breaking news
Bhadradri
-
మణుగూరులో ఉద్రిక్తత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు.. ఫర్నిచర్ను తగలబెట్టారు. మంటలను ఫైర్ సిబ్బంది, పోలీసులు అదుపు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన రేగా కాంతారావు.. కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని స్వాధీన పరుచుకునేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. -
ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకం
కొత్తగూడెంటౌన్: కోర్టులో ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రతీ న్యాయవాది ఫోరెన్సిక్ సైన్స్పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టులోని లైబ్రరీ హాల్లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాలీగ్రాఫిక్, ఫింగర్ ప్రింట్, నార్కో విశ్లేషణ, లైడిటెక్షన్, సంతక పరీక్ష, డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ విధానాలు, శాసీ్త్రయ విశ్లేషణ పద్ధతుల గురించి వివరించారు. జిల్లాలోని న్యాయవాదులంతా ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.సరిత, ఎం.రాజేందర్, కె.కిరణ్కుమార్, కె.కవిత, కె.సాయిశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఐఎల్పీఏ జిల్లా కన్వీనర్ జె.గోపీకృష్ణ, సుంకర భానుప్రియ, న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, జె.శివరామ్ప్రసాద్, కిలారు పురుషోత్తం, యూనిట్ సభ్యులు అడపాల మహాలక్ష్మి, ఎండీ సాధిక్పాషా, ఎర్రపాటి కృష్ణ, ఝెర్రా కామేష్, అంబటి రమేష్, దొడ్డా సామంత్, మేకల దేవేందర్, రాజశేఖర్, శ్రీకాంత్, మారపాక రమేష్, యాస యుగంధర్ అంకూష్పాషా, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ -
●మిథిలా.. ఏమిటీ వ్యథ !
మిథిలా నగరం అనగానే రామరాజ్యం గుర్తొస్తుంది. త్రేతాయుగం నాటి ఆ రాజ్యానికి గుర్తుగా భద్రగిరిలో కొలువై ఉన్న శ్రీరాముడి క్షేత్రంలో కల్యాణ వేదిక ప్రాంగణానికి మిథిలా స్టేడియం అని నామకరణం చేశారు. కానీ ఆ పేరుకే అవమానం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు ఆలయ అధికారులు. శ్రీరామనవమి రోజుల్లోనే ఆ స్టేడియంలో పరిశుభ్రత పనులు చేపడుతూ అనంతరం ఆలనా పాలన పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంగణమంతా చిట్టడివిని తలపిస్తోంది. పశువులు, పిచ్చిమొక్కలతో పరిసర ప్రాంతాలు దర్శనమిస్తున్నాయి. స్టేడియాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. – భద్రాచలం -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైభవంగా సత్యనారాయణ వ్రతం.. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చిత్రకూట మండపంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాల్లో ఈ వ్రతాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం విదితమే. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సత్యనారాయణ వ్రతంలో పాల్గొని, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కాగా, రామాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. గతేడాది అక్టోబర్లో సుమారు 1.40 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈ ఏడాది 1.80 లక్షల మంది దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. అక్టోబర్లో నిరంతరం వర్షాలు కురిసినా భక్తుల రాక పెరగడం విశేషం.భక్తి శ్రద్దలతో ‘కార్తీక’ వ్రతం -
దేశంలోనే అత్యధిక ఓఈఆర్
● ఫెర్టిలైజర్ డీలర్షిప్ తీసుకుంటాం ● ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వెల్లడి ● ఫ్యాక్టరీ మేనేజర్లకు ఘన సన్మానం దమ్మపేట: 2024 – 25 సంవత్సరానికి రాష్ట్ర ఆయిల్ఫెడ్ సంస్థ దేశంలోనే అత్యధిక ఓఈఆర్(ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్) 20.01 శాతం సాధించడం గర్వంగా ఉందని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. అత్యధిక ఓఈఆర్ సాధించిన సందర్భంగా మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మేనేజర్లను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆయిల్ సంవత్సరంలో 3.3 లక్షల టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్నకు మేనేజర్లు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారని అభినందించారు. అత్యధిక ఓఈఆర్తో టన్ను గెలలకు అదనంగా రూ.500 పెరగనుందని తెలిపారు. పామాయిల్ రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో అత్యాధునిక టెక్నాలజీతో నూతన ఫ్యాక్టరీని నిర్మించామని తెలిపారు. అత్యధిక ఓఈఆర్ వచ్చేందుకు ప్రతీ ఫ్యాక్టరీలో ఆధునిక సాంకేతిక యంత్రాల వినియోగానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డీలర్షిప్ను ప్రముఖ బహుళ జాతి కంపెనీల నుంచి తీసుకునేలా త్వరలో జరిగే బోర్డు మీటింగ్లో చర్చిస్తామని వివరించారు. తద్వారా సంస్థకు లాభంతో పాటు రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందించే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైతే పామాయిల్ రైతులకు ఎరువులు అప్పుగా ఇచ్చి, ఫ్యాక్టరీకి గెలలు తీసుకొచ్చాక అందులో మినహాయించుకుంటామని తెలిపారు. ఆయిల్పామ్ నర్సరీల పెంపకంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతామన్నారు. నర్సరీలో మొక్కల పెంపకం నుంచి రైతులు సాగు చేసే తోటల పరిశీలనకు ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలను నియమించే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆయిల్ఫెడ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మేనేజర్లు కళ్యాణ్ గౌడ్, నాగబాబును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, చలసాని సాంబశివరావు, బండి భాస్కర్, మద్దినేని వెంకట్, కోటగిరి సీతారామస్వామి, శీమకుర్తి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్, కె.వి.రాధాకృష్ణ, మొగళ్లపు చెన్నకేశవరావు, సత్యనారాయణ చౌదరి, వసంతరావు, అప్పారావు, అంకత మహేశ్వరరావు పాల్గొన్నారు. -
వ్యాపార విస్తరణ చర్యలు భేష్
కొత్తగూడెంఅర్బన్ : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టడం హర్షణీయమని మాజీ డైరెక్టర్(పా) జి.ఎస్.జి. అయ్యం అన్నారు. సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 27 నుంచి ఈనెల 2వరకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో తాను పనిచేసిన కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. సంస్థ చేసే కొనుగోళ్లు, టెండర్ల విషయంలో స్పష్టత ఉండాలని, అవసరం మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. తద్వారా సంస్థకు నష్టం రాకుండా ఉంటుందని తెలిపారు. 2003 నుంచి ఇప్పటివరకు సింగరేణి సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకలు ఘననీయంగా వృద్ధి చెందాయని, తెలంగాణలోనే కాకుండా ఒడిశాలోనూ బొగ్గు ఉత్పత్తి చేయడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్లో కూడా మరింత అభివృద్ధి చెంది గ్లోబల్ సంస్థగా మారాలని ఆకాంక్షించారు. కాగా, సీఎండీ ఎన్.బలరామ్ హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రంలో బొగ్గు బ్లాక్ను ప్రారంభించామని, రాజస్థాన్తో కలిసి సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో బంగారం, రాగి గనుల అన్వేషణ జరుగుతోందని, బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలతో సింగరేణి గ్రీన్ ఎనర్జీ సంస్థగాను, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్గాను విస్తరించనుందని తెలిపారు. అనంతరం మాజీ డైరెక్టర్(పా) అయ్యం ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమలరావు, కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు పాల్గొన్నారు. -
ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఇల్లెందురూరల్: శిక్షణలో నేర్చుకున్న అంశాలపై నిరంతరం సాధన కొనసాగిస్తూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. మండలంలోని యువజన శిక్షణ కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు యువతకు సెంట్రింగ్ పనిపై శిక్షణ శిబిరం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అనంతరం శిక్షణ పొందిన 60 మంది సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు, టీషర్ట్లను పంపిణీ చేశారు. ఎంపీడీవో ధన్సింగ్, సెర్ప్, న్యాక్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
అండర్–17 వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్లను శనివారం ఎంపిక చేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు నిర్వహించామని, ప్రతిభ కనబర్చిన వారి నుంచి జట్లను ఎంపిక చేశామని జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. బాలుర జట్టుకు ఎం.శ్యామ్, బి.రిషి, జి. శేషు, కె.ధనుష్, పి.దివాకర్, సీహెచ్. శరత్చంద్ర, ఎం.భరత్, ఎం.యశ్వంత్, బాలికల జట్టుకు జి.కావ్య, టి.పవిత్ర, ఏ.టోనీశ్రీ, జి.శృతి, సీహెచ్. శ్రీవల్లి, శాంతి, ఎన్.హాసిని ఎంపికయ్యారని వెల్లడించారు. -
అదుపు తప్పి ఆటో బోల్తా
జూలూరుపాడు: అదుపు తప్పి ఆటో బోల్తా పడి ఏడుగురు గాయపడ్డ సంఘటన జూలూరుపాడులో శనివారం జరిగింది. కొమ్ముగూడెం, భేతాళపాడు, మాచినేనిపేటతండా, సాయిరాంతండాకు చెందిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గిద్దలగూడేనికి చెందిన బానోత్ సేవాలాల్ ఆటోలో మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలకు వస్తున్నారు. ఆటో ముందు జూలూరుపాడుకు చెందిన యువకుడు దూపాటి నరసింహారాజు బైక్పై వెళ్తున్నాడు. జూలూరుపాడు సెయింట్ ఆంటోనియస్ స్కూల్ సమీపంలోకి రాగానే కోతులు అడ్డు రావడంతో నరసింహారాజు సడన్ బ్రేక్ వేశాడు. వెనకాలే వస్తున్న ఆటో బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలోని ఆరుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనదారుడు నరసింహారాజుకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులు లకావత్ స్నేహలత, బానోత్ నిఖిత, పాలేపు శరణ్య, గోగుల భవ్య, తేజావత్ భార్గవి, భూక్యా అవని, నరసింహారాజులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిఖిత, స్నేహలత, శరణ్యలను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.ఏడుగురికి గాయాలు -
రికార్డులు పక్కాగా నిర్వహించాలి
ములకలపల్లి/ చుంచుపల్లి : గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి బి.అనూష సిబ్బందిని ఆదేశించారు. ‘పల్లె పాలన.. పడేనా గాడిన’ శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో పర్యటించిన డీపీఓ.. పంచాయతీలో పలు రిజిస్టర్లతో పాటు పారిశుద్ధ్య పనులు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, నర్సరీ నిర్వహణను పరిశీలించి తగు సూచనలు చేశారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలని, గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఎస్కే షబ్న, కార్యదర్శి పఠాన్ యూనిస్ ఖాన్, గుంటుపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.పల్లె పాలనపై డీపీఓ దృష్టి -
సమగ్ర వ్యవసాయ విధానాలతో నికర ఆదాయం
రఘునాథపాలెం: రైతులు ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలు తెలుసుకుని అవలంబించడం ద్వారా పంటల నుంచి నికర ఆదాయం లభిస్తుందని అశ్వారావుపేట వ్యవసాయశాఖల అసోసియేట్ డీన్ హేమంత్కుమార్ తెలిపారు. మండలంలోని చిమ్మపూడిలో శనివారం వ్యవసాయశాఖ, ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యాన మిరప, ఆయిల్పామ్పై ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్పామ్తో పాటు అంతర పంటలు సాగుచేస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చ ని చెప్పారు. అలాగే, మిరపలో విత్తనం దశ నుంచి కోత వరకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించా రు. అనంతరం మల్యాల కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్, ఖమ్మం ఏడీఏ కె.వెంకటేశ్వరరావు, రోటరీక్లబ్ గవర్నర్ మల్లాది వాసు మాట్లాడారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రాంప్రసాద్, నాగాంజలి, నీలిమ, రోటరీక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని రామారావు, బొడ్డు సుధాకర్రావుతో పాటు కోటేరు వెంకటరెడ్డి, వెంకట్, చందు, ఏఓ కె.ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఉలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
కొత్తగూడెంటౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణం మేదరబస్తీకి చెందిన ములుగురి శ్రీనివాస్, లక్ష్మి(32) దంపతులు చుంచుపల్లి విద్యానగర్ కాలనీలో దుకాణం ఏర్పాటు చేసుకుని బుట్టలు వంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. శనివారం దుకాణానికి బైక్పై బయల్దేరారు. అదే సమయంలో కొత్తగూడెం నుంచి ఆంధ్రప్రదేశ్కు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో పోస్టాఫీస్ సెంటర్లోని పెట్రోల్ బంకు వద్ద బస్సు ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు కిందపడిపోయారు. లక్ష్మి మీదుగా ఆర్టీసీ టైరు వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా భార్య మృతదేహం వద్ద భర్త రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో..సత్తుపల్లి(పెనుబల్లి): మండలంలోని లంకపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడుకు చెందిన గుర్రం వెంకటదాసు – సంపూర్ణ(45) దంపతులు శనివారం ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వీ.ఎం.బంజరు మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో లంకపల్లి వద్ద వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ టైర్ కింద పడిన సంపూర్ణ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటదాసుకు గాయాలయ్యాయి. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్సై వెంకటేష్ ఘటనాస్థలిని పరిశీలించి మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యఅశ్వారావుపేటరూరల్: చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం అశ్వారావుపేటలో జరిగింది. ఎస్సై యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం దర్భగూడేనికి చెందిన అన్నమనేని శ్రీను(52) కొంతకాలంగా అశ్వారావుపేటలోని ఓ కూరగాయల దుకాణంలో దినసరి కూలిగా పని చేస్తున్నాడు. గడిచిన కొన్నేళ్లుగా మద్యానికి బానిసై కుటుంబీకులను పట్టించుకోవడంతో భార్య వాణితో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మద్యం తాగి మనస్తాపం చెంది గురై కూరగాయల దుకాణం యజమాని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి.. ఇల్లెందు: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మారేపల్లి వెంకటనారాయణ(56) శనివారం తన నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన అతని భార్య కొంతకాలంగా ఖమ్మంలోని కుమార్తె వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకటనారాయణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు శ్యామ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ హసీనా కేసు నమోదు చేశారు. దాడి ఘటనలో కేసు నమోదుపాల్వంచ: పాత కక్షల నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తులపై శనివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 30న ప్రభుత్వాస్పత్రి రోడ్లో ఉన్న ఈర్ల గాంధీపై బత్తుల అంజి, అతని అనుచరులు కలిసి దాడి చేశారు. దీంతో తల పగిలి గాయమైంది. గాంధీ భార్య మహాలక్ష్మి ఫిర్యాదుతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు. -
కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించాలి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ డీడీ అశోక్ అన్నారు. ఐటీడీఏ పీఎంఆర్సీ భవనంలో లీడ్ మైండ్స్ స్పార్క్ ప్రోగ్రాంపై శనివారం హెచ్ఎంలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. శిక్షణ పొందిన ప్రధానోపాధ్యాయులందరూ వార్డెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కంప్యూటర్ థింకింగ్ నైపుణ్యం పెంచాలని సూచించారు. లీడ్ మైండ్స్ బృందం కోఆర్డినేటర్లు, ఉమా మహేష్, భీమ్రావు, ఖమ్మం డీడీ విజయలక్ష్మి, ఏసీఎంఓలు రమేష్, రాములు, జీసీడీఓ అలివేలు మంగతాయారు, ప్రమీల భాయ్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ‘ధర్తీ ఆబా’భద్రాచలంటౌన్: భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని పీఎం ధర్తీ ఆబా కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి 15 వరకు గిరిజన సంక్షేమ శాఖ సంస్థలు, గిరిజన గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రెటరీ సర్వేశ్వర్ రెడ్డి, టీసీఆర్ అండ్ టీఐ జాయింట్ డైరెక్టర్ సమజ్వాల సూచించారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. పీఎం ధర్తీ ఆబా, ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, నాటికలు, కల్చరల్, క్రీడలు వంటి పోటీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, మ్యూజియం ఇన్చార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ద్విచక్రవాహనం చోరీఅశ్వారావుపేటరూరల్: ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్రవాహనం చోరీకి గురికాగా, శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన కాసగాని ప్రసాద్ శుక్రవారం ఉదయం తన ఇంటి ద్విచక్రవాహనం నిలిపాడు. కొద్ది సేపటి తర్వాత గమనించగా ద్విచక్రవాహనం లేదు. సీసీ ఫుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ను అపహరించినట్లు రికార్డయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యయాతీ రాజు తెలిపారు. గౌరవ వేతనం ఇవ్వాలిసూపర్బజార్(కొత్తగూడెం): కమీషన్ కాకుండా గౌరవ వేతనం ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరుతూ లైసెన్స్డ్ సర్వేయర్లు శనివారం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు. వేతనం, సామాజిక భద్రత, శాశ్వత గుర్తింపు ఇవ్వాలని కోరారు. భూభారతి ఎంట్రీలు, నాలా మ్యాప్ ప్రక్రియలు, సర్వేడేటా అప్డేట్ వంటి విధులు నిర్వర్తించేందుకు తమను నియమించారని, తగిన పారితోషికం కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అట్రాసిటీ కేసు నమోదుదమ్మపేట : కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శుక్రవారం మండలంలోని మందలపల్లి గ్రామంలో ఓ ఇంటి విషయమై తగాదా జరిగింది. గ్రామానికి చెందిన దళిత మహిళ చింతలచెరువు జయప్రదను అదే గ్రామానికి చెందిన యర్రపాటి కృష్ణవేణి, యర్రపాటి సత్యనారాయణ, యర్రపాటి సత్యవతి, యర్రపాటి వెంకటపవన్లు కులం పేరుతో దూషించారు. జయప్రదతో పాటుగా ఆమె భర్త సునీల్ను కూడా బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. అదనపు కట్నం కోసం వేధింపులుఇల్లెందు: పట్టణంలోని జేకే కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి బానోతు దుర్గను ఆమె భర్త నగేష్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సింగరేణిలో మస్టర్ల ఫికర్
కొత్తగూడెంఅర్బన్: సాకులు చెప్పి విధులకు డుమ్మా కొట్టే సింగరేణి కార్మికుల ఉద్యోగానికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. యాజమాన్యం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్తో కార్మికులు గుబులు చెందుతున్నారు. గైర్హాజరును తగ్గించి, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదతక పెంచేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. కఠిన నిర్ణయమైనా గైర్హాజరు కార్మికులను దారిలో పెట్టేందుకు పని చేస్తుందని కొన్ని కార్మిక సంఘాలంటే, మరికొన్ని సంఘాలు మాత్రం నిబంధనలు కార్మికులపై కొరడా దెబ్బలని పేర్కొంటున్నాయి. సింగరేణి కార్మికులకు ఏడాదికి 100 మస్టర్ల హాజరు నమోదు కావాలి. ప్రస్తుతం ఆ నిబంధనను 150 మస్టర్లకు పెంచారు. ఏడాదిలో 150 మస్టర్లులేని కార్మికుల వివరాలను ఈ నెల 5వ తేదీలోగా అందించాలని సీఎండీ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో గైర్హాజరు కార్మికులను గుర్తిస్తున్నారు. గనుల నోటీసు బోర్డుల్లో వివరాలు ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత కార్మికుల పేర్లనూ నోటీస్ బోర్డుల్లో ఉంచనున్నారు. వచ్చే జనవరి నెలాఖరుకు చార్జీషీట్ ఇచ్చి, ఫిబ్రవరి 15 లోగా వివరణ తీసుకుంటారు. వివరణ సహేతుకంగా లేకపోతే మార్చి 15 లోగా విచారణ పూర్తి చేసి, ఏప్రిల్లో కౌన్సెలింగ్ ఇస్తారు. నెలలో భూగర్భ గనుల్లో 16 మస్టర్లు, ఉపరితలంలో 20 మస్టర్ల కంటే తక్కువ హాజరుకలిగినవారి వివరాలను కూడా ఈ నెల 5వ తేదీలోగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. భూగర్భ గనుల్లో మూడు నెలలపాటు హాజరు ఇలాగే ఉంటే గని మేనేజర్ స్థాయి కమిటీకి పంపించాలని, గైర్హాజరు కౌన్సెలింగ్కు కూడా హాజరు కాకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడే వారు సిక్ లెటర్ సమర్పిస్తే సరిపోతుంది. సరైనా కారణాలు లేకుండా విధులకు హాజరుకాని కార్మికులకు మాత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. గైర్హాజరు కార్మికులు ఇకనైనా మేల్కొనకపోతే సింగరేణి యాజమాన్యం తీసుకోబోయే చర్యలకు బాధ్యులు కానున్నారు. సింగరేణిలో గైర్హాజరు కార్మికులను దారిలో పెట్టే ప్రయత్నం యజమాన్యం ప్రయత్నం చేస్తోంది. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. ప్రతీ కార్మికుడు నెలలో తప్పనిసరిగా 16 మస్టర్ల కంటే ఎక్కువగా పనిచేయాలి. కావాలని పని బంద్ చేసే వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. –కొరిమి రాజ్కుమార్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సింగరేణిలో డిస్మిస్డ్ కార్మికులకు కూడా మరో అవకాశం ఇవ్వాలి. కొత్తగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం గైర్హాజరు కార్మికులు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కార్మిక సంఘాల అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుండేది. –త్యాగరాజు, ఐఎన్టీయూ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ -
15న ప్రత్యేక లోక్ అదాలత్
కొత్తగూడెంటౌన్: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. లక్ష్మీదేవిపల్లిలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం పాటిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజీ పడదగిన కేసుల్లో ఇరు వర్గాల నిర్ణయాలతో ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా కృషి చేయాలని అన్నారు. చిన్న విషయాల్లో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీపడడమే ఉత్తమమని కక్షిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కేసుల పురోగతిని పరిశీలిస్తూ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే తమ దృష్టికి తేవాలని అన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీష్కుమార్, రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తీ సత్యనారాయణ, పోలిబోయిన రామనర్సయ్య, సోయం కన్నారావు, దారబోయిన రమేష్, కారం కృష్ణ తదితరుఉల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏజెన్సీలో భూ చట్టాలను కఠినంగా అమలు చేయాలని బాధితులు కోరారు. దీక్షల్లో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గొగ్గెల రామస్వామి, జారె కృష్ణ, భూ బాధితులు గొగ్గెల ఆదిలక్ష్మి, పూనెం అనసూయ, నరసింహారావు, కల్తీ మల్లయ్య, కుంజా రాములు, పూసం నరసింహారావు, పూనెం కోటయ్య పాల్గొన్నారు. -
మరో ముందడుగు..
జిల్లా మీదుగా వెళ్తున్న రెండో జాతీయ రహదారి 930 (పీ) విస్తరణలో మరో అడుగు పడింది. నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న ఈ రోడ్డుకు సంబంధించిన భూ సేకరణకు తాజాగా మూడో నోటిఫికేషన్ను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం● ఇల్లెందు – కొత్తగూడెం మధ్య నాలుగు లేన్లతో జాతీయ రహదారి ● 2021లో ఎన్హెచ్ 930(పీ)గా అప్గ్రేడ్ ● భూసేకరణకు 2024లో నోటిఫికేషన్ల జారీ ● కొత్తగూడెం – హైదరాబాద్ మధ్య తగ్గనున్న 40 కి.మీ. తగ్గనున్న దూరం.. కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు చేరుకునే ప్రధాన మార్గం ప్రస్తుతం ఖమ్మం – సూర్యాపేట మీదుగానే ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా కొత్తగూడెం నుంచి ఇల్లెందు, మహబూబాబాద్, తొర్రూరు మీదుగా హైదరాబాద్ (గౌరెల్లి జంక్షన్)వరకు కొత్తగా మరో జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ రోడ్డును నేషనల్ హైవే–930(పీ)గా పేర్కొంటూ 2021లో గెజిట్లో ప్రకటించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కొత్తగూడెం – హైదరాబాద్ మధ్య 40 కి.మీ. వరకు దూరం తగ్గుతుంది. జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద మొదలయ్యే ఈ రోడ్డు ఇల్లెందు మండలం నెహ్రూనగర్ వరకు 52 కి.మీ. నిడివితో ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.700 కోట్లతో ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశారు. గతంలోనే నోటిఫికేషన్.. ఇల్లెందు – కొత్తగూడెం మధ్య వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రోడ్డు విస్తరణ ఎక్కడి వరకు ఉంటుందనే మార్కింగ్ కూడా రెండేళ్ల క్రితమే పూర్తయింది. అందుకు తగ్గట్టుగానే జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో రెండుసార్లు భూ సేకరణకు సంబంధించి 3ఏ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇక రోడ్డు విస్తరణలో నష్టపోయే చెట్లను గుర్తించే పనిని అటవీశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది. కాగా, మొదటి రెండు నోటిఫికేషన్లలో పేర్కొనని స్థలాలకు సంబంధించి.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా – నాయ్) నుంచి గత అక్టోబర్ 23న మూడోసారి 3ఏ నోటిఫికేషన్ వెలువడింది. ప్రక్రియ పూర్తయితే.. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం ఏదైనా రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా తెలియజేస్తూ ముందుగా 3ఏ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ తర్వాత ఆ భూముల్లో సర్వే చేయడానికి 3బీ, అభ్యంతరాలు స్వీకరించడానికి 3సీ, స్వాధీన ప్రకటనకు 3డీ, స్వాధీనం చేసుకునేందుకు 3ఈ, 3ఎఫ్ నోటిఫికేషన్లు, నష్ట పరిహారం ప్రకటనకు 3జీ, చెల్లింపులకు 3హెచ్.. ఇలా 3ఎల్ వరకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. మూడుసార్లు జారీ అయిన నోటిఫికేషన్లతో భూసేకరణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్టే. ఆ తర్వాత అటవీ శాఖ నుంచి అనుమతులు వస్తే టెండర్ల ప్రక్రియకు వెళ్లడమే తరువాయి అనే పరిస్థితి నెలకొంది.తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇల్లెందు మండల పరిధిలో 178 కి.మీ. నుంచి 189 కి.మీ. సెక్షన్లో సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధిలో 12 వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న స్థలాలను హైవే కోసం తీసుకోనున్నారు. అలాగే 196 కి.మీ. నుంచి 230 కి.మీ. వరకు గల సెక్షన్లో టేకులపల్లి మండలం బేతంపూడిలో రెండు సర్వే నంబర్లు, గొల్లపల్లిలో నాలుగు సర్వే నంబర్లలో ఉన్న భూమిని సేకరిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామపంచాయతీ పరిధిలో 16 సర్వే నంబర్లలో ఉన్న స్థలాలను ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
రివిజన్ సమర్థంగా చేపట్టాలి
సూపర్బజార్(కొత్తగూడెం): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు.. తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వీసీలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్ పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
పాల్వంచరూరల్ : పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామికి కార్తీకమాసం సందర్భంగా శనివారం లక్ష బిల్వార్చన గావించారు. ఆ తర్వాత స్వామి సన్నిధిలో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, హారతులు, నివేదన సమర్పించగా.. సాయంత్రం ఆకాశదీపం వెలిగించారు. కాగా, క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం తులసీ కల్యాణం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ‘చెకుముకి’ వాల్పోస్టర్ల ఆవిష్కరణకొత్తగూడెంఅర్బన్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగనున్న చెకుముకి సంబురాల వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీఈఓ నాగలక్ష్మి, ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నీరజ తమ కార్యాలయాల్లో శనివారం వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఈనెల 7న, మండలస్థాయిలో 21న, జిల్లాస్థాయిలో 28న చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 12 నుంచి 14 వరకు కరీంనగర్లో జరుగుతాయని వివరించారు. పెరుగుతున్న గోదావరి ప్రవాహంభద్రాచలంటౌన్ : మోంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ శనివారం రాత్రికి 28.50 అడుగులకు చేరుకుంది. నదీ ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులను నదిలోకి దిగకుండా చర్యలు చేపట్టారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పర్యాటక కేంద్రంగా ‘కనకగిరి’ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడు శివారులో గల కనకగిరి గుట్టల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదన ఉందని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ తెలిపారు. శనివారం ఆయన బెండాలపాడు సందర్శించారు. ఆ తర్వాత గ్రామ శివారు అటవీప్రాంతంలో ఉన్న వెదురు ప్లాంటేషన్ను పరిశీలించాక గుట్టపై ఉన్న హస్తాల వీరన్నస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కనకగిరి గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. తొలుత గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, పంచాయితీ సెక్రటరీ రోహిత్, దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్తో సమావేశమై గ్రామ జనాభా, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సీతారామ కాలువ పనులు ఎంత వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పంటల పరిశీలన, ఖమ్మం రూరల్ మండలంలో సీసీ రోడ్లకు శ ంకుస్థాపన తర్వాత ఇల్లెందులో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు పొంగులేటి హాజరవుతారు. -
జలాశయంలోకి కొనసాగుతున్న వరద
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి.. భద్రాచలంఅర్బన్: జాతీయ ఆరోగ్య మిషన్ అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర బృందం (కామన్ రివ్యూ మిషన్) ఈ నెల 3వ తేదీన ఆస్పత్రిని సందర్శించనున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్హెచ్ఎం రాష్ట్ర క్వాలిటీ ఇన్చార్జ్ నిరంజన్ సూచించారు. శుక్రవారం ఆయన భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించి, మాట్లాడారు. అన్ని రికార్డులు మరోసారి తనిఖీ చేసుకోవాలని, ఏదైనా లోపాలు, తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దు కోవాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్ఎంఓ రాజశేఖర్రెడ్డి, జిల్లా సీఆర్ఎం నోడల్ అధికారి వీరబాబు, జిల్లా మలేరియా అఽధికారి స్పందన పాల్గొన్నారు. ఆటో స్టార్టర్లను వాడొద్దు అశ్వారావుపేటరూరల్: విద్యుత్ మోటార్లకు ఆటో స్టార్టర్లు ఉంటే తక్షణమే వాటిని తొలగించాలని పాల్వంచ ట్రాన్స్కో డీఈఈ పి.నందయ్య కోరారు. శుక్రవారం మండలంలోని నారంవారిగూడెంలో ‘విద్యుత్ శాఖ – రైతు పొలంబాట’కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తడి చేతులతో మోటార్లను ఆన్ చేయవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్లాస్టిక్ స్టార్టర్లు వినియోగించాలని, దెబ్బతిన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ వాహనాల్లోనే తరలించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ ఎన్.కృష్ణ,ఏడీఈ బి.వెంకటరత్నం, ఏఈఈ జి.రవి, లైన్మెన్ వి.చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు. యూడైస్ డేటాను అప్డేట్ చేయాలి ములకలపల్లి: పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా యూడైస్ డేటాను అప్డేట్ చేయాలని విద్యాశాఖ కో–ఆర్డినేటర్లు సైదులు, ఎన్.సతీశ్కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను శుక్రవారం వారు సందర్శించి, భవిత భవన నిర్మాణాన్ని పరిశీలించారు. నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. అన్నారం పాఠశాలలో జరుగుతున్న హరిత విద్యాలయ ఇవాల్యుయేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంఈఓ సత్యనారాయణ, డీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోడి పిల్లలు పంపిణీజూలూరుపాడు: జూలూరుపాడు సెర్ప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉషోదయ మండల సమాఖ్య పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కోడి పిల్లలను పంపిణీ చేశారు. 80 మంది లబ్ధిదారులకు 1200 కోడి పిల్లలను అందజేశారు. ఎంపీడీఓ పి.అజయ్ మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం, చికెన్, గుడ్లు, కోళ్లు అమ్మడం ద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు. అనంతరం సెర్ప్ కార్యాలయంలో జరిగిన సమాఖ్య సమావేశంలో ఎన్పీఏ రికవరీ, బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు తదితర అంశాలపై చర్చించారు. బోయినపల్లి రామకృష్ణ, అరుణ, సారిక, శిరీష, బండ్ల మధుసూధన్రావు, ధరావత్ నాగేశ్వరరావు, లక్ష్మీశెట్టి రామారావు పాల్గొన్నారు. -
56 లీటర్ల నాటుసారా పట్టివేత
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణం మీదుగా పాల్వంచకు తరలిస్తున్న నాటుసారాను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. భద్రాచలం గోదావరి బిడ్జి సమీపంలోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ ద్విచక్రవాహనాన్ని అపి తనిఖీ చేశారు. 56 లీటర్ల నాటుసారా దొరకడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా పాల్వంచకు చెందిన గంగా కబాసి, సింగా కుర్మీగా తేలింది. ఇద్దరు వ్యక్తులపై కేసు నమెదు చేసి నాటుసారా, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసిన్నట్లు ఎస్ఐ వెల్లడించారు. తనిఖీల్లో కానిస్టేబుల్ కరీం, బాలు, సుధీర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్ విద్యుత్ సౌధ
ఉత్సాహంగా కొనసాగిన జెన్కో క్రీడలు పాల్వంచ: జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ మెన్ టెన్నిస్, ఉమెన్ గేమ్స్లో ఓవరాల్ చాంపియన్షిప్ను విద్యుత్ సౌధ కై వసం చేసుకోగా, కేటీపీఎస్ 7వ దశ జట్లు ద్వితీయ, 5, 6 దశలు తృతీయ స్థానాల్లో నిలిచాయి. స్థానిక టీఆర్సీ టెన్నిస్ కోర్టు ఆవరణలో మూడు రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. పోటీల్లో కేటీపీఎస్ 5, 6, 7 దశలు, బీటీపీఎస్, విద్యుత్ సౌధ, నాగర్జునసాగర్, శ్రీశైలం, వైటీపీఎస్ జట్లు తలపడ్డాయి. కాగా లాన్ టెన్నిస్ జట్టు ఈవెంట్ 7వ దశ ప్రథమ, 5, 6 ద్వితీయ, మెన్ కేటగిరిలో 5వ దశ సతీశ్ ప్రథమ, వైటీపీఎస్ సోందు ద్వితీయ, ఉమెన్ కేటగిరిల్లో షటిల్ టీం ఈవెంట్లో విద్యుత్ సౌధ ప్రథమ, 7వ దశ ద్వితీయ, క్యారమ్స్లో విద్యుత్ సౌధ ప్రథమ, కేటీపీఎస్ 7వ దశ ద్వితీయ, చెస్లో 7వ దశ ప్రథమ, 5,6 దశలు ద్వితీయ స్థానంలో నిలిచాయి. టెన్నీకాయిట్లో 7వ దశ ప్రథమ, 5,6 దశలు ద్వితీయ, టేబుల్ టెన్నిస్లో విద్యుత్ సౌధ ప్రథమ, 5,6 దశలు ద్వితీయ, షటిల్ సింగిల్స్లో ప్రగతి 7వ దశ, ప్రవీణ విద్యుత్ సౌధ, తృతీయ విజయ విద్యుత్ సౌధ నిలిచారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు సీఈలు ఎం.ప్రభాకర్రావు, కె.శ్రీనివాసబాబు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్ఈలు యుగపతి, రాజ్కుమార్, జి.శ్రీనివాస్, వైసీసీఏ నాగరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీలు మహేశ్, వీరస్వామి, నరసింహారావు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
చేపల పెంపకంతో ఆర్థిక పరిపుష్టి
కొత్తగూడెంఅర్బన్: గ్రామీణ ప్రజల ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు చేపల పెంపకం దోహదపడుతుందని, సొసైటీలగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో చేపల చెరువులను అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో మత్స్యశాఖ మంజూరు చేసిన 74,100 చేపపిల్లలను శుక్రవారం అయన చెరువులో విడుదల చేసి, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు జీవనాధారంగా నిలుస్తాయని, చేపల పెంపకం ద్వారా రైతులు, మత్స్యకారులు ఆర్థికంగా బలపడతారన్నారు. చేపలపెంపకం ద్వారా ఆర్థిక తోడ్పాటు మాత్రమే కాకుండా వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగమని పేర్కొన్నారు. చెరువుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి అహ్మద్ ఇంతియాజ్ ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ భారతితోపాటు నర్మద, కిషన్, శ్రీనివాస్, రాయల నాగేశ్వర్రావు, రమాదేవి, నాగా సీతారాములు, మండె హన్మంతరావు, సలిగంటి శ్రీనివాస్, భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, బానోత్ సూర్య, పిట్టల శైలు, పొదిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దమ్మపేట: అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయిన కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి గాయాలైన ఘటన మండలంలోని పట్వారిగూడెం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి వెలుగోటి భాస్కరరావు (68) తన కుమారుడు లక్ష్మణ్కుమార్తో పాటు కుమారుడి మిత్రులు రవికాంత్, కృష్ణతో కలిసి, సత్తుపల్లి నుంచి పాల్వంచలోని బంధువుల ఇంటికి శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. కారును లక్ష్మణ్కుమార్ నడుపుతుండగా వారు పట్వారిగూడెం శివారుకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా కారుకు ఓ కుక్క అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. భాస్కరరావు, లక్ష్మణ్కుమార్, కృష్ణకు తీవ్ర గాయాలు కాగా రవికాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సత్తుపల్లికి తరలిస్తుండగా భాస్కరరావు మృతిచెందాడు. మిగిలినవారు సత్తుపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి భార్య లక్ష్మిజ్ఞానేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్ఐ రాఘవ తెలిపారు. ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి ములకలపల్లి: నూతనంగా ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటికి వస్తుండగా, ప్రమాదవశాత్తూ పల్టీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని చలమన్ననగర్కు చెందిన తెల్లం వెంకటేశ్, తమ బంధువు, డ్రైవర్ మడకం చిన్నసోమయ్య (30)తో శుక్రవారం ట్రాక్టర్ కొనేందుకు బైక్పై కొత్తగూడెం వెళ్లారు. కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేసి, తెల్లం వెంకటేశ్ బైక్పై ఇంటికి బయలుదేరగా, చిన్నసోమయ్య ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు. కమలాపురం క్రాస్రోడ్డు వద్ద అదుపతప్పి రోడ్డు పక్కగా ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో చిన్నసోమయ్య ఇంజన్ కింద ఇరుక్కొని మృతిచెందాడు. ఎస్ఐ మధుప్రసాద్ ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ఒకరు.. జూలూరుపాడు: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హెడ్కానిస్టేబుల్ వెంకటరత్నం కథనం మేరకు.. మండలంలోని సాయిరాంతండాకు చెందిన జాటోత్ రమేశ్ (38) కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి శరీరంలోకి ఏదో పురుగుమందు వెళ్లి ఉంటుందని, కొన్ని అవయవాలు చెడిపోయాయని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. రమేశ్ను హైదరాబాద్ నిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రమేశ్ అక్టోబర్ 29వ తేదీ అర్ధరాత్రి మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, విచారణ చేసి న్యాయం చేయాలని జాటోత్ నాగులు గురువారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ వెంకటరత్నం పేర్కొన్నారు. బార్ షాపులో వ్యక్తి మృతి ఇల్లెందు: పట్టణంలోని బార్ షాపులో ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం జగదాంబసెంటర్లోని బార్ షాపులో మండలంలోని మామిడి గుండాల గ్రామానికి చెందిన ముక్తి కొమురయ్య (36) మద్యం కోసం వచ్చి అదే షాపులో అలసటగా ఉందని పడుకున్నారు. గమనించిన షాపు వర్కర్లు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన తీరును బట్టి గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు బార్కు వచ్చి వాకబు చేశారు. పోలీసులు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కల్తీ మద్యం సేవించి ఉంటాడనే అనుమానంతో సీసీ ఫుటేజీలు తనిఖీ చేశారు. కాగా, కొమురయ్య చిన్న కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ కొనేందుకు వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కల్తీ మద్యంగా అనుమానం? -
ఎస్పీ కార్యాలయానికి ఎస్ఐ రామ్మూర్తి అటాచ్..
అశ్వారావపేట: అశ్వారావుపేట అదనపు ఎస్ఐ రామ్మూర్తిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందుకు కారణా లు బయటకు తెలియకున్నా.. ఎటాచ్మెంట్ విషయం బహిర్గతమైంది.ఈ విషయాన్ని ఎస్ ఐ యయాతిరాజు దృష్ఙికి తీసుకువెళ్లగా ఎటాచ్మెంట్ జరిగిన మాట వాస్తవమేనన్నారు. తడిసిన మక్కల పరిశీలన ఇల్లెందురూరల్: మండలంలోని పలు గ్రామాల్లో తుపాన్ ప్రభావంతో తడిసిన మొక్కజొన్న గింజలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు శుక్రవారం పరిశీలించారు. కొమరారం, ధనియాలపాడు, మాణిక్యారం గ్రామాల్లో పంట కల్లాల వద్దకు వెళ్లి తడిసిన మక్కలు ఆరబెట్టుకుంటున్న రైతులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్లో వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి భారీగా తగ్గిందని, మక్కలను విక్రయానికి సిద్ధం చేసిన సమయంలో వచ్చిన తుపాన్ తీరని నష్టానికి గురిచేసిందని వాపోయారు. మక్కలను ఆరబెట్టుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఏఓ వివరించారు. ఆయన వెంట ఏఓ సతీశ్, సిబ్బంది ఉన్నారు. గీత కార్మికుడికి గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని ముకుందాపురంలో శుక్రవారం తాటిచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో గీతకార్మికుడు బొంపెల్లి సైదులు తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న గౌడ సంఘం నేతలు నరాటి వెంకటేశ్వర్లు, ఐలు యాకయ్య, మోడెం కోటయ్య, సట్ల శ్రీనివాస్ తదితరులు బాధితుడిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం తరించారు. కాగా, సైదులును ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించారు. -
‘అర్బన్’లో సందిగ్ధం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 18,530 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు గడిచిన నాలుగైదు నెలలుగా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందిరమ్మ పథకంలో నిర్మించుకునే ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తోంది. పునాది నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష, గోడల నిర్మాణం తర్వాత రూ. లక్ష, శ్లాబ్ దశలో రూ. రెండు లక్షలు, ఫినిషింగ్లో మరో రూ.లక్ష లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ గ్రాంటులను ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ‘శ్లాబ్’ సాయం అందుతోంది జిల్లా వ్యాప్తంగా నాలుగైదు నెలలుగా ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల నిర్మాణ పనులు కీలకమైన శ్లాబ్ దశకు చేరుకున్నాయి. ఈ మేరకు రూ.2 లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాలో పడాల్సి ఉంది. ప్రభుత్వం అందించే రెండు లక్షల రూపాయల్లో రూ.60 వేలను ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పనులు అమల్లో లేనందున ఆ మేరకు సాయాన్ని మినహాయించి రూ.1.40 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కొన్ని రోజులుగా జమ అవుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద అందే రూ.60 వేల సాయం తమకు అందుతుందా లేదా అనే సందేహం ఇప్పుడు పట్టణ ప్రాంత లబ్ధిదారుల్లో నెలకొంది. భారం పెరుగుతోంది ప్రస్తుతం మార్కెట్లో సిమెంటు, ఐరన్, ఇసుక రేట్లు పెరిగాయి. కూలీలకు ఫుల్ డిమాండ్ ఉంది. పనిలోకి రప్పించాలంటే అధికంగా కూలి ఇవ్వాల్సి వస్తోంది. దీని వల్ల ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం కష్టంగా ఉంది. నూటికి తొంభై శాతం మంది లబ్ధిదారులు అదనంగా రెండు నుంచి మూడు లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని కోసం ఇప్పటికే వారు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో ప్రభుత్వం అందించే సాయంలో ‘ఉపాధి’కి సంబంధించిన రూ.60 వేలకు కూడా కోత పడితే తమపై మరింత భారం మోపై అప్పుల ఊబిలో కూరుకుపోతామనే భయం పట్టణ ప్రాంత లబ్ధిదారుల్లో నెలకొంది. ఈ విషయంపై ఇందిరమ్మ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ను వివరణ కోరగా.. గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ కార్డ్ లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడా ఉపాధి హామీ ద్వారా రూ.60 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు కూడా ఈ సాయం అందించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని, దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు పైనుంచి రావాల్సి ఉందని వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ప్రతీ ఏడాది 100 రోజుల పని దినాలను ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కల్పించాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో ఉపాధి హామీ పథకం భాగంగా చేయడంతో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలకు సంబంధించి జాబ్కార్డులు ప్రత్యేకంగా మంజూరు చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే అమలు చేస్తున్నారు. పట్టణ/మున్సిపాలిటీ ప్రాంతాల్లో నివసించే పేదలు ఈ పథకం పరిధిలోకి రారు. ఇందిరమ్మ ఇళ్లకు సాయంగా అందించే రూ.5 లక్షల్లో రూ.60 వేలను ఉపాధి హామీ ద్వారా సమకూర్చుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రూ.5 లక్షల సాయం పూర్తిగా అందుతుందా లేక ‘ఉపాధి’ ద్వారా వచ్చే రూ.60 వేలు మినహాయిస్తారా? అనే సందేహాలు పట్టణ ప్రాంత ఇందిరమ్మ లబ్ధిదారుల్లో నెలకొన్నాయి.మున్సిపాలిటీలు ఇందిరమ్మ పురోగతి లబ్ధిదారులు మణుగూరు 344 12.40 శాతం అశ్వారావుపేట 136 91.18 శాతం పాల్వంచ 291 ––– కొత్తగూడెం 366 ––– ఇల్లెందు 357 93 శాతంఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షల సాయం -
రైతుకు శ్రమ తగ్గేలా..
బూర్గంపాడు: విక్రయానికి ముందు ధాన్యం ఆరబెట్టేందుకు సరైన వసతులు, కల్లాలు లేక రైతులు ప్రతీ సీజన్లో అవస్థ పడుతున్నారు. హార్వెస్టర్లతో వరిపంట కోశాక పరదాలపై వడ్లు ఆరబోస్తున్నారు. ఆ సమయంలో అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఇలాంటి ఘటనలు ప్రతీ సీజన్లో ఎదురవుతూనే ఉన్నాయి. ఆరబెట్టేందుకు కూలీల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టేందుకు ప్యాడీ డ్రయ్యర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఒక్కో యంత్రానికి రూ. 17 లక్షలు జిల్లాలోని బూర్గంపాడు, కొత్తగూడెం, దమ్మపేట, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీలు నాలుగు ప్యాడీ డ్రయ్యర్ యంత్రాలను కొనుగోలు చేశాయి. మార్కెట్ కమిటీ ఆవరణలలో నిర్వహించే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యంత్రానికి రూ. 17లక్షల వరకు వెచ్చించారు. దీనిద్వారా గంటకు 30 టన్నుల వరకు ధాన్యాన్ని ఆరబెట్టే వీలుంది. ఇందుకోసం సుమారు 12 లీటర్ల వరకు డీజిల్ పడుతుంది. రైతులు డీజిల్ ఖర్చు భరిస్తే ప్యాడీ డ్రయ్యర్తో ఉచితంగా ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. ధాన్యం పరదాలపై ఆరబోసుకుని రోజూ కూలీలతో ఆరతిప్పేందుకు అయ్యే ఖర్చులో డీజిల్ ఖర్చు పదోవంతు కూడా ఉండదు. దీంతోపాటు సమయం కూడా కలిసివస్తుంది. అకాల వర్షాలతో పంట నష్టపోయే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. రైతులు వరి కోయగానే ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చి ప్యాడీ డ్రయ్యర్లో పోస్తే గంటల వ్యవధిలోనే తేమశాతం తగ్గుతుంది. దీంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 193 కొనుగోలు కేంద్రాలు ప్రస్తుత వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణకు ప్రభుత్వం 193 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కొనుగోళ్లకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. గన్నీ బ్యాగులు, ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సామగ్రిని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరికోతలు మొదలవుతున్నాయి. మరో వారం పదిరోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కాగా 16 శాతం కంటే తక్కువ తేమ ఉన్న ధాన్యాన్నే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ప్యాడీ డ్రయ్యర్లను అందుబాటులోకి తెస్తున్నా సరిపడా లేకపోవటం కూడా ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. జిల్లాలో నాలుగు మార్కెట్ యార్డుల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లోని యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులంతా ఇవే కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ డ్రయ్యర్లను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.ధాన్యం ఆరబెట్టేందుకు ప్యాడీ డ్రయ్యర్లు -
దుర్గంధం వెదజల్లుతున్న టాయిలెట్లు
ఈఎంఆర్ఎస్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. టాయిలెట్లు దుర్గంధం వెదజల్లుతున్నాయి. సగం మరుగుదొడ్లు పనిచేయడంలేదు. బాత్రూంలలో పంపులు విరిగిపోయాయి. బట్టలు ఉతుక్కునే వాష్ ఏరియా అపరిశుశ్రంగా మారింది. ఇక పాఠఽశాల ఆవరణలో పిల్లలు తినే కోడిగుడ్లు పడేసి ఉన్నాయి. మెనూ కూడా సక్రమంగా అమలు కావడంలేదని, కూరల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. టిఫిన్లో చట్నీ వడ్డించడంలేదని, తెలంగాణా సంస్కృతి అయినా బతుకమ్మ వేడుకలకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. తరగతి గదుల్లో బోర్డులు కూడా లేవన్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధిలకు చెబితే సిబ్బంది బెదిరింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. -
సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించొద్దు
కొత్తగూడెంటౌన్: బాలలు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలని, సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. శుక్రవారం జిల్లా కోర్టు మీటింగ్ హాల్లో జిల్లాస్థాయి అధికారులు భరోసా, షీటీం, బాలల సంక్షేమ కమిటీ సైబర్ క్రైం, పారా లీగల్ వలంటీర్లకు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమిషానికి 16 మంది ఇంటర్నెట్లో వేధింపులకు గురవుతున్నారని అన్నారు. అతిగా ఇంటర్నెట్ను వినియోగించడం వల్ల బాలల్లో శారీరక రుగ్మతలు వస్తున్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలతో జరిగే నష్టాలపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కోప్ ఆర్టి కో ఆర్డినేటర్ సుజాత, సైబర్ నిపుణుడు వెంకి నాయుడు, భరోసా ఎస్ఐ అరుణ, ఎస్ఐలు రమాదేవి, షేక్ జుబేదా, బాలల సంక్షేమ సమితి సభ్యులు సుమిత్రాదేవి, సాధిక్ పాషా పాల్గొన్నారు..జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ -
దేశ ఐక్యతలో పటేల్ కృషి ఎనలేనిది
కొత్తగూడెంటౌన్: దేశ సమగ్రత, ఐక్యతలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎనలేనిదని కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు అన్నారు. శుక్రవారం పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి ఫోస్టాఫీస్ సెంటర్ వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజలు ఐక్యమత్యంతో జీవించేలా పటేల్ కృషి చేశారని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని దేశ సమగ్రతకు కృషి చేయాలని సూచించారు. రామవరం టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫోర్ ఇంక్లైన్ నుంచి రుద్రంపూర్ ప్రగతివనం పార్కు వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులు నరేందర్, వెంకటేశ్వర్రెడ్డి, అబ్దుల్ రెహమాన్, మల్లయ్యస్వామి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. యువత ముందుకు సాగాలి సూపర్బజార్(కొత్తగూడెం): ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పటేల్ 150 జయంతి సందర్భంగా యువతలో ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యతా భావనలను పెంపొందించేందుకు పాదయాత్రల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన వంటి పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు, ఆరోగ్య శిబిరాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై ప్రసంగాలు, ఆత్మనిర్భర్ భారత్ ప్రతిజ్ఞలు, సర్టిఫికెట్ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే యువత https:// mybharat. gov. in/ pages/ unity& march వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విత్తన సేకరణ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు 40 రకాలైన 400 కిలోల విత్తనాలను సేకరించడం అభినందనీయమని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫర్నిచర్ తయారీలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఆసక్తిగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం ఐక్యతా ర్యాలీ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామయ్య సేవలో ఆదాయపన్నుశాఖ కమిషనర్భద్రాచలంటౌన్/దుమ్ముగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలను ఇన్కమ్టాక్స్ ప్రిన్సిపాల్ కమిషనర్ ప్రభాత్కుమార్ గుప్తా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భద్రాచలం అంతరాలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికా రులు స్వామివారి శాలువాతో సత్కరించి ప్రసా దం, జ్ఞాపికను అందజేశారు. పర్ణశాలలో కూడా పూజలు చేశారు. అనంతరం పంచవటి కుటీరం, నార చీరల ప్రాంతాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయ పీఆర్ఓ సాయిబాబు పాల్గొన్నారు. -
రెండు రోజులుగా నీళ్లు బంద్
● ఆందోళన చేపట్టిన ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ● అల్పాహారం తినకుండా స్కూల్లోనే నిరసన ములకలపల్లి: రెండు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తరగతులను బహిష్కరించి, క్యాంపస్ ఆవరణలోనే బైఠాయించి నిరసన తెలిపారు. మండల పరిధిలోని మూకమామిడిలో శివారులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఇక్కడ 225 మంది బాలురు, 210 మంది బాలికలు, మొత్తం 435 మంది విద్యార్థులు ఉన్నారు. వందమంది వరకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వారి కుటుంబీకులు ఉంటున్నారు. మోటారుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో రెండు రోజులుగా పాఠశాల, హాస్టల్ భవనాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గతంలో పలుమార్లు ఇదే సమస్య ఏర్పడినా, తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొస్తున్నారు. దీంతో శాశ్వత పరిష్కారం చూపాలంటూ పిల్లలు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా స్నానం చేయలేదని, ఉదయం బ్రెష్ చేసుకునేందుకు కూడా నీళ్లు లేవని వాపోయారు. అల్పాహారం తినకుండా నిరసన చేపట్టడంతో ఆర్సీఓ అరుణకుమారి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ససేమిరా అనడంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వచ్చి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి విద్యుత్ సమస్యను పరిష్కరించారు. కాగా విద్యార్థులు ఉదయం 7 గంటలకు తినాల్సిన టిఫిన్ 11 గంటలకు తిన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్కా అజిత్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అనుమల సాయి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. –ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రిన్సిపాల్ విజయ్కుమార్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 మంది టీచర్లు ఉండి కూడా సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓ అరుణకుమారి, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వరప్రసాద్, జీపీ కార్యదర్శి శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు, సురభి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె పాలన... పడేనా గాడిన?
● పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తం ● క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ ● ప్రకృతి వనాల పరిస్థితి అధ్వాహ్నం ● డీపీఓ అనూషకు సమస్యల స్వాగతం చుంచుపల్లి: పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. గ్రామాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. దీంతో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, సైడు కాలువలు, పైపులైన్లు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం అధ్వానంగా మారాయి. ఏడాదిన్నరగా పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై మరింతగా పనిభారం పెరిగింది. కనీసం వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, జీపీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా కొనలేకపోతున్నారు. ఇప్పటి దాకా తమ జేబుల్లో నుంచి ఖర్చు చేసిన కార్యదర్శులు ట్రాక్టర్ల నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్వహణ దెబ్బతిన్నది. కొన్ని పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు ఇవ్వలేదు. ఇటీవల జిల్లావ్యాప్తంగా 42 మంది పంచాయతీ కార్యదర్శులు జూలైలో ఫేక్ అటెండెన్స్తో దొరికిపోయారు. వీరందరికీ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. పలు మండలాల్లో ఎంపీఓల పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారిగా తొలిసారి బాధ్యతల్లో చేరిన గ్రూప్–1 ఆఫీసర్ బొప్పన అనూషపై పెద్ద బాధ్యతే ఉంది. పర్యవేక్షణ కరువు గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం 2024 జనవరి 31న ముగియడంతో ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి ప్రత్యేకాధికారిని నియమించింది. జిల్లాలోని 471 పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఏ గ్రామంలో చూసినా రోడ్లపైనే మురుగు, చెత్తాచెదారం కనిపిస్తున్నాయి. సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతుండడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక పాలన పట్టుతప్పుతోంది. గ్రామాల ప్రగతిపై తప్పుడు నివేదికలిస్తూ అధికారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రత్యేకాధికారులు తమ శాఖాపరమైన విధులతో పల్లె పాలనపై దృష్టి సారించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. సర్పంచుల పదవీకాలం పూర్తయి 19 నెలల నుంచి అభివృద్ధికి ఎలాంటి నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి ఆగింది. అటు గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండడంతో వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాకర్లకు డీజిల్ కొనేందుకు కూడా చిల్లిగవ్వలేదు. ప్రత్యేక అధికారులు సైతం చేసేదేమీ లేక కార్యదర్శులపై భారం మోపుతున్నారు. పట్టణాల మాదిరిగానే పల్లెల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 481 గ్రామ పంచాయతీల పరిధిలో 1,282 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. చాలా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు నిర్వహణ లేక కళ తప్పాయి. రూ.కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆహ్లాదం అందని ద్రాక్షగానే మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మొక్కలు లేకుండానే పల్లె ప్రకృతి వనాలు దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో అడపాదడపా మొక్కలు నాటినా సరైన సంరక్షణ చర్యలు చేపట్టక పోవడంతో కనిపించకుండానే పోయాయి. కొన్ని చోట్ల మొక్కలు నాటకుండానే తప్పుడు లెక్కలు నమోదు చేసి బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వనాల చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయి. కొన్నిచోట్ల కొద్దిపాటి మొక్కలను మాత్రమే నాటి పల్లె ప్రకృతి వనాల బోర్డులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక శ్మశానవాటికలను సైతం పట్టించుకునేవారే లేరు. వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు చాలా చోట్ల నిర్వాహణ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి దర్శనమిస్తున్నాయి. డంపింగ్యార్డుల్లోనూ సేంద్రియ ఎరువుల తయారీ పూర్తిగా అటకెక్కింది. ఇక గ్రామాల్లో కాల్వలు శుభ్రం చేయడం, తాగునీటి పైపులైన్ లీకేజీలు సరిచేయడం లాంటి పనుల కోసం కార్యదర్శులు అప్పులు చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక నిర్వహణ భారంగా మారిందంటున్నారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. కాగా ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.అమరులను స్ఫూర్తిగా తీసుకోవాలిభద్రాచలంఅర్బన్: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరుల స్ఫూర్తితో పోలీసులు పనిచేయాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భద్రాచలం న్యాయమూర్తి శివనాయక్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, పోలీస్ సిబ్బంది, పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ మాట్లాడారు. రక్తదానం దివ్యాంగులను అభినందించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న 100 మంది పోలీసులకు, యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అత్యధికంగా ఓఈఆర్ నమోదుఅప్పారావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో 20.01 శాతం అశ్వారావుపేట: దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో ఓఈఆర్ అత్యధికంగా 20.01శాతం నమోదైంది. గెలల నుంచి నూనె వచ్చే శాతాన్ని ఓఈఆర్(ఆయిల్ ఎక్ట్రార్షన్ రేష్యో)ను తెలంగాణ ఆయిల్ఫెడ్ నమోదు చేస్తుంది. అప్పారావుపేటలో నమోదయ్యే ఓఈఆర్ను అనుసరించే ఆయిల్పామ్ గెలల ధరను నిర్ణయిస్తారు. అప్పారావుపేట ఫ్యాక్టరీకి నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025(ఆయిల్ ఇయర్) వరకు 2,26,409 టన్నుల గెలలు, అశ్వారావుపేట ఫ్యాక్టరీకి 1,01,893 టన్నుల గెలలను రైతులు సరఫరా చేశారు. వీటిని క్రషింగ్ చేయగా అప్పారావుపేటలో 20.01శాతం, అశ్వారావుపేటలో 19.47 శాతం ఓఈఆర్ నమోదయింది. కాగా గతంలో ఆఈఆర్ 19.42శాతమే అత్యధికం. ఈసారి జరగనున్న ఓఈఆర్ సమావేశంలో రానున్న ఆయిల్ ఇయర్కు ఓఈఆర్ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఇల్లెందురూరల్: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. మండలంలోని కొమరారం హైస్కూల్లో శుక్రవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల పెండింగ్ బెనిఫిట్స్, జీపీఎఫ్, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, ఆశ్రమ పాఠశాలల్లో పండిట్, పీఈటీలను అప్గ్రేడ్ చేయాలని కోరారు. బి.రాజు, వెంకటేశ్వర్లు, కిషోర్సింగ్, టి.బాలు, హతిరాం, జయరాజు, రాంబాబు, రూప్సింగ్ పాల్గొన్నారు. -
ముడిపడని ముహూర్తం
● రక్తనిల్వ కేంద్రం ప్రారంభం ఎప్పుడో..? ● పరికరాలు, అనుమతులు ఉన్నా ఉపయోగం సున్నా ● మణుగూరు, అశ్వారావుపేటలో ప్రారంభం.. ఇల్లెందులో తప్పని ఎదురుచూపులు ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రానికి పరికరాలు, గది, సిబ్బంది సిద్ధంగా ఉన్నా ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.12 లక్షల చొప్పున వెచ్చించి రెండు నెలల క్రితమే పరికరాలు పంపిణీ చేశారు. మిగితా రెండు ఆస్పత్రుల్లో ఇప్పటికే సేవలు కొనసాగుతున్నా.. ఇల్లెందులో మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. దాతల నుంచి సేకరణ.. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షించి, ఈ కేంద్రంలో నిల్వ చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం చాలా అవసరం. శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి ఆపరేషన్ల వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే రక్తం అందుబాటులో ఉండాలి. ఈ కేంద్రాల్లో దాతలు అందించిన రక్తంలో ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ వంటివి వేరు చేసి విడివిడిగా నిల్వ చేస్తారు. తద్వారా ఆయా అవరాలకు గల వారికి సకాలంలో రక్తం అందడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అందుబాటులో పరికరాలు.. ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఇప్పటికే రక్త నిల్వ పరికరాలు చేరాయి. వీటితో పాటు సిరంజీలు, సేకరణ సంచులు, కుర్చీలు, టేబుళ్లు, లేబులింగ్, ట్రాకింగ్ సిస్టమ్స్, ఫ్రీజర్, ల్యాబ్ మెటీరియల్, స్టెరిలైజేషన్ పరికరాలు, కంప్యూటర్ వంటివి సిద్ధంగా ఉన్నాయి. పూర్తి ఏజెన్సీ ప్రాంత వాసులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వారిలో రక్తహీనతతో బాధపడే గర్భిణులు అధికంగా ఉంటారు. ఇక కిడ్నీ, లివర్ తదితర బాధితులకు కూడా ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. జిల్లాలోని మూడు ఆస్పత్రులకు రక్త నిల్వ కేంద్రాలు మంజూరు కాగా మణుగూరు, అశ్వారావుపేటలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇల్లెందులో కూడా మెటీరియల్, స్టాఫ్, ఫ్రీజర్లు, కంప్యూటర్ సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచలో ఇప్పటికే రక్త నిధి కేంద్రాలు ఉండగా, మణుగూరు, అశ్వారావుపేటలో ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇల్లెందులో కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రధాన సెంటర్లన్నింటిలోనూ రక్త నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. -
‘సింగరేణి’లో కొత్త ఏరియా!
సత్తుపల్లి: ఎన్నో ఏళ్లు సింగరేణి ప్రభావిత గ్రామస్తుల, కార్మికుల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఇన్నాళ్లు సత్తుపల్లిలోని బొగ్గు గనులు కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉండగా.. ఇప్పుడు సత్తుపల్లి కేంద్రంగా కొత్త ఏరియాను ఏర్పాటుచేశారు. అంతేకాక జీఎం సేఫ్టీ(కార్పొరేట్)గా విధులు నిర్వర్తిస్తున్న చింతల శ్రీనివాస్ను ఏరియా జీఎంగా నియమించారు. రోజుకు 40వేల టన్నుల ఉత్పత్తి çÜ™èl$¢-ç³-ÍÏ ç³Ç«¨ÌZ gôæÒBÆŠ‡ KïÜ&2, MìSÚëtÆý‡… KïÜË$ E¯é²Æ‡$$. Òsìæ §éÓÆ> ÆøkMýS$ çÜ$Ð]l*Æý‡$ 40ÐólÌS r¯]l$²ÌS »ŸVýS$Y E™èlµ-†¢ ^ólçÜ$¢…yýl-V>, OÆð‡Ë$ Ð]l*Æý‡Y…ÌZ 32Ðól-Ë$, Æøyýl$z Ð]l*Æ>Y¯]l 2.5 r¯]l$²ÌS »ŸVýS$Y Æý‡Ðé×ê ^ólçÜ$¢-¯é²Æý‡$. íÜ…VýS-Æó‡-×ìæ-ÌZ Cç³µ-sìæ-Ð]l-Æý‡MýS$ 11 HÇĶæ*-Ë$ E…yýl-V>... 12Ð]l HÇĶæ*-V> çÜ™èl$¢-ç³-ÍÏ BÑÆý‡Â-Ñ…-_…¨. M>V>, çÜ™èl$¢-ç³-ÍÏÌZ HÇĶæ* iG… M>Æ>Å-ÌS-Ķæ*-°MìS 2022 AMøtºÆŠḥæ16¯]l Ôèæ…MýS$-Ýë¦-糯]l ^ólÔ>Æý‡$. Hyé-¨ÌZV> °Æ>Ã׿… ç³NÇ¢^ólíÜ CMýSPyìl ¯]l$…^ól ç³Ç´ë-ÌS¯]l Mö¯]l-Ýë-WÝë¢-Ð]l$° A«¨M>Æý‡$-Ë$ ^ðlí³µ-¯é M>Æý‡Å-Æý‡*ç³… §éÌS-aÌôæ§ýl$. ©…™ø {糿êÑ™èl {´ë…™èl {ç³fË$, M>ÇÃMýS$-Ë$ çÜÐ]l$-çÜÅ-Ë$ ^ðl糚-MýS$-¯ól…§ýl$MýS$ Mö™èl¢-VýS*-yðl… ÐðlâêÏ-ÍÞ Ð]lÝù¢…¨. çÜ™èl$¢-ç³-ÍÏ HÇĶæ* HÆ>µr$, iG… M>Æ>Å-ÌS-Ķæ$…Oò³ GÐðl$ÃÌôæÅ yéMýStÆŠ‡ Ð]l$sêt Æ>VýS-Ð]l$Ƈ$$ íÜ…VýS-Æó‡×ìæ ïÜG…yîl ºÌS-Æ>…§ýl–íÙtMìS ¡çÜ$-MðS-âýæÏ-V> çœÍ™èl… Ð]l_a…¨. ©…™ø §ýl*Æ>¿êÆý‡… ™èlç³µ-yýlÐól$ M>MýS ÌêÈ Ä¶æ$fÐ]l*-¯]l$-ÌSMýS$ ÌZyìl…VŠæ, MøÌŒæ Æý‡Ðé×ê ç³ÇÃrÏ sñæ…yýlÆý‡$Ï çÜ™èl$¢-ç³-ÍÏ ¯]l$…^ól QÆ>Æý‡-Ð]l#-™éƇ$$. Æý‡*.2MørÏ Ð]lÅĶæ$…-™ø °ÇÃçÜ$¢¯]l² iG… M>Æ>Å-ÌSĶæ$… ç³NÆý‡¢Äôæ$Å Ð]lÆý‡MýS$ íÜ…VýS-Æó‡×ìæ VðS‹Üt-çßo-‹ÜÌZ M>Æ>Å-ÌSĶæ$… Mö¯]l-Ýë-VýS$-™èl$…¨. iG… M>Æ>Å-ÌS-Ķæ$…-™ø ´ër$ G‹ÜKr$ iG…, HÇĶæ* C…f±-ÆŠæ, òÜMýS*Å-Çsîæ, M>ÓÍsîæ BïœçܯЇ Ñ¿êV>Ë$ A…§ýl$-»êr$-ÌZMìS Æ>V>, õÜïœt, Oòœ¯é¯ŒSÞ, ç³Æý‡Þ-¯]lÌŒæ, çÜÆó‡Ó, GõÜtsŒæ Ñ¿êV>ÌS M>Æý‡Å-MýS-Ìê´ë-Ë$ Mö¯é²â¶æ$Ï Mö™èl¢-VýS*-yðl… ¯]l$…^ól Mö¯]l-Ýë-VýS$-™éƇ$$. వైఎస్సార్ చేతుల మీదుగా.. జేవీఆర్ ఓసీని 2005 మార్చిలో నాటి సీఎం వైఎస్. రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఆతర్వాత కిష్టారం ఓసీ ఏర్పాటైంది. జేవీఆర్ ఓసీ–2 మరో 20 ఏళ్లు, కిష్టారం ఓసీ జీవితకాలం మరో నాలుగేళ్లు ఉంది. అంతేకాక బ్లాక్–3 ఓసీకి టెండర్లు దక్కించుకున్న కంపెనీ పనులు చేపట్టాల్సి ఉంది. సింగరేణిలోనే సత్తుపల్లి ఏరియా పెద్దది కాగా, జేవీఆర్ ఓసీలో 1,300 మంది, కిష్టారం ఓసీలో 150 మంది పర్మనెంట్ కార్మికులు, ఔట్సోర్సింగ్లో 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. -
సమీకృత సాగుపై దృష్టి పెట్టాలి
టేకులపల్లి : సమీకృత వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. మండలంలోని తొమ్మిదోమైలు తండా, తంగెళ్లతండాలో తుపానుతో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పొలాల్లో నీరు నిల్వ ఉంటే మరింతగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున నీటిని తొలగించాలని చెప్పారు. పత్తి సాగు చేస్తున్న రైతులు ఆ తర్వాత మునగ సాగుపై దృష్టి సారించాలని కోరారు. మునగ సాగుతో ఇప్పటికే జిల్లాలో చాలా మంది రైతులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మునగ సాగుతో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. వరి సాగు చేసే రైతులు, నీటి ఆధారం ఉన్నవారు ఆయిల్ పామ్ సాగు చేయాలని, తద్వారా దీర్ఘకాలికంగా లాభాలు గడించవచ్చని తెలిపారు. పంటలతో పాటు కౌజు పిట్టలు, మేకలు, గేదెలు, చేపల పెంపకం చేపట్టాలని, కూరగాయలు సాగు చేయాలని, దీంతో రైతుల ఆదాయం మరింతగా పెరుగుతుందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఏడీఏ లాల్చంద్, ఏఓ అన్నపూర్ణ, ఏఈఓ రమేష్ తదితరులు ఉన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నాం.. సూపర్బజార్(కొత్తగూడెం): తుపాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాల్లో తీసుకోవాల్సిన భద్రతా, సహాయ చర్యలపై హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీకి జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. వీసీలో ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీఏఓ బాబూరావు, డీసీఎస్ఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. ఫర్నిచర్ అసిస్టెంట్ కోర్సులో మూడు నెలల శిక్షణసూపర్బజార్(కొత్తగూడెం): ఫర్నిచర్ అసిస్టెంట్గా ఆసక్తి ఉన్న వారికి రెసిడెన్షియల్ విధానంలో మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికకు నవంబర్ 6న కలెక్టరేట్లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్స్టాలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో స్థిరమైన ఉపాధి ఉంటుందని, మొదటి విడతలో ఎనిమిది మంది శిక్షణ పూర్తి చేసి రూ.15వేల వేతనంతో అప్రెంటిస్ చేస్తున్నారని తెలిపారు. రెండో విడతలో 20 మంది అభ్యర్థులను ఎంపిక చేయనుండగా ఆసక్తి ఉన్న వారు గూగుల్ ఫాం లేదా క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత, 18 – 30 ఏళ్ల వయస్సు, ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https:// tinyurl. com/4zv2bn67 గూగుల్ ఫాం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 79958 06182, 77994 70817 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఎట్టకేలకు రంగం సిద్ధం
● చేప పిల్లల పంపిణీకి నేడు శ్రీకారం ● జిల్లాలోని 650 చెరువుల్లో 1.76 కోట్ల పిల్లలు పాల్వంచరూరల్ : చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 650 చెరువుల్లో 1.76 కోట్ల పిల్లలు పోసే ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. టెండర్లు ముగిసినా.. జాప్యం చేపపిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ సెప్టెంబర్ రెండోవారంలోనే ముగిసింది. అయితే స్థానిక సంస్ధల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియకు కొంతకాలం బ్రేక్ పడింది. ఎట్టకేలకు నేటి నుంచి పిల్లల సరఫరా చేపడుతున్నారు. జిల్లాలోని 734 చెరువుల్లో పిల్లలు వదలాల్సి ఉండగా సమయాభావం పేరుతో 650 చెరువుల్లో మాత్రమే పోసేందుకు చర్యలు చేపడుతున్నారు. నీటినిల్వ సామర్థ్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద సైజు పిల్లలను పంపిణీ చేయనున్నారు. 80–100మి.మీ.సైజు గల 86 లక్షల పిల్లలు రూ.1.49 పైసల చొప్పున సరఫరాకు ఒప్పందం కుదిరింది. గతేడాది ఇదే సైజు పిల్లలు రూ.1.79 పైసల చొప్పున పంపిణీ చేశారు. ఇక 35 – 40 మి.మీ. సైజ్ పిల్లలు 90 లక్షలు పోయనుండగా రూ.0.56 పైసల చొప్పున పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. గతేడాది ఈ సైజు పిల్లలకు రూ.0.60 పైసల చొప్పున సరఫరా చేశారు. అయితే సాధారణంగా జూలైలో టెండర్లు ఆహ్వానించి ఆగస్టులో చేపపిల్లలు పోస్తారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులో జాప్యం జరగడంతో సెప్టెంబర్ రెండో వారంలో టెండర్లు ఖరారైనా ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కొందరు మత్స్యకారులు సొంత డబ్బులతో పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోసుకున్నారు. ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో శుక్రవారం ప్రారంభిస్తున్నాం. ఈ చెరువులో శీలావతి, రవ్వ, బొచ్చ రకాలకు చెందిన లక్ష పిల్ల లను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నాం. ఆ తర్వాత జిల్లాలోని ఇతర చెరువుల్లో 1.76 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తాం. – ఎండీ.ఇంతియాజ్ఖాన్, జిల్లా మత్స్యశాఖాధికారి -
పులుల గణన పక్కాగా నిర్వహించాలి
● డీఎఫ్ఓ కృష్ణా గౌడ్ పాల్వంచరూరల్: పులుల గణనను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అటవీశాఖాధికారి కృష్ణాగౌడ్ సూచించారు. మండల పరిధిలోని కిన్నెరసాని డీర్పార్కు వద్ద 100 మంది వైల్డ్లైఫ్ సిబ్బందికి, టెరిటోరియల్ పాల్వంచ డివిజన్లోని 100మంది ఫారెస్ట్ సిబ్బందికి సోములగూడెం రోడ్డులోని అర్బన్ పార్కులో గురువారం శిక్షణ ఇచ్చారు. అమ్రాబాద్ నుంచి వచ్చిన వైల్డ్లైఫ్ నిపుణులు మహేందర్రెడ్డి, రమాకాంత్ పులుల గణనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ మాట్లాడుతూ వచ్చే నెల 20 నుంచి 26 వరకు జాతీయ పులుల గణన నిర్వహించాలన్నారు. 20 నుంచి 23 వరకు మాంసాహార శాఖ జంతువులైన పులులు, ఎలుగుబండ్లు, చిరుతలు, నక్కలు, తోడేళ్లు వంటి జంతువుల గణన, 24 నుంచి 26 వరకు శాకాహార జంతువులు దుప్పులు, సాంబార్లు, అడవిదున్నలు తదితర జంతువుల గణన నిర్వహించాలని సూచించారు. ఎఫ్డీఓలు బాబు, కట్టా దామోదర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సబ్ జైలు తనిఖీఇల్లెందు: ఇల్లెందు సబ్ జైలును న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రికారెడ్డి గురువారం సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. దీర్ఘకాలంగా సబ్ జైలులో ఉంటున్న పేద ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జైలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక
పాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన స్పోర్ట్స్ మోడల్ స్కూల్లో గురువారం ఎంపిక చేశారు. సబ్ జూనియర్ విభాగంలో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈమేరకు వివరాలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య వెల్లడించారు. బాలుర విభాగంలో కె.రాంచరణ్, ఎం.చరణ్, కె.దిలీప్ కుమార్, కె.వినోద్కుమార్, వి.సంతోష్, జి.విజయవర్దన్, వెంకటయోగేశ్వర్, డి.ఆదిత్యప్రకాశ్, టి.మోహన్రెడ్డి, పి.దేవంత్ స్వామి, శివ శశాంక్, బాలికల విభాగంలో ఇ.అవంతిక, బి.సంజనశ్రీ, పి.హర్షిత, కె.జ్యోత్స్న, ఎం.గౌతమి, జె.సంస్కృతి ఎంపికయ్యారని తెలిపారు. వసతి, సౌకర్యాలు కల్పించాలిభద్రాచలంటౌన్/టేకులపల్లి: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ డీడీ అశోక్ అన్నారు. ఐటీడీఏలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరమ్మతులు, డైట్ చార్జీల నిధులు కేటాయించినట్లు తెలిపారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. వసతిగృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు రాయడం, చదవడంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో దమ్మపేట, ఇల్లెందు ఏటీడీవోలు చంద్రమోహన్, భారతీదేవి, సిబ్బంది రామకృష్ణారెడ్డి, రంగయ్య, హెచ్ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంట్లో గంజాయి నిల్వ● నిందితుడి అరెస్ట్ మణుగూరు టౌన్: బంధువు మాట విని ఎక్కువ డబ్బుతో సంపాదించాలనే ఆశతో ఇంట్లో గంజాయి నిల్వ చేసిన వ్యక్తి జైలుపాలయ్యాడు. గురువారం మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చల్లా సతీష్, అతని స్నేహితుడు రేపాకుల సాగర్ సీలేరు నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. సతీష్కు బాబాయి వరసయ్యే మణుగూరు గాంధీబొమ్మ సెంటర్కు చెందిన చల్లా శ్రీనివాస్ ఇంట్లో 3.5 కేజీల గంజాయిని నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టి, గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడు చల్లా శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, చల్లా సతీష్, సాగర్లను ములుగు పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగబాబు, ఎస్ఐలు నగేశ్, శ్రావణ్, సిబ్బంది సత్యనారాయణ ఉన్నారు. గంజాయి సీజ్భద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం భద్రాచలం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ రహిమున్నిసా బేగం కథనం ప్రకారం.. పట్టణంలోని కూనవరం రోడ్డు ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది. గంజాయి తరలిస్తున్న మహ్మద్ హస్సన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయితోపాటు కారు, సెల్ఫోన్ సీజ్ చేశారు. -
● రక్షణ కోసం పోలీస్స్టేషన్కు వచ్చిన ప్రేమజంట ● యువతి బంధువుల ఆగ్రహంతో ఠాణాలో ఉద్రిక్తత
పోలీసులపై దాడికి యత్నంజూలూరుపాడు: జూలూరుపాడు ఠాణాలో గురువారం పోలీసులపై దాడికి యత్నం జరిగింది. ప్రేమజంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని అన్నారుపాడుకు చెందిన యువతి గంగ, జూలూరుపాడుకు చెందిన అఖిల్ ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు, బంధువులు గురువారం రాత్రి పోలీస్స్టేషన్ను ముట్టడించారు. యువతి కనిపించడంలేదని వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ సుమారు మూడు వందల మంది బంధువులు ఆందోళనకు దిగారు. యువతీ, యువకులు ఇద్దరూ మేజర్లు కావడంతో ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించామని పోలీసులు ఆందోళనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు, బంధువులు వినిపించుకోకుండా ఒక్కసారిగా పోలీస్స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. కుమార్తెను అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగ్గా, యువతి తల్లి స్పృహ కోల్పోయింది. దీంతో రెచ్చిపోయిన బంధువులు పోలీసులపైకి చెప్పులు విసరడంతోపాటు, దాడికి యత్నించారు. ఎస్ఐ బాదావత్ రవి అప్రమత్తమై ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సిబ్బందితో చేరుకుని ఆందోళనకారులను పోలీస్స్టేషన్ నుంచి బయటకు వెళ్లగొట్టారు. పరిస్థితిని అదుపు చేశారు. పోలీస్స్టేషన్పై దాడికి యత్నించిన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, చండ్రుగొండ ఎస్ఐ శివరామక్రిష్ణ, సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి, చుంచుపల్లి ఎస్ఐ ఉమా, లక్ష్మీదేవీపల్లి ఎస్ఐ రమణారెడ్డి, త్రీటౌన్ ఎస్ఐ శివప్రసాద్, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కాగా యువతి డిగ్రీ చదువుతుండగా, యువకుడు పీజీ చేస్తున్నట్లు తెలిసింది. -
‘ఎస్ఐఆర్’ జాబితా సిద్ధం చేయండి
బూర్గంపాడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఓటర్ జాబితాను తప్పుల్లేకుండా పకడ్బందీగా సిద్ధం చేయాలని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. బూర్గంపాడు తహసీల్ కార్యాలయంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో చేసిన ఎస్ఐఆర్తో ప్రస్తుత జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలన్నారు. శనివారం నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, ఆర్ఐ నర్సింహారావు, వీర్రాజు, జీపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. గిరిజనుల విద్య బలోపేతానికి చర్యలు అశ్వాపురం : గిరిజన చిన్నారుల విద్య బలోపేతానికి ఉద్దీపకం వర్క్ బుక్ను ప్రవేశపెట్టామని పీఓ రాహుల్ తెలిపారు. మండలంలోని కోరెంవారి గూడెం, రామవరం గిరిజన సంక్షేమ పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. పిల్లల సామర్థ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్దీపకం వర్క్ బుక్తో విద్యార్థుల్లో చాలా వరకు మార్పులు వచ్చాయని, అయినా ఇంగ్లిష్ పదాలు అక్కడక్కడ తప్పులు రాస్తున్నారని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ తప్పులు కూడా లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీఆర్పీ గాంధీ, ఉపాధ్యాయులు సాయం కృష్ణయ్య, శోభన్బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
కమనీయంగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. కొనసాగుతున్న క్రీడా పోటీలుపాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ క్రీడా పోటీలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. పోటీల్లో శ్రీశైలం, నాగర్జునసాగర్, పోచంపాడు, విద్యుత్ సౌధ, బీటీపీఎస్, కేటీపీఎస్ టీమ్లు పాల్గొన్నాయి. టేబుల్ టెన్నీస్లో విన్నర్గా విద్యుత్ సౌధ, రన్నర్ 7వ దశ, ఓపెన్ డబుల్స్ విన్నర్ విద్యుత్ సౌధ, రన్నర్గా కేటీపీఎస్ 7వ దశ, క్యారమ్స్లో విద్యుత సౌధ విన్నర్, 7వ దశ రన్నర్, షటిల్ టీం ఈవెంట్లో విద్యుత్సౌధ విన్నర్, కేటీపీఎస్ 7వ దశ రన్నర్గా నిలిచాయి. మిగితా పోటీలు శుక్రవారం ముగియనున్నాయి. స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, కౌన్సిల్ సెక్రటరీలు మహేష్, వీరస్వామి, నరసింహారావు పాల్గొన్నారు. కిన్నెరసానికి విదేశీ పర్యాటకులుపాల్వంచరూరల్ : మండలంలోని కిన్నెరసానిని గురువారం విదేశీ పర్యాటకులు సందర్శించారు. జర్మనీ దేశస్తులు సందర్శించి డీర్పార్కులోని దుప్పులను, జలాశయాన్ని వీక్షించి ఆ తర్వాత బోటు షికారు చేశారు. అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలిమణుగూరు రూరల్ : అవినీతి రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీటీపీఎస్ సీఈ బిచ్చన్న పిలుపునిచ్చారు. థర్మల్ కేంద్రంలో గురువారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. ఉద్యోగలంతా నిజాయితీగా పని చేస్తూ దేశం, సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. సాంబాయిగూడెం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈలు సూర్యనారాయణ, పార్వతి, డీవైసీసీ శ్రీనివాస్, విజిలెన్స్ డీఎస్పీ రమేష్, అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి, సేఫ్టీ డీఈ ఆనందప్రసాద్, ఏడీఈలు రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘ఓపెన్’ ఫలితాలు విడుదలకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో గత నెల 22 నుంచి 28 వరకు జరిగిన ఓపెన్ ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయని డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. ఇంటర్లో 289 మందికి గానూ 141 మంది, పదో తరగతిలో 280 మందికి 52 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాల వివరాలను వెబ్సైట్ నుంచి పొందవచ్చని, 25 రోజుల్లో మార్కుల మెమోలు స్టడీ సెంటర్లకు చేరుతాయని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు నవంబర్ 4 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రీకౌంటింగ్ ఇంటర్కు రూ.400, పదో తరగతికి రూ.350, రీ వెరిఫికేషన్ ఇంటర్కు రూ.1,200, పదో తరగతికి రూ.1,200 చెల్లించాలని, వివరాలకు స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ను సంప్రదించాలని సూచించారు. -
ఏజెన్సీ ఆస్పత్రికి సుస్తీ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. భవనాలు మరమ్మతులు నోచుకోవడంలేదు. దీంతో ఏజెన్సీ ప్రజలకు పూర్తిస్థాయిలో చికిత్స అందడంలేదు. 100 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రిని 2018లో 200 పడకలకు అప్గ్రేడ్ చేశారు. నూతన భవనాలు నిర్మించారు. అధునాతన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడకు భద్రాచలం ఏజెన్సీ, మణుగూరు, పాల్వంచ ప్రాంతాలతోపాటు సరిహద్దు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కూడా చికిత్స కోసం వస్తుంటారు. కానీ సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్యం అందటం లేదు. 112 పోస్టులు ఖాళీ.. ఆస్పత్రిలో 212 మంది వైద్యులు, సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం 100 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 69 వైద్య పోస్టులుండగా, ప్రస్తుతం కాంట్రాక్ట్, రెగ్యులర్ కలిపి 34 మందే పనిచేస్తున్నారు. సిబ్బంది 143 మంది పోస్టులు ఉండగా, 66 మంది పనిచేస్తున్నారు. వారిలో రెగ్యులర్ 50, ఔట్సోర్సింగ్ 16 మంది ఉన్నారు. 20 మందికి పైగా ఇతర ఆస్పత్రుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. నలుగురు మాత్రం ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చి ఇక్కడ డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్న వైద్యులు కూడా సమయపాలన పాటించడంలేదని, విధులకు ఆలస్యంగా వస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యూరో, కార్డియాలజీ వైద్యులు లేరు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నిత్యం అధిక సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. గర్భిణులకు స్కానింగ్ సేవలు అందించాల్సి ఉంటుంది. రేడియాలజీ విభాగంలో ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. న్యూరోసర్జన్, కార్డియాలజిస్ట్, ఎముకల వైద్య నిపుణులు ఒక్కరూ లేరు. దీంతో ఆయా సమస్యలపై వచ్చే బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సివస్తోంది. ఫలితంగా రూ. వేలు, రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అరకొరగా సివిల్ సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లు సివిల్ సర్జన్లు 16 పోస్టులు ఉండగా, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 37 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 29 మంది ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 మందిలో 21 మంది ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో కేవలం 8 మంది మాత్రమే విధులు నిర్వరిస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందడంలేదు. స్టాఫ్ నర్సుల్లో 40 పోస్టులు ఖాళీ స్టాఫ్ నర్సుల్లో 53 పోస్టులకు 13 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. మిగిలిన 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ నర్సులలో కూడా 9 పోస్టులకు 9 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కానీ వీరిలో కొందరు డిప్యూటేషన్పై ఇతర ఆస్పత్రుల్లో విధులు నిర్వరిస్తున్నారు. కొందరు నర్సింగ్ సిబ్బంది భద్రాచలం ఆస్పత్రిలో విధి నిర్వహణకు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పట్టించుకోని ఉమ్మడి జిల్లా మంత్రులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు ఒక్కరూ ఆస్పత్రిని సందర్శించి, సమస్యలు తెలుసుకోలేదు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ పలుమార్లు సందర్శించి ఆస్పత్రి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ గతేడాది ఆగస్టు 8న ఆస్పత్రిని సందర్శించి వైద్య నిపుణుల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. మినీ టీ–హబ్, డ్రగ్ స్టోర్ కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.ఆస్పత్రి, పరిసరాలు సమస్యలకు నిలయంగా మారాయి. భవనంలో డోర్లు చెదలు పట్టి పాడైపోయాయి. పుచ్చిపోయిన గుమ్మాలు, వేలాడుతున్న కిటీకీలు, పడిపోయిన స్టీల్ రైలింగ్, పెచ్చులూడుతున్న కిటికీలు బాధితులను కలవరపెడుతున్నాయి. కాగా ఆస్పత్రి గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన పలు అసెస్మెంట్లలో మొదటి స్థానం దక్కించుకుంది. కానీ ఇందుకు సంబంధించి రూ.30 లక్షల నగదు ఆస్పత్రికి అందలేదు. దీంతో మరమ్మతులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి అభివృద్ధికి కూడా నిధుల కొరత వెంటాడుతోంది.వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత పోస్టులు ఉన్నది ఖాళీలు సివిల్ సర్జన్ 16 3 13 సివిల్ సర్జన్ ఆర్ఎంఓ 1 0 1 డిప్యూటీ సివిల్ సర్జన్ 9 1 8 డెంటల్ సివిల్ సర్జన్ 1 0 1 డిప్యూటీ డెంటల్ సర్జన్ 1 0 1 సివిల్ అసిస్టెంట్ సర్జన్ 37 8 29 ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ 1 0 1 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 3 1 2 డెర్మటాలజీ 1 0 1ఏరియా ఆసుపత్రిలో గల వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బంది కొరత ఉంది, అదే విధంగా ఏరియా ఆసుపత్రి భవనం, డోర్లు, కిటీకీలు, గుమ్మాలకు మరమ్మత్తులకు సంబంధించి అవార్డులకు రావాల్సిన నగదు వస్తే చేయిస్తాము, లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాము. – డాక్టర్ రామకృష్ణ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా
మణుగూరు టౌన్: గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీ మణుగూరు శివారులో గురువారం తెల్లవారుజామున బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్యాస్ సిలిండర్ల లోడ్తో లారీ విజయవాడ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు శివారు సాయినగర్ సమీపంలో డివైడర్ ఎక్కి వాహనం బోల్తా పడింది. స్థానికుడు గమనించి డ్రైవర్ను కేబిన్ నుంచి బయటకు తీయగా ప్రమాదం తప్పింది. లారీలో 340 సిలిండర్లు ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్లను మరో లారీలో ఎక్కించారు. రోడ్డుపై నుంచి లారీని తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. కాగా ఒక్క సిలిండర్ లీకై నా పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. రెండు నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు కొత్తగూడెం– ఏటూరునాగారం మార్గంలో నెలలు తరబడి డివైడర్ పనులు సాగుతున్నాయి. నిర్మాణాల వద్ద వీధిలైట్లు, స్టాపర్లు, రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రెండు నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఓ లారీ రాత్రివేళ డివైడర్ను ఎక్కి ప్రమాదానికి గురైంది. బైక్పై వెళ్తున్న వ్యక్తి మరమ్మతులకు గురైన గుంతల్లో పడి అదే ప్రదేశంలో తీవ్రగాయాలపాలయ్యాడు. తాజాగా గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడింది. అధికారులు స్పందించి వీధిలైట్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.త్రుటిలో తప్పిన ప్రమాదం -
పోలీస్ అమరులను స్మరించుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: పోలీసు అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో త్రీటౌన్ పోలీసు స్టేషన్లో గురువారం ఆన్లైన్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. అందుబాటులో ఉన్న స్కూళ్ల విద్యార్థులు స్వయంగా ఓపెన్ హౌస్ను సందర్శించారు. పోలీసు వ్యవస్థ పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్, స్మోక్ గన్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం పని విధానాన్ని వివరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సీఐలు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, కరుణాకర్, ఆర్ఐ లాల్ బాబు, ఎస్సైలు అరుణ, రమాదేవి పాల్గొన్నారు. -
మహిళ అదృశ్యం
దమ్మపేట: మహిళ అదృశ్యంపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన కనకం సావిత్రికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు ఆమె అంగీకారంలేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సావిత్రి ఈ నెల 22న ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. భర్త గోపాలరావు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లేదు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యమణుగూరు టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్యాలమ్మనగర్ పంచాయతీకి చెందిన మాలెం శ్రీనివాస్(40) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండటంతో ఆరునెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు కూతుళ్లను హాస్టల్లో చేర్పించాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఈ నెల 28న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయే దశలో ఉందని, మృతుడి భార్య దుర్గాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రావణ్ తెలిపారు. ముద్దాయికి ఏడేళ్ల జైలుశిక్షకొత్తగూడెంటౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను హతమార్చి, భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ బుధవారం కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.కిరణ్కుమార్ తీర్పుచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్కు చెందిన రాజేశ్వరికి డోర్నకల్ ప్రాంతా నికి చెందిన కొలిపాక అశోక్తో 20ఏళ్ల క్రితం విహహం జరిగింది. అనంతరం వారు పాల్వంచలోని మంచికంటి నగర్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మాచర్ల ఏసోబు అనే వ్యక్తితో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అశోక్ ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2019 నవంబర్ 5న జరిగిన ఈ ఘటనపై మృతిరాలి సోదరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ను దాఖలు చేశారు. న్యాయమూర్తి 16 మంది సాక్షులను విచారించగా, మాచర్ల ఏసోబుపై నేరం రుజువుకావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, సిబ్బంది జి.రాఘవయ్య, ఎం.శ్రీనివాస్, జె.రవి సహకరించారు. బొలెరో వాహనం బోల్తాభద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్గేట్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబేద్కర్ సెంటర్ నుంచి సారపాక వైపు వస్తున్న ఓ బొలెరో వాహనం డివైడర్కు ఉన్న రైలింగ్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీ సహాయంతో స్థానికులు ఆ బొలెరో వాహనాన్ని పక్కకు జరిపారు. పేకాట స్థావరంపై దాడిములకలపల్లి: మండల పరిధిలోని మాధారం గ్రామశివారులో పేకాట శిబిరంపై బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎస్.మధుప్రసాద్ తెలిపారు. అరెస్టయినవారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని, రూ 5,150, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తూరుబాకలో చోరీదుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి స్వప్న ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రూ.55వేలు నగదు, రూ.15వేల విలువైన ఫోన్ను అపహరించారు. బాధితురాలు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
బీమా సొమ్ము స్వాహా
భద్రాచలంఅర్బన్: బీమా సొమ్ము కాజేసిన నలు గురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్నగర్కు చెందిన భూక్యా శ్రీ రాములు మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువపత్రం ద్వారా భద్రాచలం ఎల్ఐసీ శాఖ నుంచి రూ.10లక్షల పరిహారం పొంది వాటాలు పంచుకున్నారు. వాటాదారుల మధ్య విభేదాలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విషయం బయట పడింది. నిందితులు భూక్యా రాధ, ఆమె భర్త భూక్యా శ్రీ రాములు, భూక్యా లక్ష్మా, షేక్ యాకుబ్ పాషాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. మిగిలిన ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. భద్రాచలం ఎల్ఐసీ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులు అరెస్ట్ -
మెరుగుపడేనా..?
పరీక్ష ఫలితాలుకొత్తగూడెంఅర్బన్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజుల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెలలోగా పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షల తేదీలు వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలో గతేడాది ఆశించిన ఫలితాలు రాబట్టాలేకపోయిరు. ఈ ఏడాదైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం డీఈవో రిటైర్డ్ కాగా, జెడ్పీ సీఈవోకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విద్యాశాఖపై దృష్టి సారించే అవకాశం లేకపోవడంతో భారం అంతా జిల్లా విద్యాశాఖ కోఆర్డి నేటర్లపైనే పడినట్లు తెలుస్తోంది. నో స్నాక్స్ సెప్టెంబర్ నుంచే పదోతరగతి విద్యార్థులకు పాఠశాలల్లోఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసు లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు నీరసపడకుండా ఏటా ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్ అందిస్తున్నారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో స్పెషల్ క్లాసుల్లో స్నాక్స్ ఇవ్వడంలేదు. దీంతో విద్యార్థులు నిరుత్సాపడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు స్టడీ అవర్స్ గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 27వ స్థానంలో నిలువగా 91.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్మీడియట్కు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 62.56, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్రస్థాయిలో జిల్లాకు 9వ స్థానం దక్కింది. ఇంటర్మీడియట్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కళాశాలల్లో సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. సైన్స్ గ్రూపుల విద్యార్థులకు హైదరాబాద్ నుంచి ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. స్టడీ అవర్స్ను, ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఇంటర్మీడియట్ అధ్యాపకులు చెబుతున్నారు. కళాశాలల్లో అమలుకాని మధ్యాహ్న భోజనం జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలకు విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. చాలా మంది మధ్యాహ్నం లంచ్ బాక్సులు తెచ్చుకోకుండానే కళాశాలలకు వచ్చి సాయంత్రం వరకు ఉంటారు.ఈ నేపథ్యంలో కళాశాలల్లో మధ్యా హ్న భోజనం అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కళాశాలల నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ అమలు చేయడంలేదు. కాగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను, జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను నియమించారు. ఈ నేపథ్యంలో అధ్యాపకులు విద్యార్థులపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం
కొణిజర్ల/అశ్వారావుపేటరూరల్: కొణిజర్ల మండ లం అంజనాపురం సమీపాన నిమ్మ వాగులో బుధవారం ఓడీసీఎం కొట్టుకుపోగా డ్రైవర్ గల్లంతయ్యా డు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి మారుతినగర్కు చెందిన ఆరేపల్లి మురళి (32) మూడు రోజుల క్రితం అదే మండలం నారావారిగూడెం వాసి మునుగొండ వెంకటముత్యం డీసీఎం వ్యాన్కు డ్రైవర్గా వచ్చాడు. సుజాతనగర్లో పత్తి లోడ్ తీసు కుని వరంగల్ జిల్లాలో దిగుమతి చేసి బుధ వారం వస్తుండగా అంజనాపురం వద్ద నిమ్మవాగు వరద బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. కొణిజర్ల వైపు నుంచి డీసీఎంలో వస్తున్న మురళి వరద దాటేందుకు యత్నిస్తుండగా మరో వైపు ఉన్న స్థానికులు, ఏన్కూరు పోలీసులు వారించారు. అయినా వినకుండా ముందుకు సాగడంతో వరద ఉధృతికి వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడనే సమాచారం తెలియంతో ఎస్ఐ జి.సూరజ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి గాలించగా సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియరాలేదు. కాగా, మురళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గల్లంతయ్యాడనే సమాచారం తెలియడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. వరదలో గల్లంతైన డ్రైవర్ -
పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా సురేష్బాబు
భద్రాచలంటౌన్: ీపఆర్టీయు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణా నికి చెందిన తోటమళ్ల సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్ బుధవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘జీఎన్ఎం’ గడువు పొడిగింపుచుంచుపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి విడుదలైన జీఎన్ఎం కోర్సుల్లో చేరికలకు గడువు తేదీని నవంబర్ వరకుపొడిగించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖమ్మం మార్కెట్కు సెలవుల పొడిగింపు ఖమంవ్యవసాయం: ‘మోంథా’ తుపాను కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులను పొడిగించారు. తొలుత బుధవారం వరకు సెలవు ప్రకటించగా.. తుపాన్ తీవ్రత నేపథ్యాన శుక్రవారం(31వ తేదీ) వరకు సెలవులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై నవంబర్ 1న శనివారం, 2న ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో నవంబర్ 3వ తేదీ సోమవారం నుంచి పంట కొనుగోళ్లు మొదలవుతాయని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని సూచించారు. 2న అండర్–19 నెట్బాల్ ఎంపికలు ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల నెట్బాల్ జట్లను వచ్చేనెల 2న ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో జరుగుతాయని జూనియర్ కళాశాల క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 98483 41238 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఇద్దరిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందంకొణిజర్ల: పోలీసులు, స్థానికులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ద్విచక్ర వాహనంపై వరద దాటేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులు పడిపోగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కాపాడారు. కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన పగిడేరు ఉధృతంగా ప్రవహిస్తుండగా బుధవారం మధ్యా హ్నం పోలీసులు ట్రాక్టర్ అడ్డు పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఇంతలోనే ఇద్దరు యువకులు పోలీసులను ఖాతరు చేయకుండా వాగు దాటే క్రమాన వరద ఉధృతికి వాహనం జారి పడబోయింది. అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించి తాళ్ల సాయంతో ద్విచక్రవాహనం సహా యువకులను బయటకు లాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
కిచెన్గార్డెన్లతో ఆరోగ్యం
● కూరగాయలు, ఆకు కూరల మొక్కల పెంపకం ● పిల్లలు, గర్భిణులకు రసాయన రహిత ఆహారం.. ● జిల్లాలోని 295 అంగన్వాడీ కేంద్రాల్లో పెంపకం పోషన్ వాటిక కార్యక్రమంలో భాగంగా 55 అంగన్వాడీ కేంద్రాల్లో గతేడాది కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశాం. మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది 295 కేంద్రాల్లో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేపట్టాం. విడుతల వారీగా అన్ని కేంద్రాల్లో అమలు చేస్తాం. –స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారిగుండాల: అంగన్వాడీ కేంద్రాల్లో ఆట పాటలతో కూ డిన గుణాత్మక విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పోషన్ వాటిక కార్యక్రమంలో భా గంగా కిచెన్ గార్డెన్లకు శ్రీకారం చుట్టారు. గతేడాది 55 అంగన్వాడీ కేంద్రాల్లో వీటిని పెంచారు. ఆయా కేంద్రాల్లోనే కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేయాల్సి ఉంది. రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పండించే కూరగాయలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 295 కేంద్రాల్లో సాగు.. జిల్లాలో పోషన్ వాటిక కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 295 అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు పెంచుతున్నారు. గతేడాది సత్ఫలితాలు రావడంతో ఈసారి కేంద్రాల సంఖ్య పెంచారు. ఈ ఏడాది మండలానికి నాలుగు నుంచి ఐదు కేంద్రాలను ఎంపిక చేసి కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. తోటకూర, గోంగూర, పుదీన, కొత్తిమీర, మెంతుకూర వంటి ఆకు కూరలతోపాటు బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడు తదితర కూరగాయలు పండిస్తున్నారు. ఒక్కో కిచెన్ గార్డెన్కు రూ.10 వేలు కిచెన్ గార్డెన్ పెంపకానికి ఒక్కో కేంద్రానికి రూ.10 వేల చొప్పున విడుదల చేశారు. ఆరు రింగులు ఏర్పాటు చేసుకుని, ఖాళీ స్థలంలో మట్టి నింపుకోవాలి. ఆరు సిమెంట్ పోల్స్ వేసి గ్రీన్ మ్యాట్ కట్టాలి. మొక్కలు ఏపుగా పెరిగి, కాపు వచ్చే వరకు కిచెన్ గార్డెన్లను కాపాడుకోవాల్సి బాధ్యత టీచర్, ఆయాలపైనే ఉంది. ప్రస్తుతం పెంచుతున్న కేంద్రాల్లో సత్ఫలితాలు వస్తే అన్ని కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల పెంపకానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపా రు. వీటిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతోనే పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌషికాహారం అందించాలని చెబుతున్నారు. దీంతో కూరగాయలు, ఆకు కూరలు కిరాణ దుకాణాల్లో కొనుగోలు చేసుకునే అవసరం ఉండదు. రసాయనిక ఎరువుల ప్రభావం లేకపోవడంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. డీపీఓగా బాధ్యతల స్వీకరణచుంచుపల్లి: జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా నియమితులైన బొప్పన అనూష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీపీఓగా పనిచేస్తున్న టి.రాంబాబును హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన అనూషను కార్యాలయ సిబ్బంది, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనూష స్వస్థలం ఖమ్మం కాగా, ఆమె తొలి పోస్టింగ్ జిల్లాకు కేటాయించారు. ‘డీఎంఎల్టీ’ దరఖాస్తు గడువు పొడిగింపుచుంచుపల్లి: 2025 – 26 విద్యాసంవత్సరానికి గానూ కొత్తగూడెం వైద్య కళాశాలలో డీఎంఎల్టీ 30, డయాలసిస్ టెక్నీషియన్ 30 సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.హరిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్(బైపీసీ) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లిలో హాకీ స్టేడియంకొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల వెనుక హాకీ స్టేడియం నిర్మించనున్నట్లు డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ స్థలంలోని వివిధ రకాల 78 వృక్షాల తొలగింపునకు అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నామని, అవసరమైన రుసుము కూడా చెల్లించామని పేర్కొన్నారు. చెట్లను కొనాలనుకునే వారు నవంబర్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు. పలు రూట్లలో బస్సుల రద్దు ఖమ్మంమయూరిసెంటర్: తుపాను ప్రభావంతో ఖమ్మం రీజియన్ పరిధిలో పలు మార్గాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. రీజియన్ పరిధి ఏడు డిపోల నుంచి 128 బస్సులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల రహదారులపైకి వరద చేరడంతో ముందు జాగ్రత్తగా ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ రూట్లలో బస్సులు నడిపించలేదు. ఖమ్మంతోపాటు మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి వివిధ మార్గాల్లో బుధవారం ఒకేరోజు 60,872 కి.మీ. మేర సర్వీసులు రద్దయ్యాయి. అత్యధికంగా సత్తుపల్లి డిపో నుంచి 35, భద్రాచలం డిపో నుంచి 25, ఖమ్మం నుంచి 22, కొత్తగూడెం నుంచి 15, ఇల్లెందు నుంచి 11, మధిర, మణుగూరు నుంచి పదేసి సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
నేలవాలిన ఆశలు
సూపర్బజార్(కొత్తగూడెం)/బూర్గంపాడు: అన్నదాతల ఆశలపై మోంథా తుపాన్ నీళ్లు చల్లింది. ఎంతో ఆశతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా.. పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. చేతికందే దశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో ఈ వానాకాలంలో 2,21,345 లక్షల ఎకరాల్లో పత్తి, 1,72,625 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పంటలూ కోతకు సిద్ధమవుతున్న తరుణంలోనే తుపాన్ విరుచుకుపడి రైతులను నట్టేట ముంచింది. దిగుబడి తగ్గి.. రంగు మారి.. మోంథా తుపాన్ ప్రభావంతో బలమైన గాలులు వీయగా వరి నేలవాలింది. వర్షంతో పొలాల్లో నీరు నిలిచి వరి పంట దెబ్బతిన్నది. పత్తిలో వర్షపునీరు చేరడంతో నల్లబారే ప్రమాదంతో పాటు దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కూడా కోతదశలో ఉండగా కంకులు నానడంతో ధాన్యం రంగు మారుతుందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి కోయగా.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని, తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇక దిగువ ప్రాంతాల్లోని వరి పొలాలను వర్షపు నీరు ముంచెత్తడంతో మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. పైరు నేలవాలడంతో హార్వెస్టర్లతో కోసే అవకాశం లేకుండా పోతోంది. పత్తి కాయలు పగిలి, దూది బయటకు వస్తున్న తరుణంలో భారీ వర్షాలు కురవడంతో దూది పూర్తిగా తడిసిపోయింది. రంగు మారి నాణ్యత తగ్గింది. రంగు మారిన పత్తికి మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఇప్పటికే సీసీఐ విధించిన నిబంధనలతో సతమతమం అవుతుండగా ‘తెల్ల బంగారం’ సాగు చేసిన రైతులకు తుపాన్ ప్రభావంతో మరింత నష్టం వాటిల్లనుంది. అప్పుల ఊబిలో అన్నదాత.. సాగు చేసింది మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల రూపంలో రూ.లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుపాన్తో తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే వ్యవసాయ కమిషనరేట్ నుంచి జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పత్తి, వరి విస్తీర్ణాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అంటున్నారు. కొత్తగూడెంఅర్బన్: తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేయగా.. బడులన్నీ మూసివేశారు. అయితే గురువారం కొనసాగుతాయా, సెలవు ఉంటుందా అనేది వెల్లడి కాలేదు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 31 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లాలో సరాసరి వర్షపాతం 13.4 మి.మీ.గా నమోదైంది. జిల్లాలో ఈ సీజన్లో ఐదు మండలాల్లో సాధారణ, 18 మండలాల్లో అధికంగా వర్షం కురిసింది. మోంథా తుపాన్తో జిల్లా రైతులకు తీవ్ర నష్టం -
జెన్కో క్రీడా పోటీలు ప్రారంభం
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీఆర్సీ టెన్నిస్ కోర్టులో బుధవా రం జెన్ కో క్రీడా పోటీలు ప్రారంభమయ్యా యి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఇంటర్ ప్రాజెక్ట్స్ పోటీల్లో టెన్సిస్, చెస్, క్యా రమ్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్ విభాగాల్లో క్రీడాకారులు తలపడనున్నారు. 7వ దశ సీఈ కె. శ్రీనివాసబాబు, 5, 6దశల సీఈ ఎం.ప్రభాకర్రావు క్రీడా పోటీలను ప్రారంభించి మా ట్లాడారు. క్రీడలు శారీరక, మానసికోల్లాసానికి ఉపయోగపడుతాయన్నారు. శ్రీశైలం, నాగర్జునసాగర్, పోచంపాడు, విద్యుత్సౌధ, బీటీపీఎస్, కేటీపీఎస్ 5,6,7 దశల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఈ లు యుగపతి, రాజ్కుమార్, జి.శ్రీనివాస్, వైసీసీఎ నాగరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీలు మహేష్, వీరస్వామి, నరసింహారావు పాల్గొన్నారు. -
వాతావరణ ం
జిల్లాలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయంకొత్తగూడెంఅర్బన్: మోంథా తుపాన్ ధాటికి సింగరేణిలోని ఓపెన్కాస్ట్ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు వెల్ల డించారు. కొత్తగూడెం ఏరియాలో రోజుకు 59,080 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 38,776 టన్నులు, ఇల్లెందు ఏరియాలో 20,833 టన్నులకు గాను 6,420 టన్నులు, మణుగూరు ఏరియాలో 41,460 టన్నులకు గాను 30,039 టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైందని వివరించారు. వర్షం ఇలాగే కొనసాగితే గురువారం కూడా నష్టం తప్పదని భావిస్తున్నారు. కిన్నెరసానికి కొనసాగుతున్న వరద2వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల వరద రావడంతో బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 406.10 అడుగులకు పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు. నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
శతవసంతాల సభకు దండుగా కదలాలి
సూపర్బజార్(కొత్తగూడెం): డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వసంతాల ముగింపు సభకు ప్రతీ పల్లె, బస్తీ నుంచి దండుగా కదలాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు. సీపీఐ శత వసంత ఉత్సవాలు పార్టీ వేడుకలా కాకుండా, ప్రజల ఉద్యమ చరిత్రను గుర్తు చేసేలా ఉండాలని అన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన సీపీఐ చరిత్ర నేటి తరానికి ఆదర్శంగా ఉండేలా మండల, గ్రామ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ డిసెంబర్ 26 వరకు పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు. కార్మికులు, కూలీలు, రైతులు, ఉద్యోగులు, యువత, మహిళల సమస్యలపై విస్తృత చర్చలు, సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు మర్రి గోపీకృష్ణ, మాచర్ల శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వంగా వెంకట్, గెద్దాడు నగేష్, రమణమూర్తి, నేరెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
‘ముందస్తు’ ముచ్చటేది ?
● భద్రగిరిలో ముక్కోటి, నవమి, పుష్కరాలపై కనిపించని కసరత్తు ● శాశ్వత పనులపై శ్రద్ధచూపని అధికారులు ● ప్రణాళిక, అభివృద్ధిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే ముఖ్యమైన మూడు పండుగలు ముందే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 29న తెప్పోత్సవం, 30న ముక్కోటి ఏకాదశి, వచ్చే ఏడాది మార్చి 27న శ్రీరామనవమి పండుగలు జరుగనున్నాయి. ఇక 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు ఉంటాయి. అయితే ఈ పండుగలపై ఇంతవరకు ముందస్తు సమీక్ష, ప్రణాళికలు చేపట్టలేదు. భక్తులకు కల్పించాల్సిన శాశ్వత పనులపై ప్రణాళికాయుతంగా ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే తప్ప ఉత్సవాల నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. సమీక్షా సమావేశాల నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నిధులు విడుదల చేయించేలా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ప్రణాళికపై అధికారుల నిర్లక్ష్యం.. ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. ఇందుకోసం మిథిలా స్టేడియం పక్కనున్న వేదిక ముందు సెక్టార్లుగా విభజించి టికెట్లు విక్రయిస్తారు. అయితే వీవీఐపీ, వీఐపీ సెక్టార్లతో పాటు ఇతర ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేసిన సెక్టార్లు భక్తులతో నిండిపోతాయి. దీంతో ఇతర సాధారణ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టమే. ప్రతీ ఏడాది ఇది పరిపాటిగా మారుతోంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రీరామనవమి రోజునా ఇదే సమస్య ఎదురవుతోంది. సీఎం సెక్టార్తో పాటు వీవీఐపీ సెక్టార్లు నిండిపోయి వెనుక, చుట్టుపక్కల ఉండే భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించలేకపోతున్నారు. ఇక గోదావరి పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ముందస్తు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక వసతుల కల్పన అత్యవసరం. కానీ నేటి వరకు అటు ప్రజాప్రతినిధులు, ఇటు జిల్లా ఉన్నతాధికారులు ముందుస్తు సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం శోచనీయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానఘాట్ల సంఖ్య పెంచడం, ప్రస్తుతం ఉన్న ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, రోడ్ల విస్తరణ, భక్తులకు సర్వ దర్శనం, వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అంటున్నారు. మార్చి 27నే భద్రగిరిలో కల్యాణం.. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 27వ తేదీనే నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అస్పష్టత నెలకొని ఉంది. 26, 27 తేదీల్లో ఘడియలు వచ్చినప్పటికీ దేవస్థానంలో మిగులు గడియల్లోనే కల్యాణం జరపనున్నట్లు వైదిక సభ్యులు, ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం 26, 27 తేదీల్లో విరామం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముక్కోటి, శ్రీరామనవమి, గోదావరి పుష్కరాల ఉత్సవాలు భద్రాచలంలో జరగనున్న నేపథ్యంలో శాశ్వత పనుల ప్రణాళికపై అధికారులు వెంటనే సమావేశాలు నిర్వహించాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటి నుంచే పనులు ప్రారంభించకుంటే పుష్కరాల నాటికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు. – పోతురెడ్డి సుబ్బారెడ్డి, సారపాకభద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలకు ఎనలేని విశిష్టత ఉంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకలకు తరలి వస్తుంటారు. అలాగే 12 ఏళ్లకు ఓసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 ఆగస్టులో జరగనున్నాయి. అయితే ప్రతి ఏడాది జరిగే త్సవాలతో పాటు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా భద్రాచలంలో వసతి సౌకర్యాలు మెరుగు పడతాయని అంటున్నారు. -
లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం
కొత్తగూడెంటౌన్: లొంగిపోయిన మావోయిస్టులకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూ ర్, సుక్మా జిల్లాలకు చెందిన ముగ్గురు మావోయిస్టులు ఇటీవల లొంగిపోగా, బుధవారం తన కార్యాలయంలో వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీలో పని చేస్తూ లొంగిపోయిన వారికి పునరావాసం కోసం తెలంగాణ ప్రభుత్వం నగదు రివార్డులు మంజూరు చేసిందని చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలోకి చేర్చుకుని, వారితో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించారని తెలిపారు. పార్టీ నాయకులు, సభ్యులు ఆయుధాలు వీడి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున పోరాడాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ(ఆపరేషన్స్) నరేందర్, ఆర్ఐ రవి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
థర్మల్ విద్యుత్కు తగ్గిన డిమాండ్
కేటీపీఎస్, బీటీపీఎస్లో పలు యూనిట్లు రిజర్వ్ షట్డౌన్పాల్వంచ: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. మరోవైపు జల, సోలార్ విద్యుత్ అధిక వినియోగంతో థర్మల్ విద్యుత్పై ప్రభావం పడింది. జిల్లాలోని కేటీపీఎస్, బీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బుధవారం చాలా వరకు యూనిట్లను రిజర్వ్ షట్డౌన్లో ఉంచారు. జెన్కోకు భారీ నష్టం.. విద్యుత్ డిమాండ్ లేకపోవడం, థర్మల్ విద్యుత్ ధర అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ ధరకు లభించే జల, సోలార్ విద్యుత్కు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కేటీపీఎస్ 7వ దశలో 800 మెగావాట్లు, 5, 6 దశల్లోని 9వ యూనిట్ 250 మెగావాట్లు, 11వ యూనిట్ 500 మెగావాట్లు రిజర్వ్ షట్డౌన్లో ఉంచారు. ప్రస్తుతం పదో యూనిట్లోని 250 మెగావాట్లు మాత్రమే నడుస్తోంది. మణుగూరు బీటీపీఎస్లో నాలుగు యూనిట్లకు గాను 270 మెగావాట్ల 3వ యూనిట్ మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తోంది. మిగిలిన 1, 2, 4 యూనిట్లను రిజర్వ్ షట్డౌన్లో ఉంచారు. మొత్తంగా అక్కడ 810 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జెన్కో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావును వివరణ కోరగా డిమాండ్ లేకపోవడం, సోలార్, జల విద్యుత్నే అధికంగా వియోగిస్తుండడంతో పలు యూనిట్లు రిజర్వ్ షట్డౌన్లో ఉన్నాయని చెప్పారు. -
క్యాంపులతో ఖతం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన నిర్బంధం..సహకరించని ఆరోగ్యం కారణంగా ప్రజాస్వామ్యయుత పోరాటానికే పరిమితం అవుతున్నట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగుబాటు సందర్భంగా చెప్పారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుకే అన్నలు అనివార్యంగా అడవిని వీడుతున్నారు. పారా మిలిటరీని ఎదుర్కొనేలా.. బస్తర్ అడవుల్లోకి పారా మిలిటరీ దళాలు అడుగుపెట్టగానే మావోయిస్టులు రక్షణ వ్యూహాలకు పదును పెట్టారు. జర్మన్ యుద్ధరీతులను అధ్యయనం చేసి వేగంగా బంకర్లు, బూబీట్రాప్స్ నిర్మాణాలను వంట పట్టించుకున్నారు. తమ బస(క్యాంప్)కు సంబంధించిన సమాచారం పోలీసులు, భద్రతా దళాలకు చేరిన తర్వాత వారు తమను చుట్టుముట్టేందుకు ఎంత సమయం పడుతుంది ? ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంత సమయం అవసరం ? తప్పించుకున్న తర్వాత చెల్లాచెదురైన దళాలు 24 లేదా 72 గంటల్లోగా తిరిగి ఎక్కడ కలుసుకోవాలి ? అనే అంశాలపై అధ్యయనం చేశారు.చివరకు భద్రతాదళాలు కనీసం నాలుగు కిలోమీటర్ల పాటు అడవిలో నడిస్తే తప్ప తమను చేరుకోలేనంత దట్టమైన అడవిలోనే క్యాంప్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నాలుగు కిలోమీటర్ల నడకలో ఉన్నప్పుడే భద్రతా దళాలపై అంబూష్ లు చేసే టెక్నిక్ నేర్చుకున్నారు. దీంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భాగంగా అడవుల్లోకి వెళ్లిన బలగాలు అనేక సార్లు మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్నాయి. కట్టుదిట్టం చేసినా.. ఆపరేషన్ గ్రీన్హంట్ చేపట్టి పదేళ్లు దాటినా సానుకూల ఫలితం రాకపోవడంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్–స్మార్ట్ లీడర్షిప్, ఏ–అగ్రెసివ్ స్ట్రాటజీ, ఎం– మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ–యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ–డ్యాష్ బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్– హార్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ–యాక్షన్ ప్లాన్, ఎన్–నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్ )ను కేంద్రం తెరపైకి తెచ్చిది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బకొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడడం, మావోయిస్టుల్లోకి కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించే పనిపై ఫోకస్ చేశారు. ఆఖరకు వాయుమార్గ దాడులకు తెర తీశారు. ఎన్ని చేసినా 2021 ఏప్రిల్లో తెర్రం దగ్గర జరిగిన దాడిలో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం భద్రతాదళాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం భద్రతాదళాలకు అవసరమైంది. 4 కి.మీ ప్లాన్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ 4 కిలోమీటర్లకు ఒక పారామిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసే వ్యూహానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం అడవిలో క్యాంప్ ఏర్పాటు చేసి 24 గంటలూ జవాన్లు అక్కడే ఉన్నారు. క్యాంప్ చుట్టూ నాలుగు కి.మీ. పరిధిలో నిత్యం కూంబింగ్ చేశారు. క్యాంపుతోపాటే భారీ వాహనాలు తిరిగేలా తాత్కాలిక రోడ్లు, మొబైల్ టవర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. నెల రోజుల వ్యవధిలోనే ఆ ప్రాంతంపై పట్టు సాధించి అక్కడి నుంచి 4 కి.మీ. దూరంలో మావోలకు పట్టున్న ప్రాంతంలో మరో కొత్త క్యాంప్ (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బ్లాక్, ఎఫ్ఓబీ) ఏర్పాటు చేశారు. ఇలా ప్రణాళికాయుతంగా ముందుకు సాగడంతో 2023 నాటికి 300 పైగా క్యాంపులు ఏర్పాటయ్యాయి. పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. మావోయిస్టుల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు జరిగాయి. ప్రతీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీ సుప్రీం కమాండర్ నంబాల సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి ఆయుధాలతో లొంగిపోగా, మరికొందరు సాయుధ పోరాటానికి మద్దతు ఇస్తూనే పెరిగిన నిర్బంధం, అనారోగ్య సమస్యల కారణంగా వనం వీడాల్సి వస్తోంది. -
నిబంధనలు పాటించని క్లినిక్ సీజ్
భద్రాచలంఅర్బన్: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఓ క్లినిక్ను వైద్యాధికారులు మంగళవారం సీజ్ చేశారు. భద్రాచలంలోని డాక్టర్ ఆర్.నాగేశ్వర్రావు కాలనీలో ఓ మెడికల్ షాప్ను ఆనుకుని అనుమతి లేకుండా ప్రతీ ఆదివారం డెర్మటాలజిస్ట్ను పిలిపించి క్లినిక్ నిర్వహిస్తున్నారు. గతంలోనే అనుమతి తీసుకోవాలని నోటీసులు ఇచ్చినా నిర్వాహకుడు పట్టించుకోకపోవడంతో మంగళవారం సీజ్ చేశారు. అలాగే, బ్రిడ్జి సెంటర్లోని సూర్య ఆస్పత్రిలో పరీక్షలకు అధిక ఫీజు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీఎంహెచ్ఓ సైదులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య, ఉద్యోగులు పాల్గొన్నారు. -
బీసీలు రాజ్యాధికారం సాధించాలి..
కొత్తగూడెంఅర్బన్: బీసీలు చైతన్యంతో అగ్రవర్ణాల దోపిడీ పాలనను అంతమొందించాలంటే ఎస్సీ, ఎస్టీలతో జత కట్టి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ పేర్కొన్నారు. సామాజిక చైతన్య రథయాత్ర మంగళవారం కొత్తగూడెంనకు చేరుకుంది. సూపర్బజార్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ దోపిడీ పాలన, కుటుంబ పాలన అంతమై కాంగ్రెస్ పాలన వచ్చిందని సంతోషపడితే అంతకంటే ఎక్కువ దోపిడీ జరుగుతోందన్నారు. సీఎం కుటుంబ సభ్యులు, వారి అనుచరులు రాష్ట్రాన్ని జోనల్గా విభజించి భూదందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ లాభాల ఆపేక్షతో పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని, తక్షణమే ఓపెన్ కాస్ట్ మైనింగ్ నిలిపి, సాంకేతికతతో అండర్ గ్రౌండ్ మైనింగ్ మాత్రమే చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరులలో పూర్తిస్థాయిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఆడంబరంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో ఏడాది గడిచినా ఒక్క బ్యాచ్కు కూడా శిక్షణ ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కట్ట సతీశ్, బీరప్ప, మడకం ప్రసాద్, నూనె భాస్కర్రావు, రిషబ్జైన్, నరసింహారావు, సుధాకర్, బుల్లెట్ వెంకన్న, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. -
జాబ్మేళాలకు స్పందన
● 23,650 మందికి ఉద్యోగాలు ● సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహణ కొత్తగూడెంఅర్బన్: పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువతకు హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కల్పిస్తోంది. ఆరు నెలలుగా మెగా ఉద్యోగమేళాలు నిర్విరామంగా కొనసాగిస్తోంది. దాదాపు 24 వేల మందికి కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆలోచనలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఆరు నెలల్లో 7 పట్టణాల్లో నిర్వహించిన జాబ్మేళా కార్యక్రమాల్లో 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వారిలో 23,650 మందికి ఉద్యోగాలు లభించడం విశేషం. ఏడో తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు గల వారితో పాటు, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ తదితర అన్ని విద్యార్హతలు గల వారికి ఇక్కడ తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశం దక్కింది. ఒక్కొక్క జాబ్మేళాలో 100 నుంచి 250 వరకు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని మేళాలో పాల్గొన్న నిరుద్యోగ యువత, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ఈ జాబ్మేళా కార్యక్రమాలను ఏప్రిల్ 21వ తేదీన మధిరలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సారథ్యంలో నిర్వహించారు. అదే నెల 27వ తేదీన భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో.. మే 18న గోదావరిఖనిలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, సీఎండీ బలరామ్ ఆధ్వర్యంలో.. మే 24వ తేదీన వైరాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో.. మే26న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ఆధ్వర్యంలో.. అదేరోజు బెల్లంపల్లిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో జాబ్మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. -
కిన్నెరసాని గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద వస్తుండటంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తారు. ఈ మేరకు 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు వెల్లడించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి యువకుడి హాలీవుడ్ చిత్రం త్వరలో అమెరికాలో విడుదల కానున్న ‘ది లాస్ట్ విజిల్’ భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన యువ దర్శకుడు కొండపల్లి వివేక్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం ‘ది లాస్ట్ విజిల్’ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. భద్రాచలం పట్టణానికి చెందిన రిటైర్డ్ సీఐ కొండపల్లి మహేశ్వరరావు కుమారుడైన వివేక్.. చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. చదువుల అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, అక్కడ చదువుకుంటూనే సినీ రంగంలో మెళకువలు నేర్చుకుని, దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని రూపొందించాడు. ఇంగ్లిష్లో వివేక్ దర్శకత్వం వహించిన ‘ది లాస్ట్ విజిల్’చిత్రం త్వరలోనే అమెరికాలో విడుదల కానుంది. ఫెడరేషన్ కప్నకు భద్రాద్రి క్రీడాకారుడు భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డీవీ శంకర్రావు హిమాచల్ ప్రదేశ్లో జరగబోయే ప్రతిష్టాత్మక పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కప్నకు ఎంపికై నట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోగాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు. 73 ఏళ్ల వయస్సులో శంకర్రావు కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించడం అసాధారణమని, ఇప్పుడు ఫెడరేషన్ కప్నకు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా శంకర్రావును పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్, జాయింట్ సెక్రెటరీ గుగులోత్ శోభన్నాయక్, బోగాల వీరారెడ్డి, చిరంజీవి తదితరులు అభినందించారు. రెన్యూవల్ చేయించుకోవాలి.. కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, సీపీఆర్ఎంఎస్ స్కీమ్ ద్వారా హెల్త్ కార్డు పొందిన వారు రెన్యూవల్ చేయించుకోవాలని జీఎం (పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్ఆర్ జీవీ కిరణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏడాదికి గాను సీపీఆర్ఎంఎస్ హెల్త్ కార్డును మీ సేవలోగానీ, ఆన్లైన్లో గానీ రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సుడ్రైవర్కు గుండెపోటు తృటిలో తప్పిన ప్రమాదం భద్రాచలంఅర్బన్: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు రావడంతో చాకచక్యంగా బస్సును పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.. భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును విజయవాడకు నడుపుతున్న డ్రైవర్ వైఎన్.రావుకు తిరువూరు బస్టాండ్ దాటిన కొద్దిసేపటికే చాతిలో త్రీవంగా నొప్పి వచ్చింది. బస్సులో ఉన్న కండక్టర్, స్థానికులు వెంటనే డ్రైవర్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వైఎన్.రావును విజయవాడకు తరలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా, చాతిలో నొప్పి వచ్చిన సమయంలో డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చికిత్స పొందుతున్న మహిళ మృతి ఇల్లెందు: గడ్డిమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ సోమవారం రాత్రి మృతిచెందింది. పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన బండ జ్యోతి (36) ఈ నెల 2వ తేదీన గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు ఇల్లెందు వైద్యశాలకు అక్కడి నుంచి ఖమ్మం, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సోమవారం ఎంజీఎంలో మృతి చెందింది. ఎంఏ, బీఈడీ చేసిన జ్యోతి పుట్టుకతో వికలాంగురాలు. ఉద్యోగం రాక, వివాహం జరుగక తీవ్ర మనోవేదనకు గురైంది. కుటుంబానికి భారంగా ఉండొద్దని భావించి, పురుగుమందు తాగింది. తండ్రి పోషయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కూరగాయల సాగు అంతంతే...
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో సంప్రదాయ, వాణిజ్య పంటలు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నపై మాత్రమే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించడం లేదు. మూడేళ్లుగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసిన సమష్టి కృషి ఫలితంగా ఆయిల్పామ్ వైపునకు రైతులు మొగ్గు చూపుతున్నారు. లాభదాయకమైన కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు పట్ల రైతాంగం ఆసక్తి కనబర్చక పోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వినియోగం ఎక్కువే.. జిల్లా ఉద్యాన శాఖ అధికార గణాంకాల ప్రకారం ఒకరోజుకు ఒక మనిషికి 200 గ్రాముల కూరగాయలు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ జిల్లాగా గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల గిరిజన, ఆదివాసీ గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభా అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న కార్తీకమాసం, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, హనుమాన్ దీక్షల సందర్భాల్లో ప్రజలు ఎక్కువగా కూరగాయలనే వాడుతారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 23 మండలాల్లో కేవలం 705 మంది రైతులు 843.17 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు చేస్తున్నారంటే ఇతర ప్రాంతాల నుంచి ఏమేరకు కూరగాయలు దిగుమతి అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతులు రక్షణ చర్యలు చేపట్టి కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తే డిమాండ్ ఉన్న కారణంగా అధిక లాభాలు పొందవచ్చని అధికార యంత్రాంగం సూచిస్తున్నా రైతులు తమ సంప్రదాయ పంటల సాగు నుంచి దృష్టి మరల్చడం లేదు. జిల్లాలో కోతుల బెడద కూడా ఎక్కువగా ఉండడంతో తాము కూరగాయల సాగు చేయలేక పోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో సుజాతనగర్ మండలంలో అధికంగా 242 మంది రైతులు 344.15 ఎకరాలలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుండగా ములకలపల్లి, భద్రాచలం, చుంచుపల్లి, ఆళ్లపల్లి, బూర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో కనీసం మూడు ఎకరాల్లో కూడా కూరగాయల సాగును రైతులు చేయకపోవడం గమనార్హం. కూరగాయలు పండించాలంటే కోతుల భయం ఎక్కువగా ఉంది. సమీప ప్రాంతాల్లో అడవీ ఉన్నా వాటికి ఆహారం దొరకక పోవడంతో పంట పొలాల మీద దాడి చేస్తున్నాయి. దీంతో కూరగాయలను పండించలేక పోతున్నాం. –కల్తీ ముత్తయ్య, రైతు, కన్నాయిగూడెం, గుండాల మండలం సంప్రదాయ పంటలతో వచ్చే నష్టాలను అధిగమించేందుకు ఉద్యాన, కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలి. ఈ విషయమై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. దీంతో కొందరు ఉద్యాన పంటలపై మక్కువ చూపుతున్నారు. కూరగాయల సాగుకు ముందుకు రావడం లేదు. –జంగా కిశోర్, ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి సుజాతనగర్ 242 344.15 టేకులపల్లి 105 148.22 జూలూరుపాడు 87 86.32 మణుగూరు 48 51.36 పాల్వంచ 42 42.34 దుమ్ముగూడెం 34 24.25 చర్ల 31 9.2 అశ్వాపురం 25 28.38 చండ్రుగొండ 25 27.2 కొత్తగూడెం 22 24.29 అశ్వారావుపేట 08 11.8 ఇల్లందు 06 8.2 భద్రాచలం 06 2.2 లక్ష్మీదేవిపల్లి 05 8.11 అన్నపురెడ్డిపల్లి 04 4.15 దమ్మపేట 03 9.6 చుంచుపల్లి 03 2.2 ఆళ్లపల్లి 03 1.32 పినపాక 03 1.17 బూర్గంపాడు 02 2.33 ములకలపల్లి 01 1.2 మొత్తం 705 843.17 రైతుల నుంచి ఆదరణ కరువు -
షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం
దమ్మపేట: షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని బాలాజీ థియేటర్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట బాలాజీనగర్లో స్థానికంగా నివాసం ఉంటున్న నల్లబోతుల మహేశ్ తన కారును ఇంటి ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసి, ఇంట్లోకి వెళ్లాడు. కారు నుంచి పొగలు రావడం గమనించిన అతడు, స్థానికుల సాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. దాడిచేసిన వ్యక్తిపై కేసు పాల్వంచరూరల్: గొర్రెల షెడ్డులోకి వచ్చిన వ్యక్తి.. యజమానిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని పాండురంగాపురానికి చెందిన వీరబోయిన మహేశ్ గొర్రెల షెడ్డులోకి ఈ నెల 24వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఎల్లావుల సంతోష్ వచ్చాడు. గమనించిన మహేశ్ ఎందుకొచ్చావని అడిగితే కత్తితో దాడి చేశాడు. గొర్రెలను చోరీ చేసేందుకు వచ్చి, కత్తితో పొడిచాడని మంగళవారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ విజయ్సింహారెడ్డి కథనం మేరకు.. వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు మర్రిగూడెం శివారులో మంగళవారం దాడులు నిర్వహించారు. ఆవులు, దూడలను హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తున్న టాటా ఏస్ మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ వద్ద గల బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకునేందుకు యత్నించింది. గుర్తించిన తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలికకు కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, బాలిక తల్లిదండ్రులు గొడవ పడి వేరుగా ఉంటామని ఫోన్లో బాలికకు చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ మైథిలి, ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా.. కుటుంబ సభ్యుల కలహాలతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసిందని, తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. -
కోడి పుంజుకు నాలుగు కాళ్లు!
అశ్వారావుపేటరూరల్: సాధారణంగా కోళ్లకు రెండు కాళ్లు ఉండటం సహజమే. కానీ ఓ కోడి పుంజుకు నాలుగు కాళ్లు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన నరదల నాగరాజు కొంతకాలంగా కోళ్లను పెంచుతున్నాడు. ఏడాదిన్నర క్రితం ఓ పెట్ట గుడ్లను పెట్టి పొదగగా అందులోని ఓ కోడి పుంజు (పచ్చాకాకి జాతి)కు నాలుగు కాళ్లు వచ్చాయి. కాగా, జన్యుపరమైన లోపం కారణంగా పుంజు నాలుగు కాళ్లతో జన్మించిందని తెలుస్తోంది. కొన్ని పుంజులు దీంతో పోట్లాడుతుండగా నాలుగు కాళ్లు చూసి పారిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
హరీశ్రావుకు పరామర్శ
ఇల్లెందు: మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు తండ్రి సత్యనారాయణ మంగళవారం మృతి చెందగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని వారి నివాసంలో సత్యనారాయణ మృతదేహం వద్ద నివాళులర్పించాక హరీశ్రావు, కుటుంబీకులను పరామర్శించారు. సెక్యూరిటీగార్డుకు పాముకాటు మణుగూరుటౌన్: సింగరేణి ఓసీ–2లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీగార్డు పాముకాటుకు గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రెండో షిఫ్ట్ విధులకు హాజరైన శ్రీనివాస్ ఓసీ–2 గని సమీపంలోని 84 డీపీ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి సమయంలో కట్లపాము కాటుకు గురికావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సూపర్వైజర్లు, అధికారులు సింగరేణి ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కోతుల దాడితో ఆటో బోల్తా కల్లూరురూరల్: మండలంలోని ముగ్గు వెంకటాపురం శివారులో కోతుల గుంపు రావడంతో ఆటో బోల్తా పడింది. కుర్నవల్లి నుంచి ముత్తగూడెం వైపు మంగళవారం వెళ్తున్న ఆటో ముగ్గవెంకటాపురం శివార్లలోకి రాగానే కోతుల గుంపు ఆటోపైకి వచ్చింది. డ్రైవర్ ఆందోళన చెందగా ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. -
వణికిస్తున్న మోంథా
● జిల్లాను తాకిన తుపాను ప్రభావం ● ఈదురు గాలులతో వర్షం ● పంటలు దెబ్బతింటాయని రైతుల్లో ఆందోళన బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరించిన వాతావరణ శాఖ.. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుపాను నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు బుధ, గురువారాల్లో వ్యవసాయ పనులు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరికోతలు, పత్తితీతలు నిలిపివేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులు కోరారు. పనులకు బ్రేక్.. తుపాను నేపథ్యంలో మంగళవారం వరికోతలు, పత్తితీతలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులకు బ్రేక్ పడింది. ఇప్పటికే జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగడంతో పాటు పత్తితీతలు ఊపందుకోవాల్సి ఉంది. అయితే ఇటీవల వరకు కురిసిన వర్షాల కారణంగా వ్యవసాయ పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మోంథా తుపాను కారణంగా మరింత జాప్యం జరుగుతుండడంతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వరికోతలు ప్రారంభం కాగా, ధాన్యం ఆరబోసేందుకు ఖాళీ స్థలాలు, కల్లాలు లేవు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులను తుపాను మరింతగా కష్టాల పాలు చేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పచ్చి వడ్లను తక్కువ ధరకే మిల్లర్లు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చాలా శ్రమతో కూడుకోవడంతో పాటు వసతులు లేకపోవడంతో పచ్చి వడ్లనే అమ్ముతున్నారు. పత్తితీత పనులు కూడా తుపాను నేపథ్యంలో నిలిచిపోయాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పత్తి చెట్టపైనే పూర్తిగా తడిసింది. దీంతో పత్తి తీసే పనులను నిలిపివేశారు. మోంథా తుపాను ప్రభావం జిల్లాపై ఎక్కువగానే ఉంటుందనే ప్రచారంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఓ వైపు కోతకు వచ్చిన పొలాలు, మరో పక్క పూసిన పత్తి చేలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తుపాను గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే వరి పంట నేలవాలడంతో పాటు పత్తి మొక్కలు కూడా ఒరిగిపోతాయనే భయాందోళనలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కోసిన పంటలను తుపాను బారి నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు, పరదాలు సిద్ధం చేసుకుంటున్నారు. అధిక వర్షాల కారణంగా ఇప్పటికే చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఇప్పుడు తుపానుతో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ చెరువు కట్టలు, అలుగులు తెగిపోయి పంటలు పాడవుతాయనే ఆందోళన సైతం రైతుల్లో వ్యక్తమతోంది. -
రైతుల సంక్షేమంలో కేవీకేల పాత్ర కీలకం
సూపర్బజార్(కొత్తగూడెం): రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని కేవీకేను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలోని పరిశోధన, శిక్షణ, రైతు అవగాహన కార్యక్రమాలపై శాస్త్రవేత్తలతో చర్చించి, రైతుల సంక్షేమానికి కేవీకే చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పట్టుపురుగుల పెంపకం, విప్పపువ్వు సాగు, సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత గిరిజన రైతులకు టార్పాలిన్లు, వ్యవసాయ సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ హేమ శరత్ చంద్ర, బి.శివ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధికి కృషి.. జిల్లాలో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా భారత్ రూరల్ లైవ్లీ హుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ పాటిల్ తెలిపారు. మంగళవారం రాత్రి ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి భారత్ లైవ్లీహుడ్ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎల్ఎఫ్ సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఈ మేరకు జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం మండలాలను ఎంపిక చేయగా, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడామని వివరించారు. సంస్థ తాత్కాలిక కార్యాలయాన్ని భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేశామని, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఆర్థిక సహకారం అందుతుందని వెల్లడించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు, డీఏఓ బాబూరావు, ఉద్యానవన అధికారి కిషోర్, ఎల్డీఎం రామిరెడ్డి, పశుసంవర్థక శాఖాధికారి వెంకటేశ్వర్లు, బీఆర్ఎల్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ అనే సందేశం ప్రతీ విద్యార్థికి చేరాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పనుల్లో నాణ్యత పాటించేలా ప్రిన్సిపాళ్లు పర్యవేక్షించాలని సూచించారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అశ్వారావుపేట, చర్ల, పినపాక, దుమ్ముగూడెం కళాశాలల్లో ప్రవేశాలు ఎందుకు తగ్గాయని ఆయా ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు. కళాశాలలకు బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ప్రిన్సిపాళ్లు చెప్పగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో డీఐఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సదరం క్యాంపు పరిశీలన చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరుపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ప్రతీ దివ్యాంగుడికి అవసరమైన గుర్తింపు సర్టిఫికేషన్ అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డులు తెలంగాణతో పాటు దేశమంతటా పని చేస్తాయని చెప్పారు. ఈ కార్డుల ద్వారా దివ్యాంగులు ఆరోగ్య, విద్య, ఉపాధి, రవాణా రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని వివరించారు. సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలం : తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ వేర్వేరు ప్రకటనల్లో సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వ్యవసాయ రంగంపై తుపాను ప్రభావం అధికంగా ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలను రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఎత్తయిన ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. ఏపీ వైపు వెళ్లే వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. వర్షాలు కురిసే సమయాల్లో చెట్ల కింద ఉండొద్దని పేర్కొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
అలరించిన నృత్య ప్రదర్శన
రేపు కిన్నెరసానిలో ఆర్చరీ పోటీలు పాల్వంచరూరల్ : పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్ మోడల్ స్కూల్లో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు గురువారం నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ రౌండ్ 30 నుంచి 20 మీటర్లు, రికర్వ్ రౌండ్ 60, కాంపౌండ్ డబుల్ 50 మీటర్ల పోటీలు ఉంటాయని, పాల్గొనే బాలబాలికలు 2008 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని, జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకుని రావాలని సూచించారు. ఇక్కడ ఎంపికై న బాలబాలికలు తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ మినీ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా తరఫున ఆడుతారని పేర్కొన్నారు. భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. అభినయ కూచిపూడి నృత్యాలయ బృందం ఆధ్వర్యంలో మంగళవారం చిన్నారులు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు. -
నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి
● విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● పోలీస్ సిబ్బందికి ఎస్పీ రోహిత్రాజు హెచ్చరిక కొత్తగూడెంటౌన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, ప్రతీ కేసులో సమగ్ర విచారణ నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు అఽధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. చైతన్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హాట్స్పాట్లను గుర్తించి గంజాయి రవాణా చేసేవారితో పాటు సేవించే వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని, నివారణకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. చోరీ కేసుల్లో సాంకేతికతను వినియోగించి నిందితులను పట్టుకోవాలని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని చెప్పారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీష్కుమార్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. సమయపాలన పాటించాలిచుంచుపల్లి: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం ఆమె జిల్లాలోని వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్ 1 నుంచి 7 వరకు కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందాలు జిల్లాలో పర్యటించనున్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతీ గ్రామంలో ప్రజలకు జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్యాలను వివరించి పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో డాక్టర్లు సైదులు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో గురుకుల విద్యార్థిని ప్రతిభఇల్లెందురూరల్ : గోవిజ్ఞాన్ రాష్ట్ర స్థాయి పరీక్షలో ఇల్లెందు మండలం సుదిమళ్ల గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని తంగురి వెన్నెల మూడో స్థానం సాధించింది. గోసేవా విభాగం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి వివిధ దశల్లో నిర్వహించిన గోవిజ్ఞాన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వెన్నెల.. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటింది. మూడో స్థానంలో నిలిచిన వెన్నెలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించారు. కాగా, వెన్నెల ప్రతిభ కనబర్చడం పట్ల జిల్లా గోసేవా విభాగం ప్రతినిధులు సతీష్ ఖండేల్వాల్, పూనియానాయక్ హర్షం వ్యక్తం చేశారు. -
భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
అశ్వాపురం/మణుగూరురూరల్ : రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్ కార్యాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్లు మణిధర్, అద్దంకి సురేష్, డిప్యూటీ తహసీల్దార్లు అనూష, రాజేశ్వరరావు, రామారావు, ఆర్ఐ లీలావతి, యూడీసీ కనకలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ కుంజా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● మధిరలో భూగర్భ కేబుల్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన మధిర: రాష్ట్రమంతా భారీ వర్షాలు, తుపాన్ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలో రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టే భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం నెరవేరడంలో విద్యుత్ శాఖే కీలకమని తెలిపారు. ఏ రంగం అభివృద్ధి సాధించాలన్నా నాణ్యమైన విద్యుత్ అవసరమని, అందుకే రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తూ బలోపేతం చేస్తున్నామని చెప్పారు. దశల వారీగా... మధిర ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తొలిదశలో రూ. 27.76కోట్లతో 3.5 కి.మీ. మేర 33 కేవీ లైన్, 17.3 కి.మీ. మేర 11 కే.వీ. లైన్, 15 కిలోమీటర్ల నిడివితో ఎల్టీ లైన్ను భూగర్భంలో వేస్తామని చెప్పారు. అలాగే, సబ్స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డులోని గ్యాస్ గోదాం(రెండు వైపులా), వైఎస్సార్ విగ్రహం నుంచి అంబారుపేట చెరువు వరకు ప్రస్తుతం ఉన్న 11 కే.వీ. ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అంతేకాక నందిగామ బైపాస్ రోడ్డు హెచ్పీ బంక్ నుండి డంప్ యార్డ్ వరకు భూగర్భ విద్యుత్ లైన్ పనులు చేపడతామన్నారు. తద్వారా విద్యుత్ తీగలు బయటకు ఎక్కడా కనిపించవని, విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరగవని తెలిపారు. అంతేకాక రోడ్ల వెంట మొక్కల పెంపకానికి అవకాశ ం ఏర్పడడంతో పాటు భారీ వర్షాలు, తుపాన్ల సమయాన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని చెప్పారు. కాగా, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వెళ్లేలా విద్యుత్ అంబులెన్స్లను సమకూర్చగా, 1912 నంబర్కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఆతర్వాత మడుపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్అండ్ బీ ఈఈ తానేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దివ్యాంగులను గౌరవించాలి
కొత్తగూడెంటౌన్: దివ్యాంగులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన.. ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం –2016 పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగుల చట్టంపై త్వరలో అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దివ్యాంగులను కించపరిచినా, హేళన చేసినా, అవయవ లోపాలను ఎత్తిచూపినా శిక్షార్హులని పేర్కొన్నారు. దివ్యాంగులను అవమానించినా, పరికరాలు ధ్వంసం చేసినా ఆరు నెలల నుంచి రెండేళ్ల పాటు జైలుశిక్ష, రూ. పది వేల నుంచి రూ.5 లక్షల జరిమానా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరి సాయిరాం, అన్నం సత్తిబాబు, సభ్యులు కృష్ణా శ్రీనివాసరావు, వాల్మీకి, అలవాల రాజా పెరియార్, కొమ్మగిరి వెంకటేశ్వర్లు, అప్పన్నదాసు బాబు, మద్దెల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు -
గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందిస్తాం
భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్కు హాజరైన వారి నుంచి ఆయన ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచి అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీడీ అశోక్, ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, ఏఓ రాంబాబు, ఇన్చార్జ్ ఎస్ఓ భాస్కరన్, ఉదయ్కుమార్, ఏపీఓ పవర్ వేణు, రాజారావు, ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, నారాయణ రావు, వెంకటేశ్వరరావు, లింగా నాయక్, జయరాజ్, ఏఓ నరేందర్ పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనకు డిజిటల్ ప్లాట్ఫామ్ గిరిజన నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశామని పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు – ఉద్యోగం కల్పించే పరిశ్రమలకు మధ్య ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ (వెబ్సైట్) వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత https//deet.telangana.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్హతను బట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్ల డించారు. వివరాలకు ఐటీడీఏ ఆవరణలోని భవిత సెల్లో సంప్రదించాలని కోరారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఏసీబికి చిక్కిన జీపీఓ
● భూ రిజిస్ట్రేషన్కు రైతు నుంచి రూ.60వేలు లంచం డిమాండ్ ● రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న వైనం ములకలపల్లి: ములకలపల్లి తహసీల్ పరిధి గ్రామ పరిపాలనాధికారి(జీపీఓ) బానోత్ శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటూ అవినీతీ నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఆయనను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వేముకుంటకు చెందిన ఓ రైతు తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 22 స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆ భూమిపై బ్యాంక్ రుణం బకాయి ఉన్నందున రూ.60 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని పూసుగూడెం క్లస్టర్ జీపీఓ బానోతు శ్రీనివాస్నాయక్ స్పష్టం చేశాడు. దీంతో సదరు రైతు ఫోన్పే ద్వారా రూ.30వేలు, నగదుగా రూ.10వేలు ముట్టజెప్పాడు. మిగతా రూ.20వేలు ఇవ్వాల్సిందేనని జీపీఓ స్పష్టం చేయడంతో రూ.15 వేలకు రైతు బేరం కుదుర్చుకున్నాడు. ఆపై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు తహసీల్లో శ్రీనివాస్ నాయక్ సోమవారం రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా, వసూళ్లలో ఇతర ఉద్యోగుల పాత్రపైనా విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే, పట్టుబడిన జీపీఓ శ్రీనివాస్నాయక్ నెలన్నర క్రితమే విధుల్లోకి చేరడం గమనార్హం. కాగా తహసీల్లో అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. తహ సీల్దార్ గన్యానాయక్ను కూడా విచారించినట్లు సమాచారం. పాల్వంచలో సోదాలు.. పాల్వంచ: పట్టణంలోని అయ్యప్పనగర్లో గల శ్రీనివాస్ నాయక్ ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరి పేర్లతో ఉన్నాయనే కోణంలో తనిఖీ చేసినట్లు సమాచారం. -
నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస వసతులు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో వరి కోతలు తాత్కాలికంగా నిలిపివేయాలని విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రోజు ధాన్యం సేకరణ వివరాలు, గన్నీ బ్యాగుల వివరాల నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులను కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ను కలిసిన సైన్స్ అధికారి.. జూలూరుపాడు: కలెక్టర్ జితేష్ వి పాటిల్ను జిల్లా సైన్స్ అధికారి బి. సంపత్కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్న పద్ధతిలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఆవిష్కరణలు చేపట్టాలని ఈ సందర్భంగా సంపత్ కుమార్కు కలెక్టర్ సూచించారు. అప్డేట్ బాధ్యత కాంప్లెక్స్ హెచ్ఎంలదే.. కొత్తగూడెంఅర్బన్: యూడైస్ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేయించాల్సిన బాధ్యత కాంప్లెక్స్ హెచ్ఎంలదేనని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. పాత్తకొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూడైస్ రిపోర్టును సక్రమంగా ఎంటర్ చేయకపోవడంతో జిల్లా పీజీఐ ర్యాంక్ తగ్గిపోతుందని అన్నారు. అనంతరం డీఈఓ బి.నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో స్వచ్ఛ, హరిత పాఠశాలల ఎంపికలో భాగంగా 4, 5 స్టార్స్ కల్గిన 486 పాఠశాలలను గుర్తించి, 90 మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అసైన్ చేశామని, ఈనెల 31వరకు మూల్యాంకనం చేసి ఎస్హెచ్వీఆర్ వెబ్సైట్లో ఆయా అంశాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, మేనేజర్ త్రినాధ్ బాబు, మార్కెటింగ్ అధికారి నరేందర్, ఆర్టీఓ వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్.కె సైదులు, సతీష్ కుమార్, నాగ రాజశేఖర్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
నాణ్యమైన సేవలతో వ్యాపారాభివృద్ధి
భద్రాచలంటౌన్: వినియోగదారులకు నాణ్య మైన సేవలు అందించడం ద్వారా వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తెలిపారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఎస్ఎల్బీటీ పెయింట్స్ అండ్ జనరల్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ‘నెక్సన్’ షోరూంను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భద్రాచలంలో ‘నెక్సన్’ షోరూం ప్రారంభం కావడం హర్షణీయమని తెలిపారు. అనంతరం వెంకట్రావ్, వీరయ్యను ఎస్ఎల్బీటీ సంస్థ అధినేతలు సెట్టి వేణు, భూమా తేజ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఆయిల్పామ్తో అధిక లాభాలుసూపర్బజార్(కొత్తగూడెం): ఆయిల్పామ్ సాగు చేస్తే రైతులు అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగా కిషోర్ అన్నారు. అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సోమవారం తమ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ సాగు ఆవశ్యకత, సబ్సిడీ వంటి వివరాలు తెలిపారు. సమావేశంలో పీసీఓ ఎ.శ్రీనివాస్, ఆయిల్ఫెడ్ డీఓ రాధాకృష్ణ, గోద్రేజ్ డీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలుఇల్లెందు: అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో ఇల్లెందు పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆర్అండ్ఆర్ కాలనీలో 100 గృహాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 60 బైక్లు, 10 ఆటోలు, మద్యం, గుట్కాలు పట్టుకున్నారు. ఐదు బైక్లు సీజ్ చేశారు. అనంతరం చంద్రబాను మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం తమ నివాస ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ టి.సురేష్, టేకులపల్లి, గుండాల సీఐలు బత్తుల సత్యనారాయణ, లోడిగ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈపీఎఫ్ సమస్యలు పరిష్కరించుకోండిపాల్వంచ: ఈపీఎఫ్లో తప్పులుంటే వాటిని సవరణ చేసుకోవచ్చని నిధి ఆప్కే నికట్ వరంగల్ అకౌంట్స్ అధికారి కొండపల్లి సునీల్ అన్నా రు. స్థానిక మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ నెల 27వ తేదీన ఈపీఎఫ్పై అవగాహన కార్యక్రమం ఉంటుందని, ఈ సందర్బంగా నిర్వహించే గ్రీవెన్స్లో సమస్యలు పరిష్కరించి సలహాలు, సూచనలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ ఉద్యోగ యోజన పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ఉపాధి సామర్థ్యాన్ని అభివృద్ది చేయడం, అన్ని రంగాల్లో సామాజిక భద్రత మెరుగుపర్చడం వంటి ప్రయోజనాలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ కె.సుజాత, సెక్షన్ సూపర్వైజర్ రమేష్, మున్సిపల్ మేనేజర్ లోగాని వెంకట సత్యనారాయణ, బరగడి దేవదానం, వెంపటి అరుణ్ కుమార్, బి.సక్రాం, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీగుండాల: ఆళ్లపల్లి మండల కేంద్రంలో పనిచేస్తున్న 108 అంబులెన్స్ను హైదరాబాద్ క్వాలిటీ విభాగం అధికారి ఫకీర్దాస్, జిల్లా సమన్వయకర్త సతీష్ సోమవారం తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వాహనం మరమ్మతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పరమ సునీల్ కుమార్, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఆర్డీఓ మధు అన్నారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 30 మంది దరఖాస్తులు అందజేశారని, ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లపై దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కాగా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం, కొత్తగూడెం రామవరంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని సీపీఎం, సీపీఐ నాయకులు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆత్మహత్యగుండాల: ఒంటరి తనాన్ని భరించలేక మద్యానికి బానిసై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పడుగోనిగూడెం గ్రామానికి చెందిన వూకె నిఖిల్(25) చిన్నతనంలో తల్లిదండ్రులు మృతిచెందారు. దీంతో బంధువుల ఇంట్లో ఉంటున్నా.. ఒంటరివాడినని మథన పడేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యా డు. మనస్తాపానికి గురై వారం క్రితం పురుగుమందు తాగగా, ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదా రహూఫ్ తెలిపారు. -
గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
మణుగూరు రూరల్ : కొత్తగూడెం – మణుగూరు – ఏటూరునాగారం రహదారిపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రోడ్లపై గుంతలతో అనేక మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాకు రావాల్సిన డీఎంఎఫ్టీ నిధులు ఎక్కడికి తరలిపోతున్నాయని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా.. నిధులు సున్నా అని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి అసమర్థ పాలనతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పోశం నర్సింహరావు, కుర్రి నాగేశ్వరరావు, కె. లక్ష్మణ్, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, నూకారపు రమేష్, అక్కి నర్సింహరావు, వేర్పుల సురేష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా -
కాంగ్రెస్లో బీసీలకు ప్రాధాన్యత లేదు
టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్కుమార్ అశ్వారావుపేటరూరల్ : కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదని, మరో మూడు నెలల్లో ప్రభుత్వాన్ని కూలదోస్తారని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. సోమవారం అశ్వారావుపేటలో నిర్వహించిన సామాజిక చైతన్య రథయాత్రలో, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సామాజిక చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ కంటే అధ్వానంగా మారిందని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, మంత్రి కొండా సురేఖను సైతం ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్ దొర, నాయకులు వెలుగు జాకబ్, భాస్కర్రావు, జానీ, బీరప్ప, సుధాకర్ పాల్గొన్నారు. -
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు షురూ..
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు మాట్లాడుతూ.. విజిలెన్స్ విజిలెన్స్ విభాగం సింగరేణిలో అంతర్భాగమని అన్నారు. ప్రతీ పనిలో నీతి నిజాయితీ, పారదర్శకత అవసరమని, తద్వారా సంస్థ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అవినీతికి వ్యతిరేక జరిగే విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ మేనేజర్ విజిలెన్స్ ఎస్డీ షాకీర్ మొహినుద్దీన్ ఉద్యోగులతో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ జీఎం కె.ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికారులు కవితానాయుడు, జి.వి.కిరణ్కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎస్.వి. రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎస్.పీతాంబరరావు, సీఎంఓఏఐ కార్పొరేట్ అధ్యక్షుడు ఎస్.వెంకటాచారి పాల్గొన్నారు. -
కరకట్టపై చెత్త వేస్తే జరిమానా
భద్రాచలంఅర్బన్ : భద్రాచలంలోని అన్ని కాలనీల వారు ఇళ్లలో ఏర్పడే చెత్తను గ్రామ పంచాయతీ ఆటోల్లోనే వేయాలని, కరకట్ట ప్రాంతాల్లో వేస్తే భారీ జరిమానా విధిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇతరులు సోమవారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పీఓ, సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం కరకట్ట ప్రాంతంలో వేసే చెత్తతో వచ్చే దుర్వాసన, కొందరు ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో పరిసర ప్రాంతాల వారితో పాటు భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. త్వరలో కరకట్ట వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, రానున్న వారం రోజుల్లో కరకట్ట ప్రాంతం అంతా శుభ్రం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పంచాయతీ ఈఓ శ్రీని వాసరావు, డీడీఎంహెచ్ఓ చైతన్య పాల్గొన్నారు. సిలబస్ పూర్తి చేయాలిదుమ్ముగూడెం: ఇంటర్ సిలబస్ త్వరగా పూర్తి చేసి రివిజన్ ప్రారంభించాలని రాష్ట్ర ఇంటర్మీడిఝెట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. సోమవారం ఆయన దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజువారీ ఎఫ్ఆర్ఎస్ను 80 శాతానికి పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ కాని విద్యార్ధులకు ఈ రిజి స్ట్రేషన్ చేయించాలని సూచించారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాలని, వాటిని అటెండెన్స్ రికార్డులో నమోదు చేయాలని అన్నారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు జరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ -
బీటీపీఎస్ సీఎస్సార్ నిధులు రూ.2.50 కోట్లు
సూపర్బజార్(కొత్తగూడెం): మణుగూరు బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న సోమవారం ఐడీఓసీలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కలిశారు. బీటీపీఎస్ సీఎస్సార్ నిధుల కింద రూ 2.50 కోట్ల డీడీని అందజేశారు. మణుగూరు నుంచి ఏడూళ్ల బయ్యారం వరకు ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం, భూ సేకరణలో రైల్వేలైన్ సమస్యల పరిష్కారానికి ఈ నిధులు వినియోగించనున్నారు. నేటి బీఆర్ఎస్ ధర్నా వాయిదా.. మణుగూరు టౌన్: రోడ్డు మరమ్మతులకు రూ.2.50 కోట్ల మంజూరు నేపథ్యంలో మంగళవారం బీటీపీఎస్ గేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు సంబంధించి రూ.వందల కోట్ల డీఎంఎఫ్టీ నిధులు రాబట్టే వరకు దశల వారీగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
లక్కు దక్కిందిలా..
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు కొత్తగూడెం క్లబ్లో సోమవారం జరిగిన లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఆరు స్టేషన్ల పరిధిలో చాలా మంది సిండికేట్ అయి టెండర్లు వేయగా, మరికొందరు ఒంటరిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టెండర్లు దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఓ సిండికేట్ వర్గం వారు 21 దరఖాస్తులు దాఖలు చేయగా, ఒక్క షాపు మాత్రమే దక్కింది. టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, అశ్వారావుపేటకు చెందిన మరో 56 మంది సిండికేట్గా ఏర్పడి 108 దరఖాస్తులు దాఖలు చేయగా వారికి మూడు షాపులే వచ్చాయి. ఈ ఏడాది టెండర్ దాఖలుకు రూ.3లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించడంతో దరఖాస్తులు తగ్గినా.. గతంలో కంటే అధికంగానే ఆదాయం సమకూరింది. డ్రాలో షాపులు దక్కించుకున్న వారి నుంచి జిల్లా ఎకై ్సజ్ అధికారులు.. శ్లాబ్ ప్రకారం మొదటి విడత ఫీజు స్వీకరించారు. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల లైసెన్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 88 వైన్ షాపులు, 13 బార్లు ఉన్నాయి. 2023లో జరిగిన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో రూ.2 లక్షల ఫీజుతో మొత్తం 5,057 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం రూ.3లక్షల ఫీజుతో 3,922 దరఖాస్తులు వచ్చాయి. పారదర్శకంగా వ్యవహరించాం.. జిల్లాలో నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు పారదర్శకంగా లాటరీ తీశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే డ్రా పద్ధతిని పాటించామన్నారు. కార్యక్రమమంతా సీసీటీవీల పర్యవేక్షణలో, వీడియో రికార్డింగ్, ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజల సమక్షంలో నిబంధనల ప్రకారం నిర్వహించామని వివరించారు. టెండర్లు దక్కించుకున్న వారు నిర్దేశిత కాల వ్యవధిలో లైసెన్స్ ఫీజు చెల్లించి, షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే మద్యం విక్రయించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించే దుకాణాలు, బెల్ట్ షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు, సర్వేలు కొనసాగుతాయని తెలిపారు. అక్రమ వ్యాపారాల విషయంలో ప్రజలు కూడా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కరంచంద్ తదితరులు పాల్గొన్నారు. శేషగిరిని కరుణించిన పెద్దమ్మతల్లి ! పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద వైన్స్ కోసం పలువురు పోటీ పడగా మారుమూల ప్రాంతానికి చెందిన వాడే శేషగిరికి దక్కింది. ఈ వైన్స్ కోసం జిల్లాలోనే అత్యధికంగా 102 టెండర్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ములకలపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన వాడే శేషగిరి డ్రాలో షాపు దక్కించుకున్నాడు. ఆయన మరో 11 మంది మిత్రులతో కలిసి దరఖాస్తు చేసుకున్నాడు.మద్యం దుకాణాలకు డ్రా కార్యక్రమంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించడం గమనార్హం. కొందరు సెంటిమెంట్తో మహిళల పేర్లతోనే దరఖాస్తు చేయగా, డ్రా కార్యక్రమానికి వారిని తీసుకొచ్చారు. గతంలో డ్రా కార్యక్రమంలో మహిళలు తక్కువగా కనిపించే వారు. కానీ సోమవారం నాటి కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని దుకాణాలకు ఎక్కువ మంది మహిళలతో టెండర్లు వేయించారు. మొత్తంగా 88 మద్యం దుకాణాలకు గాను 44 షాపులు ఎస్టీలకు, ఏడు ఎస్సీలకు, 31 ఓపెన్, ఆరు గౌడ కులస్తులకు కేటాయించారు. -
భక్తిశ్రద్ధలతో సందల్ శోభాయాత్ర
ఇల్లెందురూరల్: గార్వీ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని సీఎస్సీ బస్తీ గ్రామపంచాయతీ హజరత్ ఇమామ్ ఖాసీం ఆషుర ఖానాలో సయ్యద్ యాకూబ్షావళి బాబాకు మూడు రోజులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం బాబాకు సందల్ సమర్పించే కార్యక్రమాన్ని భక్తులు కోలాహలంగా నిర్వహించారు. సీఎస్సీ బస్తీ నుంచి పాతబస్టాండ్, జగదాంబ సెంటర్ మీదుగా హజరత్ ఇమామ్ ఖాసీం ఆషురఖానా వరకు సందల్తో శోభాయాత్ర నిర్వహించారు. ఆషుర్ఖానాలో హజరత్ యాకూబ్షావళికి సంప్రదాయయుతంగా సందల్ సమర్పించారు. అనంతరం దర్గా ప్రాంగణంలో భక్తులకు గార్వీ విందు ఇచ్చారు. కార్యక్రమంలో దర్గా మాలిక్ మహ్మద్ పాషా, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న వాయుగండం
తుపాను నేపథ్యంలో రైతుల్లో హైరానా ● ఇప్పటికే ఆలస్యమవుతున్న వరికోతలు ● మొదలైనా ముందుకు సాగని పత్తితీతలు బూర్గంపాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏర్పడిన మొంథా తుపాన్ రైతులను వణికిస్తోంది. తుపాన్ ప్రభావం మంగళవారం నుంచి ఉంటుందని చెప్పిన వాతావరణ శాఖ.. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో ఇప్పటికే వరికోతలు ఆలస్యమయ్యాయి. కోతకు వచ్చి వరిపంట వర్షాలతో నేలవాలింది. చాలాచోట్ల మాగాణుల్లో నీరు నిలిచి వరికోతలకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో తుపాన్ అలర్ట్ రైతులను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తితీతలు కూడా ఆలస్యమయ్యాయి. ఒకరోజు పత్తి తీయిస్తే వర్షాల కారణంగా నాలుగు రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే తొలివిడత పత్తితీతలు పూర్తి కావాల్సి ఉన్నా.. చాలాచోట్ల మొదలేకాని పరిస్థితి నెలకొంది. కుంగదీస్తున్న వానలు.. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు రైతులను మరింతగా కుంగదీస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 1.85 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఆగస్టు నుంచి తరచూ వర్షాలు పడుతుండడంతో పంటల సాగుకు ప్రతిబంధకంగా మారింది. అధిక వర్షాలతో చీడపీడలు, తెగుళ్లు, పురుగు ఉధృతి పెరిగింది. భూమి, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో దిగుబడులపై ప్రభావం చూపింది. ఎన్నో తిప్పలు పడి పండించిన పంటను తీసుకునేందుకు వర్షాలు ఆటంకంగా మారాయి. మొంథా తుపాన్ ప్రభావం జిల్లాపై ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరికోతలు, పత్తి తీత పనులను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరు జల్లులు కురవడం ప్రారంభమైంది. జిల్లాలో మంగళవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు పత్తితీతలు, వరి కోతలను నిలిపివేశారు. అన్నదాతల ఆందోళన.. అధిక వర్షాలతో ఈ ఏడాది వరి పంటకు తాటాకు, ఎండు తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంది. వీటి నివారణకు రైతులు రూ.వేలు ఖర్చు చేశారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉంది. వర్షాల కారణంగా కోతలు ఆలస్యం కావడంతో కొన్నిచోట్ల వరి పంట నేలవాలింది. మొంథా తుపాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే పంట చేతికి వస్తుందా.. రాదా అనే డైలామాలో రైతులున్నారు. హార్వెస్టర్లతో వరి కోయాలంటే భూమి ఆరకపోవడం, ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడం, ధాన్యం తరలించేందుకు పొలం బాటలు బురదమయంగా ఉండడం వారిని కలవరపరుస్తోంది. ప్రస్తుత తుపాన్ ప్రభావంతో వరికోతలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. నవంబర్ మొదటివారంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నా.. చాలాచోట్ల వాటి నిర్వహణకు అనువైన పరిస్థితి లేదు. ఇప్పటికే కోసిన పచ్చి ధాన్యాన్నే వ్యాపారులకు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకు రూ. 2,389 మద్దతు ధర ప్రకటించగా ప్రస్తుతం రైతులు పచ్చి ధాన్యాన్ని రూ. 1,300 నుంచి రూ.1,450 వరకు అమ్ముకుంటున్నారు. ఇక మొక్కజొన్న కోతలు జరుగుతుండగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఆరబోసిన మొక్కజొన్న వానలకు తడిసిపోతోంది. ఇక తుపాన్ వస్తే పంటలకు మరింతగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతులు తీసిన పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని వ్యాపారులు కొనడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయడం లేదు. తేమశాతం 8 కంటే తక్కువగా ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాల కారణంగా పత్తిలో తేమశాతం తగ్గడం లేదు. చేలలో పూసిన పత్తి వర్షాలకు పాడవుతుండడంతో రైతులు తీయిస్తున్నారు. ఆ పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకోలేకపోతున్నారు. అందులో తేమశాతం ఎక్కువగా ఉండడం, ఆరబెట్టే వీలు లేకపోవటంతో తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటిస్తే, ప్రస్తుతం రైతుల నుంచి వ్యాపారులు క్వింటా రూ.4 వేల నుంచి రూ 5 వేల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు దిగుబడి రాక, మరో వైపు మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
ఘనంగా సత్యనారాయణ వ్రతం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో ఆర్జిత సేవలో భాగంగా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రామాలయంలోని అంతరాలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిత్యకల్యాణం సంప్రదాయబద్ధంగా జరిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, కంకణధారణ, మాంగల్యధారణ, వేద ఆశీర్వచనంతో కల్యాణ ప్రక్రియ ముగించారు. -
పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు
కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈదాడిలో ఉదయం గ్రామానికి చెందిన ఓ బాలుడు గాయపడ్డాడు. సాయంత్రం గ్రామ పంచాయతీ కార్మికుడు గోపె నాగయ్యపై దాడిచేయగా నుదుటిన తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని పశువులు, మేకలను కరిచి గాయపర్చటంతో గ్రామస్తులు కుక్కను వెంబడించి హతమార్చారు. రెండు బైక్లు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు టేకులపల్లి: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలై ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రాంపురం గ్రామానికి చెందిన కేళోతు లచ్చిరాం, కేళోతు నరసింహారావు, మాళోతు సక్రు ముగ్గురూ కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం అద్దెకు తీసుకున్న ఎద్దులను ఎర్రాయిగూడెంలోని యజమానికి అప్పగించేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. అక్కడి నుంచి బైక్పై ముగ్గురూ స్వగ్రామానికి బయలుదేరారు. దాసుతండా వద్దకు రాగానే బర్లగూడెంనకు చెందిన యువకుడు వేగంగా బైక్పై వచ్చి ముగ్గురు ఉన్న బైక్ని ఢీకొట్టాడు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇల్లెందు, టేకులపల్లికి చెందిన రెండు 108 అంబులెన్సులలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వరుస వర్షాలతో తెగుళ్లు
చర్ల: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పైర్లు దెబ్బ తింటున్నాయి. అక్టోబర్ గడుస్తున్నా వానలు కురుస్తుండటంతో పంటలు వర్షార్పణమవుతున్నాయి. తొలితీత దశలో ఉన్న పత్తి, ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న దెబ్బతిన్నాయి. వరి పంట లో తెగుళ్ల ఉధృతి పెరుగుతోంది ఈ ఏడాది జిల్లాలో సగటు విస్తీర్ణం కంటే అదనంగా 21,988 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సుమారు 1.85 లక్షల ఎకరాల్లో వరి, 2,21,345 ఎకరాల్లో పత్తి, మొత్తం పంటలు 5.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. పంటలను ఆశిస్తున్న తెగుళ్లు జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో సాధారణం కంటే 23.8 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. చర్ల, గుండాల, మణుగూరు, టేకులపల్లి, చండ్రుగొండ, సుజాతనగర్ , పాల్వంచ తదితర మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అధిక వర్షాలతో పంటలను తెగుళ్లు ఆశిస్తున్నాయి. తేమశాతం ఎక్కువగా ఉండటంతో వరి పంటకు సుడిదోమ (బీపీహెచ్), బ్యాక్టీరియా ఎండు ఆకు (బీఎల్బీ), కంకి నల్లి ( పానికల్మిట్) వంటి తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ధాన్యం దిగుబడి తగ్గుతుందని రైతులు దిగులు చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో వరి పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే కొంత మేర నష్టాన్ని తగ్గించుకోవచ్చు. వరి పంటను సుడిదోమ, బ్యాక్టీరియా ఎండు తెగులు, కంకినల్లి వంటివి ఆశిస్తున్నాయి. సుడిదోమ కనిపిస్తే పొలంలో నీరు నిలువ లేకుండా చేయాలి. బ్యాక్టీరియా ఎండు ఆకు తెగలు ఆశిస్తే ఎకరాకు 60 గ్రాముల స్ట్రెప్టోమైసిన్సల్ఫేట్ పిచికారీ చేయాలి. ఈ సందర్భంలో యూరియా వేయడం ఆపి వేయాలి. కంకి నల్లి నియంత్రణకు స్పైరోమైసిన్ మందును ఎకరాకు 159 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. వర్షం ఆగిన వెంటనే పొలాల్లో నీటి నిల్వను తొలగించాలి. మడుల మధ్య గాలి ప్రసరణ అయ్యేలా దారులు తీయాలి. ఫంగస్ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా నాటివో ఫంగసైడ్ పిచికారీ చేయాలి. – బి.సుధాకర్రావు, ఏడీఏ, భద్రాచలం సబ్ డివిజన్ -
ముంపు నుంచి రక్షణకు రూ.100 కోట్లు
ఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగరాన్ని గతేడాది తీవ్రంగా ప్రభావితం చేసిన మున్నేరు వరద ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వరద నియంత్రణ, నివారణ చర్యల కోసం రూ.6,190 కోట్ల విడుదలకు జలశక్తి మండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జిల్లాకు నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది వరదలతో ములుగు, కొత్తగూడెం, రామగుండం, భూపాలపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో భారీ నష్టాలు సంభవించాయి. వరద నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికల ఆధారంగా కేంద్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక కింద నిధులు కేటాయించింది. ఖమ్మంలో మున్నేరు వరద ముప్పును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఇటీవల జలవనరుల శాఖ అధికారులు ప్రకాశ్నగర్ వంతెన నుంచి నేషనల్ హైవే వంతెన వరకు సర్వే నిర్వహించి రిటైనింగ్ వాల్ పొడిగింపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర జలశక్తి మంజూరుచేసిన రూ.100 కోట్లను ఈ ప్రతిపాదిత పనుల కోసం వినియోగించనున్నారు. మొదట ధంసలాపురం కాలనీ వైపు శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నిధులతో మున్నేరు పరిధిలో రిటైనింగ్ వాల్ పొడిగింపు, డ్రెయినేజీ మార్గాల అభివృద్ధి, వరద నీరు తక్షణం నదిలోకి చేరేలా పనులు చేపట్టనున్నారు.నిధులు మంజూరు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ -
గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్
ఇల్లెందు: ఎస్పీ రోహిత్రాజ్ ఆదేశాల మేరకు ఇల్లెందు సీఐ టి.సురేశ్ గంజాయి సరఫరా చేసే సపావత్ వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాశీరాంతండాకు చెందిన సపావత్ వెంకన్న గంజాయి సరఫరా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లా జైలులో ఉన్న వెంకన్నపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై భద్రాచలం, దుమ్ముగూడెం, రాజేంద్రనగర్, ఇల్లెందు తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. గత ఏడాది ఇల్లెందు పోలీసులు వెంకన్నను అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో వెంకన్నను అరెస్ట్ చేయగా.. చాకచక్యంగా తప్పించుకున్నాడు. పట్టణం దాటక ముందే ఆనాటి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. తాజాగా వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి, అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ సురేశ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ రోహిత్రాజ్ అభినందించారు. -
వారధికి మరమ్మతులేవి..?
భద్రగిరి వారధి గుంతలమయంగా మారింది. ఆరు దశాబ్దాలుగా సేవలందిస్తున్నా మరమ్మతులు చేపట్టడంలేదు. గోదావరి పాత బ్రిడ్జి నిండా గుంతలు ఏర్పడటంతో వాహనాదారులు అవస్థ పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు కొత్త బ్రిడ్జి తుది పనులు పూర్తికాలేదు. పంచాయతీ, ఆర్అండ్బీ శాఖ అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. – భధ్రాచలంప్రమాదకరంగా పాత బ్రిడ్జి 1965లో ప్రారంభమైన పాత బ్రిడ్జి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తోంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. సుమారు తొమ్మిదేళ్లపాటు నిర్మాణం సాగగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని పనులు పూర్తి చేయించారు. రద్దీ దృష్ట్యా గతేడాది శ్రీరామనవమి నుంచి రెండో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అప్పటినుంచి పాత బ్రిడ్జి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో బ్రిడ్జి పొడవునా ప్రమాదకరంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సారపాక వైపు అప్రోచ్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. రెండు వైపులా పిచ్చి మొక్కలు మొలిశాయి. పరిశుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతోపాటు మట్టి పేరుకుపోయింది. భద్రగిరి దర్శనానికి వచ్చే భక్తులు ‘ఇదేం దక్షిణ అయోధ్య’ అనుకుంటూ పెదవి విరుస్తున్నారు.చీకట్లోనే రాకపోకలు గత శ్రీరామనవమికి కొత్త బ్రిడ్జిపై అనధికారికంగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తుది పనులను మాత్రం అలాగే వదిలేశారు. బ్రిడ్జికి రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పూర్తి చేయలేదు. ఇప్పటివరకు విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. చిమ్మ చీకట్లోనే రాకపోకలు సాగుతున్నాయి. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ద్విచక్రవాహన ప్రమాదంలో యువకులు మృత్యువాత పడ్డారు. నిర్మాణలో లోపం వల్ల వర్షం నీళ్లు బ్రిడ్జిపైనే నిలుస్తున్నాయి. వరదల మాదిరిగా ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. ఇలా రెండో బ్రిడ్జిపై సమస్యలు తిష్టవేశాయి. గతేడాది నుంచి రాకపోకలు సాగిస్తున్నా రెండో బ్రిడ్జిని ఇంతవరకు అధికారికంగా ప్రారంభించలేదు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టగా, పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడంలేదు. శిలాఫలకం పైలాన్ నిర్మాణం కూడా మధ్యలోనే ఆపేశారు. తుది పనులు సైతం నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మొదటి బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని, కొత్త బ్రిడ్జి తుది పనులను పూర్తి చేయాలని సీతారామ చంద్రస్వామివారి భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
ఉత్సాహంగా సాగిన ఈత ర్యాలీ
ఖమ్మంస్పోర్ట్స్: పోలేపల్లి మున్నేరుఒడ్డున ఈత ర్యాలీ ప్రారంభమై ఆరు కిలోమీటర్లపాటు ఉత్సాహంగా కొనసాగింది. ఆదివారం మున్నేరులో ఈతమిత్రుల సంఘం ఆధ్వర్యంలో కొన సాగిన ర్యాలీలో దాదాపు 150 మందికి పైగా యువకులు, పెద్దలు పాల్గొన్నారు. పోలేపల్లి నుంచి కరుణగిరి ప్రాంతంలోని గురుదక్షిణ ఫౌండేషన్ మున్నేరు ఒడ్డు వరకు సాగింది. సీనియర్ స్విమ్మర్స్ కోదాటి గిరి, బోజెడ్ల ప్రభాకర్, ఆర్గానిక్ రాంరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ దర్గయ్య, ఎకై ్సజ్ బుజ్జి, కోటేశ్వరరావు, గోపాల్రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ.. నీటి ప్రమాదాల నుంచి ప్రజలకు అవగాహన, రక్షణ కల్పించేందుకై మున్నేరులో లాంగ్ ఈత ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. వయస్సు కూడా లెక్కచేయకుండా ఎనభై ఏళ్లు దాటిన స్విమ్మర్లు, పిల్లలు పాల్గొన్నారని, ఏటా ర్యాలీ జరుపుతున్నామని వివరించారు. -
ప్రజలతో మమేకం
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ది విభిన్న శైలి ● నేలపై కూర్చుని గ్రామస్తులతో మాటామంతిపాల్వంచరూరల్: కలెక్టర్ నిత్యం విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. జిల్లా అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తుంటారు. కానీ ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇవన్నీ చేస్తూనే ప్రజలతో మమేకం అవుతున్నారు. భిన్నమైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆదివారం పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయతీలోని మారుమూల ఆదివాసీ గ్రామం కొయ్యగట్టును సందర్శించారు. గ్రామంలో స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడే రెండు గంటలపాటు గడిపారు. నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక, సిమెంట్తో (కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్న్) బ్లాక్ ఇటుకలను తానే మట్టి కలిపి తయారుచేసి చూపించారు. స్కూల్ నిర్మాణ పనుల్లో ఐరన్ పైపులను అందించారు. నేలపైన రాయిపై కూర్చుని గ్రామస్తులతో మాట్లాడారు. ఇటీవల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలోనూ పక్కన సీసీ ఉన్నప్పటికీ పిల్లలు, అధ్యాపకులు చెప్పిన సమస్యలను తానే నోటు చేసుకున్నారు. ఇలా నిత్యం ప్రజలతో మేమకం అవుతూ, ఓపికగా సమస్యలు ఉంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. చదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పులుచదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పులు వస్తాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామపంచాయతీ ఆదివాసీ గ్రామం కొయ్యగట్టును ఆదివారం ఆయన ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మతో కలిసి సందర్శించారు. పాఠశాల భవన నిర్మాణాలకు అవసరమైన మట్టి ఇటుకల తయారీపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ పాఠశాల భవనం నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాల భవనానికి ఫారెస్ట్ రక్షణ భవనంగా పేరు పెడతామని అన్నారు. విధి నిర్వహణకు అటవీ ఉద్యోగులు కూడా ఒక గది వినియోగించుకోవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటలు నిర్మించుకోవాలని, చేపలు, కౌజు పిట్టలు, వెదురు పెంపకం చేపట్టి ఆదాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఎంఈఓ శ్రీరాంమూర్తి, హెచ్ఎం.బిక్షం, ఆర్ఐ నళినీకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబా ఆలయంలో సంగారెడ్డి జడ్జి పూజలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో గల శ్రీ సాయిబాబా ఆలయాన్ని ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా జడ్జి సాయిభూపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జడ్జి సాయిభూపతిని ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదినారాయణ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. లయన్స్క్లబ్కు ఎక్స్లెన్స్ అవార్డు మణుగూరురూరల్: మెంటల్ వెల్ బీయింగ్ అండ్ వెల్నెస్ వారోత్సవాల్లో భాగంగా మండలంలో తొమ్మిదిరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన మణుగూరు లయన్స్క్లబ్కు జిల్లాస్థాయి ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. సోమవారం ఖమ్మం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన రెండో జిల్లా కేబినేట్ సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు షేక్ మీరాహుస్సేన్కు ఈ అవార్డును క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్మోహన్ చేతుల మీదుగా అందజేశారు. నూతన విద్యా విధానాన్ని నిలిపివేయాలిఖమ్మంమామిళ్లగూడెం: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా పీఎంశ్రీ పాఠశాలలు ఏర్పాటు చేసి, నూతన విద్యా విధానం పేరుతో పసిపిల్లల మెదళ్లలో మతతత్వ బీజా లు నాటే ప్రయత్నం చేస్తోందని, వెంటనే నూత న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్భవన్లో ఏఐఎస్ఎఫ్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. దేశవ్యాప్తంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పాలని, నూతన విద్యావిధానం ద్వారా మతత త్వ బోధనలు చేయాలని తలపెట్టిందన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి పీఎంశ్రీ పాఠశాల ఏర్పాటుచేయడానికిపూనుకుందని,రాష్ట్ర ప్రభు త్వం కూడా దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు శివ, వంశీ, గోపి, పవన్, నరేందర్, సందీప్, వెంకట్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల క్రీడా జట్లు సిద్ధంఖమ్మంస్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, లాన్ టెన్నిస్ క్రీడాంశాల్లో వివిధ వయసు కేటగిరిల్లో ఎంపికలను నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. జిల్లా స్కేటింగ్ అండర్–11 బాలికల జట్టులో బి.రిత్విత, జి.సోనాక్షి, టి.జింగ్నార్ష, ఎస్.కె. సమీరా, పి.యోధ, వై.దేవర్షిశ్రీ, బాలుర జట్టులో కె.సాయిశ్రీతేజ, డి.లోహిత అభిరాం, ఎ.కౌశల్, ఆర్.రియాన్, డి.భవన్జై, బి.విశ్వకార్తీక్, అండర్–14 బాలికల జట్టులో టి.జ్ఞానవి, ఐ.వ్యూహిత, వి.పవిత్రయాదవ్, వై.చైతన్య, బాలుర జట్టులో ఎ.భువన్తేజ, ఎ.వవన్సాయి, అండర్–17 బాలుర జట్టులో డి.మదిలేశ్, ఎ.చరణ్, ఎండీ తౌహిద్, జిల్లా జిమ్నాస్టిక్స్ జట్టులో బి.మనోజ్ఞసుచరిత, జి.దీక్షితశ్రీ, ఆర్.లోహితసాయి, బాలురజట్టులో సాయిరాం భరత్, సీహెచ్ మోక్షచందర్, ఎస్.కె.హమీద్అలీ, లాన్ టెన్నిస్ అండర్–14 బాలికల జట్టులో బి.ప్రీతి ప్రజ్వల్, బి.భానుశ్రీ, వి.నేహాశ్రీ, శాలిని, బాలురలో కె.వీరవర్దన్, బి.రిషిరాంనాయక్, ఎస్.తేజ్దీప్, ఎండీ మసూద్, గగన్దీప్, అండర్–17 బాలుర జట్టులో స్వప్నిల్, రఘురాం ఎంపికయ్యారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ ఖమ్మం సహకారనగర్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి, డీఎస్సీలో ప్రతిభ కనబరిచి, గత 20 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్నవారు మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, భాషా పండితుల, పీఈటీల అప్గ్రేడేషన్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి.నాగేశ్వరరావు, టి.వెంగళరావు, నాయకులు ఆళ్ల రామారావు, ముత్తయ్య, రమాదేవి, కె.వి, వీరబాబు, మల్ల య్య, నాగిరెడ్డి సంధ్యరాణి, ఉమాదేవి, ఆకుల నాగేశ్వరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● సత్తుపల్లిలో మెగా జాబ్మేళా విజయవంతం సత్తుపల్లి: ప్రతీ జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి, టాస్క్ సహకారంతో ఆదివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్మేళాను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే ఉద్యోగాల్లో మాత్రం అథమ స్థానంలో ఉందన్నారు. జాబ్మేళాకు సుమారు 70 కంపెనీలు రావడం, 13 వేల మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్మేళాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని, వివిధ నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రైవేట్ కంపెనీల ద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తోందని చెప్పారు. జాబ్మేళా నిర్వహించిన ఎమ్మెల్యే రాగమయి, సహకరించిన సింగరేణి సంస్థను అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఉద్యోగాలు సాధించటం ద్వారా ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హతకు తగిన ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి చేరవచ్చని సూచించారు. సింగరేణి ద్వారా సత్తుపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి ఈఅండ్ఎం డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ.. కోల్బెల్ట్ ప్రాంతంలో ఇది ఆరో జాబ్మేళా అని చెప్పారు. అనుభవం లేని వారికి కూడా ఉద్యోగావకాశాలు దక్కినందున కెరీర్ డెవలప్మెంట్కు ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఏసీపీ రఘు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్బాబు, భాగం నీరజ, మున్సిపల్ కమిషనర్ కోండ్రు నర్సింహా, తోట సుజలారాణి, ఎండీ కమల్పాషా, ఉమ్మినేని ప్రసాద్, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, గాదె చెన్నారావు, పసుమర్తి చందర్రావు, మందపాటి ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: కార్తీకమాసం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణ కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు కొత్తగూడెం, భద్రాచలంలలో ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌలభ్యం కోసం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్వార్డ్లో తమ దరఖాస్తులను అందజేసి రశీదులు పొందాలని, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. పర్యాటకుల జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. పొరుగు జిల్లాలో నుంచీ సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 356 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,980 ఆదాయం లభించింది. 300 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,700 ఆదాయం సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు. రైతు నేస్తం అవార్డు ప్రదానందమ్మపేట: మండలంలోని అల్లిపల్లి గ్రామానికి చెందిన పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్కు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం రైతు నేస్తం అవార్డు అందజేశారు. హైదరాబాద్లోని స్వర్ణభారతి మండపంలో ఉమ్మడి ఏపీకి చెందిన రైతు నేస్తం ఫౌండేషన్, స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో అవార్డును ప్రదానం చేశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కోటగిరి సత్యంబాబు, ఎల్లిన రాఘవరావు, నాగప్రసాద్, కేవీ, కొయ్యల అచ్యుతరావు, మురళి, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. రేక్ పాయింట్కు చేరిన యూరియాచింతకాని : మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,512.80 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్కుమార్ ఈ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,052.80 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 710 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 550 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీ కి 200 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. -
రాష్ట్రస్థాయి టీటీ టోర్నీలో ప్రతిభ
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లోని డీఆర్ఎస్ పబ్లిక్ స్కూల్లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీ ల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–11 బాలురలో జాయ్ ఇమ్మాన్యుయేల్ ద్వితీయస్థానం, అండర్–13 సింగిల్స్లో షేక్ సహాయల్ ఫజల్ ప్రథమ, అండర్–15 బాలురులో గౌరిశెట్టి చార్విక్ తృతీయస్థానం దక్కించుకున్నారు. అండర్–17 బాలురలో పరిటాల జలిత్ సింగిల్స్లో టైటిల్ను దక్కించుకోగా, పిట్టల మోహిత్ కృష్ణ తృతీయస్థానంలో.. అదే డబుల్స్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాడు. బాలికల అండర్–17లో గద్దల సిరి ద్వితీయస్థానం, డబుల్స్లో ప్రథమస్థానంలో నిలిచింది. అండర్–13లో బొంతు సాయిశివాని ద్వితీయ, వి.సౌమ్య సింగిల్స్లో ప్రథమస్థానం, అండర్–13లో ఈలప్రోలు హరి, ఈలప్రోలు తరుణ్ సింగిల్స్లో ద్వితీయ, డబుల్స్లో ప్రథమస్థానంలో నిలిచారు. అండర్–15 బాలుర డబుల్స్లో రణధీర్రెడ్డి ప్రథమ, డబుల్స్లో ప్రథమ, సీతా ప్రజ్ఞాన్ ప్రథమ, జి.చంద్రికరాణి, జి.షర్మిలరాణి డబుల్స్ లో ప్రథమస్థానాల్లో నిలిచారు. వారిని డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలసాని విజయ్, కార్యదర్శి వి.సాంబమూర్తి, ఉపాధ్యక్షులు పరిటాల చలపతిరావు, గద్దల రామారావు, షేక్ జవహర్పాషా అభినందించారు. -
‘జీరో’ చేయాల్సిందే..
ఇల్లెందు: గ్రామాల్లో పంటల కొనుగోళ్లు చేసే ప్రతీ వ్యాపారికి లైసెన్స్ ఉంటే జీరో దందా ఇక జీరో అయిపోతుందని, మార్కెట్ల నుంచి జిల్లా రాబడి రెట్టింపు అవుతుందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అక్రమ పద్ధతుల్లో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వ్యాపారులను గుర్తించి వారికి మార్కెట్ శాఖ నుంచి లైసెన్సులు ఇప్పించే చర్యలు కూడా ముమ్మరం చేశారు. దీని కోసం విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. గత ఏడా ది కంటే రెట్టింపు స్థాయిలో లైసెన్సులు ఇచ్చినప్పటికీ జిల్లావ్యాప్తంగా అన్ని మార్కెట్ల పరిధిలో అక్రమ పద్ధతుల్లో అనుమతులు లేకుండా వ్యాపారం చేసే వారు చాలా మంది ఉన్నారు. మార్కెట్ ఫీజు ఎగనామం పెట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్టర్లలో క్రయ విక్రయం నమోదు చేయడం లేదు. దీంతో మార్కెట్ ఆదాయం తరిగిపోతోంది. కొంతకాలంగా అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. తాజాగా పత్తి పంట విక్రయానికి కిసాన్ కపాస్ యాప్లో పంటల సాగు వివరాలు నమోదు చేసిన వారి నుంచే సీసీఐ కొనుగోలు చేసే అవకాశం ఉంది. చెక్ పోస్టు ఉన్నా ఏమీ చేయలేక మార్కెట్ పరిధి దాటి సరుకు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తోంది. జీరో దందాకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. 139 మందికి లైసెన్స్లు జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. కొత్తగూడెం మార్కెట్ పరిధిలో 37 మంది వ్యాపారులు ఉండగా దమ్మపేట మార్కెట్ పరిధిలో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక భద్రాచలం మార్కెట్ పరిధిలో 10 మంది, చర్ల మార్కెట్ పరిధిలో 5, బూర్గంపాడు పరిధిలో 11 మంది ఉన్నారు. ఒక్క ఇల్లెందు మార్కెట్ పరిధిలో 68 మంది వ్యాపారులు ఉన్నారు. జిల్లాలో 139 మంది వ్యపారులకు లైసెన్సులు ఉన్నాయి. ఇందులో సగం ఒక్క ఏడాదిలో పొందిన వారే ఉన్నారు. సీజన్ వస్తోంది.. ఏటా అక్టోబర్ నుంచి పంట ఉత్పత్తులు వస్తుంటాయి. పత్తి, మొక్క జొన్న పంటలు ముందే చేతికి వస్తుంటాయి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం జిల్లాలో నాలుగు మిల్లులకు అనుమతి ఇచ్చారు. ఈ దఫా భద్రాద్రి జిల్లాలో 44 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. కారేపల్లి, సుజాతనగర్, లక్ష్మీపురం, బూర్గంపాడులోని మిల్లుల ద్వారా సీసీఐకి పత్తి విక్రయించేలా గురువారం జిల్లా మార్కెట్ శాఖ అధికారి నరేందర్ అనుమతి ఇచ్చారు. జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్యార్డులు ఉన్నాయి. 2025–26 ఏడాదికి జిల్లా లక్ష్యం రూ.22.65 కోట్లుగా నిర్ణయించారు. మార్క్ఫెడ్ కోసం ఎదురుచూపులు.. ఈ దఫా మొక్కజొన్న సాగు ఎక్కువైనప్పటికీ దిగుబడి మాత్రం తగ్గింది. విక్రయించుకునేందుకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉండగా గ్రామాల్లో వ్యాపారులు మాత్రం రూ.2 వేలకు మించి పెట్టడం లేదు. మార్క్ఫెడ్ ద్వారానైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన రైతులు కోరుతున్నారు. మార్కెట్ గత ఏడాది ఈ ఏడాది లక్ష్యం లక్ష్యం బూర్గంపాడు 586.05 625.34 దమ్మపేట 325.35 367.66 ఇల్లెందు 464.69 516.60 భద్రాచలం 200.00 194.60 కొత్తగూడెం 330.88 347.89 చర్ల 262.66 212.90 జిల్లాలో మక్క సాగు అత్యధికంగా ఉన్నా దిగుబడి మాత్రం తగ్గింది. అయితే మార్కెట్లో వ్యాపారులు తక్కువ రేటుకు మక్కలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించాలంటే తక్షణమే మార్క్ఫెడ్ రంగంలోకి దిగి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకోవాలి. –బానోతు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇల్లెందు అనుమతి లేని వ్యాపారం నేరం.. జిల్లాలోని అన్ని మార్కెట్ల పరిధిలో అనుమతి లేకుండా, లైసెన్స్ పొందకుండా వ్యాపారులు కొనుగోళ్లు చేపడితే చర్యలు తీసుకుంటాం. వారి పంటలను సీజ్ చేస్తాం. ఇప్పటికే నాలుగు మిల్లులకు సీసీఐ ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అనుమతి ఇచ్చాం. ఇక మార్కెట్లలో పంటల కొనుగోళ్లకు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. అనుమతి కోరితే ఇచ్చేందుకు సిద్ధం. –జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి లైసెన్స్ లేకుండా వ్యాపారం.. మార్కెట్ ఆదాయానికి గండి -
ద్విచక్రవాహనం చోరీ
జూలూరుపాడు: మండలంలోని పడమటనర్సాపురం గ్రామంలో ఓ ఇంటి ఎదుట ఉన్న బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పడమటనర్సాపురం కాలనీకి చెందిన శ్రీరామ్ తన బైక్ను ఇంటి ఎదుట ఉన్న రేకుల్షెడ్లో నిలిపి ఉంచాడు. ఆదివారం నిత్రలేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. బైక్ను దుండగులు కొత్తగూడెం వైపు తీసుకెళ్లినట్లు డేగలమడుగు సమీపంలోని పెట్రోల్ బంక్ సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలిసింది. శ్రీరామ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుక్కలను తప్పించబోయి లారీ కిందికి.. ద్విచక్రవాహనం దూసుకుపోవడంతో మహిళ మృతి సత్తుపల్లిరూరల్: రహదారిపై ఓ మహిళ స్కూటీపై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో తప్పించబోయి లారీకిందికి దూసుకుపోయింది. తీవ్రగాయాలతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణంలోని పోస్టాఫీస్ రోడ్డుకు చెందిన మోరంపూడి స్వర్ణలత (55) ద్విచక్రవాహనం(స్కూటీ)పై గంగారం వైపు నుంచి సత్తుపల్లికి వస్తోంది. తాళ్లమడ శివారున కుక్కలు అడ్డురావడంతో వాహ నం అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ధాన్యం కోసం ఆగి ఉన్న లారీ కిందకు దూసుకుపోయింది. లారీకింద భాగంలో ఇరుక్కుపోయిన స్వర్ణలత తలకు బంపర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను సత్తుపల్లి 108 సిబ్బంది బయటకు తీశారు. మృతురాలికి భర్త రామకోటేశ్వరరావు, కుమారుడు నాగశ్యామ్, కుమార్తె నాగశ్రీ ఉన్నారు. -
లక్కు ఎవరికో..?
● నేడు కొత్తగూడెం క్లబ్లో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ● ఏర్పాట్లు పూర్తిచేసిన ఎకై ్సజ్ అధికారులు ● జిల్లా వ్యాప్తంగా 88 షాపులకు 3,922 దరఖాస్తులు పాల్వంచరూరల్: మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. లక్కు ఎవరిని వరిస్తుందోనని దరఖాస్తుదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 88 మద్యం దుకాణాలు ఉండగా, 2025–2027 సంవత్సరాల కాలానికి లైసెన్స్ కోసం గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు టెండర్ దరఖాస్తులు స్వీకరించారు. గతంలో రూ.2 లక్షలు ఉన్న లైసెన్స్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం ఈసారి రూ.3 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో గతం కంటే దరఖాస్తులు తగ్గినా ఆదాయం పెరిగింది. మొత్తం 3,922 దరఖాస్తులు రాగా, ఎకై ్సజ్ శాఖకు రూ. 117.66 కోట్ల ఆదాయం వచ్చింది. లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు కోసం ఎకై ్సజ్శాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ తీసే ప్రక్రియను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభిస్తారని ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. లాటరీలో షాపును దక్కించుకున్న వ్యాపారులు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు. నిర్దేశించిన లైసెన్స్ ఫీజును రెండేళ్ల కాలంలో ఆరు విడతలుగా చెల్లించే అవకాశం ఉంది. మొదటి విడుత ఫీజు మాత్రం వచ్చే నెలాఖరులోగా చెల్లించాలి. జిల్లాలోని ఐదు ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, భద్రాచలంలో అత్యధికంగా 16 షాపులకు 828 దరఖాస్తులు వచ్చాయి. మణుగూరులో 15 షాపులు ఉండగా తక్కువగా 512 దరఖాస్తులు వచ్చాయి. ఇక పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి వద్ద షాపునకు రికార్డు స్ధాయిలో 102 దరఖాస్తులు వచ్చాయి. కాగా నాలుగు, ఐదు దరఖాస్తులు దాఖలు చేసిన వ్యాపారులు ఒక్క షాపైనా వస్తుందో రాదోనని టెన్షన్ పడుతున్నారు. -
అండర్ – 19 క్రీడా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్బాల్, రగ్బీ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసా కలీం తెలిపారు. అండర్–19 బాస్కెట్బాల్ బాలుర జట్టులో జోయిదీప్, అబిద్, సిద్దు, వినయ్కుమార్, విష్ణు, చేతన్, ఖాదర్, సంజయ్, లోహిత్, తాస్విక్, రాజ్ కీర్తన్, బాలికల జట్టులో మౌనిక, జోషిత, సాగరిక, ధత్రి, అశిని, జబీన్, మనస్విని, లిఖిత, దీక్షిత, ప్రవళ్లిక, అక్షనీ, లావణ్య, సాయిచరిత, రగ్బీ బాలుర జట్టులో జి.ప్రవీణ్, బి.గణేష్, వి. రోమిత్, పి.వీరబ్రహ్మం, ఎం.శరణ్సాయి, ఎం. గోపీచంద్, డి.నోము, ఎ.రాకేష్, ఆర్. ఈశ్వర్, బి.రాజశేఖర్, యక్షిత్, బి.సంతోష్, టి.మనోహర్, కె.శ్రావణ్, పి.సాయితేజ, పి.విగ్నేష్, జి.నూతన్కుమార్, బాలికల జట్టులో ఎ.వేదశ్రీ, బి.సునీత, కె.సాత్విక, ఎస్.సోని, కె.మంజు, జి.మైసీ, జి.శైలజ, డి.హిమవర్షిని, జె.సాహితీ, పి.సల్మా, ఆర్.గీతయామిని, ఎస్.సాత్వి, బి.పావని, జె.ప్రవళ్లిక, ఐ.భవాని, ఎం.డి.ఆఫ్రీన్, జిచయవస్విని, కె.లాస్య ఉన్నారు. -
పశువులు పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు అక్రమంగా తరలిస్తున్న పశువులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని గుండాల కాల నీ నుంచి తిరువూరుకు రెండు ట్రాలీ ఆటోల్లో 12 పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్లోని చెక్పోస్టు వద్ద పోలీసులు నిలిపివేశారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. 70 బైక్లు స్వాధీనంఅశ్వారావుపేట: గంజాయి నిర్మూలన కోసం పోలీసులు చేపట్టిన ‘చైతన్యం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పట్టణంలోని వడ్డెర బజారు వద్ద నాకాబందీ, కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 టూవీలర్లు, 4 ఆటోలు, 4 కారులు, 6 ట్రాక్టర్లు, 2 లారీలు, బెల్టు షాపులలో నిల్వ ఉంచిన 16 లీటర్ల మద్యం స్వాధీన పరచుకున్నారు. గంజాయి వాడుక, విక్రయం, రవాణా చేయొద్దని అవగాహన కలిగించారు. సీఐ పింగళి నాగరాజురెడ్డి, ఎస్ఐలు యయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి, అఖిల, సిబ్బంది ఉన్నారు. -
గంజాయి కేసులో పీడీ యాక్ట్ నమోదు
జూలూరుపాడు: గంజాయి అక్రమ రవాణా కేసులోని నిందితుడిపై జూలూరుపాడు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం సారపాక తాళ్లగొమ్మూరుకు చెందిన దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లొచ్చాక కూడా తీరు మార్చుకోకుండా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. దీంతో నిందితుడిపై పీడీ యాక్ట్ను అమలు చేస్తూ ఈనెల 23వ తేదీన పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ రవి పీడీ యాక్ట్ నమోదు చేసి, సంబంధిత పత్రాలను చర్లపల్లి జైలు అధికారుల సమక్షంలో నిందితుడికి ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో శివశంకర్ రెడ్డి ఆస్తులను జూలూరుపాడు పోలీసులు జప్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డకట్ట గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పోలీస్శాఖ ఆధ్వర్యంలో చైతన్యం–డ్రగ్స్పై యుద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదయ్యేలా కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ అబుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మీ, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
‘రామయ్య’కు ఇంటిపోరు!
● రామాలయంలో సిబ్బంది మధ్య వర్గవిభేదాలు ● నూతన ఈఓకు తలనొప్పిగా మారిన వ్యవహారం ● భద్రాచలం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి!భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఇంటి పోరు రచ్చకెక్కుతోంది. అధికారులు, సిబ్బంది నడుమ పొసగకపోవడంతో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఆలయ అభివృద్ధిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. వెరసి ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఈఓ దామోదర్రావుకు తలనొప్పిగా మారింది. కొత్త ఈఓ వచ్చాక రెండుసార్లు అంతర్గత బదిలీలు గతంలో పనిచేసిన ఈఓ ఎల్.రమాదేవి ఆలయ పాలనను గాడిలో పెట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్గత బదిలీలను చేపట్టి అక్రమార్కులకు చెక్ పెట్టారు. రామయ్య సొమ్మును మింగిన అవినీతి పరుల వద్ద నుంచి రికవరీ చేశారు. ఈ సమయంలో పలువురిని ఇతర విభాగాలకు, పర్ణశాలకు బదిలీ చేశారు. రమాదేవి బదిలీ కాగానే బాధ్యతలు చేపట్టిన దామోదర్రావు కూడా రెండుసార్లు అంతర్గత బదిలీలు చేపట్టారు. ఇందులో రెండోసారి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి ఈఓ పలు కారణాలతో దూరంగా ఉంచిన వారికే అధిక ప్రాధాన్యతను ఇస్తూ బదిలీ చేశారు. దీంతో వర్గపోరు ఉత్పన్నమైంది. విధుల్లో చేరేందుకు విముఖత? అంతర్గత బదిలీలు చేశాక చాలా మంది వెంటనే విధుల్లో చేరలేదు. దీంతో విధుల్లో చేరాలని ఈఓ దామోదర్రావు మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా విభాగాల బాధ్యతలను అప్పగించకుండా కొందరు జాప్యం చేశారు. తమను కక్షపూరితంగా, క్లిష్టమైన విభాగాలకు బదిలీ చేశారని మరికొందరు తాత్సారం చేశారు. గతంలో ఈఓకు అటెండర్గా పని చేసిన ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఎంపీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ద్వారా పైరవీ చేయించుకోగా, ఈఓ తప్పనిసరి పరిస్థితుల్లో లడ్డూ విభాగం నుంచి విధులను మరో చోటికి మార్చటం గమనార్హం. ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగినికి ప్రొటోకాల్తో పాటు మరో కొన్ని పనులను అప్పగించారు. కానీ ఆమె విముఖత చూపుతూ అనారోగ్యమంటూ సెలవు పెట్టారు. ఇలా కొందరు విధుల్లో చేరకపోవడంతో వీరి స్థానాల్లో వెళ్లాల్సిన వారు అలాగే ఆగిపోయారు. గతంలో చక్రం తిప్పినవారే మళ్లీ.. రమాదేవి ఈఓగా బాధ్యతలు స్వీకరించక ముందు దేవస్థానంలో చక్రం తిప్పినవారు తిరిగి యథా స్థానాలకు రావడంతో వర్గ పోరుకు బీజం పడింది. ఆలయంలో సస్పెన్షన్కు గురై మళ్లీ విధుల్లో చేరిన ఓ కీలక అధికారి, పలు కాంట్రాక్ట్లు చేపట్టిన ఓ వ్యక్తి, కన్సాలిటెడ్గా పని చేస్తున్న మరో ఉద్యోగి తిరిగి ఆలయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఓ వర్గం వాదిస్తోంది. అందుకు తగినట్లుగానే అంతర్గత బదిలీలను చేపట్టారని, అవి అసంబద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తోంది. సీనియారిటీ ఆధారంగా కాకుండా బదిలీలు కేవలం కక్షపూరితంగా చేపట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అంతర్గత బదిలీలు సాధారణమేనని, ఇందులో ఎటువంటి వ్యక్తిగత కక్షలు ఉండవని మరోవర్గం పేర్కొంటోంది. రచ్చకెక్కుతున్న వర్గపోరు డిసెంబర్ చివరిలో ముక్కోటి మహోత్సవం జరగనుంది. ఆలయ మాస్టర్ప్లాన్పై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇటువంటి కీలక తరుణంలో వర్గపోరు భక్తులను కలవరపెడుతోంది. రెవెన్యూ శాఖ నుంచి దేవస్థానం ఈఓగా వచ్చిన దామోదర్రావుకు ఉద్యోగులు, సిబ్బందిని గాడిన పెట్టడం సవాల్గా మారింది. దీనికితోడు గత గురువారం ఆలయంలో ఓ కాంట్రాక్టర్ ఎస్టీఎఫ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం మరోవర్గం వాదనకు ఊతమిచ్చేలా ఉండటం ఆయనను మరింత కలవరపెట్టింది. ఈఓ ఉద్యోగుల మధ్య సమన్వయం సాధిస్తేనే భక్తుల వసతుల కల్పన, ఉత్సవాల విజయవంతం, ఆలయ ప్రతిష్టకు భంగం రానివ్వకుండా ఉండటం, ఆలయ మాస్టర్ ప్లాన్ వంటివి సాఫీగా ముందుకు సాగుతాయి. -
వైభవోపేతంగా గంగాహారతి
కాశీ తరహాలో ఇక్కడ ఏటా గంగాహారతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీకపౌర్ణమి రోజు జరిపే వేడుకలో శ్రీదేవి, భూదేవి సమేత బాలాజీ వేంకటేశ్వరుడు శేషవాహనంపై శివాలయానికి చేరుకుంటారు. దారి పొడవునా భక్తజనం దర్శించుకుంటుండగా, శివాలయ ప్రతినిధులు శ్రీనివాసునికి స్వాగతం పలుకుతారు. శివపార్వతులు ఎదురేగుతారు. ఇక్కడ దేవలతకు జ్వాలాతోరణంతో సాదర స్వాగతం పలుకుతారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ శివపార్వతులు, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ వేదికపైకి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయా దేవతల సాక్షిగా వేదమంత్రోచ్ఛరణ నడుమ గంగమ్మకు హారతి సమర్పిస్తారు. ఈ విశిష్ట ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తజనం పోటెత్తుతారు. -
ఆధ్యాత్మికశోభ
అన్నపురెడ్డిపల్లిలో చారిత్రక నేపథ్యం.. కాకతీయ సేనానిగా పనిచేసిన అన్నపురెడ్డి దట్టమైన అడవుల్లో శ్రీ వేంకటేశుడి ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఆలయం చుట్టూ జనావాసాలు ఏర్పడగా, అన్నపురెడ్డిపల్లి పేరుతో గ్రామం ఆవిర్భవించింది. 1970వ దశకంలో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రత్యేక చొరవతో నాలుగు ప్రాకారాలు, మండపం నిర్మించి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత శ్రీనివాసుడు కొలువైన గ్రామంలో శివాలయం కూడా నిర్మించాలని దేవాదాయ శాఖ అధికారులు భావించారు. శ్రీ వేంకటేశ్వర దేవస్థాన భూముల్లో పనులు మొదలుపెట్టారు. గర్భాలయం వరకు నిర్మించాక పనులు నిలిచిపోయాయి. ముప్పై ఏళ్లపాటు కేవలం గర్భాలయం మాత్రమే ఉండగా, చలువ పందిర్లు వేసి, శివకల్యాణం చేసే వారు. అటుపిమ్మట గ్రామానికి చెందిన విద్యావేత్త మారగాని శ్రీనివాసరావు ఆలయ నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. ఆరేళ్లపాటు శ్రమించి శివలింగాకారంలో, 108 శివలింగాలతో కోవెలను పూర్తి చేశారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శివపార్వతులు, నంది, భక్తకన్నప్ప, మార్కండేయులు, దక్షిణామూర్తి, భారీ వాయలింగం విగ్రహాలతో పాటు, కోనేరు నిర్మించారు. భక్తులకు వసతిగదులను కూడా ఏర్పాటు చేశారు. కనుల పండువగా కార్తీక మాసోత్సవాలు ఆలయంలో ప్రతీయేటా కార్తీక మాసోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలతో విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 22న విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఆకాశ దీపారాధనతో మాసోత్సవాలు ప్రారంభమాయ్య యి. శనివారం నాగులచవితి సందర్భంగా ఆలయ పరిసరాల్లో పుట్టల వద్ద మహిళలు పూజలు చేశారు. నవంబరు 30 వరకు విశేష పూజాధికాలు జరుపనున్నారు. నవంబర్ 1న ఏకాదశి అన్నాభిషేకం, 5న కార్తీకపౌర్ణమిని పురస్కరించుకొని కృత్తికా దీపోత్సవం, జ్వాల తోరణం, కోనేటి హారతి, గంగాహారతిని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 8న లక్ష బిల్వార్చన, 14న సామూహిక కుంకుమార్చనలు, 17న సందీశ్వరుని అభిషేకం, 18న శివపార్వతుల కల్యాణ మహోత్సవ వేడుక, 20న మాసోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారీగా భక్తులు హాజరుకానుండగా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ మేనేజర్ పీవీ రమణ తెలిపారు.ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నపురెడ్డిపల్లి భ్రమరాంబ సమేత మల్లికార్జున (మృత్యుంజయ) స్వామివారి ఆలయం ఆధ్యాత్మికశోభ సంతరించుకుంటోంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో నెలరోజులపాటు ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది. పరమశివునికి ప్రీతిపాత్రమైన మాసంలో వేకువ జామునే మహిళలు కార్తీక దీపాలు వెలిగించనుండగా, సోమ, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణం రద్దీగా మారనుంది. – ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి)కార్తీకమాసం కావడంతో నిత్యం పూజాధికాలు, అభిషేకాలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. వేడుకలపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాం. భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీగా ఏర్పాట్లు చేశాం. – మల్లెల నర్సింహారావు, ఆలయ చైర్మన్ -
వెండితెరపై గుమ్మడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సాధారణ జీవితం గడిపే గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకునేందుకు జెన్ జెడ్ తరం కూడా ఆసక్తి చూపిస్తోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కనుంది. కన్నడ స్టార్హీరో శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే తన జీవితంలో ఆచరించిన ఆదర్శాలను ఈ తరానికి మరింత స్పష్టంగా పరిచయం చేయబోతున్న దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రం గురించి చెప్పిన విశేషాలు. మూడేళ్ల పాటు రీసెర్చ్ మాది కామారెడ్డి. సినిమా రంగంలో పదేళ్లుగా ఉన్నాను. చిన్నప్పుడే కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యల జీవిత చరిత్ర చదివాను. ఆ తర్వాత అలాంటి ఆదర్శాలతో జీవించే రియల్టైం పొలిటీషియన్ కోసం ఆరా తీసే క్రమంలో ఇల్లెందు వచ్చి గుమ్మడి నర్సయ్యను కలిశాను. 2019 నుంచి మూడేళ్లపాటు ఆయనతో ట్రావెల్ చేసిన వారు, ఆయన చేతిలో ఓడిపోయిన వారు ఇలా అనేక మందిని కలిసి పూర్తి స్థాయిలో సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాను. ఐదు సార్లు ఒకే చోటనుంచి ఎన్నిక కావడమనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ ఉంటేనే ఇలా జరుగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను తెరపై జరిగే సన్నివేశాలతో లీనమయ్యే చేయగలిగితే సినిమా హిట్టే. గుమ్మడి జీవిత చరిత్రలో ఐదు గంటల పాటు కూర్చోబెట్టగలిగేంత విషయం ఉంది. రెండేళ్లపాటు గుమ్మడి జీవిత కథతో సినిమా తీసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు. చివరకు పాల్వంచకు చెందిన ఎన్.సురేశ్రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కేవలం 20 రోజుల్లో.. ఏడాదిన్నర క్రితం స్క్రిప్టును కన్నడ స్టార్హీరో డాక్టర్ శివరాజ్కుమార్కు పంపించాను. బెంగళూరు రావాలని సెప్టెంబరులో ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటి నుంచి కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్లో పాల్గొనడంతో టీజర్ రిలీజ్ చేశాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నాం. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారు. రియల్ హీరో గుమ్మడి నర్సయ్య రీల్ హీరో శివరాజ్కుమార్లు ఇంకా నేరుగా కలుసుకోలేదు. కేవలం ఫోన్లోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు. షూటింగ్కు ముందు ఒకసారి ఇద్దరు కలిసే అవకాశముంది. గుమ్మడి నర్సయ్య ట్రైలర్ రిలీజైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గుమ్మడి గౌరవం పెంచేలా భావి తరాలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోంది. -
ముంచిన ‘ఆయిల్పామ్’
అశ్వారావుపేట: కాతలేని ఆయిల్పామ్ చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలోని చింతల చెరువు సమీపంలో నలుగురు రైతులకు చెందిన 20 ఎకరాల తోటలను ఆయిల్ఫెడ్ అధికారులు తవ్వేస్తున్నారు. ఐదేళ్లపాటు పెంచినా చెట్లు కాతకురాలేదు. ఎకరానికి సుమారు రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు నిరాశ చెందుతున్నారు. ఆయిల్ఫెడ్ యాజమాన్యం మొక్కలను తొలగించేందుకు జేసీబీలను మాత్రమే పంపింది. ఆ తర్వాత కొమ్మలు, బోదెలను రైతులే తొలగించుకోవాలని సూచించడంతో ఎకరాకు కనీసం రూ.20వేలకు పైగా అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆదాయం వస్తుందని ఆయిల్పామ్ సాగు చేపట్టిన గిరిజన కుటుంబాలు సంశయంలో పడ్డాయి. రానున్న రోజుల్లోనైనా నాణ్యమైన మొక్కలు ఇవ్వాలని కోరుతున్నాయి. రైతులు నష్టపోయినా.. పరిహారం ఊసేలేదు 2015 నుంచి మొదలైన ఈ వ్యవహారం బయటపడేందుకు దశాబ్దం పట్టింది. ఈ సమస్యపై ఓ రైతు సంఘం ఢిల్లీ దాకా పోరు సల్పడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిహారం చెల్లించాలని నష్టపోయిన రైతులు డిమాండ్ చేస్తున్నా ఆయిల్ఫెడ్ యాజమాన్యం, ప్రజాప్రతినిధులు స్పందించడంలేదు. ఈ విషయమై ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట డివిజన్ అధికారి నాయుడు రామకృష్ణను వివరణ కోరగా.. ప్రభుత్వ ఆదేశాలతో 55 మంది రైతులకు 7,574 మొక్కలను తిరిగి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని తెలిపారు. ఆయిల్ఫెడ్ మొక్కలపై నమ్మకం లేదు ములకలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన తాండ్ర దిలీప్కుమార్, సుభద్ర దంపతులు ఆరేళ్ల క్రితం 19 ఎకరాల్లో టీఎస్ ఆయిల్ఫెడ్ ఇచ్చిన మొక్కలతో సాగు మొదలుపెట్టారు. ఎకరానికి 54 మొక్కలను నాటారు. ఐదేళ్లు దాటినా కాపు రాకపోవడంతో గత జూన్లో 300 మొక్కలను తొలగించారు. ఇంకా మిగిలిన మొక్కల పరిస్థితీ అలాగే ఉంది. దీంతో భారీగా నష్టపోయారు. ఆయిల్ఫెడ్ అధికారులు కొత్తగా మొక్కలను ఇస్తామని చెబుతున్నా మళ్లీ సాగు చేసేందుకు సాహసించడంలేదు. ఐదేళ్లు పెంచినా కాతరాని పామాయిల్ చెట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్పామ్ విస్తరణను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో పదేళ్లుగా ఆయిల్పామ్ విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుత వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మొదటి నుంచీ పామాయిల్ తోటల సాగుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తోటల పెంపకానికి ఆసక్తి చూపారు. ఆయిల్పామ్ సాగు చేసే ఆదాయం పెరిగి కష్టాలు పోతాయని భావించారు. అయితే సాగునీటి లభ్యత లేకున్నా రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతాల రైతులకు అశ్వారావుపేట(నారంవారిగూడెం) నర్సరీ నుంచి భారీగా మొక్కలు తరలి వెళ్లేవి. స్థానిక సన్న, చిన్నకారు రైతులకు మొక్కలు అందేవి కావు. అధికారులు ఇదే అదనుగా పనికిరాని మొక్కలను సైతం రైతులకు అంటగట్టారు. తోటల్లో రాలిన గింజల నుంచి వచ్చే మొక్కలను సైతం రైతులకు పంపిణీ చేశారనే ఆరోపణలున్నాయి. -
అటవీశాఖకు ప్రభుత్వ భూమి అప్పగింత
జూలూరుపాడు: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని అటవీశాఖ అధికారులకు శనివారం అప్పగించారు. పాపకొల్లు నుంచి వయా రాజారావుపేట మీదుగా ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామాన్ని కలుపుతూ పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో బీటీ రోడ్డును నిర్మిస్తున్నారు. రాజారావుపేట, కేసుపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతం ఉంది. బీటీ రోడ్డు నిర్మాణంతో అటవీశాఖ భూమి ఐదెకరాల భూమి కోల్పోయింది. దీంతో అటవీ భూమికి బదులుగా జూలూరుపాడు రెవెన్యూ పరిధిలోని 250 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎఫ్డీఓ యు కోటేశ్వరరావు, ఇతర అధికారులు జి ప్రసాద్రావు, సీహెచ్ ఆదినారాయణ, ప్రవీణ్, శ్రీనివాసరావు, హనుమంతు, నరసింహారావు పాల్గొన్నారు. -
తడిసి మొలకెత్తిన మక్కలు
ఇల్లెందురూరల్: మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్నలు తడిసి మొలకెత్తాయి. దీంతో రైతులు ఆవేదన చెందారు. మండలంలో సుమారు 25వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, 70 శాతం మేర విస్తీర్ణంలో కంకులను విరిచారు. యంత్రాల సహాయంతో కంకుల నుంచి గింజలను వేరుచేసి తేమశాతం కోసం కల్లాల్లో ఆరబెట్టారు. కొమరారం, మస్సివాగు, మాణిక్యారం, పోలారం గ్రామాల్లో ఆరబెట్టిన మక్కలు వానకు తడిసిపోయాయి. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ పట్టాలను కప్పినా కాపాడుకోలేకపోయారు. వర్షం అధికంగా కురవడంతో గింజలు తడిసి మొలకెత్తాయి. రైతులు శనివారం మొలకెత్తిన గింజలను చూసి ఆవేదనకు గురయ్యారు. తడిసిన మొక్కజొన్న లను మళ్లీ ఆరబెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యమే శాపంగా మారింది. మార్క్ఫెడ్ నిర్ణయించినట్లు చల్లసముద్రం, కొమరారం, వ్యవసాయ మార్కెట్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. తీరని నష్టంతో రైతు కంట కన్నీరు -
పకడ్బందీగా ఎస్ఐఆర్ జాబితా
సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలంటౌన్: ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో నుంచి కలెక్టర్తోపాటు ఐటీడీఏ పీఓ, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా కేటగిరీ ’ఏ’ ని బీఎల్ఓ యాప్ ద్వారా ఽధ్రువీకరిస్తామని, కేటగిరీ సీ, డీ లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈఆర్ఓ కార్యాలయంలో ఇద్దరు బూత్స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి వచ్చే శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
కిన్నెరసాని జలాశయానికి వరద
పాల్వంచరూరల్: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1,600 క్యూ సెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో శనివారం నీటిమట్టం 406.60 అడుగులకు పెరిగింది. ప్రాజెక్టుకు చెందిన ఒక గేటు ఎత్తి ఉంచి 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు తెలిపారు. రేక్ పాయింట్కు 2,518 టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు కోరమాండల్ కంపెనీకి చెందిన 2,518 టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,158 టన్నులు, భద్రాద్రి జిల్లాకు 830 టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 టన్నులు కేటాయించినట్లు రేక్ పాయింట్ ఇన్చార్జ్ పవన్కుమార్ తెలిపారు. మిగతా యూరియా బఫర్ స్టాక్గా నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు సంఘం కృషితోనే బదిలీలుకొత్తగూడెంఅర్బన్: గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) కృషితో బదిలీలకు మోక్షం కలిగిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ఫర్ పాలసీ మార్చాలని పలుమార్లు కోరగా యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. వ్యక్తిగత, మ్యూచ్వల్, స్పౌస్, హెల్త్ గ్రౌండ్ ప్రాతిపదికన శనివారం 114 మందికి బదిలీ ఉత్తర్వులు ఇప్పించినట్లు తెలిపారు. పోలీసుల విస్తృత తనిఖీలుభద్రాచలంఅర్బన్: పట్టణంలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లోని క్యాంటీన్, కార్గో, ఆర్టీసీ బస్సుల్లో తరలించే పార్సిళ్లను, ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఐలు సతీష్, శ్యామ్ ప్రసాద్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక వాహనాల అడ్డగింత ట్రాక్టర్ డ్రైవర్లు, గ్రామస్తుల పరస్పర దాడి టేకులపల్లి: మండలంలోని గంగారం పంచాయతీ సంపత్నగర్ వద్ద ఉన్న పాలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధిక లోడ్తో ట్రాక్టర్లు తిరుగుతుండగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. దీంతో స్థాని కులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఈ క్రమంలో గ్రామస్తులు శనివారం పాలవాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు , ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణ అనంతరం ఇసుకను వాగులో డంప్ చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు బోడు పోలీసుస్టేషన్కు వెళ్లాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘర్షణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇసుక సొసైటీల ఘర్షణమణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని అనంతారం, చినరాయిగూడెం, కోడిముత్తయ్యగుంపు ఇసుక సొసైటీ సభ్యుల మధ్య శనివారం ఘర్షణ నెలకొంది. మూడు ర్యాంపుల సొసైటీ సభ్యులు ఘర్షణ పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సీఐ నాగబాబు, ఎస్ఐ నగేష్లు వచ్చి సభ్యులకు నచ్చజెప్పి పంపించివేశారు. కాగా ఒక సొసైటీకి సంబంధించిన శివారు దారిలో మరో సొసైటీ వారు ఇసుకను తరలించేందుకు లారీలకు అనువుగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో అనంతారం సొసైటీ సభ్యులు రోడ్డు వేయొద్దంటూ అడ్డుకోవడంతో వివాదం తలెత్తినట్లు తెలిసింది. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారిదేవస్థానంలోని మూలమూర్తులకు ఆది వారం అభిషేకం, సువర్ణపుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరంనిత్యకల్యా ణానికి బేడామండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఉపాధ్యాయులపై పీఓ ఆగ్రహందుమ్ముగూడెం: ఉద్దీపకం టు వర్క్ బుక్ నిర్వహణ సక్రమంగాలేకపోవడంతో ఉపాధ్యాయులపై భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలు పదాలు తప్పులు లేకుండా సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం మండలంలోని పెద్దనల్లబల్లి, గడ్డోరు గట్ట గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలో తనిఖీచేశారు. పిల్లల సామర్థ్యాలను పరీక్షించి, రా యడం, చదవడంలో వెనుకబడిఉన్నారని గ్రహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులు కనీసం తెలుగు, ఇంగ్లిష్లో తమపేర్లు రాసుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఎస్సీఆర్పీల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని అన్నారు. టీచర్లు ఇకనైనా దృష్టిపెట్టాలని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మణుగూరు టౌన్: కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బీటీపీఎస్ విశ్రాంత ఉద్యోగి సందుపట్ల కృష్ణారెడ్డి(60) సమితిసింగారంలో నివసిస్తున్నాడు. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసి పాల్వంచ నుంచి మణుగూరు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో తోగ్గూడెం ఆలయ సమీపంలో అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొంది. దీంతో కృష్ణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 100 పడకల ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య సబిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు సందర్శించి సంతాపం తెలిపారు. సూపరింటెండెంట్ సునీల్ తదితరులు ఉన్నారు. -
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
గుండాల: రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్కు పట్టం కట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆళ్లపల్లి మండలంలో శనివారం ఆయన పర్యటించారు. రామాంజిగూడెం, పాతూరు రాయిలంక గ్రామాల నుంచి 80 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అమలుకాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మాజీ జెడ్పీటీసీ కొమరం హనుమంతు, పాయం నర్సింహరావు, ఎస్కె, బాబా, కిషోర్ బాబు, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో క్రీడా సంబరాలు
పినపాక: క్రీడా సంబరాలకు ఏడూళ్ల బయ్యారం జెడ్పీఎస్ఎస్ హైస్కూల్ వేదిక కానుంది. నవంబర్ 8, 9, 10 మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బాలబాలికల విభాగాల్లో పది ఉమ్మడి జిల్లాల వారీగా జట్లు పోటీలకు హాజరుకానున్నాయి. ప్రతిభ చూపి న బాలబాలికలను జనవరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. క్రీడా పోటీల నిర్వహణకు దాతల సహకారం తీసుకుంటుంటున్నారు. కంది చారిటబుల్ ట్రస్ట్ పోటీలకు తోడ్పాటునందించనుంది. దాతలు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. బాలురు జెడ్పీహెచ్ఎస్, బాలికలు బయ్యారం గ్రామంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో బస చేయనున్నారు. పోటీల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ను శుభ్రం చేస్తున్నారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సహాయ సహకారాలు అందించా లని కోరారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీ నివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీ హరి, సీతక్క హాజరుకానున్నట్లు అధికారులు తెలి పారు. పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 8నుంచి నిర్వహణ చదువుకున్న స్కూల్కు, సొంతూరికి మంచి చేయాలనే సంకల్పంతో నా వంతు సహకారం అందిస్తున్నాను. రాష్ట్రస్థాయి పోటీలు నేను చదువుకున్న బయ్యారం పాఠశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. – కంది విశ్వభారత్రెడ్డి, ఎన్నారై, కంది చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ -
మేం కోవర్టులం కాదు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కోవర్టులుగా తమను చిత్రీకరిస్తున్న వారు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న విజ్ఞప్తి చేశారు. తమలో విప్లవ తత్వం ఇంకా చనిపోలేదని, ప్రజాపోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు తనతో పాటు లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడిన వీడియోను ఆయన శనివారం విడుదల చేశారు. అందులో ఆశన్న పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘కేంద్ర కమిటీ స్థాయి నాయకులు లొంగిపోతే విప్లవ ద్రోహులుగా పేర్కొనడం చాన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. మాపై కూడా అలాంటి నిందలు వస్తాయని ముందే ఊహించాం. కానీ, ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన భారీ నష్టాలకు మేమే కారణమని, మేం కోవర్టులుగా వ్యవహరించామంటూ ఆరోపణలు రావడంతో వివరణ ఇస్తున్నా. నాకు ఏ స్వార్థం లేదు. భయం కూడా లేదు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ మాలో విప్లవ తత్వం చచ్చిపోలేదు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. అయితే, కార్యాచరణ ప్రకటించేంత అనువైన పరిస్థితులు లేనందున.. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం ముఖ్యం. హైదరాబాద్లో కూర్చుని ప్రకటనలా? ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్లో కూర్చుని మాపై ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారు. మేము సైద్ధాంతికంగా మీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో నిలబడి మాట్లాడుతున్నాం. మేము పోరాడుతున్న గడ్డ (దండకారణ్యం)కు వచ్చి నిజాలు తెలుసుకుని మాట్లాడండి. అప్పుడే మేము ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నామో తెలుస్తుంది. అక్కడ (హైదరాబాద్) ఉండి సాయుధ పోరాటం చేయాల్సిందే అని చెబుతున్నారు. చేస్తే ఏమవుతుంది? మా శవాలు తెలంగాణకు వస్తే వాటిపై ఎర్రగుడ్డలు కప్పి ర్యాలీలు తీసి మమ్మల్ని హీరోలను చేస్తారు. కానీ ఇక్కడి(ఛత్తీస్గఢ్ మావోయిస్టులు) వారి సంగతేంటి? ప్రాణత్యాగం వృధా సమీప భవిష్యత్లో మన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే తెగించి పోరాటం చేయడంలో తప్పులేదు. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రాణత్యాగం చేయడం వృధా. విజ్ఞతతో ఆలోచన చేయండి. అనుకూలమైన పరిస్థితుల్లో ఉండి పరిధి దాటి మాట్లాడం పౌరహక్కుల సంఘం నేతలకు సరికాదు. మేము లొంగిపోయినా గుండెకోట్ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు సాయుధ పోరాటం చేయగలరని పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ అంటున్నారు. కానీ, ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారు కూడా ఇప్పుడు ఇక్కడ నా వెంటే ఉన్నారు. నేనో, సోనూనో చెబితే వచ్చేంత అమాయకులు కారు వారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియకుండా వాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ దాదా ఉద్దేశం అది కాదు.. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్లో మావోయిస్టులపై ప్రభుత్వం దాడి భీకరంగా ఉంటుందనే అంచనా ఉంది. అందుకే మార్చి 28న శాంతిచర్చల కోసం కేంద్ర కమిటీ తరఫున మన పార్టీ నాటి జనరల్ సెక్రటరీ బీఆర్ దాదా (నంబాల కేశవరావు) అనుమతితో లేఖ రాశాం. ఆ తర్వాత ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేను లేఖలు, ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నేనేమైనా తొందరపడ్డానా అని తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా బీఆర్ దాదాతో చర్చించాను. ఈ సందర్భంగా ‘మనం తప్పు చేయలేదు. సరైన దిశలోనే ఉన్నాం. కేంద్ర కమిటీ అంతా కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సింది. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’అని కూడా అన్నారు. దీనికి సంబంధించి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ అంశంపై చివరిసారి మే 18న బీర్ దాదా నుంచి నాకు లేఖ వచ్చింది. ఈ లేఖ పంపిన రెండు గంటల తర్వాతే ‘గుండెకోట్ ఆపరేషన్’మొదలైంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది శాంతిచర్చల విషయంలో దండకారణ్యంలో అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీ సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఇందులో దక్షిణ బస్తర్లో ఉన్న కామ్రేడ్లకు సమాచారం అందకముందే శాంతి చర్చల ప్రకటన వచ్చినట్టుంది. ఇక్కడ మా మాధ్య గ్యాప్ ఏర్పడింది. శాంతిచర్చల ప్రకటన మా నుంచి వచ్చినా ప్రభుత్వం నుంచి దాడులు ఆగలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మనం ఆయుధం పట్టవచ్చు అంటూ మే 13న బీఆర్ దాదా మరో లేఖ పంపారు. ప్రస్తుతం ఈ లేఖను చూపించి బీఆర్ దాదా సాయుధ పోరాటానికి అనుకూలమనే వాదనను తెర మీదకు తెస్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టుకోమనే బీఆర్ దాదా చెప్పారు తప్పితే అప్పటి వరకు శాంతి చర్చలు, కాల్పుల విరమణ, సాయుధ పోరాటంపై వంటి అంశాల్లో తన అభిప్రాయం మార్చుకున్నట్టు కాదు. ‘సాయుధ పోరాటం’విషయంపై నాతో పాటు మరో పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్జీ (తిప్పిరి తిరుపతి)కి కూడా బీఆర్ దాదా లేఖ రాశారు. అందులో విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మల్లోజులతో టచ్లో లేను సోను (మల్లోజుల వేణుగోపాల్)తో నేను టచ్లో లేను. ఆగస్టుతో పాటు అక్టోబర్ 7వ తేదీన కేవలం రెండు సార్లే ఆయనను కలిశాను. సాయుధ పోరాటం చేయాలనే ఎస్జెడ్సీ సభ్యుడి సమక్షంలోనే బహిరంగంగా ప్రజాస్వామ్యబద్దంగా నేను, సోను చర్చ జరిపాం. అందరి అభిప్రాయాల కోసం సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూశాం. ఆ తర్వాత సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సాధ్యమైనంత వరకు పార్టీ పద్దతులు పాటించేందుకు ప్రయత్నించాం అని వివరించారు. -
ఆశావహులకు ఊరట!
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు అనర్హులు అనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలువురు ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న అభ్యర్థులు మాత్రమే పోటీకి అర్హులని నిబంధన ఉండటంతో చాలా మంది స్థానిక ఎన్నికల బరిలో నిలబడే అవకాశం కోల్పోయారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేద్దామనే యోచన ఉన్నా ముగ్గురు పిల్లలు ఉండటంతో ఎన్ని కలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదంతెలపడంతో ఆశావహులకు ఊరట కలగనుంది. దీనిపై ప్రభుత్వం చట్ట సవరణ వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే కొత్త విధానం అమల్లోకి రానుంది. 1995 నుంచి ఇద్దరు పిల్లల నిబంధన రాష్ట్రంలో జనాభా నియంత్రణతోపాటు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు పిల్లలు మాత్రమే అనే నిబంధనను తీసుకొచ్చింది. 1995 మే 31 కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. కానీ 1995 జూన్ 1 నుంచి ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు పోటీకి అనర్హులు. అప్పటినుంచి 30 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులకు ముగ్గురు పిల్లల నిబంధనలు కొంత అవరోధంగా నిలిచాయి. తెలంగాణ వచ్చాక తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం కూడా స్థానిక బరిలో నిలిచే అభ్యర్థులు ముగ్గురు పిలల్లను కలిగి ఉంటే అనర్హులు అవుతారంటూ పాత నిబంధనలే అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు ఉన్న ముగ్గురు పిల్లలు నిబంధనలను తొలగించేందుకు ముందుకురావడం శుభపరిణామం. ఈ నిబంధనలు 30 ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. దీని వల్ల చాలా మంది ఆశావహులు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా పోతోంది. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి కొంత అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయనుండటంతో ఆశావహులకు ఊరట కలుగుతుంది. – బోడా శారద, మాజీ ఎంపీటీసీ, త్రీ ఇంక్లైన్ఈ నిబంధనను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తొలగించారు. దీంతో తెలంగాణలో కూడా ఎత్తివేయాలంటూ పలు వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. వినతులు, డిమాండ్లతో పాటు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు, కుటుంబ నియంత్రణపై ప్రజల్లో పెరిగిన అవగాహనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం మంత్రి మండలి ఆమోదించింది. ఇక ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల చట్ట సవరణకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా బీసీ రిజర్వేషన్ల కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కోర్టు పరిధిలో ఉన్న బీసీ రిజర్వేషన్ల జీఓ, బిల్లు విషయం తేలేలోపే ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.విడత పంచాయతీలు వార్డులు బరిలోఉన్న వారు మొదటి 174 1,534 3,265 రెండో 142 1,294 2,708 మూడో 163 1,404 3,635స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో మార్పు -
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బాల భీముడి జననం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఓ మహిళ 5 కిలోల బాలుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మణుగూరు పట్టణ పరిధిలోని విప్పల సింగారం ప్రాంతానికి చెందిన జోగునూరి బాబు భార్య రాణికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మణుగూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. రాణిని పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో 2.05 నిమిషాలకు ఆపరేషన్ చేయగా ఐదు కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. కాగా జోగునూరి బాబు, రాణి దంపతులకు 2018లో ఒక బాబు (3.75 కేజీల బరువు) జన్మించాడు. ఐదు కిలోల బాలుడు.. తల్లీ బిడ్డ క్షేమం -
‘డైలీవేజ్’ సమ్మె విరమణ
ఇల్లెందు: డైలీవేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఆందోళన విరమించారు. తగ్గించిన వేతనం కోసం 42 రోజులపాటు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఐటీడీఏ పీఓ, కలెక్టరేట్లను ముట్టడించారు. గురువారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్లోని తన చాంబర్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘాల ప్రతినిధులు, సీఐటీయూ నేతలతో సమావేశమై చర్చించారు. పాత జీతం యథావిధిగా కొనసాగించేలా చూస్తామని, 3 నెలల లోపు సమస్యలను శాశ్వతంగా పరిష్కంచేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని, దీంతో సమ్మె విరమించినట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి తెలిపారు. గత నెల 12 నుంచి దీక్షలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కార్మికులు గత నెల 12 నుంచి రిలే దీక్షలు చేపట్టారు. డైలీవేజ్ వర్కర్లకు వేతనం రూ.26 వేలు ఉండగా, జీఓ 64 తీసుకుని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11,700 చెల్లిస్తామని ప్రకటించింది. ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం రూ.15,600 ఉండగా రూ. 9,200 చెల్లిస్తామని పేర్కొంది. దీంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. జిల్లాలో 413 మంది డైలీవేజ్ వర్కర్లు, 88 మంది ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఉన్నారు. వీరంతా ఆందోళన చేపట్టగా, మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. -
వర్కర్కు వేతనం చెల్లింపు
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల ప్రాథమిక పాఠశాల స్కావెంజర్ ప్రమీలకు ఆరు నెలల వేతనం రూ.36 వేలు గురువారం అందింది. ‘వర్కర్ నిధులు పక్కదారి’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎంఈఓ ఉమాశంకర్, క్లస్టర్ హెచ్ఎం లాలు పాఠశాలను సందర్శించారు. వేతనం చెల్లించకపోవడంపై ప్రధానోపాధ్యాయుడు సురేందర్ నుంచి వివరణ తీసుకుని బకాయి వేతనం ఇప్పించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఎంఈఓ తెలిపారు. 15 ఎకరాల్లో ‘ఆయిల్పామ్’ తొలగింపుఅశ్వారావుపేట: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన రైతులు ఆర్ల కృష్ణ, తోట పిచ్చయ్యలకు చెందిన 15 ఎకరాల ఆయిల్పామ్ తోటలను గురువారం తొలగించారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కల్లో కల్తీ మొక్కలు ఎక్కువగా ఉండి దిగుబడి రాకపోవడంతో మొక్కలను రైతులు తొలగించారు. ఎకరాకు ఏటా రూ.లక్ష మేర పెట్టుబడి పెట్టిన రైతులు నిండా మునిగిపోయారు. తిరిగి ఆయిల్పామ్ మొక్కలు పెడితే కాస్తాయనే నమ్మకం అధికారులు కలిగించాలని రైతులుకోరుతున్నారు. పటిష్ట ఏర్పాట్లు చేయాలిపినపాక: మండలంలోని ఈ బయ్యారం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించే అండర్–17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు అధికారులు ఆదేశించారు. గురువారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు సుధీర్ కుమార్, సునీల్ కుమార్, వెంకటేశ్వరరావు, నాగయ్య పాల్గొన్నారు. ఏజెన్సీలో పోలీసుల అప్రమత్తందుమ్ముగూడెం : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ మావోయిస్టులు శుక్రవారం భారత్బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం పెద్దబండిరేవు క్రాస్ రోడ్డు, పెద్దనల్లబల్లి ప్రధాన రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీల చేపట్టారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చే వాహనాలను, ప్రజలను క్షుణంగా తనిఖీ చేశారు. సరిహద్దు గ్రామాల్లో గాలింపు చేపట్టారు. సీఐ వెంకటప్పయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల నిలిపివేత భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే బస్సులు నడుపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో చర్ల, కుంట, చింతూరు ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. రామాలయంలో హల్చల్ఈఓకు ఫిర్యాదు.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బందికి – ఓ వ్యక్తికి నడుమ గురువారం వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో దేవస్థానంలో కాంట్రాక్టర్గా పని చేసిన ఓ వ్యక్తి మధ్యాహ్నం దర్శనాలు నిలిపివేసే సమయంలో కొందరిని దర్శనానికి తీసుకురాగా, అక్కడ విధులు నిర్వర్తించే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి ‘నేనెవరో తెలియదా’ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. మాటామాట పెరగడంతో హెడ్ కానిస్టేబుల్ వచ్చి నివారించే ప్రయత్నం చేయగా, ఆయనతోనూ ఇలాగే వ్యవహరించాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఈ ఉదంతంపై ఆలయ ఈఓ దామోదర్రావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఈఓను వివరణ కోరగా.. విచారణ చేపడతామని తెలిపారు. -
పెద్దమ్మతల్లి వైన్స్కు రూ.3.06 కోట్లు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయం వద్ద నిర్వహించే మద్యం దుకాణ లైసెన్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ మంది ఈ షాపు కోసం దరఖాస్తులు చేశారు. పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద వైన్స్ను ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. దీనికి ఈ నెల 18వ తేదీ వరకు 100 టెండర్లు రాగా, తర్వాత గడువు పొడిగించడంతో మరో రెండు టెండర్లు పడ్డాయి. దీంతో ఎకై ్సజ్ శాఖకు రూ.3.06 కోట్ల ఆదాయం లభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 207 మద్య దుకాణాలు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 88 షాపులు, ఖమ్మం జిల్లాలో 119 మద్య దుకాణాలు ఉన్నాయి. వీటిన్నింటికి నూతన లైసెన్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టగా, పెద్దమ్మగుడి వద్ద దుకాణానికి మాత్రమే అత్యధికంగా 102 టెండర్లు దాఖలు చేశారు. 2023లో రూ.2.48 కోట్లు 2023లో నిర్వహించిన టెండర్లలో 124 దరఖాస్తులు రాగా రూ.2.48 కోట్ల ఆదాయం లభించింది. గతంలో కంటే ఈసారి 22 టెండర్ల సంఖ్య తక్కువైనా ఆదాయం పెరిగింది. గతం కంటే రూ.58 లక్షలు ఎక్కువగా వచ్చింది. గతంలో లైసెన్స్ ధర దరఖాస్తుకు రూ. 2 లక్షలు ఉంటే ఈసారి రూ. 3 లక్షలకు పెంచిన విషయం విదితమే. పాల్వంచ పట్టణంలో మొత్తం 8 వైన్ షాపులు ఉండగా 213 టెండర్లు వచ్చాయి. తద్వారా రూ.6.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 102 దరఖాస్తులు పాల్వంచ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 13 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి తొలుత 525 టెండర్లు వచ్చాయి. గడువు పొడిగించాక మరో 15 టెండర్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దమ్మగుడి వద్ద షాపునకే మొత్తం 102 టెండర్లు లభించాయి. –ప్రసాద్, ఎకై ్సజ్ సీఐ -
త్రుటిలో తప్పిన ప్రమాదం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జిలో మరో మారు యాష్ ట్యాంకర్ బోల్తాపడింది. గురువారం తెల్లవారుజామున ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ నుంచి ఖమ్మం వైపు యాష్ ట్యాంకర్ వెళ్తోంది. అదే సమయంలో ట్రాలీ ఆటో సిమెంట్ మిక్సింగ్ మిషన్, జనరేటర్ను తీసుకుని వెళ్తోంది. ఈ క్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జిలోకి రాగానే యాష్ ట్యాంకర్ ముందు ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఆ సమయంలో ట్రాలీలో ఐదుగురు కార్మికులున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. గతంలో కూడా యాష్ ట్యాంకర్ ద్విచక్ర వాహనంపై పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే మరో సారి ట్యాంకర్ ప్రమాదం జరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిలో యాష్ ట్యాంకర్ బోల్తా -
ఏఎన్ఎం కోర్సుతో ఉపాధి అవకాశాలు
ఖమ్మంఅర్బన్: ఏఎన్ఎం కోర్సు పూర్తిచేసిన యువతులకు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్ఓ బి.కళావతి బాయి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్డబ్ల్యూ (నర్సింగ్ కోర్సు) పూర్తి చేసిన విద్యార్థినులకు గురువారం క్యాపింగ్ ఉత్సవం నిర్వహించగా ఆమె మాట్లాడారు. నిరుపేద విద్యార్థినులకు మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ మాట్లాడుతూ రెండేళ్ల కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. డీసీహెచ్ఎన్ శేషు పద్మ మాట్లాడగా కోర్సు పూర్తి చేసిన వారికి పత్రాలు అందజేశారు. మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేతతో పాటు ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, విజయ్కుమార్, సుధీర్, సుకన్య, లాలయ్య, మౌనిక, దుర్గారావు, శాంతమ్మ పాల్గొన్నారు. -
తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
టేకులపల్లి: పత్తి పంటల్లో తెగుళ్ల నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్, సేద్య విభాగం శాస్త్రవేత్తలు కోరారు. గురువారం శాస్త్రవేత్తల బృందం మండలంలోని వెంకట్యాతండాలో క్షేత్ర సందర్శన జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశిస్తే ప్రోఫినోపాస్, దియోడికార్చ్, కాయకుళ్లు లక్షణాలు గమనిస్తే ప్లాంటమైసిన్, కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మిరపలో వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ల వద్ద పోయాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.శివ, డాక్టర్ ఎం.శరత్, వ్యవసాయశాఖ అధికారులు లాల్ చంద్, అన్నపూర్ణ, విశాలచౌహాన్ పాల్గొన్నారు. పశువులు పట్టివేతభద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఎటపాక నుంచి హైదరాబాద్కు ట్రాలీలో తరలిస్తున్న 11 పశువులను గురువారం బ్రిడ్జి సెంటర్లో ఉన్న చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. -
వర్షంతో దెబ్బతింటున్న పంటలు
● కోత దశలో నేలవాలుతున్న వరి ● తడిసి పాడవుతున్న పత్తి, మక్కలు బూర్గంపాడు/గుండాల: పంటచేతికి వచ్చే సమయంలో కూడా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కుదేలవుతున్నారు. వరి, పత్తి, మొక్కజన్న పంటలు దెబ్బతింటున్నాయి. మూడురోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షాలకు కోతకు వచ్చిన వరిపంట నేలవాలుతోంది. ఇప్పటికే వరికోతలు ప్రారంభించాల్సి ఉండగా, వానల కారణంగా ఆలస్యమవుతున్నాయి. అధిక వర్షాలు ఈ ఏడాది పత్తిపంటకు కూడా ప్రతికూలంగా మారాయి. పూసిన పత్తిని తీసుకునేందుకు వర్షాల కారణంగా వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. తొలివిడత పత్తితీతలు ప్రారంభమవుతున్న తరుణంలో తరచు వర్షాలు కురుస్తుండటంతో పత్తి తీసేందుకు ఇబ్బందికరంగా మారింది. దూది తడిసి నల్లబడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షంతో తడిసిన మొక్కజొన్న వర్షంతో ఆరబోసిన మొక్కజొన్నలు గురువారం కురిసిన వర్షానికి తడిసిపోయాయి. గుండాల మండలంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయగా, ఇప్పుడిప్పుడే రైతులు కోతలు మొదలు పెట్టారు. విరిసిన మొక్కజొన్న కంకులను కల్లాల్లో, మిల్లర్ పట్టిన మక్కలను రోడ్లపై ఆరబోశారు. బుధవారం నుంచి మబ్బులు కమ్ముతూ తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.టార్బాలిన్లు కప్పుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. -
ముగిసిన మద్యం టెండర్లు
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. మొదట ఈనెల 18తో గడువు ముగియగా.. దీపావళి, ఇతర సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు ఈనెల 22వ తేదీ వరకు 3,816 దరఖాస్తులు రాగా, చివరి రోజైన గురువారం 106 దరఖాస్తులు స్వీకరించామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మొత్తంగా 3,922 టెండర్లు దాఖలయ్యాయని, ఈనెల 27న కొత్తగూడెం క్లబ్ లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తామని వెల్లడించారు. 88 షాపులకు 3,922 దరఖాస్తులు -
సమీకృత వ్యవసాయమే భేష్
● తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్బూర్గంపాడు: వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను సమ్మిళతం చేసి రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను పాటించాలని, దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మోరంపల్లిబంజర గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ డెమో ఫామ్ షెడ్ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటలతో పాటు పశుపోషణ, కూరగాయలు, పూల మొక్కలు, పండ్లతోటల పెంపకం, కోళ్లు, కౌజు పిట్టలు, చేపలు, మేకల పెంపకం వంటి పనులు చేపట్టాలని సూచించారు. తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి మోడల్ ఫామ్షెడ్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఈసీ రాజు, అధికారులు వెంకయ్య, వెంకటలక్ష్మి, హేమంతిని, పంచాయతీ కార్యదర్శి భవాని పాల్గొన్నారు. వైద్య విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలి చుంచుపల్లి : వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనాన్ని పరిశీలించి, పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య విద్యార్థుల భవిష్యత్ దేశ ఆరోగ్య రక్షణకు పునాది అవుతుందని, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటలని, విద్యార్థుల్లో పర్యావరణ స్ఫూర్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు సులభంగా కళాశాలకు చేరుకునేలా బస్సు ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా త్వరలోనే అమలు చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజ్కుమార్, డాక్టర్ సురేష్ బాబు, వార్డెన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులకు ఇబ్బంది లేకుండా చూడాలి
జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతా లెనీనా అశ్వాపురం/మణుగూరురూరల్ : వృద్ధులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని, వారికి ఏ విధమైన ఇబ్బంది కలగనీయొద్దని జిల్లా సంక్షేమాధికారిణి స్వర్ణలతా లెనీనా అన్నారు. అశ్వాపురం, సీతారాంపురంలోని వృద్ధాశ్రమాలను గురువారం ఆమె సందర్శించారు. పడకగదులు, సామగ్రి, వంటగది, భోజనశాలలను పరిశీలించారు. ఆశ్రమాల నిర్వహణకు నిధులు ఎలా సమకూరుస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మానవీయ వృద్ధాశ్రమం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి రమేశ్బాబు, కమటం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దైదా నారాయణరెడ్డి, అరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. శ్రీసత్యసాయి పాఠశాలలో తనిఖీ.. మణుగూరు మండలం సంతోష్నగర్లో సింగరేణి సేవా సమితి సహకారంతో నిర్వహిస్తున్న శ్రీసత్యసాయి పాఠశాలను స్వర్ణలతా లెనీనా గురువారం తనిఖీ చేశారు. ప్రత్యేకావసరాలు గల పిల్లలకు కల్పిస్తున్న వసతి, విద్యాబోధన, క్రీడల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్పీచ్ థెరపీ ద్వారా విద్యాభోదన చేయడాన్ని చూసి నిర్వాహకులు, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి. శ్రీనివాసరావు, ఎంపీఓ పి.వెంకటేశ్వరరావు, పాఠశాల నిర్వాహకులు టి.నాగమణి, దుర్గా వరప్రసాద్, ఉపాధ్యాయురాలు రోజారమణి పాల్గొన్నారు. -
వేగమేదయా ?!
సీతారామా..సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు లక్ష్యం మేర సాగడం లేదు. భద్రాద్రి జిల్లాలో మూడు పంపుహౌస్లు, 104 కి.మీ. మేర ప్రధాన కాల్వ పూర్తయినా.. ఖమ్మం జిల్లాలో ప్రధాన కాల్వ, టన్నెళ్ల తవ్వకంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.19,324 కోట్లకు పెంచినప్పటికీ ఆ మేరకు నిధులు రావడం లేదు. జూలూరుపాడు వద్ద టన్నెల్ తవ్వకం ప్రారంభానికే నోచుకోకపోగా, తిరుమలాయపాలెం వద్ద టన్నెల్ సగంలో నిలిచిపోయింది. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణం నిదానంగా సాగుతోంది. ఇప్పటివరకు చేసిన పనులు, భూసేకరణకు సంబంధించి రూ.258.26 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండడంతో పనులు ఊపందుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో నత్తనడకన.. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండు జిల్లాల్లో పనులను 16 ప్యాకేజీలుగా విభజించారు. భద్రాద్రి జిల్లాలో ప్రధానకాల్వ నిర్మాణం, మూడు పంప్హౌస్ల పనులు పూర్తికాగా, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి టెండర్లు, భూసేకరణ సాగుతోంది. డిస్ట్రిబ్యూటరీలను భద్రాద్రి జిల్లాలో 1, 2, 7, 8, ఖమ్మం జిల్లాలో 3, 4, 5, 6 ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 6వ ప్యాకేజీ మినహా మిగతా వాటికి అనుమతులే రాలేదు. అలాగే, ప్రధాన కాల్వ పనులు పూర్తి కాలేదు. ఇక 13 నుంచి 16 ప్యాకేజీల్లో సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ పనులు పెండింగ్ ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 1,138.693 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో అనుమతులు రావాల్సి ఉంది. ప్రధాన కాల్వకు అడ్డంకులు ఖమ్మం జిల్లాలో 13 నుంచి 16 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వలు నిర్మించాలి. ఏన్కూరు నుంచి 75 కి.మీ. మేర ప్రధాన కాల్వ తవ్వితేనే గోదావరి జలాలు రిజర్వాయర్లోకి చేరతాయి. దీంతో ఎన్నెస్పీ ఆయకట్టును స్థిరీకరించినట్టవుతుంది. కానీ భూసేకరణ, నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అంతేకాక 13వ ప్యాకేజీలో 10.53 కి.మీ. కాల్వ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్యాకేజీలో 167.76 ఎకరాల పట్టా, 213.60 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని ప్యాకేజీల్లో ఇలా.. ప్యాకేజీ 14లో 10.50 కి.మీ. నుంచి 39.50 కి.మీ. వరకు 29 కి.మీ. మేర కాల్వ నిర్మించాలి. ఇంకా 26.11 కిలోమీటర్లు పూర్తి కావాలి. ఈ పరిధిలో రెండు రైల్వేలైన్లు, ఒక గ్యాస్ పైప్లైన్ ఉండగా, 1,021 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో 872 ఎకరాలు మాత్రమే సేకరించగా 761 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.80.85 కోట్లు పెండింగ్ ఉంది. ప్యాకేజీ 15లో 23.20 కి.మీ. కాల్వకు గాను 16.96 కి.మీ. పనులు జరుగుతున్నాయి. ఇందులో రెండు అక్విడెక్ట్లు ఉన్నాయి. ఈ ప్యాకేజీలో 740 ఎకరాలకు గాను 685 ఎకరాలు సేకరించి 34 ఎకరాలకే పరిహారం చెల్లించారు. ప్యాకేజీ 16లో 4.57 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి 1.20 కి.మీ.మేర పనులు సాగుతున్నాయి. ఇక్కడ అవసరమైన 336 ఎకరాల్లో 321 ఎకరాల భూమి సేకరించి 12 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.2.09 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలో అప్రోచ్ కెనాల్ నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు చేశారు. ఖమ్మం జిల్లాలోని 16వ ప్యాకేజీ కింద తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం నుంచి కూసుమంచి మండలం పోచారం వరకు 8.2 కి.మీ. టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు నాలుగు కి.మీ. పూర్తికాగా రూ.170 కోట్ల బిల్లుల్లో రూపాయీ విడుదల కాక కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. పూర్తయిన టన్నెల్లోనూ నిలిచిన నీటిని తొలగించడానికి మూడు నెలలు పడుతుంది. 2022లో ప్రారంభమైన ఈ టన్నెల్ పనులను తొలుత 2024 నాటికి, ఆతర్వాత 2026 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ నిధులు రాక, టన్నెల్లో నీరు నిలిచి అప్పటికీ పూర్తవడం కష్టమే. ఇక భద్రాద్రి జిల్లా జూలూరుపాడు వద్ద 1.650 కి.మీ. టన్నెల్ నిర్మాణం మొదలే కాకపోగా, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిధిలో యాతాలకుంట వద్ద కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రధాన కాల్వ పనులతో పాటు టన్నెల్ పనులు పూర్తయితేనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి అందుతాయి. -
అభివృద్ధి ప్ర‘దాతలు’
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు కరువవుతోంది. అయితే తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తున్న భక్తులు రామయ్యకు పలు రూపాల్లో విరాళాలు అందజేస్తున్నారు. కానీ వారికి దేవస్థానంలో తగిన మర్యాద, మన్ననలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు ఆలయ, దేవాదాయ శాఖ అధికారులు సమష్టిగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. వితరణలతోనే వసతులు.. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరిలో రామయ్య దేవస్థానానికి పునాది పడింది నాడు కంచర్ల గోపన్న సేకరించిన ప్రభుత్వ ఖజానాతోనే. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని నేటి వరకు ప్రభుత్వం ఎంతో కొంత అభివృద్ధి చేసినా.. భక్తులు సమర్పించిన విరాళాలు, వితరణలతోనే మరిన్ని వసతులు సమకూరాయి. ఇందులో ప్రధానంగా అంతరాలయంలో బంగారు వాకిలి, వెండి వాకిలి, స్వర్ణ పూరిత వాహనాలు, మూలమూర్తులకు స్వర్ణ కవచాలంకరణ, ఆలయంలో, చుట్టుపక్కల షెడ్ల వంటివి భక్తులు సమర్పించిన విరాళాలతోనే చేయించారు. ఇంకా దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానం, గోశాల, సత్రాలు, వసతిగదులు, కాటేజీల నిర్మాణానికి పలు రాష్ట్రాల దాతలు ముందుకొచ్చారు.. వస్తూనే ఉన్నారు. వీటితో పాటు ఉత్సవాల నిర్వహణకు వితరణలు, స్వామి, అమ్మవార్లకు బంగారు ఆభరణాలు అందిస్తున్నారు. ఇలా ప్రభుత్వం చేసే అభివృద్ధి కంటే ఇప్పటికీ దాతలు భూ, ధన, వస్తు రూపాల్లో ఇచ్చే విరాళాలపైనే ఆలయాభివృద్ధి ఆధారపడి ఉంటోంది. విరాళాలకు భరోసా ఏదీ..? శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు అందించే విరాళాలు సద్వినియోగం అయ్యేలా అధికారులు భరోసా కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతేడాది దేవస్థానంలో ఓ కాటేజీ నిర్మాణానికి దాతలు అందించిన నగదు దుర్వినియోగం అయిందనే ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. అలాగే భక్తులు అందించే బంగారం, వెండి ఆభరణాల విషయంలోనూ పారదర్శకత పాటించాలని అంటున్నారు. ఇక దాతలకు దేవస్థానంలో సముచిత స్థానం దక్కడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఆలయంలో దర్శనాలు, ఉత్సవాల సమయంలో తగు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. నిర్దిష్ట విరాళం అందజేసిన దాతలకు ఆలయంలోనే స్వామివారి కండువాలు, ప్రసాదాలు అందించడంతో పాటు వేదాశీర్వచనం చేయాలని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఏడాది నిర్వహించే దాతల సత్కార కార్యక్రమంలోనూ ప్రస్తావిస్తున్నారు. తాజాగా బుధవారం జరిగిన వేడుకలోనూ ఆలయ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయానికి భక్తుల నుంచి అధికారులు భారీ స్థాయిలో విరాళాలు సేకరించలేకపోతున్నారనే అపవాదు సైతం ఉంది. వివిధ రాష్ట్రాలు, ప్రదేశాల నుంచి వచ్చే భక్తులను దాతలుగా మార్చడంలో విఫలమవుతున్నారు. దేవస్థానం వద్ద రశీదు కౌంటర్ మాత్రమే ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఆలయ ప్రాంగణంలో దాతలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, ఇందులో ప్రత్యేక ప్రొటోకాల్ దర్శన టికెట్లతో పాటు భక్తుల రద్దీని బట్టి వెయింటింగ్ హాల్ నిర్మించాలని పలువురు సూచిస్తున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే మహారాజ పోషకులకు కొదవేమీ ఉండదని అంటున్నారు. ఈ ఏర్పాట్లతో పాటు చెంతనే ఉన్న నవభారత్, ఐటీసీ, బీటీపీఎస్, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, పలు కార్పొరేట్ సంస్థల వారితో ఆలయాభివృద్ధిపై చర్చిస్తే విరివిగా నిధులు సమకూరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి
టేకులపల్లి: వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రోహిత్రాజ్ పోలీస్ సిబ్బందికి సూచించారు. బోడు పోలీసుస్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల సీఐలు సత్యనారాయణ, సురేష్, రవీందర్, ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, రాజేందర్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు,అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. అధికారులకు మంత్రి ప్రశంసఇల్లెందు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు అందుతున్న సేవలు, ప్రసవాల పెరుగుదల, ప్రజలకు తగ్గిన ఆర్థికభారం తదితర అంశాలపై ‘ప్రసవ వే‘ధన’ తగ్గింది’ శీర్షికతో గురువారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ఐఅండ్పీఆర్ విభాగం ఉన్నతాధికారులు కలెక్టర్, ఐటీడీఏ పీఓ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రజాపాలనలో మారుమూల పల్లెల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అధికారులు, సిబ్బంది శ్రమించి పనిచేయడం వల్లే భద్రాద్రి జిల్లాలో గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం పొంది ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. శబరిమలకు ఆర్టీసీ బస్సులు ఖమ్మంమయూరిసెంటర్: అయ్యప్ప మాలధారులు శబరిమలలో స్వామి దర్శనానికి వెళ్లేందుకు తక్కువ చార్జీలతో ఆర్టీసీ బస్సులు సమకూర్చనున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. రీజియన్లోని ఏడు డిపోల నుంచి పుష్బ్యాక్ సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఐదు, ఏడు రోజుల ప్రయాణంలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు. బస్సుల కోసం ఖమ్మం డిపో మేనేజర్(99592 25958), సత్తుపల్లి డిపో(99592 25962), కొత్తగూడెం డిపో (99592 25959), భద్రాచలం డిపో (99592 25960), మధిర డిపో (99592 25961), మణుగూరు డిపో (99592 25963) మేనేజర్ను సంప్రదించాలని ఆర్ఎం సూచించారు. గుండాల – తాడ్వాయి అడవుల్లో పులి సంచారం ?గుండాల: గుండాల, మహబూబాబాద్ జిల్లా పాఖాల కొత్తగూడ, ములుగు జిల్లా తాడ్వాయి సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం పాఖాల కొత్తగూడెం మండలంలో ఓ వ్యక్తి అడవిగేదె దాడిలో మృతి చెందినట్లు గుర్తించిన విషయం విదితమే. కాగా, సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుండాల–పస్రా మధ్య లింగాల, గుండాల– దామరతోగు అటవీ ప్రాంతంలో సంచిరిస్తోందని మరి కొందరు అంటున్నారు. అయితే పులి అడుగుజాడలు కానీ, ఆచూకీ కానీ ఇంతవరకూ తెలియరాలేదు. పులి సంచరిస్తోందనే ప్రచారంతో పశువుల కాపరులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, పత్తి తీసే దశలో ఉండగా ఆ పనులకు వెళ్లేందుకు కూలీలు వణికిపోతున్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని అంటూనే సమాచారం సేకరిస్తున్నామని చెబుతున్నారు. -
75 శాతం హాజరు తప్పనిసరి
● డీఐఈఓ వెంకటేశ్వరరావు ● దుమ్ముగూడెం ప్రభుత్వ కళాశాలలో తనిఖీ దుమ్ముగూడెం : ఇంటర్మీడియెట్ విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలని, అప్పుడే పరీక్ష ఫీజులు తీసుకుంటామని డీఐఈఓ హెచ్.వెకంటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి క్రమం తప్పకుండా కాలేజీకి హాజరవ్వాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అపార్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాబోయే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెరిగేలా తమకు కేటాయించిన పాఠశాలలపై దృష్టి పెట్టాలని అధ్యాపకులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్ కృష్ణవేణి, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రాయింగ్, ముగ్గుల పోటీలు.. నషా ముక్తి భారత్ అభియాన్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, జిల్లా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ రవి, డీడీఏసీ ప్రతినిధి సీహెచ్ స్వరూప, యాంటీ డ్రగ్ కౌన్సిలర్ కేపీడీ వరరాజు తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలి
భద్రాచలంటౌన్ : గిరిజన నిరుద్యోగ యువత డ్రైవింగ్లో శిక్షణ పూర్తయ్యాక సమయం వృథా చేయకుండా డ్రైవర్ ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. టీజీఆర్టీసీ వరంగల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ సెంటర్లో శిక్షణ పొందిన గిరిజన యువకులకు గురువారం తన చాంబర్లో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. భద్రాచలం ఆర్టీఓ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఆ లైసెన్సులను సద్వినియోగం చేసుకోవాలని, డ్రైవర్ ఉద్యోగాలు పొందాలని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భారీ క్రేన్లతో ఫుట్ఓవర్ బ్రిడ్జి..
12 మీటర్ల వెడల్పుతో నిర్మాణం అమృత్ భారత్ పథకంలో భాగంగా భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. స్టేషనలోని మొదటి ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ వరకు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం నుంచి భారీ క్రేన్లు తెప్పించి నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కాగా భారీ క్రేన్లతో జరుగుతున్న పనులను స్థానికులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. – కొత్తగూడెంఅర్బన్ -
ముమ్మరంగా వాహన తనిఖీలు
టేకులపల్లి: మావోయిస్టుల నిరసన నేపథ్యంలో టేకులపల్లి సర్కిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఎస్పీ రోహిత్రాజు ఆదేశాల మేరకు బోడు ఎస్ఐ పోలిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్నగర్లో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానితుల వివరాలు ఆరా తీశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువపత్రాలను తనిఖీ చేశారు. రేపు జాబ్మేళాసూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్లోని వివిధ తయారీ రంగ సంస్థల్లో పనిచేసేందుకు గాను 200 మంది ఎంపిక కోసం ఈ నెల 24న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. పాల్వంచలోని డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్మేళాను 19 నుంచి 23 ఏళ్ల వయస్సు కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్టు, వెల్డర్ ట్రేడ్లలో ఐటీఐ పూర్తిచేసిన వారు టెక్నీషియన్లుగా అర్హులని, ట్రెయినీ టెక్నీషియన్లుగా పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని, వివరాలకు 90105 84000 నంబర్లో సంప్రదించాలని సూచించారు. బీఏఎస్ స్కూళ్లలో ఖాళీల భర్తీకి దరఖాస్తులుసూపర్బజార్(కొత్తగూడెం): బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం కింద కొనసాగుతున్న పాఠశాలల్లో ఖాళీల భర్తీకి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎ.శ్రీలత తెలిపారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ నుంచి 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి అవకాశం ఉండగా, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటని వారు అర్హులని తెలిపారు. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డు జిరాక్స్, మీ సేవ ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ, నివాస పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్, రెండు ఫొటోలతో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతిములకలపల్లి: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ఆలయాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సారపాక గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మణ్ ట్రాక్టర్ను అదే గ్రామానికి చెందిన ముత్యాల శేఖర్ (50) నడుపుతున్నాడు. బుధవారం మండలంలోని కొత్తజిన్నెలగూడెం సమీపంలో జామాయిల్ కర్ర తీసుకెళ్లేందుకు శేఖర్ ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు. మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఆలయాన్ని ఢీకొట్టింది. శేఖర్ ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. స్థానికులు 108 ద్వారా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ పుల్లారావు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్పాల్వంచ: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్పై రాళ్లతో దాడిచేసి గాయపర్చిన వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి జయమ్మకాలనీలో గొడవ జరుగుతోందని సమాచారం రావడంతో కానిస్టేబుల్ అబ్బురాములు అక్కడికి వెళ్లగా.. జట్పట్ రమేశ్ రాళ్లతో దాడి చేసి గాయపర్చాడు. అబ్బురాములు ఫిర్యాదు మేరకు రమేశ్పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సుమన్ పేర్కొన్నారు. మద్యం దుకాణం వద్ద ఘర్షణఆరుగురిపై కేసు పాల్వంచరూరల్: మద్యం దుకాణం వద్ద మద్యం సేవిస్తున్న యువకుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. యువకుడిపై ఆరుగురు కలిసి దాడిచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని పెద్దమ్మగుడి వద్ద గల మద్యం దుకాణం వద్ద నాగారానికి చెందిన ఐలపాక హరీశ్పై శనగ కిశోర్, అఖిల్, భరత్, సందీప్, హరిబాబు, సాగర్ కలిసి బుధవారం దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
భద్రాద్రిలో కార్తీక పూజలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన అనుబంధంగా ఉన్న ఉమామహేశ్వరి సమేత రామలిగేశ్వర స్వామి ఉపాలయంలో జరిగిన కార్తీక మాస పూజల్లో ఈఓ దామోదర్రావు దంపతులు పాల్గొన్నారు. పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం కార్తీక మాస పురాణ విశిష్టత, సంగీత, నృత్య కార్యక్రమాలు జరిపారు. ఇదిలాఉండగా గోదావరి తీరం కార్తీక శోభను సంతరించుకుంది. తొలిరోజు బుధవారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు బారులుదీరారు. మహిళలు స్నానాలు ఆచరించి, ఒత్తులను వెలిగించి గోదావరిలో వదిలారు. రామాలయంతో పాటు అనుబంధ ఆలయాలను సందర్శించారు. -
మాదక ద్రవ్యాలను వదిలేయాలి..
సూపర్బజార్(కొత్తగూడెం)/మణుగూరురూరల్: మాదక ద్రవ్యాలు లేని సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి ఆకాంక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగూడెం, మణుగూరు పట్టణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు (కార్డన్ సెర్చ్) నిర్వహించారు. కొత్తగూడెంలో 37 బైకులు, 2 ఆటోలు, ఒక కారు, 20 బీర్ బాటిళ్లు, 223 క్వార్టర్లు (విలువ రూ.46,190) స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఇక మణుగూరులోని సురక్షా బస్టాండ్ ప్రాంతంలో అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో డీఎస్పీలు మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అల వాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మూడు టౌన్లు, చుంచుపల్లి సీఐ లు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐలు, మణుగూరు ఇన్చార్జ్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నగేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం, మణుగూరుల్లో కార్డన్ సెర్చ్ -
● సాఫ్ట్వేర్ మొరాయించడంతో నిలిచిన కొనుగోళ్లు ● వచ్చే సోమవారం నుంచి తీసుకురావాలని సూచన
పత్తి కొనుగోళ్లలో సాంకేతిక సమస్యఖమ్మంవ్యవసాయం/తిరుమలాయపాలెం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సాఫ్ట్వేర్లో ఎదురైన సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లు నిలిచిపోగా, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు పత్తి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలుకు నిర్ణయించగా, రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళ, బుధవారాల్లో నాలుగు కేంద్రాలు మొదలయ్యాయి. ఈమేరకు రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని వాహనాల్లో పత్తి తీసుకొచ్చారు. అక్కడ వ్యవసాయ శాఖ నమోదు చేసిన పంట సాగు వివరాలు, స్లాట్ వివరాలు పరిశీలించాక కొనుగోలు చేయాల్సి ఉండగా.. సాఫ్ట్వేర్లో సమస్యతో బ్రేక్ పడింది. ఈమేరకు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సమస్యపై సాఫ్ట్వేర్ సమకూర్చిన సంస్థ నిర్వాహకులతో మాట్లాడి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొలిరోజు ఒక్కో మిల్లు వద్దకు 10 – 15 వాహనాల్లో పత్తితో రైతులు రాగా, సాయంత్రం కురిసిన వర్షంతో పత్తి కొంతమేర తడిసింది. ఈవిషయమై వివరణ కోరేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. కాగా, గోల్తండాలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని తెలుసుకున్న మద్దులపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్రెడ్డి, పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేష్ చేరుకుని మార్కెట్, సీసీఐ అధికారులతో మాట్లాడాక తేమ శాతం పరీక్షించి దిగుమతి చేసుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల నేపథ్యాన రైతులు నుంచి పత్తి తీసుకురావాలని అధికారులు సూచించారు. -
కొండరెడ్లకు చేయూతనిస్తాం
దమ్మపేట : కొండరెడ్లకు జీవనోపాధితోపాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐటీడీఏ భద్రాచలం ద్వారా చేయూతనిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.రాహుల్ అన్నారు. మండలంలోని పూసుకుంట గ్రామంలో కొండరెడ్ల (గిరిజన) కుటుంబాల జీవనోపాధిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన మౌలిక వసతులు, కార్యాచరణ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ కొండరెడ్ల జీవనోపాధికి టెంట్ హౌస్లు, పవర్ టిల్లర్ యంత్రాలను అందజేసి, 14 మంది రైతులకు వ్యవసాయ క్షేత్రాల్లో నీటి బోర్లు వేయించి, పామాయిల్ మొక్కలను నాటించామని వివరించారు. తేనెటీగలు, పుట్టగొడుగులు, మేకలు, గొర్రెలు, గేదెల పెంపకంను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో 25 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, ఏపీఓ డేవిడ్ రాజ్, ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, డీఈ బాపనయ్య, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, సీడీపీఓ హేమసత్య, హరికృష్ణ, సాయికృష్ణ, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
కేంద్రీయ విద్యాలయకు స్థలం ఖరారు
కొత్తగూడెంఅర్బన్: కేంద్రీయ విద్యాలయకు స్థలం ఖరారైంది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాలకేంద్రంలో భవన నిర్మాణానికి నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. జిల్లాకు ఇటీవల కేంద్రీయ విద్యాలయ మంజూరుకాగా, ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. నూతన భవనం అందుబాటులోకి వచ్చేవరకు పాతకొత్తగూడెంలోని తెలంగాణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లోని ఓ భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే 10 గదులతో కూడిన ఖాళీ భవనం కేటాయించగా, రెండు, మూడు రోజుల్లో కేంద్రీయ విద్యాలయ ప్రతినిధులు వచ్చి పరిశీలించనున్నారు. వారి సూచనల మేరకు కొద్ది మార్పులు చేసి కొనసాగించనున్నారు. భవనం రీ మోడలింగ్కు జిల్లా విద్యాశాఖ నుంచే నిధుల విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విద్యాధికారులు తెలిపారు. ఇక పాల కేంద్రంలో కేటాయించిన నాలుగున్నర ఎకరాల్లో శాశ్వత భవనం నిర్మించనున్నారు. ఇటీవల పరిశీలించిన కలెక్టర్ పాతకొత్తగూడెంలో కేంద్రీయ విద్యాలయకు కేటాయించిన భవనాన్ని ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. భవనంలో మార్పులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అందుబాటులోకి తేవాలన్నారు. విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారి రాజగోపాల్ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కేంద్రీయ విద్యాలయ ప్రతినిధులు పరిశీలించాక, వారి సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని మార్పులు చేపట్టనున్నారు. కాగా కేంద్రీయ విద్యాలయలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్తో బోధన చేపట్టనున్నారు. అడ్మిషన్లు ఆన్లైన్ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు నామినల్ ఫీజులతో నాణ్యమైన విద్య లభించే అవకాశం ఉంది. -
●ఇలా కూడా వాడొచ్చా..!
కూల్డ్రింక్స్ తాగి వృథాగా పడేసే ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో మట్టి నింపి.. ఓ ఉపాధ్యాయుడు మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. దీనిని చూసినవారంతా వీటిని ఇలా కూడా వాడొచ్చా? అని ఔరా అంటున్నారు. మండలంలోని బండారుగుంపులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బి.వెంకటేశ్వర్లు కూల్డ్రింక్ ఖాళీ బాటిళ్లను సేకరించి పాఠశాల ఆవరణలో ఉన్న వృక్షాలకు కట్టి, వాటిలో మట్టి నింపి పలు రకాల మొక్కల్ని పెంచుతున్నాడు. అవి పూలు పూసినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను బుధవారం ‘సాక్షి’కెమెరా క్లిక్మనిపించింది. – అశ్వారావుపేటరూరల్ -
శిశువులకు శ్రీరామరక్ష
● 108 నియోనాటల్ ద్వారా అత్యవసర వైద్యం ● నవజాత శిశువు మరణాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో 1,971 మందికి సేవలు ఖమ్మంవైద్యవిభాగం: అప్పుడే పుట్టిన శిశువు మొదలు 30రోజుల లోపు వయస్సు వారిని నవజాత శిశువులుగా పరిగణిస్తారు. ఈ వయస్సు శిశువుల సంరక్షణపై అవగాహన లేక కొన్ని, సరైన పోషణ అందక ఇంకొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమాన శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యాన మరణాలు తగ్గించేలా అత్యవసర వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 నియోనాటల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ సేవలతో ఉమ్మడి జిల్లాలో వందలాది మంది శిశువుల ప్రాణాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాకు రెండు అంబులెన్స్లు కేటాయించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులకు సిబ్బంది వైద్యం అందిస్తూనే పెద్దాస్పత్రులకు తరలిస్తూ శిశు మరణాల తగ్గింపునకు పాటుపడుతున్నారు. రెండేళ్లుగా నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 108 నియోనాటల్ అంబులెన్స్ సేవలు రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 1,971 మంది శిశువులకు వైద్య సేవలు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సాధారణంగా 108 వాహనంలో శిశువు చికిత్సకు అవసరమైన సౌకర్యాలు ఉండవు. ఈమేరకు ప్రత్యేక పరికరాలతో నియోనాటల్ అంబులెన్స్లు సమకూర్చారు. ఇందులో వెంటిలేటర్ సౌకర్యంతో పాటు ఇంక్యూబేటర్, పల్స్ ఆక్సీమీటర్, సిరంజ్ పంప్, ఆక్సిజన్ సిలిండర్ ఉంటాయి. బరువు తక్కువ ఉన్న శిశువులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పుట్టేవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు చేర్చడం సులువవుతోంది. నవజాత శిశు మరణాల నివారణకు.. కొన్నేళ్లుగా జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. బరువు తక్కువగా పుట్టడం, అవయవాల ఎదుగుదలలో లోపాలతో జన్మిస్తున్న వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుంది. అయితే, శిశువు పరిస్ధితి ఇబ్బందిగా మారినప్పుడు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాకు రెండు నియోనాటల్ అంబులెన్స్లను కేటాయించగా వీటిలో వైద్యం అందిస్తూ పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. తద్వారా శిశు మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో చిన్నచిన్న సమస్యలకు కూడా కొందరు వైద్యులు వైద్యం చేయకుండా రిఫర్ చేస్తున్నారని, అలా కాకుండా జిల్లాలోనే వైద్యం అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.ఉమ్మడి జిల్లాలో రెండు నియోనాటల్ వాహనాల ద్వారా సేవలు అందుతున్నాయి. శిశువులకు చికిత్స చేస్తూనే పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారామరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. అత్యవసర వైద్యం అవసరమైన శిశువులనే రిఫర్ చేస్తే మరింత మందికి సేవలు అందుతాయి. – శివకుమార్, ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్


