Bhadradri
-
యజమానులతో కార్మిక సంఘం చర్చలు విఫలం
ఇల్లెందురూరల్: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ ఉమ్మడి జిల్లా పెంకు పరిశ్రమల కార్మికులు మూడు రోజులుగా సమ్మె బాట పట్టారు. యజమానులు, తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ నేతల మధ్య బుధవారం పెంకు పరిశ్రమలో చర్చలు జరిగాయి. వేతనాల పెంపు విషయంలో ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు యూనియన్ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు వేతనాల పెంపు విషయంలో యజమానులు మొండిగా వ్యవహరించడం సరైంది కాదని పేర్కొన్నారు. కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే వినతి భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలెక్టర్ అంకిత్కు వినతిపత్రం అందించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. భద్రాచలం – వాజేడు ప్రధాన రహదారి మరమ్మతులు, నూతన రహదారి నిర్మాణ పనులను వర్షాకాలానికి ముందే చేపట్టాలని కోరారు. తాలిపేరు ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సాగునీటి కాల్వల ద్వారా నీటిని అందించాలని, పోలవరం ప్రాజెక్టు నుంచి భద్రాచలానికి ముప్పు విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇంకా ఏరియా ఆస్పత్రి, గోదావరి వరద, దుమ్ముగూడెం మండలానికి మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ పనులపై విన్నవించారు. వడదెబ్బతో ఇద్దరు మృతి మధిర: మధిర మండలం సిద్దినేనిగూడెం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నెల్లూరు శ్రీరాములు(110) కొద్దిరోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడ్డాడు. ఇంటి వద్దే ఆయనకు చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. శ్రీరాములుకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పట్వారిగూడెంలో వృద్ధుడు.. దమ్మపేట: దమ్మపేట మండలం పట్వారిగూ డెం గ్రామానికి చెందిన వృద్ధుడు బండి రాఘవులు(70)వడదెబ్బతగిలి మృతిచెందాడు. కూలీ పనులు చేయలేక మూడు రోజులుగా భిక్షాటన చేస్తున్న ఆయన బుధవారం స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేశామని అదనపు ఎస్ఐ బాలస్వామి తెలిపారు. డివైడర్ను ఢీకొని ఆటో బోల్తా తలకు తీవ్ర గాయాలై డ్రైవర్ మృతి బూర్గంపాడు: సారపాకలో ఆటో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. తలకు తీవ్రగాయాలైన ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రసాద్ కథనం ప్రకారం.. సారపాక గాంధీనగర్కు చెందిన ఆటోడ్రైవర్ శివ (36).. మంగళవారం రాత్రి సారపాక ప్రధానకూడలి నుంచి ఐటీసీ ఈస్ట్గేట్ వైపునకు వెళ్తున్నాడు. ఆటో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన శివను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృడుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ఎస్పీ రోహిత్ రాజు జూలూరుపాడు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ బి.రోహిత్ రాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్ష ప్లాన్లో గుండెపుడిలో నిర్వహించిన రోడ్డు భద్రత గ్రామసభలో మాట్లాడారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని , స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వివరించారు. గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకుని, రోడ్డు భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, మోటారు వాహనాల అధికారి వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, శ్రీలక్ష్మి, ఇతర అధికారులు టి.శ్రీనివాస్, తాళ్లూరి రవి, రామారావు, బి.వెంకటేశ్వర్లు, తేజశ్వి, బాదావత్ రవి, రమాదేవి, ప్రవీణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు పాల్గొన్నారు. -
అడవిలో వెదురు
పాల్వంచరూరల్: అటవీశాఖకు ఆదాయం లభించే అవకాశాలు ఉన్నందును అభయారణ్యంలో వెదురు మొక్కలు పెంచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కిన్నెరసాని అభయారణ్యంలో ఈ ఏడాది 7 లక్షల మొక్కలను 400 పైన హైక్టార్ల విస్తీర్ణంలో పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందులో భాగంగా ప్రస్తుతం నాలుగు లక్షలకుపైగా నాటాలని నిర్ణయించారు. అందుకోసం వైల్డ్లైఫ్కు చెందిన నాలుగు నర్సరీల్లో ఆ జాతి మొక్కలను పెంచుతున్నారు. వానలు కురిసిన తర్వాత వాటిని నిర్దేశించిన ప్రాంతాల్లో నాటేందుకు వైల్డ్లైఫ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదాయం బాగు.. ఏజెన్సీ ప్రాంతంలో వెదురు సాగుకు అనుకూలం. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెదురు బాగా పెరుగుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. పంట భూముల్లో గట్టు చుట్టూ 4 మీటర్ల వెడల్పులో నాటుకోవాలి. 30/30 సెంటిమీటర్ల గుంతలను తీసుకుని 4 కేజీల పశువుల ఎరువు, మట్టి కలిపి గుంతలో నింపాలి. తర్వాత నాటిన మొక్కలు ఏడేళ్ల తర్వాత దిగుబడి వస్తుంది. వెదురు చివరి దశలో పూతకు వచ్చి విత్తనాలు ఇచ్చిన తర్వాత కుదురు చనిపోతుంది. నీటి సౌకర్యం ఉన్న చోట వేసవి కాలంలో నెలకోసారి తడిపెడితే దిగుబడి బాగుటుంది. ఎకరం విస్తీర్ణంలో 150 వెదురు కుదుళ్లు నాటుకోవచ్చు. ఏడేళ్ల తర్వాత 10 గెడల చొప్పున 1,500 గెడలు వస్తాయి. ఒక్కసారి నాటిన వెదురు చెట్టు కుదురు 20 నుంచి 25 ఏళ్లపాటు దిగుబడినిస్తాయి. ఉపయోగాలు.. వెదురు పోయేసి సంతంతికి చెందిన గడ్డి జాతి మొ క్క. అత్యంత వేగంగా పెరిగే మొక్కల్లో ఇది ఒకటి. వెదురు విత్తనాలు మొక్కల కొమ్మల ద్వారా పండిస్తారు. జూన్, ఆగస్టు నెలల మధ్యలో నాటుతారు. వెదురు బొంగులతో ఇళ్లు, గుడిసెల నిర్మాణం, ఫర్నిచర్, కాగితం, బుట్టలు, హస్తకళల తయారీకి ఉపయోగపడుతుంది. వెదురు చెట్టు తన జీవిత కాలంలో 10 నుంచి 12 ఏళ్లకోమారు పూచే పూత కంకుల నుంచి లభించే గింజల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది. ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, రక్తంలో చెక్కర నియంత్రణకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అభయారణ్యంలో ఈ వానాకాలంలో నాలుగు వందల హెక్టార్లలో సుమారు ఐదు లక్షల వెదురు మొక్కలను నాటాలని నిర్ణయించాం. మరో రెండు వందల హెక్టార్లలో ఇతర కలపజాతుల మొక్కలను నాటుతున్నాం. వెదురు మొక్కలను నాలుగు నర్సరీల్లో పెంచుతున్నాం. వర్షాలు కురిసిన తర్వాత నాటుతాం. –బి.బాబు, ఎఫ్డీఓ, వైల్డ్లైఫ్ పాల్వంచ డివిజన్ -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
● మూడేళ్ల చిన్నారి మృతి, మరో నలుగురికి గాయాలు ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం పాల్వంచరూరల్/మధిర: ఏపీలోని శ్రీకాకుళం నుంచి మధిరలో ఉంటున్న వైద్యుడి వద్దకు ఆయన తల్లిదండ్రులు, సోదరి, మేనకోడలు వచ్చారు. మేనకోడలికి గొంతు సంబంధిత శస్త్రచికిత్స చేయించారు. చికిత్స విజయవంతం కావడంతో భద్రాచలంలో రామయ్యను దర్శించుకుని స్వస్థలానికి వెళ్లాలని కారులో వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం బారిన పడ్డారు. దీంతో చిన్నారి మృత్యువాత పడగా మిగతా వారికి తీవ్రగాయాలైన ఘటన పాల్వంచలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి పాల్వంచకు.. ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన పద్మావతి – కృష్ణారావుల కుమార్తె హావియాకు భర్త అనురాగ్, మూడేళ్ల కుమార్తె బాల ఆద్య ఉన్నారు. ఇందులో అనురాగ్ అమెరికాలో ఉంటుండగా, హావియా తన కుమార్తెతో భర్త స్వస్థలమైన వైజాగ్లోని మధురవాడలో ఉంటోంది. ఇటీవల శ్రీకాకుళం వెళ్లిన హావియా తల్లిదండ్రులతో కలిసి మధిరలో ఉండే సోదరుడు డాక్టర్ సోమశేఖర్ వద్దకు వారం క్రితం వచ్చింది. ఆద్యకు గొంతు సంబంధిత సమస్య ఉండడంతో శస్త్రచికిత్స చేయించారు. ఆ తర్వాత భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బుధవారం కారులో వెళ్తున్నారు. కారులో కృష్ణారావు దంపతులు, హావియా, ఆమె కుమార్తె ఆద్య ఉంది. అయితే, పాల్వంచ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపాన జాతీయ రహదారి పక్కన టిప్పర్ వాహనం నిలిపి ఉంది. ఆ రహదారిపై వెళ్తున్న వీరి కారుకు కుక్క అడ్డు రావడంతో డ్రైవర్ తడికమల్ల కృష్ణ దానిని తప్పించే క్రమంలో ఆగిఉన్న టిప్పర్ను ఢీకొట్టాడు. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అమ్మమ్మ ఒడిలో కూర్చున్న చిన్నారి ఆద్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లి, అమ్మమ్మ, తాతయ్యతోపాటు డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఎస్ఐ బి.సురేశ్ క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వానికి చిన్నచూపు
భద్రాచలంఅర్బన్: నాలుగు రాష్ట్రాలకు పెద్దదిక్కుగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని తరలించే వాహనం లేక భుజాలపై మోసుకుని వెళ్లడం చూస్తే ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వానికి ఉన్న వివక్ష తెలుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఈ ఆస్పత్రిని తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్రెడ్డితో చర్చించారు. ఆతర్వాత జాన్వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలం ఆస్పత్రికి ప్రతీతీ రోజు 400 – 600 మంది వస్తున్నా సరైన వైద్యం అందకపోగా, వైద్యులు, ఉద్యోగులు 212మందికి గాను 98మందే ఉండడం గర్హనీయమన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నా పూర్తిస్థాయిలో వైద్యులు లేక పేదలకు సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, శానిటేషన్ కార్మికులకు రూ.26వేలకు బదులు కేవలం రూ.11వేల వేతనం, అది కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సందర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై సీపీఎం ఆధ్వర్యాన అధ్యయనం చేస్తున్నామని, ఇందులో గుర్తించిన సమస్యలపై ఆగస్టులో హైదరాబాద్లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జాన్వెస్లీ తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు బండారు రవికుమార్, ఏ.జే.రమేష్, ఎం.బీ.నర్సారెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, సున్నం గంగ, ఎర్రంశెట్టి వెంకటరామారావు, సీతాలలక్ష్మి, ఇరుప అనసూర్య, లీలావతి, కొలగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా అభయాంజనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమల పాకులతో అర్చన జరిపారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలిసూపర్బజార్(కొత్తగూడెం): ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం లేదా వర్షాల్లో అంతరాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తాలన్నారు. వర్షాల ఆలస్యం లేదా తక్కువ వర్షపాతం పరిస్థితులు కొనసాగితే రైతులు తక్కువ కాలవ్యవధిలో పూర్తయ్యే, తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొరల్రు, సామలు వంటి పంటల సాగును పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలని వివరించారు. జేకే ఓసీ విస్తరణ భూముల పరిశీలనఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణకు ప్రతిపాదించిన 17.51 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపు ప్రాంతాన్ని బుధవారం పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రాంతీయ కార్యాలయం అధికారి ఎస్.యువరాజ్ పరిశీలించారు. భూమి విస్తీర్ణం, ప్రాజెక్ట్ అవసరాలు, ప్రభావిత ప్రాంత వివరాలు, కుటుంబాల సంఖ్య తదితర వివరాలను ఇల్లెందు జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. జేకే ఓసీ భవిష్యత్ అభివృద్ధి, ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అటవీభూమి మళ్లింపు, అనుమతుల ప్రక్రియపై అధికారులతో చర్చించారు. డీఎఫ్ఓ కృష్ణాగౌడ్, ఎఫ్డీఓ కరుణాకర్, ఎస్ఓటూ జీఎం బలరాం, ఇతర విభాగాల అధికారులు ఉన్నారు. -
బోనస్ కట్?
డిప్యూటేషన్ వ్యక్తిగతమైతే సింగరేణిలో లెక్కాపత్రం లేకుండా డిప్యూటేషన్లు ● క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టిన యాజమాన్యం ● వ్యక్తిగత విన్నపమైతే ఆర్థిక ప్రయోజనాల్లో కోతసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ నిబంధనల ప్రకారం కఠినమైన పని పరిస్థితులు ఉండే భూగర్భ (యూజీ) గనుల నుంచి సర్ఫేస్ (ఉపరితల) పనులకు బదిలీలపై నిషేధం ఉంది. దీంతో భూగర్భ గనుల్లో పని చేసేందుకు సుముఖతలేని ఉద్యోగులు డిప్యూటేషన్పై సర్ఫేస్కు వస్తున్నారు. ఇందుకోసం రాజకీయ అండదండలు, పైరవీలు చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు ఉపరితల గనుల్లో పని చేసే ఉద్యోగులు/కార్మికులకు యూజీల్లో కంటే ఎక్కువ మొత్తంలో అలవెన్సులు ఉన్నాయి. దీంతో ఇక్కడ ఖాళీలు ఉండటం లేదు. ఫలితంగా పైరవీ డిప్యూటేషన్లపై లెక్కకు మిక్కిలి సర్ఫేస్కు వస్తున్నారు. వారిని అంతగా ప్రాధాన్యత లేని విభాగాలు, బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా లేని శాఖల్లోకి సర్దుబాటు చేయాల్సి వస్తోంది.. ఫలితంగా ఇటు ఓసీ, అటూ యూజీలలో కంటే సపోర్టింగ్ విభాగాల్లోనే అవసరానికి మించి పని చేస్తున్న ఉద్యోగులు/కార్మికుల సంఖ్య పెరిగిపోయింది. దీనికి తోడు ఇక సంస్థ ఆవల రాజకీయ నాయకులు దగ్గర వ్యక్తిగత సహాయకులుగా 50 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్టు గుర్తించారు. డిప్యూటేషన్లు ఎక్కువ వ్యక్తిగత రిక్వెస్టులపైనే.. ప్రస్తుతం ఉన్న డిప్యూటేషన్లలో 80 శాతానికి పైగా సంస్థ అవసరాల కంటే వ్యక్తిగత రిక్వెస్టులపై జరిగినవే ఎక్కువ. కానీ, బాహ్య ఒత్తిళ్ల కారణంగా అన్ని డిప్యూటేషన్లు సంస్థ అవసరాల కోటా కిందే పరిగణనలో ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా సింగరేణి సంస్థ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కొంత మొత్తాన్ని కార్మికులకు పంచుతోంది. అయితే, సింగరేణి అంటేనే బొగ్గు, అలాంటి బొగ్గు ఉత్పత్తితో నేరుగా సంబంధం లేకుండా ఉన్న వారికి బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వడం కఠిన పరిస్థితుల మధ్య భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల్లో అసంతృప్తికి కారణం అవుతోందనే వాదనలు ఉన్నాయి. ఓ వైపు సమర్థంగా మ్యాన్ పవర్ను వినియోగించుకుంటూనే, మరోసారి కార్మికుల శ్రమకు గుర్తింపు ఇచ్చే దిశగా సింగరేణి సిద్ధమైంది. అందులో భాగంగా సింగరేణిలో సులువైన పనిగా మారిన డిప్యూటేషన్లపై ఉక్కుపాదం మోపుతోంది. లాభాల వాటాలో కోత కొత్త మార్పులు – సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రస్తుతం నిరవధికంగా కొనసాగుతున్న డిప్యూటేషన్ల పొడిగింపులు క్రమంగా తగ్గిపోతాయి. వాటికి ఎక్స్టెన్షన్ కావాలంటే కచ్చితమైన కారణం తెలపాలి. లేదంటే పర్సనల్ రిక్వెస్ట్ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే సింగరేణి యాజమాన్యం అసలైన మెలిక పెడుతోంది. సంస్థ అవసరాల రీత్యా డిప్యూటేషన్పై ఉన్న వారికే లాభాల వాటా, దీపావళి బోనస్ అందించే విధంగా కొత్తగా సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం. బొగ్గు ఉత్పత్తితో నేరుగా సంబంధం లేని విభాగాల్లో వ్యక్తిగత రిక్వెస్ట్ల మీద డిప్యూటేషన్పై వెళ్లిన ఉద్యోగులు/కార్మికులకు లాభాల బోనస్లో వాటాను నిరాకరించడమే అవుతుంది. అదే జరిగితే వ్యక్తిగత రిక్వెస్ట్ మీద లైట్ జాబ్లకు రావాలనుకునే ఉద్యోగులు/కార్మికులు లాభాల బోనస్, దీపావళి బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాలను వదులుకునేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇక మీదట డిప్యూటేషన్పై ఒక ఉద్యోగి/కార్మికుడిని పంపే ముందు అందుకు గల కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. సంస్థ అవసరాల దృష్ట్యా డిప్యూటేషన్ అవసరం పడిందా లేకా ఉద్యోగి రిక్వెస్ట్ మేరకు జరిగిందా అనే విషయాన్ని తేటతెల్లం చేయాలి. ఆర్నెళ్ల పరిమితి ముగిసిన తర్వాత తదుపరి ఎక్స్టెన్షన్ కోసం డైరెక్టర్ పా నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏరియా జనరల్ మేనేజర్ స్థాయి నుంచి సంస్థ అవసరాల దృష్ట్యా డిప్యూటేషన్ అని ఫైల్ పెట్టినప్పటికీ, ఆ ఫైల్కు తగిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఉన్నాయా ? లేదా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాతే అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం జరుగుతుంది. గరిష్టంగా ఏడాదికి మించి డిప్యూటేషన్ పొడిగింపు ఉండదు. ఎప్పటిలాగే ఒక ఏరియా నుంచి మరో ఏరియా డిప్యూటేషన్కు పా అనుమతి, సంస్థ ఆవల పని చేసేందుకు సీఎండీ అనుమతి తప్పనిసరి. అయితే, ప్రతీ సందర్భంలో డిప్యూటేషన్కు సంస్థ అవసరాలు కారణమా లేక ఉద్యోగి రిక్వెస్ట్ కారణమా అనేది కీలక అంశం కానుంది. -
రహదారి భద్రత.. అందరి బాధ్యత
కూసుమంచి: రహదారి భద్రతను వాహనదారులంతా బాధ్యతగా భావిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో బుధవారం రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. వాహననం నడిపేటప్పుడు తమ కోసం కుటుంబం ఎదురుచూస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తద్వారా నిబంధనలు పాటిస్తూ వాహనదారులు తమను కాపాడుకోవడంతో పాటు ఎదుటి వాహనదారులకు మేలు చేసిన వారవుతారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పక ధరించాలని సూచించారు. అలాగే, మద్యం, మత్తు పదార్థాలను సేవించి వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడొద్దని తెలిపారు. అనంతరం ఇటీవల పలు ప్రమాదాల్లో గాయపడిన బాధిత కుటుంబాలతో మాట్లాడిన సీపీ వారికి సురక్షిత ప్రయాణంపై సలహాలు, సూచనలు అందించారు. అలాగే, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లోక్యాతండాకు చెందిన జర్పుల సందీప్ తల్లి లలితకు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కాంచాని సైదమ్మ, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్కుమార్, ఎస్ఐలు నాగరాజు, జగదీశ్, సంతోష్, స్రవంతి, దివ్య, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ -
సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచాలి
చుంచుపల్లి: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతృ, శిశు మరణాలను తగ్గించేందుకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. బుధవారం కొత్తగూడెంలో నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, శాంపిల్ సేకరణ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సిజేరియన్ ప్రసవాలను తగ్గించాలని సూచించారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ఏఎన్సీ పరీక్షలు నిర్వహించి, హై రిస్క్ గర్భిణీల ప్రత్యేక ప్రొఫైల్ను గుర్తించాలన్నారు. అధికారులు సాయి కళ్యాణ్, ప్రతాప్, రాందాస్, దినేష్, రాకేష్, హరీష్ పాల్గొన్నారు. 8 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది (2000 బ్యాచ్)కి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వీరిలో నలుగురిని భద్రాద్రి జిల్లాకు, ఇద్దరిని ఖమ్మం కమిషనరేట్కు, మహబూబాబాద్, ఇంటెలిజెన్స్కు ఒక్కొక్కరినీ కేటాయించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వారు సీపీ సునీల్దత్ను బుధవారం కలవగా ఆయన అభినందించారు. -
బైక్ల చోరీ కేసులో నిందితుల అరెస్ట్
భద్రాచలంఅర్బన్: బైక్ల చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ అరుణ్కుమార్ వెల్లడించారు. మంగళవారం రాత్రి కూనవరం రోడ్డులో టౌన్ ఎస్ఐ శ్యాం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడిని ఆపి విచారించారు. దీంతో పట్టణంలో 8వ తేదీన ద్విచక్రవాహనాల చోరీ నిందితుల వివరాలు తెలిశాయి. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకులు జల్సాలకు అలవాటు పడి.. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి నగదుకు బదులుగా చోరీ చేసిన ద్విచక్రవాహనాలను ఇచ్చినట్లు తేలిందని డీఎస్పీ చెప్పారు. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారని, వీరిపై గతంలో హైదరాబాద్, ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయని, వారిని రిమాండ్కు తరలించామని తెలిపారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ఛేదించామని డీఎస్పీ అరుణ్కుమార్ వివరించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ శ్యాం తదితరులు పాల్గొన్నారు.24 గంటల్లో ఛేదించిన పోలీసులు -
13.6 కిలోల గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: సీలేరు, ఒడిశా ప్రాంతాల్లో కొనుగోలు చేసి.. కర్నూలు, నల్లగొండ, హైదరాబాద్కు మూడు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న ఎండు గంజాయిని కూనవరం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద ఎకై ్సజ్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి, మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు, 13.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.9.90 లక్షలు ఉంటుందని, ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లో అప్పగించామని ఎస్ఐ వివరించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది రాజు, రమేశ్బాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడులు బూర్గంపాడు: మండలంలోని గుట్ట లక్ష్మీపురం గ్రామంలో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.12,480 నగదు, ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ అంకిత్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి జీపీ కార్యాలయంలో సర్పంచ్ లకావత్ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యంంతోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఈయేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని సూచించారు. పంటమార్పిడి పద్ధతి పాటించాలని, పీఆర్ –126 రకం వరి పంట సాగు చేయవద్దని సూచించారు. తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబానా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
రైతులకు అండగా ‘సాక్షి’
జిల్లా వ్యవసాయాధికారితో రేపు ఫోన్ ఇన్సూపర్బజార్(కొత్తగూడెం): రుతుపవనాల రాకతో జిల్లాలో వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాల నిల్వలు, నకిలీ విత్తనాలు, తొలకరి వర్షాలకే విత్తనాలు వేసే పరిస్థితులు, తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 12–06–2026, శుక్రవారం సమయం : ఉదయం 11నుంచి 12 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 8977743066, 9347111131 -
తమ్ముళ్ల నుంచి ప్రాణహాని ఉంది..
టేకులపల్లి: తల్లిదండ్రుల మరణం తర్వాత ఆస్తి పంచుకుందామని అడిగితే తమ్ముళ్లు తనతోపాటు తన భార్యపై దాడికి పాల్పడటమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్న కన్నీటిపర్యంతమయ్యాడు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం రేగులతండాకు చెందిన మోహన్, మీనాక్షి దంపతులు వివరాలు వెల్లడించారు. 2021లో అమ్మ, 2025లో నాన్న మరణించాక భూమి, బంగారం, ఇతర ఆస్తులను పంచుకుందామని తమ్ముళ్లు శోభన్, సుమన్కు చెప్పారు. దీంతో వారు బెదిరింపులకు దిగడంతో గత ఏప్రిల్ 14న పోలీసులను ఆశ్రయించారు. అయినప్పటికీ తమ్ముళ్ల ప్రవర్తనలో మార్పు రాకపోగా వివాదాస్పద పొలాన్ని దున్నేందుకు వచ్చారు. మోహన్, మీనాక్షి దంపతులు అడ్డుకోవడంతో శోభన్, సుమన్ వారిని చితకబాదారు. దీంతో బాధితులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత డీఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వగా జూన్ 8న పోలీసులు శోభన్, సుమన్ను రిమాండ్ చేశారు. తర్వాత కూడా వారు వచ్చి చంపుతామని బెదిరిస్తున్నారని, వారితోపాటు గ్రామస్తులు కూడా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని మోహన్, మీనాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వారు కోరారు. రక్షించాలని అన్న వేడుకోలు.. -
మొక్కులు చెల్లించి వస్తూ..
పినపాక: ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించుకుని వస్తున్న యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మండలంలోని ఐలాపురం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మణుగూరు మండలం కమలాపురం గ్రామానికి చెందిన ధర్రాజు కిశోర్ (24), బట్ట ప్రశాంత్ (30) మండలంలోని గొట్టెల గ్రామంలోని దేవాలయానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తుండగా.. ఐలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. కిశోర్ అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రశాంత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. దేవుడి ఆశీస్సులు తీసుకుని వస్తారనుకుంటే దేవుడి దగ్గరికే వెళ్లారా.. అంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి -
ఓవర్ స్లో బ్రిడ్జి!
భద్రాచలం: ఏళ్లు గడుస్తున్నా భద్రాచలం వద్ద కరకట్ట పొడిగింపు పనుల్లో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి.. నిర్మాణానికి నోచుకోవడంలేదు. ఇప్పటికే పలుమార్లు డిజైన్లు రూపొందించినా ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రస్తుతం రూ.150 కోట్ల భారీ బడ్జెట్ అంచనాతో రూపొందించిన ప్రతిపాదనలను జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి గురువారం హైదరాబాద్లో సమీక్ష జరపనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపుతో ఇప్పటికే భద్రాచలంవాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్ బ్రిడ్జి సమస్యను సమీక్షించి నిధులు కేటాయించి, పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరకట్టకు రూ.38 కోట్లు.., ఓవర్ బ్రిడ్జికి రూ.150 కోట్లు భద్రాచలం ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు గోదావరి తీరం వెంబడి 2000 సంవత్సరంలో సుమారు 7.5 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డులో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో సుమారు 700 మీటర్ల మేర కరకట్ట నిర్మాణం ఆగిపోయింది. 2022లో గోదావరి వరదలు తీర ప్రాంత కాలనీలను ముంచెత్తడంతో పాలకులు రూ.38 కోట్లతో కరకట్ట పొడగింపు పనులు చేపట్టారు. ఓవర్ బ్రిడ్జికి రూ.12 కోట్లను ప్రతిపాదించారు. కరకట్ట నిర్మాణం, స్లూయిస్, రిటైనింగ్ వాల్ తదితర పనులు ముగింపు దశకు వచ్చాయి. అయితే రూ.150 కోట్లతో ఓవర్ బ్రిడ్జి ప్లాన్ను జాతీయ రహదారుల శాఖ ఫైనల్ చేసింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తేనే కరకట్ట పనులు పూర్తవుతాయి. ఇరిగేషన్ అధికారులకు తలనొప్పి పలు మార్లు డిజైన్లకు జాతీయ రహదారుల శాఖ అభ్యంతరం తెలుపుతుండగా, బ్రిడ్జి నిర్మాణంలో కాలయాపన సాగుతోంది. వర్షాకాలం సీజన్, గోదావరి వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆ శాఖ అధికారులకు చీవాట్లు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలను సైతం జారీ చేశారు. కానీ నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇరిగేషన్ అధికారులకు మాత్రం సమస్య తలనొప్పిగా మారింది. జాతీయ రహదారి శాఖ ఆమోదించిన డిజైన్ను ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే తిరిగి ఆ పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం. అదేవిధంగా మా శాఖ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, ఇతర సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తాం. –జాని, ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం -
బూత్ కమిటీలే కాంగ్రెస్కు పునాదులు
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికొత్తగూడెంఅర్బన్: బూత్ కమిటీలే కాంగ్రెస్ పార్టీకి పునాదులని, రాబోయే ఎన్నికల్లో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకం కానుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం క్లబ్లో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర ఓటరు నమోదును నిర్ధారించడం, అర్హులైన ఓటర్లందరూ చురుకుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అన్నారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, అడ్రస్ మార్పులు ఫారం–6, 7, 8, ఎన్యుమరేట్ ఫారం ద్వారా వెంటనే చేయించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, నాయకులు కొత్వాల శ్రీను, ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, మండే వీర హనుమంతరావు, చీకటి కార్తీక్, అర్జున్ రావు, అంతోటి పాల్, ఎం ప్రసాద్ బాబు, మంద హనుమంతరావు, కొదుమూరి శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, నాగార్జున శ్రీనివాస్రెడ్డి, చింతలపూడి శేఖర్, రంగారావు, గద్దెల రమేష్, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
● కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన సీపీఐ శ్రేణులు ● అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు సూపర్బజార్(కొత్తగూడెం) : పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని, నిత్యావసరాల ధరలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. నేలపై పడుకొని నిరసన తెలిపారు. తొలుత ప్రధాన రహదారిపై భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు ప్రధాన ద్వారం నుంచి కలెక్టరేట్లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట, వాగ్వాదం నెలకొంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. పేదల పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల పొట్టకొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, సరెడ్డి పుల్లారెడ్డి, కె.సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, చండ్ర నరేంద్ర కుమార్, వి.పూర్ణచందర్ రావు, జి.వీరాస్వామి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, మువ్వా వెంకటేశ్వర్ రావు, భూక్యా దస్రు, యు.రాహుల్, ఎస్కే ఫహీమ్ పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు కన్నయ్యచర్ల : తుది శ్వాస వరకు ప్రజల సమస్యల కోసం పోరాడిన యోధుడు మచ్చా కన్నయ్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు తండ్రి, సీపీఎం చర్ల సీనియర్ నాయకుడు మచ్చా కన్నయ్య ఇటీవల మృతి చెందాడు. బుధవారం చర్లలో కన్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. నయీమ్ ఖురేషీ, కల్లూరి వెంకటేశ్వరరావు, తాతాజీ తదితరులు ఉన్నారు. -
రేపు వర్షం వస్తుంది !
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.నేరుగా వాట్సాప్కు...వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్ఫోన్ వాట్సాప్కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.విత్తనాలు, ఎరువులపై కూడా..వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ఈ ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.రైతులకు ప్రయోజనంఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ఫోన్ ఉంటున్నందున వాట్సాప్కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
విజిలెన్స్ అధికారుల విచారణ
పాల్వంచరూరల్: పాల్వంచ రేంజ్ పరిధిలోని పాండురంగాపురం గ్రామ శివారులో రిజర్వ్ ఫారెస్ట్లో కొట్టిన చెట్లు, అర్బన్పార్కులో జరిగిన అవకతవకలపై ఫారె స్ట్ విజిలెన్స్ డీఎఫ్ఓ శివయ్య, రేంజర్ అఫ్రొజ్ సోమవారం విచారణ చేపట్టారు. మంగళవారం విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ విషయమై రేంజర్ ప్రసాద్ను వివరణ కోరగా.. ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్ఓ పాండురంగాపురం శివారులో విచారణ చేశారని తెలిపారు. గత నెల 30న నారవేప చెట్టు నరకగా, కేసు కూడా నమోదు చేశామని పేర్కొన్నారు. విద్యుత్ మోటార్ చోరీఅశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామం రాళ్లవాగు సమీపంలో రైతు స్వర్గం చంద్ర య్య పొలంలో విద్యుత్ మోటార్ను ఆదివారం రాత్రి చోరీ చేశారు. ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లి చూడగా చోరీ విషయం వెలుగుచూసింది. ఇటీవల ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ మోటార్లు, మోటార్ల వైరు చోరీలతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు చోరీలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య నేలకొండపల్లి: మండలంలోని అజయ్తండాకు చెందిన బానోత్ గోపి(24) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యాన ఆమె వేధింపులు భరించలేక గోపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహిత అదృశ్యంపై కేసు మండలంలోని ఆజయ్తండాకు చెందిన ఓ వివాహిత కానరావడం లేదని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కార్మిక సమస్యలను విస్మరిస్తున్న నవ లిమిటెడ్
పాల్వంచ: నవ లిమిటెడ్ సంస్థ కార్మిక సమస్యలను పూర్తిగా విస్మరిస్తోందని, సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, సీఐటీయు సీనియర్ నాయకుడు ఎంవీ అప్పారావు డిమాండ్ చేశారు. సోమవారం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నవలిమిటెడ్ సంస్థ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కర్మాగారంలో అనేక విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులు 5 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నా యాజమాన్యం కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్మికులకు పని భద్రత, బీమా సౌకర్యం, గ్రాట్యూ టీ లేవని, తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవభారత్లో మహిళా ఉద్యోగుల నియామకాలు లేవని, ఫెర్రో ఎల్లాయిస్లో 12/3 అగ్రిమెంట్ ప్రకారం 55 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా, 47 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దొడ్డా రవికుమార్, పి.తులసీరాం, కె.సత్య, వి.సత్యవాణి, వింజా రాములు, ఎస్కె.నిరంజన్, బి.కాంతి, గోపాల్, సుధీర్, సురేష్, యాకోబు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
దమ్మపేట/అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట, పట్వారిగూడెం, మొద్దులగూడెం, నాయుడుపేట గ్రామాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం, బీటీ రోడ్లకు శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అశ్వారావుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయడంతోపాటు పబ్లిక్ అర్బన్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టనున్నారు. కాగా, మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తెలిపారు. ముత్తంగి అలంకరణలో రామయ్యభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సికిల్ సెల్ అనీమియా కేసులను గుర్తించాలిచుంచుపల్లి: జిల్లాలో సికిల్ సెల్ అనీమియా, హైపోతలసేమియా కేసులను గుర్తించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సికిల్ సెల్ అనీమియా, హైపోథలసేమియా నియంత్రణలపై సోమవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల గుర్తింపు, నివారణపై దృష్టి సారించాలని సూచించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం గర్భిణులకు, వారి భర్తలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇద్దరికీ పాజిటివ్గా తేలితే గర్భస్థ శిశువుకు కూడా తగిన పరీక్షలు చేయాలన్నారు. పుట్టిన బిడ్డకు 48 గంటల తర్వాత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామవరం యూపీహెచ్సీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ తుకా రాం రాథోడ్, ఇతర అధికారులు ప్రతాప్, రాకేష్, హరీష్, దినేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు. ప్రతీ న్యాయమైన సమస్య పరిష్కరిస్తాం ఖమ్మంరూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చివరి ప్రజాదర్బార్ జరగగా 3,500 దరఖాస్తులకు వచ్చాయని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశామని చెప్పారు. మొత్తం ప్రజా దర్బార్లలో అందిన 21,536 దరఖాస్తుల్లో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. ఇక పెన్షన్ల కోసం 4,700, భూ సమస్యలకు 4వేలు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి కూలీ.. కుమారుడు డెలివరీ బాయ్
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల వెల్లడైన బీపీఈడీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఖమ్మంకు చెందిన రామడుగు నరేందర్ రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన జాతీయస్థాయిలో బాస్కెట్బాల్, నెట్బాల్ క్రీడల్లో రాణించడమే కాక యూనివర్సిటీ స్థాయి బాస్కెట్బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తూనే నరేందర్కు క్రీడలపై ఉన్న ఆసక్తి దృష్ట్యా శిక్షణ ఇప్పించాడు. మరోపక్క నరేందర్ సైతం వివిధ సంస్థల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే చదువుకుని బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంక్ సాధించడంపై నెట్బాల్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి పీ.వీ.రమణ, తదితరులు అభినందించారు.బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్ర ఐదో ర్యాంక్ -
నేను రాసిన కథ
అతి నమ్మకం అనర్థంసత్తుపల్లి టౌన్: సిరిపురం గ్రామంలో గౌతమ్ అనే విద్యార్థి ఉండేవాడు. ఏ పనినైనా ఇట్టే చేసేయగలనని ఆయనకు అతి నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకంతోనే ఎందులోనూ రాణించలేకపోయేవాడు. ఒకరోజు గౌతమ్ వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు వారం రోజుల్లో రామాపురం అనే గ్రామంలో ఆటలు పోటీలు ఉన్నాయి. అందరూ బాగా సాధన చేయండి అని సూచించాడు. మిగతా పిల్లలందరూ సార్ చెప్పినట్టుగా సాధన చేయసాగారు. కానీ గౌతమ్ మాత్రం తనకు అన్నీ వచ్చనే అతి నమ్మకంతో ఉన్నాడు. సైకిల్ తొక్కుతూ రోడ్లమీద తిరుగుతూ వృథాగా కాలక్షేపం చేయసాగాడు. అటు ఉపాధ్యాయుడు, ఇటు స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. ఇంతలో పోటీల రోజు రానే వచ్చింది. అందరూ రామాపురం వెళ్లారు. అందరూ దూరం కావడంతో.. రామాపురంలో జరిగిన పోటీల్లో మొదటి రెండు ఆటల్లో గౌతమ్ను తీసుకోలేదు. మూడో ఆటలో ఆయనను తీసుకున్నా ఆయన ఆటతీరు సరిగ్గా లేక ఓడిపోయారు. దీంతో స్నేహితులంతా గౌతమ్ వల్లే ఓడిపోయామని తిట్టారు. సార్ కూడా కోపడ్డాడు. దీంతో ఆయన బాధపడుతూ సైకిల్ మీద ఇంటికి బయలు దేరాడు. అదే విషయం ఆలోచిస్తూ వెళ్తుండడంతో సైకిల్తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా కాళ్లు, చేతులకి బాగా దెబ్బలు తగిలాయి. చుట్టుపక్కల వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కొన్నాళ్లపాటు పాఠశాల, స్నేహితులకు దూరమయ్యాడు. అప్పుడు గౌతమ్ ‘అతి నమ్మకం వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది’అని తెలుసుకుఇ బాధపడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత పాఠశాలకు వెళ్లిన గౌతమ్ వ్యాయామ ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి ‘నేను మళ్లీ ఆటలు ఆడుతాను సార్. ఇప్పటినుంచి బాగా సాధన చేస్తాను. మీరు చెప్పినట్లు నడుచుకుంటాను’అని చెప్పాడు. అందుకు అనుగుణంగానే బాగా సాధన చేసి మంచి క్రీడాకారుడుగా ఎదిగాడు.నీతి : నమ్మకం ఉండడం తప్పు కాదు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అతి నమ్మకం అహంకారానికి, ఆ అహంకారం పతనానికి దారి తీస్తుంది. -
బొమ్మలు గీయడంలో దిట్ట!
అశ్వారావుపేటరూరల్: వేసవి సెలవులను వృథా చేయకుండా స్వతహాగా ఉన్న ఆసక్తితో బొమ్మలు గీస్తూ ప్రతిభ చాటుతోంది ఓ విద్యార్థిని. అశ్వారావుపేట బీఎస్ఆర్ నగర్కు చెందిన కృష్ణారెడ్డి – తిరుపతమ్మ దంపతుల కుమార్తె లక్కిరెడ్డి ఏశ్విత సాయి రోషిణిశ్రీ 9వ తరగతి పూర్తి చేసింది. కొంతకాలంగా చదువుతో పాటు బొమ్మలు గీయడంలో కుడా ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీంతో తక్కువ రోజుల్లోనే వందల సంఖ్యలో బొమ్మలు గీసింది. చిత్రకళలో రాణించాలంటే కొద్దోగొప్పో శిక్షణ అవసరం. కానీ ఏశ్విత సాయిరోషిణిశ్రీ మాత్రం ఎలాంటి శిక్షణ లేకుండానే అందమైన బొమ్మలను చకచకా వేస్తోంది. పెన్సిల్, వాటర్ కలర్లు, పెన్నులతో జాతీయ నాయకులు, గ్రామీణ మహిళలు, గ్రామీణ ప్రకృతి అందాలు, సామాజిక అంశాలు, రాజకీయ నాయకులు, దేవుళ్లు, సినీ నటుల చిత్రాలను గీస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు లీఫ్ ఆర్ట్స్, పేపర్ ఆర్ట్స్ సైతం అద్భుతంగా చేస్తోంది. ఆమె గీసిన బొమ్మలకు సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల అభినందనలు అందుతున్నాయి. -
‘నీట్’కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పునర్పరీక్షను సజావుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న నిర్వహించే పరీక్షకు జిల్లాలో 1,128 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలన్నా రు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా, జవాబు పత్రాల భద్రతకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామని చెప్పారు. అభ్యర్థులు, తల్లిదండ్రులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. డీఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, డి సెక్షన్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, తహసీల్దార్లు పుల్లారావు, దారా ప్రసాద్, పరీక్షా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. మణుగూరు మున్సిపాలిటీలో నక్ష సర్వే..నక్ష పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపికై న మణుగూరు మున్సిపాలిటీలో సర్వే, రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ అంకిత్ అన్నారు. భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వమించారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ద్వారా ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. మణుగూరు మున్సిపాలిటీలో సుమారు 7,524 ఆస్తులను గుర్తించామని, ఇప్పటికే 5,064 ఆస్తుల సర్వే పూర్తయిందని వివరించారు. 2,074 ఆస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఏడీ సర్వే శ్రీనివాస్, మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
డిప్యూటేషన్ కఠినతరం!
3 వేల మందికి పైగా సింగరేణిలో క్రమపద్ధతి లేకుండా ఇష్టారీతిగా అమలవుతున్న డిప్యూటేషన్లపై స్టేట్ ఆడిట్ కమిటీ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరోవైపు భూగర్భ గనుల్లో పని చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడి కఠిన పరిస్థితుల మధ్య డ్యూటీలు చేస్తున్నారు. రాజకీయ పలుకుడి ఉన్న వారు ఇలా ఉద్యోగంలో చేరి అలా సర్ఫేస్లో లైట్ జాబ్స్కు మళ్లడం సైతం ఉద్యోగులు/కార్మికుల్లో అసంతృప్తికి కారణమవుతున్న వైనాన్ని సైతం సంస్థ గుర్తించింది. ప్రస్తుతం సింగరేణిలో మూడు వేల మంది కార్మికులు/ఉద్యోగులు డిప్యూటేషన్ల పేరుతో లైట్ జాబ్లలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 600 మందికి పైగా కనీసం టైం ఫ్రేమ్ లేకుండా లైట్ జాబ్లలో ఉన్నట్టుగా సంస్థ గుర్తించింది. దీంతో డిప్యూటేషన్ల క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి యాజమాన్యం వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు డిప్యూటేషన్ల విషయంలో కచ్చితమైన నిబంధనలతో కూడిన సర్క్యులర్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇకపై ఆరు నెలలే.. సింగరేణి సంస్థ పరిధిలో ఒకే ఏరియా పరిధిలో, వివిధ ఏరియాల మధ్య , సంస్థకు ఆవల ఇలా మూడు పద్ధతుల్లో డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. వీటికి నిర్ణీత కాల పరిమితి కూడా లేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాబోయే మార్పుల్లో భాగంగా.. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఒకే ఏరియా పరిధిలో డిప్యూటేషన్ ఇచ్చే అధికారం ఆ ఏరియా జనరల్ మేనేజర్కు ఉంటుంది. అయితే, ఇది ఆరు నెలలకు మించి ఉండకూడదు. ఆరు నెలల సమయం మించితే, కార్పొరేట్ కార్యాలయంలో డైరెకర్ట్ పా నుంచి అనుమతి తీసుకునేలా మార్పులు చేశారు. ఇక సంస్థ పరిధిలో వివిధ ఏరియాల మధ్య డిప్యూటేషన్లు జరగాలంటే డైరెక్టర్ పా అనుమతి ఉండాల్సిందే. ఈ డిప్యూటేషన్ల కనిష్ట గడువు ఆరు నెలలు ఉండగా, గరిష్ట పరిమితి ఏడాది వరకే అనే విధంగా నిబంధనలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక సంస్థ ఆవల డిప్యూటేషన్ కావాలంటే సీఎండీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సింగరేణిలో ఉన్నత స్థాయిలో సుమారు వంద మందికి పైగా ఉద్యోగులు డిప్యూటేషన్ల పేరుతో హైదరాబాద్లో పని చేస్తున్నట్టుగా ఆడిట్ లెక్కలు చెబుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే లెక్కాపత్రం లేకుండా కొనసాగుతున్న డిప్యూటేషన్లకు చెక్ పడే అవకాశం ఉంది. సంస్థలో కార్మికులు/ఉద్యోగులకు జీతభత్యాలతోపాటు అదనంగా అందించే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్, లాభాల బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.అస్తవ్యస్తంగా మారిన డిప్యూటేషన్లపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. రాజకీయ అండదండలు, ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని డిప్యూటేషన్ ద్వారా తేలికపాటి జాబ్లలో కొనసాగే ఉద్యోగులు/కార్మికుల విషయంలో చూసీ చూడకుండా ఉండబోమనే సంకేతాలు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైనట్టు సమాచారం. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటే భూగ ర్భ గనుల్లోకి దిగి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పని చేయాల్సి ఉండేది. లాంగ్వాల్, ఎస్డీఎల్, కంట్యిన్యూస్ మైనర్ తదితర ఆధునిక యంత్రాలు వచ్చాక భూగర్భ గనుల్లో సైతం బొగ్గు వెలికితీత సులభంగా మారింది. ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం బ్లాస్టింగులు, తట్టా, చెమ్మాస్, లాడీస్ ఇలా అన్ని పనుల్లో కార్మికులు ఎంతో చెమటోడ్చితే కానీ బొగ్గు బయటకు వచ్చేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా కొత్తగా సంస్థలోకి వస్తున్న ఉద్యోగులు/కార్మికుల్లో చాలా మంది భూగర్భ గనుల్లో పనులకు సుముఖంగా లేరు. మెడికల్ బోర్డు ద్వారా సింగరేణిలో ఉద్యోగం పొందిన వారు, ప్రొబేషనరీ పీరియడ్ ముగిశాక భూగర్భ గనుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. తమకు తెలిసిన ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు మొదలుపెడుతున్నారు. ఫలితంగా సర్ఫేస్ (ఉపరితలం) విభాగంలో ఉద్యోగులు/కార్మికుల సంఖ్య అవసరానికి మించి ఉంది. -
ఫలప్రదం
‘ఉపాధి హామీ’ ద్వారా పండ్ల తోటల సాగు ● రైతులకు మొక్కలు, ఎరువుల సరఫరా, ఇతర ఖర్చులు చెల్లింపు ● జాబ్ కార్డు ఉన్న వారందరూ అర్హులే ● ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు లక్ష్యంరైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపునకు మళ్లించడమే కాక వారి ఆదాయం, జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం అందించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన పంటల సాగుకు ఊతమివ్వాలని నిర్ణయించింది. ఉపాధి పథకంలో జాబ్కార్డులు కలిగి, ఐదెకరాల లోపు భూమి ఉన్న వారు ఉన్న రైతులను అర్హులుగా నిర్దేశించారు. ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఈ ఏడాది పండ్ల తోటల పెంపకం చేపట్టేలా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంపండ్ల తోటలకు ఊతం పండ్ల తోటలు సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద సాయం అందించనుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల ఆధ్వర్యాన నిర్వహించే పథకానికి జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. గ్రామపంచాయతీల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి భూవిస్తీర్ణంలో 20 శాతం మేర మొక్కల పెంపకం, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సహించనున్నారు. మండలానికి 50 ఎకరాలు ప్రస్తుత వానాకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతీ మండలంలో 50 ఎకరాలకు తక్కువ కాకుండా పంటల సాగు చేయించాలని నిర్దేశించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం జాబ్కార్డులు ఉన్న సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందిస్తారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు ఈ పంటల సాగుపై ఆసక్తి చూపుతుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో రానున్న ఏడాది మరింత మంది ఆసక్తి చూపుతారనే భావన వ్యక్తమవుతోంది. మూడేళ్లపాటు ఆసరా ఐదెకరాల లోపు వ్యవసాయ భూములు కలిగిన ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వర్గాల రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, మామిడి, జీడిమామిడి, వెదురు, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్, సపోటా, బత్తాయి, అల్లనేరేడు మొక్కలను అధికారులే పంపిణీ చేస్తారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు చేయూత ఇవ్వనుంది. మట్టి నమూనా సేకరణ, పరీక్ష, మొక్కలు నాటేలా గుంతలు తీయడం, నాటడం, వంగిపోకుండా కర్రలు కట్టడం, సంరక్షణ, ఎరువులు తదితర ఖర్చులన్నీ ప్రభుత్వమే అందిస్తుంది. డిమాండ్ ఆధారంగా.. సీజన్ వారీగా లభించే పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇవి జిల్లాలో లభ్యత లేక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసకుంటున్నారు. ఈనేపథ్యాన ఉపాధి హమీ పథకం కింద ప్రోత్సహించనుండడంతో జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. తద్వారా రైతులకు దీర్ఘకాల జీవనోపాధి, సుస్థిర ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన పండ్లు చౌక ధరలో లభిస్తాయి. జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటలను సాగు చేసేలా ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం అందిస్తాం. అవసరమైన మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చు, మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు కూడా అందుతాయి. ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేయిస్తాం. జాబ్కార్డు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటల సాగుకు దరఖాస్తు చేసుకుంటే జిల్లాకు కేటాయించిన లక్ష్యం ఆధారంగా అవకాశం కల్పిస్తాం. – కొండపల్లి శ్రీరామ్, ఖమ్మం డీఆర్డీఓ -
కాంప్లెక్స్ ఎరువుల ధర తగ్గించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, యూరియా యాప్ను తొలగించాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ముద్దా భిక్షం, బుర్ర వెంకన్న, కంగాల కల్లయ్య, బానోత్ ధర్మ, ఈసం శంకర్, గొగ్గల వెంకటేశ్వర్లు, శ్రీరామ్ కోటయ్య, బైరు వెంకన్న, జూకంటి గాంధీ, నాయిని రాజు పాల్గొన్నారు. -
స్కూటీ, లారీ ఢీ
ఇద్దరు యువతులకు తీవ్రగాయాలు బూర్గంపాడు: మండల పరిధిలోని మర్రికుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులకు తీవ్రగాయాలయ్యాయి. మర్రికుంట నుంచి పాల్వంచ వైపు స్కూటీపై వెళ్తున్న పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన వైష్ణవి, శ్రీవల్లిని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీవల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైష్ణవి, శ్రీవల్లిలు మర్రికుంట గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 మెట్రిక్ టన్నుల చేపలు మృతిజూలూరుపాడు: మండలంలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ దండేల చెరువులో సోమవారం సుమారు 5 మెట్రిక్ టన్నుల చేపలు మృతి చెందాయి. ఎండ తీవ్రతతో చెరువులో నీటి నిల్వ తగ్గి, నీటిలో ఆక్సిజన్ కొరతతో చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్య సహకారం సంఘం సభ్యులు తెలిపారు. సుమారు రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా చేపల పెంపకం చేపట్టామని, మృగశిర కార్తె సందర్భంగా చేపల అమ్ముకోవచ్చని భావించామని, సోమవారం ఉదయం చెరువు వద్దకు రాగానే చేపలు చనిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా, మృతి చెందిన చేపలతో చెరువు కలుషితం కాకుండా జేసీబీతో గొయ్యి తవ్వించి పూడ్చివేసినట్లు సర్పంచ్ లావుడ్యా ద్వాలీ తెలిపారు. -
సామాజిక బహిష్కరణకు గురయ్యాం
న్యాయం చేయాలని బాధితుల వినతి టేకులపల్లి: టేకులపల్లి గ్రామపంచాయతీ మూడ్ తండాకు చెందిన మూడ్ వస్రాం (65) కుటుంబా న్ని తండా పెద్దలు సామాజిక, కుల బహిష్కరణ చేశారు. ఈ మేరకు బాధితుడు సోమవారం టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథ నం ప్రకారం... ఇటీవల తండాలో తన పిన్ని మూడ్ హీమిలి మృతిచెందగా తండా సంప్రదా యం ప్రకారం నిర్వహించే కార్యక్రమాలకు తమ కుటుంబానికి సమాచారం ఇవ్వలేదన్నారు. చేతబడి నెపంతో తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తూ, శుభకార్యాలకు కూడా రాకూడదని ఆంక్షలు విధించారని తెలిపారు. తండా నాయకుడు, అతని కుమారుడు తమ స్థలంలో అక్రమంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారని ఆరోపించా రు. సామాజిక బహిష్కరణ కారణంగా తమ ఇంట్లో చిన్నపిల్లలతో కూడా ఎవరూ మాట్లాడటం లేదని, కనీసం ఆడుకోవడానికి కూడా పిల్లలను రానివ్వకుండా కన్నీరుమున్నీరయ్యాడు. చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని టేకులపల్లి పోలీసులను వేడుకున్నాడు. పురాతత్వ శాఖతో డిగ్రీ కళాశాల ఒప్పందం పాల్వంచరూరల్: చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ, భావితరాలకు చరిత్రపై అవగాహన పెంపొందించేందుకు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పురాతత్వశాఖతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సోమవారం పురాతత్వశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ పి.పద్మ, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ వేముల కామేశ్వరరావు ఒప్పందంపై సంతకాలు చేశారు. హిందీ భాష అభివృద్ధిపై దృష్టి గిరిజన విద్యార్థుల్లో హిందీ భాష అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ బి.సుధాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం ఆయన సందర్శించి, మొక్కలు నాటి మాట్లాడారు. అధికారులు నాగరాజు, రాజు, మల్లికార్జున్, అరుణకుమారి, మాధవి పాల్గొన్నారు.పేకాట శిబిరంపై దాడిదమ్మపేట: రంగువారిగూడెం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. తొమ్మిది మంది పేకా టరాయుళ్లను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. మూడు బైక్లు, రూ, 9,530 నగదు స్వ్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. భూ వివాదంలో వ్యక్తికి గాయాలుసుజాతనగర్: భూ వివాదంలో ఓ వ్యక్తి గాయపడిన సంఘటన మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సుజాతనగర్ రెవెన్యూ లక్ష్మీదేవిపల్లిలో వ్యవసాయ భూమికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం సాగుతోంది. ఈ క్రమంలో చుంచుపల్లికి చెందిన మూడ్ భీముడు పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా, చిట్టిరామవరానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గాయాలు కాగా చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యాప్ ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు
సూపర్బజార్(కొత్తగూడెం):నిరుద్యోగులను ఉద్యో గస్తులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొందించిన Rakesh Reddy E& Classes యాప్ను సోమవారం కొత్తగూడెం క్లబ్లో ఎంపీవద్దిరాజు రవిచంద్ర ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేసీఆర్ పదేళ్ల కాలంలో సుమారు 1.67లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగాల ఊసెత్తడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం నిరుద్యోగుల పక్షాన పోరాడటమే కాకుండా వారి ప్రిపరేషన్లో కూడా తోడుగా ఉంటుందన్నా రు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 2న ఉద్యోగ ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఆశిస్తే.. నిరాశే ఎదురైందన్నారు. ఒక్క ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి, రెండున్నరేళ్ల తర్వాత 5వేల ఉద్యోగాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వ ర్లు, నాయకులు దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, కిలారు నాగేశ్వరరావు, మానే రామకృష్ణ, వన మా రాఘవేందర్, అనుదీప్, జలీల్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అక్కడే స్థల పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్తో సోమవారం ఖమ్మంలో భూదాన్ బాధితుల నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ బాధితుల సమస్యలను రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉత్తరాల ద్వారా తెలియజేశామని చెప్పారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారికి 100 గజాల స్థలంలో తిరిగి ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. బాధితుల పోరాటానికి అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వంజాకుల లక్ష్మీనారాయణ, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ కేవీ.కృష్ణారావుతో పాటు వట్టే ఉదయ్కిరణ్, మట్టే నవ్య, సుమలత, రామకృష్ణ, కృష్ణ, రాము పాల్గొన్నారు.వెలుగుమట్ల బాధితుల ర్యాలీ -
ఆయిల్పామ్ ధర జోరు..
అశ్వారావుపేటరూరల్: పెరుగుతున్న పామాయిల్ గెలల ధర రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. గత నెలలో టన్ను ధర రూ.23,501కు చేరుకోగా, ఈ నెలలో రూ.23,852కు పెరిగింది. టన్నుకు తాజాగా మరో రూ.351 పెరిగి ఆయిల్ఫెడ్ చరిత్రలోనే ఆల్టైం రికార్డు సృష్టించింది. అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటైన తర్వాత అత్యధిక ధర ఇదే కావ డం విశేషం. కరోనా సమయం, 2022వ సంవత్సరంలో అత్యధికంగా టన్నుకు రూ.23,467 గరిష్టంగా నమోదైంది. కరోనా సమయం తర్వాత మళ్లీ ఈ ఏడాదిలోనే రూ.23వేల మార్క్ దాటింది. దీంతో ఆయిల్పామ్ సాగుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త ఏడాది ఆరంభం నుంచే ధరలో పెరుగుదల కనిపించగా, ఆరు నెలలుగా పెరుగుతూనే ఉంది. దీంతో మరికొందరు రైతులు పామాయిల్ తోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కౌలుదారులపై భారమే.. ఆయిల్పామ్ తోటలను కౌలు తీసుకుని సాగు చేసే రైతులపై ధరల భారం పడుతోంది. గతేడాది ఎక రం ఆయిల్పామ్ తోట కౌలు రూ.45 వేల నుంచి అత్యధికంగా రూ.70 వేలుగా ఉంది. ఈ ఏడాది పామాయిల్ గెలల టన్ను ధర పెరుగుదల, ధర తగ్గకపోవడంతో సాగుదారులు ఒకేసారి కౌలు ధరలు పెంచేశారు. గడిచిన కొద్ది నెలలుగా జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎకరం కౌలు ఏకంగా రూ.లక్ష దాటింది. జిల్లాలోని మిగి లిన ప్రాంతాల్లో ఎకరం కౌలు ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉండగా, ఈ రెండు మండలాల్లోనే కౌలు ధర ఆందోళన కలిగిస్తోంది. భారీగా పెరిగిన కౌలు ధరలతో చిన్న, సన్నకారు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల ధర జనవరి 19,694ఫిబ్రవరి 20,456మార్చి 21,546ఏప్రిల్ 23,005మే 23,501జూన్ 23,852 -
కొమరయ్య సేవలు చిరస్మరణీయం
రుద్రంపూర్: సింగరేణి కార్మిక లోకానికి మనుబోతుల కొమరయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి మనుబోతుల కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బొగ్గు గనుల్లో ఎని మిది గంటల పని విధానాన్ని సాధించిన ఘనత కొమరయ్యదేనని గుర్తుచేశారు. భూగర్భ గనుల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే మహిళా కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించటంలో కీలక పాత్ర పోషించారని, పదేళ్లలోపు పిల్లలతో పనులు చేయించే అమానవీయ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, బొగ్గు గనుల్లో బాలకార్మిక వ్యవస్థకు ఆనాడే స్వస్తి పలికించారని గుర్తుచేశారు. కొమరయ్య ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, యూనియన్ నాయకులు రాజ్కుమార్, మిరి యాల రంగయ్య, వంగా వెంకట్, జీ.వీరస్వామి, రమణమూర్తి, మల్లికార్జున్రావు, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, కొమరయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కూనంనేని -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ వనమా కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి తమకు ఇంటి నిర్మాణ స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్కు ఎండార్స్ చేశారు. ● ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న కొండపల్లి ఉమ తన కుమెర్తా అనారోగ్యం కారణంగా గురుకుల కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరు కాలేకపోయిందని, తమ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని సీటు కేటాయించాలని కోరుతూ చేసిన దరఖాస్తును ఆర్సీఓకు ఎండార్స్ చేశారు. ● దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం ఆదివాసీ రైతులు 116 మంది తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న సుమారు 250 ఎకరాల భూమికి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేయగా, దుమ్ముగూడెం తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. ● అశ్వాపురం మండలానికి చెందిన కోడి నాగరాజు రోడ్డు ప్రమాదంలో ఎడమ చేయిని కోల్పోయానని, డిగ్రీ చదివిన తనకు ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పించాలని కోరగా, జిల్లా ఉపాధి కల్ప నాధికారికి ఎండార్స్ చేశారు. ● కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీఓ మధుకు పది మంది అర్జీలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దర్బార్కు రావొద్దుభద్రాచలం: గిరిజన దర్బార్లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించొద్దని, కేవలం స్వయం ఉపాధి పథకాలకు మాత్రమే అందజేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ అన్నా రు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరి జన దర్బార్లో ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఆనంద్ కుమార్, మధుకర్, రాంబాబు, వేణు, ఉదయ్కుమార్, గన్యా, మణిధర్ పాల్గొన్నారు.ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలు మూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిట లా డింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులు అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజా వాణి నిర్వహించనున్నట్లు వివరించారు. కిన్నెరసానిలో బోటు షికారుపాల్వంచరూరల్: కిన్నెరసాని రిజర్వాయర్లో పర్యాటకులు జలవిహారం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు కిన్నెరసానికి తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. 575 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.30,240 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.14,710 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. సురక్షితమైన ఆహారం అందించాలిసూపర్బజార్(కొత్తగూడెం): అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సురక్షిత ఆహారం అందించాలని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో జిల్లా ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆహార భద్రత శిక్షణ, ధ్రువీకరణ కార్యక్రమం నిర్వహించారు. 300 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొనగా, డీఎంహెచ్ఓ మాట్లాడుతూ సురక్షితమైన ఆరోగ్యం ప్రధాన ఉద్దేశంగా ఉండాలన్నారు. జిల్లాలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్ తెలిపారు. అనంతరం ఆహార భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఎండోమెంట్ ఇన్చార్జి డీఈగా రవీందర్భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈఈగా పనిచేస్తున్న వేగేశ్న రవీందర్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ డీఈ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా రవీందర్ ఇక నుంచి ఇన్చార్జి డీఈగా విధులు నిర్వర్తించనున్నారు. -
కార్మికులపై చిన్నచూపు తగదు
కొత్తగూడెంఅర్బన్: సంస్థ మనుగడకు కారణమైన కార్మికులను సింగరేణి యాజమాన్యం చిన్న చూపు చూడటం తగదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ఆర్సీఓఏ క్లబ్లో ఆదివా రం నిర్వహించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కౌన్సిల్ సమావేశం తొలి రోజు కార్యక్రమంలో మాట్లాడారు. ఇకనైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవా లని, సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు తప్పవని అన్నారు. కార్మిక హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావా ల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని, నిలిచిపోయిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, క్లర్క్ పోస్టుల భర్తీ, డిస్మిస్ అయిన కార్మికులకు ప్రత్యేక అవకాశం కల్పించడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతా రామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ ఆదాయపు పన్నును యాజ మాన్యమే భరించాలని, స్టక్చ్రర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూని యన్ మాజీ ప్రధాన కార్యదర్శి మనుబోతుల (యూనియన్) కొమురయ్య కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగా వెంకట్, వీరస్వామి పాల్గొన్నారు. -
బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు
కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) ఎంట్రన్స్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఎం.శిరీష రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించగా, డి.ఉమ 243, బి.అఖిల 396, పి.ఇందు 447, టి.ప్రమీల 592, కె.సౌమ్య 1,013వ ర్యాంకు సాధించింది. ఆయా విద్యార్థినులను ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ బి.రాజేశ్వరి, పీడీ బి.రమ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్ కే.పీ.ఐశ్వర్య, దీప్తి, ఎం.నవ్య అభినందించారు. -
బట్ట సంచి... ప్లాస్టిక్ కవర్ !
కరకగూడెం: ఒక గ్రామంలోని కిరాణా దుకాణంలో బట్ట సంచి, ప్లాస్టిక్ కవర్ పక్కపక్కనే ఉండేవి. ప్లాస్టిక్ కవర్ తన మెరుపును చూసుకుని గర్వపడేది. ‘నన్ను చూడు... తేలికగా ఉంటాను. అందరూ నన్నే తీసుకెళ్తారు. నువ్వు మాత్రం పాతకాలం వస్తువులా కనిపిస్తున్నావు’అని బట్ట సంచిని ఎగతాళి చేసేది. అందుకు బదులుగా బట్ట సంచి ‘సరైన సమయంలో వస్తువుల విలువ తెలుస్తుంది’అనేది. కాలక్రమంలో అవసరం తీరాక ప్లాస్టిక్ కవర్లను రోడ్ల వెంట, డ్రెయినేజీల్లో వేస్తుండడంతో కుప్పలు పేరుకుపోయాయి. ఓ రోజు భారీ వర్షం కురిసింది. గ్రామంలోని డ్రెయినేజీలు ప్లాస్టిక్ కవర్లతో నిండడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో గ్రామస్తులు ఇబ్బంది పడగా గ్రామ పెద్దలు సమావేశమై ‘ఈ ఇబ్బందికి కారణమైన ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలి’అని నిర్ణయించారు. మరుసటి రోజు నుంచి గ్రామంలో ప్రతిఒక్కరూ బట్ట సంచి ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమంలో గ్రామం పరిశుభ్రంగా మారింది. కాల్వలు శుభ్రంగా ఉండడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లేది. అప్పుడు ప్లాస్టిక్ కవర్ ఒకసారి మాత్రమే ఉపయోగపడతాను. తర్వాత ప్రకృతికి భారంగా మారతాను.. కానీ నువ్వు ఎన్నోసార్లు ఉపయోగపడుతూ ప్రకృతిని కాపాడుతున్నావు. నిజంగా నువ్వే గొప్పదానివి’అని బట్ట సంచితో చెప్పింది. అందుకు బట్ట సంచి నవ్వుతూ ‘గొప్పతనం బయట కనిపించే అందంలో కాదు. ఇతరులు, ప్రకృతికి ఉపయోగపడడంలో ఉంటుంది’అని చెప్పింది. ఆ మాటలు విన్న కవర్ తన తప్పు తెలుసుకుంది.నీతి: తాత్కాలిక సౌకర్యం కంటే ప్రకృతిని కాపాడే అలవాట్లే గొప్పవి. చిన్నచిన్న మార్పులే పర్యావరణాన్ని రక్షిస్తాయి. -
ఈ ఇల్లు మాది కాదు..
బూర్గంపాడు: మణుగూరు పట్టణంలో త్రిబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి ‘ఈ ఇల్లు మాది కాదు, మాకు బైక్ లేదు, కారు లేదు’అని జనగణనకు వచ్చిన ఎన్యూమరేటర్లకు తెలిపారు. ఆ ఇంట్లో ఉంటున్నది ఆ కుటుంబం మాత్రమే. అయితే ఆ ఇంట్లో కారు ఉంది, బైక్ ఉంది. అవి మావి కావని జనగణనకు వచ్చిన వారికి సమాచారమిచ్చారు. ఇంట్లో ఉన్న కారు, బైక్ వేరేవాళ్లవని సమాచారమివ్వటంతో ఎన్యుమరేటర్లు విస్తుపోయారు. వారు చెప్పిన సమాచారాన్నే ఎన్యుమరేటర్లు నమోదు చేసుకున్నారు. అంతా తప్పుడు సమాచారం? బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన 20 ఎకరాల ఆసామికి ట్రాక్టర్, కారు ఉన్నాయి. అయితే ఎన్యూమరేటర్లకు మాత్రం తనకు బైక్ తప్ప ఇతర వాహనాలు ఏమి లేవని సమాచారమిచ్చా రు. తండ్రి, కొడుకు కలిసి ఉంటున్న ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నామని రెండు కుటుంబాల వివరాలను వేర్వేరుగా నమోదు చేయించారు. సారపాక పట్టణంలో ఉంటున్న ఐటీసీ పర్మనెంట్ కార్మికుడు తనకు ఇల్లు లేదని, అద్దె ఇంట్లో ఉంటున్నామని, కనీసం గ్యాస్ కనెక్షన్ కూడా లేదని ఎన్యూమరేటర్లకు తప్పుడు సమాచారమిచ్చారు. వాస్తవానికి ఆ ఇల్లు అతనిదేనని, తనకు ఇటీవలే వచ్చిన రేషన్కార్డు రద్దవుతందనే భయంతోనే తప్పుడు సమాచారమిచ్చాడని తెలుస్తోంది. పథకాలు రద్దవుతాయనే.. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభు త్వం జనగణన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే జనగణన చేస్తున్న ఎన్యుమరేటర్లు మాత్రం ప్రజల నుంచి వస్తున్న సమాధానాలతో విస్తుపోతున్నారు. పక్కా బిల్డింగ్లో నివాసముంటున్నా అది మాది కాదని, కారు, బైక్ ఉన్నా అవి మావి కావని చెబుతున్నారు. కొందరైతే గ్యాస్ కనెక్షన్ కూడా లేదని చెప్పడం గమనార్హం. ఎన్యూమరేటర్లు ప్రభుత్వం తమకు ఇచ్చిన 34 ప్రశ్నలను ప్రతీ ఇంటికి వెళ్లి అడిగి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు వారు చెప్పే సమాధానాలకు పొంతన లేకుండా ఉంటున్నా యి. వాస్తవాలు చెప్పాలని ఎన్యుమరేటర్లు ఎంత మొత్తుకున్నా కొందరు మాత్రం తమకు ప్రభుత్వ పథకాలు దూరమవుతాయనే భయంతో వాస్తవాలను దాచిపెడుతున్నారు. అందులో వాస్తవం లేదు.. పక్కా బిల్డింగ్ ఉందన్నా, కారు, బైక్ ఉందన్నా ప్రభుత్వ పథకాలు దూరమవుతాయనే తప్పుడు ప్రచారంతో కొందరు జనగణనలో తప్పుడు సమాచారమిస్తున్నారు. అధికారులు, ఎన్యుమరేటర్లు వాస్తవాలు చెప్పండని, ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని ఎంత చెప్పినా కొందరు మాత్రం తమకు ఏమి లేవని చెబుతున్నారు. ముఖ్యంగా రేషన్కార్డులు రద్దవుతాయని దీంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలు రావని కొందరిలో భయాందోళనలున్నాయి. రేషన్కార్డు అన్ని ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో దానినికాపాడుకునేందుకు తప్పుడు సమాచారమిస్తున్నట్లు తెలుస్తోంది. బైక్, కారు,ట్రాక్టర్ ఉందంటే పింఛన్లు రద్దవుతాయని, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ రాదనే భ్రమ కొందరిలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణనలో ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మాత్రం పూర్తిస్థాయిలో వాస్తవాలు వెలుగులోకి రావటం లేదనేది వాస్తవం. -
వరిగడ్డి వాము దగ్ధం
మధిర: మండలంలోని నాగవరప్పాడులో ఆదివారం ప్రమాదవశాత్తు పల్లపోతుల నాగరాజుకు చెందిన వరిగడ్డి వాము దగ్ధమైంది. దీంతో రూ.35 వేల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపాడు. కాగా, మంటలు మొదలుకాగానే స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మంటలను అదుపుచేశారు. గోదాం నిర్మాణాన్ని అడ్డుకున్న ఆదివాసీలు ● విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని ఆందోళన కారేపల్లి: మండలంలోని గంగాదేవి గుట్టపై గోదాం నిర్మాణ పనులను గుట్టకింద గుంపు గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ఇక్కడ గోదాం నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్నాయక్ శంకుస్థాపన చేశారు. అయితే, గోదాం నిర్మాణం పేరుతో ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన గంగాదేవి గుట్టను ధ్వంసం చేయడం సరికాదని ఆదివాసీలు చెబుతున్నారు. తమ ఆరాధ్య దైవమైన గంగాదేవి గుట్ట, కాళికాదేవి, సమ్మక్క విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాక గుట్ట మట్టిని తరలించి కాంట్రాక్టర్ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ.. గోదాం నిర్మాణం పేరుతో గుట్టను గుల్ల చేస్తున్నారని, తద్వారా ఆరాధ్య దైవాల విగ్రహాలు విధ్వంసమవుతున్నాయని తెలిపారు. ఇకనైనా గోదాం నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. కాగా, ఆదివాసీల ఆందోళన విషయం తెలిసి ఎస్ఐ గోపి, సిబ్బందితో చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అనడంతో వెనుదిరిగారు. ప్రత్యామ్నాయ పంటలే మేలుఖమ్మంవ్యవసాయం: ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. ఈ విషయమై వ్యవసాయ, జల వనరులు, ఉద్యానవన, భూగర్భ జల వనరుల శాఖల ఆధ్వర్యాన గ్రామా ల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డీఏఓ విడుదల చేసిన ప్రకటనలోని సూచనలు ఇలా ఉన్నాయి. ●వర్షాలు ఆలస్యమైతే వరి సాగు చేసే రైతులు నాటు విధానానికి బదులుగా వెదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచించారు. స్వల్పకాలిక వరి రకాలైన బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, డబ్ల్యూజీఎల్–44, జేజీఎల్–1978, ఎంటీయూ–1010, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా వంటి రకాలు ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ●వర్షాభావ పరిస్థితులతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిన పక్షంలో వాటి స్థానాన పెసర, మినుము, బొబ్బర, కంది, వేరుశనగ వంటి పంటలను సాగు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఏఓ పేర్కొన్నారు. రైతులకు అవసరమైన పెసర విత్తనాలను ఆత్మనిర్భరత మిషన్ పథకం కింద రాయితీపై అందజేస్తామని తెలిపారు. -
ఆర్టీసీపై అ‘ధనం’!
● డీజిల్ ధర పెరుగుదలతో భారం ● రీజియన్పై భారం రోజుకు రూ.4.25 లక్షలు.. ● పొదుపు చర్యల వేళ ధరలతో సతమతం ఖమ్మంమయూరిసెంటర్: సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీపై డీజిల్ ధరల పెంపు పిడుగులా పడింది. ఇప్పటికే రకరకాల భారాలతో సతమతమవుతున్న సంస్థకు ఇటీవల రోజుల వ్యవధిలోనే డీజిల్ ధర లీటర్కు సుమారు రూ.9 మేర పెరగడం కోలుకోలేని దెబ్బతీసింది. ఖమ్మం రీజియన్లో ప్రాంతాల వారీగా రూ.96 నుండి రూ.97 వరకు ఉన్న లీటర్ డీజిల్ ధర ఇప్పుడు రూ.103.41 నుంచి రూ.105.08 వరకు చేరింది. ఫలితంగా ఆర్టీసీ చక్రాలు తిరగడం భారంగా మారింది. కి.మీ.కు రూ.1.51 అదనం ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో ఆర్టీసీ సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు కలిపి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రీజియన్ పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి రోజుకు సగటున 2.82 లక్షల కి.మీ. మేర తిరుగుతున్నాయి. ధరల పెంపుతో కిలోమీటర్పై రూ.1.51 అదనపు భారం పడగా.. సంస్థ రోజువారీ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. నెలకు రూ.1.27 కోట్లు డీజిల్ ధర పెరుగుదలతో ఆర్టీసీ ఖమ్మం రీజియన్పై రోజుకు అదనంగా రూ.4,25,820 వెచ్చించాల్సి వస్తోంది. ఇది నెలకు రూ.1,27,74,600 గా నమోదవుతుందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని డిపోల ఆదాయం అంతంతమాత్రంగానే సాగుతుంటే, మరోవైపు డీజిల్ భారం పడడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే లీటర్పై రూ.9 పెరగడం సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ప్రతీ రూపాయిని పొదుపు చేస్తూ రూట్లను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయాన ఇంధన ధరల పెంపు తమ అంచనాలను తలకిందులు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.ఆర్టీసీ, అద్దె బస్సులు తిరిగే దూరం 2.82 లక్షల కి.మీ. ప్రతీ కిలోమీటర్పై అదనపు భారం రూ.1.51 రోజుకు.. రూ.4,25,820 నెలకు.. రూ.1,27,74,600 -
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలి
మందమర్రిలో కొత్తగూడెం డిపో బస్సు బోల్తా మందమర్రిరూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రి లోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపాన కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 28 జెడ్ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న బస్సు ఓసీపీ సమీపాన అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడం, ఆ సమయాన రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో డ్రైవర్ సీతారామ్, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్కుమార్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరికి స్వల్పగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆపై పట్టణ ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యాన రాకపోకలకు ఇబ్బంది రాకుండా బస్సును పక్కకు తొలగించారు. కాగా, బస్సు డ్రైవర్ సీతారామ్కు అకస్మాత్తుగా బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మోటార్ సైకిల్ దగ్ధం మణుగూరుటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సీఎస్పీ కాంటా వద్ద ఓ మోటార్ సైకిల్కు అకస్మాత్తుగా మంటలంటుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మణుగూరు నుంచి విజయనగరం గ్రామానికి ప్రేమ్కుమార్ తన పల్సర్ బైక్పై వెళ్తున్నాడు. సీఎస్పీ కాంట వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే బైక్ పూర్తిగా దగ్ధమైంది. సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో త్రీఇంకై ్లన్లోని తెలంగాణ క్రీడా మైదానంలో 40 రోజులపాటు కొనసాగిన రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. పరిసర ప్రాంతాలకు చెందిన 50 మంది బాల, బాలికలు ఈ రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ పొందిన బాల, బాలికలకు జిల్లాస్థాయిలో పలు కేటగిరీల్లో రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచినవారికి స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ పతకాలు, సర్టిఫికెట్లు అందజేసి, మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని, క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెదపాటి కాశీహుస్సేన్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో త్రీఇంకై ్లన్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసం ప్రవళ్లిక, ఉప సర్పంచ్ పాల్తీయ లక్ష్మి, జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేశ్, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, గుగులోతు కృష్ణ, బోడ గణేశ్ పలువురు కోచ్లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ -
లోపం ఎక్కడుంది?
హరితహారం వనమహోత్సవంగా.. రాష్ట్రవ్యాప్తంగా అడవులు, పచ్చదనం పెంచే లక్ష్యంతో తెలంగాణ ఏర్పాటు నుంచీ ఏటా వానాకాలంలో లక్షలాది మొక్కలు నాటుతున్నారు. గత ప్రభుత్వం హరితహారం నిర్వహించగా, ప్రస్తుత ప్రభుత్వం అదే కార్యక్రమాన్ని వనమహోత్సవంగా చేపడుతోంది. ఈ ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా 55.40 లక్షల మొక్కలు నాటాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, నాటుతున్న మొక్కలకు బతికి ఉన్న మొక్కలకు మధ్య పొంతన లేదనే విమర్శలు ఆది నుంచి ఉన్నాయి. అందువల్లే హరిత హారం కాస్తా వనమహోత్సవంగా మారింది. పేరు మారింది తప్పా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే తీరు, సంరక్షణలో మార్పులు రాలేదు. ఎక్కడ లోపం జరుగుతోందనే అంశాన్ని తెలుసుకోవాలని గతేడాది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్తగూడెంలో ప్రత్యేకంగా సూచనలు చేశారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి లోపాలు గుర్తించాలి గతేడాది జూలై 27న ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అమలువుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ‘హరిత హారం పేరుతో విరివిగా మొక్కలు నాటామని గత ప్రభుత్వం చెప్పుకుంది. ఇప్పుడు కూడా మీరు వేల సంఖ్యలో మొక్కలు నాటబోతున్నట్టు చెబుతున్నారు. కాగితాల్లో కనిపించే లెక్కలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతనే లేదు. ఉమ్మడి జిల్లాలో ఒక మేజర్ పంచాయతీని యూనిట్గా తీసుకుని పైలట్ ప్రాజెక్ట్గా.. గడిచిన పదేళ్లలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, ఇప్పటి వరకు బతికున్న మొక్కలు తదితర వివరాలు సేకరించాలి. అప్పుడు ఈ కార్యక్రమంలో లోటుపాట్లు తెలుస్తాయి. వచ్చే ఫలితాలను అనుసరించి రాబోయే రోజుల్లో వనమహోత్సవం కార్యక్రమాన్ని లోపరహితంగా అమలు చేయవచ్చు.’అని సూచించారు. ఫారెస్ట్ శాఖతో పాటు రెండు జిల్లాల అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎండలు తగ్గుముఖం పడుతున్నాయి. వానలు నెమ్మదిగా జోరందుకోనున్నాయి. ఈ క్రమంలోనే పచ్చదనం పెంచేందుకు వన మహోత్సవం నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత సమర్థంగా అమలు చేసేలా మార్గ్గదర్శిగా నిలవాల్సిన బాధ్యత భద్రాద్రి జిల్లాపైనే ఉంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంకొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు మూడు భారీ వర్షాలు పడ్డాక వన మహోత్సవం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ క్రమంలో వన మహోత్సవం జరిపేందుకు ఇంకా మూడు, నాలుగు వారాల సమయం ఉంది. ఇప్పటికై నా లోపం ఎక్కడుందో గుర్తించేందుకు డిప్యూటీ సీఎం భట్టి సూచనలకు తగ్గట్టుగా భద్రాద్రి కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాల్సిన అవసరం ఉంది. లోపాలను సవరిస్తే మెరుగైన ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా అడవులు ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడేనికి గుర్తింపు ఉంది. అదే తరహాలో వన మహోత్సవాన్ని మరింత సమర్థంగా అమలు చేసే బాధ్యతను అధికారులు తీసుకోవాల్సి ఉంది. -
డ్రిప్ ఆటోమేషన్తో నీటి పొదుపు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నీటి కొరత, ఎద్దడిని అధిగమించేందుకు, ఉద్యాన పంటల సాగులో అధిక ఉత్పాదకత సాధించేందుకు డ్రిప్ నీటిపారుదల ఆటోమేషన్ సాంకేతికతను ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ పద్ధతి ద్వారా రైతులకు సమయం ఆదా, శ్రమ, ఖర్చును తగ్గించడంతో పాటు పంటల నిర్వహణ సులభతరంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ లేదా కంట్రోలర్ సహాయంతో పంటలకు సాగునీటిని అందించవచ్చు. నిర్ణీత సమయాలలో పంటలకు అవసరమైన మేరకు నీరు అందడం వల్ల నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం వరకు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్యాన శాఖ హెక్టారుకు యూనిట్ ధర రూ.40 వేలుగా నిర్ణయించింది. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 55 శాతం సబ్సిడీతో రూ 22 వేలు, పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడీతో రూ. 18 వేలు రాయితీ లభిస్తుంది. ఆర్కేవీవై, పీడీఎంసీ పథకం ద్వారా సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే డ్రిప్ వ్యవస్థ కలిగిన రైతులు కూడా ఆటోమేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని సబ్సిడీ పొందవచ్చని ఉద్యాన శాఖాధికారులు తెలిపారు.ఉద్యానశాఖ ద్వారా రైతులకు రాయితీ డ్రిప్ ఆటోమేషన్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రాయితీలను వినియోగించుకుని ఆటో మేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని నాణ్యమైన దిగుబడులు పొందాలి. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. –జంగ కిషోర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి -
‘నెట్బాల్’ విజేత హార్విగో హాస్టలర్స్
ఖమ్మంస్పోర్ట్స్: రెండురోజులుగా ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న నెట్బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. టోర్నీలో విజేతగా హార్విగో హాస్టలర్స్ నిలవగా, హార్వెస్ట్ చాలెంజర్స్, ఎవర్ గ్రీన్స్ ప్రాజెక్టు జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సందర్భంగా ఆయా జట్లకు హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్, నెట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఆర్.పార్వతీరెడ్డి ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల జీవితంలో ముఖ్య పాత్ర వహించడమే కాక క్రమశిక్షణ, నాయకత్వ లక్ష ణాలు, ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రాంచైజీల బాధ్యులు డాక్టర్ రవికుమార్, దీప్తి, చల్లపల్లి ఆదిత్య, డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ బాలభాస్కర్, సత్యనారాయణ, నర్సింహారావు, ఫణికుమార్, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ధాన్యం సేకరణ
● యాసంగిలో సన్నాలు ప్రైవేటు మార్కెట్లో విక్రయం ● దొడ్డు రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం ● లక్ష్యం 48 వేల మెట్రిక్ టన్నులు.. సేకరణ 40 వేల ఎంటీ ● 4,724 మంది రైతుల ఖాతాల్లో రూ.88 కోట్లు జమపాల్వంచరూరల్: ప్రభుత్వ పట్టింపులేనితనం, రైతుల అవస్థల మధ్య ధాన్యం సేకరణ పూర్తయింది. యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు ఈ నెల 3వ తేదీతో ముగించారు. రైతులు సన్నరకం ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు, దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. జిల్లాలో 89 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, లక్షా 87 వేల మెట్రిక్ టన్నుల(ఎంటీ) ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా జిల్లా పౌరసరఫరాలశాఖ 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 5,294 మంది రైతుల నుంచి రూ.96.45 కోట్ల విలువైన 40,670 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొన్నది. 4,724 మంది రైతుల ఖాతాల్లో రూ.88 కోట్లు జమ చేయగా, ఇంకా 570 మందికి సుమారు రూ.8.45 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్నరకం ప్రైవేట్కు... యాసంగిలో సన్నరకం ధాన్యం రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయించారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం 5,342 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 35.32 వేల మెట్రిక్ టన్నులు విక్రయించారు. గతేడాది యాసంగిలో 55,243 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈసారి 40,670 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. గతేడాది కంటే 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ తగ్గింది. ఈసారి బహిరంగ మార్కెట్లో సన్నాలకు అధిక డిమాండ్ ఉంది. దీనికితోడు గతేడాది యాసంగి ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అధిక డిమాండ్ ఉండటం, బోనస్ వస్తుందో, రాదో తెలియని పరిస్థితుల్లో రైతులు సన్నాలను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సి వచ్చింది. దొడ్డు రకాలను మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. యాసంగిలో సన్న రకాలకు బయట మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ఈసారి యాసంగిలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేశాం. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.88 కోట్లు జమ చేశాం. మిగిలిన రైతులకు రెండు రోజుల్లో నగదు జమ చేస్తాం. –ఎస్.త్రినాథ్బాబు, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్కొనుగోలు కేంద్రాలు ధాన్యం విలువ సేకరించిన ధాన్యం (రూ. కోట్లలో) (మెట్రిక్ టన్నుల్లో) సహకార సొసైటీ 93 66.36 27,986 ఐకేపీ 17 14.13 5,954 జీసీసీ 26 5.24 2,207 డీసీఎంఎస్ 31 10.72 4,522 -
వైదిక పోస్టుల దరఖాస్తులు పరిశీలన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న వైదిక పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్లోని కాచిగూడ బర్మత్పురా ప్రాంతంలోని తుల్జా భవన్ ధర్మశాలలో అభ్యర్థులకు ఈ నెల 13న రాత, మౌఖిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తులను భద్రాచలంలోని తానీషా కల్యాణ మండపంలోని కార్యాలయంలో స్వీకరించారు. పరిశీలించి అభ్యర్థులకు హాల్ టికెట్లను అందించారు. మొత్తం 22 పోస్టులు ఉండగా, 121 మంది దరఖాస్తులు సమర్పించారు. తొలి రోజు అఽధికారులు 28 దరఖాస్తుల ఒరిజనల్ పత్రాలను పరిశీలించారు. మరో రెండు రోజులు పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ, అనిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన -
డ్యాన్స్.. అదుర్స్ !
సత్తుపల్లిటౌన్: అదిరేటి స్టెప్పులతో అదుర్స్ అన్పిస్తున్నారు చిన్నారులు. శరీరాన్ని మెలికలు తిప్పుతూ ఆకట్టుకుంటున్నారు. వేసవి సెలవుల్లో సత్తుపల్లిలోని కళాభారతిలో నృత్య శిక్షణ శిబిరం కొనసాగుతుండగా, ఉత్సాహంగా సాధన చేస్తూ చిన్నారులు ప్రతిభ మెరుగుపర్చుకుంటున్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా.. కళాభారతిలో శిక్షణకు సుమారు వంద మంది చిన్నారులు హాజరవుతున్నారు. ఇద్దరు డ్యాన్స్ మాస్టర్ల పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతుండగా, సినిమా పాటలకే కాక జానపద గేయాలకు సైతం లయబద్ధంగా అడుగులేస్తూ పిల్లలు ఔరా అనిపిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్లు తమ్మిశెట్టి గణేశ్బాబు, జి.మంజూష ప్రత్యేక శ్రద్ధతో మెళకువలు నేర్పిస్తుండగా, ఇప్పటికే నెల దాటడంతో పిల్లలు డ్యాన్స్లో ప్రావీణ్యం సాధించారు. పిల్లలు సెల్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా నృత్యంలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పంపిస్తూ ప్రోత్సహిహిస్తున్నారు. నృత్యం సృజనాత్మక శక్తిని పెంచడమే కాక శారీకక ఆరోగ్యం, ఏకాగ్రతను పెంచుతుందని మాస్టర్లు చెబుతున్నారు.ఈ సంవత్సరం నుంచే డ్యాన్స్ క్లాస్లకు వస్తున్నా. చాలా ఇష్టంగా ఈ వేసవి సెలవులను డ్యాన్స్ నేర్చుకునేందుకు సద్వినియోగం చేసుకుంటున్నా. అందరం పోటీ పడి నృత్యం నేర్చుకుంటున్నాం. –జె.అధర్వరిషి. 3వ తరగతి, సత్తుపల్లి మూడేళ్ల నుంచి ఈ కళాభారతిలో డ్యాన్స్ నేర్చుకుంటున్నా. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జానపదం, సినిమా పాటలకు నృత్యాన్ని మాస్టర్ నేర్పిస్తున్నారు. ఈ సెలవుల్లో మరింత తర్ఫీదు పొందాను. –దోమ హెబ్సిబా, 4వ తరగతి, సత్తుపల్లి కళాభారతిలో టీచర్ మంచిగా నేర్పుతున్నారు. సినిమా పాటలే కాక జానపద నృత్యాలకు కూడా నేర్పిస్తున్నారు. నాకు జానపద నృత్యాలు వచ్చాయి. పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ప్రదర్శన ఇస్తా. –రామాల జెన్సీ, 4వ తరగతి, సత్తుపల్లి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నారులు డ్యాన్స్ నేర్చుకునేందుకు వస్తున్నారు. పిల్లలు ఉత్సాహంగా నేర్చుకోవడమే కాక ప్రావీణ్యం సాధించారు. చాలామంది అదిరేలా సెప్పులు వేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. –తమ్మిశెట్టి గణేశ్బాబు, డ్యాన్స్మాస్టర్, సత్తుపల్లి -
కామ్రేడ్.. జెన్ జెడ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాక్రోచ్ జనతా పార్టీ పేరు తో పెల్లుబుకుతున్న అసంతృప్తి, నిరసన కార్యక్రమాలు ఇటు మావోయిస్టులు, అటు నిఘా వర్గాలను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎవరికి వారుగా తమ కార్యాచరణను అమలు చేసేందు కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే జెన్జెడ్లను కలుపుకొని పోవాలనే ఆలోచనలో మాజీ మావోలు ఉన్నట్టు తెలుస్తోంది.రాజ్యాంగ పరిధిలోతిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అజ్ఞాతం వీడిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ‘మా పార్టీపై నిషేధం, మాపై కేసులు ఎత్తివేస్తే రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు తోటి కామ్రేడ్లకు పిలుపునిస్తా’అని ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు సైతం కొంచెం అటూఇటుగా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పట్లో మావో యిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసే అవకాశం కనిపించడం లేదు.కార్యాచరణ ఎలా?ఓ వైపు ఆపరేషన్ కగార్ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలోనే శ్రీలంక, నేపాల్లో జెన్జెడ్ ఆధ్వర్యాన తిరుగుబాటు ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ యువతలో సైతం నేపాల్, శ్రీలంక తరహాలో అసంతృప్తి ఉందనేది మాజీల అంచనా. అయితే దేశవ్యాప్తంగా 1995 నుంచి 2005 వరకు అమలైన తీవ్ర నిర్బ«ంధం కారణంగా సాయుధ విప్లవ పోరాటం ప్రధానంగా అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడేలకే పరిమితమైంది, ఫలితంగా 2000కి అటూఇటుగా జన్మించిన జెన్జెడ్ తరంతో సాయుధ విప్లవ పార్టీలకు పెద్దగా సంబంధాలు లేవు. అయితే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో మావోయిస్టు అగ్ర నాయకత్వం అడవులను వదిలింది. అయితే, ఏ తరహా పోరాటం చేయాలి.. ఎవరి కేంద్రంగా పోరాటాలు చేయాలనే కచ్చితమైన కార్యాచరణకు మాజీ మావోయిస్టులు రాలేకపోతున్నారు. వామపక్ష పార్టీలు మాజీ మావోలను తమ పార్టీలోకి రావాలంటూ రెడ్ కార్పెట్ పరిచాయి. అయితే వారితో కలిసి పనిచేయడం సబబా, కాదా అన్న మీమాంస లొంగిపోయిన మావోయిస్టు నేతల్లో ఉన్నట్టు సమాచారం.యువత కేంద్రంగానే బెస్ట్..సోషల్ మీడియా వేదికగా వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తోన్న ప్రభంజనం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది.దీంతో కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్ కామ్రేడ్లతో కలిసి నడవడం కంటే, ఉవ్వెత్తున ఎగిసిపడే శక్తి సామర్థ్యాలు, తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత కేంద్రంగానే తమ దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణ మేలనేది ఎక్కువ మంది మాజీల అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో కీలకంగా అడవులకు దగ్గరగా పనిచేసిన ఖాకీలు ఇప్పుడు జెన్జెడ్ల అడ్డా అయిన సోషల్ మీడియాలోకి ఎంటరవుతున్నారు. మారు గుర్తింపులతో ఖాతాలు తెరుస్తున్నారు. గడిచిన రెండు వారాలుగా అన్ని జిల్లాల్లో ఈ తరహా ధోరణి కనిపిస్తోంది. జెన్జెడ్ అడుగులు ఎటువైపు అనేది అన్ని వర్గాలకు గమనించతగ్గ అంశంగా మారిపోయింది. -
సమష్టి నిర్ణయాలతో కేఎంసీ అభివృద్ధి
కొత్తగూడెంఅర్బన్: ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తూ సమష్టి నిర్ణయాలతో అభివృద్ధి చేసుకోవాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) సర్వసభ్య సమావేశం మేయర్ మూడ్ గణేశ్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యలను గుర్తించడమే కాక ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తే ప్రజల ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. అంతేకాక డివిజన్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం కృషి చేయాలన్నారు. పైపులైన్ల పనులు పూర్తయితే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కాగా, సిబ్బంది కొరత అధిగమించేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని వెల్లడించారు. అనంతరం అజెండాలలోని అంశాలపై చర్చించి ఆమోదించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రదర్శన బీఆర్ఎస్ కార్పొరేటర్లు నల్లకండువాలు కప్పుకొని, చేతుల్లో ప్లకార్డులతో కార్యాలయానికి ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని సమావేశంలో అందరికీ అవకాశం ఉంటుందని చెప్పి అనుమతించారు. అయితే, సమావేశంలో హాల్లో కూడా వారు నిరసన తెలిపారు. కమిషనర్ సహా ఉద్యోగులెవరూ ఫోన్లకు స్పందించడం లేదని, అలాంటప్పుడు సమస్యలు ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది కొరత ఉండగా, ఉన్నవారితో ప్రజాప్రతినిధులు, అధికారుల ఇళ్లలో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితం కావాలి సూపర్బజార్(కొత్తగూడెం): కార్పొరేటర్లు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. కౌన్సిల్ సమావేశానికి ముందు ఆయన సీపీఐ పక్ష కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ప్రతీ డివిజన్లో డ్రెయినేజీలు, రహదారులు, తాగునీటి సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, మేయర్ మూడ్ గణేశ్, నాయకులు కంచర్ల జమలయ్య పాల్గొన్నారు. -
వరద రాకముందే జాగ్రత్త
● సమర్థవంతంగా ఎదుర్కోవాలి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అంకిత్సూపర్బజార్(కొత్తగూడెం): గోదావరికి ఏ స్థాయి లో వరద వచ్చినా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణు గోపాల్తో కలిసి కలెక్టరేట్లో ఆయన శనివారం అధికారులతో సమీక్షించారు. ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. అలాగే, బోట్లు, నాటు పడవలు, లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. గోదావరి నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అలాగే, తాగునీరు, వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు నిల్వలు సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేకాక ముంపు ప్రాంతాల్లోని గర్భిణుల సమాచారాన్ని సేకరించి ఆస్పత్రులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు. వరి కొనుగోళ్లు పూర్తి చేయాలి త్వరలోనే రుతుపవనాలు రానున్న నేపథ్యాన వరి కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదే శించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన సూచనలు చేశారు. అలాగే, 9నజరిగే మండల మహిళా సమాఖ్య సభ్యు ల బస్సుల ప్రారంభోత్సవం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన, డీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం త్రినాథ్బాబు, డీఐఈఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు. చుంచుపల్లి: ప్రజల సమ్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సభల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కాగా, రైతులు పంట మార్పిడి పద్ధతి పాటిస్తూ ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. కాగా, ఎస్ఐఆర్పై అపోహలు విడనాడి సిబ్బందికి సహకరించాలని ఆయన తెలిపారు. అలాగే, బడిబాట తదితర అంశాలపై సూచనలు చేయగా, రహదారులు, విద్యుత్ లైన్లు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటుపై స్థానికులు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ మాలోత్ భారతి, ఎంపీడీఓ జి.సుస్మిత, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులందరికీ చేర్చాలి
జూలూరుపాడు: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా అధికా రులు పర్యవేక్షించాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత సూచించారు. ఇందుకోసం గ్రామసభలను వేదికగా చేసుకోవాలని తెలిపారు. జూలూరుపాడు మండలం కాకర్ల రైతు వేదికలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే గ్రామాలు పరిశుభ్రంగా మారతాయని తెలిపారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి వీడియో ద్వారా అవగాహన కల్పించారు. అలాగే, స్వచ్ఛత, ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించగా, అధికారులతో కలిసి డిప్యూటీ కమిషనర్ విద్యాలత మొక్కలు నాటారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ అప్పారావు, డీఎల్పీఓ ప్రభాకర్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసీరామ్, ఎంఈఓ బానోత్ జుంకీలాల్, సర్పంచ్ బానోత్ బుల్లి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ విద్యాలత -
ఈనెల 20న జాతీయ లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత సూపర్బజార్(కొత్తగూడెం): పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ తెలిపారు. కక్షిదారులు పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందని చెప్పారు. చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాదాల పరిహారం, ఆస్తి పంపకాల వివాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, మనోవర్తి తదితర కేసులను పరిష్కరించుకునే అవకాశముందని తెలిపారు. లోక్ అదాలత్లో ఇరుపక్షాల అంగీకారంతోనే నిర్ణయం జరుగుతుందని, తద్వారా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా తక్షణ తీర్పు లభిస్తుందని వెల్లడించారు. ఈమేరకు కక్షిదారులు, ప్రతివాదులు తమ న్యాయవాదుల ద్వారా లేదా నేరుగా కోర్టుల్లో సంప్రదించి కేసులను లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. -
గిరిజన విద్యాసంస్థల్లో నాణ్యమైన మెనూ
భధ్రాచలం: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో కూడిన మెనూ అమలు చేస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. విద్యాసంస్థలకు కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ సరఫరా చేయడంతో పాటు ఇతర పనులకు గాను శని వారం టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 278 మంది టెండర్దారులు పాల్గొనగా పీఓ మాట్లాడుతూ అతి తక్కువ కోట్ చేసిన వారిని నిబంధనల ప్రకారం ఖరారు చేశామని తెలిపారు. తాజా కూరగాయలు, చికెన్, మటన్తో పాటు వారానికి ఐదు రోజులు అరటి పండ్లు, రెండు రోజులు ఇతర పండ్లు సరఫరా చేయాలని చెప్పారు. నాసిరకం సరుకులు సరఫరా చేసినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు మూడేళ్లు కాంట్రాక్టర్ను బ్లాక్లో పెడతా మని తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన, ఈఈ మధూకర్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల అధికారులు సమ్మయ్య, రమేష్, అశోక్కుమార్, చంద్రమోహన్, సత్యవతి, భారతీ దేవి తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
సంస్కృతి పరిరక్షణ
గిరిజనంపై మక్కువ.. భద్రాచలం: గిరిజనాభివృద్ధికి, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతున్న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నెల 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన జాతీయ పీవోస్ కార్పొరేషన్లో దేశంలోనే ఉత్తమ ప్రాజెక్ట్ అధికారిగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీస్ సెక్రటరీ రంజాన్ చోప్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓగా 2024 జూన్ 25న బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే రెండేళ్లు పూర్తి చేసుకునే క్రమంలో రూ. 5 లక్షల నగదు పురస్కారం అందుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందారు. గిరిజనులు, ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానికులు కూడా అభినందిస్తున్నారు. గతంలో సైతం మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా పని చేసే సమయంలో బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా, బెస్ట్ రూరల్ టూరిజం అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం పీఓగా పనిచేస్తున్న క్రమాన ఆదివాసీ గిరిజనుల ఐక్యవేదిక తరఫున ఆదివాసీ వికాసరత్న బిరుదు పొందారు. గిరిజన మ్యూజియం విస్తరణ.. పీఓ రాహుల్ మొదటి నుంచి గిరిజన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ, జాతీయ స్థాయిలో గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియం విస్తరణ, అభివృద్ధిపై తన మార్క్ చూపించారు. గిరిజనగూడెం వాతావరణం సెట్, చిన్నారుల ఆటవిడుపు, యువతకు క్రీడా వినోదాలు, పర్యాటకులకు గిరి జన వేషధారణ, వివిధ కళాఖండాల ప్రదర్శనను కల్పించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, నిధులు విడుదల చేయించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో గిరిజన పల్లెకు పర్యాటకులు, భక్తుల ఆదరణ పెరిగింది. ఇక ఇటీవల ఆదివాసీ వస్తువులు, వారి ఆహార ఉత్పత్తులు, ఇతర సామగ్రి నాణ్యతతో, తక్కువ ధరలో దొరికే విధంగా రూపొందించిన భద్రగిరి మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు ఉపాధి లభిస్తోంది. ఈ రెండింటిని సైతం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఇలవేల్పుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చి భవిష్యత్ గిరిజన తరాలకు వారి సంప్రదాయాన్ని భద్రపరిచారు. ఇక ఆదివాసీ కోయ భాషను నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయారు. కోయ భాషలో ప్రసంగాలు లు ఇస్తూ, ఆహ్వాన పత్రికలను ముద్రిస్తూ ఆ భాషపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. గిరిజన విద్యార్థులకు విద్యలో ప్రాథమిక దశలోనే కనీస సామర్థ్యాలను పెంపొందించే దిశగా ప్రత్యేకంగా ఉద్దీపనం పేరిట 3, 4వ తరగతుల్లో గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్ల్లో స్టడీ మెటీరియల్ను తొలుత రూపొందించారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంతో దీనిని విస్తృతపర్చి 1, 2వ తరగతులకు సైతం ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతోంది. పదో తరగతి అనంతరం ఉన్నత విద్య, ఉద్యోగాలపై కెరీర్ గైడెన్స్ వాల్ను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేసి ఉన్నతాధికారులతో సూచనలు ఇప్పించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. -
మరింత వేగంగా ధ్రువపత్రాల జారీ
చండ్రుగొండ: మీ సేవా కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల జారీ మరింత వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు తెలిపారు. చండ్రుగొండలో శనివారం ఆయన చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్లు, సిబ్బంది, మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రాల నుంచి అందే దరఖాస్తుల పరిశీలన, జారీపై సమీక్షించాక మాట్లా డారు. సెంటర్ల నిర్వాహకులు నిర్దేశిత రుసుమే తీసుకునేలా పర్యవేక్షించాలని సూచించారు. అలా గే, డేటా ఎంట్రీలో పొరపాట్లు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దార్లు జగదీశ్వరప్రసాద్, స్వర్ణ, జీపీఓలు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణతులసార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసార్చన జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు జరిపించారు. వారాంతం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వైదిక పోస్టులకు 13న రాత పరీక్ష భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న వైదిక పోస్టుల భర్తీకి ఈనెల 13న రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు ఈఓ దామోదర్రావు తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలోని తుల్జా భవన్ ధర్మశాలలో రాత, మౌఖిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు భద్రాచలంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజనల్ పత్రాలు, మూడు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరైతే పరిశీలన అనంతరం అర్హులకు హాల్టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఈఓ సూచించారు. 9 నుంచి కిన్నెరసానిలో సఫారీ టూర్!వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చే పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సఫారీ వాహనాల టూర్ మరో మూడురోజుల్లో ప్రారంభం కానుంది. అటవీ శాఖ ఆధ్వర్యాన ఇప్పటికే వాహనాలను సిద్ధం చేయగా, వీటిని 9వ తేదీన హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బి. బాబు వెల్లడించారు. కిన్నెరసానిలో ఈ కార్యక్రమానికి ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్, సీసీ ఎఫ్ బీమానాయక్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. నకిలీ విత్తనాల బారిన పడొద్దు టేకులపల్లి: నకిలీ విత్తనాలతో నష్టపోకుండా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబూరావు సూచించారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో శనివారం ఆయన తనిఖీ చేశారు. విత్తన నిల్వలు, అమ్మకాలు, రిజిస్టర్ల నిల్వలపై యాజమాన్యాలకు సూచనలు చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులు ఆధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు పంట కాలం పూర్తయ్యే వరకు రశీదులు భద్రపర్చకోవాలని తెలిపారు. అధిక దిగుబడులు వస్తాయని గ్రామాలకు వచ్చి చెప్పే వారిని నమ్మకుండా, వారి సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇంకా ఈ తనిఖీల్లో ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈఓలు పాల్గొన్నారు. -
మానవీయ కోణం, న్యాయమే కీలకం
టేకులపల్లి: కష్టాలతో పోలీస్ స్టేషన్కు వచ్చేవారితో మర్యాదగా మాట్లాడి మానవీయ కోణంలో వ్యవహరిస్తూ వారికి న్యాయం చేయాలని, తద్వారా పోలీసుశాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. టేకులపల్లి పోలీస్స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, కంప్యూటర్, రికా ర్డుల గదిని పరిశీలించారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తుపై ఆరా తీశాక ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే బాధితులతో, ముఖ్యంగా మహిళలు, వృద్ధులతో మర్యాదగా మాట్లాడి మానవీయ కోణంలో సమస్యలు తెలుసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. కాగా, నేరాల నియంత్రణకు రాత్రి వేళ గస్తీ పెంచడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు, టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి బోడు, ఆళ్లపల్లి ఎస్ఐలు అలకుంట రాజేందర్, పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సోమేశ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. టేకులపల్లి పీఎస్ను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్రాజు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
పాల్వంచరూరల్: నాణ్యత లేని, లూజు విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖాధికారి వి. బాబూరావు హెచ్చరించారు. శుక్రవారం పాల్వంచలోని పలు ఎరువులు, ఫర్టిలైజర్స్, విత్తనాల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిస్ బిల్ బుక్స్, స్టోర్ సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం డీలర్లతో మాట్లాడుతూ.. ప్రతీ డీలర్ స్టాక్ వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని, రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. రైతులు తొందరపడి పొడి దుక్కుల్లో విత్తనాలను నాటొద్దని, లూజు, లేబుల్ లేని విత్తనాలను కొనుగోలు చేయొద్దని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు గాని, వ్యవసాయాధికారులకు గాని ఫిర్యాదు చేయాలని చెప్పారు. తనిఖీల్లో మండల వ్యవసాయశాఖ అధికారి బి.శంకర్ పాల్గొన్నారు. -
●విరివిగా మొక్కలు నాటాలి
పర్యావరణ వేడుకల్లో సింగరేణి డైరెక్టర్లు రుద్రంపూర్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, అందరూ విరివిగా మొక్కలు నాటాలని సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారా యణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్స వం నిర్వహించారు. అధికారులు పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ సింగరేణివ్యాప్తంగా 16,790 హెక్టార్లలో 6.68కోట్ల మొక్కలను నాటా మని, గనుల సమీప గ్రామాల్లో 2.32కోట్ల మొక్కలను పంపిణీ చేశామని తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణం, సాగునీటి చెరువులు, అర్బన్ పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు గనుల ఆవరణలో 62 నీటి ట్యాంకులు తవ్వించామన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ లో అత్యుత్తమ మార్కులు సాఽధించిన ఖైరీగుడా ఓపెన్ కాస్ట్ గని, రవీంద్రఖని న్యూటెక్ అండర్ గ్రౌండ్ గనులకు ఉత్తమ ఎకో ఫ్రెండ్లీ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ జీఎం బి.సైదులు, కార్మిక నాయకులు వంగా వెంకట్, త్యాగరాజన్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సమష్టి సహకారంతోనే అవార్డులు
భద్రాచలం: ఐటీడీఏలో అన్ని యూనిట్ అధికారులు, సిబ్బంది సమష్టి సహకారాలతోనే ఐటీడీఏకు అవార్డులు, పురస్కారాలు లభిస్తున్నాయిని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్న సందర్భంగా శుక్రవారం ఐటీడీఏలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 అవార్డులు ప్రకటించగా, ఉత్తమ ఐటీడీఏగా భద్రాచలం ఎంపికై ందన్నారు. ఇదే స్ఫూర్తి తో మరింత ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పీఓను ఘనంగా సత్కరించి వికాస రథసారథి బిరుదు, జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, చందన, అరుణకుమారి, మధుకర్, ఉదయ్ కుమార్, చెంగల్ రావు, మణిధర్, రాంబాబు, వేణు, అశోక్ కుమార్, రమేష్, సైదులు, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
రోడ్డు ప్రమాదంలో వార్డుసభ్యుడు మృతి
చింతకాని: ఇసుక టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతో వార్డుసభ్యుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని 10వ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు మాతంగి నాగరాజు(32) తన స్నేహితుడు లింగాల మహేందర్తో కలిసి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు బైక్పై గురువారం రాత్రి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా పందిళ్లపల్లి సబ్స్టేషన్ వద్ద బోనకల్ వైపు నుంచి ఖమ్మం ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడమే కాక ద్విచక్ర వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో వాహనం వెనుక కూర్చొన్న నాగరాజు కాళ్ల పైనుంచి టిప్పర్ టైరు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, వాహనం నడుపుతున్న మహేందర్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు 108లో క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, నాగరాజు సోదరుడు లుకాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వార్డు నాగరాజు మృతదేహం వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల గోవిందరావు, అబ్దుల్ నబీ, మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపీ, సర్పంచ్ కిలారు మనోహర్బాబు తదితరులు పాల్గొన్నారు.బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఇసుక టిప్పర్ -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
చుంచుపల్లి: కొత్తగూడెం ఇల్లెందుకు క్రాస్రోడ్డు లోతువాగు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం రామవరంకు చెందిన బి.నవీన్కుమార్ (38) ర్యాపిడో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. దీనిపై లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో రెండు గేదెలు.. టేకులపల్లి: మండలంలోని బేతంపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి డంపింగ్ యార్డు పక్కనే ఉన్న పెద్దబోయిన అశోక్ పొలం వద్ద విద్యుత్ తీగ తెగిపడింది. అయితే రోజువారీ లాగే శుక్రవారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లిన అదే గ్రామానికి చెందిన పేద రైతు జాలాది శ్రీనుకు చెందిన రెండు పాడి బర్రెలు ఆ విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. దీంతో కుటుంబానికి ఆసరాగా నిలిచే రూ.లక్షల విలువైన పాడి పశువులను కోల్పోవడంతో ఆ పేద కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. గత రెండేళ్లుగా ఆ విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి బాధిత రైతుకు నష్టపరిహారం అందించి, ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్సుజాతనగర్: వాహనంలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను సుజాతనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి నుంచి సూజాతనగర్ రోడ్డులో ఎస్ఐ తన సిబ్బందితో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో అనుమానస్పదంగా వెళ్తున్న ట్రాలీ ఆటోను ఆపి తనిఖీ చేయగా రెండు ఆవు దూడలు, రెండు కోడె దూడలు, ఒక్క దున్నపోతు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు వాహనాన్ని సీజ్ చేసి అక్రమంగా తరలిస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బత్తుల శ్రీను, గుడిబండ గ్రామానికి చెందిన మాదాసు శ్రీను, డ్రైవర్ సేవియాను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులు టేకులపల్లి ప్రాంతంలో బ్రోకర్ సేవియా సహకారంతో రైతుల నుంచి పశువులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి కోదాడ సంతలో ఎక్కువ ధరలకు విక్రయించేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తూ పట్టుబడినట్లు ఎస్ఐ తెలిపారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య దమ్మపేట: మద్యానికి బానిసైన భర్త ప్రవర్తనలో మార్పు రాదని విసుగుచెందిన ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తొట్టిపంపు గ్రామ పరిధిలోని హనుమంతుగుంపునకు చెందిన వాడే తిరుపతమ్మ (32) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈక్రమాన ఆమె భర్త వెంకటేష్ మద్యానికి బానిసై కుటుంబ పోషణను పూర్తిగా పట్టించుకోవడం లేదు. దీంతో గురువారం రాత్రి మద్యం మానేయాలని తిరుపతమ్మ భర్తతో గొడవ పడింది. అతడి ప్రవర్తనలో మార్పు రాదనే భావనతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు మీడియం రాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేష్కుమార్ తెలిపారు. -
నైతిక విలువలపై శిక్షణ
పాల్వంచ: వేసవి సెలవుల్లో పిల్లలకు నైతికల విలువలు నేర్పించడమే కాక సృజన్మాతకత వెల్లివిరిసేలా పలు ప్రధాన చర్చిల్లో వీబీఎస్(ఒకేషనల్ బైబిల్ స్కూల్) తరగతులను నిర్వహిస్తున్నారు. పిల్లలను ఆధ్యాత్మిక బాట పట్టించడమే కాక సామాజిక స్పృ హ పెరిగేలా ఈ తరగతులు తోడ్పడుతున్నాయి. ఆట పాటలతో కూడిన బోధన సాగుతుండడంతో వారు సంతోషంగా, ఉత్సాహంగా హాజరవుతున్నారు. అందరికీ ప్రవేశం సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు నేర్చుకునే విషయాలు వారు సమాజంలో బాధ్యతాయుతమైన, ఉత్తమమై న వ్యక్తులుగా ఎదగడానికి తోడ్పడుతాయని చెబుతున్నారు. 4–15 వయస్సు కలిగిన చర్చి సభ్యులే కాకుండా సమాజంలో పిల్లలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో పాటలు, నృత్యం నేర్చుకోవడమే కాక చిన్న వస్తువులు, గ్రీటింగ్ కార్డులు తయారుచేయడం, చిత్రాలు గీయడంపై శిక్షణ ఇస్తూ ఆటలు, క్విజ్, జ్ఞాపకశక్తి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవికాక మంచి నడవడిక, క్రమశిక్షణ, నిజాలే మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, క్షమించే గుణం వంటి నైతిక విలువలను నేర్పిస్తున్నారు. తద్వారా నిజాయితీ, క్షమాగుణం, ప్రేమ, కరుణ, ఇతరులను గౌరవించడం వంటి లక్షణాలు అలవాటవుతాయని, ఇతర పిల్లలతో కలిసి ఉండడంతో వల్ల కొత్త స్నేహాలు ఏర్పడి నలుగురితో ఎలా కలిసిపోవాలో తెలుస్తుందని చెబుతున్నారు.చర్చిల్లో ప్రత్యేక వీబీఎస్ తరగతులు పిల్లలు చెడు స్నేహాలకు దగ్గరైతే అంతే త్వరగా చెడు అలవాట్లకు ఆకర్షితులవుతారు. అందుకే పిల్లలు, యువతను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక సామాజిక చైతన్యం కల్పించి సృజనాత్మకతను వెలికి తీసేలా శిక్షణ తరగతులు దోహదం చేస్తున్నాయి. – పాస్టర్ కె.టైటస్ లివింగ్ వాటర్, ఎల్జీఎం చర్చి నిర్వాహకులు -
●భావితరాల భద్రత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత సూపర్బజార్(కొత్తగూడెం): పర్యావరణ పరిరక్షణే భావితరాలకు భద్రతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం మొక్క నాటా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం న్యాయమూర్తి జెండా ఊపి పర్యావరణ ర్యాలీని ప్రారంభించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసుశాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు,ఎన్జీఓలు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
ఎస్పీ బాలు పాటల పోటీలు
భద్రాచలంటౌన్: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా శుక్రవారం భద్రాద్రి స్వరాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల పాటల పోటీలు భద్రాచలంలో ఘనంగా జరిగాయి. సుమారు 50 మంది గాయకులు పోటీపడగా, ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో మురళి (భద్రాచలం–రూ.15 వేలు), వినయ్ (హైదరాబాద్–రూ.10 వేలు), పెద్దిరాజు (రెడ్డిపాలెం–రూ.5 వేలు) మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. మహిళల విభాగంలో మాధవి (విజయవాడ) ప్రథమ, కృష్ణవేణి ద్వితీయ, పూజారి జ్యోతి తృతీయ బహుమతులు సాధించారు. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు రాజబాబు, జీవన్కుమార్, సరళాదేవి, నిర్వాహకుడు పోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జామాయిల్ తోట దగ్ధం కారేపల్లి: మండలంలోని బొక్కలతండా స్టేజీ సమీపాన రైతు వాకుండోత్ గన్యాకు చెందిన జామాయిల్ తోటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. గ్రామంలో శుక్రవారం సాయంత్రం గాలిదుమారానికి విద్యుత్ వైర్లు రాసుకుని షార్ట్సర్క్యూట్ ఏర్పడడంతో నిప్పు రవ్వలు తోటపై పడి మంటలు మొదలయ్యాయి. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేలోగానే తోట కాలిపోయింది. ఘటనలో రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగినందున ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గన్యా కోరాడు. -
‘సాదా బైనామా’కు ప్రాధాన్యమివ్వాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో భూభారతి, సాదా బైనామా, ఇతర భూసేకరణ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం రాత్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి అశ్వాపురం, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని ఆదేశించారు. మార్గదర్శకులుగా వ్యవహరించాలి పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అమలు, ఉపాధి కల్పన కార్యక్రమాల పురోగతిపై సమీక్ష జరిపారు. టీజీఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు 50 దరఖాస్తులు అందగా, 39 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు వివరించగా, యువ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు డేవిడ్రాజ్, మధుసూదన్ రెడ్డి, రామిరెడ్డి, రాజేష్, పరంధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరికలు పెంచాలి పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అడ్మిషన్లపై శుక్రవారం రాత్రి కళాశాల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదని అన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కోర్సుల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. టేకులపల్లి: ప్రజలకు సత్వర సేవలందించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం ఆయన టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజావాణి, భూభారతి, సాదా బైనామా, జనన మరణ కుల, ఆదాయ , ఇతర ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు, పరిష్కారాలపై ఆరా తీశారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ వీరభద్రం, ఏఓ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ -
లక్ష్యం చేరని ‘తునికాకు’
● జిల్లాలో 47 శాతం మాత్రమే సేకరణ ● ఆసక్తి చూపని గిరిజన, గిరిజనేతర కూలీలు ● సేకరణ ప్రారంభంలో జాప్యం కూడా కారణమే పాల్వంచరూరల్: ఈ సీజన్లో కూడా తునికాకు సేకరణ లక్ష్యం చేరలేదు. అయితే గతేడాది కంటే పెరి గింది. గత సంవత్సరం లక్ష్యంలో 29.52 శాతం తునికాకు సేకరించగా, ఈ సారి 47 శాతం సేకరించారు. అంటే 12 శాతం పెరిగింది. గతనెలలో సేకరణ మొదలు కాగా, గిరిజనులు, గిరిజనేతరులు తునికాకు సేకరించారు. ఎక్కువ మంది ఉపాధి పనులకు వెళ్లడం, ఎండ తీవ్రత వల్ల ఆకు సేకరణ తగ్గినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఆరుడివిజన్ల పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం 32,690 స్టాండర్డ్ బ్యాగులు కాగా, 14,419 స్టాండర్డ్ బ్యాగులు మాత్రమే సేకరించారు. గతేడాది 35,300 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యం కాగా, 10,361 బ్యాగులు సేకరించారు. కాగా, గత నెల 31వ తేదీతో సేకరణ ముగిసింది. కారణాలివే.. పలు అవరోధాలు ఎదురుకావడంతో తునికాకు సేకరణ తగ్గింది. అకాల వర్షాలు, అధికారులు సేకరణను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో కూలీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వర్షాల కారణంగా చీడ పీడలు పట్టి ఆకు పనికిరాకుండాపోయింది. దీంతో అనుకున్న, నాణ్యమైన ఆకు సేకరణ జరగలేదు. ఏటా మేలో నెలరోజులపాటు తనికాకు సేకరిస్తారు. ఈసారి 15 రోజులు మాత్రమే సేకరించారు. గతంలో 50 ఆకుల కట్టకు రూ.3 చొప్పున చెల్లిస్తే ఈసారి రూ.3.30 చొప్పున కూలీలకు చెల్లించారు. ఏటా గిరిజనులు వేసవి పంటగా భావించే తునికాకు సేకరణ రెండేళ్లుగా తగ్గిపోతుండటంతో ఆ మేరకు ఆదాయం కూడా కోల్పోతున్నారు. డివిజన్ టార్గెట్ సేకరణ శాతం కిన్నెరసాని అభయారణ్యం 3,200 831 26 భద్రాచలం 9700 7,145 80 ఇల్లెందు 10,600 2,458 26 మణుగూరు 5,400 3,052 60 పాల్వంచ 2,300 653 28 కొత్తగూడెం 1,490 280 18 మొత్తం 32,690 14,419 47ఈసారి అకాల వర్షాలకు తోడు కూలీలు కూడా సేకరణపై అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో లక్ష్యం పూర్తి కాలేదు. గతంలో తునికాకు సేకరణకు ఏజెన్సీ గ్రామాల్లో కూలీలు అధిక సంఖ్యలో వచ్చేవారు. ఇప్పడా పరిస్థితి లేదు. నాణ్యమైన తునికాకు జిల్లాలోనే అధికంగా లభిస్తుంది. గతేడాదికంటే ఈసారి సేకరణ పెరిగింది. –జి. కృష్ణాగౌడ్, డీఎఫ్ఓ -
నిందితులకు శిక్ష పడేలా చేయాలి
ఎస్పీ రోహిత్ రాజు సూపర్బజార్(కొత్తగూడెం): నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర కీలకమని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కోర్టు డ్యూటీ అధి కారులకు కేసులపై అవగాహన కల్పించాలన్నా రు. సమన్లు, వారెంట్ల జారీలో జాప్యం చేయొద్దన్నారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యా యం చేసేందుకు కృషి చేయాలన్నారు. సీఐలు, ఎస్ఐలు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. కృషికా యాప్ను ఉపయోగించుకోవాలిసూపర్బజార్(కొత్తగూడెం): రైతులు వ్యవసా య రుణాల కోసం కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆవిష్కరించిన కృషికా ( krishika) యాప్ను వినియోగించుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు రామిరెడ్డి శుక్రవా రం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన వ్యవసాయ రుణాలకు ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. రేపు జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు సూపర్బజార్(కొత్తగూడెం): ఈనెల 7న చర్ల స్టేడియం (జెడ్పీహెచ్ఎస్ రోడ్)లో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ శుక్రవారం తెలిపా రు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 11వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ స్టేడియం, హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో 100 మీ, 200 మీ, 400 మీ. పరుగు, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, షాట్పుట్ విభాగాల్లో పాల్గొంటారని తెలిపారు. పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనుండగా ఆసక్తి గల వారు ఈ నెల 7వ తేదీన ఉదయం 8 గంటలకు చర్ల స్టేడియంలో రిపోర్ట్ చేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 85220 67157ను సంప్రదించాలన్నారు. డ్రండ్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు శిక్ష బూర్గంపాడు/భద్రాచలంఅర్బన్: బూర్గంపాడు పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 మంది పట్టుబడగా.. శుక్రవారం భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శివనాయక్ తీర్పు వెలువరించారు. ఇందులో ఇద్దరికి ఒకరోజు జైలు శిక్ష, తొమ్మిది మందికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మేడా ప్రసాద్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని, వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ ఇద్దరిని బూర్గంపాడు పోలీసులు, మరో ఇద్దరిని భద్రాచలం టౌన్ పోలీసులు పట్టుకోగా న్యాయమూర్తి శివనాయక్ నలుగురికి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు రూ.100లు జరిమానా విధించారు. -
‘ఎన్ఎంఎంఎస్’కు 66 మంది ఎంపిక
కొత్తగూడెంఅర్బన్/అశ్వారావుపేటరూరల్/జూలూరుపాడు: జిల్లాలో 2025 నవంబర్లో జరిగిన (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. జిల్లా నుంచి 745 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 66 మంది అర్హత సాధించారని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. గత సంవత్సరం 59 మంది అర్హత సాధించారని గుర్తు చేశారు. అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ అందుతుందని పేర్కొన్నారు. ఎన్ఎంఎంఎస్కు ఎంపికై నవారిలో అశ్వారావుపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకుల వీరేన్ గంగాదుర్గ, బొల్లి మణిచందర్ రాజు, జూలూరుపాడు మండలం పాపకొల్లు పీఎం శ్రీ హైస్కూల్ విద్యార్థులు బి.వర్షిత, కె.మేఘన, జి.కృష్ణ మనోహర్లు ఉండగా, వారిని హెచ్ఎంలు పి.హరిత, ఎస్కే మీరా సాహెబ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. -
విద్య.. వాసంతి.. సవాళ్లు
● ఇన్చార్జి పాలనలోనే సాగిన గత విద్యాసంవత్సరం ● పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో లాస్ట్ నుంచి రెండో ర్యాంక్ ● పర్యవేక్షణ కొరవడి తెలుగు సబ్జెక్ట్పై పట్టుకోల్పోతున్న విద్యార్థులు ● ప్రైవేటు పాఠశాలల ఫీజు దందాపై చర్యలు చేపట్టని అధికారులు కొత్తగూడెంఅర్బన్: ఇటీవల బాధ్యతలు చేపట్టిన కొత్త జిల్లా విద్యాశాఖాధికారికి సరికొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. గతేడాది ఇన్చార్జ్ డీఈఓ పాలనతో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఎక్కువ మంది విద్యార్థులు తెలుగు సబ్జెక్ట్లోనే ఫెయిల్కావడం చర్చకు దారితీసింది. ప్రభుత్వ సౌకర్యాలను అందిపుచ్చుకుని మెరుగైన ఫలితాలు రాబట్టడంలో జిల్లా విద్యాధికారులు వెనుకబడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు పూర్తిస్థాయి డీఈ ఓను నియమించడం హర్షణీయం. డీఈఓగా బాధ్యతలు చేపట్టిన వాసంతి గతంలో కూడా ఇక్కడ డీఈఓగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖలో జిల్లా కో ఆర్డినేటర్ల పదవీ కాలం ముగిసినా డిప్యూటేషన్పై అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన కో ఆర్డినేటర్ల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల తిరిగి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో అనుమతి రెన్యూవల్ చేసుకోని పాఠశాలలు, అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఎంఈఓలు ఈ పనులన్నీ నిర్వహించేందుకు గోప్యత పాటిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త డీఈఓ వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు పాఠశాలలపై కొరవడిన నిఘా గతేడాది ప్రైవేటు పాఠశాలలపై కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాల్సి ఉన్నా.. ఏ ఒక్క పాఠశాలలోనూ ఫీజు పట్టిక ఏర్పాటు చేయలేదు. ఈ ఏడాది అయిన ఫీజుల పట్టికలు ఏర్పాటు చేసేలా డీఈఓ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజు లు, ప్రవర్తన రకరకాల కారణాలు చెబుతూ ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కు మార్చుతుండటంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం పాఠశాలల్లోనే కొనాలని యాజమాన్యాలు తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. అధిక ఫీజులు, పుస్తకాల పేరుతో రూ. వేలకు వేలు వసూళ్లు చేస్తున్నా యి. ఈ వ్యవహారం ఏటా జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడంలేదు. ఈ ఏడాదైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త డీఈఓ సమస్యలపై దృష్టి సారించి విద్యార్థులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పర్యావరణ ప్రతిన
జిల్లా వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పలుచోట్ల మొక్కలు నాటారు. చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉద్బోధించారు. రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పాల్వంచరూరల్: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్రస్థాయి పర్యావరణ అవార్డు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళా శాల, పాల్వంచ డిగ్రీ (అటానమస్) కళాశాలలు అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మండలి కార్యదర్శి రవి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ పొలారపు పద్మ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు అందుకోవడం పర్యావరణ విజయాలకు గుర్తింపు అని అన్నారు. భవిష్యత్లో మరిన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషి వేల్ల అవార్డు లభించిందన్నారు. కళాశాల ఎకో క్లబ్ కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేను రాసిన కథ
కృతజ్ఞతాభావం..అశ్వారావుపేట రూరల్: ఒక రాజ్యంలో కాంతవర్మ అనే రాజు పాలన చేసేవాడు. ఆయన కోపిష్టి కావడంతో ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కఠినంగా శిక్షించేవాడు. రాజుగారి మామిడి తోటలో పనిచేసే శాంతయ్య అనే తోటమాలి మామిడి కాయల లెక్క పొరపాటుగా తప్పు చెప్పాడు. రాజుగారికి ఈ విషయం తెలిస్తే శిక్ష తప్పదని భావించి శాంతయ్య పారిపోతాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన రాజు.. శాంతయ్యను పట్టుకురమ్మని తన భటులను ఆజ్ఞాపిస్తాడు. దీంతో భటులు వెంబడిస్తుండగా శాంతయ్య పరుగులు తీస్తాడు. కొంత దూరం పరిగెత్తాక దాహంతో చెరువు వద్ద ఆగగా భటులు దగ్గరగా రావడంతో మళ్లీ పరుగు మొదలుపెడతారు. ఎదురుగా గుహ కనిపించడంతో అందులో దాక్కుందామని వెళ్తే సింహం కనిపిస్తుంది. వెనక్కి వెళ్తే భటులు.. ముందుకు వెళ్దామంటే సింహం ఉండడంతో ఏం చేయాలో పాలుపోక శాంతయ్య ఆలోచిస్తుంటాడు. శిక్ష కంటే ఇదే మేలని.. ఇంతలోనే ఎదురుగా ఉన్న సింహం శాంతయ్యను గమనించి దగ్గరకు రమ్మని సైగ చేస్తుంది. భటులకు చిక్కితే రాజు కఠినంగా శిక్షిస్తాడు.. అంతకంటే సింహానికి ఆహారంగా మారడమే మేలు అనుకుని ఆయన దగ్గరకు వెళ్తాడు. ఆ సింహం శాంతయ్యకు తన కాలుని చూపిస్తుంది. కాలికి గాయమై రక్తం కారుతుండడాన్ని గమనించిన శాంతయ్య అక్కడి చెట్టు ఆకులను కోసి పసరు తీసి కట్టుకడతాడు. రెండు రోజులు అలాగే కడుతూ అక్కడే ఉంటాడు. మూడో రోజున ఆకలి తీర్చుకునేందుకు సమీపంలోని చెట్టు పండ్లు కోసుకునేందుకు వెళ్తాడు. ఈ విషయాన్ని భటులు గమనించి రాజుకు చెబుతారు. దీంతో రాజు ఆదేశాలతో శాంతయ్య బంధించి తీసుకెళ్లగా ఆయనకు సింహ భక్షణ శిక్ష విధిస్తాడు. ఆపై భటులు ఒక బోనులో సింహాన్ని ఉంచి అందులోకి శాంతయ్యను పంపిస్తారు. ఆపై సింహం గర్జిస్తూ శాంతయ్య దగ్గరకు రావడంతో ఆయన భయపడుతుండగా అది మాత్రం శాంతయ్య చుట్టూ తిరుగుతూ ఒంటిని ప్రేమగా నాకుతుంది. ఇది చూసి రాజు, ప్రజలంతా ఆశ్చర్యపోతారు. శాంతయ్య మాత్రం తాను వైద్యం చేసిన సింహం అదేనని గుర్తించి అది ప్రేమ చూపించిందని భావించగా.. రాజు వద్ద ఇన్నేళ్లు సేవలు చేసిన చిన్న తప్పుకే చంపాలని చూస్తున్నాడని అనుకుంటూ సింహానికి మనసులో కృతజ్ఞత తెలుపుకుంటాడు. ఆపై రాజు వివరాలు ఆరా తీయగా శాంతయ్య ఏనాడూ తాను తప్పు చేయలేదని.. మామిడికాయల లెక్క రోజున తన కూతురికి జ్వరం రావడంతో కంగారు పడ్డాడని చెప్పాడు. దీంతో మృగమే కృతజ్ఞత చూపించినప్పుడు తాను మాత్రం ఆవేశం చూపించడం సరికాదని గ్రహించిన రాజు అప్పటి నుంచి కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాడు.నీతి : మనం చేసిన మేలు ఎప్పటికై నా కృతజ్ఞతగా తిరిగి వస్తుంది. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● ప్రజా సమస్యలపై ‘పోరుబాట’ ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీఅశ్వారావుపేటరూరల్: ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఫలితంగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ఆధ్వర్యాన చేపట్టే పోరుబాట కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేసి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలో నిర్వహిస్తున్న పార్టీ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు శుక్రవారం ముగియగా జాన్వెస్లీ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించకపోవడంతో అవన్నీ నీటిమీద రాతలుగా మారా యన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా అర్హులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇక విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నందున ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అంతేకాక ఆదివాసీలపై అటవీశాఖ వేధింపులకు తోడు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని తెలిపారు. అనంతరం భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్ల కోసమే గిరిజన చట్టాల్లో మార్పులు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల మనుగడ ను ప్రమాదంలోకి నెడుతోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు కనకయ్య, కె.పుల్లయ్య, నర్సారెడ్డి పాల్గొన్నారు. -
మేల్కొనపోతే ముప్పు..
● ప్రకృతిని ప్రేమిద్దాం.. వనరులను సంరక్షిద్దాం.. ● మానవ తప్పిదాలతో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ● అవగాహన పెంచుకుంటే మేలు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పాల్వంచరూరల్: మావన తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా పర్యావరణంపై ప్రభావం పడుతోంది. పర్యావరణ వ్యతిరేక కార్యకలాపాలతో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుండడంతో మానవ మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారుతోంది. పర్యావరణ పరీరక్షణ కోసం ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ ప్రాధాన్యాన్ని గుర్తించి దాని పరిరక్షణ కోసం కార్యాచరణ రూపొందించి జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం చేకూరితే కొంతమేరకై నా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ప్రతీది ప్రకృతి నుంచి లభిస్తున్నా.. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యంతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనికి పెరిగే జనాభా తోడై సమస్య ఇంకా తీవ్రమతుంది. ఆధునికత పెరిగిన కొద్దీ వనరుల వినియోగం, వస్తు వినియోగం పెరుగుకుంటూ వస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో ఉంటే వారు తమ అవసరాల మేరకు చెట్లను ఇష్టాను సారంగా నరికివేయడంతో ప్రభావం పర్యావరణంపై పడి అవాంతరాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న కాలుష్యం.. రోజురోజుకు వాయు కాలుష్యం పెరగడంతో పర్యావరణపై ప్రభావం పడుతోంది. దీనికి తోడు వాహనాల కాలుష్యంతో ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది. అడవులు అంతరించిపోవడం కూడా వాతావరణ కాలుష్యానికి కారణమని చెప్పొచ్చు. ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి ఇష్టానుసారంగా చెట్లను నరికివేయడంతో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ ఏర్పడి విపత్తులు సంభవిస్తున్నట్లు గ్లోబల్ మానిటైజేషన్ ఫోరం గతంలో ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా భౌగోళిక ఉష్ణోగ్రతలు పెరగడం, తుపానులు రావడం, అతివృష్టి, అనావృష్టి వంటి దుష్పరిణామాలు సంభిస్తున్నట్లు చెప్పారు. అయితే గత ప్రభుత్వ హయాంతో ప్రవేశపెట్టిన ‘హరితహారం’పథకంలో రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో మొక్కలు నాటారు. ఈక్రమాన ఇటీవల కాలంలో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ జీవవైవిద్య సదస్సులో ప్రపంచదేశాల ప్రతినిధులు వాతావరణ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
అమాంతం పెంచేశారు!
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లా పరిధిలో భూముల మార్కెట్ విలువలకు రెక్కలొచ్చాయి. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలను 100 శాతం వరకు పెంచగా.. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలను మాత్రం 20శాతానికి మించకుండా పరిమితం చేశారు. ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా, ప్రధాన కూడళ్లలో ఉన్న భూముల విలువ భారీగా పెరిగింది. అయితే సర్వే నంబర్ల ఆధారంగా ధరలు నిర్ణయించడంతో రోడ్డు పక్క భూములకు భారీగా, లోపలి వైపు ఉన్న భూములకు స్వల్పంగా పెరగడంతో ఒకే గ్రామంలో రకరకాల ధరలు అమలవుతాయి. ఖమ్మం అర్బన్, సత్తుపల్లి మండలాల పరిధిలోని కొన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ భూముల ధర ఎకరానికి ఏకంగా రూ.కోటి దాటింది. ఖమ్మం అర్బన్ మండలం ఖమ్మం, పాకబండ రెవెన్యూ పరిధిలో గతంలో ఎకరా వ్యవసాయ భూమి ధర రూ.84 లక్షలు ఉండగా.. దానిని ఏకంగా రూ.1.26 కోట్లకు పెంచారు. ఇక అత్యల్పంగా ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో రూ.6.75 లక్షలు ఉన్న ధరను రూ.11.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సత్తుపల్లి మండలం అయ్యగారిపేట రెవెన్యూ గ్రామంలో గతంలో రూ.91.48 లక్షలు ఉన్న ఎకరా ధరను ఇప్పుడు రూ.1.14 కోట్లకు పెంచారు. ఇదే గ్రామంలో అత్యల్పంగా రూ.9 లక్షలుగా ఉన్న ధర రూ.18 లక్షలకు చేరింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధి లో ఇళ్ల స్థలాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ప్రధాన వాణిజ్య కేంద్రమైన వైరా రోడ్డుకు ఇరువైపులా గతంలో గజం ధర రూ.44,900 ఉండగా.. ఇప్పుడు అది రూ.51,700 కు పెంచారు. అలాగే, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధర(ఎస్ఎఫ్టీ) అత్యల్పంగా రూ.2వేలు ఉండగా.. అది రూ.2,400కు చేర్చారు. అలాగే గరిష్ట ధర రూ.2,800గా ఖరారైంది. వైరా మున్సిపాలిటీతో పాటు కొణిజర్ల మండలంలోనూ ధరలు భారీగానే పెరిగాయి. వైరా పరిధిలో వ్యవసాయేతర భూమి అత్యల్పంగా రూ,1,700 ఉన్న గజం ధరను రూ.3,000కు పెంచారు. అత్యధికంగా రూ.10,800 ఉన్న గజం ధర రూ.16,200కు చేరింది. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధర(ఎస్ఎఫ్టీ) రూ.1,500 నుంచి రూ.1,800కు చేర్చారు. ఇక కొణిజర్ల మండలంలో ఇళ్ల స్థలాల ధర గజానికి రూ.1,100 ఉంటే రూ.1,700కు పెంచారు. అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ఎస్ఎఫ్టీ ధర రూ.1,300 నుంచి రూ.1,600కు పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో వ్యవసాయేతర భూముల ధరలను సైతం ప్రభుత్వం భారీగా పెంచింది. ఇళ్ల స్థలాల గజం ధర గతంలో కనిష్టంగా రూ.3,100 ఉన్న చోట దాన్ని ఇప్పుడు రూ.5,500గా నిర్ణయించారు. అలాగే గరిష్టంగా రూ.29,900 ఉన్న ధరను ఏకంగా రూ.37,400కు పెంచారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధర(ఎస్ఎఫ్టీ) అత్యల్పంగా రూ.1,500 ఉండగా రూ.1,800కు.. అత్యధికంగా ఉన్న రూ.2,800 ధరను రూ.3,400కు చేర్చారు. భూముల కొత్త మార్కెట్ ధరలు -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పర్యావరణ అవార్డు
పాల్వంచరూరల్: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ (ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ అవార్డు–2026) అవార్డుకు ఎంపికై ంది. కళాశాల ప్రాంగణంలో విరివిగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ప్లాస్టిక్ నివారణకోసం ప్రత్యేకంగా విద్యార్థులతో క్లాత్, జూట్ సంచుల తయారీ, విత్తన బంతుల తయారీ, వేస్ట్ నుంచి బెస్ట్ వస్తువుల తయారీ, ఎకో బ్రిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రతిపాదనల మేరకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కిందని కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మ తెలిపారు. నేడు హైదరాబాద్లో జరిగే ఎన్విరాన్మెంట్ డే ప్రోగ్రాంలో అటవీశాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. -
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది. సమగ్ర అధ్యయనం చేపట్టాలిపోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఎమ్మెల్యే పాయం వినతి బూర్గంపాడు: పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్తో పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై సమగ్ర అధ్యయనంతో నివేదికలు రూపొందించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు, కేంద్ర జలసంఘం ప్రతినిధులను గురువారం ఆయన సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్లో కలిసి విన్నవించారు. పోలవరం బ్యాక్వాటర్తో జరిగే నష్టాన్ని వివరించారు. బాధితులకు న్యాయం చేశాకే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. ఏటా గోదావరి వరదలకు బూర్గంపాడు, అశ్వాపురం, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు, వందల సంఖ్యలో ఇళ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు. స్థానిక రైతులు, ముంపు బాధితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సర్పంచ్లు మందా నాగరాజు, కిషోర్నాయక్, నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, పూలపెల్లి సుధాకర్రెడ్డి, యారం పిచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. -
నేను రాసిన కథ
పయనమెటు?సత్తుపల్లిటౌన్: రవి తన స్నేహితుడు కిషోర్ కోసం పార్క్లో ఎదురుచూస్తున్నాడు. ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో వస్తున్నానని చెప్పి గంట అవుతున్నా రాలేదు. ఫోన్ చేస్తే కలవకపోవడంతో కిషోర్కి ఏమైనా అయిందేమోనని రవికి భయం మొదలైంది. హఠాత్తుగా పార్క్లోని జనం కంగారుగా పరిగెత్తుతున్నారు. ఏమిటని రవి ఆరా తీస్తే ఎవరో కుర్రాడికి ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఆయన చెప్పిన పోలికలన్నీ కిషోర్వే కావడంతో రవి భయంగా వెళ్లేసరికి గాయపడింది వేరే వ్యక్తి కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. సరిగ్గా అప్పుడే బండిపై వేగంగా కిషోర్ వస్తుండగా హఠాత్తుగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి ఆమడదూరాన పడ్డాడు. కళ్ల ముందు జరిగిన ప్రమాదాన్ని చూసి రవి ఏడుస్తూ కిషోర్ వైపు వెళ్లగా ఆయన ఎగిరి పెద్ద బండపై పడగా తలకు బలమైన గాయమై మృతి చెందాడు. ●ఇదంతా టీవీలో చూస్తున్న ఆనంద్కు భయమేసింది. ఎందుకంటే తన కొడుకు ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోగా.. బండి వేగంగా నడుపుతుంటాడు. అలాగే, ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించడు. అప్పుడే కాలేజీకి బయలుదేరుతున్న కొడుకుని చూసి ఆనంద్ హెల్మెట్ తీసి ఇచ్చాడు. అది చూసిన కొడుకు ‘హెల్మెట్ ఎందుకు నాన్నా.. ఇది పెట్టుకుంటే జుట్టు చెదిరిపోతుంది.. అయినా నాకేం కాదులే..’అనడంతో అప్పుడే టీవీలో చూసిన ప్రమాదాన్ని ఆనంద్ వివరించాడు. ‘హెల్మెట్ పెట్టుకో నాన్నా.. జట్టు పాడవుతుందని ప్రాణం మీదికి తెచ్చుకుంటావా.. ప్రయాణంలో ప్రమాదం జరిగితే మేము తట్టుకోగలమా..’అనడంతో తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న కుమారుడు అంగీకరించాడు. ఇకపై హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లనని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కొడుకులో వచ్చిన ఈ మార్పును చూసి తండ్రి ఆనంద్ ఎంతో సంతోషించాడు. -
ఏజెన్సీలో సిగ్నల్ సమస్య ఉండొద్దు
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిపాల్వంచరూరల్: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సిగ్నల్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో టెలికాం విభాగం ఏపీఎల్ఎన్ఏ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టి.భాస్కరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ కె.లక్ష్మణకుమార్, బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సి.రమణలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు 25 నూతన టవర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో జాప్యం చేయొద్దని ఆదేశించారు. గిరిజన, సరిహద్దు గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా అందాలని అన్నారు. నెట్వర్క్ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించి, సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. టవర్ల ఏర్పాటుపై ప్రస్తుత స్థితిగతులు, సాంకేతిక అంశాలను అధికారులు వివరించారు. -
అదనపు ధర చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్
సవరించిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాత ధరలతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయవిక్రయదారులు బారులు దీరారు. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 66 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగగా, రూ.38,81,923 ఆదాయం సమకూరింది. మిగతా కార్యాలయాల్లో కూడా రద్దీ నెలకొంది. కాగా, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా పెరిగిన ధరకు అనుగుణంగా శుక్రవారం నుంచి అదనపు రుసుము చలాన్ చెల్లించాలని స్పష్టం చేశారు. పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్లు చేయనుండగా, ఆ మేరకు రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది. -
గాలివాన బీభత్సం...
పినపాక: మండలంలో బుధవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బయ్యారం, ఎల్సీరెడ్డిపల్లి పంచాయతీలలో అర్ధరాత్రి గాలివాన దాటికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ఇళ్లపై పడడంతో పాక్షికంగా దెబ్బతినగా.. అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు రాత్రి నుంచే వాటిని తొలగించే పనులు చేపట్టారు. పంచాయతీ అధికారులు జేసీబీ సాయంతో భారీ వృక్షాలను రోడ్లపై నుంచి తొలగిస్తున్నారు. గాలి దుమారానికి పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. నిలిచిన విద్యుత్ సరఫరా.. మండలంలోని ఈ బయ్యారం, ఎల్సీరెడ్డిపల్లి గ్రామాల్లో కరెంట్ విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపడడంతో అధికారులు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తక్షణ చర్యలో భాగంగా కొత్త విద్యుత్ స్తంభాలు, వైర్లు పునరుద్ధరించే పనిలో విద్యుత్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. విద్యుత్ వైర్లు తెగిపడి బయ్యారం, కొత్త రెడ్డిపాలెం గ్రామంలో ఆవు మృతి చెందింది. దీంతో విద్యుత్ అధికారులు పంచనామా నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. అటు దెబ్బతిన్న ఇళ్లను తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది పరిశీలించి సుమారుగా బయ్యారం పంచాయతీలో 15 ఇల్లు, ఎల్సీరెడ్డిపల్లి పంచాయతీలో 14 ఇళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న ఇళ్ల వివరాలు నమోదు చేసుకుని, ప్రభుత్వం తరఫున వారికి సాయం అందజేస్తామని తెలిపారు. -
పొడుపు కథలు..
● జుట్టులా పలుచగా ఉంటుంది కానీ పర్వతాలను కోస్తుంది.. ● గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ.. వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ● చెవులు లేవు కానీ మాట వింటుంది.. నోరు లేదు కానీ సమాధానం చెబుతుంది ● పచ్చని భవనం తెల్లని గదులు.. నల్లని బంగులు ● చిటారు కొమ్మన మిఠాయి పొట్లం● నీరు ● తేలు ● ప్రతిధ్వని ● సీతాఫలం ● తేనెపట్టు– ఇల్లెందురూరల్ -
వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జనగణన ప్రక్రియలో రూపొందించే జాబితా ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సూపర్వైజర్లతో గురువారం కలెక్టర్ తన కార్యాలయంలో జనగణన నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ సమయంలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సూపర్వైజర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేసిన కలెక్టర్ జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు కలెక్టర్ అంకిత్ గురువారం తన చాంబర్లో అక్రిడిటేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అర్హులకు శుక్రవారం నుంచి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ను కమిటీ సభ్యులు సత్కరించారు. మరింత చేరువగా ప్రభుత్వ సేవలు చండ్రుగొండ : ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని కలెక్టర్ అంకిత్ తెలిపారు. మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులు పంట మార్పిడి చేసుకునేలా వ్యవసాయశాఖాధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. సర్పంచ్ దారావత్ రామారావు, డీఆర్డీఓ విద్యాచందన, తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ పాల్గొన్నారు.జనగణన సమీక్షలో కలెక్టర్ అంకిత్ -
ప్రజా చైతన్యమే కాంగ్రెస్ ఆయుధం
కొత్తగూడెంఅర్బన్: ప్రజా చైతన్యమే కాంగ్రెస్ ఆయుధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న తెలిపారు. గురువారం కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా కమిటీకి నూతన పదవుల నియామక పత్రాల అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. గత పదేళ్లుగా అణచివేయబడ్డ తెలంగాణ సంస్కృతికి, కళలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పూర్వ వైభవం తీసుకొస్తామని, ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలను పాటల రూపంలో గడపగడపకు తీసుకెళ్లాన్నారు. ప్రతిపక్షాల అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టాలని నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్రెడ్డి, సాంస్కృతిక సేన అధ్యక్షుడు కిన్నెర లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి జానకిరామ్, గౌరవ అధ్యక్షుడు గోను లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ముత్తుజ, కిన్నెరమణి, సాంస్కృతిక సేన మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు లక్ష్మీప్రసన్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.6.25 లక్షల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం
నిందితులు భద్రాద్రి జిల్లా వాసులు ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మీదుగా తరలిస్తున్న రూ.6.25 లక్షల విలువైన 526 గ్రాముల హాష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశామని సీఐ అనుమలు శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు వివరాలు వెల్లడించారు. ఎస్సై మహేశ్, సిబ్బందితో కలిసి మండల కేంద్రం సమీపంలోని జీడివాగు వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈక్రమాన బైక్పై వచ్చిన భద్రాద్రి జిల్లాకు చెందిన నల్లగట్ల సురేంద్రకుమార్, బండ్ల సాయి అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా హాష్ ఆయిల్ లభించింది. వీరిద్దరు ఒడిశాలోని కుమురమానూరు చెందిన రాజునాయక్ వద్ద హాష్ ఆయిల్ కొనుగోలు చేసి బైక్పై ఏటూరునాగారం మీదుగా ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సిరోంచ వైపునకు వెళ్తూ పట్టుబడ్డారని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై మహేష్, సిబ్బంది హరీశ్, చంద్రమోహన్, సదానందం, సుధాకర్, మహేందర్ పాల్గొన్నారు. అన్నదమ్ములను బలితీసుకున్న ట్రాక్టర్.. బైక్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చర్ల: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడిన సంఘటన ఇది. ఇటీవల వారు ఓ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి పని నిమిత్తం భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్తుండగా మృత్యురూపంలో ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందగా.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కొడుకులు మృతి చెందారని వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విచారక ఘటన దుమ్ముగూడెం మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా.. చర్ల మండలం గొమ్ముగూడెంకు చెందిన చుంచు సంతోష్కుమార్ (22), చుంచు సాయి చరణ్ (16)లు గురువారం భద్రాచలం నుంచి చర్ల వైపునకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈక్రమంలో చర్ల నుంచి భద్రాచలం వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ డీకొట్టడంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల ఎస్సెస్సీ పూర్తి.. స్వయాన అన్నదమ్ములైన వారిద్దరు ఇటీవలే కొత్త బైక్ కొనుగోలు చేశారు. ఇందులో సాయి చరణ్ మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులవగా ఇంటర్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే జరిగిన రోడ్డు ప్రమాదంలో వారిద్దరూ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను శవ పంచనామా కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపించగా.. స్వగ్రామమైన గొంపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. చెట్టును ఢీకొట్టిన కారు.. పినపాక: మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం–రంగాపురం ప్రధాన రహదారి గోపాలరావుపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరు కరకగూడెం మండలానికి చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్ దంపతులుగా తెలిసింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో చెట్టు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తలగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం పినపాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పరిహారమే సమస్య?
నది/వాగు ముంపు గ్రామం (ఎకరాలు) కిన్నెరసాని 312 బూర్గంపాడు దోమలవాగు 194 బూర్గంపాడు పెద్దవాగు 239 నాగినేనిప్రోలు ఏదులవాగు 60 మోతే ఇరవెండి వాగు 7 ఇరవెండి తూరుబాక వాగు 75 తూరుబాక మేడివాయి వాగు 12 ఎటపాక మొత్తం 899 సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం ప్రాజెక్ట్కు సాంకేతిక చిక్కులతోపాటు నష్టపరిహారం చెల్లింపులు కూడా సమస్యగా మారింది. పరిహార భారాన్ని తగ్గించేందుకు ముంపు నష్టాన్ని తక్కువగా చేసి చూపుతున్నారనే వాదనలు ఆది నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా వాస్తవ నష్టాన్ని లెక్కించేందుకు పీపీఏ క్షేత్రస్థాయి పర్యటనకు రావడంతో అసలైన ముంపు లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. ముంపే అసలు సమస్య గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీలకు పైగా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని ఒడిసి పట్టేందుకు గోదావరిపై ఇచ్చంపల్లి, పోలవరం దగ్గర భారీ జలాశయాలు కట్టాలనే ఆలోచనలు నైజాం/ బ్రిటీష్ జమానా నుంచి ఉన్నాయి. అయితే, ప్రతిపాదిత డ్యామ్ నిర్మిత స్థలం దట్టమైన అడవుల మధ్య ఉండటం, పైగా భారీ ఎత్తున నీటిని నిల్వ చేస్తే లక్షలాది ఎకరాల భూములు ముంపునకు గురి కావడం పెద్ద సమస్యగా నిలిచింది. పోలవరం కూడా మొదట్లో 800 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం అనుకున్నది కాస్తా భారీ స్థాయిలో ముంపు ఉండటం, ఆ మేరకు అత్యంత భారీ స్థాయిలో పరిహారం చెల్లించాల్సి రావడం సమస్యగా మారింది. దీంతో ప్రస్తుతం 194 టీఎంసీలకే ప్రాజెక్ట్ను పరిమితం చేశారు. అయినప్పటికీ తెలంగాణలో ఏడు మండలాలు పోలవరం ముంపు పరిధిలో ఉండటంతో వాటిని ఆగమేఘాల మీద రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపారు. ఇంత చేసినా పోలవరం బ్యాక్ వాటర్తో ఏపీలోనే లక్షకు పైగా కుటుంబాలు నిర్వాసితులుగా తేలాయి. భద్రాచలం ఏజెన్సీ భారీగానే నష్టపోతోంది. వాస్తవాలు ఇలా ఉంటే, తెలంగాణ పరిధిలో ముంపు ప్రభావం నామమాత్రమే అనేది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాదనగా ఉంటూ వస్తోంది. వాస్తవాలు వేరే ప్రతీ ఏటా గోదావరికి వచ్చే భారీ వరదలను పరిశీలిస్తే పోలవరం బ్యాక్ వాటర్ కిన్నెరసాని నదిలో 18 కి.మీ వరకు కనిపిస్తోంది. ముర్రేడు సైతం ముంపు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారమే కిన్నెరసానితో పాటు దానిలో కలిసే దోమలవాగుకు సైతం బ్యాక్ వాటర్ వస్తోంది. దీని వల్ల 194 ఎకరాలు పరిహారం కోసం అర్హులుగా తెలంగాణ గుర్తించింది. కిన్నెరసాని నుంచి ఎగువకు రెండు వైపులా పరిశీలిస్తే పెద్దవాగు, ఏదులవాగు, ఇరవెండి వాగు, తూరుబాక, మేడివాయి వాగుల పరిధిలో సైతం ముంపు ప్రభావం ఉంది. మొత్తంగా అన్ని వాగులను పరిగణనలోకి తీసుకుంటే కనిష్టంగా 899 ఎకరాలు ముంపుగా తేలుస్తోంది. ఈ మేరకు పీపీఏ నుంచి పరిహారం రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా పులితేరు వాగు, చిన్నవాగుల నష్టాలను కూడా గణించాలని స్థానికులు కోరుతున్నారు. పరిగణనలోకి శబరి ? ప్రస్తుతం పీపీఏ లెక్కలన్నీ పోలవరం డ్యామ్ దగ్గర 45.72 మీటర్ల గరిష్ట స్థాయిలో నిల్వ ఉంచితే భద్రాచలం దగ్గర 43 మీటర్ల ఎత్తులో నీరు ఉంటుంది. కనిష్ట స్థాయిలో 41.14 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంటే 28 మీటర్ల ఎత్తుగా పేర్కొంటూ నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల్లోనే అనేక లోపాలు ఉన్నాయి. వీటిని సవరించాలనేది ప్రభావిత ప్రాంతాల ప్రజలు, తెలంగాణ డిమాండ్గా ఉంది. దీని చుట్టే సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ భద్రాచలం–పోలవరం మధ్యన కూనవరం దగ్గర శబరి గోదావరిలో కలుస్తుంది. డ్యామ్తో సంబంధం లేకుండానే శబరికి వరద పోటెత్తితే భద్రాచలం దగ్గర వరద నీరు కిందికి పోకుండా పరీవాహక ప్రాంతాలను ముంచుతుంది. అలాంటి డ్యామ్ పూర్తయిన తర్వాత తుపాన్లు, క్లౌడ్బరస్ట్ వంటి విపరీత పరిస్థితులు ఒకేసారి వచ్చినా, శబరికి భారీ వరద వచ్చినా, ప్రస్తుతం పేర్కొంటున్న లెక్కలు, అంచనాలు తలకిందులవుతాయి. భద్రాచలం ఏజెన్సీలో బ్యాక్ వాటర్ ప్రభావాన్ని అంచనా వేసేప్పుడు శబరి పోటును కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్ర విభజన సందర్భంగా గోదావరికి ఎడమ వైపు కేవలం భద్రాచలం పట్టణాన్ని మినహాయించి మిగిలిన మండలం మొత్తాన్ని పోలవరం కోటాలో ఏపీలో కలిపారు. కుడి వైపున బూర్గంపాడు మండలంలో కిన్నెరసాని నది వరకు ఉన్న గ్రామాలను తెలంగాణలో ఉంచి, మిగిలిన వాటిని ఏపీలో పంపారు. ప్రస్తుతం కిన్నెరసాని నది ఏపీ, తెలంగాణల మధ్య సరిహద్దుగా ఉంది. దీంతో సరిహద్దులో ఉన్న కిన్నెరసాని పరీవాహక ప్రాంతం ఒక్కటే పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఇబ్బందులకు గురవుతోందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) వాదిస్తోంది. అందువల్లే పీపీఏ లెక్కల ప్రకారం పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం కేవలం కిన్నెరసానికి ఎడమ వైపు బూర్గంపాడు మండలంలో 312 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టు పేర్కొంటోంది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వేయి ఎకరాలకు ముప్పు -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అదేవిధంగా స్వామి వారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. రామయ్య సేవలో మాజీ ఐఏఎస్లు..భద్రాచలంఅర్బన్: శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఉద్యోగ విరమణ పొందిన ఐఏఎస్ అధికారులు సత్యనారాయణ రెడ్డి, వెంకటరామిరెడ్డి గురువారం దర్శించుకున్నారు. కాగా వెంకటరామిరెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. పట్టణంలోని అహోబిల నర్సింహాస్వామిని, దుమ్ముగూడెం ముత్యాలమ్మతల్లిని కూడా వీరు దర్శించుకున్నారు. వీరి వెంట ఉప్పాడ ప్రసాద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనక దుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ రజనీకుమారి, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. నేడు పర్యావరణ ర్యాలీసూపర్బజార్(కొత్తగూడెం): పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉదయం 8:45 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టు నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు పర్యావరణ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, అటవీశాఖ ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. నేడు సింగరేణి సీఎండీ రాక కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం జరుగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్జ్యోతి హాజరుకానున్నారు. ఉదయం 7 గంటలకు ఇల్లెందు గెస్ట్ హౌస్లో మొక్కలు నాటి అనంతరం సింగరేణి హెడ్డాఫీస్ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ప్లాంటేషన్కు శ్రీకారంరుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైడెన్సీటీ మిక్స్డ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీఎం ఎం.శాలేంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ ఏడీ శంభూప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు జరుగుతాయని, 1,399 మంది విద్యార్థులు హాజరుకానుండగా, నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిర్వహణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు డిపార్ట్మెంట్ అధికారులు, 47 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు వివరించారు. అదనపు సమాచారం కోసం 89192 79238 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
45 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారం
సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ వేణుగోపాలచారి అశ్వారావుపేటరూరల్: వినియోగదారులు విద్యుత్ సమస్యలపై తగిన ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందిస్తే 45 రోజుల్లో పరిష్కరించాలని సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ వేణుగోపాలచారి అన్నారు. గురువారం అశ్వారావుపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో నిర్వహించిన వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరించారు. లోవోల్టేజీ సమస్య, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, కొత్త లైన్లు ఏర్పాటు, విద్యుత్ మీటర్ల సమస్యలపై, అశ్వారావుపేట, వినాయకపురం సబ్ స్టేషన్లలో ఏఈఈ పోస్టులు భర్తీ కాకపోవడం, విద్యుత్ సిబ్బంది ఖాళీలపై వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి 45 రోజులు దాటినా పరిష్కారం కాకపోతే విద్యుత్ ఫోరాన్ని ఆశ్రయించవచ్చని, ఫోరం తీర్పుపై అసంతృప్తి ఉంటే విద్యుత్ అంబుడ్స్మెన్ను ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మహేందర్, డీఈఈ రంగస్వామి, ఏడీఈ వెంకట రత్నం, ఏఈఈలు శివశంకర్, వెంకట్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
తెలుగును వారసత్వ సంపదగా అందించాలి
భద్రాచలం: తెలుగు భాషను భావితరాలకు వారసత్వ సంపదంగా అందించాలని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్రావు అన్నారు. గురువారం తన కార్యాలయంలో ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల గోడపత్రికలు ఆవిష్కరించి మాట్లాడారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో రాజమండ్రి గ్లోబల్ యూనివర్శిటీలో ఈ నెల 6 ,7 తేదీల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కవులు, సాహితీవేత్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహాసభల సమన్వయకర్త సురేష్ బాబు తోటమల్ల, గుమ్మడపు దుర్గాప్రసాద్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. పాల్వంచరూరల్: అంతర్రాష్ట్రం నుంచి అక్రమంగా ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాలిలా.. మండల పరిధిలోని కేశవాపురం గ్రామ పంచాయతీ సమీపంలోని బీసీఎం జాతీయ రహదారిపై ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్.శ్రీహరిరావు ఆధ్వర్యాన గురువారం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న రెండు స్పోర్ట్స్ బైక్లను అనుమానాస్పదంగా కన్పించడంతో ఆపి తనిఖీ చేశారు. దీంతో రూ.2.25 లక్షల విలువైన నాలుగు కేజీల 480 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న కర్నూలుకు చెందిన షేక్.మహ్మద్ అవిజ్భాషా, పాసుపాల జగన్నాథ్, మల్కాన్గిరిలోని నాళ్లగండికి చెందిన ప్రసన్నదిత్ మండల్, ప్రితమ్రాయ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు బైక్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని పాల్వంచ ఎకై ్సజ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడిలో ఎన్ఫోర్స్మెంట్ హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ.ఖలీల్ హమ్మద్, ఎస్కె.జమీల్ షరీఫ్, కానిస్టేబుళ్లు కె.ఉపేందర్, సీహెచ్.ప్రసన్న, యు.నాగరాజు, వి.శివకుమార్లు పాల్గొన్నారు. గుండాల: ఓ రైతు చేనులో దాచి ఉంచిన టేకు కలపను ఆళ్లపల్లి ఫారెస్టు అధికారులు స్వాధీన పర్చుకున్నారు. రేంజర్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో అనంతోగు గ్రామంలో ఓ రైతు చేను పక్కన గుర్తు తెలియని వ్యక్తులు టేకు కలపను దాచి ఉంచారు. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది తనిఖీ చేసి పట్టుకోగా.. వీటి విలువ సుమారు రూ. 3,60,771లు ఉంటుందన్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న కలపను పాల్వంచ డిపోకు తరలించామన్నారు. పరారైన దుండగుల కోసం దర్యాప్తు చేపట్టినట్లు రేంజర్ తెలిపారు. కల్లూరురూరల్: పొలాల్లో వ్యర్థ్యాలను నిప్పు అంటించడంతో మంటలు ఎగిసి పడి జామాయిల్ తోట కాలిపోయిన ఘటన గురువారం కల్లూరులోని రామనగర్ కాలనీ వద్ద జరిగింది. రైతులు పలువురు పొలాల్లోని పంట అవశేషాలకు నిప్పు పెట్టగా వడగాలులతో మంటలు పెరిగి సమీపంలోని మద్దినేని శ్రీనివాసరావు కుటుంబానికి చెందిన ఎనిమిది ఎకరాల జామాయిల్ తోటకు అంటుకున్నాయి. దీంతో తోట పూర్తిగా కాలిపోగా, సమీపంలోని ఎకరం భూ మిలో వేసిన మల్లెపూల తోట కూడా చాలావరకు కాలిపోయింది. అంతేకాక సమీపంలోని మిల్లుల వద్దకు మంటలు చేరుతుండడంతో యజమానులు, హమాలీల అప్రమత్తమై ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఈమేరకు కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్నాయక్, కౌన్సిలర్లు ఎం.డీ.ఇస్మాయిల్, గుండ్ల పుల్లారావు, కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు తదితరులు సత్తుపల్లిలోని అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడమే కాక మున్సిపాలిటీ ట్యాంకర్ తెప్పించి మంటలు ఆర్పించారు. -
భూసారాన్ని కాపాడుకుందాం..
టేకులపల్లి: రైతులు రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల నేల తల్లి జీవకళను కోల్పోతుందని, భూసారాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టి పరీక్షలు చేయించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి.భరత్ రైతులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఖేతి బచావో అభియాన్’కార్యక్రమంలో భాగంగా గురువారం టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామం అంబేద్కర్నగర్లో ‘మట్టి పరీక్షా, సమతుల్య ఎరువుల వినియోగం’అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవీకే ద్వారా అందిస్తున్న డబ్ల్యూజీఎల్ 44 (సిద్ది), కేఎన్ఎం 1638 వరి రకాలను ఎంచుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆయిల్ పామ్, మునగ, తీగజాతి కూరగాయల వంటి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం టేకులపల్లి ఏఓ అన్నపూర్ణ మాట్లాడగా.. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష, ఉప సర్పంచ్ అనిత, గ్రామ సెక్రటరీ మోతిలాల్, అటవీ శాఖ అధికారి లక్ష్మణ్, ఉపాధ్యాయులు బాలు పాల్గొన్నారు. -
●చుక్చుక్ రైలు వస్తోంది..
ఒకప్పుడు నలుగురు పిల్లలు కలిస్తే చాలు చుక్చుక్ రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి.. ఆగినంక ఎక్కండి అంటూ పాడుతూ ఆడేవారు. కానీ ఇలాంటి క్రమేపి తెరమరుగయ్యాయి. అంతా ఆన్లైన్ ఆటలకు అలవాటుపడ్డారు. కానీ సత్తుపల్లి అయ్యగారిపేటలో చాన్నాళ్ల తర్వాత పిల్లలు చుక్చుక్ రైలు ఆడుతుండడం కనిపించింది! – సత్తుపల్లి టౌన్గాలిదుమారం.. ఆగమాగంచండ్రుగొండ: మండలంలో మంగళవారం రాత్రి గాలిదుమారం, వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి అయ్యన్నపాలేనికి చెందిన దండుగుల చిట్టెమ్మ, బూరుగు లక్ష్మి, దాసరి చిట్టిబాబు, మరొ కరి ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. సత్యనారాయణపురంలో బచ్చల రామారావు ఇంటిపై భారీ వృక్షం పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం అదుకోవాలని రేపల్లెవాడ సర్పంచ్ ఇర్పా స్రవంతి డిమాండ్ చేశారు. చండ్రుగొండ సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి అయన్నపాలెంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆర్ఐ తిరుపతిరావు నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంతటి రామకృష్ణ, అంకిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అకాల వర్షం.. అపార నష్టంజూలూరుపాడు: మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుము లు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వినోభానగర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణయ్య రైతుకు చెందిన ఐదు ఎకరాల్లోని మునగ పంట దెబ్బతిన్నది. కాపు దశలో ఉన్న తరుణంలో ఈదురుగాలులతో సగానికి పైగా చెట్లు విరిగి పడగా రూ.3లక్షల నష్టం వాటిల్లింది. గంగావత్ శ్రీనుకు చెందిన మూడు ఎకరాల్లోని బొప్పాయి పంట దెబ్బతిని, రూ.2లక్షలు నష్టం వచ్చింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. సిరికొండ లక్ష్మి ఇంటిపై చింత చెట్టు విరిగిపడింది. నిర్మాణ దశలో ఉన్న గంగావత్ హచ్చా ఇంటిపై చెట్టు పడటంతో గోడ కూలింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు. దెబ్బతిన్న పంటలను వినోభానగర్ సర్పంచ్ నవీన్, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఇళ్లపై చెట్లు విరిగిపడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో చౌడం నరసింహారావు, గంగావత్ హచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి కుండ... ప్లాస్టిక్ బాటిల్
కరకగూడెం: ఓ ఇంట్లో డైనింగ్ టేబుల్పై మెరిసిపోయే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉండేది. ఆ పక్కనే చిన్న మట్టి కుండ ఉండేది. ప్లాస్టిక్ బాటిల్ తన రంగులను చూసుకుని గర్వపడేది. ఓ రోజు మట్టి కుండను చూస్తూ ‘నువ్వు చూడడానికి నల్లగా ఉన్నావు. నేను ఎంత మోడ్రన్గా ఉన్నానో చూడు. నన్ను అందరూ కార్లలో ఆఫీసులకు తీసుకెళ్తారు’ అని ఎగతాళి చేసింది. అందుకు మట్టికుండ నవ్వి.. ‘నువ్వు నీటిని దాస్తావు నిజమే కానీ నేను నీటిని సహజంగా చల్లబరిచి మనుషులకు ఆరోగ్యాన్ని ఇస్తాను’ అంది. అయినా బాటిల్ వినలేదు. కొద్దిరోజుల తర్వాత ఎండలు తీవ్రమయ్యాయి. ఫ్రిజ్లో పెట్టి తీసిన ప్లాస్టిక్ బాటిల్లోని నీరు ఐదు నిమిషాలకే వేడెక్కాయి. అంతేకాక బాటిల్లోని నీరు తాగిన పిల్లల గొంతు నొప్పి వచ్చింది. కానీ మట్టి కుండలోని నీరు ఎండ ఎంత ఉన్నా చల్లగానే ఉన్నాయి. దీంతో ఇంట్లో వారంతా ప్లాస్టిక్ బాటిల్ను పక్కనబెట్టి మట్టి కుండ నీటినే తాగడం మొదలుపెట్టారు. పైగా ప్లాస్టిక్ బాటిల్ పాతదైపోవడంతో దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అప్పుడు అది తాను ప్రకృతికి భారమని, మట్టి కుండ మాత్రం ప్రకృతిలో కలిసిపోయే గొప్ప వస్తువని తెలుసుకుంది. -
ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలి
భద్రాచలంటౌన్: గోదావరి వరదల గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సూచించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి అత్యవసర సమావేశంలో మాట్లాడారు. ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి పునరావాస కేంద్రాలు, రక్షణ బృందాలు, బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర సామగ్రి సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి, పశుసంపద నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. లంక గ్రామాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పించాలని చెప్పారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఎస్డీసీ ఆనంద్ కుమార్, డీఎల్పీఓ సుధీర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీధర్, ఏఓ భగవాన్ రెడ్డి, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ -
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరగాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్షించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సైదులు, సతీష్ కుమార్ పాల్గొన్నారు. నేటి నుంచి గ్రామసభలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, గ్రామాలు, వార్డుల స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టడం లక్ష్యంగా గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం గోదాం తనిఖీకొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదాంను కలెక్టర్ అంకిత్ బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో గోదాం భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా పరిస్థితులను పరిశీలించారు. సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపరిండెంట్ రంగాప్రసాద్, మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ, వివిధ పార్టీల ప్రతినిధులు లక్ష్మణ్ అగర్వాల్, జె.మోహనకృష్ణ, ఎస్.అనుదీప్, రాంబాబు, ఎన్ని కల విభాగం సిబ్బంది నవీన్, అశోక్ పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
వ్యసనంలా సెల్ఫోన్
చిన్నారులపై అధిక ప్రభావం ● పక్కదారి పడుతున్న యువత ● మానసిక ఒత్తిడి.. ఆందోళనలో తల్లిదండ్రులు ● అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్న నిపుణులుభద్రాచలంటౌన్: సాంకేతికత మనిషి జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, నేడు సెల్ఫోన్ వినియోగం ఒక పెద్ద వ్యసనంగా మారుతూ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు కేవలం సమాచార మార్పిడికి, అత్యవసరాలకు మాత్రమే పరిమితమైన మొబైల్.. నేడు ప్రతి ఒక్కరి చేతిలో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఒకే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి విడివిడిగా సెల్ఫోన్లు ఉండటం సర్వసాధారణమైంది. అయితే, పరిమితికి మించిన ఈ మొబైల్ వినియోగం ముఖ్యంగా చిన్నారులు, యువతపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతోందని విద్యావేత్తలు, వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు సెల్ఫోన్ వాడకం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతూ ఫోన్ల లో మాట్లాడటం, డ్రైవింగ్ చేస్తూనే మెసేజ్లు చూడటం వల్ల వాహనదారుల దృష్టి మళ్లుతోంది. ఈ అజాగ్రత్తల వల్ల నిత్యం ఎందరో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అవసరాల కంటే.. ఆకర్షణకే ఎక్కువ! నిజానికి విద్య, ఉద్యోగాలు, బ్యాంకింగ్ లావాదేవీలు, టికెట్ బుకింగ్, ప్రభుత్వ సేవ లు వంటి అనేక రకాల నిత్య జీవిత అవసరాలకు మొబైళ్లు ఎంతో ఉపయోగపడుతున్నా యి. కానీ, అదే సమయంలో సోషల్ మీడి యా, ఆన్లైన్ గేమ్స్, అశ్లీల కంటెంట్, జూ దం వంటి ప్రమాదకరమైన అంశాల వైపు యువత మళ్తుతోంది. ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఆన్లైన్ చదువుల పేరుతో పిల్లలకు కొనిచ్చిన ఫోన్లను.. కొందరు విద్యార్థులు కేవలం వినోదానికే పరిమితం చేస్తూ పక్కదారి పడుతుండటం తల్లిదండ్రులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. నెట్ లభ్యతతో పెరిగిన వినియోగం ఇంటర్నెట్ డేటా చార్జీలు భారీగా తగ్గడంతో పాటు, టెలికాం కంపెనీలు అపరిమిత డేటా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావ డం ఈ వ్యసనానికి మరింత ఆజ్యం పోస్తోంది. దీనివల్ల యువతలో నెట్ వినియోగం రోజురోజుకూ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగామ్ రీల్స్ వంటి వాటితో పాటు పబ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆన్లైన్ ఆటలపైనే రాత్రనక, పగలనక ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొందరు యువకులు ఈ గేమ్స్, బెట్టింగ్లకు పూర్తిగా బానిసలై చేతిలో డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరం.. సెల్ఫోన్ వినియోగంతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాడుకలో నియంత్రణ లేకపోతే భవిష్యత్లో దుష్పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన మేరకే ఫోన్లు ఇచ్చి వారిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో మత్తు పదార్థాల తరహాలోనే పెరుగుతున్న ఈ సెల్ఫోన్ వ్యసనం.. రాబోయే తరాల భవిష్యత్కు ఒక కొత్త సవాలుగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడటం చట్టప్రకారం నేరం. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ వాడటం వల్ల డ్రైవర్ దృష్టి మరలి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. ప్రయాణంలో అత్యవసర ఫోన్ కాల్స్ వస్తే.. వాహనాన్ని పక్కన ఆపి మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలి. – సంగం వెంకటపుల్లయ్య, ఎంవీఐ, భద్రాచలం -
ముంపు ముప్పు ఏమేరకు..?
బూర్గంపాడు/భద్రాచలంటౌన్: పోలవరం ప్రాజెక్ట్ ని ర్మాణంతో గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) అధికా రులు, కేంద్ర జల సంఘంఅధికారులు బుధవా రం పరిశీలించారు. గోదావరి వరదలతో ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులోని కొల్లుచెరువు ప్రాంతం, నాగినేనిప్రో లు – సారపాక మధ్యన పెదవాగు, మోతె వద్ద వెదుర్లవాగు ప్రాంతాలను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు ముందుగా సర్వే చేసి, మ్యాప్లు రూపొందించి, మా ర్కింగ్ చేసిన ప్రాంతాల్లో పర్యటించారు. బూర్గంపాడు మండలంలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములు, రాష్ట్రీయ, జాతీయ రహదారులు, గ్రామాల వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఏమేరకు నష్టం సంభవిస్తుందో నమోదు చేసుకున్నారు. స్థానికులతో మా ట్లాడి వరద వివరాలు ఆరాతీశారు. అనంతరం ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకున్నా రు. పరిశీలన బృందంలో పీపీఏ చీఫ్ ఇంజనీర్ సంజీవ్వోహ్ర, సెక్రటరీ రఘురామ్, చీఫ్ ఇంజనీర్ (పీఅండ్డీ) రమేశ్కుమార్, పీపీఏ డైరెక్టర్ (ఏఅండ్సీ) సతీశ్కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆనెపు ప్రవీణ్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, ఈఈలు వెంకటేశ్వరరావు, సయ్య ద్ అహ్మద్జానీ, డీఈఈ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, పీపీఏ బృందం భద్రా చలం కరకట్ట, స్లూయిస్లను పరిశీలించారు. స్లూయిస్ల పనితీరుపై ఆరాతీశారు. శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయానికి సం బంధించిన మ్యాప్ను పరిశీలించి ముంపునకు గుర య్యే ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. 2022లో గోదావరి వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన సుభాష్నగర్కాలనీలో పర్యటించారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక వాగు ప్రాంతాన్ని పరిశీలించారు.పోలవరం ప్రాజెక్ట్తో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అధికారుల పర్యటన -
రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, శ్రీసీతారామచంద్ర స్వామివారిని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణంలో పాల్గొని కల్యాణం తిలకించగా అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. బటర్ఫ్లై పార్కును అభివృద్ధి చేయాలి సీసీఎఫ్ భీమానాయక్ పాల్వంచరూరల్: కిన్నెరసానిలో బటర్ఫ్లై పార్కు అభివృద్ధి చేయాలని, నక్షత్ర రాశుల వనాలకు సంబంధించి మొక్కలను పెంచాలని అటవీశాఖ సీసీఎఫ్ భీమానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని డీర్ పార్కును బుధవారం ఆయన డీఎఫ్ఓ కృష్ణాగౌడ్తో కలిసి సందర్శించారు. డీర్ పార్కు ఎదుట ఔషధ మొక్కల పెంపకం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అడవులను సంరక్షించాలని కోరుతూ అటవీశాఖ అధికారులు బుధవారం పట్టణంలో ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బి.బాబు , సిబ్బంది పాల్గొన్నారు. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటంసీపీఎం రాష్ట్ర నాయకుడు బండారు రవికుమార్ అశ్వారావుపేటరూరల్: కేంద్రం, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిచ్చేందుకు చేస్తున్న మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణా తరగతులను బుధవారం ప్రారంభించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ‘మతోన్మాద, కార్పొరేట్ రాజకీయాలు’ అనే అంశంపై వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మత విభజన రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతాన్ని సెంటిమెంట్గా ఉపయోగించి విద్వేష రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధాల ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నవరపు కనకయ్య, కొక్కెరపాటి పుల్లయ్య, ఏజే రమేష్, నర్సారెడ్డి, బ్రహ్మచారి, కారం పుల్లయ్య, చిరంజీవి, పిట్టల అర్జున్, మోరంపూడి శ్రీనివాస్, ఎం.రాంబాబు, కే.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వర్షపు నీటిని రక్షించాలి
పాల్వంచరూరల్: వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకోసం ఇంకుడు గుంతలు, ఫారంపాండ్స్ను నిర్మించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ణి బి.నాగలక్ష్మి అన్నారు. మండలంలోని బస్వతారకకాలనీలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం స్వచ్ఛగ్రామం, సురక్షిత జలవాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటారు. వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను త్వరతగతిన పూర్తిచేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నియంత్రించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జర్పుల కాశ మ్మ, ఉపసర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీఓ చెన్నకేశవులు, ఏపీఎం షబానా, కార్యదర్శులు రాంబాబు, కృష్ణవేణి పాల్గొన్నారు. నేటి నుంచి గ్రామసభలు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నుంచి 10వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బొగ్గనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘నవ లిమిటెడ్’కు అవార్డుపాల్వంచ: పాల్వంచకు చెందిన నవ లిమిటెడ్కు ఎఫ్టీసీసీఐ ఎక్స్లెన్స్ ఇన్ సీఎస్ఆర్–2026 అవార్డ్ను దక్కించుకుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్, యూనిట్ హెడ్ ఎల్వీ శరత్బాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. 9వ తేదీన హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డ్ అందుకోనున్నట్లు పేర్కొన్నారు. చెట్టును ఢీకొన్న బైక్ఇల్లెందురూరల్: మండలంలోని వీరాపురం గ్రామంలో మూలమలుపు వద్ద బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలయాయి. మహబూబాబాద్ జిల్లా పాఖాల నుంచి స్వగ్రామమైన రేపల్లెవాడకు బైక్పై వస్తున్న కల్తీ స్వామి, విజయలక్ష్మి దంపతులు వస్తున్నారు. వీరాపురంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. విజయలక్ష్మి తలకు తీవ్ర గాయం కాగా, స్వామికి సైతం గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 ద్వారా ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. -
అధిక సాంద్రత.. అధిక దిగుబడి
● సరికొత్త విధానంలో పత్తి సాగుకు రైతుల మొగ్గు ● మొక్కల సంఖ్య పెరగడంతో అదేస్థాయిలో దిగుబడి ● పంట కాలం ఆరు నెలలే కావడంతో రెండో పంటకూ అవకాశం బూర్గంపాడు: అధిక సాంద్రత విధానంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పైరు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రైతులు కూడా ఇదే విధానంలో పంటలు సాగుచేసి ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 2.10లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతుంది. ఒక ఎకరానికి గతంలో ఒకటిన్నర ప్యాకెట్ల పత్తిగింజలు వేసేవారు. ప్రస్తుతం ఎకరాకు రెండున్నర ప్యాకెట్ల గింజలు వేస్తున్నారు. దీంతో పత్తి మొక్కల సంఖ్య వేలల్లో పెరుగుతున్నాయి. గతంలో ఎకరాకు సుమారు 15 వేల మొక్కలుండేవి. అధిక సాంద్రత విధానంతో మొక్కల సంఖ్య 25 వేలకు పెరిగింది. మొక్కల సంఖ్య పెరగటంతో దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. మొక్కకు 15 నుంచి 25 కాయలు కాసినా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. తక్కువ వర్షాలు కురిసినప్పుడు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయి. అధిక వర్షాలు కురిసినప్పుడు మొక్కలు ఏపుగా పెరగకుండా యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆ తర్వాత దిగుబడులు పెరగనున్నాయి. త్వరితగతిన పంటకాలం పూర్తి అధిక సాంద్రత విధానంలో ఎరువుల వినియోగం బాగా తగ్గుతుంది. మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల చేను నిండా పంట కనిపిస్తుంది. పురుగు మందుల వినియోగం కూడా తగ్గుతుంది. పంట తొందరగా కాపునకు వస్తుంది. త్వరితగతిన పంటకాలం పూర్తవుతుంది. దీంతో సాగునీటి వనరులు ఉన్న దగ్గర రైతులు మరో పంట సాగు చేసుకునే వీలుంటుంది. జిల్లాలో వానాకాలం పత్తి పంట వేసిన రైతులు ఆరు నెలల్లో డిసెంబర్ వరకు పంట తీసుకుని ఆ తర్వాత మొక్కజొన్న, కూరగాయలు, అపరాల పంటలు సాగు చేస్తున్నారు. గతంలో మాదిరి పత్తి సాగు చేస్తే మొక్కలు బాగా ఏపుగా పెరిగేందుకు ఎరువులు ఎక్కువగా వేయాల్సి వచ్చేది. మొక్కలు బాగా పెరిగేందుకు, కాపు వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టేది. పత్తి పంటకాలం తొమ్మిది నుంచి పదినెలలు పట్టేది. దీంతో రైతులు రెండో పంట వేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. రసాయనిక ఎరువుల వినియోగం పెరగటంతో భూసారం రోజురోజుకూ తగ్గిపోతోంది. పంట చేలల్లో పైరు ఎదుగుదలకు విపరీతంగా ఎరువులు వేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక సాంద్రత విధానాలను రైతులకు సూచిస్తున్నారు. ఈ విధానంలో సాగు చేసిన పంటను రెండు విడతల్లోనే పూర్తిగా తీసుకునే అవకాశాలుండటంతో కూలీల సంఖ్య తగ్గుతుంది. ఐదారేళ్లుగా రైతులు ఈ విధానంలో పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. క్రమంగా రైతుల సంఖ్య పెరుగుతోంది. -
భూముల విలువ మరింత!
● రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి.. ● వ్యవసాయేతర భూములపై 15 నుంచి వంద శాతం పెంపు ● వ్యవసాయ భూముల విలువ సైతం రెట్టింపు ఖమ్మంమయూరిసెంటర్: భూముల మార్కెట్ విలువల పెంపుపై కొద్దినెలలుగా తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువ అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోనూ కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. వ్యవసాయ భూముల విలువలను అదనపు కలెక్టర్ ఆధ్వర్యాన తహసీల్దార్లు, వ్యవసాయేతర భూములు, ప్లాట్లు, ఇళ్ల మార్కెట్ విలువలను జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యాన సబ్ రిజిస్ట్రార్లు ప్రత్యేక ఫార్మాట్లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి 763 గ్రామాల్లో మార్కెట్ విలువలను ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిసింది. తక్కువ ఉంటే ఎక్కువగా.. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను 15 శాతం నుంచి 100 శాతానికి పెంచినట్లు తెలుస్తోంది. గజం రూ.500 ధర ఉన్న ప్రాంతాల్లో వంద శాతం పెంచి రూ.వేయిగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఇప్పటికే అత్యధిక ధర ఉన్న ప్రాంతాల్లో 15 శాతం మేర మాత్రమే పెంచినట్లు తెలిసింది. తద్వారా ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో 15 శాతమే భూమి ధర పెరగనుంది. గాంధీచౌక్ ప్రాంతంలో గజం ధర రూ.49 వేల వరకు ఉండగా.. పెంపులో పెద్దగా వ్యత్యాసం ఉండదని తెలిసింది. ఇక వ్యవసాయ భూములకు సంబంధించి ధర రెట్టింపు చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఎకరం ధర కనిష్టంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల లోపు ఉండేలా సవరించినట్లు చర్చ జరుగుతోంది. ప్రధాన హైవేలు, పట్టణాలకు సమీపాన ఉన్న ప్రాంతాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ధర రెట్టింపు చేసినట్లు తెలిసింది. ఈ నెల 5వ తేదీ శుక్రవారం నుంచి పెరిగిన భూముల మార్కెట్ ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో గురువారం పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యాన గురువారం ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. గత నెల 29వ తేదీ నుంచే కార్యాలయాల పనివేళల పొడిగింపు అమల్లో ఉంది. ఈ మేరకు బుధవారం వరకు ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 408 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో రూ.2,88,51,787 ఆదాయం సమకూరింది. -
‘పోలవరం’తో భద్రాచలంలో మురుగు!
ప్రాజెక్ట్లో డెడ్ స్టోరేజీస్థాయి నీటి నిల్వ ఉన్నా కరకట్ట స్లూయిస్ గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఫలితంగా మురుగు నీటి ప్రవాహానికి బ్రేక్ పడి భద్రాచలంలో వరద పెరిగే అవకాశం పైనుంచి వరద పెరిగి దిగువన శబరి పోటేసిందంటే పట్టణానికి తీవ్ర ముప్పు ఇరిగేషన్ విభాగం అంచనా ప్రకారం ఏడాదిలో 9 నెలలపాటు ముంపు గుప్పిట్లోనే భద్రగిరి జిల్లాలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బృందం దృష్టి సారించాలని స్థానికుల వేడుకోలు2022, జూలైలో వచ్చిన గోదావరి వరదలతో నీట మునిగిన భద్రాచల పట్టణం ఇప్పటికే ఇబ్బందుల్లో.. భద్రాచలం పట్టణానికి గోదావరి వరద నుంచి రక్షణ కల్పించేందుకు 2002/2003లో 80 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించారు. పరిసరాల్లో పడిన వర్షపు నీరు, పట్టణంలో వెలువడే మురుగు నీరు గోదావరిలో కలిసేందుకు కరకట్టకు ఎనిమిది చోట్ల స్లూయిస్ గేట్లను ఏర్పాటు చేశారు. గోదావరి వంతెనకు ఎటపాక వైపు 4.82 కి.మీలు కరకట్ట ఉండగా, ఐదు స్లూయిస్ గేట్లు ఉన్నాయి. ఆలయం వైపు రూ.2.95 కి.మీ కరకట్ట ఉండగా, మూడు స్లూయిస్ గేట్లు ఉన్నాయి. గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక 43 మీటర్ల వద్ద ఉండగా, మూడో ప్రమాద హెచ్చరిక 53 మీటర్ల దగ్గర ఉంది. కరకట్టకు ఉన్న ఎనిమిది స్లూయిస్ గేట్లలో రెండు గేట్ల ఎత్తు 43 మీటర్లు, అంతకంటే దిగువన ఉన్నాయి. కీలకమైన విస్తా కాంప్లెక్స్ గేటు ఎత్తు 44.50 మీటర్లుగా ఉంది. గోదావరిలో వరద మొదటి ప్రమాద హెచ్చరికస్థాయి(43 మీటర్ల) వరకు రాకముందే.. 38 మీటర్ల వరకు చేరుకోగానే ముందు జాగ్రత్తగా ఈ మూడు చోట్ల డ్రెయినేజీ స్లూయిస్ గేట్లను మూసివేస్తున్నారు. ఇక్కడ ఆగిపోయే వరదను మోటార్ల ద్వారా గోదావరిలోకి ఎత్తి పోస్తున్నారు. ఏడాదిలో కనీసం ముప్పై రోజుల పాటు ఇలా శ్రమించాల్సి వస్తోంది. రేయింబవళ్లు కష్టపడిన కీలకమైన విస్తా గేటు వరద కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు, పోకల దమ్మక్క అన్నదాన సత్రం ప్రతీ సీజన్లో ముంపునకు గురవుతున్నాయి. బాధ్యత పీపీఏదే ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు ఇలా ఎనిమిది గేట్లను మూసివేసి, ఎత్తిపోతల ద్వారానే ఎటపాక నుంచి భద్రాచలం వరద, డ్రెయినేజీ నీరును గోదావరిలోకి పంప్ చేయాల్సి ఉంటుంది. ఇక పోలవరం డెడ్ స్టోరేజీ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా 42.67 మీటర్ల ఎత్తులో నీరు నిలిచినప్పటికీ భద్రాచలం దగ్గర మూడు స్లూయిస్ గేట్ల దగ్గర ఇబ్బంది తప్పదు. కేవలం ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 28 మీటర్లుగా ఉంటుంది. అంటే, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగం అంచనాల ప్రకారం ఏడాదిలో 9 నెలల పాటు భద్రాచలం పట్టణం పోలవరం ముంపు గుప్పిట్లో ఉంటుంది. ఈ ముప్పును తొలగించేందుకు ఎటపాక, భద్రాచలం పట్టణానికి కచ్చితంగా మెరుగైన డ్రెయినేజీని నిర్మించాల్సిన బాధ్యత పోలవరం ప్రాజెక్టు అథారిటీదే అవుతుంది. ఈ మేరకు పీపీఏను ఒప్పించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ సర్కార్ ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.స్లూయిస్ గేట్లు ఎత్తు డేంజర్ జోన్ ఎటపాక–1 50.90 లేదు ఎటపాక–2 50.90 లేదు ఎటపాక–3 40.25 ఉంది కొత్తకాలనీ 43.50 ఉంది రెడ్డి సత్రం 47.85 పర్వాలేదు విస్తాకాంప్లెక్స్ 44.50 ఉంది సుభాష్నగర్ 50.90 లేదు డంపింగ్ యార్డ్ 50.90 లేదుగోదావరి బ్యాక్ వాటర్ ముంపు ప్రభావాన్ని అంచనా వేసేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) జిల్లాలో పర్యటిస్తోంది. ప్రస్తుతానికి పీపీఏ దృష్టి అంతా బ్యాక్ వాటర్ కారణంగా కిన్నెరసాని పరీవాహకంలో కేవలం 320 ఎకరాలే ముంపునకు గురవుతుందని నిరూపించడంపైనే ఉంది. తెలంగాణ సర్కారేమో సుమారు వెయ్యి ఎకరాలకు నష్టమని చెబుతోంది. ఈ రెండు వాదనల మధ్య భద్రాచలం మురుగు సమస్య మరుగున పడిపోతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంపోలవరం ఎఫ్ఆర్ఎల్ : 45.72 మీటర్లు డెడ్ స్టోరేజీ లెవల్ : 43.67 మీటర్లు భద్రాచలం డ్రెయినేజీ కనిష్ట ఎత్తు : 40.25 మీటర్లు విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ గేట్ : 44.50 మీటర్లు పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 42.67 మీటర్లు, గరిష్ట నిల్వ సామర్థ్యం 45.72 మీటర్లుగా ఉంది. భద్రాచలం ఆలయం సగటు ఎత్తు 61 మీటర్లు, పట్టణం 55 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎంత సేపటికీ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 45.72 వద్ద నిలపడం వల్ల 55 మీటర్ల ఎత్తులో ఉన్న భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం ఉండదని వాదిస్తోంది. కానీ, భద్రాచలం డ్రెయినేజీ గోదావరిలో కలిసే ప్రాంతం 43 మీటర్ల ఎత్తు దగ్గర ఉంది. ఫలితంగా డ్యామ్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే..అంటే 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాచలం దగ్గర కనీసం నాలుగు స్లూయిస్ గేట్లను మూసి వేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా పై నుంచి వరద ప్రవాహం పెరిగి, దిగువన శబరికి పోటు వచ్చిందంటే ఎనిమిది గేట్లను మూసివేయకతప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇది భద్రాచలం పట్టణాన్ని తీవ్ర వరద ముప్పులోకి నెడుతుంది. ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపి వేయాల్సి పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. -
వాతావరణ ం
జిల్లాలో గురువారం పగటి వేళ అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాయంత్రం అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కోవాలిఎస్పీ రోహిత్రాజుసూపర్బజార్(కొత్తగూడెం): రాబోయే వర్షాకాలంలో జిల్లాలో వరదలు, ప్రకృతి వైరీత్యాను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖలతో బుధవారం నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్, చెట్లను తొలగించడానికి అవసరమైన కట్టర్లు, ఇతర రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్, టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ మరియదాస్, ఆపరేషన్ ఆర్ఐ బి.రవి, సింగరేణి రెస్క్యూ టీం ఇన్చార్జ్ అనంత రాములు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సుమంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఉత్సాహంగా సైక్లింగ్ పోటీలుసూపర్బజార్(కొత్తగూడెం): శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న సైక్లింగ్ వేసవి శిక్షణా శిబిరంలో బుధవారం ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. విజేతలకు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి చేతుల మీదుగా మెడల్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ నాగేశ్వరరావు, రైఫిల్ షూటింగ్ కోచ్ నబీ, ఉదయ్కుమార్ పాల్గొన్నారు. -
9.5 కిలోల గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఏపీ సరిహద్దు నుంచి తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. సీలేరు నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్నవారు కూనవరం రహదారిపై పోలీసులకు చిక్కారు. ఒక బైక్పై తరలిస్తున్న 4.3 కిలోలు, మరోబైక్పై తరలిస్తున్న 5.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బానోత్ వీరేందర్, గుత్తికొండ యశ్వంత్, షేక్ ఖాసీం, షేక్ అమీర్ను అరెస్టు చేసి, బైక్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6.20 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుళ్లు ఖలీల్ అహ్మద్, జమాల్ షరీఫ్, కానిస్టేబుళ్లు శివకుమార్, నాగరాజు, ప్రసన్నకుమార్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. నలుగురు వ్యక్తుల అరెస్ట్ -
అడ్వకేట్ల రక్షణకు చట్టం అమలు
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల గౌరవం, స్వాతంత్య్రం, భద్రతలను పరిరక్షించేందుకు ఈ చట్టం మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ చట్ట సాధన కోసం తెలంగాణ రాష్ట్ర న్యాయవాద సమాజం ఎన్నో సంవత్సరాలుగా ఐక్యంగా పోరాడిందన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్ను సానుకూలంగా పరిగణించి ఈ చారిత్రాత్మక చట్టం అమలుకు కృషి చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చట్ట రూపకల్పన, ఆమోద ప్రక్రియలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో బిల్లును ఆమోదింపజేయడంలో చురుకై న పాత్ర పోషించిన దేవరకద్ర శాసనసభ్యుడు, న్యాయవాది జి.మధుసూదన్రెడ్డికి అభినందనలు తెలిపారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సమర్థవంతంగా అమలవుతూ, న్యాయవాదుల హక్కులు, గౌరవం, భద్రతలను మరింత బలోపేతం చేస్తుందని ఫెడరేషన్ ఆశాభావం వ్యక్తం చేస్తోందన్నారు. న్యాయవాదుల హర్షం అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన సందర్భంగా కొత్తగూడెం కోర్టులో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జీవీకే మనోహర్, పప్పుల ప్రసాద్, వేల్పుల సుధాకర్, గడదాసు నాగరాజు, జి.రామ్మూర్తి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ సుభిక్షంగా ఉండాలి..
రామాలయంలో సుదర్శన హోమం భద్రాచలం: రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం, ఇతర పూజలు జరిపారు. అనంతరం బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పూజల్లో ఆలయ ఈఓ దామోదర్రావు, ప్రధానార్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, అర్చకులు, పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలోని సబ్ స్టేషన్ ఆవరణలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడీఈ వెంకట రత్నం తెలిపారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే సదస్సులో సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ వేణుగోపాలచారి పాల్గొని విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈమేరకు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీపీగా అజయ్కుమార్ సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొట్టే అజయ్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి నుంచి ఆయన బదిలీపై కొత్తగూడెం వచ్చారు. ఇప్పటికే కొత్తగూడెం మొదటి, రెండో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏపీపీగా నర్సింగోజు అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం నేడు ధర్నా రుద్రంపూర్: సింగరేణిలో సుమారు 350 మంది కార్మికులు ఏడాదిన్నర క్రితం మెడికల్ అన్ఫిట్ అయినా, వారి పిల్లలకు ఇంటర్వ్యూ నిర్వహించినా పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం చేయడం సరికాదని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ బుధవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. కాగా, యాజమాన్యం స్పందించి నియామక పత్రాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం కామేపల్లి: కామేపల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో శ్రీ హరిహర గురుక్షేత్రం(శివాలయం) నిర్మించనుండగా, తాళ్లగూడెంకు చెందిన పుచ్చకాయల కృష్ణ – భద్రమ్మ దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్కు మంగళవారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేయగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.శివాజీ, పి.కోటయ్య, వి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో గిరిజన సమగ్రాభివృద్ధి
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ భద్రాచలం: పోరాటాలు, అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా పాటుపడుతోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగిస్తున్న గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. విద్యా, వైద్యం ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు సాగునీరు, తాగునీరు, స్వయం ఉపాధి రంగాల్లో అభివృద్ధికి అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజన మ్యూజియం, గిరిజన మార్ట్ల ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల అధికారులు ఉదయ్కుమార్, గన్యా, వేణు, అశోక్, సైదులు, ఆనంద్కుమార్, వెంకటపుల్లయ్య, సున్నం రాంబాబు, మణిధర్, రమేశ్, అలివేలు మంగతాయారు, హరికష్ణ, రాజకుమారి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ రాజ్యంలో మహిళా స్వశక్తి
ఇల్లెందు: రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయనుందని, ఆ దిశగా మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛన్లు ఇలా పలు పథకాల వల్ల మహిళలు స్వశక్తితో నిలబడగలుతున్నారని తెలిపారు. మహిళా సంఘాలకు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో అప్పగించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 4,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు. పూసపల్లి ఓసీ ప్రారంభానికి కృషి జరుగుతుందని తెలిపారు. తనకు, తన కుటుంబానికి భూములు ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేయటం తగదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్మిత్ర, వైస్ చైర్మన్ పి.రాజు, మాజీ చైర్పర్సన్ అనసూర్య, బోళ్ల సూర్యం, మండల రాము, మడుగు సాంబమూర్తి, గాలిపల్లి స్వరూప పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం జూలూరుపాడు: అన్నారుపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం మంగళవారం జరిగింది. సర్పంచ్ భూక్యా ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు, స్థానికులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రావణి, సెక్రటరీ రమణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కృష్ణమూర్తి విగ్రహం ఏర్పాటు చేయాలి పాల్వంచ: తెలంగాణ తొలి ఉద్యమకారుడు పోటు కృష్ణమూర్తి విగ్రహాన్ని ప్రభుత్వం పాల్వంచలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్జేకే అహ్మద్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పోటు కృష్ణమూర్తి సతీమణి లక్ష్మిని సన్మానించారు. మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో పోటు కృష్ణమూర్తి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, జారే భిక్షం, ఆళ్ల రాఘవ, నయీం, నాయుడు, ఆసీఫ్, పోటు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం రుద్రంపూర్: కార్మిక ప్రాంతం రామవరం సీఆర్పీ క్యాంప్కు చెందిన సృజన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యఖర్చులు సుమారు రూ.3 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆటోయూనియన్ నాయకులు మర్రి కృష్ణ ఆధ్వర్యంలో రూ.27,500 చందాలు సేకరించి మంగళవారం సృజన్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి అశోక్, ఇమ్రాన్ అలీ, జాన్పాల్, గాంధీ,భరత్ తదితరులు పాల్గొన్నారు.డిగ్రీ విద్యార్థిని అదృశ్యం పాల్వంచరూరల్: డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాండురంగాపురం తండాకు చెందిన బానోతు హిందు (22) సోమవారం అర్ధరాత్రి చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె తండ్రి తులసీరాం మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.సురేశ్ తెలిపారు. విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి టేకులపల్లి: సులానగర్ గ్రామంలో మంగళవారం గాలిదుమారంతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గ్రామానికి చెందిన కోరం సంపత్కు చెందిన దుక్కిటెద్దు అటుగా వెళ్లడంతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఎద్దు విలువ రూ.లక్ష ఉంటుందని, వ్యవసాయానికి, జీవనాధారానికి ప్రధాన ఉండేదని, బాధిత రైతును ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తగిన నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
మరో వందేళ్లు
సింగరేణి విరాజిల్లాలి రుద్రంపూర్: సింగరేణి సంస్థ 137 ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తుండగా.. మరో వందేళ్లు ఇలాగే కొనసాగేలా అందరూ సహకరించాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సింగరేణి ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఆ తర్వాత ప్రకాశం స్టేడియంలో కూడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత స్టేడియం నుంచి బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులు రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న అభివృద్ధిలో సింగరేణి కీలకంగా నిలుస్తోందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి, సౌరశక్తి, పవనశక్తి, అరుదైన ఖనిజాల అన్వేషణ వంటి రంగాలలో అడుగులు వేస్తున్న నేపథ్యాన కార్మికులు మరింత శ్రద్ధ వహిస్తూ వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం 16 మంది ఉత్తమ కార్మికులను సన్మానించగా, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలంరించాయి. ఇక సాయంత్రం కూడా ప్రకాశం స్టేడియంలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనంతరం సినీ, టీవీ గాయకులు, కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమల్రావు, నాయకులు, అధికారులు రాజ్కుమార్, త్యాగరాజన్, రమణమూర్తి, టి.లక్ష్మీపతిగౌడ్, కె.అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాజరుకాని సీఎండీ, డైరెక్టర్ (పా) సింగరేణికి సంబంధించి తెలంగాణ ఆవిర్భావ వేడుకల ప్రధాన కార్యక్రమం కొత్తగూడెంలో నిర్వహించగా సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్, డైరెక్టర్ (పా) గౌతం పోట్రు హాజరుకాలేదు. దీంతో కార్మికులు నిరాశకు లోనయ్యారు. మరోపక్క కార్మికులకు సెలవు ప్రకటించకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇటీవల గనుల పరిశీలనకు రాగా ఆదివారం అయినప్పటికీ ఏరియాలో అందరికి ప్లేడే నిర్వహించి డ్యూటీలు వేశారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని విస్మరించడంపై పలువురు తప్పుట్టారు. ఆవిర్భావ వేడుకల్లో డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
సంక్షేమం, సమగ్ర అభివృద్ధి
ఇదే ధ్యేయంగా అంతా దీక్ష బూనాలి ● ‘సీతారామ’తో 1.57లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ● సీతమ్మసాగర్ కోసం 3,123 ఎకరాల భూసేకరణ పూర్తి ● తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ క్రమాన దేశం దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక’ పేరిట ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్త్తోందని తెలిపారు. గ్రామ, వార్డు మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 2,07,391 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయగా, 63,614 మంది రైతులకు రూ.400కోట్లకు పైగా రుణమాఫీ చేశామని తెలిపారు. అలాగే, 1.05లక్షల మంది రైతులకు బీమా చేయగా, అందులో 1,924 మంది రైతు కుటుంబాలకు రూ.96.20కోట్ల పరిహారం అందిందని చెప్పారు. ఇక ఆయిల్ పామ్, కోకో సాగు విస్తీర్ణంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానాన నిలిచిందని తెలిపారు. సూపర్బజార్(కొత్తగూడెం): అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడం, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దీక్ష బూనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో మంగళవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మంత్రి, ఆతర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొనగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కింద జూలూరుపాడుకు చెందిన యెల్లంకి కళావతి, కేలోత్ బాలు(సాయిరాం తండా), బాదావత్ లలిత(గుండ్లరేవు), చిమట వెంకటనరసమ్మ(శంభునిగూడెం)కు మంత్రి మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే, 478 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ.51.06 కోట్ల చెక్కు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.59.53 లక్షల చెక్కులు అందజేశాక మంత్రి తుమ్మల మాట్లాడారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడు పంప్ హౌస్లను ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రధాన కాల్వ నుంచి ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా నీరు విడుదల చేయగా, ఉప ప్రధాన కాలువ పనులకు టెండర్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో 1,57,574 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు చిన్న నీటి తరహా చెరువుల కింద 42,935 ఎకరాల స్థిరీకరణకు ప్రతిపాదించామన్నారు. ఇక సీతమ్మ సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ కోసం 3,123 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని తెలిపారు. అలాగే, 21 చెక్డ్యాంలతో 7,275 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ 875 కోట్లతో 127 రహదారుల పనులు చేపట్టగా 48 పూర్తయ్యాయని చెప్పారు. కాగా, పాండురంగాపురం – సారపాక రైల్వే లైన్, కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలోని 1,323 ప్రభుత్వ పాఠశాలలో 59,088 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇప్పటికే అందిస్తుండగా, ఈ విద్యాసంవత్సరంలో ఉదయం అల్పాహారం కూడా పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతేకాక జూనియర్ కాలేజీల విద్యార్థులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమల్లోకి రానుందని చెప్పారు. ఐదు నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశామని, కొత్తగూడెంలో దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుచేశామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 1.84లక్షల మందికి పైగా వినియోగదారులకు రూ.40.76 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మహాలక్ష్మి ద్వారా 5.36 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యాప్రమాణాల మెరుగునకు కృషి
డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన వాసంతి కొత్తగూడెం అర్బన్: జిల్లాలో విద్యాప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు. డీఈఓగా నియమితులైన ఆమె కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) శంభుప్రసాద్, ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాల పెంపు, అభివృద్ధికి కృషి చేయడమే కాక ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా పాటుపడతానని తెలిపారు. అనంతరం డీఈఓ వాసంతి కలెక్టర్ అంకిత్ను మర్యాద పూర్వకంగా కలిశారు. -
దేవ్సింగ్కు ఉత్తమ ఉద్యోగి అవార్డు
టేకులపల్లి: విధి నిర్వహణలో అంకితభావం కలిగిని బొమ్మనపల్లి ఆపరేషన్ సెక్షన్ లైన్మ్యాన్ బి.దేవ్సింగ్కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్లో నిర్వహించిన కంపెనీ స్థాయి కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగి అవార్డును ప్రదానం చేశారు. మూడేళ్లుగా 11 కేవీ ముత్యాలంపాడు ఫీడర్, 11 కేవీ మద్రాస్ తండా ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిర్వహణ బాధ్యతలను దేవ్సింగ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గాలి తుఫానులు, భారీ వర్షాలు కురిసినప్పుడు, చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ప్రతిసారీ, రాత్రింబవళ్లు శ్రమించారు. అనేక విపత్కర సందర్భాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ డీఈ, ఏడీఈ, ఏఈల సిఫార్సు మేరకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లైన్మ్యాన్ దేవ్సింగ్కు విద్యుత్ అధికారులు, సహోద్యోగులు, స్థానికులు అభినందనలు తెలియజేశారు. -
10న ఇఫ్టూ రాజకీయ శిక్షణ తరగతులు
టేకులపల్లి: కొత్తగూడెం జిల్లా స్థాయి ఇఫ్టూ రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర నాయకులు డి.ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం కోయగూడెం ఎల్ఎస్ఎన్ ఓబీ పరిధిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయనతో పాటు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవ్ పాల్గొన్నారు. మాట్లాడుతూ జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఐఎఫ్టీయూ నిరంతరం పోరాడుతోందని కొనియాడారు. ఆవిర్భావం నుంచి ఎదురైన అనేక నిర్బంధాలను తట్టుకొని, కార్మికుల పక్షాన నిలబడి ఎన్నో విజయాలు సాధించిందని, కార్మిక శక్తి ముందు ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయన్నారు. జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎల్ఎస్ఎన్ ఓబీ రెండు షిఫ్టుల కార్మికులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుడికి సన్మానం
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమంలో పాల్గొని పోలీసు కాల్పుల్లో బుల్లెట్లతో గాయపడిన కొత్తగూడెం హనుమాన్ బస్తీ వాస్తవ్యుడు మదనయ్యను తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోషియేషన్ నాయకులు చుంచుపల్లిలోని ఉద్యోగుల సంఘం భవనంలో మంగళశారం ఘనంగా సన్మానించారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వాలు ఉద్యమకారులను విస్మరించాయని, ఉద్యమంలో పాల్గొని అన్నీ కోల్పోయిన ఉద్యమాకారులను ఇప్పటికై నా గుర్తించి తగు పారితోషికం, ఇతర సదుపాయలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాపయ్య, సాయిబాబ, బి.వెంకటేశ్వర్లు, డిస్టిక్ట్ కౌన్సిలర్ గొల్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ చుంచుపల్లి: విద్యానగర్లోని పీఎం బ్రదర్స్ ఆస్పత్రిలో చికిత్సలపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాందాస్ ఆధ్వర్యాన మంగళవారం తనిఖీ చేపట్టారు. పూర్తి వివరాలతో కలెక్టర్, డీఎంహెచ్ఓకు నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ హరీశ్, డాక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు. భారీ వర్షం జూలూరుపాడు: మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షం ఉపశమనాన్ని కలిగించింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలిటేకులపల్లి: కొత్తగూడెం జిల్లా సారపాకలో మంగళవారం నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా మహాసభలకు టేకులపల్లి మండలం నుంచి ఎన్నికై న ప్రతినిధులు వెళ్లారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, గుగులోతు రామచంద్, నరసింహారావు, భూక్యా నర్సింగ్ మాట్లాడుతూ ఈ జిల్లా మహాసభల్లో చర్చించి ఆమోదించే కీలక నిర్ణయాలను, భవిష్యత్ కార్యాచరణను టేకులపల్లి మండలంలో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే విరమించుకోవాలనే ప్రధానాంశంపై ఈ సభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మహాసభకు వెళ్లినవారిలో భూక్యా కీర్యా, అనంతోజు చంద్రచారి, పాయం సూరయ్య, కల్తీ స్వామి, బాలు, మేకల పొట్టయ్య తదితరులు ఉన్నారు. నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలి జూలూరుపాడు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు పచ్చిరొట్ట విత్తనాలతోపాటు, అన్నిరకాల పంటలకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ ధర్మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పడమటనర్సాపురంలో జరిగిన అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) కొత్తగూడెం డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నకిలీ విత్తనాలతో దళారీ వ్యవస్థ పెరిగిందని ఆరోపించారు. దీంతో రైతులు దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పాత రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బైరి వెంకన్న, లింగాల వీరభద్రం, తోటకూరి నరేష్, పారుపల్లి బాబురావు, అర్జున్రావు, పద్మ, పద్మావతి పాల్గొన్నారు. -
జయహో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధన పోరాటంలో మృతి చెందిన అమరవీరులకు నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల పునాదులపైనే నేటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అమరుల ఆశయాలు సాధించేందుకు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రజా సంక్షేమం, హక్కుల రక్షణ కోసం కృషి చేయాలన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ ఘనంగా రాష్ట్రావతరణ దివోత్సవం ● ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఎగిరిన జాతీయ జెండా -
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ఎస్పీ కార్యాలయ ఆవరణలో మంగళవారం జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ ఎందరో త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పాటుపడుతూ, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అనంతరం రాష్ట్రప్రభుత్వ పతకాలకు ఎంపికై న చర్ల సీఐ రాజువర్మ, ఆర్ఐ బి.రవిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీలు ఆదినారాయణ, మల్లేశ్స్వామి, సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యా, సీఐలు, ఎస్ఐలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ -
భూసేకరణకు సహకరించాలి
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా కార్యాలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. మంగళవారం జెండా ఆవిష్కరణలతోపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. –సూపర్బజార్ (కొత్తగూడెం)● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● సీతారామ డిస్ట్రిబ్యూటరీ కాలువలు, మారెళ్లపాడు లిఫ్ట్పై సమీక్షఅశ్వాపురం: సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, రైతులు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో సీతారామ ప్రాజెక్ట్ ఫేజ్–1 పంప్హౌస్ సమీపంలో నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను సోమవారం ఆయన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ఠలతో కలిసి పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. బీజీ కొత్తూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారెళ్లపాడు లిఫ్ట్ పనులు జూలై లోపు పూర్తి చేయాలని అన్నారు. సీతమ్మసాగర్కు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో నీటి విడుదలకు ముందే సీతారామ కాలువలను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. పంప్హౌస్ నిర్మాణానికి సహకరించిన బీజీ కొత్తూరు గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో రహదారి, మౌలిక సదుపాయాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, తుమ్మలచెరువును అభివృద్ధి చేయాలని మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య, మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి వినతిపత్రం అందజేయగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ నర్సింహారావు, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాసరెడ్డి, మేఘా సంస్థ ఏవీపీ శ్రీనాథ్రెడ్డి, ఇతర అధికారులు సూర్యప్రకాష్, ముత్యాలరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య పాల్గొన్నారు. -
రామయ్య భూములకు రక్షణ కల్పించండి
● చింతూరు సబ్కలెక్టర్, పీఓలకు భద్రాచల రామాలయ అధికారుల వినతి ● త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చిన ఏపీ అధికారులు భద్రాచలం: అన్యాక్రాంతం, అనుమతిలేని నిర్మాణాలతో 900 ఎకరాల రామయ్య భూములు కబ్జాకు గురవుతున్నాయి. రక్షణ కల్పించాలని భద్రాచలం రామాలయ అధికారులు ఏపీ ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఆలయ ఈవో దామోదర్రావు మూడు రోజుల క్రితం రంపచోడవరం కలెక్టర్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్కుమార్, చింతూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం మక్వాల్ను కలిసి సమస్య విన్నవించారు. దేవస్థాన భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, భూముల యాజమాన్యం, పరిరక్షణ, నిర్వహణ తదితర అంశాలను వివరించారు. త్వరలో మళ్లీ కమిటీ ఏర్పాటు పది రోజుల్లో సంబంధిత రెవెన్యూ, దేవాదాయ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చింతూరు సబ్ కలెక్టర్ ఈఓకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విధి విధానాలను ప్రకటించినా క్షేత్రస్థాయి పరిశీలనకు మాత్రం రాలేదు. అంతర్రాష్ట్ర సమస్యగా మారడం, చట్టాల్లోని లొసుగుల ఆధారంగా అక్రమ నిర్మాణాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. దీంతో దేవస్థానం అధికారులు నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది. ఏపీ నుంచి ఆదేశాలు వస్తేనే.. రంపచోడవరం, చింతూరు ఉన్నతాధికారులను దేవస్థానం అధికార వర్గాలు కలిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, సదరు దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు వస్తేనే పురుషోత్తపట్నం భూముల్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విభజన నుంచి సమస్య జఠిలంగా మారినా పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. ఫలితంగా వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వాగ్వాదాలు, తోపులోటలతో రామయ్య భూములు యుద్ధక్షేత్రాలుగా మారుతున్నాయి. -
హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ
పాల్వంచ: పట్టణంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లను సోమవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇ.శరత్ తనిఖీ చేశారు. పలు హోటళ్లలో శుభ్రత, నాణ్యత లేకుండా ఆహార పదార్థాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశంపై శ్రీఫుడ్ ఇన్స్పెక్టర్ జాడెక్కడ?శ్రీ అనే కథనం సాక్షిలో ప్రచురించితమైంది. దీంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బీసీఎంరోడ్లోని మెస్లు, రెస్టారెంట్లను తనిఖీ చేసి, తినుబండారాలు, సరుకులను పరిశీలించారు. పలు శాంపిళ్లను సేకరించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ఫిర్యాదు ఉన్నా 83670 56146 నంబర్లో సంప్రదించాలని, ఆరు నెలల కాలంలో 43 కేసులు నమోదు చేసి, రూ.1.5 లక్షలు జరిమానా విధించామని వెల్లడించారు. -
పాఠశాలలకు ముందే పుస్తకాలు
పాల్వంచ: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందిస్తామని ఎంఈఓ శ్రీరామ్మూర్తి అన్నారు. సోమవారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో మండలంలోని 75 మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు యూడీఐఎస్ఈ ప్రకారం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను ముందుగానే సిద్ధం చేసి పంపించిందన్నారు. జూన్ 12 తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం రోజునే విద్యార్థులకు వీటిని అందిస్తామని తెలిపారు. ఎఫ్ఆర్ఓగా తేజస్వి జూలూరుపాడు: జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా కె.తేజస్వి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏడూళ్లబయ్యారం ఎఫ్ఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న తేజస్వి సాధారణ బదిలీల్లో భాగంగా జూలూరుపాడు వచ్చారు. జూలూరుపాడు ఎఫ్ఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న జి.ప్రసాద్రావు బదిలీపై మహబూబాబాద్ జిల్లా గూడూరుకు వెళ్లారు. పాపకొల్లు అటవీ సెక్షన్ ఆఫీసర్గా జి.తారాసింగ్, రాజుపాలెం ఎఫ్బీఓగా పెరుమాళ్ల ఖాసీం, రాజారావుపేట ఎఫ్బీఓగా బి.జోగేశ్, పాపకొల్లు ఎఫ్బీఓగా నాగేశ్, వినోభానగర్ ఎఫ్బీఓగా బి.బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే – ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్రాజ్కు వినతిపత్రాలు అందజేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం, ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలలో 50 శాతం ఫీజు రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యపరీక్షల్లో రాయితీ ఇవ్వాలని, రైల్వే పాస్లను పురుద్ధరించాలని వినతిపత్రాలు అందజేశారు. డీఎంహెచ్ఓ, డీఈఓలకు సైతం వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బీవీ రమణారెడ్డి, యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాగు వెంకటరత్నం, కార్యదర్శి జునుమాల రమేశ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నాగచంద్ర పాల్గొన్నారు. -
ఈ నెల 15 వరకు ‘దోస్త్’ అడ్మిషన్లు
పాల్వంచరూరల్: దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 15 వరకు ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. పాల్వంచ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగావకాశాలతో కూడిన ఏఈడీపీ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు డిగ్రీతోపాటు ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏఈడీపీ) కింద ప్రత్యేక కోర్సులు ఉన్నట్లు తెలిపారు. బీకాం విభాగంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), సెన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో బీఎస్సీ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఏఈడీపీ విధానంలో విద్యార్థులు డిగ్రీ చదువుతోపాటు పరిశ్రమలు, సంస్థల్లో అప్రెంటిస్షిప్ శిక్షణ పొందుతారని, దీంతో ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యం, వృత్తిపరమైన అనుభవం, కమ్యూనికేషన్, సామర్థ్యాలు పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. ఐదో సెమిస్టర్లో అప్రెంటిస్ సమయంలో విద్యార్థులకు నెలకు రూ.12 వేల చొప్పున ఆరు నెలల పాటు స్లయిఫండ్ ఇస్తారని, ప్రతిభ చూపిన విద్యార్థులకు సంబంధిత సంస్థల నుంచి ఆఫర్ లెటర్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది. వేడుకలకు ముఖ్య అతిథిగా సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్ హాజరవుతున్న నేపథ్యంలో అన్ని సదుపాయాలు కల్పించారు. ఉత్తమ కార్మికుల సన్మానం, ఎస్అండ్పీసీ ఉద్యోగుల గౌరవ వందనం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. సింగరేణి ప్రధాన కార్యాలయం, జీఎం కార్యాలయం, ఇతర కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.పీవీకే–5 ఇంక్లైన్ గని మేనేజర్ బదిలీ రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గని మేనేజర్ శ్యాంప్రసాద్ను కార్పొరేట్ ఏరియాలోని సీపీపీ విభాగానికి బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. శ్యాంప్రసాద్ 22 మాసాల క్రితం గని మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. కాగా, పీవీకే–5 ఇంక్లైన్ గని మేనేజర్గా వకీల్పల్లిలో పనిచేస్తున్న ఆర్.రవికిరన్ను నియమించారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. గిన్నిస్ బుక్ రికార్డుల్లో మామిడిగూడెం వాసి ఇల్లెందురూరల్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మండలంలోని మామిడిగూడెంనకు చెందిన గుర్రం సుందర్రావుకు స్థానం దక్కింది. పరిశ్రమల శాఖలో జాయిట్ డైరెక్టర్గా ఉద్యోగ విరమణ చేసిన ఆయన పియానోపై నైపుణ్యం సాధించాడు. ఫిబ్రవరి 2న హైదరాబాద్లో 22 దేశాలకు చెందిన 2 వేల మందితో పియానో కీబోర్డు ప్రదర్శన ఇవ్వగా, 777 మంది గిన్నిస్ బుక్ రికార్డు కోసం అర్హత సాధించారు. వీరిలో సుందర్రావు కూడా ఉండగా, గత నెల 29న ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.‘ర్యాపిడో’ను రద్దుచేయాలికొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో ర్యాపిడో వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఐఎన్టీయూసీ(ఆటో) జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్)లో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ర్యాపిడో వ్యవస్థ కారణంగా ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో డ్రైవర్లు వారి కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టతరంగా మారిందన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో చల్లంగి శ్రీనివాస్, గంగులు, సుధాకర్, మహమ్మద్ నూరు, శోభన్, సర్వయ్య, పాషా తదితరులున్నారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా విజయ్భాస్కర్ జూలూరుపాడు: ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జూలూరుపాడుకు చెందిన పెండ్యాల విజయ్భాస్కర్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతులమీదుగా ఆయన నియామకపత్రం అందుకున్నారు. విజయభాస్కర్ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ ఇల్లెందురూరల్: ఇల్లెందు తహసీల్దార్గా ఎండీ.షాఖాసీం సోమవా రం బాధ్యతలు చేపట్టా రు. ఇప్పటివరకు తహసీల్దార్గా పనిచేసిన సూర్యనారాయణను కలెక్టరేట్కు బదిలీ చేశారు. కాగా, బదిలీపై వచ్చిన తొమ్మిది మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు సోమవారం విధుల్లో చేరారు. షాఖాసీం ఇంతకుముందు గుండాల తహసీల్దార్గా పనిచేశారు. -
ప్రగతి పథం
పుష్కర కాలం.. 12 ఏళ్ల స్వరాష్ట్రంలో జిల్లాలో పలు మార్పులు విద్యా, వైద్య రంగాల్లో సానుకూల పరిస్థితి పర్వాలేదనిపించేలా పారిశ్రామిక ప్రగతి రూ.వేల కోట్లు ఖర్చైనా కనిపించని కొత్త ఆయకట్టు రవాణా రంగంలో మిశ్రమ ఫలితాలుగడిచిన పన్నెండేళ్లలో విద్యారంగంలో జిల్లా సానుకూల ఫలితాలు సాధించిందనే చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన సమయంలో మంజూరైన గిరిజన వర్సిటీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థాపిస్తారనే ప్రచారం జరిగినా.. చివరకు ములుగుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేశారు. మరోవైపు అశ్వారావుపేటకు హార్టికల్చర్ కాలేజీ మంజూరైంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు మంజూరైనా ఇంకా నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. ఇల్లెందుకు ఏటీసీ మంజూరై రెండేళ్లు దాటినా క్లాసులు ప్రారంభం కాలేదు. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ పనులు ఎక్కడా మొదలు కాలేదు. కొన్ని చోట్ల స్థల సేకరణే కొలిక్కి రాలేదు. జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు మంజూరయ్యాయి. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ప్రస్తుతానికి మెడికల్ కాలేజీ ఫలాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినా రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. అశ్వారావుపేట, ఇల్లెందు, బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు వంద పడకల ఆస్పత్రులుగా అప్గ్రేడ్ అయ్యాయి. మారుమూల చర్ల ఆస్పత్రిలో క్రమం తప్పకుండా ప్రసవాలు జరుగుతున్నాయి. భద్రాచలం పెద్దాసుపత్రి ఎప్పటిలాగే మూడు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రిని కేంద్రం నిధులతో ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ వచ్చిన రెండేళ్లకే 2016లో సీతారామ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. గడిచిన పదేళ్లలో సుమా రు రూ.20 వేల కోట్ల వరకు చేసినా జిల్లాలో కొత్తగా ఒక్క ఎకరం కూడా ఆయకట్టు రాలేదు. యాతాలకుంట టన్నెల్ పూర్తైనందున త్వరలో సీతారామ వల్ల గరిష్టంగా లక్ష ఎకరాలు ఒక్క అశ్వారావుపేటలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగూడెం పాక్షికంగా లబ్ధిపొందనుంది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకర్గాల్లో కొత్త ఆయకట్టు విషయంలో ప్రభుత్వం తరఫున ఎటువంటి హామీ లేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో పారిశ్రామిక ప్రగతికి కేరాఫ్ అడ్రెస్గా హైదరాబాద్, వరంగల్ నగరాల సరసన కొత్తగూడెం నిలిచింది. 90వ దశకం తర్వాత క్రమేపీ ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. ప్రైవేటు సెక్టారులో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా లాకౌట్ ప్రకటించి కనుమరుగైపోయాయి. ఈ తరుణంలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో మణుగూరులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కావడం ఓ సానుకూల అంశంగా పేర్కొనవచ్చు. అప్పారావుపేటలో 90 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చింది. మరోవైపు కేటీపీఎస్ విస్తరణ ఎండమావిగానే ఉండిపోయింది. ఆశించిన స్థాయిలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందులలో సింగరేణి గనుల విస్తరణ జరగడం లేదు. సారపాక ఐటీసీ విస్తరణ సైతం మధ్యలోనే ఆగిపోయింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన డిమాండ్ పూర్తిగా అటకెక్కింది. మూడు రాష్ట్రాల సరిహద్దులో జిల్లా ఉంది. గడిచిన పుష్కర కాలంలో ఖమ్మం–దేవరపల్లి హైవే కారణంగా అశ్వారావుపేటకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడింది. ఎన్హెచ్ 930పీ వల్ల మహబూబాబాద్–ఇల్లెందు–కొత్తగూడెం మార్గం అప్గ్రేడ్ అవడం సానుకూల అంశం. ఇక పాల్వంచ–దమ్మపేట, మోరంపల్లి బంజర – మణుగూరు – ఏటూరునాగారం, కొత్తగూడెం – వైరా రోడ్లను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని పలు మార్లు కేంద్రానికి వినతులు వెళ్లినా సానుకూల ఫలితాలు రాలేదు. రైల్వే పరంగా కొత్తగూడెం–సత్తుపల్లి మార్గం పూర్తయింది. భద్రాచలం–మల్కన్గిరి లైను కొత్తగా మంజూరైంది. మణుగూరు–రామగుండం మార్గాన్ని పీపీపీ మోడల్లో నిర్మించాలనే నిర్ణయం జరిగింది. జిల్లాకు మరిన్ని కొత్త రైళ్లు మంజూరు కావాల్సిన అవసరం ఉంది. ఇల్లెందులో కొత్తగా ఆర్టీసీ బస్డిపో రాగా అశ్వారావుపేటలో కొత్త డిపో కోసం సర్వే మొదలైంది.కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. కొత్తగా అశ్వారావుపేట మున్సిపాలిటీ హోదా సాధించింది. మణుగూరు, భద్రాచలంల విషయంలో చట్టపరమైన చిక్కుముడులు గడిచిన పుష్కరకాలంలో వీడలేదు. భద్రాచలం సబ్ డివిజన్ నుంచి ఏపీలో కలిసిన ఏడు మండలాల నుంచి కనీసం ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలిపే అంశం కొలిక్కి రాలేదు. ఇల్లెందుకు రెవెన్యూ డివిజన్ హోదా బోడు, కొమురారం, మొండికుంట కొత్త మండలాల డిమాండ్లు కూడా నెరవేరలేదు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరి ష్కారానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఆర్ఓ పద్మావతిలతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలు కల్పించా లని, గృహలక్ష్మి పథకంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం చేయాలని, కోతుల బెడద నివారించాలని పలువురు కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు. పరిశీలించిన కలెక్టర్ దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు అధికారులను ప్రశ్నించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలిసూపర్బజార్(కొత్తగూడెం): పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్, అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ వ్యక్తి బాధ్యతగా ముందుకు రావాలని అన్నా రు. ఈనెల 12వరకు జిల్లావ్యాప్తంగా ప్రజల్లో పర్యా వరణ చైతన్యం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్ మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 55లక్షల మొక్కల నాటనున్న ట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అటవీశాఖ సిబ్బందికి సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో వివిధ శాఖ ల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ -
అంతా అసంపూర్తిగా..
ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో పేషంట్ వెయింట్ హాల్, జనరల్ వార్డు, బర్త్ వెయింట్ హాల్ నిర్మాణ ప్రతిపాదనలకు ఆరు నెలలు దాటినా అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రికి వచ్చిన సమయాన ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు మంత్రి సూచనలతో అధికారులు అంచనాలు రూపొందించినా ఆచరణలోకి మాత్రం రాలేదు. వర్షాకాలం వస్తే గోస.. వైద్యశాలకు వచ్చే గర్భిణుల వెంట సహాయకులు ఉండటానికి బర్త్ వెయిటింగ్ హాల్ కోసం ఏర్పాట్లు చేశారు. అయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణులు ఒకటి రెండు రోజులు వేచి ఉండాలంటే వెయిటింగ్ హాల్ ఉపయోగపడుతుంది. అయితే అందుకు తగిన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినా ఆచరణలో సాధ్యం కాలేదు. రోగుల సహాయకుల అవస్థలు.. వైద్యశాలకు వచ్చే రోగుల సహాయకులకు ఉండటానికి ఇబ్బందిగా మారింది. రోగుల వద్ద ఉండటం వల్ల నర్సుల విధులకు ఆటంకంగా మారుతోంది. రోగుల బెడ్ల వద్ద సహాయకులను బయటకు పంపిస్తున్నారు. ఆరు బయట చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. వెయిటింగ్ హాల్ ఉంటే వారికి ఉపయోగపడేది. ఈ మేరకు షెడ్డు నిర్మించాలని ప్రతిపాదించినా, ఆరు నెలలు దాటినా జాప్యం వీడడం లేదు. జనరల్ వార్డు కూడా.. వైద్యశాలలో రోగులకు తగ్గట్టు బెడ్లు అందుబాటులో లేవు. రోజురోజుకూ రోగుల రాక పెరిగిపోతోంది. కనీసం 20 బెడ్లు కూడా ఏర్పాటు చేసుకునేంత సదుపాయం ఈ వైద్యశాలలో లేదు. ఆరు బయట వరండాలో రోగులను ఉంచాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టెలా జనరల్ వార్డు నిర్మాణం చేయాలని వైద్యులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి సూచనల మేరకు ఐటీడీఏ పీఓ రాహుల్ పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆరు నెలలు గడిచినా జనరల్ వార్డు నిర్మాణానికి నోచుకోలేదు. రెనోవేషన్ పూర్తయింది.. ఈ విషయమై వైద్యశాల సూపరింటెండెంట్ హర్షవర్దన్ను వివరణ కోరగా గుండాలలో రెండు 108 అంబులెన్సులు ఉంటే ఒకటి ఇల్లెందుకు కేటాయించారని తెలిపారు. ఇక బర్త్ వెయిటింగ్ హాల్ రెనోవేషన్ పూర్తయింది. జనరల్ వార్డు, పేషంట్ వెయింగ్ హాల్ నిర్మాణం మాత్రం జరగాల్సి ఉంది. -
పొగాకు ఆరోగ్యానికి హానికరం
జూలూరుపాడు: పొగాకు ఆరోగ్యానికి హానికరమని, అందులోని నికోటిన్ అనే రసాయనానికి ప్రజలు బానిసలుగా మారతారని డీఎంహెచ్ఓ తుకారంరాథోడ్ తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు, వైద్యసిబ్బంది నిర్వహించిన అవగాహన ర్యాలీలో డీఎంహెచ్ఓ పాల్గొని మాట్లాడారు. పొగాకు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగడం, అంబర్లు, గుట్కాలు, పాన్ పరాగ్(మసాలా)లు వంటి ఉత్పత్తులను వాడటం వల్ల నోరు, నాలుక, గొంతు, ఊపిరితిత్తులు, ఆహార నాళం, పొట్ట, మూత్రాశయం కేన్సర్ సోకడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పొగ తాగడం, పీల్చడంతో ఆరోగ్యం దెబ్బతింటుందని, యువకులు ధూమపానం చేయడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుందని వెల్లడించారు. ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ భూతాన్ని తరమి కొట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. కాగా, జూలూరుపాడు ఏఎన్ఎం మంగమ్మ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ తుకారంరాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం మంగమ్మను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్, ఆర్బీఎస్కే డాక్టర్ తబుసం, ఫార్మసిస్టు జి.శశికళ, హెచ్ఎస్ రత్నకుమార్, హెచ్వీ రాధిక, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉత్తమ పోలీసులకు పతకాలు
సూపర్బజార్(కొత్తగూడెం)/చర్ల: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో సోమవారం ప్రకటించిన వివిధ పతకాలకు జిల్లా ఉంచి పలువురు అధికారులు ఎంపికయ్యారు. ఇద్దరికి శౌర్య పతకాలు, ఆరుగురికి కఠిన సేవా పతకాలు, 10 మందికి సేవాపతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఓఎస్డీ కార్యాలయ ఆర్ఐ ఆఫ్ పోలీస్ బి.రవి, చర్ల సీఐ ఏ రాజువర్మలకు శౌర్య పతకాలు వరించాయి. కఠిన సేవాపతకాలకు చర్ల ఎస్ఐ పడాల కేశవరావు, హెడ్ కానిస్టేబుల్ ఎల్.రాంబాబు, కానిస్టేబుళ్లు పెట్టి రాము, పూజారి వినోద్కుమార్, దుమ్ముగూడెం కానిస్టేబుల్ పి.రాము, ఏఆర్పీసీ బి.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. సేవాపతకాలు ఎస్ఐ డి.బాలస్వామి నాథన్, ఏఎస్ఐ జి.యోహాన్, ఏఆర్ ఎస్ఐ పి.యుగంధర్, లక్ష్మీదేవిపల్లి హెడ్ కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ఎం.శంకరయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ భూక్య లక్పతి, హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ఆర్ రామచంద్రారెడ్డి, సుజాతనగర్ హెడ్ కానిస్టేబుల్ వి.భీముడు, చాతకొండ 6వ బెటాలియన్ ఆర్ఐ ఆఫ్ పోలీస్ చింతా వెంకట శ్రీనివాసరెడ్డిలను వరించాయి. విధి నిర్వహణలో , ఏజెన్సీలో మావోయిస్టు కార్యకలాపాల అరికట్టేందుకు విశేష కృషి చేసిన అధికారులు, సిబ్బందిని పతకాలకు ఎంపిక చేశారు. వీరికి మంగళవారం పతకాలు ప్రదానం చేయనున్నారు. కాగా పతకాలకు ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు శౌర్య, ఆరుగురు కఠిన సేవా, 10 మంది సేవా పతకాలకు ఎంపిక -
రామవరం ఆస్పత్రిని పునరుద్ధరించండి
రుద్రంపూర్/కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరంలో వందలాది కార్మికులు, కార్మిక కుటుంబాలు నివాసముంటున్న నేపథ్యంలో రామవరం ఆస్పత్రిని పునరుద్ధరించాలని ఏఐటీయూసీ నాయకులు ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్రాజ్కుమార్ను కోరారు. సోమవారం ఆస్పత్రి సీఎంఓకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి వంగా వెంకట్ మాట్లాడారు. ఆస్పత్రిని మూసివేసే ఆలోచనను విరమించుకోవాలని, వైద్యుడితోపాటు నర్సును కూడా ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికులు ఏ చిన్న చికిత్స కోసమైనా ప్రధానాస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో రమణమూర్తి, గట్టయ్య, రాము, కత్తెర రాములు, అనంతలక్ష్మి, మధుకృష్ణ, నాగయ్య, రమేశ్, మర్రి గోపి, లక్ష్మీనారాయణ, రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయం
జూలూరుపాడు: రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా సోమవారం వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్నాయక్ మండలంలోని పడమటనర్సాపురం, జూలూరుపాడు, వెంగన్నపాలెం, భోజ్యాతండా గ్రామ పంచాయతీ రాజారావుపేట, పుల్లుడుతండా తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో 2.50 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసిరామ్, హౌసింగ్ ఏఈ గాడ్విన్తోపాటు లేళ్ల వెంకటరెడ్డి, మాళోత్ మంగీలాల్నాయక్, అల్లాడి నరసింహారావు, సంఘం లక్ష్మీకుమారి, లావుడ్యా ద్వాలీ, బానోత్ సుమలత, ఆళ్ల ప్రవీణ్కుమార్, దుద్దుకూరి మధుసూదన్రావు, లేళ్ల గోపాల్రెడ్డి, దుద్దుకూరి సుమంత్, లేళ్ల అప్పిరెడ్డి, లకావత్ లచ్చునాయక్, చౌడం నరసింహారావు, బాదావత్ హరీశ్, బి.బాబు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు టేకులపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో భాగంగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి మండలంలో సోమవారం పర్యటించారు. మండలంలోని టేకులపల్లి, గోల్యతండా, తొమ్మిదోమైలుతండా, బేతంపూడి, రోళ్లపాడు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. గృహప్రవేశం చేసిన దంపతులను సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లక్కినేని శ్యామ్, కోరం సురేందర్, బోడ మంగీలాల్, కాలే ప్రసాద్, హౌసింగ్ ఏఈ గణేశ్, ముచ్చా సుధాకర్, సర్పంచులు బానోత్ పూర్ణ, సుభాష్చంద్రబోస్, నాకా, చందర్సింగ్, బాలు, ఊకె సునీత తదితరులు పాల్గొన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భద్రగిరి మార్ట్లో నోటు పుస్తకాలుభద్రాచలం: పాఠశాలల్లో అవసరమైన నోట్ పుస్తకాలు, స్యూల్ బ్యాగులు, ఇతర సామగ్రిని భద్రగిరి మార్ట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్నింటిని అందుబాటులో ఉంచామని, తల్లిదండ్రులు గమనించాలని పేర్కొన్నారు. ఐటీడీఏ డీడీగా చందనభద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ డీడీగా చందన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి డీడీగా విధులు నిర్వహిస్తున్న అశోక్ నుంచి ఆమె చార్జ్ తీసుకున్నారు. తొలుత ఆమె ఐటీడీఏ పీఓ రాహుల్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యల పరిష్కారాని కృషి చేయాలని పీఓ సూచించారు. ఇంటర్ తరగతులు ప్రారంభంకొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 14 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలు ఉండగా, మొదటి రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు క్లాసులకు కొందరు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి అన్ని కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకొని క్లాసులకు హాజరైన మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. మరికొన్ని కళాశాలల్లో మంగళవారం నుంచి పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. పాల్వంచ ఇన్చార్జి ఎఫ్డీఓగా డీఎఫ్ఓకు బాధ్యతలుపాల్వంచరూరల్: పాల్వంచ అటవీ డివిజన్ ఇన్చార్జి ఎఫ్డీఓగా కొత్తగూడెం డీఎఫ్ఓ జి.కృష్ణాగౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి ఎఫ్డీఓ కట్టా దామోదర్రెడ్డి సూర్యాపేట డీఎఫ్ఓగా బదిలీ అయిన విషయం విదిత మే. ఇక వైల్డ్లైఫ్ కార్యాలయం సూపరింటెండెంట్ నాగేశ్వరరావు భద్రాచలం సూపరిటెండెంట్గా, అక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ రామకృష్ణ వైల్డ్లైఫ్ విభాగానికి బదిలీఅయ్యారు. ఇల్లెందు విద్యార్థికి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ కొమరంభీం కాలనీకి చెందిన మోకాళ్ల శరత్చంద్ర సోమవారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 382వ ర్యాంకు, ఎస్టీ కేట గిరీలో 4వ ర్యాంకు సాధించాడు. ఎప్సెట్లో 52వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్లో జాతీయ స్థాయిలో 452వ ర్యాంక్, ఎస్టీ కేటగిరీలో 4వ ర్యాంకు సాధించిన విషయం విదితమే. విద్యార్థిని తల్లిదండ్రులు అభినందించారు. -
పోలవరం సర్వే శాసీ్త్రయంగా జరగాలి
సూపర్బజార్(కొత్తగూడెం): పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శాసీ్త్రయంగా సర్వే జరగాలని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పర్యటన జరుగనున్న నేపథ్యంలో గోదావరి బ్యాక్ వాటర్పై అడ్డగోలుగా సర్వే నిర్వహిస్తే అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్తో పాటు బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం నీట మునిగే ప్రమాదం ఉందని, పొలాలు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాక్ వాటర్ కారణంగా ముర్రేడు, కిన్నెరసాని కూడా నిండి ప్రవహిస్తాయన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. సమావేశంలో దిండిగాల రాజేందర్, రాజుగౌడ్, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, అనుదీప్, దామోదర్, హుస్సేన్, లావుడ్యా సత్యనారాయణ, రాజేశ్, సింధు తపస్వి, మల్లెల స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా
పాల్వంచరూరల్: జేఈఈ అడ్వాన్స్డ్లో కిన్నెరసానిలోని గిరిజన గురుకుల ప్రతిభ జూనియర్ కళాశాల (సీఓఈ)కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. డి.సిద్ధు 475 ర్యాంక్, జి.రోహిత్ 1,380 ర్యాంక్ సాధించారని ప్రిన్సిపాల్ రమేశ్ సోమవారం తెలిపారు. కళాశాల నుంచి మొత్తం ఏడుగురు విద్యార్థులు పరీక్ష రాయగా ఇద్దరు విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి, రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి అభినందించారు. టేకులపల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టేకులపల్లి మండలం బద్ధుతుండ పంచాయతీ సామ్యతండాకు చెందిన బానోతు యుగంధర్ ఎస్టీ విభాగంలో 622వ ర్యాంకు సాధించాడు. బొమ్మనపల్లికి చెందిన లకావత్ జాహ్నవి ఎస్టీ విభాగంలో 1,163వ ర్యాంకు సాధించింది. -
విద్యుత్ పరికరాలు దగ్ధం
సుజాతనగర్: హై ఓల్టోజ్ విద్యుత్ సరఫరాతో సుమారు 20 లక్షల విద్యుత్ పరికరాలు దగ్ధం అయిన ఘటన సుజాతనగర్లో సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో స్థానిక ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం తలెత్తడంలో హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా అయింది. దీంతో సుమారు 60 గృహాల్లోని ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు, టీవీలు తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. ఆగ్రహించిన బాధితులు స్థాఽనిక విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హై ఓల్టోజ్ విద్యుత్ సరఫరా అయిందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టం వాటిల్లిన గృహాలను పరిశీలించి నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏఈ కిషన్ తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తాంసూపర్బజార్(కొత్తగూడెం): ముస్లింలకు సంబంధించిన బీసీ–ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్పాషా బీసీ కమిషన్ను కోరారు. సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాప్రోలు జైప్రకాష్, తిరుమలగిరి సురేందర్, మైనారిటీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ వాహబ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం.. ఉద్యమ గుమ్మమై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 2009 నవంబర్ 29న నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఆ సమయంలో ఉద్యమం ప్రత్యేక దిశను సంతరించుకుంది. అక్కడ కేసీఆర్ను పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం సబ్జైలుకు తరలించడంతో జిల్లా అంతటా నిరసనలు, ప్రదర్శనలు హోరెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా న్యూడెమోక్రసీ, సీపీఐ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అన్ని వర్గాల ప్రజలు కలిసిరావడంతో ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. ఖమ్మం సబ్జైలుకు.. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణదీక్ష చేయాలని నిర్ణయించి.. 2009 నవంబర్ 29న కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట సమీపంలోని రంగథంపల్లి దీక్షా స్థలికి బయలుదేరారు. దీంతో కేసీఆర్ను అల్గనూర్ క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రోజంతా తీవ్ర ఉత్కంఠ మధ్య పలు మార్గాల్లో తిప్పుతూ, వాహనాలు మారుస్తూ రాత్రి ఖమ్మం చేర్చారు. అదే రోజు రాత్రి ఖమ్మం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట కేసీఆర్ను హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో దానవాయిగూడెంలోని ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి.. జైలుకు తరలించాక కూడా కేసీఆర్ ఆమరణ దీక్ష కొనసాగించారు. ఈ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. ఆపై ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో భద్రతా కారణాల దృష్ట్యా, మెరుగైన వైద్యం కోసం కేసీఆర్ను డిసెంబర్ 3న హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డిసెంబర్ 9వరకు ఆయన దీక్ష చేశారు. ఉద్యమ కెరటంగా ఖమ్మం కేసీఆర్ను ఖమ్మం సబ్ జైలుకు తరలించడంతో ఖమ్మం ఉద్యమ గుమ్మంలా మారింది. కేసీఆర్కు మద్దతుగా సీపీఐ, అప్పటి న్యూడెమోక్రసీ, ప్రస్తుత సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకులే కాక మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. రోడ్డుపైకి వచ్చి ఆటపాటలతో తమ నిరసన తెలుపుతూ కదం తొక్కారు.నాడు ఖమ్మం సబ్జైలులో కేసీఆర్ ఆమరణ దీక్ష -
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు
●ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భద్రాచలం: ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు అందజేసి, పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజనులు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అధికారులు డేవిడ్ రాజ్, ఆనంద్ కుమార్, అశోక్, మధుకర్, సైదులు, సమ్మయ్య, రాంబాబు, ఉదయ్ కుమార్, వేణు, గన్యా, మనిధర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో 16మంది ఉత్తమ ఉద్యోగుల ఎంపిక●ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురు కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా 12 ఏరి యాల నుంచి 16 మందిని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. విధుల్లో నిబద్ధత, ప్రమాదాలకు గురి కాకుండా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తున్న వారిని ఎంపిక చేశామని జీఎం(పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్ఆర్ కె. అజయ్కుమార్ తెలిపారు. వీరిని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సన్మానించునున్నట్లు వెల్లడించారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాస్(ఏజీఎం–మణుగూరు ఏరియా), లకావత్ అశోక్(ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇల్లెందు ఏరియా), జి.లక్ష్మీనారాయణ(హెచ్ఓఎం, కొత్తగూడెం ఏరియా), భూక్యా రాంబాబు(డీవైఎస్ఈ, సత్తుపల్లి ఏరి యా), పి.మురళీకృష్ణ(జీఎం–కార్పొరేట్), ము కుంద సత్యనారాయణ(డీజీఎం, కార్పొరేట్), ఎన్.కుమారస్వామి(ఫోర్మెన్, కార్పొరేట్) ఉన్నారు. అవినీతిపరులకు మోదీ అండ●మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఇల్లెందు: అవినీతి పరులకు, రేపిస్టులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటోందని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సోమవారం ఇల్లెందులోని ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అదానీ, అంబానీలను తన వెంట తిప్పుతూ మరింత ధనవంతులుగా మార్చుతున్నారని విమర్శించారు. అగ్రరాజ్య దురాక్రమణపరుడు ట్రంప్, ఫాసిస్టు విధానాలు అవలంబించే మోదీ ఇద్దరు ప్రజావ్యతిరేకులేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్నలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, నాయకులు నాయిని రాజు, శ్రీరాం కోటయ్య, ఈసం శంకర్, ఆర్.బోసు, ప్రసాద్, పగడయ్య, అజ్మీర బిచ్చా, బుర్ర వెంకన్న, యాకుబ్షావళి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో 8 మంది వైద్యాధికారుల బదిలీరుద్రంపూర్: సింగరేణి సంస్థ పరిధిలోని వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 8 మంది వైద్యాధికారులను బదిలీచేస్తూ యాజమాన్యం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెం ఏరియా మెయిన్ వర్క్షాపులో ఫిజిషియన్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్న ఎల్తూరి రాజు ఆర్జీ–1 ఏరియా ఆస్పత్రికి, కొత్తగూడెం మెయిన్ ఆస్పత్రిలో డిప్యూటీ సీఎంవోగా పనిచేస్తున్న జీఎన్ కృష్ణవేణి రుద్రంపూర్ ఆస్పత్రికి, మణుగూరు ఏరియాలో మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న పి.శేషగిరిరావు కొత్తగూడెం మెయిన్ ఆస్పత్రికి, బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో డీవైఎంఎస్గా పనిచేస్తున్న మైకం మురళీమోహన్ ఇల్లెందు ఏరియా ఆస్పత్రికి బదిలీ అయ్యారు. వీరితో మరో నలుగురిని కూడా యాజమాన్యం బదిలీ చేసింది. వీరంతా ఈ నెల 8వ తేదీలోగా కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
భగవద్గీత.. చైతన్యగీతిక
సత్తుపల్లిటౌన్: అనంతపురం అనే ఊరిలో రాజేశ్ తల్లిదండ్రులతో జీవించేవాడు. రాజేశ్ పాఠశాలకు వెళ్లే దారిలోని గ్రంథాలయానికి ప్రతిరోజూ వెళ్లి కనీసం ఒక పుస్తకం చదివేవాడు. అలా దాదాపుగా గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివాడు. పుస్తకం చదివాక అందులోని వివరాలను తల్లితో చెప్పే రాజేశ్.. ఒక రోజు తానెంతో జ్ఞానం కలవాడినన్న అహంకారంతో మాట్లాడాడు. అప్పుడు వాళ్ల అమ్మ.. ‘కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి’అని అడిగింది. దీంతో రాజేశ్ ‘కురుక్షేత్ర సంగ్రామం అంటే ఏమిటమ్మా. నేను ఎన్నో పుస్తకాలు చదివినా దీని గురించి వినలేదు. నాకు వివరంగా చెప్పవా’అని అడిగాడు. అందుకు తల్లి ‘నేను ఇప్పుడు పనిలో ఉన్నాను.. తర్వాత చెబుతాను’అన్నది. రాజేశ్ మాత్రం ఆ పుస్తకం పేరైనా చెప్పాలని కోరాడు. దీంతో ఆమె భగవద్గీత అని చెప్పగానే గ్రంథాలయానికి వెళ్తే ఆ పుస్తకం దొరకలేదు. ఆపై నిరాశగా ఇంటికి వెళ్తున్న రాజేశ్కు దారిలో ఓ వృద్ధురాలు కన్పించింది. ఆమె ‘నాన్నా.. ఏదో ఆలోచిస్తున్నావు.. నీకు ఏమైనా కావాలా’అని అడిగింది. అప్పుడు రాజేశ్ ‘నాకు భగవద్గీత కావాలి’అన్నాడు. ఎందుకు అని అడిగితే కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంతో అర్జునుడు ఊదిన శంఖం పేరు ఏమిటని తన తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయానని పేర్కొన్నాడు. అప్పుడు ఆమె అర్జునుడు ఊదిన శంఖం పేరు దేవదత్తం అని చెప్పింది. అంతేకాక భగవద్గీత పుస్తకం కూడా ఇచ్చింది. దీంతో రాజేశ్ సంతోషంగా ఇంటికి వెళ్లి తన తల్లికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆమె పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించగా.. పుస్తకం చదవడమే కాక అనుసరించడం మొదలు పెట్టాడు రాజేశ్. అంతేకాక తన అహంకారాన్ని విడిచిపెట్టి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. –పాత్రాసాగర్, పదో తరగతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్తుపల్లి నేను చదివిన కథ -
డాక్టర్ సోమరాజు దొరకు బెస్ట్ ట్రైబల్ అచీవర్ అవార్డు
పాల్వంచ: పాల్వంచకు చెందిన చరిత ఆర్గానిక్ కల్టివేషన్ అండ్ సోలార్ డ్రయర్స్ నిర్వాహకులు డాక్టర్ ఎస్.సోమరాజు దొర బెస్ట్ ట్రైబల్ అచీవర్ అవార్డు–2026 అందుకున్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన జన జాతీయ గరిమా ఉత్సవ్–2026 కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సోమరాజు దొర మాట్లాడుతూ సంస్థ స్థాపించిన 18 నెలల కాలంలోనే రాష్ట్ర స్థాయి గౌరవాన్ని దక్కించుకుందన్నారు. ఆర్గానిక్, నేచురల్ ఉత్పత్తుల సేకరణ, తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్లే అవార్డు లభించిందని తెలిపారు. -
భద్రగిరిలో భక్తుల సందడి
భద్రాచలం: సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో భద్రగిరి ఆదివారం రద్దీగా మారింది. వేసవి సెలువులు ముగింపునకు రావడంతో భద్రాచలం బాట పట్టారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. -
‘ప్రైవేట్’కు పచ్చజెండా
రైల్వేలో ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా బాటలు వేస్తోంది. కీలకమైన ట్రాక్ నిర్మాణ పనుల్లోనూ ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు లైన్లను ఎంపిక చేయగా, అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మణుగూరు–రామగుండం లైన్ కూడా ఉంది. నిర్మాణం పూర్తయ్యాక 11 ఏళ్లలో పెట్టుబడి తిరిగి వస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం నత్తనడకన పనులు రైల్వే మౌలిక స్వరూపంలో భాగమైన ట్రాక్ల నిర్మాణం, ఇంజన్లు, రోలింగ్ స్టాక్ల విషయంలో ప్రైవేట్కు పచ్చ జెండా ఊపాలని గతంలో ప్రయత్నించినా ప్రతిపక్షాలు, రైల్వే సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. కానీ, అత్యంత ఖర్చుతో కూడుకున్న ట్రాక్ల నిర్మాణం కాలక్రమేణా రైల్వేకు సవాల్గా మారింది. దీంతో గడిచిన రెండు దశాబ్దాలుగా ట్రాక్ల నిర్మాణ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా, నిర్మాణ వ్యయాన్ని పంచుకోవాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను రైల్వేశాఖ కోరుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం, భద్రాచలంరోడ్ – సత్తుపల్లి లైన్ నిర్మాణ వ్యయంలో సింగరేణి సగం ఖర్చు భరించాయి. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. ఫలితంగా కొత్త లైన్ల నిర్మాణ పనులు ఆలస్యంగా ప్రారంభం కావడం, ఒక వేళ మొదలైనా అరకొర నిధులతో ఏళ్ల తరబడి కొనసాగడం పరిపాటిగా మారింది. పీపీపీఏసీ సమావేశలో సూత్రప్రాయంగా అంగీకారం గత ఏప్రిల్ 10న న్యూఢిల్లీలో రైల్వే బోర్డు ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) 144వ సమావేశం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచేందుకు ప్రైవేట్ ప్లేయర్లకు పార్టనర్షిప్ ఇవ్వాలని సూత్రప్రాయంగా బోర్డు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు కొత్త లైన్లను పీపీపీ పెట్టుబడుల కోసం ఎంపిక చేయగా, అందులో దక్షిణ మధ్య రైల్వే పరిఽధిలో 207 కి.మీ నిడివి కలిగిన మణుగూరు–రామగుండం లైన్ కూడా ఉంది. దీంతోపాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సొంత రాష్ట్రమైన ఒడిశాలో విస్తరించిన ఈస్ట్కోస్ట్ రైల్వే పరిధిలోని బుధపాంక్–లుబూరి (113 కి.మీ), కోరాపూట్ – రాయగడ(49 కి.మీ), బలరాం – టెంటులోయ్ (50 కి.మీ), జైపూర్ – దమారా (101 కి.మీ), పకూర్/నగర్నబి – గొడ్దా ( 127 కి.మీ ఈస్టర్న్ రైల్వే) లైన్లను కూడా ఎంపిక చేసింది. 20 ఏళ్లుగా ముందుకు సాగని రామగుండం లైన్ లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో సుమారు 20 ఏళ్ల క్రితం రామగుండం–మణుగూరు లైన్ నిర్మాణాన్ని బడ్జెట్లో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు మంత్రులు మారినా పనులు మొదలు కాలేదు. సర్వేలు జరపడం, ఆపై బడ్జెట్ అంచనాలు పెరగడం మినహా పురోగతిలేదు. చివరిసారిగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గతేడాది డిసెంబర్లో సమస్యను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, రూ.4 వేల కోట్లు ఖర్చయ్యే లైన్ పనులు త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. కానీ, అనూహ్యంగా లైన్ పీపీపీ పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5,818 కోట్లు వ్యయం అవుతుంది. మొదటి ఏడాది భూసేకరణ పనులు పూర్తి చేసి, మిగిలిన నాలుగేళ్లలో ట్రాక్ నిర్మాణం పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గం గుండా బొగ్గు, ధాన్యాలు, సిమెంట్, ఖనిజాలు ప్రధానంగా రవాణా చేయాలని భావిస్తోంది. నిర్మాణం పూర్తయ్యాక తొలి ఏడాది 13 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.456 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ తర్వాత క్రమంగా రవాణా సామర్థ్యం పెంచుకుంటూ 11 ఏళ్లు పూర్తయ్యే సరికి సాలీనా సరుకు రవాణా 20 మిలియన్ టన్నులకు చేరుకుని రూ.1,139 కోట్ల వార్షిక ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ప్రాజెక్ట్ను ఐదేళ్లలో పూర్తి చేస్తే, ఆ తర్వాత పదకొండేళ్లలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని రైల్వే లెక్కలు చెబుతున్నాయి.లైన్ మణుగూరు–రామగుండం ట్రాక్ నిడివి 207 కి.మీ. ప్రాజెక్ట్ వ్యయం రూ. 5,818 కోట్లు ట్రాక్ గరిష్ట వేగ సామర్థ్యం 110 కి.మీ నిర్మాణ సమయం ఐదేళ్లు పీపీపీ విధానంలో రైల్వే లైన్ల నిర్మాణం జీఎంకు రైల్వే సమస్యల ఉద్యమకారుల వినతి మణుగూరు టౌన్: మణుగూరు రైల్వే స్టేషన్ నుంచి రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవకు శుక్రవారం సికింద్రాబాద్లో మణుగూరు రైల్వే సమస్యల ఉద్యమకారులు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. కోవిడ్కు ముందు మణుగూరు స్టేషన్ నుంచి నడిచిన రైళ్లను తిరిగి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. మణుగూరు–కాజీపేట ప్యాసింజర్(డైలీ), మణుగూరు– కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ వయా డోర్నకల్, సోలాపూర్ రైళ్లు మణుగూరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవన్నారు. పవన్కుమార్, వినయ్, జ్ఞానేష్ నాయక్ వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారని తెలిపారు. -
‘కొత్త విద్య’ సంవత్సరంలోకి..
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యతోపాటు ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ బోధన అందిస్తుండగా, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు సైతం పంపిణీ చేస్తోంది. సోమవారం నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుండగా.. ఈసారి పాఠశాలల్లో మాదిరి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం అందించనున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్పులకు శ్రీకారం ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి సిలబస్లో మార్పు చేయడమేకాక విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు లబ్ధి జరగనుంది. ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు కాలేజీలకు చేరాయి. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కొత్త కోర్సు ప్రారంభించనుంది. ఇంటర్నల్ మార్కులు ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోధనలో మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే, విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పేరుతో ఈ అంతర్గత మార్కులు కేటాయిస్తారు. ఆర్ట్స్ గ్రూపులు, భాషా సబ్జెక్టుల్లో కూడా ఈ మార్కులు ఉంటాయి. విద్యార్థులు 80 మార్కుల ప్రశ్నపత్రానికి పరీక్ష రాస్తే, మిగతా 20 అంతర్గత మార్కులుగా అధ్యాపకులు వేయనున్నారు. కాగా, ఎంపీసీ విద్యార్థులకు (గణితంలో) 75 మార్కుల్లో 15 అంతర్గత మార్కులు కేటాయించారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రథమ సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మాత్రం ఇన్నాళ్లు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా.. ఇకపై ప్రథమ సంవత్సరంలో 15 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. టిఫిన్, భోజనం ఇన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలవుతోంది. పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఉదయం టిఫిన్ కూడా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయాన జూనియర్ కాలేజీల విద్యార్థులకు సైతం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి అల్పాహారం, మధ్యాహ్నభోజనం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తద్వారా దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ఆకలి తీరుతుందని, చదువుపై శ్రద్ధ కనబరుస్తున్నారని భావిస్తున్నారు.జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు : 14 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 2,402 మంది -
ప్రజా సమస్యలపై రాజీలేని పోరు
● ఇదే కాసానికిచ్చే ఘన నివాళి ● సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులురుద్రంపూర్: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటామే కాసానికిచ్చే ఘనమైన నివాళి అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని సెవెన్హిల్స్ హోటల్ సమీపంలో, సుజాత నగర్లో ఏర్పాటు చేసిన కాసాని ఐలయ్య స్మారక స్తూపాలను ఆయన ఆవిష్కరించారు. తొలుత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కొత్తగూడెం నుంచి సుజాతనగర్ వరకు పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో బీవీ రాఘవులు మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు, దోపిడీ లేని సమాజం కోసం కాసాని తుదిశ్వాస వరకు పోరాడారని గుర్తుచేశారు. సుజాతనగర్ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సుజాతనగర్ సర్పంచ్గా ఆదర్శపరిపాలన కొనసాగించారని తెలిపారు. కాసాని ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయిబాబు, పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, కొలగాని బ్రహ్మచారి, అన్నవరపు సత్యనారాయణ, కున్సోత్ ధర్మా, నర్సారెడ్డి, వీరహనుమంతరావు, వీర్ల రమేష్, గడ్డం స్వామి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో ఆదివా రం చండీహోమం, విశేష పూజలు నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చా రు. అనంతరం మండపారాధన, గణపతిపూజ చండీహోమం చేశారు. చివరన పుర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 28 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. ఈఓ రజనీకుమారి పాల్గొన్నారు.నేడు ‘సీతారామ’ను సందర్శించనున్న మంత్రి తుమ్మలఅశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులో ఉన్న సీతారామ ప్రాజెక్టు ఫేస్–1 పంప్ హౌస్ను సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించనున్నారు. పినపాకలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన అనంతరం పంప్ హౌస్ సందర్శన, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించనున్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వక అర్జీలు అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నటుకలెక్టర్ తెలిపారు. 4న పాటల పోటీలుభద్రాచలంఅర్బన్: గాన గంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఈ నెల 4న రెండు తెలుగు రాష్ట్రాల గాయనీ గాయకులకు పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి స్వరాంజలి నిర్వాహకుడు పోకల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాటల పోటీలు జరుగుతాయని, విజేతలకు క్యాష్ప్రైజ్తోపాటు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. జలనవరుల శాఖలో 40, జీసీసీలో 11 మంది బదిలీపాల్వంచరూరల్: ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జలనరులశాఖలో 40 మంది ఇంజనీర్లు బదిలీ అయ్యారు. కొత్తగూడెం ఈఈ అర్జున్తోపాటు 8మంది డీఈలు, 30మంది ఏఈలు, ఇద్దరు ఏఈఈలకు స్థానచలనం కలిగింది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో 11 మంది సేల్స్మెన్లను బదిలీ చేశారు. పాల్వంచ బ్రాంచ్ పరిధిలో ఖాళీగా ఉన్న యానంబైల్ డీఆర్ డిపోకు సేల్స్మెన్ జె.వెంకటేశ్వర్లు, నాగారం కాలనీ డిపోకు దమ్మపేట నుంచి బి.బాలు, ఇరవెండికి భద్రాచలం నుంచి ఏ.వెంకటరత్నం, పూసుగూడెం డిపోకు ఇల్లెందు నుంచి తావుర్యా బదిలీపై వచ్చారు. గురుకుల టాపర్కు సన్మానంఇల్లెందురూరల్: గురుకుల కళాశాలల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం హైదరాబాద్లో సన్మానించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు హాజరై ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహకం అందజేశారు. మండలంలోని లక్ష్మీనారాయణతండాకు చెందిన శివజ్యోతిక కూడా సన్మానం పొందింది. సుదిమళ్ల గురుకుల కళాశాలలో ఇంటర్ సీఈసీ చదివిన ఆమె 970/1000 మార్కులు సాధించి గురుకులాల్లో రాష్ట్రస్థాయి ప్రథమ స్థానంలో నిలిచింది. శివజ్యోతికను తల్లిదండ్రులు బోడ శంకర్, విజయ, గ్రామస్తులు అభినందించారు. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ఖమ్మం సహకారనగర్: డీఈఈ సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఖమ్మం టేకులపల్లిలోని డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
మట్టి.. కొల్లగొట్టి..
● యథేచ్ఛగా ‘ఇందిరాసాగర్’ మట్టి అక్రమ రవాణా ● అడ్డుకున్న వ్యక్తిపై దాడులు ● పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేసిన ఆర్ఐ ● కాంగ్రెస్ నాయకుల హస్తముందనే ఆరోపణలు అక్రమ మైనింగ్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని, మైనింగ్కు వినియోగించిన యంత్రాలు, వాహనాలను అదుపులోకి తీసుకుంటాం. ఎంతటివారైనా సరే చర్యలు తీసుకుంటాం. –రామనరేశ్, తహసీల్దార్, దమ్మపేట అక్రమ మైనింగ్కు పాల్పడిన జేసీబీ, ట్రాక్టర్లను ఆర్ఐ వదిలేయమని చెబితేనే కానిస్టేబుల్ వెనక్కి వచ్చాడు. తహసీల్దార్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వాహనాలను అదుపులోకి తీసుకుంటాం. ఇందులో మా పాత్ర ఏమీలేదు. –రాజేశ్కుమార్, ఎస్ఐదమ్మపేట: మండలంలోని పెద్దగొల్లగూడెం శివారులో కొద్ది రోజులుగా అక్రమ మట్టి మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మైనింగ్ వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తముందనే ప్రచారం సాగుతోంది. ఈ మైనింగ్ను అడ్డుకోబోయిన ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని, దీంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిసింది. పెద్దగొల్లగూ డెం శివారులో ఇందిరాసాగర్ కాల్వ మట్టిని కొందరు అనుమతులు లేకుండా బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని సమా చారం. జేసీబీతో తవ్వి, పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి, మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 28న మైనింగ్పై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి వెళ్లిన ఆర్ఐ పోలీసుల సాయంతో జేసీబీ, ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించకుండా మధ్యలోనే వదిలేశాడని విమర్శలు వస్తున్నాయి. చర్యలు ఏవి..? మైనింగ్ మాఫియాపై గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యు లు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిపై మాఫి యా ముఠా దుర్భాషలాడటమే కాక భౌతిక దాడు లకు పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ అక్రమ మైనింగ్ వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మైనింగ్కు పాల్పడిన వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించకుండా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారనే చర్చ నడుస్తోంది. కాగా బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని, విచారణ నిర్వహిస్తున్నామని ఎస్ఐ రాజేశ్ కుమార్ చెబుతున్నారు. ఆర్ఐ పాత్రపై ఆరోపణలు.. పెద్దగొల్లగూడెం శివారులో ఈనెల 28న భారీ ఎత్తున ఇందిరా సాగర్ మట్టిని బయటకు తరలిస్తున్నారని తహసీల్దార్ రామనరేశ్కు ఫిర్యాదు రాగా, ఘటనా స్థలానికి ఆర్ఐని వెళ్లాలని ఆదేశించారు. ఆయన కానిస్టేబుల్తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిని దమ్మపేటలోని శివాలయం వరకు తీసుకొచ్చాక ట్రాక్టర్లను వదిలేస్తున్నామని కానిస్టేబుల్కు ఆర్ఐ చెప్పాడు. కానిస్టేబుల్ ఎస్ఐకి అదే విషయం చెప్పి వచ్చేశాడు. ట్రాక్టర్లను వదిలేసిన అనంతరం ఆర్ఐ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లను వదిలేయడంపై దర్యాప్తు జరపాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఇదే విషయమై ఆర్ఐని వివరణ కోరగా.. జేసీబీ, ఐదు ట్రాక్టర్లను పెద్దగొల్లగూడెం నుంచి దమ్మపేట శివాలయం సమీపానికి తీసుకురాగా.. డ్రైవర్లు వాహనాలను ఆపకుండా పరారయ్యారని.. కానిస్టేబుల్, తాను ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదని తెలిపారు. కాగా, ఆర్ఐ ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
మొన్న పదోన్నతి.. నిన్న ఉద్యోగ విరమణ
ఒకరోజు ఎస్ఐలుగా సర్వీసులో.. సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి దక్కాలని కలలు కంటారు. ఈ మేరకు పదోన్నతి దక్కిందనే ఆశ తీరేలోగా కొత్త హోదాలో ఒకే రోజు సర్వీసుతో రిటైర్డ్ అయిన ఉదంతమిది. పోలీసు శాఖలో ఏఎస్ఐలుగా విధులు నిర్వర్తిస్తున్న కొదిరిపాక సత్యనారాయణ, జెడల సాదయ్యకు శనివారం ఎస్ఐలుగా పదోన్నతి కల్పించడమే కాక భద్రాద్రి జిల్లాకు కేటాయించారు. దీంతో వీరిద్దరు జిల్లాలో రిపోర్టు చేయగా.. ఆదివారం సర్వీస్ ముగియడంతో ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సత్యనారాయణ, సాదయ్యను అధికారులు సన్మానించి వీడ్కోలు పలికారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కొత్తగూడెం త్రీటౌన్, వన్టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ, పోలీసు అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ట్రాక్టర్లకు పూజలుఇల్లెందురూరల్: మరో వారం రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో పల్లెల్లో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నుతూ మంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఖరీఫ్లో సాగు సమృద్ధిగా సాగాలని, తమ ట్రాక్టర్లకు జోరుగా పని కలగాలని ఆకాంక్షిస్తూ మండలంలోని మిట్టపల్లి ప్రాంతానికి చెందిన 40 మంది ట్రాక్టర్ యజమానులు ఆదివారం మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో వాహన పూజ చేపట్టారు. అమ్మవారకి మేకలను బలిచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రాక్టర్లు నడవాలని వేడుకున్నారు. అనుమానాస్పద స్థితిలో కేటీపీఎస్ ఉద్యోగి మృతి పాల్వంచ: అనుమానాస్పద స్థితిలో కేటీపీఎస్ ఉద్యోగి మృతి చెందాడు. పట్టణంలోని గట్టాయిగూడెంలో నివాసం ఉంటున్న మీసాల సునీల్కుమార్ (45) కేటీపీఎస్లో పనిచేస్తున్నాడు. అతను నివాసం ఉండే ఇంట్లో నుంచి ఆదివారం దుర్వాసన రావడంతో స్థానికులు పరిశీలించగా సునీల్కుమార్ గదిలో బెడ్పైనే మృతి చెంది కనిపించాడు. మూడు రోజుల క్రితమే చనిపోగా శరీరం ఉబ్బి వాసన వస్తున్నట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల మధ్య మనస్పర్దలు రావడంతో భార్య వెళ్లిపోయిందని, దీంతో అతను ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిసింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులను వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు రాలేదని, ఎలా మృతి చెందాడనేది దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. -
కిన్నెరసానికి పర్యాటకుల తాకిడి
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానికి ఆదివారం జిల్లానలు మూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 457 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.23,905 ఆదాయం.. 260 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,810 ఆదాయం లభించిందని నిర్వాహకులు తెలిపారు. అగ్నివీర్–జీడీ ఉద్యోగానికి ఎంపికకరకగూడెం: మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఆర్మీలో అగ్నివీర్–జీడీ (జనరల్ డ్యూటీ) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలో రాత, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించగా, శనివారం రాత్రి ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తండ్రి రఫీక్ పాషా ప్రోత్సాహంతో ఆర్మీకి ఎంపికయ్యాడు. కాగా ఇమ్రాన్ డిగ్రీ చదువుతున్నాడు.ఈ సందర్భంగా పలువురు అభినందించారు. సింగరేణిలో అధికారుల బదిలీరుద్రంపూర్: సింగరేణి సంస్థవ్యాప్తంగా 12 ఏరియాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను యాజమాన్యం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీఅయిన వారిలో 117 మంది మైనింగ్ విభాగం అధికారులు, 30 మంది పర్సనల్ విభాగం అధికారులు, 68 మంది ఈ అండ్ ఎం విభాగం అధికారులు ఉన్నారు. వీరిలో జీఎం, ఏజీఎంలు, డీజీఎంలు, డీవైజీఎంలు, అడిషనల్ మేనేజర్లు, అండర్ మేనేజర్లు ఉన్నారు. వీరందరూ నిర్దేశించిన గడువులోగా కేటాయించిన స్థానంలో రిపోర్టు చేయాలని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతిభతోనే గుర్తింపు, గౌరవం వైరా: విద్యార్థులు చదువులో ప్రతిభ చాటుతూ ఉన్నతస్థాయికి చేరడం ద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయని కుమ్మరి శాలివాహన ప్రజాపతి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుమ్మడిదల వెంకటనారాయణ తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన శాలివాహన విద్యార్థులను ఆదివారం వైరాలో సన్మానించి నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేలా కష్టపడి చదువుకోవాలని సూచించారు. -
దాహం తీర్చేలా..
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యంతోపాటు జిల్లా అటవీ ప్రాంతంలో వేసవి కాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఓ వైపు అడవుల విస్తీర్ణం పెంచుతూనే మరోవైపు వన్యప్రాణి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గతంలో కాంపెన్సేటరీ ఏఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ (క్యాంపా) నిధుల ద్వారా జిల్లాలో రూ.2.45 కోట్ల వ్యయంతో 94 నీటి కుంటలు, 54 చెక్ డ్యామ్లు, 36 నీటితొట్లను ఏర్పాటు చేసింది. గతేడాది రూ.19,41,400 వ్యయం చేసి 254 నీటితొట్లను నిర్మించారు. వన్యప్రాణులకు నీటి సౌకర్యం వేసవిలో ఎండలు తీవ్రమై అటవీ ప్రాంతంలోని నీటి వనరులైన వాగులు, వంకలు ఎండిపోవడంతో పలు రకాల వన్యప్రాణులు, పక్షులు నీటి కోసం అల్లాడుతాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ కొన్నేళ్లుగా అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అటవీశాఖ నీటితొట్ల (సాసర్ఫిట్లు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వేసవికాలం ముగిసేవరకు తొట్లలో నీళ్లు ఉండేలా సిబ్బందితో ట్యాంకర్ల ద్వారా నీరు నింపుతోంది. గతేడాది కూడా జిల్లా అటవీ ప్రాంతంలో 6 డివిజన్ల పరిధిలో రూ.5,96,000 వ్యయంతో 74 నీటితొట్లను నిర్మించారు. కొత్తగూడెం డివిజన్లో 60, ఇల్లెందులో 53, పాల్వంచలో 25, మణుగూరులో 48.. భద్రాచలంలో ఈఏడాది1, కిన్నెరసాని అభయారణ్యంలో ఈఏడాది 19 నీటితొట్లను నిర్మించారు. నీటి సౌకర్యంలేని ప్రాంతాలను గుర్తించి 171 నీటితొట్లు, 34 సోలార్ పంపుసెట్లు, 50 నీటికుంటలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. కుంటల్లోని నీరు సురక్షితమేనా..? రెండు రోజుల క్రితం టేకులపల్లి మండలం కిష్టారం బీట్లోని సోలార్ పంపు నీటికుంటలో నీరు తాగిన పది గొర్రెలు తాగి వెంటనే మృతిచెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు కలుషితమయ్యాయా? లేక వన్యప్రాణులను సంహరించేందుకు ఎవరైనా వేటగాళ్లు నీళ్లలో విషప్రయోగం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా వేటగాళ్లు జంతువులను విద్యుత్ ఉచ్చులు, నీటిలో విషప్రయోగం చేస్తూ వేటాడుతున్నట్లు సమాచారం. వేసవికాలంలో వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నీటితొట్లను ఏర్పాటు చేసి, వాటిలో వర్షాలు కురిసేవరకు నీళ్లు ఉండేవిధంగా ట్యాంకర్లతో నీటిని నింపుతున్నాం. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. జంతువులను వేటాడకుండా 30 బేస్క్యాంప్ల్లోని 150 మందికిపైగా సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బందితో 24 గంటలూ పహారా కొనసాగుతోంది. కిష్టారం ఘటనలో పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే తప్ప స్పష్టమైన కారణం చేప్పలేం. –జి.కృష్ణాగౌడ్, డీఎఫ్ఓ -
19 శాతం వెనుకంజ
రుద్రంపూర్: సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో 62 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో మే నెలకు 53,71,900 లక్షల టన్నుల లక్ష్యాన్ని కేటాయించగా.. సంస్థ పరిధిలో 12 ఏరియాల్లోని 18 ఓసీలు, 19 భూగర్భగనుల్లో 43,62,124 లక్షల టన్నులే సాధించడంతో 81శాతంగా నమోదైంది. రోజుకు 2,14,876 లక్షల టన్నులు ఉత్పతి చేయాల్సి ఉన్నా 1,54,402 లక్షల టన్నులకే పరిమితమవుతోంది. ఇక మే నెలలో మణుగురు ఏరియా 115 శాతం, ఆర్జీ–2 ఏరియా 102, సత్తుపల్లి, బెల్లంపల్లి ఏరియాలు 101శాతంతో అగ్రస్థానాన నిలిచాయి. మిగిలిన ఏరియాల్లో కొత్తగూడెం 67శాతం, ఇల్లెందు 63, మందమర్రి 54, రశ్రీరాంపూర్ 24, ఆర్జీ–1 ఏరియా 30, ఆర్జీ– 3 ఏరియా 47, అడ్రియాల ప్రాజెక్ట్ 43, భూపాలపల్లి 47శాతంతో వెనుకంజలో ఉన్నాయి. వచ్చేది వర్షాకాలం ఏటా వేసవిలో గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తికి అవకాశాలు ఉంటాయి. అలాంటి ఈ మే నెలలో నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేని పరిస్థితి ఎదురైంది. ఎండాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో ఉత్పత్తిపై మరింత ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. వర్షాకాలంలో ఓసీల్లో నీరు చేరి బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. రోజుల తరబడి వర్షం కొనసాగిందే ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఇదంతా వార్షిక లక్ష్యసాధనకు ఆటంకంగా మారే ప్రమాదముందని పలువురు చెబుతున్నారు.గతేడాది భారీ వర్షాల కారణంగా ఓసీల్లో లక్షల క్యుసెక్కుల నీరు చేరింది. దీంతో సంస్థ తన సిబ్బంది ద్వారా సొంత మోటార్లతో నీరు తీయించింది. అయితే, అధిక వర్షపాతం నమోదవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కక సుమారు 8 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్కాస్ట్ గనుల్లో వర్షపు నీరు బయటకు తీసే మో టార్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏరియా జీఎంలు సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఆదేశాలతో త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. -
ఈత.. కేరింత
సత్తుపల్లిటౌన్: వేసవి సెలవుల్లో చిన్నారులు ఈత నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈత నేర్పిస్తుండడంతో సత్తుపల్లిలో స్విమ్మింగ్పూల్ నిత్యం ఉదయం, సాయంత్రం సందడిగా ఉంటోంది. ఈతతో ఆరోగ్యానికి మేలు జరుగుతుండడంతో పిల్లలకు స్విమ్మింట్ నేర్పిస్తూ పెద్దలు కూడా ఈత ప్రాక్టీస్ చేస్తున్నారు. సత్తుపల్లిలోని డాల్ఫిన్ స్విమ్మింగ్పూల్లో ఐదేళ్ల లోపు చిన్నారులకు కోచ్ ఈత నేర్పిస్తున్నారు. ఆ పక్కనే ఏడు అడుగుల లోతుతో మరో పూల్లో పెద్దలు ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ఉల్లాసం.. వ్యాయామం వేసవిలో వయస్సుతో సబంధం లేకుండా చిన్నా, పెద్ద ఈత కొట్టేందుకు ప్రాధాన్యత ఇస్తారు. గ్రామాల్లో వ్యవసాయ బావులు, చెరువులు ఉండగా.. పట్టణాల్లో ఆ వెసలుబాటు లేక స్విమ్మింగ్ పూల్స్ను ఆశ్రయిస్తున్నారు. రోజూ గంట పాటు ఈత కొడితే శ్వాస ప్రక్రియ మెరుగుపడడంతో పాటు శరీరంలోని క్యాలరీలు కరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక ఈతతో 90 శాతం అవయవాలు కదలి మంచి వ్యాయామం చేసినట్లు అవుతుందని, మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, మానసిక ఉల్లాసం లభిస్తుందని సూచిస్తున్నారు. ఇవేకాకుండా ఈత కొట్టడం వల్ల ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఒత్తిడి దూరవమవడమే కాక జ్ఞాపకశక్తి, చురుకుదనం పెరుగుదలకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఈత నేర్చుకునేటప్పుడు లైఫ్ జాకెట్లు, తలకు వాటర్ ప్రూఫ్ క్యాప్, కళ్లకు అద్దాలు, చెవుల్లోకి నీరు వెళ్లకుండా అమర్చే పరికరాలతో పాటు సేఫ్టీ పరికరాలు వినియోగించాలి. శిక్షకుల పర్యవేక్షణ ఉండాలి. తలకు టోపీ, కళ్లకు అద్దాలు ధరించటం మంచిది. చర్మవ్యాధులు, జలుబు ఉన్నవారు స్విమ్మింగ్పూల్లోకి వెళ్లకూడదు. స్విమ్మింగ్లో నుంచి బయటకు రాగానే స్నానం చేస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. స్విమ్మింగ్ పూల్లో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారి వెంట ఉండటం మంచిది. వేసవి సెలవులు వృథా చేయకుండా, సెల్ఫోన్తో కాలక్షేపం చేయకుండా ప్రతీరోజు ఈతకు వస్తూ మెళకువలు నేర్చుకుంటున్నా. తద్వారా మంచి ఆరోగ్యం సొంతం అవుతోంది. ఇప్పటికే ఈతలో నైపుణ్యం సాధించి పోటీల్లో బహుమతులు సాధించా. –సుహాస్ కార్తికేయ, సత్తుపల్లి నాకు మొదట్లో నీళ్లంటే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఈతలో నైపుణ్యం సాధించడంతో ఆ భయం పోయింది. ఈత ఒక ఉత్తమ వ్యాయామం. దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. –ప్రణతి, సత్తుపల్లి


