breaking news
Bhadradri
-
గణనకు సిద్ధం
కిన్నెరసాని అభయారణ్యంలో పులి పాదముద్రలు గుర్తిస్తున్న సిబ్బంది(ఫైల్) పులులు, జంతువుల లెక్క తేల్చేందు కు అటవీశాఖ సిద్ధమైంది. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలోని పాల్వంచ అభయారణ్యం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు అటవీ డివిజన్లలో 24 రేంజ్ల పరిధిలోని 700 బీట్లలో 1,200 మందితో లెక్కింపునకు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్ వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో గణన చేపడతారు. పులులతోపాటు శాకాహార, మాంసాహార జంతువులెన్ని ఉన్నాయనే వివరాలు సైతం సేకరిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ఈ సర్వే నిర్వహిస్తారు. – పాల్వంచరూరల్లెక్కింపు ఇలా.. ప్రతీరోజు బీట్కు ఇద్దరు చొప్పన ఐదు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ లెక్కిస్తుంటారు. నిర్దేశించిన బీట్లో ఏడు రోజులపాటు పులుల పాదముద్రలు, పెంటికలు, వెంట్రుకలు తదితర గుర్తులు సేకరించిన తర్వాత జంతువుల గణన చేపడుతారు. ఈ లెక్కింపు ఆధారంగానే భవిష్యత్లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పులులు, జంతు గణన సందర్భంగా సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఏఐటీఈ(ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్) యాప్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో పొందుపరుస్తారు. సర్వే సిబ్బందికి టీషర్టులు, క్యాప్లతో పాటు ఓ కిట్గ్యాగ్ ఇస్తారు. అందులో పేపర్, పెన్ను, జిప్లాక్(ఆనవాళ్ల సేకరణకు ఉపయోగించే పదార్థం) ఉంటాయి. కాగా, సర్వేపై సిబ్బందికి మరోసారి అవగాహన కల్పించేందుకు ఈనెల 12న అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో రేంజర్లతో, 17న కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని గట్టుమల్ల బీట్లో స్థానిక సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 550 బీట్లలో పులు లు, జంతు గణనను పకడ్బందీగా నిర్వహించబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 75 నుంచి 100 మంది వలంటీర్లను తీసుకుంటున్నాం. ఈ గణనలో అటవీ సిబ్బంది 900 మంది పాల్గొంటారు. వీరికి తోడుగా బేస్ క్యాంప్ సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్కు ఇద్దరు చొప్పున ప్రతీ రోజు 5 కిలోమీటర్ల చొప్పున లెక్కిస్తారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి, ఆ తర్వాత యాప్లో నమోదు చేస్తారు. –జి.కృష్ణాగౌడ్, డీఎఫ్ఓ కిన్నెరసాని అభయారణ్యంలో జీవవైవిధ్యంతో పాటు జంతువుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండడంతో వాటి సంతతి పెరుగుతోంది. గత జంతుగణన సమయంలో ఎలుగుబంట్లు 412, చుక్కల దుప్పులు 4,278, కొండగొర్రెలు 659, అడవి పిల్లులు 674, అడవిగేదెలు 1,892, కణుజులు 508తో పాటు తోడేళ్లు, నక్కలు, కుందేళ్లు, అలుగు, మూషిక జింకలను గుర్తించారు. కాగా, ఒకప్పుడు అభయారణ్యంలో ఐదు పులు లు, 14 చిరుతలు ఉండగా అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఒక పులి మాత్రమే సంచరిస్తోంది. ఈ ఏడాది లెక్కింపు పూర్తయితే కానీ ఏయే జంతువులు ఎన్ని ఉన్నాయనే వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక మూషిక జింకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే సంచరిస్తున్నాయని గుర్తించిన అటవీ శాఖ వాటి సంరక్షణకు చర్యలు చేపడుతోంది. -
కాంగ్రెస్ది పేదల ప్రభుత్వం
● పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్నపాల్వంచ: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న అన్నారు. శనివారం వజ్రా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం అనైతికమని పేర్కొన్నారు. పేరు తొలగింపును నిరసిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రానున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని అన్ని పార్టీ పదవులు రద్దయ్యాయని, పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించేలా చూస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు నాగ సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, వూకంటి గోపాలరావు, నూకల రంగారావు, కొండం వెంకన్న, యర్రంశెట్టి ముత్తయ్య, సాధం రామకృష్ణ, చీకటి కార్తీక్, అభినవ పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా సంజయ్టేకులపల్లి : బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ (బీఏఎన్ఏఈ ) జాతీయ ఉపాధ్యక్షుడిగా మండలంలోని బోడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోత్ సంజయ్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం నవీ ముంబైలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎన్నుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. సంజయ్ హైదరాబాద్లోని ఏఐఎంఎల్ వొక్సెన్ యూనివర్సిటీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు. వ్యక్తి ఆత్మహత్యదుమ్ముగూడెం : దుమ్ముగూడెం గ్రామానికి చెందిన ఎనగంటి శివకుమార్(30) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా దుమ్ముగూడెం గ్రామంలోని ఎస్ఎల్ఎస్ పవర్ ప్లాంట్ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మద్యం మత్తులో శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తూ మృతుడి తండ్రి చంద్రం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేడే తుది పోరు
పినపాక: మండలంలోని ఈ–బయ్యారంలో జరుగుతున్న జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు. ఆయా మ్యాచ్ల్లో జట్లు హోరాహోరీగా పోటీపడగా తెలంగాణ, హరియాణా, ఉత్తరప్రదేశ్ జట్లు సెమీస్కు చేరాయి. ఆదివారం సెమీఫైనల్లో ఉత్తర్ప్రదేశ్తో తెలంగాణ తలపడనుంది. కాగా, క్వార్టర్ ఫైనల్స్లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడిన ఆంధ్రప్రదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. చిరుజల్లులతో నిలిచిన ఆట క్వార్టర్ ఫైనల్స్లో కర్ణాటక – రాజస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే, ఆ సమయాన చిన్నపాటి వర్షం జల్లు పడడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆదివారం ఉదయం ఈ రెండు జట్ల నడుమ క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించి గెలిచిన జట్టుతో హరియాణా జట్టుకు సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో గెలిచిన జట్టు, యూపీ – తెలంగాణ మధ్య జరిగే సెమీస్లో విజేతతో ఫైనల్స్లో తలపడుతుంది. ఒక్క పాయింట్తో సెమీస్కు దూరమైన తమిళనాడు క్రీడల్లో ఒక్క పాయింట్ కూడా ఎంత ముఖ్యమో కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. అదే పరిస్థితి శని వారం తమిళనాడు జట్టుకు ఎదురైంది. హరి యాణా – తమిళనాడు జట్లు క్వార్టర్స్లో హోరాహోరీగా తలపడ్డాయి. తమిళనాడు 50 పాయింట్లు చేయగా హరియాణా 51 పాయింట్లు సాధించడంతో సెమీస్ కు దూసుకెళ్లింది. ఒక్క పాయింట్ తేడాతో ఓడిన తమిళనాడు సెమీస్ అవకాశాలు దూరం చేసుకున్నట్లయింది. కాగా, టోర్నీ తుది దశకు చేరడంతో అభిమానులు తెలంగాణ జట్టుకు ఈలలు, కేకలతో మద్దతు తెలుపుతున్నారు. కాగా, పంజాబ్పై గెలిచి సెమీస్కు చేరిన తెలంగాణ జట్టు క్రీడాకారులు సంబురాలు చేసుకున్నారు. -
కొత్త.. కిలకిలలు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, చంద్రుగొండ మండలాల్లో 35వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పులిగుండాల అటవీ ప్రాంతం(కనకగిరి గుట్టలు)లో అరుదైన పక్షులు ఆవాసం ఏర్పాటుచేసుకున్నాయి. భిన్నమైన వృక్షాలు, మొక్కలే కాక జలపాతాలు, జలాశయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాక మచ్చల జింకలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, సాంబార్ వంటి జంతువులతో పాటు అరుదైన పక్షి జాతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. భిన్నమైన పక్షి జాతులు పులిగుండాల అటవీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపద, నీటి వనరుల కారణంగా భిన్నజాతుల పక్షులు జీవనం సాగిస్తున్నాయి. కొన్ని స్థిరనివాసం ఏర్పాటుచేసుకోగా, మరికొన్ని పక్షులు సీజన్ల వారీగా వచ్చివెళ్తున్నాయని గుర్తించారు. ఆగ్నేయాసియా, ఈశాన్య భారత దేశంలో మాత్రమే నివసించే ప్లమ్ హెడెడ్ పారకీట్(చిలుక జాతి) పక్షిని ఈ అడవుల్లో ఇటీవల గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా అడవుల్లో నివసించే షిక్రా పక్షి కూడా సంచరిస్తున్నట్లు తేలింది. ఇవికాక కుటుంబానికి చెందిన ఇండియన్ ప్యారడైజ్ ఫ్లైక్యాచర్ పక్షి ఇక్కడ తరచుగా కనిపిస్తోంది. కామన్, వైట్–త్రోటెడ్, పైడ్, బ్లూ– ఎర్ట్ కింగ్ఫిషర్లు కూడా ఉన్నాయి. పెద్దనీటి పక్షులుగా చెప్పుకునే హెరాన్లు ఇక్కడి సరస్సుల్లో కనిపిస్తున్నాయి. వీటిలో పర్పుల్ హెరాన్, గ్రే హెరాన్లు ఉన్నాయి. ఇంకా టికెల్స్ బ్లూ ఫ్లైక్యాచర్, ఏషియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్ వంటి పేర్ల కలిగిన పక్షి జాతులు ఉన్నట్లు నిపుణులు, అటవీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు సైబేరియా నుంచి ఆస్ప్రె(గద్ద జాతి) పక్షులు, యూరప్ నుంచి నాలుగు రకాల గోరింకలు చలికాలంలో వచ్చి ఫిబ్రవరిలో వెళ్తుంటాయని తేలింది. పక్షి వీక్షణ కేంద్రంగా అభివృద్ది పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేస్తూనే అరుదైన పక్షులు ఉన్నందున పక్షి వీక్షణ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. మిరాకీ, అటవీ బర్డ్స్ ఎన్జీవోస్ సంస్థలు ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. చలికాలంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఇక్కడ మకాం వేసి అత్యాధునిక పరికరాలతో పక్షులను పరిశీలిస్తూ అందులో అరుదైన రకాలను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యాన సాధారణంగా ఉండే పక్షులతో పాటు మొత్తంగా 370 రకాల పక్షులు ఈ అడవుల్లో ఉన్నట్లు మిరాకీ సంస్థ బాధ్యులు చెబుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు పక్షులు, జంతువులకు ఆవాసంగానే కాక ప్రత్యేక అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో పులిగుండాలకు సందర్శకులు పెరుగుతున్నారు. ఈనేపథ్యాన పక్షులు, జంతుల ప్రేమికుల కోసం అటవీ అధికారులు బర్డ్ వాక్, నేచర్ వాక్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బర్డ్ వాక్లో వివిధ ప్రాంతాలకు చెందిన 60మందికి హాజరయ్యారు. ఈ ప్రాంతం 27 కి.మీ. రహదారితో ఉండడంతో సఫారీ వాహనాలను సమకూర్చగా, బోటింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది.అరుదైన పక్షుల ఆవాసంగా పులిగుండాల -
మెరుగైన నైపుణ్యంతోనే అవకాశాలు
సూపర్బజార్(కొత్తగూడెం): వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటే యువత భవి ష్యత్ అభివృద్ధిపథంలో నడుస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో అప్రెంటిస్షిప్, బ్యాచిలర్ / డిప్లొమా ఇన్–ఒకేషనల్ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణ కోసం నిర్వహించిన ఓరిఝెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాల ను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉపాధి అవకా శాలు పెరుగుతాయని చెప్పారు. యువతలో వృత్తి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ అప్రెంటిస్షిప్ శిక్షణలో ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ సౌకర్యం, 100శాతం ప్లేస్మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మల్టీ స్కిల్స్ అవసరమని, యువత నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తాను పేద కుటుంబం నుంచే వచ్చానని, తన తండ్రి ఐటీఐ చదివారని, కుటుంబంలో పెద్దగా చదువుకున్న వారు ఎవరూ లేరని అన్నారు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో పనులు చేశానని గుర్తు చేసుకున్నా రు. ప్రస్తుతం హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం ఈనెల 21న మరోసారి శిక్షణ, ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి 107 మంది యువకులు హాజరుకాగా, వీరిలో 92 మంది వివరాలు నమో దు చేసుకున్నారని, వారికి మౌఖిక పరీక్షలు నిర్వహించి 57 మందిని వివిధ పరిశ్రమలకు ఎంపిక చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్కంపెనీ సూ పర్వైజర్ అమృత్ రాజు, రానె మద్రాస్ కంపెనీ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ బి. స్వజిట్ ఖుంటియా, సెర్ప్ నుంచి బి. నీలయ్య, ఏపీఎంలు ఎల్. వెంకయ్య, జి. ప్రసాద్ రెడ్డి, ఏ. నాగేశ్వరరావు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
పందేనికి సై!
అశ్వారావుపేటరూరల్/చర్ల/బూర్గంపాడు: సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. సరిహద్దుల్లో కోడి పందేలకు బిర్రులు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ఏపీ గ్రామాల్లో, తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల్లో జోరుగా కోడి పందేలు సాగనున్నాయి. మూడు రోజులపాటు రాయుళ్ల వాహనాలు అటువైపే బారులుదీరనున్నాయి. రసవత్తరంగా సాగే పందేల్లో బరిలో దించే పుంజులను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తోటల్లో పెంపకం.. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని పిల్ల దశ నుంచే కోళ్లను ప్రత్యేకంగా పెంచారు. ఏపీలోని పశ్చిమ, తూర్పు గోదావరి, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరుతోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఒక్కో గుడ్డు రూ.500 నుంచి సుమారు రూ.3వేల దాకా ధర పెట్టి కొనుగోలు చేసి, తెలంగాణలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో పొదిగించి ఆయిల్పాం, మామిడి తోటల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఒక్కో కేంద్రంలో 100 నుంచి 150 వరకు కోడి పుంజులు ఉన్నాయి. పండుగకు రావడంతో పందెంరాయుళ్లు కోడి పుంజుల కోసం పెంపకందారులను ఆశ్రయిస్తున్నారు. ప్రత్యేక ఆహారం.. కోడి పుంజులకు మూడు నెలల ముందు నుంచే ప్రత్యేక ఆహారం, శిక్షణ ఇస్తారు. ఉడకబెట్టిన గుడ్డు, ఖరీదైన జీడి పప్పు, పిస్తా, బాదం, రాగులు, సజ్జలు, వడ్లు తినిపిస్తారు. వారానికోరోజు మాంసహారం(మటన్) కై మా, మిగిలిన రోజుల్లో ఆకు కూరలతో ఆహారాన్ని అందిస్తారు. పుంజు శారీరకంగా బలపడేందుకు నీటి తొట్టెలో ప్రత్యేకంగా ఈత కొట్టించడంతో చన్నీళ్లతో స్నానం చేయిస్తారు. ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాక్సిన్లు, మందులు కూడా ఇస్తారు. ధర రూ. లక్ష వరకు.. బరిలో దింపే కోడి పుంజు కనీసం ఐదు కేజీల బరువు, ఏడాదిపైనే వయస్సు ఉండేలా చూస్తుంటారు. కాకి, నెమలి, డేగ, సీతువా, పచ్చకాకి, కోడి డేగ, ఆబ్రాసు, రసంగి డేగ వంటి జాతి కోళ్లనే బరిలో దించుతారు. దీంతో ధర కూడా ఉంటోంది. పుంజు ధర రూ.15 వేల నుంచి రూ.80 వేలు, రూ.లక్ష వరకు ఉంటోంది. కొందరు నెల, రెండు నెలల క్రితమే పుంజులను కొనుగోలు చేయగా, మరికొందరు ప్రస్తుతం కొంటున్నారు. పందేలు మూడు రకాలు.. కోడి పందేల్లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో ముసుగు పందెం, జోడి పందేలు, చూపుడు పందేలు ఉన్నాయి. ముసుగు పందెంలో బరిలో దించే కోళ్లకు ముసుగు వేసి పందెం కడుతారు. ఇరు పక్షాల మధ్య పందెం కుదిరితే నేరుగా కోడి పుంజును బరిలో దించుతారు. జోడి పందెంలో పందెం వేసే వారి వద్ద కనీసం ఐదు కోడి పుంజులు ఉండాలి. వరుసగా ఐదు పందేలు వేయాల్సి ఉంది. ఇక చివరిగా చూపుడు పందెం. బరిలో ఉన్న రెండు పుంజులను చూసి తమకు ఇష్టమైన వాటిపై పందెం వేస్తుంటారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులో... చర్ల: తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా కోడి పందేలకు స్థావరాలు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు గ్రామాలైన కుర్నపల్లి, బోదనెల్లి, వీరాపురం, తిప్పాపురం, కొండెవాయి, తిమ్మిరిగూడెం, బక్కచింతలపాడు, గీసరెల్లి, ఉయ్యాలమడుగు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పందేల సమయంలో మద్యం, గుడుంబా కూడా జోరుగా విక్రయించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్ జిల్లాలు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తెలంగాణాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి పందె రాయుళ్లు కోడిపందాలు ఆడేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాలను సమీప గ్రామాల్లో ఉంచి అక్కడి నుంచి స్థావరాలకు కాలికనడకన వెళ్లునున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోలీసులు దాడి చేసినా సులువుగా తప్పించేకునేలా నిర్వాహకులు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. బూర్గంపాడు సమీపంలో.. బూర్గంపాడు సమీపంలోని ఏపీ గ్రామాల్లో కూడా బిర్రులు సిద్ధమవుతున్నాయి. బూర్గంపాడుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీధర గ్రామంలో అధిక సంఖ్యలో బిర్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పేకాట, గ్యాంబ్లింగ్ ఆటలు కూడా నిర్వహిస్తారు. డోజర్లు, జేసీబీలతో 20 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. జిల్లావాసులే ఎక్కువ మంది శ్రీధర వెళ్లనుండగా, ఏపీ పోలీసులు మూడురోజులపాటు కోడి పందేలను లైట్గా తీసుకుంటారు. తెలంగాణ పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా పెడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెడుతున్నారు. తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు ఉప్పుసాక సమీపంలో దాడులు నిర్వహించి ఎనిమిదిమంది పందెం రాయుళ్లపై కేసులు నమోదు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఏటా కోడి పందేలు నిర్వహించడం సాధారణమే. అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెం, అనంతారం, గాండ్లగూడెం, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, నారంవారిగూడెం, అచ్యుతాపురం, నందిపాడు, కుడుములపాడు, కొత్తూరు గ్రామాలు, దమ్మపేట మండలంలోని ముష్టిబండ, అల్లిపల్లి, మొద్దులగూడెం గ్రామాలకు ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి, చింతలపూడి మండలాలు సరిహద్దులోనే ఉంటాయి. కూత వేటు దూరం, రోడ్డు దాటితే ఏపీ హద్దుల్లోకి వెళ్లే చోట పందేలు జోరుగా నిర్వహిస్తారు. దీంతో పండుగ మూడు రోజులపాటు స్థానికులు సరిహద్దు దాటి పందేలకు వెళ్తుంటారు. సంక్రాంతి వేళ సరిహద్దుల్లో జోరుగా కోడి పందేలు సరిహద్దుల్లో కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్న ప్రాంతాలు అటవీ ప్రాంత గ్రామాలు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడంతో కొంత ఇబ్బందిగా మారింది. అయినా ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట భద్రతతో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాం. పూర్తి స్థాయిలో కోడి పందేలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటాం. –రాజువర్మ, చర్ల సీఐ -
గోకులరామంలో రామయ్య ‘విలాసం’
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పగల్ పత్తు, రాపత్తు సేవలు పూర్తయ్యాక స్వామివారికి వివిధ ప్రాంతాల్లో మూడు రోజులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. తొలిరోజు శనివారం ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న గోకుల రామంలో నేత్రపర్వంగా జరిపించారు. స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువుదీర్చి మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ వేడుకగా గోకులరామం వేదికపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజ లు చేసి, హారతి సమర్పించారు. కాగా, భక్తులు దారి పొడవునా స్వామివారికి స్వాగతం పలికారు. భద్రాచలానికి చెందిన హరిశ్చంద్రనాయక్ ఆధ్వర్యంలో జరి గిన ఈ వేడుకల్లో అర్చకులు, వేద పండితులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన.. అంతరాలయంలోని మూలమూర్తులకు మొదట సువర్ణ తులసీ అర్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైభవోపేతంగా ప్రారంభమైన విలాసోత్సవాలు -
యూరియా సాధనలో ప్రభుత్వం విఫలం
పాల్వంచ: రైతాంగానికి కావాల్సిన యూరియా కొరత కేంద్రం సృష్టిస్తే, కేంద్రంపై పోరాడి సరిపడా యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారిలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటీకి పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఆయిల్ సంపదను దోపిడీ చేసే లక్ష్యంతోనే వెనుజువెలాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడికి పాల్పడ్డారని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. తనను మోదీ కూడా సంతోష పెట్టలేదని ట్రంప్ పరోక్ష బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయినా ప్రధాని మోదీ స్పందించలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నీళ్లు కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు కేజీ రామచంద్రన్, కె.రంగయ్య, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, చిన్న చంద్రన్న, ముద్ద భిక్షం, కల్పన, రాము, రాజు, కృష్ణ పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్అశ్వారావుపేటరూరల్: గిరిజన బాలికను గర్భవతిని చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12ఏళ్ల లోపు గిరిజన బాలిక గత దసరా పండుగ సెలవులకు ఇదే మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చి కొంతకాలం ఇక్కడే ఉంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యువకుడు ఎం.అరవింద్ బాలికను మాయమాటలతో పరిచయం చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి కాగా, శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి దమ్మపేట కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి● మరొకరికి తీవ్ర గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టేకులపల్లి మండలం సులానగర్కు చెందిన చిలకబత్తిని రవి (42) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన గనమల్ల భిక్షం తీవ్రంగా గాయపడ్డాడు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వారం రోజులు అక్కడే పనిచేసి శనివారం బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో సమ్మక్క గద్దెల సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో తీవ్రగాయాలై రవి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గాయాలైన భిక్షంను సీఐ టి.సురేష్ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్లో ప్రతిభ
మణుగూరు రూరల్: హరియాణాలో ఈనెల 9వ తేదీన జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ పోటీల్లో మాస్టర్స్ టు 93 కేజీల విభాగంలో మణుగూరుకు చెందిన స్కై జిమ్ నిర్వాహకుడు కొమిరెడ్డి రవీంద్రారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా.. రవీంద్రారెడ్డి 120 కేజీల బరువు ఎత్తి ఐదో స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో ప్రతిభచాటిన రవీంద్రారెడ్డిని పలువు రు అభినందించారు. సర్కారు బడుల మూసివేతకు కుట్ర ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ భద్రాచలంటౌన్: రేషనలైజేషన్ సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. భద్రాచలంలో శనివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధుల కోత, ఖాళీల భర్తీ చేపట్టకుండా పేదలకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ – 2025 బిల్లుతో విద్యను కాషాయీకరణ చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణను ప్రతీ ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎం.రామాచారి, అధ్యక్షుడిగా జి.హరిలాల్, ప్రధాన కార్యదర్శిగా వి.వినోదిని, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు వై.అశోక్కుమార్, ఎ.సోమయ్య,కె.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఎస్పీ రోహిత్ రాజ్ సూపర్బజార్(కొత్తగూడెం): పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీస్స్టేషన్ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడేవారి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఊరెళ్తున్నారా.. సమాచారం ఇవ్వండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళం వేసి దూరప్రాంతాలకు వెళ్లేవారు సమీప పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సెలవులకు చాలామంది కుటుంబ సమేతంగా వెళ్తుంటారని, ఆ సమయంలో దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముందుగా సమాచారం అందిస్తే పెట్రోలింగ్ చేసే పోలీసులు ఆ ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తారని వెల్లడించారు. ఇళ్లకు తాళం వేసేప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్చేయాలని తెలిపారు. -
కొండంత అండ
రఘునాథపాలెం: సరైన సాగునీటి వనరులు లేక ఇబ్బంది పడుతున్న రఘునాథపాలెం మండల రైతుల చిరకాల స్వప్నం నెరవేరుతోంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయింది. ఈ పథకాన్ని మంత్రి 13వ తేదీన ప్రారంభించనుండగా.. తొలిదశలో మండలంలోని 36 చెరువులకు సాగర్ జలాలు చేరనున్నాయి. తద్వారా ఆయకట్టుకు సాఫీగా నీరు అందడమే కాక ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. ఏడాది క్రితం శంకుస్థాపన.. నిరంతర పర్యవేక్షణ ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ఏకై క గ్రామీణ మండలమైన రఘునాథపాలెంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు వి.వి.పాలెం మీదుగా సాగే సాగర్ ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిర్ణయించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పేరిట నిర్మాణానికి శంకుస్థాపన చేశాక మంత్రినిరంత రం పర్యవేక్షిస్తూ నిధులు మంజూరు చేయించడంతో రికార్డు సమయంలో పూర్తయింది. పనులు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే మెయిన్ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయడమే కాక తాత్కాలిక మోటార్లతో ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తు తం సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవడంతో మూడు మోటార్లు ఏర్పాటు చేయగా నీటి సరఫరాకు పథకం సిద్ధమైంది. రూ.66కోట్ల అంచనాలతో.. మండల వ్యాప్తంగా 64 చెరువులకు సాగర్ జలా లు అందాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారంచుట్టారు. తొలుత రూ.66 కోట్ల అంచనాలతో ప్రణాళిక రూపొందించినా అన్ని చెరువులకు నీరు అందడానికి పైపులైను విస్తరణ తప్పని సరి కావడంతో రూ.100 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.66 కోట్లతో పూర్తయిన మొదటి దశ పనులను ప్రారంభిస్తే 36 చెరువులకు నీరు అందనుంది. ఇక మండలంలో చిట్టచివరన అత్యధిక శాతం గిరిజనులు ఉన్న పంగిడి వైపు మరో 18 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణానికి రూ.34 కోట్లు విడుదలైతే ఇంకొన్ని చెరువులకు నీరు చేరుతుంది. ప్రస్తుతం తొమ్మిది కిలోమీటర్ల ప్రధాన పైప్లైన్ పనులు పూర్తికాగా, మంచుగొండ వద్ద డెలివరీ పాయింట్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి గ్రావిటీ విధానంలో 25 కి.మీ. పైప్లైన్తో చెరువులకు నీరు అందించనున్నారు. ఐదు పైపులైన్ల ద్వారా సాగే ఈ నీటితో తొలిదశలో 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కాగా, వి.వి.పాలెం వద్ద సాగర్ ప్రధానకాల్వ నుంచి ఒక్కో మోటార్ ద్వారా 13 క్యూసెక్కుల చొప్పున మూ డింటి ద్వారా 39 క్యూసెక్కుల నీటిని పైపులైన్లు ద్వారా చెరువులకు తరలించనున్నారు. ఈ పథకం ప్రారంభంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు తీరడమే కాక భూగర్భజలాలు పెరుగుతాయని, తద్వారా బోర్లు, బావుల ద్వారా పంటలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. సిద్ధమైన మంచుకొండ ఎత్తిపోతల పథకం -
నమ్మకం పేరిట నయవంచన
ఖమ్మంక్రైం: భర్తకు దూరమైన మహిళకు సోదరుడిలా అండగా ఉంటానని నమ్మంచి.. సాయం చేస్తున్నట్లు నటించాడు. ఆ వ్యక్తి అసలు స్వరూపం తెలియక ఆయన వ్యాపారం కోసమంటూ సదరు మహిళ డబ్బు, బంగారం ఇవ్వడమే కాక మరికొందరి నుంచి అప్పులు ఇప్పించింది. ఆపై ఆయనలో మృగం మేల్కొనడంతో ఇది తప్పు అని వారించినా వినకపోగా ఊరు మారినా విడవకుండా మరో వ్యక్తితో కలిసి దారుణంగా హతమార్చాడు. ఖమ్మంలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భర్తతో విబేధాలు సృష్టించి.. కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన ప్రమీల (35) తల్లిదండ్రులు మృతి చెందటంతో భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం రేగళ్లలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంది. అదే ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ మాడెం నరసింహారావుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2010లో వివాహం చేసుకుని పాల్వంచలో నివాసం ఉన్నారు. అక్కడ నరసింహారావు స్నేహితుడైన బొమ్మ శ్రావణ్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయనను ప్రమీల అన్నయ్య అని పిలిచేది. కొంతకాలానికి నరసింహారావు దంపతుల మధ్య విబేధాలు రాగా ఇందుకు శ్రావణే కారణమని తెలిసింది. ఆపై ప్రమీల భద్రాచలంలో ఇల్లు అద్దెకు తీసుకుని బట్టల దుకాణంలో పనిచేసేది. అక్కడకు వెళ్లే శ్రావణ్ సోదరుడిలా అండగా ఉంటానని నమ్మించడంతో ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బుతో పాటు మరికొందరి దగ్గర అప్పు ఇప్పించింది. ఆ తర్వాత ప్రమీలపై కన్నేసిన ఆయన దంపతుల మధ్య అగాధం మరింత పెంచడంతో ఆమె మార్పును కనిపెట్టి హెచ్చరించింది. ఆపై భద్రాచలంలో పోలీస్స్టేషన్లో శ్రావణ్పై కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రమీల భద్రాచలం నుంచి పండితాపురంలోని బాబాయి, పిన్ని వద్దకు, అనంతరం ఖమ్మం వచ్చి కస్బాబజార్లోని షాపింగ్ మాల్లో పనిచేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఆమైపె కక్ష పెంచుకున్న శ్రవణ్ తన బావమరిది, కొత్తగూడెంలోని రామవరం వాసి, రౌడీషీటర్ అయిన రమేశ్తో శుక్రవారం ఖమ్మం వచ్చాడు. రాత్రి ఆమె షాపింగ్ మాల్ నుంచి హాస్టల్కు వెళ్తుండగా దూరంగా నిల్చుని రమేశ్ను ముందుకు పంపించినట్లు తెలిసింది. అక్కడ రమేశ్ ఆమెతో గొడవ పడి గొంతుతో పాటు పలుచోట్ల పొడవగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. అయితే, చాలాసేపు ఆమె తనను హత్య చేయొద్దని రమేశ్, శ్రావణ్ను బతిమాలినట్లు సమాచారం. ఆ సమయాన వచ్చిన ఓ వృద్ధురాలిని సైతం నిందితులు బెదిరించినట్లు తెలిసింది. చిన్న గల్లీ కావడంతో హత్య విషయం ఆలస్యంగా బయటపడగా ఏసీపీ రమణమూర్తి, వన్టౌన్ సీఐ కరుణాకర్ చేరుకుని పారిపోయిన రమేశ్ను జూలురుపాడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ్ కోసం గాలిస్తున్నారు. ప్రమీల మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించగా ఆమె భర్త శ్రీనివాసరావు పాల్వంచకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు. కాగా, ఖమ్మంలో మహిళల హత్యలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఐద్వా నాయకులు మార్చురి వద్ద ఆందోళన చేపట్టారు. రేషన్ బియ్యం స్వాధీనంటేకులపల్లి: పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి మండలంలోని దాసుతండా పంచాయతీ మంగళితండాలో సోదాలు నిర్వహించారు. పాయం గుంపులోని మాడె లక్ష్మయ్య నివాసంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. లాలు, జామ్లా అనే వ్యక్తులు నిల్వ చేసినట్లు విచారణలో తేలిందని సివిల్ సప్లయ్ డీటీ రాంబాబు తెలిపారు. 140 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామని, ఇల్లెందు ఎంఎల్ఎస్ పాయింట్కు తరలిస్తామని పేర్కొన్నారు. నిందితులపై 6ఏతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు
● మీటర్ గ్యాప్ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మం అర్బన్: పాలేరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఖమ్మం కార్పొరేషన్ విద్యానగర్ కాలనీ అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంకా అవసరమైన నిధులు మంజూరు చేసి మీటర్ ఖాళీ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యానగర్ కాలనీలో రూ.4 కోట్ల నిధులతో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ఏర్పడి పదేళ్లు దాటినా గత పాలకులు అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్ల డించారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల జారీతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, ఆర్డీఓ జి.నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ డి.సైదులు, నాయకులు మద్దినేని బేబీస్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. మోడల్గా ఏదులాపురం ఖమ్మంరూరల్: కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ఏదులాపురం మున్సిపాలిటీ గొల్లగూడెంలో రూ.42.26 కోట్లు, పెదతండాలో రూ.14కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ అభివృద్ధి పనులపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ పి.రాంప్రసాద్, నాయకులు బండి జగదీష్, తోట చినవెంకటరెడ్డి, చింతమళ్ల రవికుమార్, బండి సతీష్, వెంపటి రవి, ధరావత్ రాంమ్మూర్తినాయక్, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా
పాల్వంచరూరల్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల విద్యార్థులు రెండేళ్లుగా రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ చూపి చాంపియన్షిప్లను కై వసం చేసుకుంటున్నారు. ఇటీవల ఏటురూనాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడాపోటీల్లోనూ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకున్నారు. అథ్లెటిక్స్ బాలికలు అండర్–14, 17 విభాగాల్లో, బాలురు అండర్–17 విభాగంలో 40 మీటర్లులో బంగారు పతకం, 30 మీటర్ల పరుగులో వెండి పతకాలు సాధించారు. బాలికలు అండర్–17 విభాగంలో 40 మీటర్ల పరుగులో బంగారు, 30 మీటర్ల పరుగులో సిల్వర్, వాలీబాల్ పోటీల్లో బాలురు అండర్–17 విభాగంలో బంగారు, అండర్–14 విభాగంలో సిల్వర్ మెడళ్లు సాధించారు. కబడ్డీలో బాలురు, బాలికలు అండర్–17 విభాగంలో బంగారు, అండర్–14 విభాగంలో బాలికలు బంగారు, ఖో–ఖోలో అండర్–17 విభాగంలో కాంస్యం, టెన్నీకాయిట్లో బాలురు అండర్–17 విభాగంలో కాంస్యం, చదరంగంలో అండర్–14 విభాగంలో బాలురు, బాలికలు బంగారు పతకాలు సాధించి.. సీనియర్, జూనియర్ బాలురు, బాలికలు ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకున్నట్లు ఐటీడీఏ క్రీడల అధికారి బొల్లి గోపాల్రావు తెలిపారు. కాగా, శుక్రవారం విజేతలకు ఏటూరూనాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్ ట్రోఫీ అందించారు. ఓవరాల్ చాంపియన్ కై వసం -
వీబీ–జీ రామ్జీ బిల్లు చరిత్రాత్మకం
చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ ఆజివిక మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్జీ)–2025 చట్టం చరిత్రాత్మకమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కార్యలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకం పేరు మార్చడంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. గతంలో వంద రోజులు ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచుతూ ఈ చట్టం రూపకల్పన చేశారని తెలిపారు. సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి భూక్య రవినాయక్, నాయకులు బలగం శ్రీధర్, మాలోతు గాంధీ, సాయి శ్రీనివాస్, గొడుగు శ్రీధర్, జల్లారపు శ్రీనివాస్, గుంపుల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి టోర్నమెంట్ ప్రారంభం
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియాలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో శుక్రవారం ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్ను ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేంరాజు ప్రారంభించారు. జెండా ఆవిష్కరించి, ఇతర విభాగాల అధికారులతో కలిసి బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో తలమునకలయ్యే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని అన్నారు. పోటీల్లో బెల్లంపల్లి, రామగుండం, కొత్తగూడెం రీజియన్ల అధికారులు పాల్గొంటారని తెలిపా రు. కాగా మొదటి రోజు కొత్తగూడెం, కార్పొరేట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. -
యథేచ్ఛగా తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం పరిధిలో సర్వే నంబరు 117లో మూడు వందల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇది గ్రావెల్ మట్టితో నిండిన ఎత్తైన కొండ ప్రాంతం. ఇందులో 25 ఎకరాలను ప్రభుత్వ జూనియర్ కాలేజీకి గతంలో కేటాయించారు. మరో పదెకరాలను సీఆర్పీఎఫ్ క్యాంపు కోసం కేటాయించారు. కొండ దిగువ ప్రాంతంలో జూనియర్ కాలేజీతోపాటు అనుబంధంగా హాస్టళ్లను నిర్మించారు. కాలేజీ తరగతులు, హాస్టళ్ల భవనాలన్నీ కలిసి దాదాపుగా ఐదు ఎకరాల స్థలంలోనే ఉన్నాయి. కాలేజీకి చెందిన మరో పదెకరాల స్థలం నిరుపయోగంగా మారింది. వాజేడు నుంచి భద్రాచలం వరకు మధ్యలో ఎక్కడా డిగ్రీ కాలేజీ లేకపోవడంతో చర్ల జూనియర్ కాలేజీకి సంబంధించిన పదెకరాల ఖాళీ స్థలంలో డిగ్రీ కాలేజీ నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ముందుగా ఎన్ఓసీ ఇసుక లారీలు తిరిగేందుకు వీలుగా రోడ్లు నిర్మించేందుకు చర్ల జూనియర్ కాలేజీ స్థలంలో ఉన్న గ్రావెల్ తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను గతేడాది తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగూడెం ప్రాజెక్టు అధికారి శంకర్ నాయక్ కోరారు. ఇక్కడ గ్రావెల్ తీసుకున్నందుకు బదులుగా కాలేజీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, కొండ ప్రాంతాన్ని చదునుగా చేసి మైదానంగా మార్చి కాలేజీకి ఇస్తామని హామీ ఇచ్చారు. టీజీఎండీసీ పీవో నుంచి వచ్చిన ప్రతిపాదన సబబుగా ఉండటంతో కలెక్టర్ కార్యాలయం నుంచి డీఈవో ఆఫీసు మీదుగా సంబంధిత దస్త్రం కాలేజీకి చేరింది. చివరకు గతేడాది నవంబరులో గ్రావెల్ తీసుకునేందుకు అభ్యంతరం లేదంటూ ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ చేశారు. అనుమతులు లేకుండానే మైనింగ్ చర్ల జూనియర్ కాలేజీ నుంచి ఎన్ఓసీ రావడమే ఆలస్యం ఇసుక వ్యాపారులు భారీ యంత్రాలను పెట్టి కాలేజీ క్యాంపస్ స్థలంలో గ్రావెల్ను తోడటం మొదలెట్టారు. రాత్రి వేళలో లారీల్లో వందలాది ట్రిప్పుల్లో మట్టిని తరలించారు. దీనిపై మరోసారి విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తవ్వకాలు ఆపేశారు. అనంతరం అలువాల జ్యోతి పేరుతో మైనింగ్ శాఖకు మొరం కోసం దరఖాస్తు వచ్చింది. పరిశీలించిన మైనింగ్ శాఖ, కాలేజీకి కేటాయించిన సర్వే నంబరు 117లో 4.77 హెక్టార్ల స్థలం నుంచి గరిష్టంగా 2,000 మెట్రిక్ టన్నుల గ్రావెల్ మైనింగ్కు అనుమతి వచ్చింది. 2026 జనవరి 3 నుంచి మార్చి 3 వరకు ఈ పర్మిట్ చెల్లుబాటులో ఉంటుంది. రూ. 52,000ను. సీనరేజ్ చార్జీగా పేర్కొంది. సైంటిఫిక్ అప్రోచ్ ఏది ? ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం కాలేజీ స్థలంలో గ్రావెల్ (మొరం) తవ్వకం ద్వారా ఎత్తైన కొండ ప్రాంతాన్ని చదును చేసి మైదానంగా మార్చాల్సి ఉంది. అంటే ప్రస్తుతం కాలేజీ ఉన్న సహజ ఎత్తును అనుసరించి మైనింగ్ జరిగే ప్రాంతం ఎఫ్ఎఫ్ఎల్ (ఫైనల్ ఫ్లోర్ లెవల్) సరితూగాలి. ఈ మేరకు సర్వే చేపట్టి, ఏ ప్రాంతంలో ఎంత మేరకు మైనింగ్ చేయాలనేది నిర్ధారించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టే పనులు జరగాలి. అలా కాకుండా ఇష్టారీతిగా మొరాన్ని తవ్వితే కాలేజీ స్థలంలో పెద్ద గోతుల ఏర్పడతాయి. గతంలో అనుమతులు లేకుండా ఇక్కడ మొరం తవ్వడం వల్ల కాలేజీ పక్కనే చెరువును తలపించే విధంగా పెద్ద నీటి మడుగు ఏర్పడింది. దోమల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనుమతులు ఉన్నాయనే వంకతో సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కాలేజీ స్థలంలో మట్టిని తవ్వేస్తున్నారు. రాత్రి 8 గంటలు దాటిందంటే చాలు భారీ యంత్రాలు కాలేజీ స్థలంలోకి వచ్చి చిమ్మచీకట్లో మట్టిని తోడేస్తున్నారు. ఈ మైనింగ్ ఇలాగే కొనసాగితే కాలేజీకి మైదానం అందుబాటులోకి రావడం సంగతి అటుంచితే భవిష్యత్లో పూడ్చుకోలేని నష్టం జరిగే అవకాశముంది. ఏజెన్సీ డిగ్రీ కాలేజీ ఆశలకు ఎసరు వచ్చే ఆస్కారం ఉంది. గతంలో రోడ్లు బాగు చేయిస్తామని మణుగూరు, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో టీజీఎండీసీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. లాభాపేక్ష తప్ప ప్రజా సంక్షేమం, సామాజిక బాధ్యతలను పట్టించుకోని ఇసుక వ్యాపారుల దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ విభాగాలు మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. -
ముగిసిన జిల్లాస్థాయి పోటీలు
కొత్తగూడెంఅర్బన్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా)ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని హైస్కూళ్ల విద్యార్థులకు నిర్వహించిన ఎడ్యుకుషన్, ఒలింపియాడ్ జిల్లాస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. ఆనందఖని జెడ్పీహెచ్ఎస్లో జరిగిన పోటీల్లో 6, 7 తరగతులవారిని జూనియర్లు, 8, 9, 10వ తరగతుల విద్యార్థులుగా సీనియర్లుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. తొలుత ప్రశ్న పత్రాలను జిల్లా ఏసీజీఈ ఎస్.మాధవరావు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంగ్ల నైపుణ్యాలు, పోటీతత్వం పెంపొందించేందుకు ఎల్టా చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. మరుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా మార్చేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇంగ్లిష్లో భావవ్యక్తీకరణ, భాష వ్యాకరణపై పట్టు సాధిస్తే భవిష్యత్లో ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొనవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్టా జిల్లా అధ్యక్షుడు షేక్ దస్తగిరితోపాటు డాక్టర్ షేక్ మీరాహుస్సేన్, వి.వెంకటేశ్వర్లు, ఎస్.కె జహంగీర్ షరీఫ్, కె.సైదులు, రవికుమార్, భాగ్యశ్రీ, వెంకన్న పాల్గొన్నారు. -
సీసీఐ కేంద్రంలో అగ్ని ప్రమాదం
కారేపల్లి: కారేపల్లిలోని శ్రీలక్ష్మిప్రియా కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో కొనసాగుతున్న సీసీఐ పత్తి కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మిల్లు మిషనరీ నుంచి మొదలైన మంటలు పత్తికి అంటుకోగా ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. మిల్లు పక్కనే సుమారు వేయి క్వింటాళ్ల పత్తిపై నిప్పు రవ్వలు పడగా వర్కర్లు, సీసీఐ కేంద్రానికి వచ్చిన రైతులు పరుగులు తీశారు. ఇంతలోనే తేరుకుని పైపులతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇల్లెందు నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే 20క్వింటాళ్ల పత్తి కాలిపోయినా రూ.కోటి విలువైన బేళ్లు, సీడ్లకు నిప్పు అంటుకోక పోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా, పత్తిని బేళ్లుగా మార్చేందుకు శుభ్రం చేసే క్రమాన రాయి వంటివి వస్తే నిప్పు రవ్వలు వస్తాయని.. అది కన్వేయర్ బెల్ట్ వద్ద అంటుకోవడం ప్రమాదం కారణమై ఉండొచ్చని మిల్లు యజమాని రాహుల్ తెలిపారు. అండర్గ్రౌండ్లో ఉన్న మిషనరీ బెల్టుల వద్ద నుంచి పొగ రావడాన్ని గుర్తించిన వర్కర్లు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్లయింది. కాగా ఈ ఘటనలో భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఇద్దరు రైతులకు సంబంధించిన 50 క్వింటాళ్ల పత్తి కూడా ఉంది. ఘటనాస్థలాన్ని సింగరేణి తహసీల్దార్ రమేష్, ఎంపీఓ రవీంద్రప్రసాద్ పరిశీలించారు. సీసీఐ అధికారి ఆరా ప్రమాదం జరిగిన మిల్లును సీసీఐ అధికారి గురురాజ్ కులకర్ణి పరిశీలించారు. ఇల్లెందు మార్కెట్ కార్యదర్శి నరేష్కుమార్తో కలిసి పరిశీలించిన ప్రమాదాలు వివరాలు తెలుసుకున్నాక మాట్లాడారు. ఒక ల్ రూ.25వేలు ఉంటుందని, అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పిందని పేర్కొన్నారు. శుక్రవారం 145క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, మిగతాది మిల్లు యజమాని నిల్వ చేసుకున్నాడని తెలిపారు. -
దసరా మండపంలో దర్జాగా..
భద్రాచలం: భక్త రామదాసు కాలం నాటి దసరా మండపంలో భద్రగిరి రాముడు దర్జాగా దర్శనమిచ్చాడు. అధ్యయనోత్సవాలలో భాగంగా శుక్రవా రం మారుతి పారామెడికల్ కళాశాల ఆధ్వర్యంలో రాపత్తు సేవ నిర్వహించారు. ఈ సేవను ఏటా దసరా మండపంలో జరుపుతారు. ఈక్రమంలో ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి కోలాటాలు, వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తులు శ్రీరామ నామస్మరణల నడు మ కోలాహలంగా శోభా యాత్ర జరిపారు. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు మండపంలో ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ కాంతారావు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. వాగ్గేయకారోత్సవాల బ్రోచర్ల ఆవిష్కరణ ఈనెల 23నుంచి ప్రారంభం కానున్న 393 భక్త రామదాసు జయంతోత్సవ కార్యక్రమాల బ్రోచర్లను ఆలయ ఈవో దామోదర్రావు శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రముఖ సంగీత కళాకారులు చిత్రకూట మండపంలో ఐదురోజులపాటు ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు. ఆలయ ఏఈవోలు శ్రావణ్ కుమార్, భవాని రామకృష్ణ పాల్గొన్నారు. స్వర్ణ కవచాలంకరణలో మూలమూర్తులు అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ప్రతీ ఆదివారం నదీ హారతి సూపర్బజార్(కొత్తగూడెం): ఏరు– ది రివర్ ఫెస్టివల్లో భాగంగా భద్రాచలంలో ప్రతీ ఆదివారం గోదావరి నదీహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, భక్తులు, పండితుల సూచనలు, వినతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత రెండు శనివారాల్లో భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద నిర్వహించిన నదీహారతి కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభించిందని తెలిపారు. ఇకపై ప్రతీ ఆది వారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఘనంగా రాపత్తు సేవ -
ప్రతీ హామీని అమలు చేశాం
ఇల్లెందు/పినపాక: ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడం వల్లే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం పంచాయతీల్లో విజయం సాధ్యమైందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తీర్పు ఇవ్వాలని కోరారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు వార్డు సభ్యుల ఆత్మీ య సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ ఆవరణలో, పినపాకలో నిర్వహించారు. ప్రజాప్రతినిధులను సన్మానించాక మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలనలోసర్పంచులు, వార్డు సభ్యులు కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి ద్వారానే ప్రజల వద్దకు చేరుతాయని అన్నారు. మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఎన్నికలకు వస్తామని అన్నారు. మార్చి చివరి నాటికి రెండోదశ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లెందు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, జీఓ 76ను కూడా పరిష్కరిస్తామని తెలి పారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాలని అన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇల్లెందులో నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సీతారామ ప్రా జెక్టు చేపట్టకుండానే మొండి చేయి చూపించారని విమర్శించారు. నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ నీళ్లు ఇస్తుందని, బడ్జెట్లో నిధులు కేటాయించేలా మంత్రి పొంగులేటి బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్యేలు పాయంవెంకటేశ్వర్లు, జారే ఆది నారాయణ, తుళ్లూరు బ్రహ్మయ్య, మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు బానోతు రాంబాబు, మంగీలాల్ నాయక్, కాంగ్రెస్ పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడుడానియేల్, సైదులు, దమ్మాలపాటి వెంకటేశ్వ రరావు, యదళ్లపల్లి అనసూర్య, మడుగు సాంబ మూర్తి, మండల రాము తదితరులు పాల్గొన్నారు. -
వనమా రాఘవ వల్ల ప్రాణహాని
బీఆర్ఎస్ నాయకుడు చందునాయక్ సెల్ఫీ వీడియో వైరల్ పాల్వంచ: బీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేసే తనను అవమాన పర్చే విధంగా మాట్లాడిన వనమా రాఘవేందర్రావు వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నాయకుడు చందునాయక్ ఆరోపించారు. శుక్రవారం వనమా రాఘవపై చందునాయక్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కార్పొరేషన్ ఎన్నికల కోసం మాట్లాడాలని వనమా రాఘవ తన ఇంటికి పిలిపించాడని, తాను గతంలో జలగం వెంకట్రావ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వద్ద పనిచేశావని, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఎలా వస్తుందని ప్రశ్నించాని తెలిపారు. ‘నేను’పార్టీలో లేకపోయినా కేసీఆర్, కేటీఆర్ ఇంటికి భోజనానికి వస్తారని, నేను చెప్పిందే శాషనం అని కులం పేరుతో రాఘవ దూషించాడని, తన సంగతి చూస్తానని బెదిరించాడని చందునాయక్ వాపోయాడు. రైతులకు సరిపడా యూరియా కూసుమంచి: యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు. మండలంలోని చేగొమ్మ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల సాగు, యూరియా అవసరంపై రైతులతో మాట్లాడారు. యూరియా నిల్వలు, డిమాండ్, సాగు ఆధారంగా నియోజకవర్గంలోని సబ్సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తుండడంతో ఇబ్బంది రాలేదని అధికారులు తెలిపారు. ఈ విధా నం బాగుందని అభినందించిన సంచాలకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డైరెక్టర్ విజయ్కుమార్, ఏడీఏ సతీష్, ఏఓ వాణి, సీఈఓ రామకృష్ణ పాల్గొన్నారు. -
‘బంగారం’ వచ్చేస్తోంది..
● మేడారం మహా జాతరకు దిగుమతి అవుతున్న బెల్లం ● పలు రాష్ట్రాల నుంచి సరుకు తెప్పిస్తున్న వ్యాపారులు సుజాతనగర్: మేడారం వన దేవతలు సమ్మక్క, సారమ్మకు భక్తులు నైవేద్యంగా సమర్పించే బంగారం (బెల్లం) నిల్వలను వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే వ్యాపారులు పలురాష్ట్రాలు, ప్రాంతాల నుంచి బెల్లం తెప్పించి అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో జిల్లాలో బెల్లం విక్రయించే హోల్ సేల్ షాపులు ఇదివరకే ఉండగా కొత్తగా మరికొన్ని వెలుస్తున్నాయి. జిల్లాలోని మరికొంత మంది వ్యాపారులు సైతం మహాజాతరకు బెల్లం నిల్వలను రెడీ చేస్తున్నారు. పావు కిలో నుంచి 10 కిలోల వరకు.. మార్కెట్లో పావు, అరకిలో, కిలో, ఐదు, పది కిలోల చొప్పున బెల్లం నిల్వలు లభిస్తున్నాయి. కిలో బెల్లం ధర రూ.40 నుంచి రూ.70 వరకు నాణ్యత, దిగుమతి చేసుకునే ప్రాంతం, దూరం ఆధారంగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. అన్నింట్లోనూ కస్తూరి రకం అధిక నాణ్యమైందని, కిలో రూ.66 నుంచి రూ.70 వరకు ధర పలుకుతోందని తెలిపారు. సమ్మక్క పున్నమితో ఇంటింటా పూజలు ఈ నెల 3వ తేదీన సమ్మక్క పున్నం ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఫిబ్రవరి 1న రానున్న పౌర్ణమి వరకు భక్తులు ఇంటింటా సమ్మక్క పూజలు చేస్తారు. ముఖ్యంగా బుధ, గురు, శుక్ర వారాల్లో పల్లెల్లో సమ్మక్క పూజల సందడి కనిపిస్తుంది. ఆ రోజుల్లో వీలు కాని వారు ఆదివారం చేస్తారు. ఇంటి వద్ద పూజలు చేసిన తర్వాతే జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఈ పూజల్లో ఎత్తు బెల్లం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో వనదేవతల పూజల్లో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. బరువు ఎక్కువగా ఉన్న వారు అమ్మవార్లకు కొంత బెల్లంతో పాటు పంచదార (చక్కెర)ను కూడా నైవేద్యంగా అందిస్తున్నారు. చక్కెర కిలో ధర ప్రస్తుతం రూ.40 ఉంది. గతంలో రూ.రెండు ఎక్కువ ఉన్నా ఇటీవల తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో.. అంటే జనవరి 28, 29, 30 తేదీల్లో అమ్మవార్ల జాతర నిర్వహిస్తారు. జాతరలో భక్తులు వేల టన్నుల బెల్లాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించనున్నారు. దిగుమతి చేసుకునే రకం.. కిలో బెల్లం ధర మహారాష్ట్ర నాందేడ్ రకం.. రూ.40 మహారాష్ట్ర పుణే రకం.. రూ.42 కర్ణాటక కోలాపూర్ రకం.. రూ.48 కర్ణాటక కస్తూరి రకం.. రూ.66 మేడారం మహాజాతర కోసం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నాం. పలు రకాలు, నాణ్యత ఆధారంగా ధరలు ఉన్నాయి. కొత్త బెల్లం అమ్మకానికి వస్తే తప్ప ఇప్పుడున్న ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. జాతర సమయం దగ్గర పడితే అప్పటి పరిస్థితి ఆధారంగా కొద్ది తేడాలతో ధరలు ఉండే అవకాశం ఉంది. మిరియాల రామకృష్ణ, కిరాణా వ్యాపారి, సుజాతనగర్ -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచా మృతం, అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతో పాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీ కుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఫ్రైడే డ్రైడే పాటించాలిచుంచుపల్లి: ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖఅధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. శుక్రవారం కారుకొండ రామవరం యూఎఫ్డబ్ల్యూసీని సందర్శించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరి శీలించి మాట్లాడారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే గదిని పరిశీలించి, పలు సూచలను చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలిదమ్మపేట: కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రం దమ్మపేట లో సీఐటీయూ మండల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. లేబర్ కోడ్లతో కార్మి కుల సంక్షేమం, హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు. ఉపాధిహామీ పథకం పేరును వీబీ రామ్జీగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మధు, బ్రహ్మాచారి, రమేష్, పద్మ, పిట్టల అర్జున్, నబీ, రఘు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలికొత్తగూడెంఅర్బన్: ఇంటర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా లెక్చరర్లు దృష్టి పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ రామచందర్ అన్నారు. శుక్రవారం ఆయ న కొత్తగూడెం జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో అభివృద్ధి పనులు పరిశీ లించారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ల్యాబ్లలో సౌకర్యాలను తనిఖీ చేసి మాట్లాడారు. ఆ తర్వాత కళాశాలలో తెలంగాణ ప్రభు త్వ లెక్చరర్ అసోసియేషన్ క్యాలెండర్లను ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియ ట్ విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వర్లు, జూని యర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఖుర్షిద్, బండి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ధనకొండ నరసింహారావు, కుమారస్వామి, ఆర్.చైతన్య తదితరులు పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యంపాల్వంచరూరల్: నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని బ్రహ్మకుమారీలు ప్రశాంతి, స్రవంతి అన్నారు. మండల పరిధిలోని బస్వతారాక కాలనీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత మూడు రోజులుగా విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం బ్రహ్మకుమారీలు హాజరై విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఆసనాలు వేయించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్ కట్టా రవీంద్రబాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కామేశ్వరరావు, సుధాకర్ పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల హవా...
పినపాక: జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు మూడో రోజు శుక్రవారం కూడా రసవత్తరంగా కొనసాగాయి. బిహార్పై తెలంగాణ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి 23 పాయింట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. మణిపూర్ జట్టుపై 20 పాయింట్ల తేడాతోఆంధ్రప్రదేశ్ ఘన విజయం సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. తెలంగాణ జట్టు విజయంలో కెప్టెన్ దేవరాజ్, జిల్లాలోని ములకలపల్లి మండలానికి చెందిన సాయి కీలక పాత్ర పోషించారు. రెండు రాష్ట్రాల జట్లు పోటీలో ఉండటంతో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడలను వీక్షించారు. ముగిసిన లీగ్జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీల్లో శుక్రవారం లీగ్ దశ ముగిసింది. విద్యాభారతి, పంజాబ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి, గుజరాత్, రాజస్థాన్, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, హరియాణా, తమిళనాడు, మహారాష్ట్ర, సీబీఎస్ఈ జట్లు ప్రీ క్వార్టర్ పోటీలకు అర్హత సాధించాయి. మిగిలిన 16 జట్లు టోర్నీ నుంచి నిష్ట్రమించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ప్రీ క్వార్టర్, క్వార్టర్, ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ, ఏపీ విజయం -
కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛమిత్ర కార్మికుల ధర్నా
సూపర్బజార్(కొత్తగూడెం): పాఠశాలలలో పనిచేస్తున్న స్వచ్ఛమిత్ర కార్మికులకు ఇచ్చే జీవితాల్లో కోతలు విధించొద్దని, స్వచ్ఛమిత్ర కార్మికుల జీతాలు వారి ఖాతాల్లోనే జమ చేయాలని సీఐటీయూ అనుబంధ శ్రామిక మహిళ కన్వీనర్ జి.పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛమిత్ర కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛమిత్ర నాయకురాలు నిహారిక అధ్యక్షతన జరిగిన సభలో పద్మ మాట్లాడారు. స్వచ్ఛమిత్ర కార్మికులు మొదట జీతం లేకుండానే పనిచేశారని, ప్రభుత్వం ఇప్పుడు పిల్లల ప్రాతిపదికగా నెలకు రూ.3 వేలు జీతం ఇస్తోందని, ఈ జీతంలో అధికారులు నెలకు రూ.500 నుంచి రూ.1,500 వరకు కట్ చేసి ఇస్తున్నారని తెలిపారు. ఎందుకు కట్ చేస్తున్నారని అడిగితే స్కూలు మెయింటెనెన్స్ కోసమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.3 వేల జీతాన్ని కూడా ఖాతాల్లో వేయకుండా అమ్మ ఆదర్శ కమిటీ, గ్రామ సంఘం కమిటీ, స్కూల్ హెచ్ఎంలు సంతకాలు పెడితేనే ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటనరసమ్మ, సీత, రాజమణి, కుమారి, ఈశ్వరమ్మ, సమ్మక్క, సుస్మిత పాల్గొన్నారు. -
మూడేళ్లలో సీతారామ పూర్తి
అశ్వారావుపేటరూరల్: రానున్న మూడేళ్లలో సీతా రామ ప్రాజెక్ట్ను వందశాతం పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి గోదా వరి జలాలను పూర్తిస్థాయిలో అందిస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్ట్ పేరుతో ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఒక్క ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. శుక్రవారం అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన రైతు మేళా, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు గడిచిన రెండేళ్లుగా అమలు కానీ యంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.100కోట్ల వ్యయంతో 1.30లక్షల మంది రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తామని చెప్పారు. దేశంలోని 29రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 148లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాల న, ఉమ్మడి రాష్ట్రం హయాంలో కూడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరిసాగులో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని అన్నారు. ప్రకృతి వ్య వసాయాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పా రు. మంత్రి తుమ్మలవ ూట్లాడుతూ త్వరలోనే సీతా రామ 4వ పం్ప్హౌస్ను పూర్తిచేసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు కూడా గోదా వరి నీళ్లు అందిస్తామన్నారు. వచ్చేమూడేళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ విస్తరిస్తామని తెలిపారు. 2047నాటికి 400 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని వ్యవసాయ రంగం ద్వారా వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారెఆదినారాయ ణ, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జాన య్య, వ్యవసాయశాఖ కార్యదర్శి కె.సురేంద్రమో హన్, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, కళాశాల ఏడీ హేమంత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మొగళ్లపు చెన్నకేశవరావు, బండి భాస్కర్ పాల్గొన్నారు. -
క్రీడలపై దృష్టి సారించాలి
పాల్వంచరూరల్: గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలపై దృష్టిసారించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడాపోటీలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అథ్లెటిక్స్ పోటీలకు 150మంది క్రీడాకారులు హాజరుకాగా, ప్రతిభచూపిన 30మంది బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 18న నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు కళాశాల ప్రిన్సి పాల్ ఎం.అన్వేష్, పీడీ మల్లేష్ పతకాలను అందజేశారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మహీందర్, కోచ్ పి.నాగేంద్ర, మల్లికార్జునరావు, ఎర్రయ్య, పవన్ పాల్గొన్నారు.జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామరెడ్డి -
గిరిజనులకు ప్రత్యేకం!
● ‘ఖేలో ఇండియా’లో క్రీడాపోటీల నిర్వహణకు నిర్ణయం ● ఏడు అంశాల్లో జాతీయస్థాయి పోటీలు ● గిరిజన క్రీడాకారుల ప్రతిభకు తగిన గుర్తింపుఖమ్మం స్పోర్ట్స్: గిరిజన యువతలో సహజసిద్ధంగా దాగి ఉండే క్రీడా ప్రతిభను వెలికితీయడం, ఔత్సాహికుల ప్రతిభను తెరపైకి తీసుకురావడమే లనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఖేలో ఇండియా పోటీల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కేవలం గిరిజన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేలా పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 177 జిల్లాలో గిరిజనులు ఉండగా, ప్రత్యేక పోటీలతో ప్రతిభావంతులను గుర్తించొచ్చని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ నిర్వహించనుండగా, ప్రస్తుతం వయోబేధం లేకుండా మహిళలు, పురుషులు పాల్గొనేలా ఏడు క్రీడాంశాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్బాల్ క్రీడాంశాలు ఉన్నాయి. తొలుత రాష్ట్రస్థాయిలో ఎంపిక రాష్ట్రస్థాయిలో ఎంపికై న క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు తీసుకుంటారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక నిష్పక్షపాతంగా ఎంపిక జరిగేలా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఒకరు, గిరిజన సంక్షేమం / సాంఘిక సాంక్షేమ శాఖ ఓ అధికారి, తెలంగాణ క్రీడా సంఘం తరపున ఇంకొకరితో పాటు ద్రోణాచార్య / అర్జున అవార్డు గ్రహీత, లేదా కోచ్కు ఈ కమిటీలో స్థానం కల్పిస్తారు. తుది జాబితాలో దేశవ్యాప్తంగా 2,500 మంది క్రీడాకారులకు స్థానం కల్పించడమే కాక ప్రత్యేకంగా స్పోర్ట్స్ కిట్స్ అందించనున్నారు. జాతీయస్థాయిలో ఇప్పటికే పతకాలు సాధించిన క్రీడాకారులు ప్రతిభ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఖేలో ఇండియా క్రీడల ద్వారా సత్తా చాటితే తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాక ఫెడరేషన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు తెరపైకి రాలేకపోయిన గిరిజన క్రీడాకారులకు ఇకనైనా గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉంది. – పుట్టా శంకరయ్య, జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీ సభ్యుడుగిరిజన, ఆదివాసీ జనాభా ఉమ్మడి జిల్లాలో అధికంగానే ఉంటుంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్చరీ శిక్షణకు ఖేలో ఇండియా సెంటర్ ఉండగా, కాచనపల్లి, కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూళ్లలో కూడా ఆర్చరీ శిక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యాన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన, ఆదివాసీ యువత ఇప్పటికే జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రధానంగా ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్లో ప్రభుత్వం, ఐటీడీఏ ప్రోత్సాహం, స్పోర్ట్స్ స్కూళ్లలో శిక్షణతో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో ప్రత్యేకంగా గిరిజనుల కోసం జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనుండడంతో వీరికి మంచి వేదికగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
లూయీస్ బ్రెయిలీకి నివాళి
సూపర్బజార్(కొత్తగూడెం): లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తుకారం రాథోడ్, జిల్లా సంక్షేమ శాఖాధికారి జేఎం స్వర్ణలత లెనీనా హాజరయ్యారు. మొదట బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత లెనీ నా మాట్లాడుతూ బ్రెయిలీ కనిపెట్టిన చుక్కల లిపి ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. బ్రెయిలీ లిపి ద్వారా అంధులు విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. అంధులైన ఉద్యోగులను, అంధుల కోసం వివిధ రంగాల్లో సేవ చేస్తున్నవారిని సన్మానించి గోడ గడియారాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో బ్లైండ్ అసోసియేషన్ సభ్యులు ఎం.నరేందర్, రాజ్ కిరణ్, రమణయ్య, ఉపేంద్రమ్మ, అనూష, కిరణ్, వరప్రసాద్, నాగేశ్వరరావు, నరేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన బెటాలియన్ క్రీడలు
చుంచుపల్లి: నాలుగు రోజుల పాటు రసవత్తరంగా సాగిన బెటాలియన్ వార్షిక క్రీడలు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఫైనల్కు చేరిన జట్ల పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది, అధికారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతాయని చెప్పారు. భవిష్యత్లో జరిగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ట్లు డి.శ్రీనివాసరావు, కె.శంకర్ పాల్గొన్నారు. జిల్లా యువతకు రెండు భారీ పరిశ్రమల్లో శిక్షణసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా యువతకు రెండు భారీ పరిశ్రమల్లో శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం శనివారం ఓరియెంటేషన్, ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఏఎన్ఈ 50, ఎంఆర్ఎఫ్లో 70 పోస్టులు ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్కు హాజరు కావాలని సూచించారు. యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దేశంలోని ప్రముఖ పరిశ్రమలైన ఆర్ఏఎన్ఈ(మద్రాస్) లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ సంస్థల్లో శిక్షణ, అప్రెంటిస్ అవకాశాలు కల్పించామని వివరించారు. వివరాలకు 93473 53551, 79958 06182 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్కు ప్రమాదం
జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు గ్రామ సమీపాన గురువారం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. చీపురుగూడెం గ్రామానికి చెందిన సుమారు 30 మంది మహిళా కూలీలు పత్తి తీసేందుకు ట్రాక్టర్లో భేతాళపాడు గ్రామం మీదుగా వెళ్తున్నారు. ఈక్రమంలో పొలాలకు వెళ్లే దారి బురద, గుంతలతో ఉండడంతో ట్రాక్టర్ ట్రక్కు బురదలో ఇరుక్కుని పక్కకు ఒరిగింది. దీంతో ట్రక్కులోని మహిళా కూలీలు పడిపోగా.. 8 మందికి గాయాలయ్యాయి. ఇందులో మూడు నెలల గర్భిణి సోడె సుస్మితతో పాటు వజ్జా విజయలక్ష్మి, వజ్జా రమాదేవి, మూతి రజిత, కీసర ఉదయశ్రీ, బచ్చల అనసూయ, బొర్రా మంగమ్మ, కోరం లక్ష్మి ఉండగా.. స్థానికులు వీరిని 108లో కొత్తగూడెం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను సేకరించారు. అలాగే భేతాళపాడు సర్పంచ్ గుగులోత్ సునీత, మహేష్ దంపతులు క్షతగాత్రులను పరామర్శించారు. ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడకుండా పక్కకు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. 8 మంది మహిళా కూలీలకు గాయాలు -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటనఇల్లెందు/పినపాక: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లెందుకు చేరుకోనున్న మంత్రి.. రూ. 3.17 కోట్లతో నిర్మించే రోడ్లు, డ్రెయిన్లు, బ్రిడ్జిల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో నూతన సర్పంచ్లను సన్మానిస్తారు. సాయంత్రం 4 గంటలకు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం చేరుకుని జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను వీక్షిస్తారు. అనంతరం బయ్యారం క్రాస్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ నూతన సర్పంచ్లను సన్మానిస్తారు. ఈ మేరకు అధకారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతంగా టెట్సూపర్బజార్(కొత్తగూడెం): సుజాతనగర్లోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన టెట్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సెషన్ –1కు 100 మంది అభ్యర్థులను గాను 87 మంది, సెషన్–2కు 100 మందికి గాను 56 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. రెండు సెషన్లలోనూ ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు కొనసాగాయని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని వివరించారు. మందుల కొరత లేకుండా చూడాలిడీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ చుంచుపల్లి: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. గురువారం ఆయన ఫార్మసీ, నర్సింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన మందుల ఇండెంట్ను ఈ – ఔషధీ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. కాలం చెల్లిన మందుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని, గడువుకు ముందే వాటిని వినియోగించేలా చూడాలని చెప్పారు. అనంతరం జిల్లా వ్యాక్సిన్ స్టోర్ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డాక్టర్ తేజస్వి, సిబ్బంది నాగభూషణం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకుడికి డాక్టరేట్పాల్వంచరూరల్: పట్టుదలతో ఉన్నత చదువులు చదివి అధ్యాపకుడిగా ఉద్యోగం చేస్తున్న మండల వాసికి డాక్టరేట్ దక్కింది. మండలంలోని కొత్తసూరారం గ్రామానికి చెందిన గుగులోతు రాంజీ – కౌసల్య దంపతుల చిన్నకుమారుడు గుగులోతు సుధాకర్ పాండిచ్చేరిలోని జిప్మార్ విశ్వవిద్యాలయంలో మెడికల్ బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తిచేశారు. ప్రస్తుతం కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని మల్వంచల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుధాకర్ను వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
క్రీడోత్సవాలకు వేళాయె..
ఇల్లెందురూరల్: గ్రామస్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి తీసుకొచ్చిన సీఎం కప్ పోటీలతో పల్లెల్లో క్రీడా సంబురాలు మొదలుకానున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలను నాలుగు దశల్లో ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీవైఎస్ఓ మందపాటి పరంధామరెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. గతేడాదికి భిన్నంగా.. గతేడాదికి భిన్నంగా ఈ ఏడాది చిన్నారులు, వృద్ధులు, మహిళలకు సైతం ప్రత్యేక క్రీడలను ఏర్పాటు చేశారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో మొత్తం 44 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా.. ఆసక్తి గల క్రీడాకారులందరూ పాల్గొనవచ్చని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, నియోజకవర్గ స్థాయిలో అదనంగా బాస్కెట్బాల్ పోటీలు ఉంటాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మిగతా అన్ని క్రీడాపోటీలు నిర్వహిస్తారు. క్రీడాంశాల వివరాలు.. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, బాక్సింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్బాల్, సెపత్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్ బాక్సింగ్, సైక్లింగ్, రాకెట్, రోయింగ్, స్క్వాష్, కన్నోయింగ్ కయాకింగ్, అత్యాపత్య, సాఫ్ట్బాల్, పవర్లిఫ్టింగ్, ఉషూ, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ అండ్ స్నూకర్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లఖంబ, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికల్బాల్, పారాగేమ్స్. దరఖాస్తు విధానం.. సీఎం కప్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ క్రీడాకారుడు రెండు క్రీడల్లో మాత్రమే పాల్గొనే అవకాశం ఉండడంతో క్రీడాంశాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రీడాకారులు తమ వివరాలను satg. telangana. gov. in అనే వెబ్సైట్లో వారి ఫోన్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి లేదా గూగుల్ ప్లేస్టోర్లో సీఎంకప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పాల్గొనదల్చిన క్రీడల్లో నమోదు చేయాలి. వారు మాత్రమే పోటీలలో పాల్గొనేందుకు అర్హులని జిల్లా యువజన, క్రీడాల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సీఎం కప్ పోటీలు నిర్వహించనుండగా.. గ్రామస్థాయిలో ఈ నెల 17వ తేదీ నుంచి 22 వరకు, మండల, మున్సిపల్ స్థాయిలో ఈ నెల 28 నుంచి 31 వరకు, నియోజకవర్గస్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు, రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. సీఎం కప్ పోటీలకు జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ కన్వీనర్గా, క్లస్టర్ ఇన్చార్జ్లుగా ఎంఈఓలు, డీఈఓ,డీపీఓలు వ్యవహరిస్తారు. ఈ నెల 17 నుంచిసీఎం కప్ పోటీలు -
కత్తితో యువకుడు హల్చల్..
టేకులపల్లి: భూ తగాదాల నేపథ్యాన ఓ యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. అందరినీ చంపేస్తానని బెదిరించడంతో పాటు బైక్లు, ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశాడు. టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం దాసుతండా పంచాయతీ సింగ్యతండాకు చెందిన హమాలీ వర్కర్ బోడ వెంకన్న తన బంధువైన బోడ గన్నాకు భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన గురువారం సాయంత్రం గన్నా ఇంట్లో లేని సమయాన వెంకన్న కత్తితో వారి ఇంట్లోకి వెళ్లి గన్నా భార్య రజితను దుర్భాషలాడడంతో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని బెదిరించారు. అంతేకాక ఇంట్లోని కుర్చీలు, వాషింగ్ మిషన్, తలుపులను, బయట ఉన్న భూక్య లక్ష్మణ్, గుగులోత్ శ్రీను, బోడ గన్నాలకు చెందిన బైక్లను ధ్వంసం చేశాడు. దీంతో స్థానికులు 100కు డయల్ చేయగా.. టేకులపల్లి పోలీసులు వచ్చి వెంకన్నను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. బోడ రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వివాహిత ఆత్మహత్య దమ్మపేట: కుటుంబ కలహాల నేపథ్యాన మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్మ చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిద్దె వెంకటలక్ష్మి(28)కి, ఆమె భర్తకు ఇటీవల కాలంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె క్షణికావేశంలో ఇంటి వెనుక ఉన్న చెక్క దులానికి చున్ని సాయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. వేధింపులు భరించలేక మరొక వివాహిత.. కొణిజర్ల: బావ వరస అయ్యే వ్యక్తి లైంగికంగా వేధిస్తుండడంతో తట్టుకోలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ వెల్లడించిన వివరాలు... కూసుమంచి మండలం శుక్రవారపుపేటకు చెందిన కానిస్టేబుల్ షేక్ సయ్యద్కు మండలంలోని లాలాపురం వాసి షేక్ ఆశాబీ(34)తో వివాహం జరిగింది. అయితే, ఆశాబీని బావ వరస అయ్యే వైరా వాసి షేక్ రహీమ్ కొంతకాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంలో రహీమ్ భార్య జైబూబీ కూడా ఆశాబీని తప్పుపడుతూ ఆమె ఫొటోలు బయటపెడతానని బెదిరించింది. దీంతో వేదనకు గురైన ఆశాబీ ఈనెల 7న లాలాపురం వచ్చి గురువారం పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తండ్రి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై ఆశాబీ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సత్యంపేటలో ‘ప్రజాబాట’
ములకలపల్లి: మండలపరిఽధిలోని సత్యంపేట గ్రామంలో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజాబాట’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ఈ జి.మహేందర్ మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగం, కరెంట్ వాడకంపై పొ దుపు తదితర అంశాలపై వివరించారు. మా ధారం సర్పంచ్ గంపా సుజాత, ఏడీఈ రహీం హుస్సేన్, ఏఈ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. కలకోటలో చేపల చోరీకి యత్నం బోనకల్: మండలంలోని కలకోట చెరువులో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియ ని వ్యక్తులు చేపల చోరీకి యత్నించారు. అదే సమయానికి మత్స్య సహకార సంఘం సభ్యులు వచ్చేసరికి వారు పారిపోయారు. అప్పటికే పెద్దమొత్తంలో చేపలు పట్టి తరలించేందుకు సిద్ధం కాగా, వాటితో పాటు వలలను వదిలేసి వెనుదిరిగారు. ఘటనపై సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
● కారు ఢీకొని ఒకరు.. సత్తుపల్లిరూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటకు చెందిన మేధమంచి వరప్రసాద్(65) ద్విచక్రవాహనంపై గురువారం వస్తుండగా సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. ● బైక్ అదుపుతప్పి మరొకరు.. టేకులపల్లి: సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన అత్తగారింటికి వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పిన మృతిచెందాడు. బోడు ఎస్ఐ పోలిరెడ్డి శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం. కొత్తగూడెం బూడిదగడ్డకు చెందిన గొగ్గెల పెద్దిరాజు(31)కు టేకులపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రేష్మాతో ఆరేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఒక పాప ఉంది. అయితే సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న పెద్దిరాజు బుధవారం ఉదయం బర్లగూడెంలోని అత్తగారింటికి వెళ్లి అదే రోజు రాత్రి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈక్రమంలో బర్లగూడెం–ఒడ్డుగూడెం మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోగా.. రాత్రంతా ఎవరూ గమనించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తగూడెంకు తరలించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ● ట్రాక్టర్ బోల్తాపడి ఇంకొకరు.. ములకలపల్లి: మండలపరిధిలోని తాళ్లపాయ జీపీ పరిధిలో గురువారం ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మధుప్రసాధ్ కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామానికి చెందిన సిద్దెల ప్రసాద్ తన కొడుకు సిద్దెల వంఽశీ (23)ని ట్రాక్టర్పై ఎక్కించుకొని వెంకటాపురం వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో తాళ్లపాయ జీపీ పరిధిలోని రింగిరెడ్డిపల్లి శివారులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా వంశీ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 108లో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, ఆపై ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య గీతాంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రీడాభివృద్ధికి సహకరిస్తాం
సీఎం కప్ టార్చ్ ర్యాలీలో కూనంనేనిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో క్రీడల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీఎం కప్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు సీఎం కప్ టార్చ్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. 44 అంశాల్లో సీఎం కప్ క్రీడా పోటీలు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్ స్థాయిలో పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ టోర్నీ ఏర్పాటుచేశారని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం. పరంధామరెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు యుగంధర్రెడ్డి, మహీధర్, వెంకటేశ్వరరావు, రమేష్, కాశీహుస్సేన్, స్వాతిముత్యం, బాబ్జి, జాన్సన్, శ్రీధర్, మొగిలి, రఘు, కోచ్లు డానియల్, కళ్యాణ్, మల్లికార్జున్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఇల్లెందులో టార్చ్ ర్యాలీఇల్లెందు: ఇల్లెందులో శుక్రవారం ఉదయం 8 గంటలకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభమవుతుందని డీవైఎస్ఓ పరంధామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీలో యువత, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
రోశిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు
బూర్గంపాడు: పీసీసీ మాజీ సభ్యుడు యడమకంటి రోశిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు అన్నారు. నాగినేనిప్రోలులోని రోశిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం జరిగిన దశదిన కర్మలకు వారు హాజరై నివాళులర్పించాక మాట్లాడారు. దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అనుచరుడిగా భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాలలో పార్టీ అభివృద్ధికి ఆయన కృషిచేశారని, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పాయం, తెల్లం -
జాబ్మేళాలో 10 మందికి ఉద్యోగాలు
రుద్రంపూర్: కొత్తగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అపోలో హైదరాబాద్ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన జాబ్మేళాలో ఉద్యోగాలకు ఎంపికై న 10 మందికి గురువారం నియామక పత్రాలు అందజేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి(డీఈఓ) కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. అపోలో కంపెనీలో జూలూరుపాడు, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో ఖాళీగా ఉన్న ఫార్మసీ అసిస్టెంట్ 100 పోస్టులకు 25 మంది హాజరు కాగా.. 10 మందిని కంపెనీవారు ఎంపిక చేశారన్నారు. వీరికి వేతనం రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించనున్నట్లు తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ పాల్వంచరూరల్: పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మండల పరిధి లోని కోడిపుంజులవాగు గ్రామ శివారులో గురువారం పేకాటస్థావరంపై రూరల్ ఎస్ఐ సురేశ్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీంతో పేకాట ఆడుతున్న జాటోత్ అశోక్, అజ్మీర కల్యాణ్, హలవత్ బాలాజీ, గురులోత్ సక్రు, తోట్ల సంపత్ పట్టుబడగా.. గుగులోత్ లాలు తప్పించుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.18,260 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దాడి కేసులో వ్యక్తి.. టేకులపల్లి: దాడి కేసులో టేకులపల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ పరిధిలోని పాత తడికలపూడి గ్రామంలో గత నెల 16న ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఈసం వంశీరామ్ను అదే గ్రామానికి చెందిన జార కల్యాణ్ ఇనుప రాడ్డుతో కొట్టడంతో వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో టేకులపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదవగా.. గురువారం నిందితుడు కల్యాణ్ను అరెస్టు చేసి ఇల్లెందు కోర్టుకు, ఆ తర్వాత జైలుకు తరలించారు. దుప్పిని చంపిన కేసులో ఇద్దరి రిమాండ్ పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యంలో గత మూడు నెలలక్రితం దుప్పిని చంపిన కేసులో ఇద్దరికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. యానంబైల్ సెక్షన్ ఆఫీసర్ బి.కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. యానంబైల్ రేంజ్ పరిధిలోని మొండికట్ట బీట్లో గతేడాది అక్టోబర్లో మొండికట్ట గ్రామానికి చెందిన దేశెట్టి ఆంజనేయులు, వరాల ప్రసన్నకుమార్లు దుప్పిని హతమార్చారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం కొత్తగూడెం కోర్టులో హాజరు పర్చగా.. ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో భద్రాచలంలోని సబ్జైలుకు తరలించినట్లు తెలిపారు. ములకలపల్లి: కొండగొర్రె మాంసం విక్రయిస్తున్న నలుగురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) రవికిరణ్ కథనం మేరకు.. ములకలపల్లి మండలకేంద్రంలోని విజయపురి కాలనీలో బుధవారం రాత్రి వన్యప్రాణి మాంసం అమ్ముతున్నారనే సమాచారం రావడంతో దాడి చేయగా.. సంగం ఆది నారాయణ ఇంట్లో మాంసంతో పాటు తల, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు. కాలనీకి చెందిన నారాయణతో పాటు గంపా సాంబయ్మ, కన్నెబోయిన శివ, సంగం వెంకన్నలను అదుపులోకి తీసుకున్నారు. ములకలపల్లి శివా రులోని అట వీ ప్రాంతంలో వేటకుక్కల సాయంతో కొండగొర్రెను హతమార్చినట్లు నిందితులు ఒప్పుకోవడంతో ఆ నలుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి 15 రోజుల రిమాండ్ విధించగా.. భద్రాచలం సబ్జైలుకు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. నాటు సారా, బెల్లం స్వాధీనం కొత్తగూడెంఅర్బన్: వాహనాల తనిఖీల్లో భాగంగా కొత్తగూడెం – హేమచంద్రాపురం రోడ్డులో గురువారం కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ టీం ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈనేపథ్యాన టేకులపల్లి మండలం 9వ మైల్తండాకు చెందిన ఇస్లావత్ రవి తన బైక్పై వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. దీంతో అతడి వద్ద 25 కేజీల బెల్లం, 2 కేజీల పట్టిక, 2 లీటర్ల నాటు సారాయి లభించడంతో వాటితో పాటు బైక్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌతమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రామకృష్ణగౌడ్, రమేష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
జీయర్ మఠంలో రాపత్తు సేవ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు సేవలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం జీయర్ మఠం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో రాపత్తు సేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి కోలాటాలు, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జీయర్ మఠానికి తీసుకెళ్లారు. వేదికపై ఆశీనులు చేసి, ప్రత్యేక పూజలు చేశాక హారతి సమర్పించారు. అలాగే ఆలయంలో నమ్మాళ్వార్ పరమపదోత్సవం, చిత్రకూట మండపంలో శాత్తుమురై నిర్వహించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నయనానందకరంగా నిత్య కల్యాణం -
దారి మళ్లారెందుకో..?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అడవుల సంరక్షణ విషయంలో అటవీ శాఖ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని కీలకమైన ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అయినప్పటికీ అడవిని రక్షించడంలో రాజీ పడదనే పేరును ఆ శాఖ తెచ్చుకుంది. ఆరేళ్లుగా అతీగతీ లేదు.. ఆళ్లపల్లి – మామకన్ను మధ్యన కిన్నెరసానిపై రూ.9 కోట్లతో 2019లో వంతెన పనులు ప్రారంభమయ్యాయి. అయితే వంతెనకు సంబంధించి ఒక పిల్లర్ అభయారణ్యం పరిధిలో ఉందంటూ అటవీ శాఖ ఆ పనులను ఆపేసింది. ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ ఇంచు కూడా ముందుకు సాగలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో అశ్వాపురం మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. దీనికి అనువుగా పినపాక మండలం జానంపేటలో 50 ఎకరాల స్థలంలో ఆయిల్ఫామ్ మొక్కల నర్సరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, అటవీ శాఖ అభ్యంతరాలతో నర్సరీ దగ్గరే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేటకు తరలిపోయింది. వీరాపురం క్రాస్రోడ్ నుంచి రేగళ్ల మీదుగా ఆళ్లపల్లి మండలం మర్కోడు వరకు గత ప్రభుత్వ హయాంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంత కోటాలో రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. అయితే రేగళ్ల – మర్కోడు మధ్య అటవీ ప్రాంతమనే అడ్డంకులతో ఈ రోడ్డు నిర్మాణం జరగక నిధులు వెనక్కి మళ్లాయి. ఈ రహదారి పూర్తయితే మణుగూరుతో సంబంధం లేకుండా జిల్లా కేంద్రం కొత్తగూడెం వచ్చేందుకు వారికి దగ్గరి దారి అందుబాటులోకి వచ్చేది. అత్యవసర వైద్యం, ఇతరత అవసరాలకు ఈ రోడ్డు ఏజెన్సీ వాసులకు ఉపయోగపడేది. అటవీ సంరక్షణే ధ్యేయంగా.. అటవీ శాఖ అభ్యంతరాలతో జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. అందులో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం మొండికట్ట – కారేగట్టు రోడ్డుకు మూడేళ్ల క్రితమే రూ.6 కోట్లు మంజూరయ్యాయి. అశ్వారావుపేట మండలంలో గాండ్లగూడెం – చెన్నాపురం రోడ్డు, ములకలపల్లి మండలం తిమ్మంపేట – గుండాలపాడు రోడ్డు, చండ్రుగొండ మండలంలో బెండాలపాడు –బ్రహ్మాళ్లకుంట, ఇల్లెందు మండలం మొండితోగు – ధర్మాపురం తదితర రోడ్లకు నిధులు మంజూరైనా అటవీశాఖ అభ్యంతరాలతో ఈ పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇంకా పలు వంతెనలు, కల్వర్టుల పనులు కూడా నిలిచిపోయాయి. వలసలపైనా కఠినమే ఒంటి మీద సరైన వస్త్రం కూడా లేకుండా అత్యంత దీనమైన పరిస్థితుల్లో వలస ఆదివాసీలు జిల్లాలో జీవిస్తున్నారు. వాగు నీరే వీరికి ఆధారం. వేసవిలో వాగులు ఎండి గుక్కెడి నీటి కోసం అల్లాడిపోతుంటారు. వీరు నివసించే గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడంపై అటవీ శాఖ ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చివరకు తాగునీటి కోసం బోరు వేసేందుకు కూడా ఒప్పుకోవడం లేదు.వనాలను కాపాడే విషయంలో నిక్కచ్చిగా ఉన్న జిల్లా అటవీ విభాగం, మణుగూరు డివిజన్లో నిర్మించిన జలపాతాల రోడ్డుతో చిక్కుల్లో పడినట్టయింది. గోదావరి తీరంలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి లారీలు వచ్చి పోయేందుకు వీలుగా అడవిలో వేలాది చెట్లను నరికి రోడ్డు వేయడం, తర్వాత దానికి వాటర్ ఫాల్స్ రోడ్లు అంటూ కలరింగ్ ఇవ్వడం అటవీ శాఖ పనితీరులో వచ్చిన మార్పునకు అద్దం పడుతోంది. అడవులను సంరక్షించే విషయంలో ఇప్పటి వరకు కఠినంగా ఉన్న జిల్లా అటవీ శాఖ అకస్మాత్తుగా మెత్తబడటం వెనుక మతలబు ఏంటనేది హాట్ టాపిక్గా మారింది. అడవి నరికివేతకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు పెద్దలు మరోసారి అదే పెద్ద మనసుతో వ్యవహరించి జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ కొర్రీలతో ఆగిపోయిన పనులపై దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుక రవాణాపై చూపించిన శ్రద్ధనే ఏజెన్సీ వాసులు కష్టాల తీర్చడంపైనా చూపిస్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.అధికారుల వైఖరి అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. -
బీజేపీ బూత్ కమిటీల సమన్వయ సమావేశం
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన గురువారం భారతీయ జనతా పార్టీ బూత్ నిర్మాణ అభియాన్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ.. పార్టీకి బూత్ కమిటీ పునాది వంటిదని, జిల్లా వ్యాప్తంగా అన్ని బూతులలో పటిష్టమైన కమిటీలను నిర్మించాలన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతీ బూతు స్థాయిలో 12 మందితో కూడిన కమిటీ వేసి అనునిత్యం ఓటర్ల సమస్యల పరిష్కా రం కోసం పాటుపడాలన్నారు. బూత్ నిర్మాణ అభియాన్ కన్వీనర్ గొడుగు శ్రీధర్, కో– కన్వీనర్ భోగి కృష్ణ, ఖమ్మం పార్లమెంట్ కో–కన్వీనర్ జల్లారపు శ్రీనివాసరావు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చింతలచెరువు శ్రీనివాస్రావు, మండల అధ్యక్షులు, కన్వీనర్లు, కో– కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. -
23 నుంచి వాగ్గేయకారోత్సవాలు
● భద్రగిరిలో ఐదు రోజుల పాటు రామదాసు జయంత్యుత్సవాలు ● ఈనెల 27 వరకు స్వర నీరాజనాలు ● పలు ప్రాంతాల నుంచి తరలిరానున్న సంగీత కళాకారులుభద్రాచలం: వాగ్గేయకారోత్సవాలకు భద్రగిరి సిద్ధమవుతోంది. ఐదు రోజుల పాటు సంగీత కళాకారులు తమ మధుర గీతాలతో ఓలలాడించనున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ నిర్మాణ కర్త, రామయ్యకు అపర భక్తాగ్రేసరుడైన రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్న 393వ జయంతి సందర్భంగా ఈ వేడుకలు జరపనున్నారు. ఈనెల 23 నుంచి 27 వరకు దేవస్థానం, అలివేలు మంగా సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్, సామగా నలహరి కల్చరల్ ట్రస్ట్, నాదసురంగణి వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే సంగీత కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. నేండ్రగంటి, మల్లాది సోదరులు ప్రత్యేకంగా.. భక్త రామదాసు వాగ్గేయకారోత్సవాలకు సరికొత్త రూపునిచ్చి ప్రఖ్యాతిని పెంచారు చక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్. రామయ్య, రామదాసుపై భక్తితో ప్రతీ ఏడాది ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ సరికొత్త శోభను పెంచారు. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులను రప్పించి భద్రాచలంలో సంగీత నీరాజనాలను సమర్పించేలా కృషి చేశారు. ప్రతీ ఏడాది వాగ్గేయకారోత్సవాల ప్రారంభం రోజున హాజరై స్వామి వారి సేవలో తరిస్తారు. ‘నవరత్న ఘోష్టి’ పేరిట రామదాసు కీర్తనలు ఆలపించి స్వామికి నీరాజనం అర్పిస్తారు. మల్లాది సోదరుల సంగీత ప్రదర్శనలు మరో ఆకర్షణగా నిలుస్తాయి. కార్యక్రమాలు ఇలా.. ఈ వేడుకల్లో తొలిరోజైన 23వ తేదీన నగర సంకీర్తన, రామదాసు విగ్రహానికి అభిషేకం, చిత్రకూట మండపంలో సభాప్రారంభం, నవరత్న కీర్తనల ఘోష్టి నిర్వహిస్తారు. నేండ్రగంటి కృష్ణమోహన్, మల్లాది సూరిబాబు, మల్లాది శ్రీరామ్కుమర్, రవికుమార్తో పాటు ఇతరుల ప్రదర్శనలు ఉంటాయి. 24 నుంచి 27 వరకు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ కొల్లు దామోదర్రావు తెలిపారు. -
తెలంగాణ జట్టు బోణీ
పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి అండర్ –17 బాలుర కబడ్డీ పోటీలో తెలంగాణ జట్టు బోణీ చేసింది. రెండో రోజైన గురువారం తమిళనాడు – తెలంగాణ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఆరు పాయింట్ల తేడాతో రాష్ట్ర జట్టు గెలుపొందింది. జట్టుకు సారథ్యం వహించిన దేవరాజ్ 20 రైడ్ పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రాష్ట్ర జట్టుకు యూనిఫామ్, షూ అందజేశారు. తలపడిన 20 జట్లు.. పోటీల రెండో రోజున మొత్తం 20 జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. పంజాబ్ – మధ్యప్రదేశ్ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం – విద్యాభారతి జట్ల మధ్య జరిగిన పోటీలో విద్యా భారతి, చండీఘర్ – ఒడిశా జట్లలో ఒడిశా, ఏపీ – త్రిపుర జట్లు పోటీ పడగా ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి – సీఐఎస్సీ జట్ల మధ్య జరిగిన పోటీలో పుదుచ్చేరి, తెలంగాణ – తమిళనాడు జట్లు పోటీ పడగా తెలంగాణ, కర్ణాటక – ఢిల్లీ జట్ల మధ్య జరిగిన పోటీలో కర్ణాటక, మహారాష్ట్ర – హిమాచల్ప్రదేశ్ జట్లు పోటీ పడగా మహారాష్ట్ర, రాజస్థాన్–ఉత్తరాఖండ్ జట్లు పోటీ పడగా రాజస్థాన్, హరియాణా – కేవీఎస్ జట్ల మధ్య జరిగిన పోటీలో హరియాణా, ఎన్వీఎస్ – మధ్యప్రదేశ్ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్, జార్ఖండ్ – మణిపూర్ జట్లు పోటీ పడగా మణిపూర్, పశ్చిమ బెంగాల్ – సీబీఎస్ఈ జట్లు తలపడగా సీబీఎస్ఈ, గుజరాత్ – జమ్మూ కాశ్మీర్ జట్లలో గుజరాత్, కేరళ – సీబీఎస్ఈ వెల్ఫేర్ జట్లు పోటీ పడగా కేరళ, ఉత్తరప్రదేశ్ – ఛత్తీస్గఢ్ జట్లు పోటీ పడగా ఉత్తరప్రదేశ్, అసోం – విద్యాభారతి జట్లు తలపడగా విద్యాభారతి, పంజాబ్ – ఎన్వీఎస్ జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్ విజయం సాధించాయి. ఛత్తీస్గఢ్ – ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో రెండు పాయింట్లు తేడాతో ఉత్తరప్రదేశ్, కేరళ – సీబీఎస్సీ వెల్ఫేర్ జట్ల మధ్య జరిగిన పోటీలో నాలుగు పాయింట్లు తేడాతో కేరళ విజయం సాధించాయి. తెలంగాణ జట్టుకు సారధిగా ఉండడం బాధ్యతను మరింతగా పెంచింది. క్రీడాకారుల సమన్వయం, కోచ్ల సలహాలు, సూచనలతో రాష్ట్రాన్ని విజయ తీరాలకు చేర్చే లక్ష్యంతో పోరాడుతాం. మొదటి మ్యాచ్ గెలుపొందడం సంతోషాన్నిచ్చింది. –దేవరాజ్, తెలంగాణ జట్టు కెప్టెన్ క్రీడాభిమానులు, గ్రామస్తులు కేరింతల నడుమ క్రీడలు ఆహ్లాద భరితంగా సాగుతున్నాయి. తొలిరోజు జార్ఖండ్పై ఏపీ జట్లు గెలుపొందగా, రెండో రోజు తమిళనాడుపై తెలంగాణ విజయం సాధించింది. ఇక ఆంధ్రప్రదేశ్ జట్టు రెండో రోజు త్రిపురపై 27 పాయింట్లు తేడాతో గెలుపొందింది. ఈ పోటీ నడుస్తుండగానే ఏపీకి చెందిన క్రీడాకారుడు స్వల్ప అస్వస్థతకు గురి కాగా వైద్యులు చికిత్స అందించి, ఫిజియోథెరపీ చేశారు. తమిళనాడుపై గెలుపొందిన రాష్ట్ర జట్టు -
సర్కార్ బడులకు కంప్యూటర్లు అందజేత
చర్ల(దుమ్ముగూడెం): దుమ్ముగూడెం మండలం సింగవరం గ్రామపంచాయతీ పరిధి పెద్దపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మళల్ల మోహన్కుమార్ చొరవతో ఆయన స్నేహితులు మండలంలోని ఐదు పాఠశాలలకు రూ.లక్ష విలువైన నాలుగు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్ అందజేశారు. భద్రాచలంలోని మండల విద్యావనరుల కేంద్రంలో గురువారం డీఈఓ బి.నాగలక్ష్మి చేతుల మీదుగా వీటిని దుమ్ముగూడెం మండలంలోని పెద్దపాడు, కొమ్మనాపల్లి, ములకపాడు, చిన నల్లబల్లి, తూరుబాక గ్రామ పాఠశాలల హెచ్ఎంలకు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మోహన్కుమార్ తన మిత్రులైన మూర్తి, బ్రహ్మచారి, ఎం.సాయిసన్వి, సాయిరాం, ఎ.నరేష్కుమార్, కె.బాలప్రసాద్, ఎం.యాదగిరి, ఎ.రాజు, జి.శివకుమార్, ఎన్.ప్రకాశ్, జి.ప్రవీణ్కుమార్, వెంకటరమణ, బాలాజీ సహకారంతో కంప్యూటర్లు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమాదేవి, దుమ్ముగూడెం కాంప్లెక్స్ హెచ్ఎం కోటీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు జీఆర్సీలు కీలకం
సూపర్బజార్(కొత్తగూడెం): గ్రామీణ ప్రాంత మహిళలు గృహహింస, లైంగిక వేధింపులు, సామాజిక, ఆర్థిక సమస్యలకు గురైనప్పుడు వారికి రక్షణగా నిలిచేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్లు(జీఆర్సీ) కీలకంగా ఉపయోగపడతాయని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. జీఆర్సీల అమలుపై అవగాహన కల్పించేందుకు గురువారం కలెక్టరేట్లో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో తొలి దశలో భద్రాచలం, మణుగూరు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలకు జీఆర్సీలు మంజూరయ్యాయని తెలిపారు. మహిళా హక్కులు, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించడం, మానసిక ఒత్తిడికి గురైన బాధితులకు నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించడం వంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామ, మండల సమాఖ్యల్లోని సభ్యులతో సామాజిక కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేస్తామని, గ్రామ స్థాయిలో ముగ్గురు, మండల స్థాయిలో ఐదుగురు సభ్యులను నియమిస్తామని చెప్పారు. ఈ సభ్యులకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రతీ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీఆర్సీల్లో సభ్యులు అందుబాటులో ఉంటారని వివరించారు. కార్యక్రమంలో ట్రెయినీ డీపీఓ బి.అనూష, జెండర్ ట్రైనర్ జమున, సెర్ప్ జెండర్ డీపీఎం లింగయ్య గౌడ్, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ రూప తదితరులు పాల్గొన్నారు.డీఆర్డీఓ విద్యాచందన -
మధ్యాహ్న భోజన వర్కర్ చేతివాటం..
● వంట గదిలో 117 కేజీల బియ్యం నిల్వలు ● వారంలో ఒక్కరోజే గుడ్డుటేకులపల్లి:టేకులపల్లి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు (అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్) చేతివాటం బట్టబయలైంది. ఈ పాఠశాలలో స్కావెంజర్ను తొలగించాలని జరిగిన గొడవ కాస్త మధ్యాహ్న భోజన వర్కర్ పాల్పడిన అవకతవకలు వెలికితీతకు కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ పాఠశాలకు చెందిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ (మధ్యాహ్న భోజన వర్కర్) పొగాకు లక్ష్మి, హెచ్ఎం మంగీలాల్లు స్కావెంజర్గా గోల్కొండ శ్యామలను మూడు నెలల క్రితం నియమించారు. అయితే స్కావెంజర్ అవకతవకలకు పాల్పడుతోందని, ఆమెను తొలగించాలని హెచ్ఎంను చైర్మన్ కోరగా.. ఆమె పనితీరు బాగానే ఉందని ఉపాధ్యాయులతో సహా తేల్చి చెప్పారు. ఈ విషయంలో మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయులకు, కొందరు పేరెంట్స్కు వాగ్వాదం కూడా జరిగింది. సంక్రాంతి తర్వాత చర్చిస్తామని హెచ్ఎం చెప్పారు. అధికారుల విచారణ.. పాఠశాలలో మధ్యాహ్న భోజన వర్కర్గా పని చేస్తున్న పొగాకు లక్ష్మి అవకతవకలకు పాల్పడుతోందని తల్లిదండ్రులు, విద్యార్థులు హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో వంట గదిని తనిఖీ చేయగా.. 117 కేజీల బియ్యం లభ్యమైంది. విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలపడంతో గురువారం ఆర్ఐ రత్తయ్య ఆధ్వర్యాన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక రేషన్ డీలర్కు అప్పగించారు. ఈ క్రమంలోనే వారంలో మూడు గుడ్లకు బదులు ఒక్క టి మాత్రమే పెడుతోందని, వంట పాత్రలు సొంత అవసరాలకు వాడుకుంటోందని, ఉపాధ్యాయులను సైతం బెదిరిస్తుందనే ఆరోపణలు రావడంతో ఎంఈఓ జగన్నాయక్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విషయమై ఆమెను తొలగించనున్నట్లు హెచ్ఎం తెలపగా.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బియ్యాన్ని పొదుపు చేశానే తప్ప అక్రమంగా నిల్వ చేయలేదని లక్ష్మి పేర్కొంది. -
రండి.. రండి..
● ఈ–బయ్యారంలో మొదలైన జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీ ● 33రాష్ట్రాల నుంచి హాజరైన జట్లు ● ఇళ్ల ముందు ముగ్గులతో గ్రామస్తుల స్వాగతంకార్పొరేషన్ ఏర్పాటుపై కౌంటర్ దాఖలు చేయండిపాల్వంచ: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పా టు అసంబద్ధంగా ఉందంటూ కొందరు కోర్టులో కేసులు వేసినా ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడంపై హైకోర్టు స్పందించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలిలా.. కొత్తగూడెం కార్పొరేషన్లో షెడ్యూల్డ్ ఏరియాలోని పాల్వంచతో పాటు సుజాతనగర్ మండంలోని ఏడు గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ సరికాదని, తక్షణం ఎన్నికలు నిలిపివేయాలని, కార్పొరేషన్ను రద్దు చేయాలని పాల్వంచకు చెందిన పోట్రు ప్రవీణ్కుమార్, అజ్మీర నరేష్ నాయక్, భట్టు కృష్ణ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాదులు, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగగా 19వ తేదీకి వాయిదా పడింది. అప్పటిలోగా ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలైన మందమర్రి, మణుగూరు, కొత్తగూడెం కార్పొరేషన్కు చెందిన ఇతర పెండింగ్ కేసులు సైతం ఏక కాలంలో బెంచ్పైకి రాగా వాటికి సైతం 27వ తేదీలోగా కౌంటర్ దాఖ లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో మున్సిపాలిటీగా చేసిన భద్రాచలాన్ని తిరిగిగ్రామపంచాయతీగా మార్చిన అంశాన్ని వారు ప్రస్తావించినట్లు సమాచారం. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం -
యువత భవిష్యత్ను మార్చేలా ‘సీఎం కప్’
మణుగూరు టౌన్: క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సకల్పంతో ‘సీఎం కప్ 2025 – 26’ ఏర్పాటు చేశామని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్తో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి క్రీడాకారుడిని రాష్ట్ర స్థాయి వేదిక వరకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కప్ ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తామన్నారు. ఎమ్మెల్యేలు పాయం, తెల్లం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల భవిష్యత్ వృథా కాకూడదన్నారు. యువత క్రీడల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వర్లుతో పాటు నాయకులు నవీన్, శివ, సౌజన్య, తరుణ్ రెడ్డి, సమితిసింగారం, కూనవరం, కట్టుమల్లారం, లంకమల్లారం సర్పంచ్లు కలబోయిన మాధవరావు, ఏనిక శ్వేత, జగిడి ప్రసాద్, పూనెం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.టార్చ్ ర్యాలీ ప్రారంభంలో క్రీడా శాఖ మంత్రి శ్రీహరి -
కబడ్డీ.. కబడ్డీ..
పినపాక: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అండర్ –17 బాలుర కబడ్డీ పోటీలు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో బుధవారం ప్రారంభమయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జట్లు హాజరుకాగా, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కబడ్డీ భారతదేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అన్నారు. ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. మారుమూల ప్రాంతమైన బయ్యారంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఇందుకు బాధ్యత తీసుకున్న మౌరీటెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, డీఈఓ నాగలక్ష్మి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు నిర్మల్ జాందే, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వభారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 14 మ్యాచ్లు.. జాతీయస్థాయి పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొనగా, లీగ్ దశలో ఎనిమిది గ్రూపులుగా విభజించారు. తొలి రోజు 14 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మధ్యప్రదేశ్ – చండీఘర్ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్ జట్టు, ఆంధ్రప్రదేశ్–జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఏపీ జట్టు, పాండిచ్చేరి – పశ్చిమబెంగాల్ జట్లు పోటీ పడగా పాండిచ్చేరి, తమిళనాడు – బిహార్ జట్లు తలపడగా తమిళనాడు, కర్ణాటక – గుజరాత్ జట్ల మధ్య జరిగిన పోటీలో కర్ణాటక, మహారాష్ట్ర – కేరళ జట్లు పోటీపడగా మహారాష్ట్ర, రాజస్థాన్ – ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్, హరియాణా – అసోం జట్లు పోటీ పడగా హరియాణా, ఒడిశా – పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్, త్రిపుర – మణిపూర్ జట్లు తలపడగా మణిపూర్ జట్టు గెలుపొందాయి. వీటితో పాటు సీఐఎస్సీఈ – సీబీఎస్ఈ జట్లు పోటీ పడగా సీబీఎస్ఈ, ఢిల్లీ – జమ్మూ కశ్మీర్ జట్లు పోటీ పడగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ – సీబీఎస్ఈ వెల్ఫేర్ జట్లు పోటీ పడగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ – ఛత్తీస్గఢ్ జట్లు తలపడగా ఛత్తీస్గఢ్ జట్లు విజయం సాధించాయి. -
సమన్వయంతో జాతర విధులు
ఆర్టీసీ అధికారుల మేడారం రూట్ సర్వే, సమీక్ష ఖమ్మంమయూరిసెంటర్/ఇల్లెందు: మేడారం జాతరకు వెళ్లివచ్చే ప్రయాణికులు సాఫీగా రాకపోకలు సాగించేలా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ సూచించారు. రీజియన్లోని డిపో మేనేజర్లు, అధికారులతో కలిసి ఖమ్మం నుంచి ఇల్లెందు మీదుగా మేడారం వరకు బుధవారం రూట్ సర్వే నిర్వహించారు. అలాగే, మేడారంలో ఆర్టీసీ పాయింట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే నిర్వహించిన సమీక్షలో, అనంతరం గత జాతరల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల సూచనలు స్వీకరించాక ఆర్ఎం మాట్లాడారు. రద్దీకి అనుగుణంగా రీజియన్లోని నిర్దేశించిన పాయింట్ల నుండి బస్సులు నడిపిస్తామని తెలిపారు. భక్తులతో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. డిప్యూటీ ఆర్ఎం వి.మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ సంపత్, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి కోటాజి, డిపో మేనేజర్లు శివప్రసాద్, రామయ్య, రాజ్యలక్ష్మీ, లక్ష్మీనారాయణ, జంగయ్య, శ్యాంసుందర్, సునీత తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇల్లెందు నుంచి గుండాల, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారానికి 129 కి.మీ. కాగా, ఇతర మార్గాల్లో ఈ దూరం పెరగనుంది. దీంతో ఇల్లెందు పాయింట్ నుంచే కాక ఖమ్మం నుంచి మేడారానికి ఇదే మార్గంలో బస్సులు నడిపించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. రహదారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు లఘు చిత్రాలను రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన ర్యాలీలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపొద్దనే అంశాలపై ప్రచారం చేపట్టాలన్నారు. రహదారులపై గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిసరాలు, లక్ష్మీదేవిపల్లి మోర్ సూపర్ మార్కెట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగూడెంలో ఫుట్పాత్ల వెంట ఉండే చిరు వ్యాపారులను అనువైన ఇతర ప్రాంతాలకు తరలించేలా స్థలాన్ని గుర్తించాలని అన్నారు. -
నవ్విపోదురుగాక !
‘రోడ్డు’ పై మాట నిలుపుకోని టీజీఎండీసీ.. ● ఇసుక లారీల కోసమే అటవీ శాఖ ప్రత్యేక రోడ్డు ● ఈ వ్యవహారంపై పెదవి విప్పని ఫారెస్టు అధికారులు ● అనుమతి ఎవరిచ్చారనేది అంతుచిక్కని ప్రశ్నసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిర్మాణమే జరగని సీతమ్మ సాగర్ బరాజ్ ఎగువ భాగంలో పూడికతీత పేరుతో 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీసేందుకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు జారీ చేసింది. ఇది ఒక వింతైతే.. ఇప్పుడు మరో విచిత్ర పనిని జిల్లా అటవీ శాఖ – మణుగూరు డివిజన్ చేపట్టింది. ఈ పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు కాశీ మజిలీ కథలను మించిన సరికొత్త్త కథ తెరపైకి తెచ్చింది. ఇసుక లారీలతో వేగలేక గోదావరి ఇసుకను తరలించేందుకు చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం మండలాల పరిధిలో 20 రీచ్లను గుర్తించి, అమ్మకాలు ప్రారంభించారు. అయితే పరిమితికి మించిన లోడుతో ఇసుక లారీలు తిరగడం వల్ల నేషనల్ హైవే రోడ్లే ఛిద్రం అవుతున్నాయి. ఇక ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇసుక లారీల దెబ్బకు వాటి రూపురేఖలు మారిపోయి మట్టి రోడ్లు, గుంతలతో నిండిపోయాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణించే గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక లారీల ప్రభావంతో చివరకు పిల్లలు స్కూలుకు కూడా వెళ్లే పరిస్థితి లేకపోగా.. మణుగూరు మండలం కమలాపురం, కట్టుగూడెం గ్రామ ప్రజలు గతేడాది అక్టోబర్లో లారీలను అడ్డుకున్నారు. దీంతో టీజీఎండీసీ జిల్లా ప్రాజెక్టు అధికారి స్థానికులతో సమావేశమయ్యారు. కొత్త రోడ్డు నిర్మించిన తర్వాతే ఇసుక లారీలు నడిపిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా ఇసుక రవాణా ఆపేశారు. నమ్మించి నట్టేట ముంచే ప్రయత్నం.. కొత్త రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చిన టీజీఎండీసీ అధికారి శంకర్నాయక్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ, చిన్నరావిగూడెం – కమలాపురం – కట్టుమల్లారం మీదుగా మణుగూరు వరకు ఉన్న పంచాయతీరాజ్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా అటవీ మార్గంలో కొత్త రోడ్డు నిర్మాణం జరిగింది. మణుగూరు రేంజ్ రథంగుట్ట బీట్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఈ మేరకు గత డిసెంబర్లో ఆగమేఘాల మీద వేలాది చెట్లను నరికేసి కమలాపురం నుంచి గుట్టమల్లారం వరకు కొత్త రోడ్డు నిర్మించారు. వారం రోజుల పాటు ఈ మార్గం గుండా ఇసుక లారీలు రాకపోకలు సాగించాయి. ఈ లారీల నుంచి అటవీ శాఖ టోలు కూడా వసూలు చేసింది. ఇదే సమయంలో ఇసుక రీచ్ల దగ్గర రైజింగ్ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్న కొందరు.. ‘మీ ఊరి మీదుగా మా ఇసుక లారీలను పోనివ్వకుంటే, మాకు మరో దారి దొరకదు అనుకున్నారా? మేం తలచుకుంటే జరగనిది అంటూ ఏమీ లేదు? మాతో పెట్టుకోవద్దు’ అంటూ కమలాపురం, కట్టుమల్లారం గ్రామస్తులను అవమానించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రశ్నల పరంపర.. పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో పంటలను బలవంతంగా నాశనం చేయడం. ఏజెన్సీలో అంబులెన్స్ పోయేందుకు వీలుగా రోడ్డు నిర్మిస్తామంటే ఒప్పుకోని అటవీ శాఖ, గట్టుమల్లారం నుంచి కమలాపురం వరకు 50 అడుగులతో 6 కి.మీ. రోడ్డును అంత వేగంగా ఎందుకు నిర్మించిందనే అనుమానాలు వచ్చాయి. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ఎందుకు చేశారు ? ఎవరు అనుమతి ఇచ్చారు ? రోడ్డు నిర్మాణానికి బడ్జెట్ ఎక్కడిది? పనులు ఏ పద్ధతిన చేపట్టారు? ఇలా అనేక ప్రశ్నలు అటవీ అధికారులకు ఎదురయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ‘పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు’ అనే ఒకే ఒక్క కారణంతో ఇసుక వ్యాపారుల మెప్పు కోసం అటవీ అధికారులు వేలాది చెట్లను నరికి నిర్మించిన రోడ్డు చివరకు ఆ శాఖ మెడకే చుట్టుకుంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కొత్తగా నిర్మించిన రహదారికి అటు, ఇటు చివరన గేట్లు ఏర్పాటు చేసింది. ఇసుక లారీల రాకపోకలను బంద్ చేయించింది. ఈ కవరింగ్ చాలదన్నట్టుగా ఆ గేట్ల మీద ‘స్వప్న జలపాతం, జాబిల్లి జలపాతాలకు వెళ్లు రోడ్లు’ అని రాయించి కొత్త కలరింగ్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ రోడ్డు పరిశీలించిన ఎవరికై నా ఇది జలపాతాల కోసం వేసిన రోడ్డు కాదు.. కేవలం ఇసుక లారీల కోసమే వేసిన రోడ్డేనని అర్థమవుతుంది. ఇదొక్కటే కాదు ఇతర ఇసుక రీచ్ల కోసం రాజుపేట సమీప అడవిలో నుంచి కూడా ఒక రోడ్డు ఇటీవల పుట్టుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రోడ్డుకు జలపాతం తరహాలో ఎలాంటి కలరింగ్, కవరింగ్లు అటవీ శాఖ నుంచి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. -
ప్రజా ఉద్యమాలే సీపీఐకి బలం
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సుజాతనగర్ : ప్రజా ఉద్యమాలే సీపీఐకి బలమని, ఖమ్మంలో జరిగే పార్టీ శత వసంత ముగింపు సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సుజాతనగర్లో బుధవారం నిర్వహించిన ప్రచారజాతా ముగింపు సభలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించిన ఈ శతాబ్ద కాలం అనేక ఉద్యమాలు, త్యాగాలతో సాగిందని, రాబోయే వందేళ్లలో కూడా ఇదే స్ఫూర్తితో ముందడుగు వేస్తామని అన్నారు. స్వాతంత్య్రానికి ముందే ఆవిర్భవించిన సీపీఐ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడిందని, ఈ క్రమంలో ఎందరో యువ కిశోరాలు ప్రాణత్యాగ్యం చేశారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖమ్మంలో జరిగే సభకు సీఎం రేవంత్రెడ్డితో పాటు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలు, మేధావులు, కవులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, నాయకులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, శ్రీనివాస్, ఎల్లయ్య, భూక్యా దస్రు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, ఉప్పశెట్టి రాహుల్, పూర్ణచందర్రావు, వీరస్వామి, రాంబాబు పాల్గొన్నారు. -
డీలర్ల మాయాజాలం
● పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ● రెండు చౌక దుకాణాలు సీజ్ ● ఇల్లెందులో విజిలెన్స్ దాడులు ఇల్లెందు: ప్రభుత్వం పేదలకు రేషన్ పంపిణీ చేస్తుండగా, దాన్ని సక్రమంగా చేరవేయాల్సిన డీలర్లు మాయాజాలం సృష్టిస్తున్నారు. తాజాగా ఇల్లెందులో ‘స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్’ విభాగం సోదాలు చేసింది. ఈ సోదాల్లో రెండు షాపుల్లో 156 క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు సిక్స్–ఏ కేసు నమోదు చేసి, ఆ రెండు షాపులను సీజ్ చేశారు. పట్టణంలోని ఇల్లెందులపాడు రేషన్షాపు నం. 3020045లో 68 క్వింటాళ్లు, నం.3020016 షాపులో 88 క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నట్లు తనిఖీలో వెల్లడైంది. దీందో ఈ రెండు షాపులను సీజ్ చేసి ఒక షాపును కటకం దయాకర్కు, మరో షాపును జీసీసీ సేల్స్మెన్ యాకయ్యకు అప్పగించారు. వీటితో పాటు నంబర్ –2 బస్తీలో ఒక రేషన్ షాపు, ఆర్అండ్ఆర్ కాలనీలో రెండు షాపులను తనిఖీ చేశా రు. స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ అంజయ్య, రిటైర్డ్ తహసీల్దార్ కమాల్పాషా, ఇల్లెందు సివిల్ సప్లై విభాగం డీటీ ఎస్. రాంబాబులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఈ నెల రేషన్ పంపిణీ అయిన వారం రోజుల్లోనే రెండు షాపుల్లో 156 క్వింటాళ్లు మాయమయ్యాయంటే డీలర్లు ఏ స్థాయిలో బియ్యం అక్రమ దందా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
ముగిసిన అగ్రి స్పోర్ట్స్ మీట్
అశ్వారావుపేటరూరల్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల నుంచి 400 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా వాలీబాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్, చెస్, పుట్బాల్, ఖోఖో, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం, లాంగ్ జంప్తోపాటు మరికొన్ని పోటీలు నిర్వహించారు. కాగా బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్గా రాజేంద్రనగర్ జట్టు, బాలికల విభాగంలో అశ్వారావుపేట జట్టు నిలిచాయి. విజేతలు వీరే.. బాలుర విభాగం వాలీబాల్ పోటీల్లో రాజేంద్రనగర్పై జగిత్యాల, బాస్కెల్ బాల్లో రాజేంద్రనగర్పై పాలెం, షటిల్ బ్యాడ్మింటన్లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, టేబుల్ టెన్నిస్లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, చెస్ పోటీల్లో రాజేంద్రనగర్పై వరంగల్, క్యారమ్స్లో వరంగల్పై రాజేంద్రనగర్, క్రికెట్ పోటీల్లో జగిత్యాలపై రాజేంద్రనగర్, పుట్బాల్లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, ఖోఖో పోటీల్లో పాలెంపై సిరిసిల్ల, టగ్ ఆఫ్ వార్లో సంగారెడ్డిపై సిరిసిల్ల జట్లు గెలుపొందాయి. అలాగే పరుగు పందెం(100 మీటర్లు)లో అశ్వారావుపేట, సంగారెడ్డి, జగిత్యాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో .. వాలీబాల్లో రాజేంద్రనగర్పై సంగారెడ్డి, క్యారమ్స్లో సైఫాబాద్పై అశ్వారావుపేట, టేబుల్ టెన్నిస్లో రాజేంద్రనగర్పై అశ్వారావుపేట, టెన్నికాయిట్లో సైఫాబాద్పై అశ్వారావుపేట, షటిల్ బ్యాడ్మింటన్లో రాజేంద్రగనర్పై సిరిసిల్ల, చెస్లో వరంగల్పై జగిత్యాల, బాస్కెట్ బాల్లో వరంగల్పై అశ్వారావుపేట, ఖోఖోలో జాయింట్ విన్నర్గా అశ్వారావుపేట–సిరిసిల్ల విజయం సాధించాయి. టగ్ ఆఫ్ వార్లో ఆదిలాబాద్పై వరంగల్, పరుగు పందెం(100 మీటర్లు)లో ప్రథమ స్థానంలో రాజేంద్రనగర్, ద్వితీయ స్థానంలో జగిత్యాల, తృతీయ స్థానంలో అశ్వారావుపేట, అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో ఎం రచన(అశ్వారావుపేట) విజేతగా నిలిచారు. కాగా, విజేతలకు మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జయశంకర్ యూనివర్సిటీ డీఎస్ఏ చల్లా వేణుగోపాల్ రెడ్డి, అబ్జర్వర్ మధుసూదన్ రెడ్డి, కళాశాల డీన్ హేమంత్కుమార్, ప్రొఫెసర్లు రాంప్రసాద్ శిరీష నాగాంజలి తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి వచ్చేయండి!
● 1,368 బస్సు సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు ● ఖమ్మం రీజియన్లో ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ● ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు నిర్వహ ణ ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సిద్ధమైంది. పండుగకు సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల నుంచి 1,368బస్సు సర్వీసుల నిర్వహణకు సన్నాహాలు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పండుగకు ముందుగానే ప్రత్యేక సర్వీసులు మొదలుపెట్టాలని నిర్ణయించగా, ఈ బస్సులు 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే, అదనపు సర్వీసుల్లో సాధారణ చార్జీల కన్నా అదనంగా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. డిమాండ్ ఆధారంగా రిజర్వేషన్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయితే, 11, 17వ తేదీల్లో మహాలక్ష్మి సర్వీసులు(పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్) బస్సుల్లో కాకుండా ఇతర సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా.. విద్యా, ఉద్యోగ, వృత్తి వ్యాపార నిమిత్తం హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో ఉంటున్న వారు సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విద్యాసంస్థలకు ఈనెల 10నుంచి సెలవులు మొదలుకానుండగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణ ంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల కోసం ఈనెల 9 నుండి 15వ తేదీ వరకు 799 సర్వీసులు నడిపిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్కు 569 బస్సు సర్వీసులు ఉంటాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనంగా బస్సులు నడిపేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు.తేదీ రిజర్వేషన్ నాన్ మొత్తం రిజర్వేషన్ 9 68 80 148 10 68 80 148 11 68 88 156 12 68 88 156 13 68 88 156 14 15 20 35 15 10 20 30 తిరుగు ప్రయాణంలో ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్కు ఈనెల 16న రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ కలిపి 90 సర్వీసులు నడిపిస్తారు. అలాగే, 17వ తేదీన 138, 18వ తేదీన 173, 19వ తేదీ 128, 20వ తేదీన 40 సర్వీసులు నడిపించేలా ప్రణాళిక రూపొందించారు.సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చే వారి కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తాం. ఏపీకి వెళ్లే ప్రయాణికులు కూడా ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండడంతో ఈ ఏడాది సర్వీసుల సంఖ్య పెంచాం. ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఎంచుకునేలా ప్రచారం చేస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్, ఆర్టీసీసంక్రాంతి పండుగకు ఆర్టీసీ నడిపించే అదనపు బస్సులకు సంస్థ రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు 365 రిజర్వేషన్ సర్వీసులను, తిరుగు ప్రయాణంలో 236 రిజర్వేషన్ సర్వీసులు నడిపిస్తారు. -
నవమి నాటికి గిరిజన మార్ట్
భద్రాచలం: ప్రకృతిలో గిరిజనులకు లభించే వస్తువులన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఒక్క చోటనే లభించేలా శ్రీరామనవమి నాటికి గిరిజన మార్ట్లు అందుబాటులోకి తెస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. తన చాంబర్లో మంగళవారం ఆయన డీఆర్డీఏ, ఐటీడీఏ, ఐటీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖమ్మంలో ఎస్హెచ్జీ మహిళలు ఏర్పాటుచేసిన షాపింగ్ మాల్పై వివరాలు ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. కొనుగోలుదారులను ఆకట్టుకునేలా భద్రాచలంలోని జీసీసీ గిరిజన బజార్ను సరికొత్తగా డిజైన్ చేయాలని ఈఈ మధుకర్ను ఆదేశించారు. జిల్లాలోని రైతులు పండించే పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయాధికారి ఉదయ్కుమార్కు సూచించారు. గిరి మాల్లో వస్తువులు అమర్చేందుకు అవసరమైన ఫర్నిచర్కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శ్రీరామనవమి నాటికి గిరి మార్ట్ ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలంలోని గిరి బజార్ను సందర్శించి గిరి మార్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలపై చర్చించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, జీసీసీ డీఎం సమ్మయ్య, ఐటీసీ డీఎం చంగల్ రావు, డీఈ హరీష్, టీఏ శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సాక్షి కథనానికి పీఓ రూపం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ను స్ఫూర్తిగా తీసుకుని గిరిజనులకు లభించే వస్తువులన్నింటినీ ఒకేచోట విక్రయించేలా గిరిజన మార్ట్ను భద్రాచలంలో ఏర్పాటు చేయాలని సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. తద్వారా భద్రాచలం వచ్చే పర్యాటకులను, భక్తులకు అటవీ ఉత్పత్తులను పరిచయం చేయడంతో పాటుగా గిరిజనులకు ఉపాధి లభిస్తుందని పేర్కొంది. గిరిజనుల ఆహార ఉత్పత్తులు, వెదురు వస్తువులు అన్నింటినీ ఒకేచోట చేరిస్తే అంతర్జాతీయ స్థాయిలో గిరిజన ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని పేర్కొనడంతో స్పందించిన పీఓ రాహుల్ గిరిజన మార్ట్ ఏర్పాటు పనులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’ కథనానికి పీఓ స్పందన -
లక్ష్య సాధనకు కృషి చేయాలి
జూలూరుపాడు/చండ్రుగొండ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం ఆయన జూలూరుపాడు, చుంచుపల్లి, పెనగడప, చండ్రుగొండ పీహెచ్సీలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల పెంచాలని, ప్రతీ రెండో గురువారం పీహెచ్సీ పరిసరాలను శుభ్రం చేయాలని చెప్పారు. ఆరోగ్య ఉప కేంద్రాలపై వైద్యులు దృష్టి సారించాలని అన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గ్రామాల్లో పర్యటించాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై పీహెచ్సీలకు సమాచారం అందజేయాలన్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పీహెచ్సీలు, విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించినా, సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయొద్దని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో వైద్యాధికారి డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, వైద్యులు వెంకటప్రకాష్, తనుజా, తేజస్విని, నేహా ఆమరిన్, వెంకటప్రకాష్, ఆయుర్వేద డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ -
రమణీయంగా రామయ్య రాపత్తు సేవ
● విశ్రాంతి మండపంలో ప్రత్యేక పూజలు ● వైభవంగా దొంగల దోపు ఉత్సవంభద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామయ్యకు మంగళవారం విశ్రాంతి మండపంలో రాపత్తు సేవను రమణీయంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారిని కల్కి అవతారంలో అలంకరించారు. కోలాటాలు, వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ తీసుకొచ్చి విశ్రాంతి మండపంలో కొలువుదీర్చారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. అనంతరం తాతగుడి సెంటర్లో దొంగల దోపు వేడుకను నేత్రపర్వంగా జరిపించారు. కమనీయంగా నిత్య కల్యాణం దేవస్థానం ప్రాంగణంలో రామయ్య నిత్యకల్యాణ వేడుకను మంగళవారం కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. -
14 నుంచి మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొల్లాపురంలో సంక్రాంతి సందర్భంగా ఈనెల 14, 15వ తేదీల్లో యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యాన మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహించనున్నారు. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల జట్లు పాల్గొనే అవకాశం ఉండగా, మొదటి మూడు స్థానాల్లో నిలిచే జట్లకు రూ.20వేలు, రూ.16వేలు, రూ.12వేలు నగదు బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు తమ జట్ల వివరాలను ఈనెల 13వ తేదీలోగా 77023 47573, 83416 64923, 96760 52502 నంబర్ల ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. పకడ్బందీగా ప్రీ ప్రైమరీ తరగతులుపినపాక: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆటపాటల ద్వారా బోధన కొనసాగించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగ రాజశేఖర్ సూచించారు. మండలంలోని సింగిరెడ్డిపల్లి యూపీ స్కూల్లో బోధనను మంగళవారం టీఎస్ఎస్ఏ జిల్లా సెక్టోరియల్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా నాగ రాజశేఖర్ మాట్లాడుతూ బోధనపై పలు సూచనలు చేశారు. అనంతరం చిన్నారులకు సర్పంచ్ ముక్తేశ్వరరావు యూనిఫామ్ అందజేశారు. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, సైదులు, హెచ్ఎం పవన్ పాల్గొన్నారు. సింగరేణి ప్రమాదంలోకి వెళుతోందిఅసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని కొత్తగూడెంఅర్బన్: తెలంగాణలో సింగరేణి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సింగరేణి పరిస్థితిపై అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన మాట్లాడారు. బొగ్గుగనుల్లో కార్మికులు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పని చేస్తారని, అలాంటి వారికి మెడికల్ ఇన్వాలిడేషన్ చేయకుండా వారసులకు ఉద్యోగం ఇచ్చే ప్రక్రియను నిలిపివేయడంతో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్లు కూడా చాలా తక్కువగా వస్తున్నాయని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మైన్స్ ఏరియాల్లో ఖాళీ స్థలాలుంటే ఇళ్లు కట్టుకోవడానికి వారికి అవకాశం కల్పించడం లేదని, క్వార్టర్లలో ఉండకుండా బయటకు పంపుతున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. -
ఇక మెరుగైన వైద్యం !
రెండు పీహెచ్సీల అప్గ్రేడ్కు పరిశీలన ● అన్నపురెడ్డిపల్లిలో సీహెచ్సీ ఏర్పాటుకు ప్రతిపాదనలు ● ప్రభుత్వానికి నివేదిక అందజేత.. ఇక మంజూరే తరువాయి ఇల్లెందు: జిల్లాలో రెండు పీహెచ్సీలను అప్గ్రేడ్ చేయడంతో పాటు అన్నపురెడ్డిపల్లిలో నూతన సీహెచ్సీ, డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ముగ్గురు అధికారులతో కూడిన జిల్లా స్థాయి బృందం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. గత డిసెంబర్ 1వ తేదీన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్(టీవీవీపీ) నుంచి కలెక్టర్కు అందిన లేఖ మేరకు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్తో కూడిన ప్రతినిధి బృందం గుండాల, కరకగూడెం, అశ్వాపురం పీహెచ్సీలను పరిశీలించింది. ఆయా పీహెచ్సీల్లో గలసౌకర్యాలు, సీహెచ్సీ ఏర్పాటుకు గల అవకాశాలను వివరిస్తూ ముగ్గురు సభ్యులు అదే నెల 16న వైద్యవిధాన పరిషత్ కమిషనర్కు నివేదిక అందజేశారు. కరకగూడెం పీహెచ్సీకి 30 కిలోమీటర్ల దూరంలో, గుండాలకు 60 కి.మీ.దూరంలో డయాలసిస్ సెంటర్లు ఉన్నా యి. అన్నపురెడ్డిపల్లికి అశ్వారావుపేట 60కి.మీ., సత్తుపల్లి 30 కి.మీ., పాల్వంచ 35 కి.మీ., కొత్తగూడెం 40 కి.మీ. దూరంలో ఉన్నాయి. అశ్వాపురం పీహెచ్సీ మణుగూరు 100 పడకల ఆస్పత్రికి సమీపంలో ఉంది. దీంతో గుండాల, కరకగూడెంతో పాటు అశ్వాపురానికి బదులు అన్నపురెడ్డిపల్లిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని నివేదికలో కోరారు. అంతేకాక కరకగూడెం, గుండాల, అన్నపురెడ్డిపల్లి పీహెచ్సీలను సీహెచ్సీలుగా అప్ గ్రేడ్ చేయాలని, అందుకు అవసరమైన సదుపాయాలు కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. గుండాల, కరకగూడెం పీహెచ్సీలను సీహెచ్సీలు గా అప్గ్రేడ్ చేయడంతో పాటు అన్నపురెడ్డిపల్లిలో సీహెచ్సీ ఏర్పాటు చేస్తే ఏజెన్సీ వాసుల వైద్య కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల లేఖలు, అధికారుల నివేదికలను ప్రభుత్వంపరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందిస్తే మెరుగైన సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. -
రేషన్ షాపుల్లో టాస్క్ఫోర్స్ సోదాలు
ఇల్లెందు: పట్టణంలోని పలు రేషన్ షాపులపై స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ టాస్క్ఫోర్స్ విభాగం అధి కారులు సోదాలుచేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు టీం అధికారి అంజయ్య ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. మొ ద ట నంబర్–2 బస్తీలోని ఓ మాజీ కౌన్సిలర్కు చెందిన రేషన్ షాపును తనిఖీ చేశారు. ఆ పక్కనే గల మరో షాపులోకి వెళ్లగా అప్పటికే సమాచారం అందుకున్న ఆ షాప్ యజమాని అదృశ్యం అయ్యారు. ఆ తర్వాత కొత్త కాలనీలోని 41వ నెంబర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సోదాలతో డీలర్లలో ఆందోళన మొదలైంది. నెల రోజుల క్రితం ఇక్కడి సివిల్ డీటీని టేకులపల్లిలో ఓ డీలర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. దాడి ఘటనలో ఇద్దరిపై కేసుఇల్లెందురూరల్: మండలంలోని భద్రుతండా గ్రామానికి చెందిన వాంకుడోత్ శ్రీను, అతని కుమారుడు వంశీ తనపై దాడి చేశారంటూ అదే గ్రామానికి చెందిన వాంకుడోత్ భీమా మంగళవారం ఫిర్యాదు చేశాడని ఎస్ఐ నాగుల్మీరా చెప్పారు. ఈ మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. -
సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత
సూపర్బజార్(కొత్తగూడెం): సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందన్ అన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతా అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు నుంచి పోస్టాఫీస్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ఇది కేవలం జరిమానాల కోసం కాదని, ప్రాణ రక్షణ కోసమని అన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, నిరంజన్ రావు, పావని, పీపీ రాజారావు, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్, భిక్షమయ్య, జానకీరామ్, రాజమణి, షాహిన్, వీరభద్రం పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ -
పంట వ్యర్థాలతో బయోచార్
కలెక్టర్ పాటిల్, బయోచార్ నిపుణులు పరశురాం కై లాస్ వెల్లడి సూపర్బజార్(కొత్తగూడెం): ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులతోపాటు బయోచార్ వినియోగంపై గరిమెళ్లపాడు నర్సరీలో మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురాం కై లాస్ అఖరే ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో బయోచార్ తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఇనుముతో తయారుచేసిన పరికరంలో పంట అవశేషాలను నిర్దేశిత ఉష్ణోగ్రతతో కాల్చి నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి చేసే విధానాన్ని వివరించారు. ఈ బయోచార్ను గోమూత్రం, ఆవుపేడ మిశ్రమంలో 15 రోజుల పాటు ఉంచి ఎరువుగా వినియోగిస్తే నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూమి సారవంతంగా మారుతుందని, తేమ నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని వివరించారు. జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు సాగవుతున్నాయని, పంట కోత తర్వాత వ్యర్థాలను కాల్చకుండా బయోచార్ తయారీకి ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. బయోచార్ వినియోగం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా డ్రెయినేజీలు, పౌల్ట్రీ షెడ్లు, పశువుల శాలలు, చెత్త నిల్వ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ఉపయోగించవచ్చని తెలిపారు. తద్వారా దుర్వాసన తగ్గి గాలి పరిశుభ్రం అవుతుందని, వాతావరణం మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, గ్రామ సర్పంచ్ వాడే రాములు, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఎన్ఎస్ఎస్ అధికారులు వేముల కామేశ్వరరావు, శ్రీదేవి, ఎన్సీసీ ఇన్చార్జ్ ధర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాల్లో అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా గడువులోగా అందజేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయా పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 అక్టోబర్ 1 నాటికి ఓటరుగా నమోదు అయిన వారిని ఎపిక్ కార్డులోని చిరునామా ఆధారంగా ఆయా డివిజన్ల ఓటరు జాబితాలో చేర్చామని చెప్పారు. అభ్యంతరాలను ఈనెల 9వ తేదీ వరకు స్వీకరించి, 10న తుది జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. సమావేశంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్లు చింత శ్రీకాంత్, నాగరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు తులసీరామ్, నోముల రమేష్, శ్రీనివాస్, సందీప్, లక్ష్మణ్ అగర్వాల్, కళ్యాణ లక్ష్మీపతి, శంకరయ్య, రమేష్ పాల్గొన్నారు. -
యువతి ఆత్మహత్య ఘటనపై రాస్తారోకో
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన యువతి హైదరాబాద్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై యువతి కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారంమణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అశ్వా పురానికి చెందిన కనుకు సరస్వతి(21) హైదరాబాద్లో హనుమాన్నగర్ సూపర్ స్టూడెంట్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఈనెల 4న సాయంత్రం హాస్టల్ గదిలో ఉరి వేసుకోగా ఈ ఘటనపై మీర్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, యువతి మృతికి అశ్వాపురానికి చెందిన పాలడుగు నందకిషోర్ కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నాచేశారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలం టూ రహదారిపై మృతురాలి బంధువులు రాస్తారోకో చేపట్టారు. కొంతకాలంగా నందకిషోర్తో యువతి ప్రేమలో ఉందని, తమ కుమార్తె మృతికి అతడే కారణమ ని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్, సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
సర్వే పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ శివారులో ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణ స్థల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ భూమి గతంలో సర్వే నంబర్ 618 పేరుతో రైతులకు జారీచేసిన పట్టాదారు పాస్పుస్తకాల్లో నమోదై ఉంది. అయితే ఇది 549 సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని, అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు ఏడాది క్రితమే తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు ఫ్లెక్సీఏర్పాటు చేశారు. దీంతో ఒకే భూమిలో వేర్వేరు సర్వే నంబర్లుగా పేర్కొనడం సమస్యగా మారగా రైతులు హై కోర్టును ఆశ్రయించారు. అయితే గత శనివారం అధికారులు ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనం నిర్మాణ పనులు ప్రారంభించగా, రైతులు అడ్డుకున్నారు. తాజాగా మంగళవారం తిరిగి సర్వే చేపట్టడంతో కోర్టు పరిధి లో ఉన్న భూమిలో ఎలా సర్వే చేస్తారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కాగా, కలెక్టర్ ఆదేశాలతోనే పనులు చేపడుతున్నామని, ఏమైనా అనుమానం ఉంటే కలెక్టర్ను కలిసి వివరించాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎటూతెగని ఇంటిగ్రేటెడ్ గురుకుల స్థల వివాదం -
వేల సంఖ్యలో నేలకొరిగే!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు – పాఖాల ఆర్అండ్బీ రోడ్డులో ఇల్లెందులపాడు చెరువు నుంచి మొండితోగు మీదుగా ధర్మాపురం వరకు రోడ్డు నిర్మాణానికి 2014 – 18 ప్రభుత్వ హయాంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇల్లెందుకు ఒక బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేది. బోడు నుంచి ఇల్లెందుకు ప్రస్తుతం 35 కి.మీ దూరం ఉండగా అది 17 కి.మీ.కు తగ్గిపోయేది. గుండాల – ఇల్లెందు మధ్య దూరం కూడా తగ్గేది. కానీ అటవీ శాఖ కొర్రీలతో ఈ రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్లపల్లి – మామకన్ను గ్రామాలను కలుపుతూ కిన్నెరసానిపై వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరయ్యాయి. 2018 – 19 ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడ కూడా అటవీ శాఖ కొర్రీలతో వంతెన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. దీంతో వర్షాకాలంలో మామకన్ను గ్రామస్తులు జిల్లా కేంద్రానికి రావాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇక కిన్నెరసాని డ్యామ్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న కాటేజీలకు వెళ్లేందుకు అవసరమైన రోడ్డు నిర్మాణానికి సైతం అటవీ శాఖ ఏళ్ల తరబడి అనుమతులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దమ్మపేట – పాల్వంచ ఆర్అండ్బీ రోడ్డు నుంచి పీవీటీజీ కొండరెడ్లు ఉన్న పూసుకుంట గ్రామానికి రహదారి నిర్మాణానికీ ఆ శాఖ అధికారులు చాలా రోజులు అంగీకరించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకే అటవీ శాఖ అభ్యంతరాలు తెలిపిన జాబితా చాంతాడంత అవుతుంది. ప్రతిపాదనలతోనే పనులు.. పీవీ కాలనీ క్రాస్రోడ్డు నుంచి స్వప్న వాటర్ఫాల్ (కట్టుమల్లారం), జాబిల్లి వాటర్ ఫాల్ (కమలాపురం) వెళ్లేందుకు దారి పేరుతో రిజర్వ్ ఫారెస్టులో రెండు భారీ వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. సుమారు 60 ఫీట్లతో ఆరు కి.మీ.మేర రోడ్డు పనులు మొదలయ్యాయి. ఈ దారి కోసం వేల సంఖ్యలో చెట్లను నరికేశారు. భారీ యంత్రాలతో అటవీ ప్రాంతాన్ని చదును చేశారు. అయితే ఈ జలపాతాలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఏ సమావేశంలో తీసుకున్నారు.. ఇందుకు అంగీకారం తెలిపింది ఎవరు.. అనే అంశాలపై ఆ శాఖలో ఎవరికీ స్పష్టత లేదు. పై అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే అటవీ శాఖ, మణుగూరు డివిజన్ సిబ్బంది ఈ రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నారు. దీనిపై వివరణ కోసం మణుగూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉపేందర్కు ఫోన్ చేయగా స్పందిచలేదు. కార్యాలయానికి వెళితే అక్కడా లేరు. జిల్లా ఫారెస్టు అధికారి కిష్టాగౌడ్ను వివరణ కోరగా ‘జలపాతాలకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది’ అని తెలపడం గమనార్హం. పాతది ఉండగా కొత్తది ఎందుకు..? మణుగూరు నుంచి చిన్నరావిగూడెం గ్రామానికి వెళ్లేందుకు ఇప్పటికే పంచాయతీరాజ్ రోడ్డు అందుబాటులో ఉంది. ఇందులో కట్టుమల్లారం గ్రామం నుంచి కిలోమీటర్ దూరం నడిస్తే స్వప్న వాటర్ ఫాల్ వస్తుంది. రోడ్డు పక్కనే శంబాల, జాబిల్లి జలపాతాలు ఉన్నాయి. ఎకో టూరిజం అభివృద్ధి చేయడమే లక్ష్యమైతే కట్టుమల్లారం నుంచి 1.5 కి.మీ రోడ్డు నిర్మిస్తే సరిపోయేది. అందుకు విరుద్ధంగా పీఆర్ రోడ్డును పట్టించుకోకుండా అటవీ శాఖనే సొంతంగా.. అదీ పీఆర్ రోడ్డుకు సమాంతరంగా తన సొంత జాగాలో రోడ్డు నిర్మాణం చేపట్టింది. అందుకోసం వేలాదిగా చెట్లను కొట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరి మెప్పు కోసం అడవిని నరికి రోడ్డు వేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.చెట్ల నరికివేత ఎవరి మెప్పు కోసమో ? -
నేటి నుంచి కబడ్డీ కూత
పినపాక: జాతీయస్థాయి అండర్ – 17 బాలుర కబడ్డీ పోటీలకు ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్ధమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రీడా ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు, సుమారు 500 మంది వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సింగరేణి సహకారంతో క్రీడా ప్రాంగణం, పార్కింగ్ పరిసరాల్లో భారీ ఎల్ఈడీ లైట్లు అమర్చారు. పోటల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 33 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలిరాగా, మణుగూరు రైల్వే స్టేషన్లో వారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇసుక తిన్నెల్లో సాధన.. కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ముందుగానే చేరుకున్న తెలంగాణ రాష్ట్ర జట్టు మంగళవారం గోదావరి ఇసుక తిన్నెల్లో సాధన చేసింది. మరికొన్ని రాష్ట్రాల వారు వ్యాయామం, యోగా వంటివి చేశారు. క్రీడాకారులకు అధికారులతో పాటు మౌరీ టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల వారికి అనుగుణంగా అల్పాహారంలో బ్రెడ్, జామ్, గుడ్లు, సాంబార్, ఇడ్లీ, పూరి వంటి రుచికరమైన వంటలు అందించారు. మధ్యాహ్నం, రాత్రి రోటీలు, చపాతి, సబ్జి, దాల్ ఫ్రై, రైస్, కర్డ్ రైస్ వంటివి సమకూర్చారు. -
కార్పొరేషన్ ఎన్నికలు జరిగేనా?
● కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్పై కోర్టుల్లో కేసులు పెండింగ్ ● షెడ్యూల్డ్ ఏరియా కలిపారని, విలీనం సక్రమంగా లేదని పిల్ దాఖలు ● నేడు హైకోర్టులో విచారణకు రానున్న కేసు పాల్వంచ: వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గతేడాది మే నెలలో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పా టు చేస్తూ గెజిట్ విడుదల చేయగా, జనవరి 1న వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే కార్పొరేషన్ ఎన్నికలపై మీమాంస నెలకొంది. ఇప్పటికే కోర్టుల్లో మూడు కేసులు వేయడం, వాటిపై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఆశావాహుల్లో సైతం టెన్షన్ నెలకొంది. గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెంలో గ్రేడ్–2 ము న్సిపాలిటీ పాల్వంచను, సుజాతనగర్ మండలాన్ని కలుపుతూ కార్పొరేషన్గా మార్చారు. పాల్వంచ నుంచి సుజాతనగర్ వరకు 30 కిలోమీటర్ల మేర మధ్యలో రెండు మండలాలను వదిలేసి, అక్కడక్కడా కొన్ని ఏరియాలను కలుపుతూ ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో మరో కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసు విషయమై మంగళవారం చీఫ్ జస్టిస్ ముందు వాదోపవాదాలు జరగనున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాన్ని కలిపారంటూ.. పాల్వంచలో షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలు ఉన్నాయి. 1987 సంవత్సరంలో షెడ్యూల్డ్ ప్రాంతాలను కలిపి మున్సిపాలిటీ చేశారంటూ కరకవాగు గ్రామానికి చెందిన భట్టు కృష్ణ 2024లో హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆర్టికల్ 243జడ్(3) ప్రకారం పార్లమెంట్లో ఆమోదం తెలిపాక మున్సిపాలిటీలో కలపాల్సి ఉండగా, గవర్నర్ గెజిట్ ద్వారా కలిపారని, ఇది షెడ్యూల్–5కు విరుద్ధమని, గిరిజన హక్కులను కాలరాస్తున్నారని వాదిస్తున్నారు. పాల్వంచ నుంచి సుజాతనగర్ వరకు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలను మినహాయించి అక్కడక్కడా దూర ప్రాంతాలను కలుపుతూ కార్పొరేషన్ చేయ డం అసంబద్ధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నాయకులగూడెం, సుజాతనగర్, నర్సింహసాగర్ పంచాయతీలను ముందస్తుగా గ్రేడ్ల వారీగా కలపాల్సి ఉందని, కానీ నేరుగా కార్పొరేషన్లో కలిపారని, ఇది చట్టవిరుద్ధం అంటూ పాల్వంచకు చెందిన శివరాం ప్రసాద్, పోట్రు ప్రవీణ్కుమార్, అజ్మీర నరేష్నాయక్ సైతం కోర్టులను ఆశ్రయించారు. నేడు మరోసారి వాదనలు కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా లేదని, ఏడు పంచాయతీలను అప్గ్రేడ్ చేసిన విధానం లోపభూయిష్టంగా ఉండటంతోపాటు కోర్టు పరిధిలో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని గతేడాది ఆగస్టు 8న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగు వారాల గడువు తర్వాత వాదనలు జరిగాయి. మళ్లీ మంగళవారం విచారణ జరగనుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు కాకపోవడం గమనార్హం. దీంతో ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
మౌనమేల?
‘సీతారామ’పై ● ఆరంభంలో ప్రాజెక్ట్పై ముగ్గురు మంత్రుల ఫోకస్ ● పంపుహౌస్ల ప్రారంభం, అనుమతులపైనా దృష్టి ● ఆ తర్వాత ప్రాజెక్టు పనుల్లో కనిపించని పురోగతి ● అష్టకష్టాలు ఎదుర్కొంటున్న డిస్ట్రిబ్యూటరీ పనులు ● అసెంబ్లీలో చర్చకు సైతం రాని సీతారామ ప్రాజెక్ట్ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగునీటి ప్రాజెక్టులపై గరంగరంగా చర్చలు సాగిస్తున్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితి ఏంటనే అంశాలను ఇరు పక్షాలు వివరిస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన సాగునీటి ప్రాజెక్టులపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆ తర్వాత గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపైనా దృష్టి పెరిగింది. కానీ ఇరు పక్షాలు గొప్పగా ప్రకటించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై అసెంబ్లీలో కనీస పట్టింపు కరువైంది. పురోగతి కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబరులో అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంయుక్తంగా సీతారామ ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టారు. ఫలితంగా గతేడాది ఆగస్టు 15న మూడు పంప్హౌస్లతోపాటు రాజీవ్ కెనాల్ను సీఎం రేవంత్రెడ్డి జాతికి అంకితం చేశారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళిక (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, డీపీఆర్)కు అనుమతులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో నమోదైన కేసుపైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎట్టకేలకు డీపీఆర్కు కీలకమైన టెక్నికల్ అనుమతులు వచ్చాయి. ఎన్జీటీలో నమోదైన కేసు విషయంలో ఫైన్తో పరిష్కారం చూపింది. ఆ తర్వాత ఈ పేపర్ వర్క్స్లో వేగం తగ్గింది. ప్రస్తుతం వానలు, వరద తగ్గి గోదావరిలో నిర్మాణ పనులకు అనుకూలమైన సమయం వచ్చింది. కనీసం ఇప్పుడైనా బరాజ్ నిర్మాణ పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. తగ్గిన జోరు పంప్హౌస్లను ప్రారంభించే సమయంలోనే 2024 ఆగస్టులో జిల్లా పరిధిలో కొత్తగా 1,49,952 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను 1, 2, 7, 8 ప్యాకేజీల కింద విభజించారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించి యాతాలకుంట టన్నెల్ నిర్మాణం పూర్తయితే 7, 8 ప్యాకేజీల కింద నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో నీరు పారే అవకాశం ఉంది. ఇంకా ఈ టన్నెల్ పనులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పట్లో సత్తుపల్లి, అశ్వారావుపేటలకు గోదావరి నీరు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ప్యాకేజీలు 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ పనులు జరిగితే జిల్లాలో అరవై వేల ఎకరాల్లో గోదావరి నీరు పారే అవకాశం ఉంది. సీతారామ డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ 1, 2లకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనులకు 2024 ఆగస్టు చివర్లో ఆమోదం వస్తే అక్టోబర్లో టెండర్లు పిలిచారు. ఏడాది గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాలేదు. భూసేకరణ ప్రక్రి య కూడా పూర్తి కాలేదు. ఏడాదిన్నర గడిచినా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. సీతారామ పనుల్లో 2024 ఆగస్టు 15 వరకు కనిపించిన ఊపు ఆ తర్వాత కూడా కొనసాగి ఉంటే ప్యాకేజీ 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ కాలు వల పనులు తుది దశకు చేరుకునేవి. ఈ వేసవిలో పనులు పూర్తయితే రాబోయే ఖరీఫ్ నాటికి కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చేది. ప్రభుత్వం చెప్పినట్టు తొలి విడత అరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టుతో సీతారామ ఫలాలు అందేవి. కానీ డిస్ట్రిబ్యూటరీ పనులకు సంబంధించి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కనీసం చర్చకు కూడా నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు సీతారామ పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
రామదాసు మండపంలో రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో రాపత్తు సేవలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ నిర్మాణ కర్త భక్త రామదాసుకు గుర్తుగా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సేవ జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణలు, కోలాటాల నడుమ తహసీల్దార్ క్వార్టర్ వద్దనున్న రామదాసు మండపం వరకు తీసుకొచ్చారు. స్వామి వారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల దర్శనార్థం హారతి సమర్పించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బంది, అర్చకులు, వేదపండితులు , భక్తులు పాల్గొన్నారు. ముత్తంగి అలంకరణలో మూలమూర్తులు అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడు మ గర్భగుడినుంచి ఊరేగింపుగా తీసుకొవచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోకంగా జరిపారు. కాగా ఈఓ దామోదర్రావు ఆలయ ప్రాంగణంలో ఉన్న వస్త్రాల కౌంటర్, ప్రచారశాఖ కౌంటర్లను తని ఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, అధి క ధరలకు విక్రయాలను జరపొద్దని హెచ్చరించారు.రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పూజలు -
బ్యాంకుల్లో పటిష్ట భద్రత ఉండాలి
ఎస్పీ రోహిత్ రాజు సూపర్బజార్(కొత్తగూడెం): బ్యాంకులకు సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రోహిత్రాజు బ్యాంకర్లకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏటీఎం, బ్యాంకు చోరీ ల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకుల లోపల, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. సెక్యూరిటీ అలారం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామాజిక బాధ్యతతో సైబర్ నేరాలపై బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన నగదును త్వరితగతిన బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంపాల్వంచరూరల్/భద్రాచలంటౌన్: ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాల్లో 6 నుంచి 9 తరగతి వరకు అడ్మిషన్లు కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు పాల్వంచ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అన్వేష్, భద్రాచలం గిరిజన గురుకులం ప్రిన్సిపాల్ ఎస్.హేమలత సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు బదులుగా ఇతరుల ఫొటోలతో దరఖాస్తు చేస్తే 416 ఆఫ్ ఐపీసీ 1860 ప్రకారంక్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బయోచార్పై ఉచిత శిక్షణసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని రైతులకు ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణుడు పరశురాం కై లాస్ అఖరే ఆధ్వర్యంలో బయోచార్పై ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి గరిమెళ్లపాడు నర్సరీలో, బుధవారం ఉదయం 9.30 గంటలకు అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 94927 31222, 92814 79565 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
భధ్రాచలం: గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చర్ల మండలంలోని సున్నం గుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్నకు సామగ్రి అందజేశారు. ఆది వాసీ గిరిజన మహిళలకు రూ.లక్ష విలువైన ఇప్పపువ్వుతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకునే సామగ్రిని ఇచ్చారు. అనంతరం గిరిజన దర్బార్లో దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం నారాయణపేట గ్రామానికి చెందిన అన్నపూర్ణ భూ సమస్యల పరి ష్కారానికి, అశ్వాపురం మండలం కురువపూర్ గ్రామానికి చెందిన జోగయ్య సోలార్ విద్యుత్ కనెక్షన్కు, చండ్రుగొండ మండలం సుజాతనగర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాందాస్ ఉద్యోగం కోసం, ఇల్లెందు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మంగ్లీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కోసం దరఖాస్తులు అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్ రాజ్, సున్నం రాంబాబు, మధుకర్, వేణు, సైదులు, లక్ష్మీనారాయణ, ఉదయ్కుమార్, గన్యా, హరికృష్ణ, ఆదినారాయణ, హేమంత్ పాల్గొన్నారు. 8న రిజిస్ట్రేషన్ మేళా భద్రాచలం, పరిసర గ్రామాల్లోని ఆహార పదార్థాల వ్యాపారులకు ఈ నెల 8న రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ ప్రకటనలో తెలిపారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, మాంసం – చేపల విక్రయ కేంద్రాలు, పాల ఉత్పత్తుల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రయదారులు, కేటరింగ్ యూనిట్లు తదితర రకాల ఆహార వ్యాపారులు హాజరై లైసెన్స్ పొందాలని వివరించారు. వ్యాపారులు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్టు సైజ్ ఫొటో, దుకాణం ఫొటోలతో రావాలని సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
భద్రాద్రి కొత్తగూడెం
జాతీయ కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.7వాతావరణ ం జిల్లాలో మంగళవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది. రాత్రి వేళ చలి ప్రభావం ఉంటుంది. మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026మామిడి ‘పండు’తుందా..? నాలుగేళ్లుగా చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతులు నష్టపోతున్నారు. -
రాజు వెళ్లాకే మహాజాతర..
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు గుండాల మండలం యాపలగడ్డలోనే అంకురార్పణ జరుగుతుంది. సమ్మక్క భర్త, సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు స్వగ్రామం యాపలగడ్డ. ఇక్కడి నుంచి పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటేనే జాతరకు బీజం పడుతుంది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు అరెం వంశానికి చెందిన పగిడిద్దరాజును గ్రామానికి చెందిన ఆ వంశీయులు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. – గుండాలఅరెం వంశీయుడిగా ప్రసిద్ధి పగిడిద్దరాజు యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడని, మూడు తరాలుగా కొలుస్తున్నామని ఆ వంశీయులు చెబుతున్నారు. నాటి ఆభరణాలు, ఈటెలు, బల్లెం తదితర వస్తువులు ఇప్పటికీ గుడిలో భద్రపరిచారు. గ్రామ సమీపంలోని తొట్టివాగు వద్ద పగిడిద్దరాజు, సమ్మక్కల గద్దెలు నిర్మించి ఏటా మార్చి మొదటివారంలో పగిడిద్దరాజు జాతర నిర్వహిస్తున్నారు. రెండేళ్లకోసారి ఇక్కడి నుంచే మేడారం జాతరకు పడగల(జెండాల)ను రూపంలో పగిడిద్దరాజును కాలినడకన తీసుకెళ్తారు. రాజు వెళ్లాకే మేడారంలో జాతర ప్రారంభమవుతుంది. 70 కిలోమీటర్లు కాలినడకన.. యాపలగడ్డలో ఉన్న పగిడిద్దరాజు గర్భగుడి నుంచి పడగలకు(జెండాలకు), శివసత్తులకు పురాతన కాలంనాటి ఆభరణాలకు పూజారులు(వడ్డెలు) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వీరితోపాటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామానికి చెందిన అరెం వంశీయులు కూడా పాల్గొంటారు. పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు చేస్తారు. జాతర అనంతరం పడగలను తిరిగి యాపలగడ్డకు చేర్చుతారు. అసౌకర్యాల నడుమ.. మేడారం జాతరకు గుండాల మీదుగా వెళ్లే భక్తులు పగిడిద్దరాజును దర్శించుకుని వెళ్తారు. ఇక్కడ కూడా వంటవార్పు చేసుకుంటారు. ఇక మార్చిలో జరిగే పగిడిద్దరాజు జాతరకు వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేవు. పగిడిద్దరాజు ఆలయానికి నిధులు ఇవ్వాలని మేడారం ట్రస్టును, ఐటీడీఏ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని అరెంవంశీయులు పేర్కొంటున్నారు. గద్దెల వద్ద ప్రహరీ లేదు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవు. ఆర్చ్లు, సీసీ రోడ్లు లేవు. మేడారం జాతరలో పగిడిద్ద రాజు నుంచి వస్తున్న మూడో వంతు డబ్బులతో ఇక్కడ జాతర ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడంతోపాటు శుభకార్యాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టాలని, ఫంక్షన్ హాల్ కూడా నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేడారం ట్రస్టుతోపాటు ఐటీడీఏ అధికారులను ఏటా గద్దె ల అభివృద్ధికి నిధులు కేటా యించాలని కోరుతున్నాం. మేడారంలో రూ.కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం ఇక్క డ కూడా దృష్టి పెట్టాలి. తాగునీటి సౌకర్యం, మ రుగుదొడ్లు, ప్రహరీ, సీసీ రోడ్లు, ఆర్చిలు నిర్మించాలి. – అరెం కాంతారావు, యాపలగడ్డయాపలగడ్డ నుంచి తరలివెళ్లనున్న పగిడిద్దరాజు -
15 కిలోల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: సారపాక ప్రధాన కూడలిలో పోలీసులను గమనించి అతివేగంగా పరారవుతున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కొద్దిగాయాలతో అక్కడే పడిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు చేయగా 15 కిలోల గంజాయి దొరికింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఎస్ఐ మేడా ప్రసాద్ కథనం ప్రకారం.. సీలేరు నుంచి జగ్గయ్యపేట వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. బైక్ నడుపుతున్న జగ్గయ్యపేటకు చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపినాఽథ్ను పోలీసులు పట్టుకుని విచారించారు. రూ 7.65 లక్షల విలువైన 15కిలోల గంజాయి లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పరారైన వ్యక్తి గూటి నాగరాజుగా తేలింది. బైక్ను సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని, పరారైన నాగరాజు కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పాల్వంచలో 7 కేజీలు.. పాల్వంచరూరల్: ద్విచక్రవాహనంపై తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరావు కథనం ప్రకారం... మండల పరిధిలోని కేశవాపురం గ్రామపంచాయతీలో బీసీఎం జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచవైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ.4 లక్షల విలువైన 7.4 కేజీల ఎండు గంజాయి లభించింది. పాల్వంచ పట్టణానికి చెందిన గొల్లపల్లి సాంబశివరావు, భూక్యా శ్రీహరి, పొతుల చిన్న ఒడిశా నుంచి గంజాయి తెస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురుని అదుపులోకి తీసుకుని, గంజాయితోపాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని పాల్వంచ ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. బైక్ అదుపుతప్పి కిందపడటంతో పట్టుబడ్డ నిందితుడు -
ఇదో రకం మోసం..!
● పెట్రోల్ బంక్ యజమానులకే బురిడీ ● ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఉడాయిస్తున్న వాహనదారులు ● ఖమ్మానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తింపు ఖమ్మం అర్బన్ : సహజంగా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరుగుతోందని, తక్కువ ఇంధనం పోస్తున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తుంటాయి. కానీ ఇందుకు విరుద్ధంగా కొందరు ఘరానా మోసగాళ్లు పెట్రోల్ బంక్ యజమానులనే బురిడీ కొడుతున్న ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. కార్లలో డీజిల్, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని డబ్బు చెల్లించకుండా ఉడాయిస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం నగరంలోని దంసలాపురం, చింతకాని మండలం నాగులవంచ, బోనకల్ మండలంలోని ఓ బంక్, కొణిజర్ల మండలం లాలాపురంలోని బంక్ల్లో ఇలాగే ఇంధనం నింపుకుని డబ్బులు ఇవ్వకుండా కారులో పారిపోయినట్లు బంక్ మేనేజర్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ.. గత నెలలో లాలాపురం బంక్లో డీజిల్ కొట్టించుకుని కారులో ఉడాయించిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళల్లో బంకుల్లో సిబ్బంది తక్కువగా ఉండడాన్ని ఆసరాగా తీసుకుని, ఇంధనం నింపిన వెంటనే పరారవుతున్నారు. ఆదివారం సాయంత్రం ధంసలాపురం బంక్ వద్ద ఇలాగే పెట్రోల్ పోయించుకుని పరారు కాగా, కారును గుర్తించిన బంక్ యజమానులు పోలీసులకు సమాచారం అందించగా ఆ కారును పట్టుకుని నిందితులపై విచారణ చేపట్టారు. చింతకాని, బోనకల్ మండలాల్లో కూడా ఇదే కారుతో ఇంధనం నింపుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ధంసలాపురం ఘటనలో ఖమ్మం నిజాంపేటకు చెందిన పి.శివానంద్, రాపర్తినగర్కు చెందిన బి. కార్తీక్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. మరో యువకుడి కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. -
ఎస్సీల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయం, హక్కుల కాలరాత, రిజర్వేషన్లపై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ కోరారు. సోమవారం కొత్తగూడెం అంబేద్కర్ భవనంలో నిర్వహించిన షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల సమస్యలను పట్టించుకోకపోతే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆందోళనలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, నాయకులు సలిగంటి కొమరయ్య, గోపి కిరణ్, ఇంటికాపల్లి శంకర్, ఆర్ నరసయ్య, ఉండేటి దేవరాజు, మ్యాచెస్, రాజయ్య, కండె రాములు, చిరంజీవి, ఇనుముల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ జీఓను ప్రభుత్వం సవరించాలి పాల్వంచరూరల్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకణను అమలు చేస్తూ విడుదల చేసిన జీఓను సవరించాలని మాల సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి కొమరంభీమ్ భవనంలో సోమవారం జన విజ్ఞాన వేధిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక కన్వీనర్ ఎస్.వెంకటేశ్వర్లు, బరగడి దేవదానం, ఎర్రా కామేష్, న్యాయవాది డి.శోభరాణి, దాసరి శేఖర్, రమణమూర్తి, ఇన్నయ్య, గుర్రం లక్ష్మయ్య, దాసరి రమేష్, శనగ రామచందర్, గడ్డం రాఘవబాబు, ఇస్సాక్, శాంతివర్ధన్, రాజశేఖర్, పోతురాజు బాబు, కమలాకర్, ప్రసాద్ పాల్గొన్నారు. -
జీపు బోల్తా పడి వ్యక్తి మృతి
గుండాల: జీపు బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. కొమరారం ఎస్సై నాగుల్మీరా కథనం ప్రకారం.. మండలంలోని చెట్టుపల్లికి చెందిన పెరిక రామకృష్ణ(35) శంభూనిగూడెంలో కిరాయి ఉండటంతో ఆదివారం రాత్రి బయల్దేరాడు. చెట్టుపల్లి–శంభూనిగూడెం మార్గం మధ్యలో ఓ మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ జీపు కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో సోమవారం ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తొమ్మిదోమైలుతండాకు చెందిన గుగులోత్ భద్రు కుమారుడు అశోక్ (26) బైక్పై రోళ్లపాడు చెరువు వద్దకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో దర్గా సమీపంలో అదుపు తప్పి మోరీని ఢీకొని కింద పడ్డాడు. దీంతో అశోక్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అశోక్కు గత వేసవిలోనే వివాహం కాగా, భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. జాతీయ వాలీబాల్ టోర్నీకి ముగ్గురి ఎంపికఖమ్మం స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈనెల 11 వరకు జరిగే జాతీయస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్రజట్టులో స్థానం పొందిన వారిలో కొర్రి జగదీష్, బండ్ల గణేష్, చల్లగుండ్ల సారిక ఉన్నారు. జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.గోవిందారెడ్డి, కోచ్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. -
యూరియా కొరత లేదు
జూలూరుపాడు: జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్లో యూరియా, ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబూరావు తెలిపారు. సోమవారం పీఏసీఎస్లో తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల స్టాక్ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి యూరియా పంపిణీపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజువారీగా సరిపడా యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని, ప్రస్తుతం 565 యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని వివరించారు. వరి, మొక్కజొన్న సాగు చేసే రైతులకు ఎకరాకు ఒక బ్యాగ్ యూరియా చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. జూలూరుపాడు ఏఓ జి.దీపక్ ఆనంద్, ఏఈఓలు గౌస్, గోపికృష్ణ, ప్రసాద్, విజయభాను,సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. దాడి ఘటనలో కేసు నమోదుఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామపంచాయతీ సీత్లాతండా గ్రామంలో భూవివాదంలో ఆడపడుచులు, అత్తమామలు తనపై దాడిచేసి గాయపర్చారని భూక్య అశ్విని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను కోల్పోయిన తాను అత్తమామల వద్దే ఉంటున్నానని ఫిర్యాదులో పేర్కొంది. గ్రామపెద్దల సమక్షంలో నిర్వహించిన భూమి, అప్పులకు సంబంధించిన వ్యవహారంలో తనపై కోపంతో భౌతికంగా దాడిచేశారని వివరించింది. ఈ మేరకు ఆడపడుచులు జ్యోతి, రోజా, అత్తమామలు భూక్య భారతి, గన్నాలపై కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్సై నాగుల్మీరా తెలిపారు. దుకాణం యజమానిపై .. ఇల్లెందు: బాల కార్మికుడిని పనిలో పెట్టుకున్న జగదాంబా గుంపులోని ఎంఆర్ మోటార్స్ దుకాణం యజమాని ఎస్కే రబ్బానీపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సుభాష్నగర్లో ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు తనిఖీలు చేపట్టారు. ఎంఆర్ మోటార్స్ షాపులో ఓ బాలుడు పనిచేస్తుండగా గుర్తించి, యజమానిపై కేసు పెట్టారు. పందెంరాయుళ్ల అరెస్ట్మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని కమలాపురం గ్రామ శివారు వద్ద కోడిపందేలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లు, ఐదు కోడి కత్తులు, కోడి పుంజు, రూ.6,600 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రావణ్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ఇల్లెందు: బుగ్గవాగు నుంచి పోలంపల్లి వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ రోడ్లోని సింగరేణి చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు ట్రాక్టర్ను పట్టకుని స్టేషన్కు తరలించారు. డ్రైవర్ పొదెం ప్రసాద్పై కేసు నమోదు చేశారు. ప్రజాప్రతినిధిపై దాడి!ఇల్లెందు: పట్టణంలోని ఓ ప్రజాప్రతినిధిపై దాడి జరిగినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి తన బంధువుల ఇంటికి వెళుతున్న అతడిని కొందరు యువకులు అడ్డుకుని దాడి చేసినట్లు సమాచారం. ఈ విషయమై సీఐ టి.సురేష్ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. మహిళ అదృశ్యంఇల్లెందు: పట్టణంలోని కోర్టు ఏరియాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో సహా అదృశ్యం కాగా, సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం కోర్టు ఏరియాకు చెందిన సతీష్ కారు డ్రైవింగ్ కోసం లింగాల వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య శిల్పశ్రీ తన కుమారుడితో కలిసి ఇంట్టి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు. డిగ్రీ విద్యార్థిని..ఇల్లెందు: డిగ్రీ విద్యార్థిని అదృశ్యంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ ఏరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి మోహన్ కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈ నెల 2న ఇంటి నుంచి దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేదు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో సీఐ సురేష్ కేసు నమోదు చేశారు. మందుపాతర పేలి బాలుడికి తీవ్ర గాయాలుచర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మందుపాతర పేలి ఓ బాలుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. బాలుడు రాము పోతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లేండ్రా– కోర్చోలి అడవి నుంచి నడిచి వెళ్తున్నాడు. పోలీసు బలగాలను మట్టుబెట్టే లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెజర్ బాంబుపై కాలు వేయడంతో అది పేలి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలుడికి సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
సీఎం కప్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సీఎం కప్ క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణపై సోమవారం క్లస్టర్ ఇన్చార్జీలు, ఎంఈఓలు, డీఈఓ, డీపీఓ, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీస్థాయిలో ఈ నెల 17 నుంచి 22 వరకు, మండలస్థాయిలో ఈ నెల 28 నుంచి 31 వరకు, నియోజకవర్గస్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు, రాష్ట్రస్థాయిలో, మొత్తం ఐదు దశల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామీణ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో క్రీడలు నిర్వహించాలని చెప్పారు. ఎంఈఓలు, సీఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో 21 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు వివరాలను అధికారిక వెబ్సైట్ satg. telangana. gov. in/ cmcup లేదా CM cup మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
మామిడి ‘పండు’తుందా..?
వరుసగా నాలుగేళ్ల నుంచి మామిడి తోటలకు పెట్టుబడితోనే సరిపోతుంది. తెగుళ్లకు తోడు ఏదో ఒక కారణంతో నష్టాలే తప్ప లాభాల ముఖమే చూడలేదు. ఈసారి పూత బాగానే ఉన్నా, చివరకు నష్టాలే వస్తే మామిడి తోట తొలగించక తప్పదు. – అట్లూరి సత్యనారాయణరెడ్డి, రైతు, అడసర్లపాడు ఈ ఏడాదైనా మామిడి లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పటికే మామిడి తోటలు లీజ్కు తీసుకున్నాను. ప్రస్తుతం తోతాపురి తోటల్లో పూత ఆశాజనకంగా ఉంది. వాతావరణం కలిసొస్తే తోటలతో లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. – జంగ జమలయ్య, మామిడి తోటల వ్యాపారివేంసూరు: విదేశాలకు ఎగుమతి చేసే తోతాపురి, బంగినపల్లి తదితర మామిడి రకాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగవుతున్నా యి. ఖమ్మం జిల్లాలో సుమారు 32వేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి.అయితే, మామిడి సాగు వ్యయం పెరుగుతుండడం.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు వస్తుండడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పలుచోట్ల మామిడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రారంభించారు. వేంసూరు మండలంలో కొన్నేళ్ల క్రితం వరకు 25వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఇప్పుడు ఏడు వేల ఎకరాలకు పడిపోయింది. కాగా, నాలుగేళ్ల నుంచి వరుస నష్టాలు వస్తుండడంతో రైతులు దిగాలు చెందుతుండగా, ఈసారి పూతఆశాజనకంగా ఉండడంతో మెరుగైన దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. పూతను కాపాడుకునేలా.. ఈసారి మామిడిచెట్లకు పూత గణనీయంగా వచ్చింది. ఇందులో సగమైనా కాతగా మారితే దిగుబడికి ఢోకా ఉండదని, లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఈ మేరకు నాలుగేళ్ల నుంచి నష్టాలు తప్ప లాభమన్నది ఎరగని రైతులు.. పూత, పిందెను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తూ తోటల్లో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలుచోట్ల తోటలను లీజ్కు తీసుకున్న తెలంగాణ, ఏపీ వ్యాపారులు మామిడితోటల్లో చీడపీడల నివారణ చర్యలు చేపడుతున్నారు. చీడపీడలు ప్రకృతి వైపరీత్యాలే కారణం జిల్లాలో ఒకప్పుడు వేంసూరు మండలంలో అత్యధికంగా మామిడి తోటలు ఉండేవి. ఈ మండలంలో 25వేలకు పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఇప్పుడు కేవలం ఏడు వేల ఎకరాలకే పరి మితమైంది. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు మామిడి సాగుకు ప్రధాన సమస్యలుగా మారాయి. పూతదశలో ఏటా తేనె మంచుపురుగు, తామర పురుగు ఉధృతితో పెట్టుబడి పెరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఒకవేళ కాయ దశకు చేరినా మంగు తెగులుతో నష్టాలు, దీన్ని అధిగమించే సరికి ఈదురు గాలులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఓర్చుకుంటూ కాత వచ్చేసరికి జిల్లాలో మామిడి మార్కెట్ లేక మంచి ధర కోసం దక్షిణాది రాష్ట్రాల వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదు. -
జాతీయ కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు
పినపాక: జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలకు మండలంలోని ఈ.బయ్యారంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోటీలపై యువత సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తోంది. ‘మన గ్రామం, మన క్రీడలు, మన బాధ్యత’ ట్యాగ్లైన్తో పోస్టులు పెడుతున్నారు. అధికారులు ప్రత్యే క ఆకర్షణగా భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలకు పోస్టర్లు అంటించడంతోపాటు మైకులతో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాల జట్లు రాక పోటీలు బుధవారం ప్రారంభంకానుండగా, సోమవారమే పలు రాష్ట్రాల జట్లు ఈ.బయ్యారం చేరుకున్నాయి. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఛతీస్గఢ్ రాష్ట్రాల జట్ల క్రీడాకారులు రాగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు వారిని బస చేసే ప్రదేశానికి తరలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి జాతీయస్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సోమవారం పోటీలు నిర్వహించే ఈ.బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో అధికారుల అలస్తత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటీపీఎస్, సింగరేణి సంస్థలను భాగస్వామ్యం చేసుకుని పనులు పూర్తి చేయాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు. డీఈఓ నాగలక్ష్మి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఈ.బయ్యారంలో ప్రారంభం కానున్న క్రీడలు -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. సోమవారం కొత్తగూడెంలోని 14, 19, 30, 29, 55, 56, 58, 59 డివిజన్లలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మాట్లాడారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించడంలో కార్యకర్తలు, నాయకులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు , పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళి, రజాక్, మండే వీరహనుమంతురావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘురాంరెడ్డి -
బంకుల్లో మోసాలకు తావు లేదు
ఎర్రుపాలెం: పెట్రోల్ బంక్ల్లో వినియోగదారులను మోసం చేసేందుకు తావు లేదని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి బి.ప్రవీణ్కుమార్ అన్నారు. ఇటీవల మండలకేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొలతల్లో తేడాలు రావడంతో వినియోగదారులు పౌరసరఫరాల అధికారులకు, మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రవీణ్కుమార్, సివిల్ సప్లై డీటీ ప్రసన్న సోమవారం పెట్రోల్ బంక్ను, రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్రోల్ పంప్ను సీజ్ చేశారు. శాంపిళ్లు ల్యాబ్కు పంపించి తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రవీణ్కుమార్ తెలిపారు. బంక్ల్లో పని చేసే సిబ్బంది వినియోగదారులతో మర్యాదగా మెలగాలని సూచించారు. టాయిలెట్లు, ఎయిర్, తాగునీరు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. -
బ్రిక్స్ ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
పాల్వంచరూరల్: బాలకార్మికుడితో పని చేయిస్తున్న ఇటుకల ఫ్యాక్టరీ యజమానిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధి లక్ష్మీదేవిపల్లిలోని శ్రీవెంకటేశ్వర మణి నిలయం ఇటుకల తయారీ కంపెనీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంటకు చెందిన బాలుడితో పనులు చేయిస్తున్నారు. దీంతో ఆపరేషన్ స్మైల్ బృందం తనిఖీలో గుర్తించగా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రిక్స్ ఫ్యాక్టరీ యజమాని పగిళ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
అభ్యాసం మెరుగుపర్చేలా..
కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను సమగ్రంగా మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రాథమిక విద్యే భవిష్యత్కు పునాది అయినందున అది ఎంత బలంగా ఉందో తెలుసుకునేందుకు మూడో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వారికి జాతీయ సాధన సర్వే పరీక్ష (నేషనల్ అచీవ్మెంట్ సర్వే) నిర్వహణకు చర్యలు చేపట్టింది. చదవడం, రాయడం, గణితంపై విద్యార్థులకు ఉన్న అవగాహన స్థాయిని ఈ పరీక్ష ద్వారా పరిశీలించనున్నారు. జిల్లాలో 963 ప్రాథమిక, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా సుమారు 5వేల మంది మూడో తరగతి విద్యార్థులున్నారు. ఫిబ్రవరి 26న పరీక్ష.. వచ్చే ఫిబ్రవరి 26న జాతీయ సాధన సర్వే పరీక్షను నిర్వహించనున్నారు. తెలుగు,ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల విద్యార్థులకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనుండగా, గణితం అంశంలో కూడా ప్రాథమిక స్థాయి సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను అన్ని అంశాల్లో సమగ్రంగా తీర్చిదిద్దాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించారు. మూడు దశల్లో మాక్ టెస్టులు... జాతీయ స్థాయి పరీక్షకు నేరుగా వెళ్లకుండా మూడో తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయిలో మూడు దశల్లో నమూనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మాక్ టెస్టుల ద్వారా విద్యార్థులు జాతీయ పరీక్షకు అలవాటు పడడంతో పాటు వారి సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది. గత డిసెంబర్ చివరి వారంలో తొలి పరీక్ష నిర్వహించగా ఈనెల మూడో వారంలో రెండో పరీక్ష, ఫిబ్రవరి రెండో వారంలో మూడో నమూనా పరీక్ష ఉంటాయి. ఈ పరీక్షల ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అందుబాటులో మాదిరి ప్రశ్నపత్రాలు.. విద్యార్థులు,ఉపాధ్యాయుల సౌకర్యార్థం జాతీయ సాధన సర్వేకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాలను విద్యాశాఖ అధికారికంగా అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది.ఈ ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షా విధానం,ప్రశ్నల స్వరూపం,సమయ నిర్వహణ వంటి అంశాలపై విద్యార్థులకు ముందుగానే అవగాహన కలుగుతుందని అధికారులు తెలిపారు.ఉపాధ్యాయులు కూడా ఈ మాదిరి ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకుని తరగతి గదుల్లో ప్రత్యేక సాధన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సర్వే ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవిక విద్యా ప్రమాణాలను అంచనా వేసే అవకాశం లభించనుంది.అందిన ఫలితాల ఆధారంగా బోధనా విధానాల్లో అవసరమైన మార్పులు,శిక్షణ కార్యక్రమాలు,విద్యా విధాన పరంగా తీసుకోవాల్సిన సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లభించే అవకాశముందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఉన్న అభ్యాస సామర్థ్యాన్ని స్పష్టంగా తెలుసుకోవడం మా ప్రధాన ఉద్దేశం.చిన్న తరగతుల్లోనే చదువు పునాది బలపడితేనే భవిష్యత్లో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.అందుకే మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాం.ముందస్తు సాధన పరీక్షల ద్వారా పిల్లలు ఎలాంటి అంశాల్లో ఇబ్బంది పడుతున్నారో గుర్తించి,ఆ లోపాలను సరిదిద్దే విధంగా బోధన కొనసాగించనున్నాం.ఉపాధ్యాయులు,ఫీల్డ్ సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తాం. – నాగరాజశేఖర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్జాతీయ సాధన సర్వేకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేస్తోంది.వీరికి ముందుగా అవసరమైన శిక్షణ అందించి,ఆయా పాఠశాల సముదాయాల పరిధిలో నమూనా పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్షల నాణ్యతతో పాటు పారదర్శకతను కూడా నిర్ధారించనున్నారు.నమూనా పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి,వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.అవసరమైన చోట అదనపు బోధన,ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టనున్నారు.ప్రస్తుతం ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో అంచనా వేయనున్నారు.విద్యార్థులు ఎక్కడ లోపాలు ఎదుర్కొంటున్నారో గుర్తించి,అందుకు అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావడంతో పాటు,విద్యా నాణ్యతను మెరుగుపర్చే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యానికి అసలైన పరీక్ష -
సహకార ఎన్నికలేనా?
● డీసీసీబీ, పీఏసీఎస్ల రద్దుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ ● ఇక నామినేటెడ్ పద్ధతిలోనే పాలకవర్గాల భర్తీ అంటూ ప్రచారం ! ● మరోవైపు ఉమ్మడి జిల్లాలో కొత్త పీఏసీఎస్ల ఏర్పాటు ● ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదనలుసాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్ ప్రాతిపదికన ఎన్నుకుంటారనే చర్చ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ సంఘాలకు ఎన్ని కలు నిర్వహించగా.. ఇటీవల ఆయా పాలకవర్గాల ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్ల చైర్మన్లు డీసీసీబీకి చైర్మన్, పాలకవర్గాన్ని ఎన్నుకునే వారు. అయితే ఈ ప్రక్రియ లేకుండా డీసీసీబీ, పీఏసీఎస్ల చైర్మన్లను నేరుగా నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేస్తారనే ప్రచా రం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పరిధిలో ప్రస్తు తం ఉన్న పీఏసీఎస్లు, ఇంకా కొత్తగా ఎన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఉద్దేశంతో వారే నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. పాలక వర్గాలకు మంగళం.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వీటికి ఇన్చార్జ్ల నియామకానికి సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ, పీఏసీఎస్ల పాలక మండళ్ల పదవీకాలం గత ఫిబ్రవరిలో ముగియగా వాటినే కొనసాగిస్తూ ఫిబ్రవరి 14, ఆగస్టు 14న రెండుసార్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హఠాత్తుగా ఆ జీఓను రద్దు చేస్తూ.. డీసీసీబీ, పీఏసీఎస్లకు అధికారులను ఇన్చార్జ్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక గల కారణాలను విశ్లేషించే పనిలో ప్రజాప్రతినిధులు పడ్డారు. సహకార విభజనకు శ్రీకారం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 101 పీఏసీఎస్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి జిల్లాలో 21, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నాలుగు ఉన్నాయి. అయితే రైతుల అవసరాలకు అనుగుణంగా పెద్ద పీఏసీఎస్లను విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రిలో 21, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 4 సంఘాలు పెద్దవిగా గుర్తించారు. వీటిలో నుంచి రెండు లేదా మూడు సంఘాలుగా విభజించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన నివేదికలు జిల్లా సహకార అధికారుల నుంచి రాష్ట్ర సహకార రిజిస్ట్రార్కు అందాయి. ఈ ప్రతిపాదనలను ఆయన పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిలో మర్మమేమిటో..? ప్రభుత్వం విడుదల చేసిన జీఓలోని అంశాలపై ఉమ్మడి జిల్లాలో చర్చ సాగుతోంది. పాలక వర్గాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రద్దు చేయడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలక వర్గాల స్థానంలో పర్సన్ ఇన్చార్జ్లతో కూడిన అధికారుల కమిటీని నియమించాలని, ఆరు నెలల కాలానికి లేదా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని జీఓలో స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆరు నెలల్లో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. అయితే జీఓలో మాత్రం సహకార సంఘాలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రస్తుత కమిటీల కాలపరిమితి విషయంలో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినట్లు చెబుతున్నారు. వైరాలో 21 పీఏసీఎస్లకు ప్రతిపాదన.. వైరా నియోజకవర్గ పరిధిలో నూతనంగా 21 పీఏసీఎస్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఏన్కూరు మండలం గార్లొడ్డు పీఏసీఎస్ను విభజించి ఐదు పీఏసీఎస్లు, సింగరేణి మండలం కారేపల్లి పీఏసీఎస్ పరిధిలో మూడు, కొణిజర్ల మండలం గోపవరం పీఏసీఎస్ పరిధిలో ఐదు, వైరా మండల కేంద్రంలోని పీఏసీఎస్ పరిధిలో నాలుగు, గరికపాడు పీఏసీఎస్ పరిధిలో మరొకటి, జూలూరుపాడు పీఏసీఎస్ పరిధిలో మూడు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషిస్తున్న రాజకీయ వర్గాలు పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం సర్కారుకు లేదనే అంటున్నాయి. పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లను నేరుగా నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పరిధిలో ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్లు, కొత్తగా ఏర్పాటు చేయాలనే దానిపై నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం. -
కబడ్డీ పోటీలకు అంతా సిద్ధం..
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు ● క్రీడాకారులకు ఆశ్రమ పాఠశాలలో వసతి ● రాష్ట్రాలకు అనుగుణంగా వంటలు పినపాక: ఈ–బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 7 నుంచి నిర్వహించే జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు ఓ పక్క మొదలవుతుండగానే.. ఈ–బయ్యారం గ్రామం క్రీడలకు సన్నద్ధం అవుతోంది. క్రీడా ప్రాంగణంలో ఐదు మ్యాట్లు ఏర్పాటుచేశారు. సుమారు 200 నుంచి 300 మంది కూర్చొని తిలకించేందుకు గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ కోసం రెండు ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు. 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. వారికి ఎల్సిరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. పిల్లలకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. దీంతో వారంతా ఇంటికి వెళ్లడంతో వీరికి బస ఏర్పాటు చేశారు. బెడ్లు, ఫ్యాన్లు, దుప్పట్లు సిద్ధం చేశౠరు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని రకాల వంటలు.. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి వస్తున్న క్రీడాకారులకు రుచికరమైన భోజన ఏర్పాట్లను కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాలకు అనుగుణంగా వంటలను వండే విధంగా మాస్టర్లను సిద్ధం చేశారు. నార్త్ ఇండియా ఆటగాళ్లకు చపాతి, రోటీ, స్వీట్, దాల్ఫ్రై వంటి వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. క్రీడాకారులకు అందించే భోజనంలో రాజీ లేకుండా ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. వారి రాష్ట్రాల్లో ఉండే ఆహారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు, క్రీడలను వీక్షించడానికి వచ్చే వారికి భోజన ఏర్పాట్లు చేస్తాం. క్రీడాకారులు ఉండటానికి ఆశ్రమ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. –విశ్వభారత్రెడ్డి, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి పనుల్లో నిమగ్నమయ్యాం. గ్రామస్తుల సహకారంతో అనుకున్న సమయానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాం. జాతీయస్థాయి క్రీడలతో ఈ–బయ్యారం గ్రామానికి, పాఠశాలకు మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయని భావిస్తున్నాం. –నరేశ్, జాతీయ స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ -
పునర్వసు మండపంలో రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు సేవలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పునర్వసు మండపంలో వైభవోపేతంగా సేవలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణలు, కోలాటాల నడుమ వేడుకగా పునర్వసు మండపం వరకు తీసుకొచ్చారు. మండపంలో స్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలను జరిపి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు దారిపొడవునా స్వామివారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మూలమూర్తులకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం తెల్లవారుజామున అభిషేకం, అనంతరం సువర్ణ పుష్పార్చలను జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారి పూజల్లో, ఆర్జిత సేవల్లో అధికంగా పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు వేలం పాటలుఆలయ కొత్త కాంప్లెక్స్లోని 1,2,3 నంబర్ షాపులు, పాతకాంప్లెక్స్లోని 3,4 షాపులు, చీరలు పోగుచేసుకునే, పూలదండల విక్రయాల లైసెన్స్ హక్కులకు మంగళవారం సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. 32 పోస్టులకు 330 దరఖాస్తులుసింగరేణిలో వైద్యుల పోస్టులకు ముగిసిన దరఖాస్తు గడువు రుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 32 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులను రెగ్యులర్ బేసిస్లో నియమించేందుకు గత నెల 22న యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించింది. మొత్తం 330 మంది దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరికి ఈ నెల 8,9 తేదీల్లో హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు. కొనసాగుతున్న క్రీడా పోటీలు అశ్వారావుపేట: అశ్వారావుపేట వ్యవసాయ క ళాశాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయస్థాయి క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రెండోరోజు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బాస్కెట్బా ల్, రన్నింగ్, ఫుట్బాల్, వాలీబాల్ పోటీలు ని ర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ పోటీలను పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కవుల ప్రతిభభద్రాచలంటౌన్: ఏపీలోని గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో జిల్లా కవులు ప్రతిభ చాటారు. కవి సమ్మేళనంలో తెలంగాణ సాహితి భద్రాచలం శాఖ బాధ్యులు తాతోలు దుర్గాచారి, కె.కనకదుర్గ, ఎం.పద్మావతి, ఉమాదేవి, కొత్తగూడేనికి చెందిన రాజేష్, ఎంవీవీ ప్రసాద్ పాల్గొని అద్భుతంగా కవితాలాపన చేశారు. అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రపంచ స్థాయి వేదికపై కవితలు వినిపించి, సన్మానం అందుకున్న జిల్లా కవులను పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు అభినందించారు. రాష్ట్ర బృందం పరిశీలనఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలో స్టేట్ లెవల్ ఎక్స్ఫర్ట్ అప్రైజర్ కమిటీ సభ్యులు దినేష్కుమార భరద్వాజ్, సరిత సజ్జ ఆదివారం పర్యటించారు. జేకే–5 ఓసీని సందర్శించి ప్లాంటేషన్ను పరిశీలించారు.ఓబీ ఏరియాలో పర్యావరణ పరిరక్షణపై ఆరా తీశారు. అధి కారులు సైదులు, కృష్ణయ్య, రామస్వామి, శంకర్ శ్రీనివాస్, జాకీర్ హుస్సేన్, గోవిందరావు, శ్రీనివాసరావు, రమణారెడ్డి పాల్గొన్నారు. -
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 7న కొత్తగూడెంలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కోరారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బైక్ ర్యాలీ నిర్వహిస్తారని, ఇటీవల విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను సన్మానిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియతోపాటు దిండిగాల రాజేందర్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి బూర్గంపాడు: పురుగుమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. మండలంలోని రాజీవ్నగర్కు చెందిన కుంజా జోగయ్య (28) కొంతకాలంగా మద్యానికి బానిసై.. పనికి వెళ్లకుండా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. గత నెల 22న పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు పాల్వంచ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి ఆదివారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు భద్రు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లెందు మండలంలో యువకుడు.. ఇల్లెందురూరల్: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఉపేందర్ (30) డిసెంబర్ 28వ తేదీన మహబూబాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అనారోగ్యంతో బీటీపీఎస్ ఉద్యోగి..పాల్వంచ: అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న బీటీపీఎస్ ఉద్యోగి రోడ్డు పక్కనే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన బీటీపీఎస్ ఫోర్మెన్ రామాల థామస్ (56) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం మద్య ం సేవించేందుకు బయటకు వెళ్లిన థామస్ తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు పక్కనే పడి మృతి చెందాడు. అయితే, గతంలో అతడికి ఫిట్స్ ఉందని, అనారోగ్యంతో మృతి చెందాడని భార్య ఝాన్సీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పశువుల పట్టివేత మణుగూరుటౌన్: జామాయిల్ తోటలో కబేళాకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న గోవులను ఆదివారం రాత్రి మణుగూరు పోలీసులు గోశాలకు తరలించారు. మండలంలోని రామానుజవరంలో జామాయిల్ తోటలో 26 గోవులను కబేళాకు తరలించేందుకు కట్టేసి ఉంచగా, విషయం తెలుసుకున్న పలువురు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నాగబాబు ఆ గోవులను గోశాలకు అప్పగించారు. పోలీసులకు నాయకులు అభినందనలు తెలిపారు.కార్మికుడికి గాయాలు బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో విధి నిర్వహణలో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. పీఎం–1ఏలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు బత్తుల కిశోర్ చేయి ప్రమాదవశాత్తు రివైండర్లో పడింది. తీవ్రంగా గాయపడటంతో అతడిని తోటి కార్మికుల సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కార్మికుడిని ఐటీసీ కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు. -
రైతుల సంక్షేమానికే రిజిస్ట్రేషన్
● పథకాల లబ్ధి కోసం ఆధార్, భూ వివరాలు నమోదు ● జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఖమ్మంవ్యవసాయం: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభ్వుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రాధాన్యతను వెల్లడించిన ఆయన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ద్వారా అందుబాటులోకి రాగా రైతుల ఆధార్ నంబర్, భూమి వివరాలు పొందుపరుస్తారని తెలిపారు. ఇందులో రిజిస్ట్రేషన్ కావడం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, పంటల బీమా అమలులో ఆటంకాలు ఎదురుకావని చెప్పారు. జిల్లాలో 3,54,320మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,97,459 మందిని ఫార్మర్ రిజిస్ట్రీలో ఏఈఓలు నమోదు చేశారని, మిగతా వారు కూడా ముందుకు రావాలని డీఏఓ సూచించారు. ఇవీ ప్రయోజనాలు.. ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేయించుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల అమలు సులభమవుతుందని డీఏఓ తెలిపారు. పీఎం కిసాన్ అమలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరని, రైతుల వివరాలు కచ్చితంగా నమోదు చేయడంతో పారదర్శకత పెరిగి బీమా, సబ్సిడీలు, రుణాలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ మేరకు రైతులు ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్తో పాటు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలతో ఏఈఓల వద్ద ఉచితంగా నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. అంతేకాక మీ సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కూడా ఉందని డీఏఓ పుల్లయ్య వివరించారు. -
ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం ఆగదు
● పేదలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయం ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి ● ఏదులాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనఖమ్మంరూరల్ : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ చిత్తశుద్ధితో అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు రూ.56 కోట్ల విలువైన పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందకు సాగుతోందని, ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తోందని చెప్పారు. వచ్చే ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని, ప్రతీ ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఏదులాపు రం మున్సిపాలిటీ పరిధిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లపై నుంచి విద్యుత్ తీగల తొలగింపు పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో గతంలో వచ్చిన వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు కొంత సాయం చేశామని, భవిష్యత్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రూ.580 కోట్లతో మున్నేరు నదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు త్వరగా, నాణ్యతగా పూర్తి చేయాలని కమిషనర్కు సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం సీపీ సునీల్దత్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఎస్ఈలు యాకోబ్, వెంకటేశ్వర్లు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ కళలకు
ప్రోత్సాహమేది..?సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆసియాలోనే అతిపెద్దదిగా పేరున్న సమ్మక్క–సారలమ్మ జాతర కోసం ములుగు జిల్లాలోని మేడారం గ్రామాన్ని సర్వాంగ సుందరంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చెప్పేలా శిలలపై శిల్పాలు చెక్కించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఆదివాసీ కళాకారులకు గుర్తింపు, వారికి ప్రోత్సాహంలో ఈ తరహా చొరవ కనిపించడం లేదు. ఫలితంగా ఆదివాసీ, గిరిజన కళాకారులు తగిన గుర్తింపునకు నోచుకోక వారి కళలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇందుకు సమ్మక్క–సారలమ్మ వృత్తాంతాలను తెలిపే పద్మశ్రీ సకిని రామచంద్రయ్య జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చు. వృత్తాంత ప్రచార బాధ్యతలు రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించాక అప్పటి సీఎం కేసీఆర్ స్పందించారు. 2022 ఫిబ్రవరి 1న రామచంద్రయ్యను ప్రగతిభవన్కు పిలిపించుకుని అభినందించడమే కాక ఇంటి స్థలం కేటాయిస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.కోటి ఆర్థిక సాయాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా అందిస్తామని ప్రకటించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వృత్తాంతాలను భావితరాలకు తెలిసేలా ప్రచారం చేసే బాధ్యతను రామచంద్రయ్యపై పెట్టారు. వారంలో ఆరు రోజులపాటు ఈ అంశంపై ఆసక్తి ఉన్న ఆదివాసీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు గిరిజన విద్యాసంస్థల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. ఇందుకుగాను నెలకు రూ.20 వేలు గౌరవ పారితోషికం ఇస్తామని ప్రకటించి, బాధ్యతను ఐటీడీఏకి అప్పగించారు. కళ అంతరించిపోవద్దని.. ప్రభుత్వ సూచనల మేరకు ఆదివాసీ కళలపై రామచంద్రయ్య నేతృత్వంలో శిక్షణ – ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేందుకు భద్రాచలంలోని గిరిజన మ్యూజియంలో 2022లోనే ఓ గదిని ఐటీడీఏ కేటాయించింది. ఆ తర్వాత నిధుల కేటాయింపు, సరైన కార్యాచరణ లేకపోడంతో కార్యక్రమం ఆదిలోనే ఆగిపోయింది. మరోవైపు సకిని రామచంద్రయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలైన ఇంటి స్థలం కేటాయింపు, రూ.కోటి ఆర్థిక సాయం అమలుకు నోచుకోలేదు. ఆఖరికి కళాకారులకు అందించే రూ.10వేల పింఛన్ సైతం అందలేదు. చివరి రోజుల్లో అనారోగ్యం పాలై వైద్యం కోసం అప్పులు చేశారు. ఆఖరికి చిన్న ఇంట్లో రూ.2వేల వృద్ధాప్య పింఛన్తో బతుకీడుస్తూ 2024 జూలై 23న ఆయన మృతి చెందారు. కంచుతాళం, కంచుమేళం కళలో ఆరితేరిన ఆదివాసీ కళాకారుడిని ఆదుకోలేకపోగా, కళను భావితరాలకు అందించడానికి సరైన రీతిలో ప్రభుత్వం స్పందించలేదనే విమర్శలు వచ్చాయి. మేడారం అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వైఫై, సోషల్ మీడియా జమానా, డీజే హోరులోనూ ఇప్పటికీ ఆదివాసీ కళలు, సంప్రదాయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన కళాకారులను గుర్తించి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య ఆదివాసీ సంస్కృతిలో భాగమైన కంచు మేళం, కంచు తాళం(డోలు వాయిద్యం) సాయంతో వనదేవతల వీరగాథలు చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు కథను కళ్లకు కట్టినట్టుగా రామచంద్రయ్య గానం చేసేవారు. జాతరలో చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చేప్పుడు ఆయన కీలకంగా వ్యవహరించేవారు. ఈయన ప్రతిభను గుర్తించిన కేంద్రం 2022 జనవరి 25న పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. వనదేవతల వీరగాఽథలు చెప్పిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య -
కేయూ క్రికెట్ విజేత ‘వరంగల్’
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించగా.. వరంగల్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో వరంగల్ – ఖమ్మం జోన్ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. జట్టులో ఉదయ్ 32, శిశిరిక్ 16 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లలో నితిన్, దివిన్, ఇబ్రహీం, సిద్ధార్థ ఒక్కో వికెట్ పడగొట్టగా ప్రద్యుమ్న నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వరంగల్ జోన్ జట్టు తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాట్స్ మెన్ దివిన్ 77 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాట్స్మెన్లు నితిన్ 28 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. రవికుమార్, డాక్టర్ బి. వెంకన్న హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీఈడీలు డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, కుమార్, అస్లాం, సందీప్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ.. దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం – తూరుబాక గ్రామాల మధ్య అదుపుతప్పిన లారీ (టీజీ 04 టీ 4959) చెట్టును ఢీకొట్టింది. ఇసుక లోడ్ కోసం వస్తున్న లారీని క్లీనర్ మద్యంలో డ్రైవింగ్ చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో డ్రైవర్ మద్యం అధికంగా సేవించి నిద్రపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ చేపట్టారు. ఇసుక లారీ సీజ్ దమ్మపేట: అనుమతులు లేకుండా ఏపీ నుంచి మండలానికి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని దమ్మపేట పోలీసులు సీజ్ చేశారు. మండలంలోని వడ్లగూడెం శివారులో అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఏపీలోని రాజమండ్రి నుంచి దమ్మపేటకు ఇసుకను తరలిస్తున్నట్టు తేలడంతో లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. -
నాటుసారాపై ఉక్కుపాదం మోపుతాం
కరకగూడెం: నాటుసారా నియంత్రణలో భాగంగా మణుగూరు ఎకై ్సజ్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని కలవలనాగారం శివారులోని అటవీ ప్రాంతంలో 1000 కిలోల బెల్లం, 15 కిలోల పటిక, 6 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన భూక్యా రామదాసు, ఇస్లావత్ బన్సీలాల్, వాంకుడోత్ బాబూరావు, కుంసోత్ సాగర్పై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రాజిరెడ్డి వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది వెంకట అప్పారావు, ప్రసన్న, సతీశ్ పాల్గొన్నారు. -
పేదల పక్షాన ఎర్రజెండా పోరాటం
అశ్వాపురం/మణుగూరురూరల్/కరకగూడెం/గుండాల: పేదలు, కార్మికులు, కర్షకుల పక్షాన సీపీఐ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. సీపీఐ నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార జాతా ఆదివారం అశ్వాపురం, మణుగూరు, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో సాగింది. మణుగూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. మొండికుంటలో కొల్లు శ్రీనివాసరెడ్డి విగ్రహానికి, మణుగూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించే పార్టీ నూరు వసంతాల ముగింపు సభకు వేలాదిగా తరలిరావాలని కోరారు. సీపీఐ నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, కమటం వెంకటేశ్వరరావు, మువ్వా వెంకటేశ్వరరావు, వేల్పుల మల్లికార్జున్, పేరాల శ్రీను, కొల్లు ఆశ, పగిడిపల్లి జంపన్న, దండి నాగేష్, దంతాల జగదీష్, పవన్సాయి, సురేందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, వంగరి సతీష్, బుడగం సతీష్, ముత్తయ్య, లక్ష్మీనారాయణ, రాజబాబు, డి.సుధాకర్, వై.రాంగోపాల్, సర్పంచులు ఉషారాణి, కల్పన, రేసు ఎల్లయ్య, క్రిష్ణయ్య, రమేష్, రహీం, హనుమంతు, షాహెద్, శ్రీనివాస్, రామయ్య పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా -
సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్పాల్వంచ: ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. టీఎన్జీవో, టీజీవో, ట్రస్మా ఆధ్వర్యంలో ఆదివారం సుగుణ గార్డెన్లో ప్రగతి టు గెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పంచాయతీ రాజ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సాధించిన ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. మునగ, అజొల్లా, సమీకృత వ్యవసాయం, కొర్రమీను, కౌజుపిట్టల పెంపకం, బయోచార్, ఇటుకల తయారీ వంటి వాటిల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
యాసంగి సాగు 54.7 శాతం
● జిల్లాలో మొక్కజొన్న, వేరుశనగ అధికం ● నీటి వనరులు ఉన్నచోట పనులు వేగవంతం సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో గత సీజన్ మాదిరిగా కాకుండా ఈసారి యాసంగి సాగు ఊపందుకుంది. జలవనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మరింత వేగవంతంగా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. దీంతో ప్రధాన పంటల నిర్దేశిత విస్తీర్ణ లక్ష్యంలో ఇప్పటివరకు 54.7 శాతం సాగైంది. యాసంగిలో ప్రధాన వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 1,56,667 ఎకరాలుగా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 84,713 ఎకరాల్లో రైతులు వివిధ పంటల సాగు చేపట్టారు. మొక్కజొన్న, వేరుశెనగ సాగు లక్ష్యం పూర్తి కానుండగా, వరి ఇంకా ఊపందుకోలేదు. జిల్లాలో పొగాకు 2,255 ఎకరాల్లో సాగు చేపట్టారు. కేవలం ఐదు మండలాల్లోనే ఈపంట సాగవుతోంది. అధికంగా అశ్వారావుపేట మండలంలో 1,662 ఎకరాలు, ములకలపల్లి మండలంలో 320 ఎకరాలు, దమ్మపేట మండలంలో 210 ఎకరాలు, అన్నపురెడ్డిపల్లి మండలంలో 60 ఎకరాలు, చండ్రుగొండ మండలంలో 3 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. పంట సాధారణ సాగు విస్తీర్ణం విస్తీర్ణం వరి 79,000 16,833 మొక్కజొన్న 65,000 51,453 వేరుశనగ 2,700 2,151 నువ్వులు 260 28 పొద్దుతిరుగుడు 105 88 మినుము 302 223 అలసంద 200 182 పెసర 650 150 మిర్చి 7,500 9,779 కూరగాయలు 950 1,299 మొత్తం 1,56,667 84,713 -
బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు
కామేపల్లి : మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను విభజిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించి, లౌకిక, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండలంలోని జాస్తిపల్లిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనిజులాపై అమెరికా చేపడుతున్న యుద్ధోన్మాద చర్యలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల ఆధారంగా ఉద్యమాలు నిర్మించి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు దుగ్గి కృష్ణ, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, రమణ, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, దొంతిబోయిన నాగేశ్వరావు, చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, మచ్చా మణి, కంచర్ల అనిత తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
మంత్రి ఆదేశాలు బేఖాతరు..
రుద్రంపూర్: ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ మాయాబజార్ ఇళ్లను కూల్చివేశారని, ఇళ్లు నిర్మించుకునేంత వరకు అవకాశం ఇవ్వాలని కోరినా.. సింగరేణి అధికారులు కనికరం చూపలేదని ధన్బాద్ పంచాయతీ మాయాబజార్ నివాసులు వాపోయారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీ విస్తరణలో భాగంగా మాయాబజార్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సింగరేణి యాజమాన్యం తెలిపింది. గంగహుస్సేన్బస్తీలో నిర్వాసితులకు 100 గజాల స్థలం కేటాయించింది. అక్కడ ఇళ్లు కట్టుకోవడానికి నిర్వాసితులు మూడు మాసాల గడువు కోరారు. ఖమ్మం ఎంపీ, రాష్ట్ర మంత్రులు సానుకూలంగా స్పందించి ఒప్పకున్నారు. కానీ, సింగరేణి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది తమ ఇళ్లను కూల్చివేశారని నిర్వాసితులు తెలిపారు. సింగరేణి అధికారుల తీరుపై తాము ఎస్పీని ఆశ్రయించనున్నామని వెల్లడించారు. ఈ విషయమై ఏరియా జీఎం ఎం.శాలేంరాజును వివరణ కోరగా.. ఎంపీ ఇచ్చిన గడువు తీరిన నేపథ్యంలో విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన తరువాతే తాము కూల్చివేశామన్నారు. ఇంటి స్థలం కేటాయించి సుమారు రెండున్నరేళ్లు అవుతోందని వెల్లడించారు. మాయాబజార్ ఇళ్లు కూల్చివేసిన సింగరేణి సెక్యూరిటీ -
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
పినపాక: ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ దిలీప్ కుమార్ హెచ్చరించారు. శనివారం తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి బయ్యారం క్రాస్రోడ్లో తనిఖీలు చేపట్టారు. ఇసుక లారీలను ఆపి డీడీలను పరిశీలించారు. అనుమతులు లేకుండా ఇసుక తోలకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇసుక క్వారీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మలకు ప్రభుత్వం నుండి ప్రత్యేక టోకెన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పవర్ ప్లాంట్ ఎదురు అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను పరిశీలించి జప్తు చేశారు. వివరాలు సేకరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. పులి సంచారం లేదు● రేంజర్ నరసింహారావు గుండాల: గుండాల అటవీ ప్రాంతంలో పులి సంచారం లేదని, మండల సరిహద్దు ప్రాంతాల్లో అన్వేషిస్తున్నామని రేంజర్ నరసింహారావు తెలిపారు. గుండాల, మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలాల సరిహద్దుల్లో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన ఫారెస్ట్ అధికారులు శనివారం అన్వేషణ ప్రారంభించారు. గుండాల, గంగారం, దుబ్బగూడెం, కొత్తగూడ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వెతకగా పులి అడుగుజాడలు కనిపించలేదని తెలిపారు. ప్రజలు, బాటసారులు భయభ్రాంతులకు గురికావొద్దని చెప్పారు. డిసెంబర్, జనవరి మాసాలలో పులి ఎదకు వచ్చే సమయం కావడంతో అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని అన్నారు. చేను పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతాలతోపాటు నీటి వనరులు ఉన్నచోట ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రోజూ అటవీశాఖ అధికారులు అన్వేషణ చేస్తారని అన్నారు. సమీప ప్రాంతాల్లో పులి అడుగుజాడలు కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. బాలుడిపై కేసు.. జువైనల్ హోమ్కు తరలింపుబంజారాహిల్స్: పాల్వంచ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16), బాలుడు (16) ఇద్దరూ పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదవగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాది క్రితం వరకు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో ఇద్దరి కుటుంబీకులకు తెలియడంతో మేజర్లు అయ్యేవరకు కలుసుకోవద్దని చెప్పారు. దీంతో బాలుడు ఇంటర్ మొదటి సంవత్సరం పాల్వంచలో చదువుతుండగా, బాలిక హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లోని ఎన్బీటీనగర్ బస్తీలో గది అద్దెకు తీసుకుని కుట్టు శిక్షణ తీసుకుంటోంది. గతనెల 31న బాలుడు హైదరాబాద్లోని బాలిక గదికి రాగా, నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అయితే బాలుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హైదరాబాద్ ఎన్బీటీ నగర్కు రాగా, బాలిక, బాలుడు కనిపించారు. అప్పటికే వచ్చిన బాలిక తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో కేసు నమోదుదమ్మపేట: బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికను ఆమె సమీప బంధువైన వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు కోడిపందేల స్థావరాలపై దాడులుబూర్గంపాడు: మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామసమీపంలో రాజీవ్నగర్ వద్ద కోడిపందేల స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. తొమ్మిదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ.17 వేల నగదు, 8 సెల్ఫోన్లు, 8 బైక్లు, 7 పందెం కోళ్లు, కోడి కాళ్లకు కట్టే 12 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బూర్గంపాడు స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. బీట్ ఆఫీసర్ సస్పెన్షన్జూలూరుపాడు: జూలూరుపాడు అటవీ నర్సరీ బీట్ ఆఫీసర్ నర్సింహారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల పాపకొల్లు గ్రామంలోని సదరు బీట్ ఆఫీసర్ ఇంట్లో అక్రమంగా కలప నిల్వ చేయడంతో అటవీశాఖ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై శనివారం జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావును సంప్రదించగా.. ఎఫ్బీఓను సస్పెండ్ చేస్తూ డీఎఫ్ఓ కిష్టాగౌడ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. -
పీఎస్ఈ ప్రక్రియ పూర్తి చేయండి
సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలంటౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ(పీఎస్ఈ) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి పి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికభద్రాచలంటౌన్: పట్టణంలోని సిటీ స్టైల్ జిమ్కు చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు డీవీ శంకర్ రావు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించడంతో జాతీయ పోటీలకు అర్హత సాధించాడు.హరియాణాలోని ఫరీదాబాద్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో పాల్గొంటారని జిమ్ కోచ్ జి.వి. రామిరెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ రావును తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఉపాధ్యక్షుడు వి. మల్లేష్, జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు అభినందించారు. రామభక్తుల పాదయాత్ర జూలూరుపాడు: ధనుర్మానం సందర్భంగా శనివారం పలువురు రామభక్తులు పాదయాత్ర నిర్వహించారు. జూలూరుపాడులోని శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం, గుండెపుడి శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలిపాల్వంచ: ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యాలయంలో బండ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటుంటే ఆదివాసీలు జీవనాధారమైన భూమిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు మోర రవి, సూరేపల్లి వెంకటేశ్వర్లు, శర్ప నారాయణ, కుంజ వెంకటేశ్వర్లు, ఊకం పాపారావు, మడివి సోమయ్య, రెంటాల నారాయణ, రాజు, గంగయ్య, మమత పాల్గొన్నారు. భద్రాచలంలో కార్డన్ సెర్చ్భద్రాచలంటౌన్: పట్టణంలోని ఏఎంసీ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కాలనీని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, నేరస్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు తనిఖీలు చేపట్టామన్నానరు. సీఐ నాగరాజు, ఎస్ఐలు సతీష్, శ్యామ్, స్వప్న పాల్గొన్నారు. వైఎస్ జగన్ అభిమానులకు బెయిల్ ఖమ్మంమయూరిసెంటర్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న, ఓపార్టీ నేతల జోక్యంతో పెట్టి న కేసుతో జైలుకు వెళ్లి న వైఎస్సార్, జగన్ అభిమానులకు బెయిల్ లభించింది. ఈ మేరకు ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, యర్రా నాగరాజురెడ్డి, గంగరబోయిన రవి, గణ పారపు మురళి, సరికొండ రామరాజు, శివారెడ్డి తదితరులకు శనివారం పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారికి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ అభిమానులు స్వాగతం పలికారు. -
నాణ్యమైన విద్యనందించాలి
కొత్తగూడెంఅర్బన్: దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నాణ్యమైన విద్యనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే వంటి మహోన్నత వ్యక్తుల జీవితాలు ఆదర్శంగా తీసుకుని సమాజాన్ని బాగు చేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నా రు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ బోధన వృత్తి మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత పేర్కొన్నారు. 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న 44 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకుడు కొదుమూరు సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
భయం.. భయం
జాతీయ రహదారిపైఅశ్వారావుపేటరూరల్: జాతీయ రహదారుల శాఖ, ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డు వెడల్పు 100 అడుగులు ఉండగా, కేవలం 80 అడుగుల వరకే కల్వర్టు శ్లాబు నిర్మించి వదిలేశారు. నిత్యం రద్దీగా జాతీయ రహదారిపై వాహనదారులు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సూర్యాపేట నుంచి దేవరపల్లి వెళ్లే 365బీబీ జాతీయ రహదారిపై అశ్వారావుపేట పట్టణంలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల పనులు సాగుతుండగా, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో మెగా డ్రెయినేజీ వంకర టింకరగా నిర్మించారు. అంతర్గత రోడ్లకు సంబంధం లేకుండా డివైడర్ల పనులు చేపట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. సమారు రెండు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో సత్తుపల్లి వైపు వెళ్లే మార్గంలోని ఓ రెస్టారెంట్ వద్దగల కాలువపై కల్వర్టును అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. జాతీయ రహదారి కావడంతో 100 అడుగుల వెడల్పు, మధ్యలో డివైడర్ ఉంది. ఇక్కడ వంద అడుగుల దాకా కల్వర్టు నిర్మించాల్సి ఉండగా, కేవలం 80 అడుగుల వెడల్పు వరకే శ్లాబ్ నిర్మించారు. దీంతో కాలువ జాతీయర రహదారి మధ్యలోకి చొచ్చుకుని వచ్చినట్లు ఉండి, ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఆర్అండ్బీ డీఈ ప్రకాశ్ను వివరణ కోరగా.. కల్వర్టు నిర్మాణ ప్రాంతం జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉందని, కల్వర్టు పూర్తి చేసేందుకు తాము కూడా ప్రతిపాదనలు పంపామని తెలిపారు. -
డీప్ సైడ్ ను సింగరేణికే కేటాయించాలి
మణుగూరు టౌన్: మణుగూరు భవిష్యత్తో ముడి పడి ఉన్న సింగరేణి పీకేఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హైదరాబాద్లోని అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గని సింగరేణికి వస్తే మణుగూరు ఏరియాకు మరో 20 సంవత్సరాల భవిష్యత్ పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న మైన్ జీవితకాలం 2031తో ముగియనుందని, డీప్ సైడ్ సింగరేణికి కేటాయించకపోతే వేలాది మంది కాంట్రాక్ట్, ఓబీ కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. కోల్ ట్రాన్స్పోర్ట్ రంగం దివాళా తీస్తుందని చెప్పారు. స్పందించిన డిప్యూటీ సీఎం తగిన చర్యలు చేపడతానని హామీనిచ్చారని ఎమ్మెల్యే పాయం తెలిపారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే పాయం -
నగదు చెల్లించాలని రుణదాతల నిరసన
మణుగూరు టౌన్: ఇద్దరు వ్యాపారులు పలువురి వద్ద అప్పుతీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రుణదాతలు శనివారం నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని వ్యాపారులు రామ్,లక్ష్మణ్లు మణుగూరుకే చెందిన పలువురు నుంచి రూ.2.10 కోట్లు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి చేయడంతో కోర్టు ద్వారా నోటీసులు పంపి ఉన్నప్పుడు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో వారి సమీప బంధువైన ఓ గిన్నెల కొట్టు వ్యాపారి రుణం పొందిన వ్యాపారుల పేరు మీద ఉన్న ఇంటిని విక్రయించి రూ.1.10 కోట్ల చెల్లిస్తానని అంగీకరించాడు. రూ. 50 లక్షలు చెల్లించాడు. మరో రూ.60 లక్షలు ఇవ్వడంలేదు. దీంతో విసిగి వేసారిన బాధితులు శనివారం నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని ప్లకార్డులు చేబూని నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారి దుకాణం ఎదుట నిరసన తెలిపారు. నగదు ఇవ్వకుంటే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇకనైనా మేల్కొంటారా..?
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరు బస్టాండ్ నుంచి మొండికుంట గ్రామశివారు అటవీ ప్రాంతంలోని ఎర్రమ్మగుడి వరకు మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి వాగులపై నిర్మించిన కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. కేఎల్ఆర్ కళాశాల బస్సు ప్రమాదం కూడా ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు వద్దే జరిగింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించగా కల్వర్టు గోడలు కూలుతున్నాయి. కల్వర్టుల వద్ద జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. అయినా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు గోడలు నిర్మించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా కల్వర్టులు -
క్రీడాకారుల సాధన
● బయ్యారం చేరిన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు ● స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పినపాక: జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు ఈ నెల 7 నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. 16 మంది సభ్యులతో కూడిన తెలంగాణ రాష్ట్ర జట్టు ఈ నెల 1న ఈ.బయ్యారం చేరింది. క్రీడాకారులు వారం రోజులు ముందుగానే సాధన ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో కోర్టుకు సంబంధించిన మ్యాట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చలి, మంచు కారణంగా సాధనకు ఇబ్బందులు లేకుండా రాత్రి పగలు శిక్షణ ఇవ్వటానికి రైతు వేదికలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వివాదాస్పద భూమిలో సర్వేను అడ్డుకున్న రైతులు
ఇల్లెందురూరల్: మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ శివారులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు కేటాయించిన భూమి విషయంలో సర్వే నంబర్ వివాదాస్పదమైంది. దీంతో బాధత రైతులు న్యాయం కోరుతూ ఏడాది క్రితం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో సర్వే నంబర్పై స్పష్టత ఇచ్చేందుకు ల్యాండ్సర్వే విభాగం అధికారులు సర్వే చేపట్టారు. కాగా, ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించిన స్థలం విషయంలో స్పష్టత వచ్చినట్లు పేర్కొంటూ సదరు భూమిని స్కూల్ నిర్మాణం కోసం ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని తహసీల్దార్ను ఆదేశిస్తూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వు పత్రంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు సిబ్బంది శనివారం స్థలంలో సర్వే ప్రారంభించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారంటూ బాధిత రైతులు అరుణ, కొమరయ్య, చిలకమ్మ, సౌజన్య, బాలచందర్, లక్ష్మి తదితరులు పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన ఆర్ఐ కామేశ్వరరావును రైతులు నిలదీశారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను వారికి అందజేసి పూర్తిస్థాయి సమాచారం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆర్ఐ బాధిత రైతులకు సూచించారు. సరిహద్దులతో కూడిన పంచనామా రిపోర్టు ఇవ్వనందున తాము ఎవరినీ సంప్రదించబోమని, న్యాయం కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు. -
వ్యవసాయ రంగం మహోన్నతమైనది
● ఐఏఎస్ అంటే ‘ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్’ ● వ్యవసాయ యూనివర్సిటీ క్రీడా పోటీల ప్రారంభంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ అశ్వారావుపేట : వ్యవసాయ రంగం ఎంతో ముఖ్యమైన, శక్తివంతమైన వృత్తి అని, సాంకేతికత సహాయంతో ఈ రంగంలో త్వరలోనే పెను మార్పులు చోటు చేసుకుంటాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు అశ్వారావుపేటలో నాలుగు రోజుల పాటు క్రీడలు నిర్వహించనుండగా.. ఈ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సగటు రైతు ఒక ఐఏఎస్ అని, ఐఏఎస్ అంటే ఇండియన్ అగ్రికల్చ రల్ సర్వీస్ అని చెప్పారు. ఇంతటి మహోన్నతమైన రైతులకు సహాయం చేసే వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చాలా అదృష్టవంతులని అన్నారు. ఆటల్లో ఒకరి నుంచి ఒకరు మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. స్టూడెంట్స్ ఎఫైర్స్ డీన్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం, క్రీడా స్ఫూర్తి అలవడుతాయన్నారు. యూనివర్సిటీ పరిధిలోని 13 కళాశాలలకు చెందిన 467 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా యూనివర్సిటీ అబ్జర్వర్ ఎస్. మధుసూదన్ రెడ్డి, అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్, డాక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్.. సూపర్బజార్(కొత్తగూడెం): పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో ఈనెల 7 నుంచి నిర్వహిస్తున్న అండర్–17 బాలుర విభాగం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 24 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు రానున్నారని వివరించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ, సీబీఎస్ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సీఐఎస్సీఈ, విద్యాభారతి వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి కూడా జట్లు వస్తాయని వెల్లడించారు. క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, అతిథులకు వసతి, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాల కల్పనకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
వసతులేవీ ?
అభివృద్ధి సరే..భద్రాచలం: భద్రగిరికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. క్రిస్మస్ నుంచి నూతన సంవత్సరం లోపే సుమారు లక్ష మంది రామయ్యను దర్శించుకున్నారు. ఇక ఈ ఏడాది శ్రీరామనవమి, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు.. ఇలా వరుసగా భక్తజన జాతర నెలకొననుంది. ఈ నేపథ్యంలో సరైన వసతులు లేక భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ, దేవస్థాన గదులు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు లాడ్జీల యజమానులు ఇటీవల రోజుకు రూ. 5వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. కాగా ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన మాస్టర్ ప్లాన్లో ఆలయ అభివృద్ధి నమూనా మాత్రమే ఉండగా వసతి, సౌకర్యాల మాటేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. రూ.350 కోట్లతో ప్రతిపాదనలు.. భద్రాద్రి రామాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు, ప్లాన్ సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పలుమార్లు పరిశీలించిన అధికారులు.. వైదిక పెద్దలతో సమాలోచనలు చేశాక రామాలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.350 కోట్లతో ప్రతిపాదనలు అందజేశారు. తొలి విడతగా ఆలయ కాంప్లెక్స్ విస్తరణ చేపట్టాలని, మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాద విభాగం, పరిపాలనా భవనాల నిర్మాణానికి రూ.115 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. రెండో విడతలో రూ.35కోట్లతో విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారులు అభివృద్ధి చేయాలని, మూడో విడతలో కరకట్ట దిగువ భాగాన ఉన్న కాపా రామలక్ష్మమ్మ భూమిలో రామాయణ మ్యూజియం, తూము నర్సింహాదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కింగ్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. చివరగా ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పార్కింగ్ కూడా ప్రధానమే.. రానున్న పెద్ద ఉత్సవాల్లో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు, పార్కింగ్ కూడా ప్రధానమే. మొదటి దశలో ఆలయ అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు.. మూడో దశలో పార్కింగ్, భక్తుల వసతికి సంబంధించిన నిర్మాణాల గురించి ప్రస్తావించారు. ప్రతీ సంవత్సరం ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో భక్తులు వసతి సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రసాద్’లో భవన నిర్మాణ పనులు చేపట్టినా అది నేటికీ పూర్తి కాలేదు. ఈ భవనంతో పాటు మల్టీ లెవల్ వసతి గదులతోనే సమస్య పరిష్కారం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభంతో పాటే వసతి గదుల పనులను సైతం చేపట్టాలని, తద్వారా 2027 ఆగస్టులో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఈ సమస్య కొంతైనా పరిష్కారం అవుతుందని అంటున్నారు.రానున్న రోజుల్లో భద్రగిరికి భక్తుల తాకిడి -
ముసురుకున్న మంచు!
చుంచుపల్లి/పాల్వంచరూరల్/ములకలపల్లి : జిల్లాలో రెండు రోజులుగా పొగమంచు కమ్ముతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. దీంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. పాల్వంచ – భద్రాచలం ప్రధాన రహదారిపై శనివారం ఉదయం మంచు దట్టంగా ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు డ్రైవర్లు తమ వాహనాలను పక్కనబెట్టి వేచి ఉండాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. చలి సైతం పంజా విసురుతుండగా ప్రజలు అల్లాడుతున్నారు. పొగ మంచు, చలి గాలుల నేపథ్యంలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలు, అడవులు ఎక్కువగా ఉన్న భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటున్నాయి. ఉబ్బసం, జలుబు తదితర వ్యాధులున్నవారు చలితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పట్టణాల్లో ఫుట్పాత్లపై వ్యాపారం చేసేవారు సాయంత్రం వరకే ఇళ్లకు పయనమవుతున్నారు. ఊటీని తలపిస్తున్న రహదారులు.. గత నాలుగు రోజులుగా చలి విపరీతంగా ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఉదయమే పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ఇక జిల్లాలోని పలు రహదారులను మంచు కమ్మేయడంతో ఊటీని తలపించేలా ఉన్నాయి. అత్యవసరమైన వారు ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో రగ్గులు, స్వెటర్ల విక్రయాలు ఊపందుతున్నాయి. చలి తీవ్రత మరింతగా పెరిగిందని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.జిల్లాలో కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు -
కొలువుల కోట!
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్థిక స్థోమత కారణంగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగలేక ఇబ్బంది పడుతున్న వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆశాదీపంగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల చీకట్లను అధిగమించి ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలనే తపనతో ఉన్న యువతీ, యువకులకు విజయాల చిరునామాగా మారింది. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మంది ఉద్యోగాలు సాధిస్తూ తమ కలను సాకారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగ ఫలితాల్లో బీసీ స్టడీ సర్కిల్ నుంచి శిక్షణ తీసుకున్న వారు ముందు వరుసలో నిలుస్తుండడంతో నానాటికీ తాకిడి పెరుగుతోంది. అధికారుల ప్రత్యేక చొరవ బీసీ స్టడీ సర్కిల్లో నిరుద్యోగ అభ్యర్థుల కోసం శిక్షణ, సదుపాయాలు కల్పించడంలో అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించడమే కాక అధికారులతో నిరంతరం చర్చిస్తున్నారు. ఇదే సమయాన కలెక్టర్ సౌకర్యాల కల్పనకే పరిమితం కాకుండా అభ్యర్థులకు మార్గదర్శిగా నిలుస్తుండడం వారికి ఉపయోగపడుతోంది. విజయాల వెల్లువ కొద్దినెలలుగా నిర్వహిస్తున్న గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగ పరీక్షలతో పాటు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, డీఎస్సీ, గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల్లోనూ ఇక్కడ శిక్షణ తీసుకున్న వారు సత్తా చాటారు. ఒకప్పుడు ఇక్కడ శిక్షణ తీసుకునే వారు వేళ్లపై లెక్కించే సంఖ్యలో ఉండగా, ఇప్పుడు అధికారులపై నమ్మకంతో బారులు దీరుతున్నారు. అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు శ్రద్ధ వహిస్తుండడంతో గత రెండేళ్లలో దాదాపు 150 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఇందులో చాలామంది పేదలే ఉండడంతో ఉద్యోగాల సాధనతో వారి తలరాతలు మారుతున్నాయని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అండగా ఉంటున్న బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్రంలోనే రోల్ మోడల్గా నిలుస్తోందని చెబుతున్నారు.ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా బీసీ స్టడీ సర్కిల్లో సదుపాయాలు కల్పించారు. పోటీ పరీక్షల కోసం మార్కెట్లోని ప్రతీ పుస్తకాన్ని సమకూర్చడమే కాక అభ్యర్థులు రోజంతా చదువుకునేలా రీడింగ్ రూమ్స్, విశాలమైన హాళ్లు ఏర్పాటు చేశారు. అంతేకాక పరీక్షా విధానంపై అవగాహన కల్పించేందుకు ఆన్లైన్ టెస్ట్లు, వీడియో తరగతుల సదుపాయం కల్పించారు. రాష్ట్రంలోనే పేరున్న సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తుండడమే కాక స్టడీ మెటీరియల్ సమకూరుస్తూ ఉపకార వేతనం అందిస్తున్నారు.బీసీ స్టడీ సర్కిల్ శిక్షణతో ప్రతిభ -
ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
చర్ల: పేద, బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో నుంచే కమ్యూనిస్టు పార్టీ పుట్టుకొచ్చిందని, ఉద్యమాలతోనే ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో చర్ల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రచార జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరగిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ వందేళ్ల ప్రస్థానంలో అనేక సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడి విజయం సాధించామని, గిరిజనులు, దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరావు, నాయకులు అడ్డగర్ల తాతాజీ, కోటి ముత్యాలరావు, చల్లా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీపీఐ ప్రజార జాతాకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్, నాయకులు బండారు రామకృష్ణ, భాస్కర్రావు, మురళి సంఘీభావం తెలిపారు. ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులే.. దుమ్ముగూడెం : ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. చర్లలో ప్రారంభమైన జీపు జాతా దుమ్ముగూడెం చేరగా.. అక్కడి సభలో ఆయన మాట్లాడారు. దుమ్ముగూడెం మండలంలో అమరుల త్యాగాలతో వందల ఎకరాల భూములను పేద గిరిజనులకు పంచిన ఘనత కమ్యూనిస్టులదేనని అన్నారు. ఖమ్మంలో జరిగే పార్టీ శత వసంతాల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పుల్లారెడ్డి, నున్నా లక్ష్మీకుమార్, బొల్లోజు వేణు, తాటిపూడి రమేష్, నోముల రామిరెడ్డి, గొంది నాగేశ్వరరావు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ -
పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా యాగశాలలోకి తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ అనంతరం హోమం చేసి, చివరకు పూర్ణహుతి జరిపించారు. హోమంలో పాల్గొన్న 17 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. వాహనాల ఫిట్నెస్పై దృష్టి పెట్టాలిసూపర్బజార్(కొత్తగూడెం): పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరలించే వాహనాల ఫిట్నెస్పై దృష్టి సారించాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థులను తరలించే వాహనాల విషయంలో నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్బీ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు సీహెచ్ శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, ఎంవీఐలు వి.వెంకటరమణ, డి.మనోహర్, ఏవీఎంఐ ఫారూక్, రాజశేఖర్ రెడ్డి, అశోక్, రాకేష్, శ్వేత, మానస పాల్గొన్నారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా ఉండొద్దుపాల్వంచరూరల్ : అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్ మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా ఉండొద్దని జిల్లా అటవీ శాఖాధికారి జి.కృష్ణాగౌడ్ అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని అభయారణ్యంలోని చాతకొండ రేంజ్ గుండాలమడుగులోని ప్లాంటేషన్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు చనిపోకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బి.బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా నదీ హారతి
భద్రాచలం : ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఏరు – ది రివర్ ఫెస్టివల్’లో భాగంగా భద్రాచలంలో గోదావరి మాతకు శనివారం నదీ హారతి సమర్పించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా.. వేడుకకు హాజరైన కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. నదీ సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల కోరిక మేరకు ఇకపై ప్రతీ శనివారం భద్రాచలం గోదావరి తీరంలో నదీహారతి కొనసాగుతుందని, భక్తులు భారీగా హాజరు కావాలని కోరారు. రామయ్యకు రాపత్తు సేవ.. ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రామయ్యకు వైభవంగా రాపత్తు సేవ నిర్వహించారు. తాతగుడి సెంటర్లోని గోవిందరాజ స్వామి రామయ్యకు ఆతిథ్యం ఇచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణలు, కోలోటాల నడుమ తీసుకొచ్చి గోవిందరాజ స్వామి ఆలయంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం హారతిని సమర్పించారు. భక్తులు దారిపొడవునా స్వామి వారికి ఘనంగా స్వాగతం పలికారు. వైభవంగా సువర్ణ తులసీ అర్చన దేవస్థానంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రక్తంగా నిర్వహించారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన రాజకుమార్, శోభారాణి దంపతులు రూ. 1,11,116, విజయవాడకు చెందిన సుబ్బారావు, ఝాన్సీలక్ష్మి రూ.1,01,116 విరాళాలను శనివారం అందజేశారు. వారికి ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు రసీదును ఇచ్చారు.రామయ్యకు గోవింద మండపంలో రాపత్తు సేవ -
హాహాకారాలు.. ఆర్తనాదాలు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామశివారు ఎర్రమ్మగుడి సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి వంతెన వద్ద పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తాపడింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల విద్యార్థులతో మణుగూరు నుంచి బయలుదేరిన బస్సు మొండికుంట గ్రామం దాటాక అటవీ ప్రాంతంలో బస్సు స్టీరింగ్ సక్రమంగా పనిచేయక అదుపు తప్పి వాగు, వంతెన పక్కకు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో 40 మందికిపైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి చేతులు విరిగాయి. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. సీఐ అశోక్రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు గాయాలతో భద్రాచలం ఏరియా వచ్చారని, ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు తెలిపారు. కాగా విద్యార్థులంతా డిప్లొమా, బీటెక్ కోర్సులు చదువుతున్నారు. చేయి ఇరుక్కుని విలవిల్లాడిన విద్యార్థి బోల్తా పడిన బస్సులో మణుగూరుకు చెందిన డిప్లొమా విద్యార్థి అంబికా చేయి బస్సులో ఇరుక్కుని విలవిలలాడింది. 30 నిమిషాలకు పైగా విద్యార్థి బస్సులో ఉండిపోయింది. చేయి నొప్పితో విద్యార్థి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. జేసీబీల సహాయంతో పోలీసులు, స్థానికులు విద్యార్థినిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. తప్పిన పెను ప్రమాదం మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఎర్రమ్మగుడి సమీపంలో వంతెన వద్ద బస్సు బోల్తా పడింది. రెప్పపాటులో బస్సు వాగులో బోల్తాపడేది. బస్సువాగులో బోల్తా పడితే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం ఉండేది. వాగును చూసిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు పిల్లలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బయ్యారం, మణుగూరు, అశ్వాపురం తదితర ప్రాంతాల నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. గాయాలైన విద్యార్థులను చూసి తల్లిడిల్లిపోయారు. స్థానికుల సహాయక చర్యలు పోలీసులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్థానికులు జేసీబీలు తెప్పించి బస్సులో ఇరుక్కున్న విద్యార్థినిని రక్షించారు. పోలీసుల సేవలను స్థానికులు శభాష్ అంటున్నారు. ఎమ్మెల్యే పాయం దిగ్బ్రాంతి ప్రమాదంపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్నారు. భద్రాచలం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే ఖమ్మం, హైదరాబాద్ తరలించాలని, విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇద్దరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు భద్రాచలంటౌన్: ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. మొత్తం 36 మంది విద్యార్థులు గాయపడగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెబుతున్నారు. వీరిలో స్పందన, హిర్మాయి, పూర్ణిమ ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో అంబిక చేయి నుజ్జునుజ్జయి రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, బస్సు క్లీనర్ నర్సింహరావుకు ఛాతీ ఎముక విరగడంతో శస్త్రచికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి ఆర్ఎంఓ రాజశేఖర్రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య పరామర్శించారు. మా బస్సు ఇది కాదు. రోజు ఈ బస్సు రాదు. అప్పుడప్పుడు వస్తుంది. ఈ బస్సు సమస్య ఉందని ఎప్పటి నుంచో అంటున్నారు. బస్సు స్టీరింగ్ స్టక్ అయి ప్రమాదం జరిగింది. బస్సులో 40 మందికి పైగా ఉన్నాం. – కృష్ణమనోహర్, విద్యార్థిబస్సు ఫిట్నెస్ లేకనే ప్రమాదం జరిగింది. సరైన బస్సులు నడపక కళాశాల యాజమాన్యం మా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజులు రూ. లక్షల్లో వసూలు చేస్తూ బస్సులను పట్టించుకోవడం లేదు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, విద్యార్థి తండ్రిబస్ ఫిట్నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైన బస్సు కావడంతో స్టీరింగ్ స్టక్ అయి ప్రమాదం జరిగినట్టు సమాచారం. కళాశాల యాజమాన్యం స్టీరింగ్ కూడా సక్రమంగా లేని బస్సుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కళాశాల యాజమాన్యం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈవీఎం గోదాం తనిఖీసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదాం పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించరాదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. టెట్ కేంద్రాల వద్ద అమలులో ఆంక్షలు సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో శనివారం నుంచి టెట్ మొదలవుతున్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7–30నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందని ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని, సభలు, ర్యాలీలు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. అలాగే, పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. కాగా, పరీక్ష సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. కొబ్బరి సాగుదారులకు రాయితీ పెంపుఅభివృద్ధి బోర్డు డీడీ డాక్టర్ మంజునాథ్ రెడ్డి అశ్వారావుపేటరూరల్: కొబ్బరి సాగుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రాయితీలు పెంచిందని, ఈ రాయితీలు పొందాలంటే తోటలకు జియో ట్యాగ్ తప్పనిసరి చేసిందని సీడీబీ(కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేటలోని రైతు కాసాని పద్మ శేఖర్ గార్డెన్లో సాగుదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి సాగు ఆశించిన స్థాయిలో లేదని, సాగుదారులు పెరిగితేనే స్థానికంగా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీ రఘుతన్, డీవో శరత్, హెచ్ఈవో ఈశ్వర్, రైతులు తలశిల ప్రసాద్, కొక్కెరపాటి పుల్లయ్య, తుమ్మా రాంబాబు, తుంబూరు మహేశ్వరరావు, ఆళ్ల నాగేశ్వరరావు, పీ ఆదినారాయణ, శీమకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
యాష్ సొసైటీల కొట్లాట..
● సిండికేట్ కావాలంటూ సొసైటీలపై ఒత్తిడి ● తరచుగా గొడవలు.. పోలీసులకు ఫిర్యాదుపాల్వంచ: కేటీపీఎస్ కర్మాగారంలో అత్యధిక బూడిద నిల్వలు ఉండటంతో వాటిని బయటకు పంపించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. స్థానికంగా 110 మంది గిరిజన సొసైటీ సభ్యులకు బూడిద తరలించేందుకు అనుమతులు ఇవ్వడంతో వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా ఎవరికి వారు కాకుండా సిండికేట్ కావాలంటూ కొందరు, మిగితావారిపై ఒత్తిడి తేవడం, అడ్డుకోవడం, గొడవలకు దిగడం, లారీలను ఆపడం, పుస్తకాలు, స్లిప్పులను గుంజు కుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వర్గాలుగా మారి గొడవలు పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. రోజువారీగా డయల్ 100కు అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు. సిండికేట్కు సహకరించడం లేదని.. కేటీపీఎస్ 5, 6, 7 దశల కర్మాగారంలో ఉన్న బూ డిద తరలింపు కోసం సొసైటీలు అన్ని సుమారు 20 కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. వీరందినీ సిండికేట్ అయి ధర పెంచి అమ్ముకునేందుకు కొందరు వ్యక్తు లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం జెన్కో సంస్థ టన్ను రూ.50 ధర చొప్పున అందిస్తుండగా, నిర్వాహకులు రూ.30 కలపడంతో రూ.80 అవుతుంది. ఇక దీని ధర మార్కెట్లో రూ.200 వరకు అమ్ముతున్నారు. అయితే సిండికేట్ అయి ధరను పెంచి అమ్మాలనే విషయంపై వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. సిండికేట్ అయితే ఇప్పటి వరకు ఈ బూడిదపై ఆధారపడి ఉన్న అనేక మంది నష్టపోయే అవకాశం ఉంది. ఘర్షణలకు దిగుతున్న వారిపై చర్యలు శూన్యం అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను యాష్ పాండ్ల వద్ద, గేటుల వద్ద గంటల తరబడి అడ్డుకుని, ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పుస్తకాలు లాక్కుని, ఘర్షణలకు దిగు తున్నా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అనేక మంది వర్గాలవారీగా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసుకున్నారు. ఇక లారీలు యాష్ పాండ్లకు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. ఇక కర్మాగారంలో వందలాది ఎకరాల స్థలం ఉన్నా వచ్చే లారీలకు పార్కింగ్ స్థలం చూపించడం లేదు. దీంతో అల్లూరి సెంటర్ నుంచి కరకవాగు వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు పక్కనే నిలుపుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లారీలపై సరైన పట్టాలు కప్పక పోవడంతో గాలికి బూడిద అధికంగా స్థానికులపై, ఇతర వాహనదారులపై పడుతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్రావును వివ రణ కోరగా సమస్య తన దృష్టికి రాలేదన్నారు. -
పురుషోత్తపట్నంలో రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారికి వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు సేవలు వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచలం రామయ్యకు శుక్రవారం ఏపీలోని పురుషోత్తపట్నంలో రాపత్తు సేవ జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణ నడుమ వేడుకగా గ్రామానికి తీసుకెళ్లారు. దమ్మక్క స్వగ్రామమైన పురుషోత్తపట్నంవాసులు కోలాటాలుతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వర్ణకవచాలతో మూలమూర్తుల దర్శనం దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. నిత్యకల్యాణం నిమిత్తం బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతర్వాత కల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతీ శనివారం భద్రగిరిలో నదీ హారతిసూపర్బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో శనివారం సాయంత్రం గోదావరి నదీహారతి నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. గోదావరి నది అనేక సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ‘ఏరు – ది రివర్ ఫెస్టివల్’లో భాగంగా ప్రారంభించిన నదీ హారతి కార్యక్రమాన్ని ప్రతీ శనివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదావరి నది ఔన్నత్యాన్ని ప్రజలకు మరింతగా తెలియజేయడం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహించేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని కలెక్టర్ ఓ ప్రకటనలో కోరారు. స్వర్ణకవచాలతో శ్రీసీతారామ చంద్రస్వామివారి దర్శనం -
యూరియా అధిక ధరకు విక్రయించొద్దు
టేకులపల్లి: యూరియా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని బేతంపూడి సొసైటీ వద్ద యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం రైతులు, విలేకరులతో మాట్లాడారు. యాసంగిలో 27,273 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 16,161 మెట్రిక్ టన్నులు వచ్చిందని, ప్రస్తుతం 7,186 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని విరించారు. ఇవి జనవరి వరకు సరిపోతాయని అన్నారు. జిల్లాలో 406 కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నామని, టేకులపల్లిలో కౌంటర్లు పెంచుతామని తెలిపారు. ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా ఇస్తామన్నారు. ఏడీఏ జి లాల్చంద్, ఏవో నీరుడు అన్నపూర్ణ, మానిటరింగ్ ఆఫీసర్ ఆనంద్, సీఈవో ప్రేమాచారి, ఏఈవోలు శ్రావణి, విశాల, రమేష్ , సోసైటీ సిబ్బంది వెంకటేశ్వర్లు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): అందరూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్, వైద్య, ఆరోగ్య, తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరులలో ఐదు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. తప్పిపోయిన, కిరాణం షాపులు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న బాల కార్మికులను, వదిలేసిన పిల్లలను, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించాలని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించాలని, లేదా చైల్డ్ కేర్హోమ్కు పంపించాలని అన్నారు. బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తొలుత పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెపెక్టర్ రాము, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, సీడబ్లూసీ సభ్యులు అంబేద్కర్, సాధిక్ పాషా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, డీసీపీఓ హరికుమారి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సందీప్, మాధవరావు, కేఎస్సీఎఫ్ కో–ఆర్డినేటర్ రాజేష్, కమిటీ సభ్యులు షీ టీం ఎస్ఐ రమాదేవి, ఎస్ఐలు విజయ, రాజేష్, సమ్మిరెడ్డి, రాఘవయ్య, లక్ష్మణ్, ఆపరేషన్ స్మైల్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్ రాజ్ -
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్భద్రాచలం: పదో తరగతి విద్యార్థులపై హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లు, హెచ్ఎంలు, వార్డెన్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.స్పెషల్ ఆఫీసర్లు, హెచ్ఎంలు కేటాయించిన పాఠశాలల్లో వారానికి రెండుసార్లు తనిఖీ చేస్తూ ఫొటోలు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అలాగే, ఉద్దీపకం వర్క్బుక్ నిర్వహణ, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అమలుపై సూచనలు చేశారు. కాగా, సర్వారం, ఎలిసిరెడ్డిపల్లి, కమలాపూర్, రేగళ్ల తండా, బొజ్జాయిగూడెం, పాల్వంచ, పాత ఇల్లెందు, గొందిగూడెంతో పాటు ఖమ్మంలోని కొన్ని పాఠశాలల్లో గత ఏడాది పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రానందున ఈసారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పీఓ స్పష్టం చేశారు. తొలుత పీఓ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు డేవిడ్రాజ్, మధుకర్, అశోక్, విజయలక్ష్మి, రమేష్, శ్రీరాములు, సత్యవతి, రాధమ్మ, భారతీదేవి, అలివేలు మంగతాయారు పాల్గొన్నారు. -
ఆయిల్ఫెడ్లో బదిలీలు.. బాధ్యతల స్వీకరణ
అశ్వారావుపేటరూరల్: ఆయిల్ఫెడ్లో పలువురు అధికారులకు బదిలీ కాగా, మరికొందరు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం ఏరియా ఆఫీసర్గా పని చేస్తున్న శంకర్ను మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ నర్సరీ డివిజనల్ మేనేజర్గా నియమించారు. దీంతో ఆయన శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఇన్చార్జి రాధాకృష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో కొంతకాలంగా మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగబాబును దమ్మపేటలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో అప్పారావుపేట ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఎంఎన్ కార్తీక్కు ఇన్చార్జి మేనేజర్ బాధ్యతలు అప్పగించారు. అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న కల్యాణ్ గౌడ్ను ఆయిల్ఫెడ్ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులను తోటి ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
కాలం చెల్లినా.. కాసులే ముఖ్యం
● ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం ● బస్సుల్లో పరిమితికి మించి తీసుకెళ్తున్న వైనం ● తనిఖీల మాటెత్తని రవాణా శాఖఖమ్మంక్రైం: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిబంధనలు పాటించడం లేదు. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టకుండా వాటిలోనే పిల్లలను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అంతేకాక కాసుల కక్కుర్తితో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లాలో 813 స్కూల్ బస్సులు అధికారిక లెక్కల ప్రచారం ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు 813 బస్సులు ఉన్నాయి. ఏటా జూన్కు ముందు ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో వీటిని తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం 764 బస్సులకే ఫిట్నెట్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిసింది. దీంతో మిగిలిన బస్సులను వాడడం లేదా, కాలం చెల్లినా పిల్లలను తరలిస్తున్నారా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. నిబంధనలకు మంగళం పెనుబల్లి మండలం గణేషన్పాడు సమీపాన వివేకానంద విద్యాలయం బస్సు శుక్రవారం బోల్తా పడింది. ఇదేరోజు అశ్వాపురం మండలం మొండికుంట వద్ద కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా కొట్టింది. వివేకానంద విద్యాలయం బస్సు బోల్తా పడిన సమయాన అందులో 107 మంది పిల్లలు ఉండడం గమనార్హం. బస్సు ఫీజు అదనంగా వసూలు చేసే యజమానులు అందుకు సరిపడా బస్సులు సమకూర్చకుండా కొన్నింట్లోనే లెక్కకు మిక్కిలిగా తరలిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు రెండు ఘట నలు జరగడం అటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అధి కారుల నిర్లక్ష్యం తేటతెల్లం చేశాయి. అయితే, కొందరు విద్యాసంస్థల యజమానులు బస్సుల విషయంలో నిబంధనలు పాటించకుండా రాజకీయ నాయకుల పైరవీలతో రవాణాశాఖ అధికారులను మచ్చిక చేసుకుంటున్నారని సమాచారం. కొన్ని బస్సులకు ఫిట్నెస్ లేకపోగా, అనుభ వం లేనిడ్రైవర్లను నియమించడం, వారిలో కొందరు మద్యం మత్తులో వస్తున్నా పట్టించుకోకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోందని చెబుతున్నారు.స్కూల్ బస్సులను ఏటా జూన్కు ముందు రవాణా శాఖ అదికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయడమే కాక ప్రతీనెల ఒకసారి తనిఖీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం తప్ప మిగతా సమయాల్లో అధికారులు తనిఖీల మాటే ఎత్తడం లేదు. ఇక కొందరు డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి కానరావడం లేదు. బస్సు ఫీజు పేరిట వేలాది రూపాయలు వసూలు చేసే యాజమాన్యాలు కక్కుర్తితో ఒకే బస్సులో వంద మంది చొప్పున తరలిస్తుండడంతో అనుకోని ఘటన జరిగితే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశముంది. అయినా, అటు యాజమాన్యాలు.. ఇటు అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో ఉన్న అనాథ మృతదేహానికి అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం జూలూరుపాడులో 75 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందగా, మృతదేహాన్ని కొత్తగూడెం సర్వజన వైద్యశాల మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఎవరూ రాకపోవడంతో అనాజత మృతదేహంగా భావించి అన్నం ఫౌండేషన్ సహకారంతో పోలీసులు కొత్తగూడెం పట్టణంలో దహన సంస్కారాలు నిర్వహించారు. అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది, రామవరం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, హిందూ శ్మశాన వాటిక కాటికాపరి సత్యనారాయణ పాల్గొన్నారు. రోడ్డుపై ఇసుక డంప్.. నిందితులు పరార్దమ్మపేట: ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను మండలంలోని చీపురుగూడెం శివారు డంప్ చేసిన వ్యక్తులు లారీతో సహా పరారయ్యారు. ఎస్సై సాయికిషోర్రెడ్డి కథనం ప్రకారం.. శుక్రవారం ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో చీపురుగూడెం శివారులో కొందరు అడ్డుకుని పోలీసులకు చెబుతామని బెదిరించారు. దీంతో లారీలో ఉన్న వారు అక్కడే ఇసుక డంప్ చేసి లారీతో సహా వెళ్లిపోయారు. ఎస్సై, రెవెన్యూ ఉద్యోగులు చేరుకుని ఇసుక సీజ్ చేయగా, రవాణాకు పాల్పడిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. పేకాట శిబిరంపై దాడిదమ్మపేట: మండలంలోని గుర్వాయిగూడెం శివారులో పేకాట శిబిరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు. నాలుగు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.11,310 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు. మహిళపై కత్తితో దాడిబూర్గంపాడు: భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవను నిలువరించేందుకు వెళ్లిన మహిళపై కత్తితో దాడికి పాల్పడ్డ ఘటన మండల పరిధిలోని ఏదుళ్లచెరువులో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివాసీ గ్రామమైన ఏదుళ్లచెరువు గ్రామానికి చెందిన మడివి రాజు(60) అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. అతని అంత్యక్రియలకు బంధువులైన అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరుకు చెందిన జంపన్న, అతని భార్య ఉమ హాజరయ్యారు. జంపన్న మద్యం మత్తులో భార్యతో గొడవపడుతుండగా, అక్కడే ఉన్న చుక్కమ్మ అనే మహిళ వారించింది. కోపోద్రిక్తుడైన జంపన్న కత్తితో దాడి చేయగా, చుక్కమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణలో మహిళకు గాయాలుదమ్మపేట: కుటుంబ సభ్యుల గొడవను ఆపే ప్రయత్నంలో తోపులాట జరిగి, ఓ మహిళకు శుక్రవారం తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని చీపురుగూడెం గ్రామ సమీప కొత్తూరు కాలనీకి చెందిన బేతిని దుర్గాదేవి అలియాస్ తిరుపతమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. గురువారం అర్ధరాత్రి గ్రామంలో దుర్గాదేవి తండ్రి, సోదరి కుటుంబ సమస్యల కారణంగా గొడవ పడుతున్నారు. గొడవను ఆపేందుకు వెళ్లిన దుర్గాదేవిని తండ్రి నెట్టివేయడంతో పక్కనే ఉన్న సైడ్ డ్రెయినేజీలో పడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో శుక్రవారం ఉదయం 108 అంబులెన్స్ ద్వారా దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒడిశా వాసి మృతి ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుర్రాలపాడు వద్ద కారు ఢీకొన్న ఘటనలో రబీంద్ర డాకువా(46) మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పతార్పంజికి చెందిన డాకువా గుర్రాలపాడులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లోకి సరుకులు తీసురావడానికి వెళ్తూ రోడ్డు దాడుతుండగా వెంకటగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల, కాళ్లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఆయన బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
ప్రతీ ఇంటిని గ్రంథాలయంగా మార్చండి
ఇల్లెందు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా మార్చేందుకు ప్రతీ ఇంటిని గ్రంథాలయంగా మార్చాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని మాంటిస్సోరి స్కూల్ 33వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పారు. పిల్లల ఉన్నతిలో తల్లిదండ్రులు కూడా తమ పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాంటిస్సోరీ స్కూల్ చైర్మన్ జోష్ నెడుంతుండమ్, దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎంఈఓ ఉమాశంకర్, సుధాకర్ రెడ్డి, శివప్రసాద్, టి. ప్రసాద్, డాక్టర్ టి.సుధాకర్, వేముల రాజు తదితరులు పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ ●రూ.15లక్షలకు పైగా విలువైన బంగారం, నగదు అపహరణ రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం కోయచలకలో శుక్రవారం ఉదయం చోరీజరిగింది. మహిళా కానిస్టేబుల్ విధులకు వెళ్తుండగా ఆమెను బస్సు ఎక్కించేందుకు భర్త కూడా వెళ్లగా తిరిగొచ్చే సరికి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు ను చోరీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ తెలబోయిన పూజిత ఇల్లెందులో విధులు నిర్వర్తిస్తుండగా శుక్రవారం ఉదయం ఆమెను కోయచలక క్రాస్ వద్ద దింపడానికి భర్త రాంబాబు వెళ్లాడు. బస్సు ఎక్కించాక పొలం పనులు చూసుకుని రాంబాబు వచ్చేసరికి ఇంటి వెనక తలుపు పగలగొట్టి ఉంది. లోపల పరిశీలించగా బీరువాలోని 13 తులా ల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అయితే, పూజిత దంపతులు బయటకు వెళ్తున్నట్లు గుర్తించి కాపుకాసిన నిందితులు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న రఘునాథపాలెం, సీసీఎస్ సీఐలు ఉస్మాన్ షరీఫ్, రాజు, ఎస్ఐ వి.శ్రీనివాస్ క్లూస్స్ టీంతో చేరుకుని విచారణ చేపట్టారు. సమాజ సేవ అందరి బాధ్యత రఘునాథపాలెం/చింతకాని/తిరుమలాయపాలెం: సమాజ సేవను అందరూ బాధ్యతగా భావించాలని, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఇందులో కీలకంగా వ్యవహరించాలని కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్సీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సూచించారు. రఘునాథపాలెం మండలం రేగులచలకలో ఎంజేపీటీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శీతాకాల శిబిరం శుక్రవారం ముగియగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు, ఆర్సీఓ సీ.హెచ్.రాంబాబు, సర్పంచ్ యండపల్లి రమాదేవి సత్యం, అధ్యాపకులు డాక్టర్ ఎన్.స్వాతి, సునీత, వినీల, అనిత, హుస్సేనితో పాటు నున్నా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, చింతకాని మండలం తిరుమలాపురంలో నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన, తిరుమలాయపాలెంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యూనిట్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శీతాకాల శిబిరాలను నారాయణ ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్లో చేరడం ద్వారా విద్యార్థులకు సమాజ సేవ, సమస్యలపై అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. ఈకార్యక్రమాల్లో డీఐఈఓ రవిబాబు, ఎన్ఎస్ఎస్ జిల్లా పీఓ డాక్టర్ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు మల్లయ్య, చాపలమడుగు వీరబాబు, నాగమణి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గురువారం జరిగిన రాష్ట్ర క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా నుంచి 19మంది పాల్గొన్నారు. మహిళల 10 కిలోమీటర్లు పరుగుపందెం విభాగంలో 25 పాయింట్లు సాధించి చాంపియన్షిప్ గెలుపొందారు. పాల్వంచకు చెందిన ఉషారాణి, హర్షిత, శ్యామల, అంకంపాలేనికి చెందిన టబు మొదటి 10 స్థానాల్లో మెరుగైనన ఫలితాలు సాధించి చాంపియన్షిప్ను కై వసం చేసుకున్నారు. భద్రాచలానికి చెందిన సరిత, కాచనపల్లికి చెందిన దుర్గ 2 కిలోమీటర్లు పరుగుపందెంలో మూడు, ఐదో స్థానాలు సాధించారు. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె మహీధర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. విజేతలతోపాటు కోచ్ నాగేందర్, యర్రయ్య, నాగరాజు, శివలను జిల్లా క్రీడాధికారి ఎం.పరంధామరెడ్డి, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె సారంగపాణి, జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు జి.రాధాకృష్ణ, జాతీయ కోచ్ నాగపురి రమేష్, స్పోర్ట్స్ అథారిటీ కోచ్ శ్రీనివాస్ అభినందించారు. -
కేంద్రపాలిత ప్రాంతంతో టూరిజం అభివృద్ధి
భద్రాచలం: పోలవరం ప్రాజెక్ట్తో ముంపునకు గురయ్యే భద్రాచలం, ఇతర పరిసర ప్రాంతాలను కేంద్రం పాలిత ప్రాంతంగా మార్చాలని, తద్వారా టూరిజం అభివృద్ధి జరుగుతుందని అంతర్జాతయ గాంధీ పథం కన్వీనర్, భద్రాచలం ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్రెడ్డి అన్నారు. భద్రాచలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఊరూరా ఉద్యమంలా సంతకాల సేకరణ జరిపి, సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో మహాత్మాగాంధీకి గౌరవం దక్కుతుండగా.. కేంద్రప్రభుత్వం మాత్రం ఆయనను అవమానించేలా ఉపాధి హామీ పథకానికి పేరు తొలగించటం గర్హనీయమని పేర్నొన్నారు. దీనిపై జిల్లాల అఽధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ సీఎం రేవంత్రెడ్డికి బాసటగా నిలుస్తామని చెప్పారు. గాంధీ పథం కన్వీనర్ బూసిరెడ్డి శంకర్రెడ్డి -
మరో అగ్రనేత లొంగుబాటు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) బెటాలియన్ నంబర్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు వార్తలు హల్చల్ చేస్తుండగానే, మరో అగ్రనేత సైతం లొంగుబాటలో ఉన్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గతేడాది మే 21న మావోయిస్టు పార్టీ చీఫ్ సెక్రటరీ నంబాల మరణం తర్వాత కీలక మావోయిస్టు నేతలు దండకారణ్యం వదిలిపెట్టారు. దండకారణ్యం చుట్టూ విస్తరించిన తెలంగాణ, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అగ్రనేతలు రహస్య జీవితం గడుపుతున్నట్టు తెలుస్తోంది.నవంబర్లో హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అప్పటి నుంచి తెలంగాణ–ఛత్తీస్గఢ్తో సరిహద్దులు పంచుకుంటున్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల అడవుల్లో మావోయిస్టు కీలక నేతలు తలదాచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టే తెలంగాణలో షెల్ట ర్ తీసుకున్న ఓ కీలక నేత తన అభిప్రాయాలు, డిమాండ్లను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ఓ యూట్యూబర్ను తమ స్థావరానికి పిలిపించారని సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సదరు యూ ట్యూబర్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయాన తన చానల్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఎవరా నేత ? హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్టు రెండు వారాల పాటు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన క్షేమంగానే ఉన్నాడని పార్టీ ప్రకటించింది. అప్పటి నుంచి జార్ఖండ్లోని ఓ రహస్య ప్రాంతంలో తిరుపతి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే, శాంతిచర్చలు–లొంగుబాట్ల సమయంలో కీలక సమాచారం బయటి ప్రపంచానికి తెలిపిన యూట్యూబర్ ఇప్పుడు తెలంగాణలో కీలక నేతను కలుసుకునేందుకు వచ్చినట్టు ప్రకటించడంతో ఆ కీలక నేత తిరుపతేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తిరుపతి కానీ పక్షంలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి నేతృత్వం వహిస్తున్న దామోదర్ అయి ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరు కాకపోతే లొంగుబాటుకు ముందే బర్సె దేవా తన సేఫ్టీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అయి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తలదాచుకుంటున్న సదరు కీలక నేత ఎవరనే అంశం ఒకటి, రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది. సంధానకర్తలుగా గతేడాది ఏప్రిల్లో శాంతిచర్చల ప్రక్రియ తెరపైకి వచ్చినప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ‘బస్తర్ టాకీస్’అనే యూట్యూబ్ చానల్కు ఇంటరూయ్వ ఇచ్చారు. ఆ తర్వాత 210 మంది కేడర్తో ఆయుధాలతో సహా ఆయన లొంగిపోయారు. ఇటీవల ఎంఎంసీ జోనల్ సభ్యుడు అనంత్ మరో యూట్యూబ్ చానల్ ద్వారా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక ఇంటర్నెట్ యాక్సెస్ కీలకంగా మారింది.దీంతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులకు అనుసంధానకర్తలుగా యూట్యూబ్ చానళ్లు మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్తర్ టాకీస్కు చెందిన వికాస్ తివారి.. తెలంగాణలోకి వచ్చారు. దట్టమైన అడవిలో ఓ రహస్య ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతతో సమావేశమయ్యారు. మార్గమధ్యలో బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవా తన జంబో టీమ్తో బస చేసిన ప్రాంతం, వంటలు చేసుకున్న ప్రదేశాలను వీడియోలో చూపించాడు. వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిన మూడు రోజుల తర్వాత ఆ ప్రదేశాన్ని మావోయిస్టులు బహిర్గతం చేశారు. -
యాప్లతో అవస్థలు
బూర్గంపాడు: పంటల సాగులో సాంకేతిక పద్ధతులు అవలంబించినా, లేకున్నా పత్తి అమ్మకాలకు, ఎరువుల కొనుగోళ్లకు మాత్రం యాప్లను తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి నెలకొంది. సీసీఐలో మద్దతు ధరకు పత్తి కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ అమల్లోకి తెచ్చింది. రైతులు వ్యతిరేకించినా తప్పనిసరి చేసింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం యూరియా అమ్మకాలకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తెచ్చింది. ఫలితంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులందరికీ స్మార్ట్ ఫోన్లు లేకపోవటం, మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ లేకపోవటం, రైతుల పట్టాదారు పాసుపుస్తకాలకు, ఆధార్కార్డులను, ఫోన్ నంబర్లకు అనుసంధానం కాకపోవడంతో ఓటీపీ సమస్యగా మారింది. చదువు రాని రైతులు, నాలుగైదు తరగతులు చదివిన రైతులకు యాప్ను వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఓటీపీలు చెప్పటం, స్లాట్ బుకింగ్కు ఇతరులపై ఆధారపడాల్సివస్తోంది. పత్తికి కపాస్ యాప్.. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. రైతులు పత్తి మద్దతు ధరకు పత్తి విక్రయించాలంటే స్మార్ట్ ఫోన్లో కపాస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. తొలుత ఎకరాకు ఏడు క్వింటాళ్లకు మాత్రమే అనుమతినిచ్చారు. రైతుల ఆందోళనతో పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచారు. ముందుగా రైతులు వ్యవసాయశాఖ అధికారులను కలిసి యాప్నకు సంబంధించి ఓటీపీలు తెలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో చేసుకోవాలి. అందరికీ స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, గ్రామాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో ఈ ప్రక్రియకు ప్రతిబంధకంగా మారింది. పలుమార్లు యాప్లో లాగిన్ అయినా సిగ్నల్స్ సమస్య తలెత్తుతోంది. దీంతో విసిగిపోతున్న రైతులు సీసీఐకి వెళ్లకుండా తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారు. క్వింటాకు రూ.వేయి నుంచి రూ.1,500 వరకు నష్టపోతున్నారు.వానాకాలం తరహాలో రైతులకు యూరియా కోసం ఇక్కట్లు పడకుండా యాసంగి సీజన్లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. యాప్ను స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని యూరియా కోసం బుకింగ్ చేసుకోవాలి. జిల్లాలో ఈ యాప్ పనిచేయటం లేదు. యూరియా బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే ‘మీ జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ కిందకు రాదు’అని సూచిస్తోంది. దీంతో రైతులు మళ్లీ పీఏసీఎస్ గోదాంలకు, ఫెర్టిలైజర్ షాపులకు క్యూ కడుతున్నారు. వ్యాపారుల వద్ద ఎక్కువ ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పత్తి అమ్మకాలకు కపాస్ కిసాన్ యాప్ -
పెద్దమ్మను హత్య చేసిన రౌడీషీటర్
ఖమ్మంక్రైం: భూతగాదాల్లో సొంత పెద్దమ్మను ఓ రౌడీషీటర్ నడిరోడ్డుపై హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బొక్కలగడ్డలో గురువారం ఈ ఘటన చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంనకు చెందిన మోటె రాములమ్మ(70) కుటుంబం బతుకుదెరువు కోసం ఏళ్ల క్రితం ఖమ్మం వచ్చి బొక్కలగడ్డలో నివాసం ఉంటోంది. ఆమె భర్త యాదగిరి మృతి చెందాక కూలీ పనులు చేసుకుంటూ కుమారుడు నర్సింహారావుతో జీవిస్తోంది. ఆమె భర్త, ఆయన సోదరులకు సంబంధించి స్వగ్రామంలో ఐదెకరాల పొలం ఉండగా ఇంకా పంచుకోలేదు. ఆ భూమిని రాములమ్మ గ్రామంలో ఉంటున్న కుమార్తె పేరిట రిజిస్టర్ చేశాక గొడవలు మొదలయ్యాయి. పెద్దమనుషులు బుధవారం మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేవరకు పొలాన్ని దున్నవద్దని చెప్పారు. అయినా రాములమ్మ కుమార్తె దున్నిస్తోందనే సమాచారంతో ఖమ్మం వెంకటేశ్వరనగర్లో జీవిస్తున్న రాములమ్మ మరిది కుమారుడు మోటె శేఖర్ పెద్దమ్మ ఇంటికి రాగా, ఆ సమయంలో ఆమె కుమారుడు పనికి వెళ్లాడు. ఈక్రమాన వాదన పెరగడంతో ఆరుబయట మిర్చి తొడిమలు తీస్తున్న రాములమ్మ ఊపిరితిత్తులపై శేఖర్ కత్తితో పొడవడంతో సమీపంలోని మహేష్ అనే వ్యక్తి రాగా ఆయనపైనా దాడి చేశాడు. ఘటనలో తీవ్రగాయాలతో రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందగా శేఖర్ పారిపోయాడు. కాగా, జులాయిగా తిరిగే శేఖర్పై ఖమ్మం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో రౌడీషీట్తో పాటు పలు కేసులు నమోదయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ మోహన్బాబు, ఎస్ఐ కొండలు చేరుకుని రాములమ్మ మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. మృతురాలి కుమారుడు నర్సింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా,నిందితుడు శేఖర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. భూమి పంపకంలో తగాదాలే కారణం -
నెలల వారీగా మద్యం అమ్మకాలు
నెల అమ్మకాలు (రూ.కోట్లలో) జనవరి 201ఫిబ్రవరి 181మార్చి 201ఏప్రిల్ 167మే 208జూన్ 214జూలై 168ఆగస్టు 182సెప్టెంబర్ 185అక్టోబర్ 118నవంబర్ 149డిసెంబర్ 264మొత్తం 2,238 -
పిల్లలు, అత్త దూరమై ఆవేదన
తల్లాడ: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు మృతి చెందారు.. అదే ఘటనలో అత్త, మరో బంధువు మృతి చెంది ఎనిమిది నెలలు దాటినా వారి జ్ఞాపకాలను మరిచిపోలేని వివాహిత తరచూ కన్నీరుమున్నీరయ్యేది. అదే ఆవేదనతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా ఆ కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయిన ఘటన ఇది. గత ఏడాది ఏప్రిల్ 29న తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ఘటనలో వినోద్ – రేవతి(30) దంపతుల కవల కుమారులు వరుణ్, తరుణ్ తేజ్, వినోద్ తల్లి సుశీల, మేనకోడలు మృతి చెందారు. అప్పటి నుంచి వినోద్ భార్య రేవతి మానసికంగా కుంగిపోయి తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఇద్దరు పిల్లలే కాక అత్త, మరొకరు మృతితో మనోవేదనకు గురవుతున్న ఆమె డిసెంబర్ 22న ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొంది. ఆ సమయాన ఇంటి ముందు ఉన్న వినోద్ అనుమానంతో తలుపు నెట్టగా రాకపోవటంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి అప్పటికే అపస్మారక స్థితికి చేరిన రేవతిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేక పరిస్థితి విషమించడంతో రేవతి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు.జ్ఞాపకాలు మరిచిపోలేక వివాహిత ఆత్మహత్య -
వైభవంగా రాపత్తు సేవ
గోవిందరాజస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు భద్రాచలం : శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి గోకుల మండపంలోని శ్రీకృష్ణాలయంలో గురువారం వైభవంగా రాపత్తు సేవ నిర్వహించారు. తొలుత మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ రామయ్యను తాతగుడి సెంటర్లోని గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించగా.. భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. మూలమూర్తులకు అభిషేకం.. దేవస్థానంలో మూలమూర్తులకు అభిషేకం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, నూతన సంవత్సరం కావడంతో భక్తులు స్వామి వారిని భారీగా దర్శించుకున్నారు. పెరిగిన భక్తుల రాక ప్రతి ఏడాది శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 2024లో డిసెంబర్లో 2.43 లక్షల మంది దర్శించుకోగా 2025 డిసెంబర్లో ఆ సంఖ్య 2.70 లక్షలుగా నమోదు కావడం విశేషం. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వేభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని సూచించారు. స్వల్పంగా పెరిగిన పామాయిల్ గెలల ధరఅశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల టన్ను ధర స్వల్పంగా పెరగడంతో సాగుదారులకు కొంత ఊరట లభించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని ఆయిల్ఫెడ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పామాయిల్ టన్ను ధరను రూ.19,694గా నిర్ణయించారు. ప్రస్తుతం టన్ను ధర రూ.19,598 ఉండగా, తాజాగా టన్నుకు రూ.96 పెంచినట్లు ఆయిల్ఫెడ్ ఉన్నతాధికారులు తెలిపారు. కిన్నెరసానిలో ‘నూతన’ సందడిపాల్వంచరూరల్ : నూతన సంవత్సరం సందర్భంగా కిన్నెరసానికి గురువారం పర్యాటకులు పోటెత్తారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. మొత్తం 1,170 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.64,245, 400 మంది బోటుషికారు చేయడం ద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థకు రూ.20,670 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలిఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలంటౌన్: గిరిజనుల సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2026లో గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలు మరింతగా మెరుగు పర్చాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం టీఎన్జీవోస్, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడీ అశోక్, ఈఈ మధుకర్, ఆర్సీఓ అరుణకుమారి, ఏడీఎంహెచ్ఓ తుకారం నాయక్, సర్పంచ్ పూనెం కృష్ణదొర పాల్గొన్నారు. గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంచుంచుపల్లి: జిల్లాలోని పలు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2026 – 27 విద్యా సంవత్సరంలో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 22న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. -
సింగరేణిలో ‘నూతన’ వేడుకలు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని చెప్పారు. 2025లో అతి తక్కువ గని ప్రమాదాలు జరిగాయని అన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితోపాటు రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్రమాదరహిత సింగరేణిగా అవతరించాలని ఆకాంక్షించారు. గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ ఎస్.వి.రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం (ఐఎన్టియూసి) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.త్యాగరాజన్ు, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ టి.లక్ష్మీపతిగౌడ్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
రేసులో ఉంటుందా?!
మిగతా మున్సిపాలిటీలతో కలవాలని.. రాష్ట్రంలో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా 10వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వీటితో పాటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై మంత్రి తుమ్మల సూచనలతో మేయర్, ఆ పార్టీ కార్పొరేటర్లు సమావేశం కాగా మెజార్టీ సభ్యులు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని మున్సిపాలిటీలతో కలిపి కేఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ డివిజన్లు కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రికి చేరిన సమాచారం పార్టీలోని మెజార్టీ కార్పొరేటర్లు ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపిన అంశాన్ని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడాక స్పష్టత వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీలో చేరారు. ఈ బలానికి తోడు ప్రభుత్వం అధికారంలో ఉండడం.. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో కార్పొరేషన్ను కై వసం చేసుకోవచ్చనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది మే 7వ తేదీ వరకు పాలకవర్గానికి గడువు ఉన్నా మిగతా మున్సిపాలిటీలతో కలిపి ఎన్నికలకు వెళ్తే పార్టీపరంగా కలిసివస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనందున మంత్రి నిర్ణయం కీలకం కానుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బలాబలాలు మారినా తక్కువే.. గత ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 10, సీపీఎం, సీపీఐ రెండేసి డివిజన్లతో పాటు ఒక డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. తద్వారా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బలాబలాలు మారాయి. మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీకి 31 మంది, బీఆర్ఎస్కు 26 మంది, సీపీఎంకు ఇద్దరు, సీపీఐకి ఒక కార్పొరేటర్ ఉన్నారు. కౌన్సిల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి కాంగ్రెస్కు తోడు సీపీఎం, సీపీఐ సభ్యులు మద్దతు తెలిపినా 34 మందే అవుతారు. కానీ 40 మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా... ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మద్దతు తెలుపుతారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. ఇదంతా వారం రోజుల్లోనే పూర్తిచేయాలన్న భావనతో ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ముందడుగు పడనుంది.ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్లో కసరత్తు కౌన్సిల్ను రద్దు చేయాలన్న తీర్మానాన్ని మెజార్టీ సభ్యులు బలపరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగనుంది. మొత్తం 60 మంది కార్పొరేటర్లలో 40 మంది అంటే 2/3 సభ్యులు తీర్మానానికి అంగీకారం తెలపాలి. ఇందుకోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదా రాతపూర్వక తీర్మానం పై 2/3 వంతు సభ్యులు సంతకాలు చేసి కలెక్టర్కు ఇస్తేఅక్కడి నుంచి ప్రభుత్వానికి చేరుతుంది. ఆపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా కౌన్సిల్ రద్దవుతుంది. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత సంఖ్యా బలం లేనందున తీర్మాన కాపీపై సంతకాలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
కలెక్టర్ జితేష్ వి పాటిల్సూపర్బజార్(కొత్తగూడెం): ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రోడ్డు భద్రతను అందరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లు, ప్లెక్సీలను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్లు పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రతా సందేశాలతో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ వెంకటరమణ, ఆర్టీఏ అధికారి జోషి, ఎంవీఐలు మనోహర్, వెంకట పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గరిమెళ్లపాడు నర్సరీ సందర్శన గరిమెళ్లపాడు నర్సరీని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం సందర్శించారు. 72 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ నర్సరీ అణువణువూ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నర్సరీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన చర్యలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. -
అభివృద్ధికి ప్లాన్ !
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. పూర్తి కాగానే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించనుండగా.. ఆయన ఆమోదిస్తే ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నమూనా, బడ్జెట్, ఇతరత్రా పనులు పూర్తి చేసి ఈ ఏడాది శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నవమికి శంకుస్థాపన? నూతనంగా రూపొందించిన డిజైన్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్తో చర్చించారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అభివృద్ధి నమూనాపై దృష్టి సారించారు. 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించి, పుష్కరాల నాటికి భక్తులకు రామయ్య దర్శనానికి ఆటంకం లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్లాన్ తుదిరూపుపై వేగం పెంచినట్లు తెలుస్తొంది. ప్లాన్ను సీఎం రేవంత్రెడ్డి ఆమోదిస్తే మార్చి 27న శ్రీరామనవమి రోజున ఆయనతోనే శంకుస్థాపన చేయించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా మాఢ వీధుల విస్తరణలో ఇప్పటికే భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించగా, వారికి బ్రిడ్జి సెంటర్లో ఉన్న ఆర్అండ్బీ కార్యాలయ ఖాళీ స్థలాన్ని అప్పగించాల్సి ఉంది. చర్చనీయాంశంగా అర్చకుల వినతి.. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్లాన్ సీఎం రేవంత్రెడ్డి ఫైనల్ చేసే క్రమాన శ్రీ భద్రాచల సీతారామ అర్చక సంఘం పేరిట అర్చకులు వినతిపత్రం అందించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు స్తపతి, ఇతర అధికారుల సలహాలు, సూచనలతో ఆలయ అధికారులు ప్లాన్ రూపొందించారు. దీన్ని మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు ఆమోదించే తరుణాన మరికొన్ని మార్పులను సూచించారు. ప్రధానంగా రెండో ప్రాకారం, దాని నిర్మాణంపై సలహాలు, సూచనలు చేశారు. మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలు గర్భాలయానికి వెనుక, ఉత్తర, దక్షిణ దిక్కులో నిర్మించాలని, ఆలయ ప్రాకారాలకు అవతల ఈశాన్య భాగంలో పుష్కరిణి, లక్ష్మీ అమ్మవారి ఆలయానికి ఎదురుగా ద్వాదశ మండపం, ఆండాళ్ అమ్మవారి ఆలయానికి ఎదురుగా పౌర్ణమి మండపం నిర్మించాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం వినతిపత్రంలో ప్రస్తావించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన డిజైన్ను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దేవాదాయ శాఖకు చెందిన ఆర్కిటెక్ట్ బృందం, స్తపతి, కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఇటీవల పలుమార్లు భద్రాచలం వచ్చి భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ విస్తరణ వంటి పలు పనులను ప్లాన్లో సూచించారు. వైదిక సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. వీటన్నింటి తర్వాత తుది ప్లాన్ను ఇటీవలే కలెక్టర్ ఫైనల్ చేయగా దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు చేరింది. దీనిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అధికారులు, వైదిక సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ప్లాన్పై సమగ్ర అవగాహనకు వచ్చారు. కాగా దేవాదాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం మూడు విడతలుగా రూ.350 కోట్లతో అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిపాదించారు. సీఎం రేవంత్రెడ్డి ఈ ప్లాన్ను ఆమోదిస్తే బడ్జెట్లో నిధుల కేటాయింపు ఇతర అంశాలపై స్పష్టత రానుంది. సిద్ధమైన రామాలయ మాస్టర్ ప్లాన్ నమూనా -
అందుబాటులో ‘ముసాయిదా’
కొత్తగూడెంఅర్బన్/ఇల్లెందు/అశ్వారావుపేటరూరల్ : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో స్థానిక అధికారులు ముసాయిదా ఓటరు జాబితాలోను గురువారం ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధం చేసిన జాబితాలను ప్రజల పరిశీలనార్థం ఆయా కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మహిళా ఓటర్లు 70,503, పురుషులు 64,590, ఇతరులు 30.. మొత్తం 1,35,123 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ సుజాత ప్రకటించారు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే తమకు అందజేయాలని సూచించారు. నిబంధనల మేరకు ఫిర్యాదులను పరిశీలించాక తుది ఓటరు జాబితాలు విడుదల చేస్తామని చెప్పారు. కొత్తగూడెం కార్పొరేషన్ నూతనంగా ఏర్పడిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లు పెరిగే అవకాశం ఉన్నందున ఆయా కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా ప్రకటించడం లేదని వెల్లడించారు. ఇల్లెందులో 33,777 మంది.. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 33,777 మంది ఓటర్లు ఉన్నారని కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. మొత్తం 24 వార్డులకు గాను ఒక్కో చోట అత్యధికంగా 1,608 మంది, అతి తక్కువగా 1,232 మంది ఉన్నారని ప్రకటించారు. ఇక మొత్తంగా మహిళా ఓటర్లు 17,523, పురుషులు 16,250, ఇతరులు నలుగురు ఉన్నారని వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని అభ్యంతరాలుంటే తమ దృష్టికి తేవాలని కోరారు. ‘పేట’లో 22 వార్డులు.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్ బానోతు నాగరాజు గురువారం విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు గాను మహిళా ఓటర్లు 8,762 మంది, పురుషులు 8,084, ఇతరులు నలుగురు.. మొత్తం 16,850 మంది ఓటర్లు ఉన్నారని ప్రకటించారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఏరులై పారింది!
● గత ఏడాది రూ.2,238 కోట్ల విలువైన మద్యం సేల్స్ ● అత్యధికంగా డిసెంబర్లో రూ.277 కోట్లు పాల్వంచరూరల్/వైరా : అంతకుముందు ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా 2025లో గణనీయమైన స్థితిలోనే నమోదు కావడం విశేషం. కొత్త ఎకై ్సజ్ పాలసీ డిసెంబర్ 1న అందుబాటులోకి రావడం, ఆ వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు.. ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకలు జరగడంతో అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపారులకు కలిసొచ్చింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి రూ.2,238 కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలోని 204 వైన్స్, 52 బార్లు, మూడు క్లబ్లకు ఈ మద్యం సరఫరా అయింది. డిసెంబర్లోనే అత్యధికంగా రూ.277 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా, రోజుల వారీగా పరిశీలిస్తే మార్చి 29న రూ.25.85 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. కొంత తగ్గినా.. 2024తో పోలిస్తే 2025లో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రూ.2,308 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కానీ 2025లో ఇది రూ.70కోట్ల మేర తగ్గి రూ.2,238 కోట్లుగా నమోదైంది. అయితే, అమ్మకాలు తగ్గడానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. అక్కడి కూటమి ప్రభుత్వం అంతకుముందు సర్కారు తీరుకు భిన్నంగా మద్యం అమ్మకాలు పెంచేలా అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీకి సరిహద్దుగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాంతాల వైన్స్లో అమ్మకాలు తగ్గాయని భావిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో ‘నయా’ జోష్ నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో ఒక్కరోజే రూ.13 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. బుధవారం రాత్రి, గురువారం జిల్లాలోని మద్యం షాపులన్నీ సందడిగా మారాయి. వైన్స్తో పాటు గ్రామాల్లోని బెల్ట్ దుకాణాల్లోనూ మందుబాబుల కోలాహలం నెలకొంది. ఎకై ్సజ్ శాఖ గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలకు సంబంధించి ఇల్లెందులో రూ.17.8 కోట్లు, పాల్వంచలో రూ.17.50 కోట్లు, కొత్తగూడెంలో రూ.24.70 కోట్లు, మణుగూరులో రూ.14.70 కోట్లు, అశ్వారావుపేటలో రూ.11.50 కోట్లు, భద్రాచలంలో రూ.18.72 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. 2024 డిసెంబర్లో జిల్లా వ్యాప్తంగా రూ.92.75 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, 2025 డిసెంబర్లో రూ.105 కోట్ల వ్యాపారం జరిగిందని ఎకై ్సజ్ ఎస్ఈ జానయ్య వివరించారు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని వైన్స్ల నుంచి బెల్ట్షాపులకు మద్యం సరఫరా అవుతోంది. వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపుల వారికి ధర పెంచడమే కాక ప్రత్యేక లేబుళ్ల ఆధారంగా మద్యాన్ని బహిరంగంగానే తరలిస్తున్నారు. ధర ఎక్కువ ఉందని బెల్టు షాపుల నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా పర్యవేక్షణకు ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటుచేయడంతో వైన్స్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. -
బొగ్గు టిప్పర్ ఢీకొని మహిళ మృతి
రుద్రంపూర్: బొగ్గు టిప్పర్ ఢీకొని గురువారం ఓ మహిళ మృతి చెందింది. రామవరం ప్రశాంతి నగర్కు చెందిన కొమ్ము సరోజ(65) నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రార్థన చేసేందుకు చర్చికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా రామవరంలోని సింగరేణి సివిల్ ఆఫీస్ వద్ద ఆర్పీహెచ్పీ నుంచి కోయగూడెం వెళ్తున్న బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె కాలు నుజ్జునుజ్జయి కుప్పకూలింది. స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా హైవే పక్కన ఫుట్పాత్ లేకపోవడం, బొగ్గు టిప్పర్ అతి వేగమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. రామవరంలోని ఎస్సీబీనగర్ వద్ద గత నెల 17న బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. ఐషర్ వాహనాన్ని, విద్యుత్ టవర్ను ఢీకొట్టింది. 15 రోజులు గడవక ముందే మరో ప్రమాదం జరిగి ఓ మహిళ మృతి చెందింది. ఇప్పటికై నా సింగరేణి, పోలీస్ అధికారులు స్పందించి బొగ్గు లారీల వేగాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. బావిలో పడి వ్యక్తి .. ఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగూడెం గ్రామపంచాయతీ సీతానగరానికి చెందిన చంద్రమౌళి (50) గురువారం బావిలో పడి మృతి చెందాడు. సాయంత్రం ఇంటి ఆవరణలో ఉన్న చేదబావిలో జారి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు తీశారు. అయితే అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. గుండెపోటుతో రైతు .. తల్లాడ: ఓ రైతు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్లే క్రమాన స్నేహితులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి బయలుదేరుతుండగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన దొడ్డ నరేందర్(40) పిల్లలు చదువుల నిమిత్తం ఖమ్మంలో నివసిస్తుండగా, స్వగ్రామంలో ఉన్న పదెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై గురువారం గ్రామానికి వచ్చిన ఆయన పొలం వద్దకు వెళ్లగానే గుండెల్లో నొప్పిగా ఉండడంతో తిరిగి ఖమ్మం బయలుదేరాడు. మార్గమధ్యలో యూనియన్ బ్యాంకులో పని చూసుకుని స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాక ఖమ్మం వెళ్తుండగా రెడ్డిగూడెం సమీపాన రెండోసారి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. దీంతో రోడ్డు పక్కనే కుప్పకూలిన ఆయనను స్థానికులు 108అంబులెన్స్లో ఖమ్మం తరలిస్తుండగా మరణించాడు. కాగా, నరేందర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండు బైక్లు ఢీకొని ఒకరు..చుంచుపల్లి: మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... సింగరేణి ఉద్యోగి మీస లక్ష్మీనారాయణ(55) విధులు ముగించుకుని కొత్తగూడెం బైపాస్ రోడ్డు మీదుగా ఇంటి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలై లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. మరో బైక్పై ఉన్నవారికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కత్తితో పలువురిపై దాడి ఖమ్మంరూరల్: ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన గంజుతారి మోహన్ పలువురిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కోటనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కోటనారాయణపురానికి చెందిన పోస్టల్ ఉద్యోగి ఏసు మణికంఠం బుధవారం రాత్రి తన స్నేహితుడు ఎస్కే.అబ్దుల్తో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమాన హోటల్ వద్ద మోహన్ వీరితో ఘర్షణకు దిగగా మణికంఠం తన బావ రామకృష్ణకు ఫోన్లో చెప్పగా ఆయన చేరుకున్నాడు. ఈక్రమాన మోహన్ ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో సాయికుమార్ గొడవను ఆపేందుకు యత్నిస్తే ఆయనపైనా దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో మోహన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
రామయ్య సన్నిధిలో సినీ హీరో కిరణ్ అబ్బవరం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారిని గురువారం సినీ హీరో కిరణ్ అబ్బవరం కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను, జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్వో లింగాల సాయిబాబు, అనిల్, తదితరులు పాల్గొన్నారు. అన్నదానానికి రూ. లక్ష విరాళంభద్రాచలంటౌన్: జూనియర్ కళాశాల సెంటర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో అన్నదానానికి పట్టణానికి చెందిన ఉంగరాల వెంకట్రావు–లక్ష్మి దంపతులు తమ కుమారుడు సాయిదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ నిధులతో గురువారం సుమారు 1,400 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ శాలువాతో సత్కరించి బాబా చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు ఆర్థిక పునరావాసం సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని ట్రాన్స్ జెండర్ల నుంచి ఆర్థిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో యూనిట్కు రూ.75 వేల చొప్పున 8 యూనిట్లు వంద శాతం సబ్సిడీ రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీలోగా కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని, పూర్తి వివరాలకు 63019 81960, 83310 06010 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ జారీ చేసిన గుర్తింపు పత్రం కలిగి, 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ట్రాన్స్జెండర్లు అర్హులని తెలిపారు. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో దివ్యాంగులు దివ్యాంగులను లేదా దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వివాహ ప్రోత్సాహక బహుమతి రూ. లక్ష అందిస్తుందని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణత లెనినా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివాహం జరిగిన సంవత్సరం లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం 1 నుంచి 10వ తరగతి చదువుకునే దివ్యాంగ విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఆపై ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలను కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని వివరించారు. పూర్తి వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్గా చంద్రకళటేకులపల్లి: మండలంలోని కోయగూడెం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పూనెం చంద్రకళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుబంధ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకాలను ప్రకటించినట్లు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. గురువారం టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రకళను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, నాయకులు కోరం మహాలక్ష్మి, బండ్ల రజిని, రాసమల్ల నరసయ్య, ఎనగంటి అర్జున్ రావు, సర్పంచ్ కోరం హనుమంతు, నాయకులు బోడ సరిత, మునుస్వామి, సుగుణ, రఫియా బేగం పాల్గొన్నారు. 11 మంది అరెస్టుములకలపల్లి : మండలపరిధిలోని పాతగుండాలపాడు, కమలాపురం శివార్లో రెండు వేర్వేరు చోట్ల కోడిపందేల స్థావరాలపై గురువారం పోలీసులు దాడి చేశారు. 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ 19 వేల నగదు, 10 కోడిపుంజులు, ఆరు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు. -
మెరుగైన వేతన ఒప్పందానికి కృషి
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్పీడీలో మెరుగైన 14వ వేతన ఒప్పందం కోసం యాజమాన్యంపై, గుర్తింపు కార్మిక సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చేలా పోరాటాలను కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ సానికొమ్ము శంకర్రెడ్డి అన్నారు. గురువారం సారపాక ఐటీసీ పీఎస్పీడీలోని బీఆర్టీయూ, సీఐటీయూ, బీఎంఎస్, ఏఐటీయూసీ, టీఈయూ, ఐఈయూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్లు జేఏసీగా ఏర్పడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో ఐటీసీ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గుర్తింపు సంఘం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ మల్లికంటి వెంకటేశ్వర్లు, ముఖ్యనేతలు బిజ్జం అశోక్రెడ్డి, సింగంనేని ప్రసాద్, టీ వెంకటేశ్వర్లు, ఎస్కే షైక్షావలి, కే నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
● ‘నయా’ జోష్ !
పాల్వంచ కేటీపీఎస్ సీఈ ప్రభాకర్రావుకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఇంజనీర్లు జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కేక్లు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇళ్ల లోగిళ్లలో సుందరమైన ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, పాల్వంచ పెద్దమ్మతల్లి, అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి, కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ తదితర ఆలయాలతో పాటు పలు చర్చిలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరంలో తమ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలంటూ ఇష్టదైవాలను వేడుకున్నారు. సింగరేణి, కేటీపీఎస్, బీటీపీఎస్, ఐటీసీ తదితర సంస్థల్లో సంబరాలు అంబరాన్నంటగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. – నెట్వర్క్ -
ట్రాలీ బోల్తా : 15 గొర్రెలు మృతి
ఇల్లెందురూరల్: గుండాల మండలం శెట్టిపల్లి గ్రామం నుంచి గురువారం నారాయణపేట జిల్లాకు 70 గొర్రెలను ట్రాలీలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని పోచారంతండా గ్రామ సమీపంలో ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 15 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల వ్యాపారి వోటేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాధారణ వ్యక్తుల్లా పోలీసుల దాడి● ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్ట్ పాల్వంచరూరల్: మండల పరిధిలోని దంతలబోరు గ్రామ శివారులో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కొందరు పేకాట ఆడుతున్నారు. సమాచారం రావడంతో స్పెషల్ పార్టీ పోలీసులు, రూరల్ ఎస్ఐ సురేష్ సాధారణ వ్యక్తుల్లా ట్రాలీ ఆటోలో వెళ్లి దాడి చేశారు. ఒక్కరిని పట్టుకోగానే మిగతా పందెంరాయుళ్లు ఉరుకులు, పరుగులు పెట్టగా, పోలీసులు వెంబడించారు. ములకలపల్లి మండలం సుందరయ్యనగర్కు చెందిన రవ్వ శ్రీరాములు, మాదారం గ్రామానికి చెందిన ఊకంటి కిషోర్, పాల్వంచలోని నటరాజ్ సెంటర్కు చెందిన జి.ప్రశాంత్లను అదుపులోకి తీసుకున్నారు. ఆరు పందెం కోళ్లు, మూడు స్మార్ట్ఫోన్లు, ద్విచక్రవాహనం, రూ.39,450 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడటంతో వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ఎర్రమ్మ తల్లి గుడి వద్ద కేఎల్ఆర్ కాలేజీకి చెందిన బస్సు శుక్రవారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. కాలేజీ బస్సు మణుగూరు నుండి పాల్వంచకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా కారణంగా విద్యార్థులు బస్సు కింద ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


