breaking news
Bhadradri
-
చిన్నారుల గాంధీగిరి!
తల్లాడ: పాఠశాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు గాంధీ మార్గాన్ని అనుసరించారు. తల్లాడ మండలం మల్లవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం పంచాయతీ కార్యదర్శి షేక్ సిద్దిక్ మియాకు గులాబీపూలు అందించారు. పాఠశాలలో భగీరథ పైపులైన్ లేక తాగునీరు అందడం లేదని, పైపులైన్ నిర్మాణానికి తవ్వి వదిలేయడంతో రోడ్డు పాడైందని పేర్కొన్న వారు పాఠశాలకు ఇరువైపలా పిచ్చిమొక్కలు తీయించాలని కోరారు. కాగా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని కార్యదర్శి తెలిపారు. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్రాజు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడుకు చెందిన మడకం దేవా (ఏసీఎం ఏరియా కమిటీ సౌత్ బస్తర్), పార్టీ మెంబర్ మడవి జోగా, మిలీషియా సభ్యులు, పోడియం దేవా, మడకం ఇడుమ, మడకం ముకా, మడవి ఐతా లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులకు ఒక్కొక్కరికి తక్షణసాయం కింద రూ.25 వేల చొప్పున నగదు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని ఎస్పీ రోహిత్ పేర్కొన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
టేకులపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని 9వ మైలు తండాకు చెందిన మాలోత్ బీక్యా(75) భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనోవేదన చెందుతున్నాడు. వృద్ధాప్యం వల్ల అనారోగ్యం సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా అతడి కుమారుడు గమనించి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కారు, బైక్ ఢీ
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు పినపాక: ద్విచక్ర వాహనం, కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డ ఘటన మండలంలోని ఐలాపురం వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మణుగూరు మండలం సమితిసింగారం గ్రామానికి చెందిన పాల్వంచ మహేష్ (32) మేనకోడలు అంజలితో కలిసి ద్విచక్రవాహనంపై గడ్డంపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లాడు. కూతురిని చూసి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై జానంపేట నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్పై వస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మహేష్ మృతి చెందాడని తెలిపారు. అంజలి చికిత్స పొందుతోంది. కాగా కారు బైక్ ఢీకొన్నాక రోడ్డు దిగి చెట్లలోకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ అంజయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు. -
చెట్టును ఢీకొట్టిన బైక్
● సింగరేణి కార్మికుడి మృతి మణుగూరు టౌన్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చెట్టుకు బైక్ ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం ముత్యాలమ్మనగర్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓసీ–2లో డ్రిల్ ఆపరేటర్గా పనిచేస్తున్న కుమార్ (37) ఉదయం విధులకు హాజరయ్యాడు. విధులు ముగించుకుని ముత్యాలమ్మనగర్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో హెల్మెట్ పగిలిపోయి తలకు తీవ్రగాయాలుకాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మోటార్సైకిల్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింగరేణి మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఇతర అధికారులు ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా కృషి చేస్తున్నామని పీఓ బి.రాహుల్ దిసోం సంస్థ బృందానికి తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలోని దిసోం సంస్థ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఐటీడీఏ అమలుచేస్తున్న వివిధ పథకాల పరిశీలన నిమిత్తం గురువారం వచ్చారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్ను కలిసి వారు పరిశీలన చేసిన ప్రదేశాల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజన మహిళలకు సబ్బులు, మిల్లెట్ బిస్కెట్లు, నాప్కిన్ వంటి వస్తు తయారీ యూనిట్లను, న్యూట్రి బాస్కెట్, చిక్కి యూనిట్, దాల్ మిల్, బ్రిక్స్ తయారీ, న్యూట్రి డ్రైమిక్స్, ఇప్పపువ్వు లడ్డూ యూనిట్ల ద్వారా జీవనోపాధి కలిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించే వారికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దీపకం వర్క్బుక్స్తో పాటు కెరీర్ గైడెన్స్ ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన సంస్కృతిని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశామని, వారి గోత్రాలు సేకరించి ఇలవేల్పుల గ్రంధాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. దిసోం సంస్థ వ్యవస్థాపకుడు బిరేన్ భాటు మాట్లాడుతూ.. తమ సంస్థ విద్యార్థులు 15 నెలల పాటు దేశ పర్యటన చేసి వివిధ ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో గిరిజ మావిలన్(కేరళ), మిజింగ్ నర్జరి(అసోం), మునిర్(మహారాష్ట్ర), సోడె శ్రీను, సోడే లెనిన్, రాజేంద్రప్రసాద్(ఏపీ) పాల్గొన్నారు. బూడిద తరలింపుతో జీవనోపాధి కల్పించాలి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విడుదలయ్యే బూడిదను తరలించే బాధ్యత నిరుద్యోగ గిరిజన యువతకు అప్పగించాలని, వారికి జీవనోపాధి కల్పించాలని రాహుల్ అన్నారు. తన చాంబర్లో గురువారం బీటీపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీటీపీఎస్ కింద భూములు కోల్పోయిన దమ్మక్కపేట సొసైటీలో 31 మంది, సాంబాయిగూడెం సొసైటీలో 38 మంది, సీతారాంపురం సొసైటీలో 33 మంది, పోతిరెడ్డిపల్లిలో మూడు సొసైటీలు కలిపి 253 మంది గిరిజన యువకులు సొసైటీల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని, బీటీపీఎస్ బూడిద తరలించే బాధ్యత ఎక్కువ శాతం వీరికే అప్పగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, డీఈ మురళీకృష్ణ, ఎస్ఈ శ్రీనివాస్, శివచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
కలల ప్రపంచం!
కార్పొరేషన్ పేరుతోసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు పాల్పడేవారు మళ్లీ రెక్కలు విప్పుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సామాన్యుల కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీరి ఆగడాలకు ఆరంభంలోనే అడ్డుకట్ట వేయకుంటే జిల్లా ఆవిర్భావం సమయంలో జరిగిన మోసాలే పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా సమీకృత కార్యాలయం ఎదురుగా 2017లో వెంచర్లో స్థలాలు కొనుగోలు చేసిన పలువురికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని, తమలా మరొకరకు మోసపోకుండా చూడాలని గత నాలుగైదేళ్లుగా కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లో బాధితులు పలుమారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేడు. ఎనిమిదేళ్లుగా తేలని పంచాయితీ.. అనధికారిక వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ఇళ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా ఇవి తమ ప్లాట్లని, తాము ఫలానా వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని వేరే వ్యక్తులు రంగంలోకి దిగారు. ఈ విషయమై పాల్వంచ పోలీస్స్టేషన్, ఎస్పీ ఆఫీస్, కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లో బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎనిమిదేళ్లుగా ఎటూ తేలడం లేదు. స్థానిక దాదాలు రంగంలోకి దిగినా గొడవలు, రక్తపాతాలు మినహా ఒరిగిందేమీ లేదు. అనధికారిక వెంచర్ వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భారీ కమీషన్లు తీసుకుని అమాయకులకు ప్లాట్లు అంటగట్టిన బ్రోకర్లు తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిస్తేజంగా కార్పొరేషన్.. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను ఏకం చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు జీఓ వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు పాల్వంచ మొదలు సుజాతనగర్ వరకు ఎక్కడిక్కడ వెంచర్లు వెలుస్తూనే ఉన్నాయి. వీటికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ పేరుతో కలల ప్రపంచం చూపిస్తూ అనధికారిక వెంచర్లు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నా బల్దియా నుంచి కనీస అప్రమత్తత కనిపించడం లేదు.జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుత పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 416/1/2/1లో (ఐడీఓసీ ఎదురుగా) ఉన్న ఎకరం స్థలంలో 2017లో అనధికారిక వెంచర్ వేశారు. సాధారణంగా ఎకరం స్థలంలో 30, 20 అడుగులతో రోడ్లు, పదిశాతం కమ్యూనిటీ స్థలాన్ని మినహాయిస్తే 200 గజాల చొప్పున 12 నుంచి 14 ప్లాట్లు చేయొచ్చు. కానీ ఈ వెంచర్లో ఏకంగా 29 మందికి 200 గజాల ప్లాట్లు ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలో నిర్మించే కలెక్టరేట్ ఎదురుగా ప్లాట్లు కారుచౌకగా వస్తున్నాయని, ఆలస్యం చేస్తే మళ్లీ అవకాశం రాదని ఆరు నెలల్లోనే ప్లాట్లు అమ్మేశారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది కూలీలు, టైలర్లు, చిన్న చిన్న కిరాణా కొట్ల నిర్వాహకులే ఉన్నారు. వీరిలోనూ మహిళలే అధికంగా ఉన్నారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. నా భర్త కూలీ పని, నేను టైలరింగ్ చేస్తూ పైసాపైసా కూడబెట్టాం. ఇద్దరు పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని 2017లో కలెక్టరేట్ ఎదురుగా వెలిసిన వెంచర్లో 200 గజాల ప్లాట్ కొనుగోలు చేశాం. ప్లాట్ అమ్మిపెట్టిన బ్రోకర్, వెంచర్ వేసిన యజమాని చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఇప్పటికీ మాకు ప్లాటు దక్కలేదు. అడిగితే మహిళ అని కూడా చూడకుండా కొడుతున్నారు. – రమాదేవి, కొత్తగూడెంనా భర్త దుబాయ్లో ఉంటాడు. అక్కడ రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు మాడ్చుకుని కూడబెట్టిన డబ్బుతో 2017లో కలెక్టరేట్ ఎదురుగా వేసిన వెంచర్లో రెండు ప్లాట్లు కొనుగోలు చేశా. ఇప్పటికీ ఆ ప్లాట్లు మాకు అప్పగించలేదు. ఈ విషయమై కుటుంబంలో కలతలు వచ్చాయి. దయచేసి ఇప్పటికై నా అనధికారిక వెంచర్ల విషయంలో సర్వే జరిపి మాకు న్యాయం చేయాలి. మరొకరు నష్టపోకుండా చూడాలి. – అరుణ, భద్రాచలం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, అక్టోబర్ 7న నిర్వహించే శబరి యాత్రపై ఆలయ ఈఓ దామోదర్రావు ఆదివాసీ గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించారు. శబరి యాత్రకు గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈఓ కోరారు. నిత్యాన్నదానానికి విరాళంభద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడుకు చెందిన గారపాటి తులసమ్మ రూ.లక్ష, బొప్పొడి కాశీబాబు–శాంతారాణి దంపతులు రూ.50వేల చెక్కును ఆలయ అధికారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతల కుటుంబసభ్యులు స్వామివారిని దర్శించుకోగా, అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ పీఆర్వో రామిరెడ్డి, వేదపండితులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. కాగా, మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో శనివారం రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. పూజలో పాల్గొనేవారు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేయించుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు నందీశ్వరుడికి అభిషేకం పెద్దమ్మగుడి సముదాయంలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. నేడు జాబ్ మేళాసింగరేణి(కొత్తగూడెం): హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 200 ఖాళీల (ప్రొడక్షన్ ట్రైనీ) భర్తీకి కొత్తగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బీఎస్సీ చదువుకునేందుకు ఆసక్తి గలవారికి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ వారు ఆర్థిక సాయం, వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. ‘ఎర్త్ సైన్సెస్’లో స్పాట్ అడ్మిషన్లకు 14 మందికొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్, బీఎస్సీ జియాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు 14 మంది విద్యార్థులు హాజరయ్యారని ఓఎస్డీ జగన్మోహన్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 20 వరకు అవకాశం కల్పించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఇదేం జీ(వి)తం !
● 104 సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాల్లేవ్.. ● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలుబూర్గంపాడు: ఆరు నెలలుగా వేతనాలందక 104 సిబ్బంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. విఽధి నిర్వహణకు రోజూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు రవాణా చార్జీలకు కూడా కటకటలాడుతున్నారు. జీతాలు చెల్లించాలని అటు అధికారులను, ఇటు ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం శూన్యం. చివరకు మంత్రులు, ఆరోగ్యశాఖ కమిషనర్ను కలిసినా వేతనాలు మాత్రం రావడం లేదు. కనీసం దసరా పండుగకై నా చెల్లించి తమను ఆదుకోవాలని జిల్లాలోని 104 ఉద్యోగులు కోరుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో సర్దుబాటు.. జిల్లాలో 59 మంది 104 సిబ్బంది వివిధ పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఫార్మసిస్ట్లుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా, డ్రైవర్లుగా, సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. వీరికి గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో క్రమం తప్పకుండా వేతనాలు అందిన దాఖలాలు లేవు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దీర్ఘకాల రోగులకు ప్రతీ నెల వైద్యారోగ్య శాఖ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు అందించే లక్ష్యంతో 104 వాహనాలను ప్రవేశపెట్టారు. ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించగా 2022 వరకు ప్రజలకు వైద్య సేవలు అందించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 104 వాహనాలను తొలగించి, ఆ సిబ్బందిని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సర్దుబాటు చేసింది. ఫార్మసిస్ట్లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ. 22,750, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, మల్టీపర్పస్ హెల్త్ ఆసిస్టెంట్లకు రూ.19,500, సెక్యూరిటీ గార్డులకు రూ.15,600 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని సిబ్బంది కోరుతుండగా.. ఆ మాటేమో కానీ సక్రమంగా వేతనాలు కూడా రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా బడ్జెట్ విడుదల చేసి తమకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయమై బూర్గంపాడు సీహెచ్సీ సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. 104 సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వలేదని, రాగానే వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఆస్పత్రుల రాకపోకలకు రవాణా చార్జీలకు కూడా డబ్బులుండడం లేదు. కుటుంబం గడవటం కష్టంగా మారింది. కనీసం దసరా పండుగకై నా వేతనాలు అందించి ఆదుకోవాలి. – రవి, 104 వర్కర్స్ యూనియన్ నాయకుడురోజూ ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్న మమ్మల్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి. పిల్లల చదువులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు అందించాలి. – శ్రీనివాస్, 104 వర్కర్స్ యూనియన్ నాయకుడు -
సింగరేణి విస్తరణకు సహకరించండి
ఎస్బీఐ చైర్మన్తో భేటీలో సీఎండీ బలరామ్కొత్తగూడెంఅర్బన్: సింగరేణి విశ్వవ్యాప్తంగా విస్తరించేలా దేశ, విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సంసిద్ధత తెలిపింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీ సత్యేంద్రకుమార్ సింగ్, సీజీఎం శైలేష్ ఉన్నితన్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానాన ఉన్న సింగరేణి త్వరలోనే దేశ, విదేశాల్లో కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించనుందని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ లభించిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వినియోగించుకుంటూ దేశంలోనూ పెద్ద ఎత్తున కీలక ఖనిజాల ఉత్పత్తికి సిద్ధమవుతున్నామని, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, 5 వేల మెగావాట్ల సోలార్, థర్మల్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్, మిథనాల్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎండీ వివరించారు. సింగరేణి చేపట్టే భారీ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో ఆర్థిక సహకారం అందించాలని కోరగా ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే సింగరేణి ప్రధాన ఆర్థిక లావాదేవీల (లీడ్) బ్యాంకుగా సేవలదింస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సంస్థగా సత్తా చాటాలని ఆకాంక్షించారు. -
22 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేయాలన్న అదనపు కలెక్టర్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ అభ్యర్థులకు బాబుక్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతికి 320 మంది, ఇంటర్కు 300 మంది హాజరు కానున్నారని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్టికెట్ వెంట తెచ్చుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వివరాలకు 89192 79238 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ బి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ’ మట్టి మాయం!
● టిప్పర్ లారీలతో అర్ధరాత్రి తరలింపు ● వందలాది ట్రిప్పుల కాలువ మట్టి స్వాహాములకలపల్లి : మండల పరిధిలోని సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రధాన కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీలతో టిప్పర్ లారీల్లో నింపి ఇతర ప్రాంతాలకు తోలి విక్రయిస్తున్నారు. పూసుగూడెం, మాధారం మధ్య అటవీ ప్రాంతంలోని మెయిన్ కెనాల్ సమీపం నుంచి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. జనసంచారం లేని ప్రాంతం కావడంతో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా మట్టి తరలించుకుపోతున్నారు. గత కొన్ని నెలులగా ఈ దందా సాగుతుండగా, ఇప్పటికే వందల కొద్దీ టిప్పుల మట్టి పాల్వంచతోపాటు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో 12 అడుగులకు పైగా ఎత్తుగా పోసిన కాలువ మట్టి తరలిపోతోంది. సుమారు ఐదు వందల టిప్పర్ లారీలకు పైగా మట్టి బయటకు తరలించినట్లు సమాచారం. ఒక్కో టిప్పర్ రూ.5 వేలకు విక్రయించినా రూ.25 లక్షల విలువైన మట్టి తరలించినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టిప్పర్ సీజ్, జరిమానా విధింపు కొన్ని నెలలుగా దందా సాగుతున్న క్రమంలో పోలీసులు ఇటీవల ఓ లారీని సీజ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో రాత్రి వేళ సాగుతున్న మట్టి తోలకాల విషయం బయటకు పొక్కింది. సదరు మట్టి టిప్పర్ లారీని పోలీసులు, రెవెన్యూ శాఖకు అప్పగించారు. రూ.5 వేలు జరిమానా విధించినట్లు తహసీల్దార్ భూక్యా గనియా తెలిపారు.మట్టి తోలకాల విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. అక్రమ తోలకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మట్టి అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. –రాంబాబు, డీఈ, నీటి పారుదల శాఖ -
యంత్రాలు వినియోగించుకుంటే..
ఇల్లెందు: మద్దతు ధర పొందాలంటే నిబంధనల ప్రకారం పంట ఉత్పత్తుల్లో వ్యర్థాలు ఉండకూడదు. తేమ నిర్దేశిత శాతానికి మించొద్దు. అప్పుడే రైతులు తాము పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందారు. పంటల్లో వ్యర్థాల తొలగింపునకు, ఉత్పత్తులను ఆరబెట్టేందుకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవగాహన లేకపోవడంతో రైతులు ఉపయోగించుకోవడంలేదు. దీంతో రూ. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు కార్యాలయాల్లో, గోదాంలలో మూలుగుతున్నాయి. 5.92 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 5,92,264 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. 1,39,169 మంది రైతులు ఉన్నారు. వరి 42 వేల ఎకరాలు, పత్తి 2.11 లక్షలు ఎకరాలు, మొక్కజొన్న 84 వేల ఎకరాలు, పెసర 346 ఎకరాలు, కంది 1,071 ఎకరాలతోపాటు మరికొన్ని పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పంటల కొనుగోలు సమయంలో వ్యాపారులు, అధికారులు ఆయా పంటలను పరిశీలించి యంత్రాలతో నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయిస్తుంటారు. అందుకు తగ్గట్లు పరిశుభ్రత పాటించకపోతే మద్దతు ధర లభించదు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నష్టం వాటిల్ల కుండా ఉండేందుకు ఆయా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నాణ్యత నిర్ధారణ యంత్రాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కువ మంది రైతులు వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తద్వారా ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారు. ఇందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు. అందుబాటులో ఉన్న యంత్రాలు ధాన్యానికి సంబంధించి నూర్పిడి యంత్రం, తాలు లేకుండా చేసేందుకు జల్లెడ, ప్యాడీ క్లీనర్, తూర్పార యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే డ్రయ్యర్ అనే యంత్రంతో ఆరబెట్టవచ్చు. ఇల్లెందు వ్యవపాయ మార్కెట్లో ప్యాడీ క్లీనర్ యంత్రాలు 60, ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్స్ రెండు, పెద్ద ప్యాడీ క్లీనర్ యంత్రాలు 13, ఒక డ్రయ్యర్ ఉన్నాయి. టార్పాలిన్లు 1900, ఎలక్ట్రానిక్ తూకం కాంటాలు 157, తేమ శాతం తేల్చే మిషన్లు 83, క్యాలీబర్స్ 54, టస్క్ రిమూవర్స్ 57 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాలను రైతులకు ఉచితంగా అందజేస్తారు. కాగా జిల్లాలో 43 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీలు వీటిని నిర్వహిస్తాయి.పంట ఉత్పత్తుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు మార్కెట్ యార్డుల్లో పంటల పరిశుభ్రతకు ఉపయోగించుకోవాల్సిన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంట ఉత్పత్తుల్లో నాణ్యత పెంచుకుంటే మద్దతు ధర పొందవచ్చు. యంత్రాలను రైతులకు ఉచితంగానే అందజేస్తాం. –ఈ.నరేష్, మార్కెట్ కార్యదర్శి, ఇల్లెందు -
విద్యావసతుల విస్తరణకు కృషి
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యా వసతుల విస్తరణకు నిరంతరం కృషి చేస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని రామవరం ఏరియా బాలికల గురుకుల పాఠశాలలో రూ.5 కోట్ల ఐటీడీఏ నిధులతో చేపట్టనున్న వసతిగృహాల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువ మంది గిరిజన, గిరిజనేతర పేద విద్యార్థులు గ్రామీణ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారని, వీరిని మరింత ప్రోత్సహించి ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ప్రిన్సిపాల్ శిరీష, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘రేడియో’లో రామానుజవరం విద్యార్థినులు
మణుగూరు రూరల్ : మండలంలోని రామానుజవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం కొత్తగూడెం ఆకాశవాణి రేడియో కదంబ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చూపారు. సుమారు గంట సేపు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పి.నిఖిత, జి.అక్షయ దివ్య, ఎస్కే. అస్రత్, ఎ.శ్రావణి, పి.పుష్పాంజలి, బి.మహిమతేజలు గురువులకు వందనాల పాట పాడారు. సెల్ఫోన్లతో కలిగే నష్టాలను తెలిపే కవితలను చదివారు. పొడుపుకథలు, కనువిప్పు నాటిక, జోకులు, ఐకమత్యమే మహాబలం ఆంగ్ల కథ, తెలుగునీతి పద్యాలు, నాకు నచ్చిన నాయకుడు అబ్దుల్ కలాం తదితర అంశాలను వివరించారు. విద్యార్థినులను, ప్రోత్సహించిన ఉపాధ్యాయులు వీవీ కోటేశ్వరరావు, జి.సురేష్లను పాఠశాల హెచ్ఎం యశోద అభినందించారు. కాగా రేడియో కార్యక్రమం ఈ నెల 21న మధ్యాహ్నం 12.40 గంటలకు కొత్తగూడెం ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుందని హెచ్ఎం తెలిపారు. -
ముస్లిం దంపతుల మత సామరస్యం
అశ్వారావుపేటరూరల్: ముస్లిం దంపతులు భవానీ మాలధారులకు భిక్ష(అన్నదానం) చేసి మత సామరస్యం చాటారు. మండలంలోని ఆసుపాక గ్రామానికి చెందిన ఎస్కే కరీం–గౌసియా దంపతులు గురువారం తమ గ్రామంలో భవాని మాలధరించిన స్వాములకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ముస్లిం దంపతులు మాట్లాడుతూ కుల మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని, ఎంతో కఠోర దీక్ష చేసే భవాని మాలదారులకు అన్నదానం చేసే అదృష్టం తమ దక్కడం సంతోకరమని అన్నారు. పీడీఎస్యూ జిల్లా కమిటీ ఎన్నికసింగరేణి(కొత్తగూడెం): సెప్టెంబర్ 16,17 తేదీల్లో కొత్తగూడెంలోని ఉర్దూఘర్ ఫంక్షన్ హాల్లో పీడీఎస్యూ జిల్లా మహాసభలు జరిగాయి. మొదటి రోజు పట్టణంలో విద్యార్థుల ప్రదర్శన, రెండో రోజు ప్రతిఽనిధుల సభ నిర్వహించారు. నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోగా, గురువారం వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా వి.విజయ్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జే.గణేష్లతోపాటు మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సింగరేణి మహిళా కళాశాల లెక్చరర్కు డాక్టరేట్సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం హెచ్ఓడీగా పనిచేస్తున్న జి.మంజులకు ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆంగ్లంలో పరిశోధన చేసినందుకు ఆమెకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా సింగరేణి జీఎం ఎడ్యుకేషన్ ఎస్.వెంకటాచారి, కరస్పాండెంట్ జీకే కిరణ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శారద, కళాశాల లెక్చరర్లు అభినందనలు తెలిపారు. నర్సరీలోని మొక్కలు ధ్వంసం! దుమ్ముగూడెం : మండలంలోని పెద్దబండిరేవు గ్రామంలోని అటవీశాఖ నర్సరీలోని దాదాపు 2 లక్షల మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు సమాచారం. నర్సరీలోని మొక్కలపై దుండగులు పురుగు మందు స్ప్రే చేయడంతో మొక్కలు మాడిపోయినట్లు తెలిసింది. రేంజర్ కమల సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. 22న ఫుట్బాల్ జట్టు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 ఫుట్బాల్ బాలుర జట్టును ఈనెల 22న ఎంపిక చేయనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే పోటీలకు క్రీడాకారులు వయసు ధ్రువపత్రాలతో పాటు ఇంటర్ స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలని చెప్పారు. ఇక్కడ ఎంపిక చేసే జిల్లా జట్టు రాష్ట్రస్థాయి అండర్–19 జూనియర్ కళాశాలల పోటీల్లో పాల్గొంటుందని, వివరాలకు 99896 47696, 98483 41238 నంబర్లలో సూచించారు. పద్ధతి మార్చుకోకుంటే శిక్ష తప్పదుచర్ల: కాంట్రాక్టర్లు, వ్యాపారులు, భూస్వాములు, రాజకీయ నాయకులతో పాటు ఓ విలేకరి పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతా రామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి విప్లవ పేరిట గురువారం రాత్రి లేఖ విడుదలైంది. విప్లవోద్యమంపై పాలకుల, భూస్వా మ్య, పెత్తందారుల విధానాలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయని, పేద, మధ్య తరగతి వర్గాలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొందరు పెత్తందారులు ఈ పోకడలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రాజకీయ బ్రోకర్లతో కలిసి పెత్తందారులు, భూస్వాములు ఈ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు తమదృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. భూస్వాములు వారి భూములను పేదలకు పంచాలని, లేదంటే తామే స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని ప్రకటించారు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, భూస్వాములు, కాంట్రాక్టర్లు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, ఓ విలేకరి(సాక్షి కాదు) కూడా ఇలాంటి వైఖరే ప్రదర్శిస్తున్నాడని, వారు పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. -
కొత్తగా పోడు నరికాడని..
జూలూరుపాడు: అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లఘించి 124 చెట్లు నరకడాన్ని గుర్తించిన అటవీ అధికారులు కేసు నమోదు చేసి, రూ 23 వేలు జరిమానా విధించారు. మండలంలోని రాజారావుపేట బీట్ను గురువారం అటవీశాఖ టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్లు లోకనాథం, రాఘవరావు పరిశీలించారు. కంపార్ట్మెంట్ 35లో పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లాతండాకు చెందిన నునావత్ రమేష్ అనే వ్యక్తి కొత్తగా పోడు నరికినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కాగా రమేష్కు 2006లో 5.5 ఎకరాల పోడు భూమికి ప్రభుత్వం అటవీ హక్కు పత్రాన్ని అందించింది. ఐదున్నర ఎకరాల పోడు భూమిలో సాగు చేయకుండా కొంత భూమి వదిలేశానని, ఆ స్థలంలోని చెట్లు నరికానని బాధిత రైతు రమేష్ చెబుతున్నాడు. హక్కు పత్రాలున్న భూమి పక్కన అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి చెట్లు నరికి కొత్తగా పోడు సాగు చేసేందుకు రమేష్ ప్రయత్నిస్తున్నాడని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో రాజారావుపేట సెక్షన్ ఆఫీసర్ హారిక, బీట్ ఆఫీసర్లు ఎస్కే రహీం, రేఖ పాల్గొన్నారు. గిరిజన రైతుపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు -
కెమికల్ లారీ బోల్తా
టేకులపల్లి: అదుపు తప్పి కెమికల్ లారీ బోల్తా పడింది. త్రుటిలో డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం... కర్నూల్ నుంచి భద్రాచలం వెళ్తున్న కెమికల్ లారీ బొమ్మనపల్లి వద్ద గురువారం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ , క్లీనర్ లారీ నుంచి పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. లారీలో కెమికల్స్ ఉన్నా లీకేజీ కాకపోవడంతో ప్రమాదం జరగలేదు. ఆలయంలో చోరీజూలూరుపాడు: మండలంలోని కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలోకి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. తాళం పగులగొట్టి గుర్తుతెలియని ఆలయంలోకి చొరబడ్డారు. గర్భగుడి తలుపు తాళం పగులగొట్టి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. హుండీ కూడా పగులగొట్టారు. రెండు రోజుల క్రితమే ఆలయ కమిటీ కానుకలు లెక్కించడంతో అందులో డబ్బులు లేవు. దొంగలు అపహరించిన ఆభరణాల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాదావత్ రవి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా మంగళవారం రాత్రి మాచినేనిపేటతండా గ్రామంలో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి బంగారు, వెండి వస్తువులను చోరీ చేశారు. రెండో రోజు బుధవారం రాత్రి కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ ఆలయంలో చోరీ జరగింది. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
భద్రాచలంటౌన్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన కరకట్టపై గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మొక్క నాటి మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి సంస్థ మరిన్ని పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం జూనియర్ కళాశాల సెంటర్లోని షిరిడీ సాయిబాబా ఆలయాన్ని సందదర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు చిట్టె లలిత, పామరాజు తిరుమలరావు, పల్లింటి దేశప్ప, కామిశెట్టి కృష్ణార్జునరావు, గంగాధర వీరయ్య, బిర్రు సుధాకర్, రామరాజు, ఆలయ చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అబ్బినేని శ్రీనివాసరావు, గొర్ల వెంకటేశ్వరరావు, ఆర్ఐ నరసింహారావు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట మొక్క నాటుతున్న సబ్ కలెక్టర్, తదితరులు -
పాఠశాల ప్రారంభం
అన్నపురెడ్డిపల్లి, (చండ్రుగొండ): మండలంలోని కనకగిరి గుట్టల ప్రాంతంలో ఉన్న రజబ్అలీ నగర్లో గిరిపుత్రుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను బుధవారం ఎంఈఓ ఉండేటి అనంద్కుమార్ ప్రారంభించారు. మహబూబ్నగర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రజబ్అలీనగర్ 3 కి.మీ. దూరంలో ఉంది. గొత్తికోయ చిన్నారులు పాఠశా లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ఎంఈఓ ఆనంద్కుమార్ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఓ వెంకటరమణ, సీఆర్పీలు శిరీష, కృష్ణ, బుచ్చయ్య, వి.వెంకటేశ్వరరావు, జయరాం, శంకర్, మహదేవన్ పాల్గొన్నారు. -
ఏడుగురిపై కేసు
అశ్వాపురం: మండల కేంద్రంలో కాలువబజార్లో బుధవారం జరిగిన గొడవ, దాడి కేసులో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలువబజార్లో బొల్లం కుమార్ తల్లి ఇటీవల మరణించగా బుధవారం పెద్ద కర్మ నిర్వహించారు. అక్కడికి వచ్చిన కొందరు మద్యం సేవించి గొడవ పడి కుమార్ తండ్రి, బంధువులపై దాడి చేసి గాయపరిచారు. బొల్లం కుమార్ ఫిర్యాదు మేరకు జగ్గారం గ్రామానికి చెందిన నూకల సంపత్, పిండి శ్రావణ్, బాలిన రాజేశ్, నూకల నాగరాజు, నెట్టెం రామకృష్ణపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలో నూకల నాగరాజు ఫిర్యాదు మేరకు కొత్తగూడెంనకు చెందిన కాటిబోయిన అరవింద్, జంగిలి శ్రీనివాస్పై సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు అదనపు చెల్లింపులు
చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలి విడత బిల్లుల చెల్లింపుల తర్వాత అదనంగా మరోసారి నగదు జమ చేసిన ఘటన బుధవారం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో వెలుగు చూసింది. ఆలస్యంగా దీనిని గుర్తించిన అధికారులు లబ్ధిదారుల వద్ద నుంచి వాటిని రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. చండ్రుగొండ మండలానికి చెందిన ఎస్డీ ఇమాంబీ, సిరికొండ స్వామి, గంగారపు సుబ్బమ్మ, కునసోతు జయ, పొట్టా భవానీ, బండ ఉషారాణి, కంచర్ల తిరుమలి, ఇనుముల లక్ష్మి, కుక్కముడి రాణి, గోసుల నర్సింహారావు, సీతమ్మ, జాల పద్మకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నెల 11వ తేదీన వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున నగదు జమ అయింది. కాగా, వారికి అదనంగా మరోసారి ఈ నెల 15న బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు లబ్ధిదారుల వద్దకు వెళ్లి అదనంగా నగదు చెల్లింపులు జరిగాయని, ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాల్సిందిగా స్థానిక గృహ నిర్మాణ శాఖ అధికారులు కోరుతున్నారు. కాగా, చండ్రుగొండ మండలంతోపాటు అన్నపురెడ్డిపల్లి మండలం, జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కుడా ఇలాగే జరిగినట్లు తెలిసింది.టెన్నిస్ కోర్టు ప్రారంభంభద్రాచలంటౌన్: ఉద్యోగులకు టెన్నిస్ క్రీడలు ఎంతో మేలు చేస్తాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని నివాస సముదాయంలలో కొత్తగా నిర్మించిన లాన్ టెన్నిస్ కోర్టును పీఓ బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. టెన్నిస్ ఆడితే వ్యాయామంతో పాటు మనసుకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. క్రమం తప్పకుండా ఉద్యోగులు తమ పిల్లలు గంట పాటు టెన్నిస్ ఆడాలని సూచించారు. చెత్తా చెదారాన్ని మైదానంలో వేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, అలివేలు మంగతాయారు, గోపాల్రావు, నాగేశ్వరరావు, ఆదినారాయణ, పీడీలు వెంకటేశ్వర్లు, హరికృష్ణ ఈశ్వర్,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.మార్గదర్శక శక్తిగా పనిచేస్తాయి..అశ్వాపురం: ఎన్సీసీ శిబిరంలో పొందిన శిక్షణ, అనుభవాలు వారి భవిష్యత్ ప్రయత్నాల్లో మార్గదర్శక శక్తిగా పనిచేస్తాయని ఐటీడీఏ పీఓ రాహుల్, వరంగల్ గ్రూప్ కమాండర్ వీరచక్ర కల్నల్ సచిన్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో పది రోజులుగా జరుగుతున్న ఎన్సీసీ శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఐటీడీఏ పీఓ, వరంగల్ గ్రూప్ కమాండర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. కేడెట్లు దేశభక్తి గీతాలు, తెలంగాణ సాంస్క్రతిక నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాహుల్, సచిన్ మాట్లాడుతూ.. ఎన్సీసీ శిక్షణలో పొందిన అనుభవాలు నాయకత్వం, దేశభక్తి, బాధ్యతను పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్భద్ర, కళాశాల ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి, సిబ్బంది పాల్గొన్నారు.వృద్ధుడి అదృశ్యంచండ్రుగొండ: మండలంలోని రావికంపాడు గ్రామానికి చెందిన బొర్రా భావ్సింగ్ కనిపించకుండా పోగా.. బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. 70 ఏళ్ల వయసున్న భావ్సింగ్ మంగళవారం మండలంలోని టేకులపల్లిలో ఉన్న తన కుమార్తెను చూసి వస్తానని వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా, ఆయన అక్కడకు రాలేదని చెప్పారు. భావ్సింగ్ ఆచూకీ తెలియకపోవడంతో కుటంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్ 87126 82043కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీజూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండాలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. మాచినేనిపేటతండాకు చెందిన బీరేల్లి సుధాకర్ ఈనెల 16న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం ఇంటికి వచ్చి చూడగా.. చోరీ జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ శ్రీలక్ష్మి.. సిబ్బంది, క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.12 వేల విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని ఎస్ఐ రవి తెలిపారు. -
పంట నిల్వ ప్రాజెక్టులకు రాయితీలు
ఖమ్మంవ్యవసాయం: పంటల నిల్వ, రవాణా, ప్రాససింగ్ చేయడం వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఉద్యాన రైతులకు ఈ మేరకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. దేశంలో రైతులు పండించిన పంటల్లో 20–30 శాతం వరకు తగిన నిర్వహణ లేక నాణ్యత కోల్పోయి మద్దతు ధర దక్కడం లేదు. ఉద్యాన పంటల్లో ప్రధానంగా పండ్లు కోత తరువాత శీతలీకరించడం, గ్రేడ్ చేయడం, ప్యాకింగ్, రవాణా, ప్రాసెసింగ్ వంటి విధానాలు అవలంభించడం ద్వారా విలువ పెరగడంతో పాటు ప్రత్యేక మార్కెటింగ్ చానల్ ద్వారా అమ్మకాల కు అవకాశం ఉంటుంది. తద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాక వినియోగదారులకు నాణ్యమైన పండ్లు లభిస్తాయి. జిల్లాలో పండ్లతోటలు పెంచే రైతుల కు ఏడు ప్యాక్ హౌస్ యూనిట్లు, రెండు కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ఒక రైషనింగ్ చాంబర్, 15సోలార్ ప్యానెల్ యూనిట్లు మంజూరయ్యాయని జిల్లా ఉద్యానాధికారి ఎం.మధుసూదన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ
చర్ల: చర్ల – వెంకటాపురం ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో లారీడ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని సీ–కత్తిగూడెంలో ప్రధాన రహదారిపై ఇసుక లారీ నిలిపి ఉంది. వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్కు తీవ్ర గాయాలవగా, లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. స్థానికులు గమనించి, గాయపడిన డ్రైవర్ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అటవీ శాఖకు నూతన హంగులుసత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అటవీశాఖకు జిల్లా కేంద్రం తరహాలో నూతనహంగులు రానున్నాయి. టింబర్ డిపోప్రాంగణంలోని స్థలాన్నిపరేడ్గ్రౌండ్గా తీర్చిదిద్దారు. ఇందులోరూ.2లక్షలతో అటవీ అమరవీరుల స్తూపం, రూ.4 లక్షలతో పోడియం ఏర్పాటు చేశారు. డివిజన్స్థాయిలో ఉద్యోగులకు శిక్షణ, సమావేశాల నిర్వహణకోసం రూ.12 లక్షలతో మీటింగ్హాల్ నిర్మించారు.నీలాద్రి అర్బన్ పార్కులో..సందర్శకుల ఆదరణ పెరుగుతున్న నీలాద్రి అర్బన్ పార్కుకు రూ.10 లక్షలతో మారో రెండు బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ పార్కులోని వన్యప్రాణులు బయటకు రాకుండా.. వీధి కుక్కలు లోపలికి చొరబడకుండా కన్జర్వేషన్ జోన్ ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో 1.5 కిలోమీటర్ల మేర చైన్లింగ్ ఫెన్సింగ్తో రక్షణ చర్యలు చేపట్టారు. పనులను ఎమ్మెల్యే రాగమయితో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభిస్తారు. -
యాత్రాదానం.. సేవాభావం
● వినూత్న కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలను యాత్రలకు తీసుకెళ్లేలా కార్యాచరణ ● దాతలు ముందుకొస్తే బస్సుల కేటాయింపుసత్తుపల్లిటౌన్: పుణ్యక్షేత్రాలు, పర్యాటక, విజ్ఞాన విహార యాత్రలను సందర్శించాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది. కానీ, పేదరికం వల్ల ఆ కల నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం వినూత్నంగా ‘యాత్రా దానం’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పలు యాత్రలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకబస్సులు నడుపుతున్న ఆర్టీసీ యాత్రాదా నం పేరిట ఆదాయాన్ని ఆర్జించేందుకు నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను దాతల సహకారంతో అనాథలు, పేద లు సందర్శించేలా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీరికి అవకాశం కల్పించేలా.. జిల్లాలోని అనాథలు, ఆశ్రమాలలోని వృద్ధులు, దివ్యాంగులు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టీసీ ‘యాత్రాదానం’తో పర్యాటక, పుణ్య క్షేత్రాల సందర్శనకు తీసుకెళ్తారు. అందుకోసం రీజియన్ లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డిపోల పరిధి లో డిపోమేనేజర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. దాతల చేయూతతో.. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజులు, పండుగలు తదితర సందర్భాలు, సంతోషకరమైన రోజుల్లో అన్నదానం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం ఎక్కువగా చేస్తుంటా రు. ఈసందర్భాలలో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాల దర్శ నం కల్పించటానికి ఆర్టీసీకి డబ్బులు విరాళంగా అందజేస్తే బస్సు సదుపాయం కల్పిస్తారు. అలాంటి దాతలు, సంస్థల సేవలను వినియోగించుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఎన్ఆర్ఐలతో పాటు కార్పొరేట్ సంస్థలు, స్వస్ఛంద సంస్థలు, సంఘాలు ముందుకు వచ్చి ఆర్టీసీ ‘యాత్రాదానం’లో భాగస్వాములు కావొచ్చు. మిత్రుల భాగస్వామ్యంతోనైనా.. యాత్రాదానం కార్యక్రమంలో దాతలు ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు సామాజిక సేవ చేశామనే ఆనందం పొందవచ్చు. దాతలు ఏ పుణ్యక్షేత్రానికి యా త్రాదానం చేయదల్చుకున్నారో వివరాలతో డిపో మేనేజర్లను సంప్రదించాలి. యాత్రకు సంబంధించి కిలోమీటర్లను లెక్కించి దాని ప్రాతిపదికన ఏసీ, సూపర్లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల చార్జీలు వెల్లడిస్తారు. ఆపై బస్సులను ఎంచుకుంటే డిపోల నుంచి కేటాయిస్తారు. యాత్రకు సంబంధించి నగదును ఒకరైనా.. ఇంకొందరితో కలిపైనా చెల్లించవచ్చు. పుణ్యక్షేత్రాలతో.. ఖమ్మం రీజియన్లో ఏడు డిపోలకు గాను మొత్తం 563 బస్సులు ఉన్నాయి. గతంలో జూన్ నుంచి పుణ్యక్షేత్రాలు, యాత్రల పేరిట అరుణాచలం తదితర ప్రాంతాలకు ప్రత్యేకరోజుల్లో బస్సులు ఏర్పా టు చేస్తున్నారు. రీజియన్ నుంచి 42 బస్సులు నడపగా 25,682 మంది భక్తులు ఉపయోగించుకున్నారు. తద్వారా రీజియన్కు రూ.17,03,668 ఆదాయం లభించింది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి యాత్రాదానానికి సహకరించవచ్చు. సామాజిక సేవలో భాగంగా విరాళాలు ఇస్తే పేదలు పుణ్యక్షేత్రాలు, విజ్ఞాన, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సుల్లో సందర్శించే అవకాశం లభిస్తుంది. వారం రోజులు ముందుగానే బస్సును బుక్ చేసుకోవాలి. –ఎ.సరిరామ్, ఆర్టీసీ ఆర్ఎం, ఖమ్మం -
యూరియా కోసం రైతుల పాట్లు
పాల్వంచరూరల్: యూరియా కోసం నిత్యం అవస్థ పడుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జగన్నాథపురం రైతువేదిక వద్ద మూడు రోజుల క్రితం రైతులకు యూరియా పంపిణీ చేస్తామని చెప్పి ఆధార్కార్డు, పాస్ పుస్తకాల జిరాక్స్లు తీసుకున్నారు. కానీ, బుధవారం వాటిని తిరిగి రైతులకు ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీ చేస్తారని ఆశతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతువేదిక వద్ద 150 మందికి పైగా పలు గ్రామాలకు చెందిన రైతులు నిరీక్షించారు. కానీ, అధికారులు యూరియా పంపిణీ చేయకుండా తీసుకున్న జిరాక్స్ పత్రాలు ఇచ్చారు. కాగా, యూరియా కోసం వచ్చిన రైతులకు బీఆర్ఎస్ నాయకులు కాంపెల్లి కనకేశ్ భోజనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంజిత్, హర్షవర్దన్, ప్రసాద్, శోభన్, పుల్లయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవంతంగా శస్త్రచికిత్స
భద్రాచలంటౌన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు బాలుడు మింగిన స్టార్ డ్రిల్ బిట్ను శస్త్రచికిత్స ద్వారా బుధవారం విజయవంతంగా తొలగించారు. సరిహద్దు ఏపీలోని ఎటపాక మండలం చోడవరం గ్రామానికి చెందిన 8 ఏళ్ల గౌతమ్ ఆడుకుంటూ 6 అంగులాల డ్రిలింగ్ మిషన్కు సంబంధించిన స్టార్ డ్రిల్ బిట్ను గత శనివారం మింగాడు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం తల్లికి చెప్పాడు. దీంతో కుంటుంబ సభ్యులు ఏరియా వైద్య శాలకు తరలించగా పిల్లల వైద్యుడు రాజశేఖర్రెడ్డి పరీక్షించి విసర్జన ద్వారా బయటకు వస్తుందేమోనని రెండు రోజులు వేచిచూశారు. ఈ క్రమంలో బాలుడికి బాగా కడుపులో నొప్పి వస్తుండడంతో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం శస్త్ర చికిత్స నిర్వహించి డ్రిల్ బిట్ను తొలగించారు. బాలుడికి శస్త్ర చికిత్స చేసిన వారిలో అనస్థీషియన్, నిఖిత, మల్లేశ్దొర పాల్గొన్నారు. కడుపులోని డ్రిల్ బిట్ తొలగింపు -
ఉన్నత లక్ష్యాలతో రాణించాలి
దమ్మపేట/ములకలపల్లి : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో రాణించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఆయన ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో పర్యటించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. అదే పాఠశాలలో రూ.8 కోట్ల 60 లక్షలతో నిర్మించనున్న బాలుర హాస్టల్, ఉద్యోగుల క్వార్టర్ల భవనాల శంకుస్థాపన నిమిత్తం ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. అడ్వెంట విత్తన కంపెనీ ఆర్థికసాయంతో రూ.46 లక్షలతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను, రూ.21 లక్షలతో గండుగులపల్లిలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి తుమ్మల మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత స్థానిక మంగపేట పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించి, దేశంలోని ఏకలవ్య పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఏర్పాటు చేయాలని వైద్య శాఖాధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లతోపాటు, శాస్త్రవేత్తలుగా కూడా ఎదగాలని, ప్రధానంగా భూ, జల, వ్యవసాయ రంగాల్లో రాణించాలని సూచించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్సైన్స్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు అద్భుత అవకాశాలు దక్కుతాయన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ దసరా సెలవుల్లోగా అన్ని పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళలదే ప్రధాన పాత్ర పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓ గౌతమ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఆర్డీఓ విద్యాచందన, డీఎంఅండ్హెచ్ఓ జయలక్ష్మి, తహసీల్దార్ గనియా నాయక్, ఎంపీడీఓ రామారావు, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, తాండ్ర ప్రభాకర్రావు, పర్వతనేని అమర్నాథ్, పువ్వాల మంగపతి, కరుటూరి కృష్ణ, అడపా నాగేశ్వరరావు, బాల అప్పారావు, కారం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
మరో సర్వేకు అడుగులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్తోపాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్లలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కొత్తగూడెంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో చిన్న విమానాలతోపాటు ఎయిర్బస్ వంటి భారీ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా మూడు కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 950 ఎకరాల భూమి అవసరమని భావించారు. కొత్తగూడెం మండల పరిధిలోని రామవరం, గరీభ్పేట శివారులలో 707, సుజాతనగర్ మండల పరిధిలో 195, చుంచుపల్లి మండల పరిధిలో 50 ఎకరాల స్థలాలను కూడా గుర్తించారు. ఇక్కడున్న ఎత్తైన గుట్టలు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా నిలిచాయి. మరోవైపు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల విషయంలో సానుకూల ఫలితాలు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో సెప్టెంబరు 16న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కొత్తగూడెం ఎయిర్పోర్టు కోసం విజ్ఞప్తి చేయగా.. మరోసారి ఫీజుబులిటీ సర్వేకు అడుగులు పడ్డాయి. ఇరవై ఏళ్లుగాఽ అదే సమస్య కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే అంశంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన స్థలాన్ని ఎంపిక చేయడమే సవాల్గా మారింది. భవిష్యత్లో బోయింగ్ విమానాలు దిగేందుకు వీలుగా వెయ్యి ఎకరాల్లో ఎయిర్పోర్టు కోసం సుజాతనగర్ ప్రాంతంలో భూములు వెతికారు. అయితే అది సాధ్యపడలేదు. చివరకు ఎయిర్కార్గో సేవల కోసం ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక ఆ తర్వాత పాల్వంచ మండలం గుడిపాడు – బంగారుజాలల మధ్య ఎయిర్పోర్టు నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. పాల్వంచ పట్టణాన్ని అనుకుని ఉన్న ఎత్తైన గుట్టలు, కేటీపీఎస్ చిమ్నీలు, కూలింగ్ టవర్ల వల్ల సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఈ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది. కొత్తగూడెం – భద్రాచలం మధ్య.. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎన్నిసార్లు స్థలాలను గుర్తించినా ఎత్తైన కొండలు, అభయారణ్యం, హై టెన్షన్ కరెంటు లైన్లు, రైల్వే మార్గాలు, నేల స్వభావం, గాలుల తీవ్రత, నీటి ప్రవాహాలు వంటి భౌగోళిక, సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మండలాలను మినహాయించి భద్రాచలం – కొత్తగూడెం మధ్య ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాలను పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు సైతం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు మూడు చోట్ల స్థలాలను గుర్తించగా, ఇందులో ఒక స్థలాన్ని ఎయిర్పోర్టు కోసం ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఎంతో ఉపయుక్తం జిల్లాలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే దేశం నలుమూలల నుంచి భద్రాచలం క్షేత్రానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, కేటీపీఎస్, బీటీపీఎస్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీ, డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటైంది. దేశం మొత్తం మీద ఎర్త్ సైన్సెస్ విభాగంలో ప్రత్యేక కోర్సులు అందిస్తున్న వర్సిటీగా ఇది నిలిచింది. త్వరలోనే సేంద్రియ సాగు విధానానికి సంబంధించి ఎక్స్లెన్స్ సెంటర్ కూడా జిల్లాకు రానుంది. మరోవైపు అడవులు విస్తారంగా ఉండటంతో ఎకో టూరిజానికి ఈ ప్రాంతం అనువుగా ఉంది. ఇప్పటికే ఎకో టూరిజంలో ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి, పాపికొండలు, సీలేరు – పొల్లూరు వాటర్ఫాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు భద్రాచలం గేట్వేగా ఉంది. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలు ఈ ప్రాంతంలో పుంజుకుంటాయి. సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఆస్కారముంది. -
స్వచ్ఛతా హీ సేవా పోస్టర్ ఆవిష్కరణ
చుంచుపల్లి: స్వచ్ఛతా హీ సేవా–2025 పోస్టర్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛ శ్రామికులకు ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛత ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన, నాటక, ఇతర పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, సిబ్బంది రేవతి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యా విధానంతో సులభంగా నేర్చుకోవచ్చుసూపర్బజార్(కొత్తగూడెం): డిజిటల్ విద్యావిధానంతో విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో బుధవారం ఎనిమిది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, రెండు భవిత సెంటర్ల ఐఈఆర్పీలకు సీఎస్ఆర్ పాలసీ ద్వారా హైదరాబాద్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యాజమాన్యం క్యాన్ ప్రొజెక్టర్ (డిజిటల్ బోధనా పరికరాలు)లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూ.25 లక్షల విలువైన భోధనా పరికరాలను అందజేసినందుకు అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో జిల్లాలో 250 పాఠశాలలకు కూడా మంజూరు చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. బీఈఎల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డీఈఓ బి.నాగలక్ష్మి, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్కుమార్, సైదులు, నాగరాజశేఖర్, బీఈఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
భధ్రాచలం: భద్రాద్రి రామయ్య చెంతకు వచ్చే భక్తులకు ప్రశాంత దర్శనం, సకల సౌకర్యాల కల్పన, దేవస్థానం అభివృద్ధే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తిస్తానని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొల్లు దామోదర్రావు తెలిపారు. ఇటీవల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భక్తులకు సౌకర్యాల కల్పన భద్రాచలం ఆర్డీఓగా పనిచేసి ఉండటంతో భద్రాచలం, దేవస్థానంపై అవగాహన ఏర్పడింది. దీంతోపాటు ఆలయ అభివృద్ధిలో కీలకమైన మాఢ వీధుల విస్తరణలో భూ సేకరణ చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందజేశాం. ఇప్పుడు ఆలయ ఈఓగా అదే అభివృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తా. ఇప్పటికే భక్తులకు అందుతున్న ఆన్లైన్ సౌకర్యాలను ఇతర విభాగాలకూ విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక ప్రధానంగా రామాలయంలో నిర్వహించే సేవలు, ఆలయ ప్రాశస్త్యంపై ప్రచార లోపం ఉందనే అపోహలు తొలగించేందుకు ఆ సేవలు, ఇతర హోర్డింగ్లను భద్రాచలంతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రంగనాయకుల గుట్టపై నిరుపయోగంగా ఉన్న టీటీడీ, అన్నవరం సత్రాలను పూర్తిగా తొలగించి ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రామాలయం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తొలగించి క్లీన్ భద్రగిరిగా ఉంచేందుకు కృషి చేస్తా. మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలు.. ఇక ప్రభుత్వం సంకల్పించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తా. ప్రధానంగా ఆలయం, ఉపాలయాల అభివృద్ధి, మార్పులు, చేర్పులపై ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పండితులు, వైదిక కమిటీలతో సమన్వయం చేసుకుంటూ వారి సలహాలు, సూచనల మేరకు ముందుకెళ్తాం. ఈ మేరకు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చలు ముగిశాక కలెక్టర్, ఇతరులతో కలిసి తగిన నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తాం. ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాల కల్పనే ప్రధాన అజెండాగా పని చేస్తాం. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని తట్టుకునేందుకు తాత్కాలిక వెయిటింగ్ గదులు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మిథిలా స్టేడియం, ఇతర ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. భక్తులకు సరిపడా లడ్డూలు, వీఐపీలకు ఇతర సేవలను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తాం. రాముడికి చెందిన భూములను చట్ట ప్రకారం కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఏపీలోని పురుషోత్తపట్నంలో రాముడి భూములు దేవస్థానానికి చెందేలా అన్ని పత్రాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించాం. వీటిని న్యాయపరంగానే దక్కించుకుంటాం. ఏపీలోని అన్ని శాఖల సహాయ సహకారాలతో ఈ భూములపై పోరాడుతాం. ఇతర ప్రాంతాలలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులకు సేవ చేసేందుకు రామయ్య కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. -
మతాల మధ్య చిచ్చుకు కుట్ర
● సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులుముతారా..? ● సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులు మత పరమైన రంగు పులుముతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ విమర్శించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఈ పోరాటంలో శ్రామికులు, కార్మికులు, రైతులు భాగస్వాములయ్యారని, మహిళల భాగస్వామ్యం కూడా గొప్పదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరులో అనేక మంది ప్రాణత్యాగం చేశారని నివాళులర్పించారు. దున్నేవాడికే భూమి కావాలని భూ స్వాములకు ఎదురొడ్డి పోరాటం సాగిందని, దీని ఫలితంగానే లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచారని తెలిపారు. అయితే కేంద్రంలోని నేటి పాలకులు ఈ పోరాటానికి మతం రంగు పులుముతూ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దీన్ని ముస్లింలకు – హిందువులకు మధ్య జరిగిన పోరాటమని కొందరు వక్రీకరిస్తూ విమోచన, విలీనం, విద్రోహం అనే పేర్లతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హక్కులు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి, అత్యాచారాల నిరోధంతో పాటు దున్నే వాడిదే భూమి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నాయకులు బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎం. సుబ్బారావు, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారి నిత్యకల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైభవంగా భద్రగిరి ప్రదక్షిణభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు)ని పురస్కరించుకుని భక్తరామదాసు ట్రస్ట్ (కొత్తగూడెం) నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం భద్రగిరి ప్రదక్షిణా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రామయ్య కృపాకటాక్షాలకు గిరిప్రదక్షిణానే మార్గంగా ప్రతి నెలా పునర్వసు రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అధికారులు గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి, ప్రసాదం అంజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్, సీసీ శ్రీనివాస రెడ్డి, పీఆర్ఓ సాయిబాబు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గొత్తికోయల వలసగూడెం ఖాళీ..అటవీ సిబ్బంది కృషితో అడవిని వీడేందుకు అంగీకారం చుంచుపల్లి: కొత్తగూడెం డివిజన్ అటవీ సిబ్బంది సమష్టి కృషితో బుధవారం గొత్తికోయల వలసగూడెం వాసులు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. సత్యంపేట బీట్ పరిధిలో 18 కిలోమీటర్ల మేర మాస్ కూంబింగ్–ఫారెస్ట్ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు. 2018లో అటవీలో ఏర్పడిన మామిడిగూడెం గొత్తికోయల వలసగూడెంలోని సుమారు 45 కుటుంబాలు దాదాపు 45 ఇళ్లను, పశువుల కొట్టాలను ఏర్పాటు చేసుకున్నాయి. గతేడాది నుంచి నిరంతరంగా జరిగిన సమావేశాల ఫలితంగా చివరికి వారు అటవీ బయటకు వెళ్లేందుకు అంగీకరించారు. అటవీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా వారంలోగా గ్రామం పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉందని ఎఫ్డీఓ యూ.కోటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెం వాసికి డాక్టరేట్కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని ఎస్ఆర్ డిజీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దోర్బల లక్ష్మీఅనురాధకు ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ‘పర్సెప్షన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆన్ది ఫంక్షనింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై డాక్టర్ గోగినేని యశోద పర్యవేక్షణలో ఆమె పరిశోధనాపత్రం సమర్పించారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అనురాధను పాఠశాల యాజమాన్యం లక్ష్మణరావు, సతీష్, తిరుమల్రెడ్డి, రామారావు అభినందించారు. -
అన్ని రంగాల్లో అగ్రగామి
సూపర్బజార్(కొత్తగూడెం): అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రధానంగా ఖనిజసంపద, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మొదట సింగరేణి అతిథి గృహంలో మంత్రికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులు, ప్రజాపోరాట యోధుల త్యాగాల వల్లే నేడు ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలేపాలకులని, ప్రజలే అధిపతులు అనే స్ఫూర్తిని ప్రజాపాలన దినోత్సవం గుర్తు చేస్తోందని అన్నారు. విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఉపాధి, సంక్షేమరంగాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలతో రైతు సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్గా నిలిచిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కల నెరవేరిందని, దేశంలోనే తొలిసారిగా జిల్లాలో ఎర్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. భద్రాచలం రైల్వే లైన్కు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అడ్డంకులను తొలగించి కలెక్టర్ సూచించిన ప్రాంతంలో విమానాశ్రయం నిర్మిస్తామని తెలిపారు. రింగ్రోడ్డు, బైపాస్రోడ్డు, నేషనల్హైవే పనులు కూడా పురోగతిలో ఉన్నాయని వివరించారు. సింగరేణి సంస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు మిర్చి, పత్తి వంటి పంటలను తగ్గంచి లాభదాయకమైన ఉద్యాన పంటల వేయాలని సూచించారు. దేశంలోనే జిల్లా ఆయిల్పామ్ హబ్గా మారుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు జిల్లాలో జరుగుతున్న ఆయిల్పామ్ సాగు గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. సిద్ధిపేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా అటవీశాఖాధికారి కృష్ణాగౌడ్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతికలెక్టరేట్లో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, కాపర్తి వెంకటాచారి, వారాధి సత్యనారాయణ, బసవపాత్రుని తిరుపతి, వారాధి రామాచారి, బి.సాంబయ్య, ఎస్.కృష్ణమాచారి, కూరపాటి లింగాచారి, పి.వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.‘ప్రజాపాలన’తో సమానత్వం, న్యాయం: ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలంటౌన్: ప్రజాభిప్రాయాలు, ఆకాంక్షలు, సమస్యలను గుర్తించి సరైన పరిష్కారం చూపి, సమాజాన్ని సమానత్వం, న్యాయం అభివృద్ధి దిశగా నడిపించడమే ప్రజాపాలన ఉద్దేశమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పతాక ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ 17తో నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, మణెమ్మ, సున్నం రాంబాబు, భాస్కరన్, హరీష్, ఉదయ్ కుమార్, అశోక్ కుమార్,ఆదినారాయణ, ప్రభాకర్ రావు, హరికృష్ణ, చలపతి, బిక్షం తదితరులు పాల్గొన్నారు. -
రామాలయంలో ఉట్ల వేడుక
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఉట్ల పండుగను మంగళవారం ఆనందోత్సాహాలతో నిర్వహించారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి వేడుకలు ముగిసిన మరుసటి రోజున ఈ పండుగ జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పల్లకీలో స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి మేళతాళాల నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకెళ్లారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన యాదవులు ఉట్లు కొట్టడంలో పోటీ పడ్డారు. అనంతరం స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు. రామయ్య సన్నిధిలో ప్రముఖులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా గురునందానంద సరస్వతీ పీఠం నిర్వాహకులు మాధవానంద సరస్వతీ స్వామి, ఎస్పీ రోహిత్రాజ్ దంపతులు వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి వేద పండితులు, ఈఓ దామోదర్ రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న పలువురు -
చదువుతో పాటు కళల్లోనూ రాణించాలి
కొత్తగూడెంఅర్బన్ : విద్యార్థులు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి కళోత్సవం పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నప్పుడు తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని, కానీ వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయానని తెలిపారు. నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటేనే భవిష్యత్ బాగుంటుందని సూచించారు. పిల్లలంతా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి దారి చూపించేది ఇలాంటి పోటీలేనని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని తీపి జ్ఞాపకాలను తమతో తీసుకెళ్లాలని సూచించారు. ఈ పోటీలలో సుమారు 200 మంది విద్యార్థులు 12 రకాల కళారూపాలను రెండు రోజులపాటు ప్రదర్శించనున్నారని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగ రాజశేఖర్ మాట్లాడుతూ.. మొదటి రోజు శాసీ్త్రయ, జానపద నృత్యాలు, థియేటర్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ 2డీ, 3డీ అంశాల్లో, రెండో రోజు గాత్ర సంగీతం, వాయిద్య సంగీ తం, కథలు చెప్పడం వంటి పోటీలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, సైదులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
మెరుగైన విద్యుత్ సేవలందిస్తాం
అశ్వారావుపేటరూరల్: వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ట్రాన్స్కో ఎస్ఈ జి. మహేందర్ తెలిపారు. మండలంలోని నారాయణపురం విద్యుత్ సబ్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ, గృహ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. భవిష్యత్లో పోడు భూముల సాగుతో పెరిగే విద్యుత్ లోడ్కు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. నూతన ట్రాన్స్ఫార్మర్తో సబ్ స్టేషన్ పరిధిలో లోవోల్టేజీ సమస్య పరిష్కారం కావడంతోపాటు విద్యుత్ అంతరాయాలు తొలగిపోతాయని వివరించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో డీఈ(ఆపరేషన్) నందయ్య, డీఈ(ఎంఆర్టీ) వెంకటేశ్వర్లు, ఏడీఈ వెంకట రత్నం, ఏడీఈ(టీఆర్ఈ) రాంబాబు, వినాయకపురం ఏఈ సంతోష్ పాల్గొన్నారు. -
సృజనాత్మక బోధన అందించాలి
టీఎల్ఎం మేళాలో పీఓ రాహుల్భద్రాచలం: విద్యార్థులకు సృజనాత్మక బోధన అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో ఏర్పాటుచేసిన టీఎల్ఎం మేళాను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు వివిధ అంశాలను సులువుగా నేర్చుకునేందుకు ఈ ప్రక్రియ ఉపకరిస్తుందన్నారు. ఉద్దీపకం వర్క్బుక్–2 లోని సారాంశాలను సృజనాత్మక చిత్రాల ద్వారా అవగాహన కల్పించేందుకే ఈ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు డివిజన్ల పరిధిలో ఈ మేళాలను నిర్వహించామని వెల్లడించారు. జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో తెలుగు, గణితం, ఇంగ్లిష్ విభాగాల్లో ఉత్తమంగా ఎంపికై న పాఠశాలల ఉపాధ్యాయులకు నగదు బహుమతులు అందిస్తామని వివరించారు. ప్రథమ బహుమతిగా రూ. 5,000, రెండో బహుమతి రూ. 3,000, మూడో బహుమతి రూ.2,000తో పాటు మెమెంటోలు అందిస్తామని తెలిపారు. స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి.. నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని రాహుల్ అన్నారు. వైటీసీలో జరుగుతున్న వీడియో, ఫొటోగ్రఫీ శిక్షణను పరిశీలించిన పీఓ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం, ఐటీడీఏ అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాతృభాషపై పట్టు సాధించాలి.. భద్రాచలంటౌన్ : పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపునకు పలు రకాల పోటీలు నిర్వహించాలని, తద్వారా మాతృభాషపై మరింత విజ్ఞానం, పట్టు కలుగుతాయని పీఓ బి.రాహుల్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక గిరిజన భవన్లో నిర్వహించిన వివిధ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి పోటీలతో పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందన్నారు. అనంతరం వివిధ అంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, జేడీఎం హరికృష్ణ, ఆర్సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల ఉద్యోగులు రమేష్, రాములు, అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, నారాయణరెడ్డి, కృష్ణార్జున, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ నిర్మాణంపై చొరవ తీసుకోండి
కేంద్ర మంత్రికి తుమ్మల వినతి ఇల్లెందు/ఖమ్మంఅర్బన్: కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రాంమోహన్నాయుడుకు వివరాలు అందజేసి మాట్లాడారు. గతంలో గుర్తించిన స్థలం అనుకూలంగా లేదని తేల్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన నేపథ్యాన సర్వే చేయించాలని కోరారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులే కాక సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పరిశ్రమలకు వచ్చివెళ్లే అధికారులకు అనువుగా ఉంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామిని కూడా కలిసిన తుమ్మల.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఆవశ్యకతను వివరించారు.కలెక్టరేట్లో నేడు ప్రజాపాలన దినోత్సవంసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో బుధవారం నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవివిష్కరించనున్నారు. ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. వివిధ అభివృద్ధి పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం 11.30 గంటలకు ములకలపల్లి మండలం మంగపేటలో నిర్వహించే జిల్లా స్థాయి ఆరోగ్య శిబిరంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దమ్మపేట మండలం గండుగులపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. రైతులు కూపన్లు తీసుకోవాలిములకలపల్లి: పీఏసీఎస్లో యూరియా కోనుగోలు చేసే రైతులు.. ఏఈఓలు జారీ చేసే కూపన్లు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి. బాబూరావు సూచించారు. మండలంలోని పూసుగూడెం రైతువేదికలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆధార్కార్డు, పట్టా పాస్ పుస్తకాలు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సొసైటీలతో పాటు రైతు వేదికల్లోనూ యూరి యా విక్రయిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏడీఓ జి.లాల్చందర్, ఎంఏఓ అరుణ్బాబు, ఏఈఓ రజనీకాంత్, పీఏసీఎస్ సిబ్బంది మురళీ, నాగేంద్ర పాల్గొన్నారు. లైసెన్స్ హక్కులకు 29న వేలంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానంలో వివిధ లైసెన్స్ల హక్కు మంజూరుకు ఈనెల 29న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ కె.దామోదర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు తానీషా కల్యాణ మండపంలోని కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని సూచించారు. గతంలో దేవస్థానానికి బాకీ, తగాదాలు ఉన్నవారు అనర్హులని పేర్కొన్నారు. వివరాలకు కార్యాలయ పనివేళల్లో 9515545354 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. నేడు ఖమ్మంలో సాయుధ పోరాట వారోత్సవాల సభ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. గత వారం రోజులుగా అమరువీరులకు నివాళులర్పించడమేకాక సభను విజయవంతమయ్యేలా ప్రచారం చేశామని వెల్లడించారు. ఈమేరకు బుధవారం జరిగే సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబి, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
‘స్వచ్ఛత’కు సర్వం సిద్ధం
చుంచుపల్లి: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని చెప్పిన మాహాత్మాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీలో స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్వాన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేయగా.. స్వచ్ఛోత్సవ్ – పక్షోత్సవాల పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేస్తారు. ఇందుకోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రధానంగా పరిసరాల పరిశుభ్రతపై మానవహారాలు, స్వచ్ఛత పరుగు, ర్యాలీలు చేపట్టనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బహిరంగ స్థలాలు, కూడళ్లలో ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, శ్రమదానాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం వంటివి జరిపిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు. ప్రధాన కార్యక్రమాల వివరాలిలా.. ● పల్లెల్లో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధాన కూడళ్లు, ప్రజోపయోగ స్థలాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చెత్త, మురుగు తొలగిస్తారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజల శ్రమదానంతో పారిశుద్ధ్య పనులు చేపడతారు. ● కంపోస్ట్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేయడం, చెత్త నుంచి ప్లాస్టిక్, గాజు, ఇతర వస్తువులు తొలగించి మిగిలిన తడిచెత్త వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తారు. ● అక్టోబర్ 2న చివరి రోజు గ్రామసభల్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేలా ప్రత్యేక తీర్మానాలు చేస్తారు. వస్త్ర సంచులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. స్వచ్ఛత ప్రాధాన్యంపై విద్యాలయాల్లో క్విజ్ పోటీలు, విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడతారు. నిధుల సంగతేంటి..? ‘స్వచ్ఛతా హీ సేవ’ పేరుతో బుధవారం నుంచి వచ్చే నెల 2 వరకు 15 రోజులపాటు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గ్రామ కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రతి పనికీ కార్యదర్శులే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలకు నిధుల లేమితో అడ్డంకులు ఏర్పడతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. రోజువారీ ప్రణాళికలతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛ పల్లెలుగా మార్చడమే లక్ష్యం. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. – ఎం. విద్యాచందన, డీఆర్డీఓ -
తుది పోరులో రుధిర ధారలు
బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం బ్రిటిష్ వారి సహకారంతో పాలన సాగిస్తున్న నిజాం రాజు చేతిలోనే ఉంది. అతడి సైన్యమైన రజాకార్లు తెలంగాణ వ్యాప్తంగా బీభత్సం సృష్టించారు. గ్రామాల్లో దమనకాండ సాగించారు. వారిని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరు సాగించారు. ఆయుధ శిక్షణ తీసుకుని నిజాం సైన్యాన్ని మట్టి కరిపించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కమ్యూనిస్టులు సైతం ప్రాణాలొదిలారు. ఇరు వర్గాల మధ్య భీకర పోరుతో నాడు పల్లెల్లో రక్తం ఏరులై పారింది. చివరకు 1948 సెప్టెంబర్ 17న నిజాం సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని వీడడంతో ఈ ప్రాంతం కూడా భారత్లో భాగమైంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంపోలీస్ చర్యతో హైదరాబాద్ స్టేట్ భారత్లో విలీనమైనందున సాయుధ రైతాంగ పోరాటం ఆపేయాలని కమ్యూనిస్టులకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అప్పటివరకు కమ్యూనిస్టులకు మద్దతుగా నిలిచిన వర్గాలు సైతం ప్రభుత్వ ప్రతిపాదనపై మొగ్గు చూపాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంపిణీ చేసి కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. పల్లెల్లో సంఘం ఎంతో కీలకంగా మారింది. రైతాంగ పోరాటం ఆపితే గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయిన భూస్వాములు తిరిగి వస్తారని, అప్పటి వరకు చేసిన పోరాటం వృథా అవుతుందనే వాదనలు కామ్రేడ్ల నుంచి వినిపించాయి. అప్పటికి రాజ్యాంగం అందుబాటులోకి రాకపోవడంతో పోరాటం ద్వారా తాము పంపిణీ చేసిన భూమిని పేదలకు చట్టబద్ధంగా ఎలా పంచాలనే అంశంపై కమ్యూనిస్టులకు స్పష్టత లేదు. దీంతో సాయుధ పోరాటం కొనసాగించడమే మంచిదని నాటి నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్మీపై ఆరోపణలు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు నాయకులు చేసిన ఆరోపణల ప్రకారం 1950 సెప్టెంబర్ 6న ఆళ్లపల్లి, ఇల్లెందు నుంచి ప్రత్యేక బలగాలు గుండాలకు వెళ్లి విప్లవకారులకు మద్దతుగా ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా దాడులు చేశాయి. గుండాల సమీపంలోని ముత్తాపురం – దొంగతోపు మధ్య ఆ రోజుల్లో పోలీస్ క్యాంప్ ఉండేది. దీన్ని కేంద్రంగా చేసుకుని సాయుధ పోరాటానికి మద్దతుగా ఉన్న గిరిజనులపై ఆర్మీ దమనకాండకు పాల్పడిందని చెబుతారు. ఆ తర్వాత ఆళ్లపల్లి ఆర్మీ క్యాంపు ద్వారా జరిగిన వివిధ ఆపరేషన్లలో మొత్తం 119 మంది రైతాంగ పోరాట వీరులు మరణించారు. అందులో ఒక్కరోజే 45 మంది చనిపోయారు. ఇక్కడ గెరిల్లా నుంచి ప్రతిఘటన ఎక్కువగా ఉండటంతో వైమానిక దాడులు జరిగినట్టుగా చెబుతారు. బెండాలపాడు గుట్టల్లో దాగి ఉన్న గెరిల్లాల ఆచూకీ కోసం అక్కడి ఆదివాసీ కుటుంబాలపై దాడులు జరిగాయి. గార్ల జాగీరులోని కట్టుగూడెంలోనూ అమానవీయ దాడులు చోటుచేసుకున్నాయి. పోరాట విరమణ.. ఇరువైపులా అంతులేని హింస చెలరేగడంతో చివరకు 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టు కమ్యూనిస్టులు ప్రకటించారు. దీంతో క్రమంగా శాంతి నెలకొనడం మొదలైంది. పోరాటం విరమించే సమయానికి జిల్లా పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో 50 మంది విప్లవకారులు, 500 మంది కోయ మిలిటెంట్లు మిగిలారు. 3సాయుధ పోరాటం ఆపాలన్న భారత సర్కారు సుశిక్షుతులైన, ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన భారత సైన్యం ముందు అల్పస్థాయిలో ఆయుధాలు, అంతంతగానే సైనిక శిక్షణ కలిగిన విప్లవకారులతో రైతాంగ పోరాటం చేయడం కమ్యూనిస్టులకు కష్టంగా మారింది. దీంతో గెరిల్లా పోరాటమే మార్గమని నాయకత్వం భావించింది. కరీంనగర్ జిల్లా గెరిల్లాలు మంథని అడవుల్లోకి వెళ్లగా.. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన గెరిల్లాలు అటు నల్లమల ఇటు పాల్వంచ, ఇల్లెందు అడవుల్లో తలదాచుకున్నాయి. దీంతో 1949 ఫిబ్రవరి నాటికి సాయుధ రైతాంగ పోరాటానికి భద్రాద్రి జిల్లానే ప్రధాన స్థావరంగా మారింది. రెండు వందల గ్రామాల్లో విప్లవ సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సాయుధ దళాలను వెదుక్కుంటూ భారత ఆర్మీ ఇక్కడి అడవులపై దృష్టి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా మైసూర్ సైన్యం, గూర్ఖా పోలీసులతో కూడిన 30కి పైగా ఆర్మీ క్యాంపులు వెలిశాయి. ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే పల్లెల్లో రక్తం ఏరులై పారింది. -
బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు షురూ
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి వర్క్ పీపుల్ స్పొర్ట్స్, గేమ్స్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా ఉద్యోగులకు బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీఎం (పర్సనల్) వెల్ఫేర్ (సీఎస్సార్) జీవీ కిరణ్కుమార్ హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఉద్యోగులు వారి పనులను నిర్వహిస్తూనే క్రీడల్లో ఆసక్తి చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులకు 2025 – 26 ఏడాదికి సంబంధించిన ఏకరూప దుస్తులు, క్రీడా సామగ్రి అందించారు. బాడి బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 23, 24 తేదీల్లో భూపాలపల్లి ఏరియాలో, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలను ఈ నెల 25, 26 తేదీల్లో ఆర్జీ–3 ఏరియాలో జరిగే కంపెనీస్థాయి పోటీలకు ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏజే మురళీధర్రావు, కేసా నారాయణరావు, ఆర్.కేశవరావు, ఎస్వీ రమణమూర్తి, ఎస్.పితాంబరరావు, కె.సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేపాల్ తిరుగుబాటులో అమెరికా పాత్ర
ఖమ్మంమయూరిసెంటర్: నేపాల్లో తిరుగుబాటుకు రాజకీయ అస్థిరత్వం, అవినీతి అంతర్గత కారణాలు గా నిలిస్తే, దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తదితర దేశాల చర్యలు బాహ్య కారణాలుగా ఉన్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు అన్నారు. ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో మాస్లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని నియంత్రించడానికి అమెరికా అదృశ్యశక్తిగా పనిచేస్తోందని తెలిపారు. నేపాల్లో దాడుల్లోనూ ఆ దేశ పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కాగా, సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల అశోక్, శిరోమణి, శోభ, కె.శ్రీను, ఆజాద్, రాకేష్, లక్ష్మణ్, వెంకటేష్, లెనిన్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు -
బైక్ను ఢీకొట్టిన టిప్పర్
● తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి కొత్తగూడెంటౌన్: రుద్రంపూర్ నుంచి ద్విచక్రవాహనంపై కొత్తగూడెం వస్తున్న ఆటోడ్రైవర్ కలాతురి వేణుగోపాల్ (49)ను బొగ్గు లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం హనుమాన్బస్తీకి చెందిన వేణుగోపాల్ ఆటో నడుపుతున్నాడు. సాయంత్రం రుద్రంపూర్కు ద్విచక్రవాహనంపై వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్ను టూటౌన్ సీఐ ప్రతాప్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు. లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
మణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని కమలాపురం గ్రామంలో వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా.. ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపాలిటీలోని కమలాపురం వైపు నడుస్తున్న ఇసుక రీచ్లకు వెళ్లే లారీలు అధిక వేగంతో వెళ్తుండటంతో రోడ్లు పాడవుతున్నాయని స్థానికులు ఇటీవల రాకపోకలను అడ్డుకున్నారు. అధికారుల సూచనలతో లారీల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్లకు వెళ్లే లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం పూర్తిగా కిందపడకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇప్పటికై నా ఇసుక తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.తృటిలో తప్పిన ప్రమాదం -
ఇసుక అక్రమ నిల్వలు సీజ్
బూర్గంపాడు: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సోంపల్లి గ్రామ సమీపంలో ఇసుకను నిల్వ చేశారు. మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీర్రాజు పరిశీలించి, అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దుప్పిని గాయపర్చిన కుక్కలుసత్తుపల్లి: సత్తుపల్లి మండలం నీలా ద్రి అర్బన్ పార్కు నుంచి జనావా సాల్లో వచ్చిన చుక్కల దుప్పిని వీధి కుక్కలు వెంటాడి గాయపరిచాయి. పార్కులో నుంచి మంగళవారం బయటకు వచ్చిన దుప్పి సింగరేణి ఓసీ మెయిన్గేట్ ప్రాంతానికి చేరింది. అక్కడ వీధికుక్కలు వెంట పడడంతో సింగరేణి సెక్యూరిటీ కుక్కల ను తరిమేశారు. అప్పటికే దుప్పి గాయపడడంతో ప్రాథమిక చికిత్స అనంత రం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కాగా, దుప్పిని రక్షించిన సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది విజేందర్, అయ్యప్ప, సుధాకర్, రామకృష్ణ, ప్రభాకర్, బాజిత్, జోసెఫ్ను పలువురు అభినందించారు. మహిళకు జైలు శిక్ష భద్రాచలంటౌన్: ఓ మహిళ మరో మహిళపై దాడి చేసి గాయపరిచిన కేసులో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ వి.శివనాయక్ దాడి చేసిన మహిళకు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన సోడి సుభద్రపై అదే గ్రామానికి చెందిన పూనెం రాధ దాడి చేసి గాయపరిచింది. సుభద్ర స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఎడాది ఏప్రిల్ 25న కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మంగళవారం కేసును విచారించిన న్యాయమూర్తి పూనెం రాధకు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఏపీ డీఎస్సీలో టేకులపల్లివాసికి ఉద్యోగం
టేకులపల్లి: ఇటీవల ప్రకటించిన ఏపీ డీఎస్సీ ఫలితాలో టేకులపల్లి మండల ఆదివాసీ బిడ్డకు వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం లభించింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రాయిగూడెం పంచాయతీకి చెందిన ఊకే రాజేందర్రావు – లక్ష్మి దంపతుల కుమార్తె ఊకే శిరోమణి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాసింది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నాన్ లోకల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ఉద్యోగానికి ఎంపికై ంది. మారుమూల గ్రామంలోని ఆదివాసీకి ఏపీ డీఎస్సీలో పీఈటీగా ఉద్యోగం రావడంపై గ్రామస్తులు అభినందించారు. -
నాసిరకం ఆయిల్పామ్ విత్తనాలపై దర్యాప్తు జరపాలి
అశ్వారావుపేటరూరల్: విదేశాల నుంచి నాసిరకం ఆయిల్పామ్ విత్తనాలు దిగుమతి చేసి తెలంగాణలోని నర్సరీల్లో పెంచడం ద్వారా రైతులకు నష్టం జరిగినందున సమగ్ర దర్యాప్తునకు సహకరించాలని తెలంగాణ ఆయిల్పామ్ రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) సమావేశంలో జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ దవాలే, వీజీ కృష్ణణ్కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ అంశంపై దర్యాప్తుతో పాటు రైతులకు పరిహారం అందించేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే, పామాయిల్ గెలల టన్ను ధర రూ.25 వేలు ఉండేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, ధర నిర్ణయంలో రైతు సంఘాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్పామ్ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు మహేశ్రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్యతో పాటు నాయకులు టి.సాగర్, బొంతు రాంబాబు, శోభన్, పి.జంగారెడ్డి, శ్రీనివాసులు, సోమయ్య, చందునాయక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పోషణ్ అభియాన్
మాతా, శిశు సంరక్షణే లక్ష్యంగా మాసోత్సవాలు ● గర్భిణులు, బాలింతులు, కిశోర బాలికల ఆరోగ్యంపై అవగాహన సదస్సులు ● అంగన్వాడీ కేంద్రాల్లో నెల పాటు కార్యక్రమాలు చర్ల: సమగ్ర పోషకాహార పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 30 రోజుల పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా, బుధవారం నుంచి అక్టోబర్ 16 వరకు జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐసీడీఎస్ ఇతర శాఖలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమాలపై మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. ప్రధాన లక్ష్యాలు.. ●మాతా శిశు ఆరోగ్య పరిరక్షణ, గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల పిల్లలకు సరైన పోషకాహారం, స్వచ్ఛత వంటి అంశాలపై దృష్టి. ●మహిళలు, చిన్నారులకు ఆరోగ్యకరమైన, పోషకాలు ఉన్న ఆహారం అందించడం. ●శిశువు జననానికి ముందు, జన్మించిన తరువాత రెండేళ్ల వరకు అందించాల్సిన పోషకాహారాలపై అవగాహన కల్పించడం. ●ూసోత్సవ ప్రత్యేక అంశాలు.. ●అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ చేపడతారు. ●పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాన్ని గుర్తించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలుండే ఆకుకూరలు, కూరగాయలు స్థానికంగా దొరికే ఇతర ఆహార పదార్థాల గురించి వివరించడం. ●బాల్యంలో అధిక బరువు నివారణ, మంచి ఆహారపు అలవాట్లను గుర్తించి అలాంటి వాటికి ప్రోత్సాహకాలు అందజేయడం. ●పోషణ ప్రతిజ్ఞ, ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, గృహ సందర్శనలు, పోషణ మేళాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. తొలి వారం కార్యాచరణ.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వంటల పోటీలు నిర్వహించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను ఇచ్చే వంటకాలకు బహుమతులు అందజేస్తారు. మహిళలు, బాలికలకు బీఎంఐ పరీక్షలు నిర్వహించి పిల్లలు బరువు, ఎత్తు కొలుస్తారు. రెండో వారం.. బిడ్డకు అందించే ముర్రుపాల విశిష్టత, అనుబంధ ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లపై అవగాన సదస్సులు నిర్వహిస్తారు. పిల్లల పోషణలో తండ్రుల భాగస్వామ్యం, పుట్టిన బిడ్డ మొదటి 1000 రోజుల్లో మెదడు అభివృద్ధి చెందే విధానంపై వివరిస్తారు. మూడో వారం.. అత్యధికంగా పోషణ లోపమున్న పిల్లల్ని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తారు. వృద్ధి పర్యవేక్షణకు హాజరు కాలేని పిల్లలను గుర్తించి వారి బరువు, ఎత్తు కొలిచేందుకు ఆశ కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తారు. నాలుగో వారం.. కిశోర బాలికలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ, రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, తాగునీరు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, తక్కువ చక్కెర నూనెలతో తయారు చేసే వంటకాలను ప్రదర్శిస్తారు. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాల నిర్వహణ గురించి వివరిస్తారు. పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. జిల్లాలో అన్ని శాఖలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పోషణ్ అభియాన్ మాసోత్సవాన్ని విజయవంతం చేస్తాం. అన్ని ప్రాజెక్టుల్లో స్థానికంగా ఉండే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు అందించాలని ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చాం. నెలరోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. – స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారిణి -
ప్రైవేట్ ఆస్పత్రి సీజ్
చుంచుపల్లి: విద్యానగర్లో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని ఆరోపణలు వచ్చిన అద్విత ఆస్పత్రిని డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి ఆదేశాల మేరకు బుధవారం ప్రోగ్రామ్ ఆఫీసర్ మధువరణ్, సిబ్బంది సందర్శించారు. నిర్దేశించిన ప్రమాణాలను పాటించడంలో ఆస్పత్రి యాజమాన్యం విఫలమైందని గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. కనీస ప్రమాణాలను పాటించని ఆస్పత్రులు, క్లినిక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో మహ్మద్ ఫయాజ్ మొహియుద్దీన్ ఉన్నారు. కుక్కలను తీసుకొచ్చిన ట్రాలీ.. ● పట్టుకున్న గ్రామస్తులు అశ్వారావుపేటరూరల్: ఇతర ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తీసుకొచ్చి తమ ప్రాంతంలో వదిలేస్తున్నారనే అనుమానంతో ఓ ట్రాలీ ఆటోను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన ఓ వ్యక్తి ట్రాలీ ఆటోలో నాలుగు కుక్కలను గొలుసులతో బంధించి స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర బజార్ సమీపంలో వదిలేందుకు యత్నించాడు. గమనించిన కొందరు స్థానికులు కుక్కలతో ఉన్న ట్రాలీ ఆటోను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి.. స్థానిక మున్సిపాలిటీ సిబ్బందికి ట్రాలీ ఆటోను అప్పగించారు. కాగా, మున్సిపాలిటీ అధికారుల విచారణలో సదరు వ్యక్తి పెంపుడు కుక్కలను పోషించ లేక ట్రాలీ ఆటోలో తీసుకొచ్చి వదులుతున్నట్లు గుర్తించారు. అనంతరం ట్రాలీ ఆటోను వదిలేసినట్లు అధికారులు తెలిపారు. వివాహిత ఆత్మహత్య భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని రిక్షాకాలనీకి చెందిన వివాహిత అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పట్టణ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. రిక్షాకాలనీకి చెందిన గుడివాడ లక్ష్మి (42) కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. మూడు రోజుల క్రితం తన పిల్లలను చూసుకోవాలని కోరుతూ తన అన్నయ్యకు సూసైడ్ నోట్ రాసింది. నోట్ చూసిన పిల్లలు తల్లికి సర్ది చెప్పారు. మనస్తాపం చెందిన ఆమె మంగళవారం మధ్యాహ్నం భర్త శ్రీనివాస్, ఇద్దరు కుమారులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గోదావరిలో దూకిన వ్యక్తి..?భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి వంతెన పైనుంచి ఓ వ్యక్తి దూకినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. వైట్ షర్ట్, ప్యాంట్ ధరించిన సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి నదిలో దూకిన్నట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. గంజాయి సేవిస్తున్న వ్యక్తులపై కేసు ములకలపల్లి: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. కొందరు గంజాయి సేవిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం కంపగూడెం క్రాస్రోడ్డు వద్ద దాడులు నిర్వహించారు. పశ్చిమబెంగాల్కు చెందిన సన్యా ముస్తాకిమ్, బిహార్కు చెందిన సర్వేశ్కుమార్తోపాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చికిత్స పొందుతున్న రైతు మృతి పాల్వంచరూరల్: కడుపునొప్పి తాళలేక ఏడు రోజుల క్రితం చేనులో పురుగుమందు తాగిన రైతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లికి చెందిన రైతు భూక్యా ప్రసాద్ (36) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 9వ తేదీన చేనులో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్ను కుటుంబ సభ్యులు ద్విచక్రవాహనంపై ఉల్వనూరు పీహెచ్సీకి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అదే ద్విచక్రవాహనంపై పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
తిరుమల సంకీర్తనలో దుమ్ముగూడెం వాసులు
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామానికి చెందిన టీటీడీ హిందూ ధర్మ ప్రచారక్ పిలక నాగేందర్రెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణానికి చెందిన స్వర రాగ సుధ భజన మండలి కళాకారులు తిరుపతిలో జరిగిన అఖండ హరి నామ సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సంకీర్తనలో భాగంగా శ్రీరామ రక్ష స్తోత్రం హనుమాన్ చాలీసా 11 పర్యాయాలు, గోవిందనామాలు అన్నమయ్య సంకీర్తనలు, భజన పాటలు ఆలపించారు. కార్యక్రమంలో స్వర రాగ సుధ భజన మండలి అధ్యక్షులు జవ్వాజి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొల్లు సునీత, సభ్యులు బేబీ, రామలక్ష్మి, అరుణ, సుశీల, నాగమణి, పద్మ, పద్మావతి పాల్గొన్నారు. -
ఏరియా వ్యాప్తంగా ‘స్వచ్ఛతాహీసేవా’
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో స్వచ్ఛతాహీసేవా కార్యక్రమం నిర్వహించాలని నోడల్ ఆఫీసర్, జీఎం (హెచ్ఆర్డీ) టి.వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయలో కార్పొరేట్ ఏరియా సభ్యులతో ఆయన కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆఫీస్, గనులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 25వ తేదీన ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రమదానం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జీఎం(పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్ఆర్ జీవీ కిరణ్కుమార్, ఆర్.కిరణ్రాజ్కుమార్, డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి
మణుగూరురూరల్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ బుర్ర సోమేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కాంగ్రెస్ హయాంలోనే వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జి.వెంకటేశ్వర్లు, పెనుగొండ సాంబశివరావు, పొదిల వీరబాబు, ఎన్.సతీశ్, పి.రవి, ముత్యం రమేశ్, కవిత, బింగి రమాదేవి, జయమ్మ, శాంతమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల కాల్పుల విరమణ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తీవ్ర నిర్బంధ పరిస్థితుల నేపథ్యంలో బేషరతుగా కాల్పుల విరమణకు మావోయిస్టులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యంగా వెలుగు చూసినట్లు మంగళవారం అర్ధరాత్రి జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. హిందీలో విడుదలైన ఈ లేఖలో.. తమ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో అమరుడు కాకముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు అభయ్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో మారుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, హోంమంత్రి అమిత్షా మొదలు ప్రధాని నరేంద్ర మోదీ వరకు అనేకమంది ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలంటూ చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఈ అంశంపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇతర మావోయిస్టు నేతలతో చర్చించుకుని తుది నిర్ణయానికి వచ్చేందుకు కనీసం నెల పాటు ప్రభుత్వం తరఫున కూడా కాల్పుల విరమణ కావాలని కోరారు. కొన్ని కారణాల వల్ల లేఖ విడుదల జాప్యమైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రేడియో లాంటి ప్రభుత్వ వార్తా సంస్థల ద్వారా గానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ తెలిజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే మావోయిస్టుల లేఖను పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. అయితే లేఖలోని వాస్తవికతను పరిశీలించాల్సి ఉందని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ చెప్పారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ కూడా..మావోయిస్టుల లేఖలోని వాస్తవికతను, అందులోని అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. -
విజయనగరం ఐసిస్ కేసులో కదలిక
సాక్షి హైదరాబాద్/కొత్తగూడెం టౌన్: ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)ల ద్వారా విధ్వంసాలకు పాల్పడడానికి కుట్రపన్నిన విజయనగరం ఐసిస్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోని 16 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఎన్ఐఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విజయనగరం కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాది సిరాజ్–ఉర్–రెహమాన్ను జులైలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఐఈడీల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను సిరాజ్ కలిగి ఉండటంతో ఉగ్రవాద నెట్వర్క్పై ఎన్ఐఏ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 27న సౌదీ అరేబియాలోని రియాద్కు పారిపోవడానికి ప్రయత్నించిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ను అరెస్ట్ చేసింది. సిరాజ్తో కలిసి నేపాల్ సరిహద్దు ద్వారా ఆయుధాల సరఫరాకు ఏర్పాట్లు చేయడానికి కుట్ర చేసినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నినట్లు సిరాజ్ విచారణలో వెల్లడించాడు. దీని ఫలితంగా మరో నిందితుడు సయ్యద్ సమీర్ను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ వివైజులు, డాక్యుమెంట్లు, నగదు సహా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా ఉగ్రవాదం వైపు యువత రిక్రూట్మెంటుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఐదు నెలల క్రితం పెట్టిన మతపరమైన పోస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు లైక్ కొట్టిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్ సమీపాన మధురబస్తీలోని ఓ ఇంటికి తెల్లవారుజామున 4 గంటలకు దాదాపు పది వాహనాలతో వచ్చిన అధికారులు ఉదయం 6 గంటల వరకు సోదాలు నిర్వహించి వివరాలు సేకరించారు. అనంతరం కొత్తగూడెం పాలకేంద్రం సమీపాన మరొకరి ఇంట్లోనూ చేపట్టిన తనిఖీలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. -
మోసమే కాంగ్రెస్ నైజం
సాక్షి, హైదరాబాద్ : ప్రజలను మోసగించడమే కాంగ్రెస్ నైజమని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాత రోజులను తిరిగి తెచ్చి పాలనా సామర్థ్యం లేక గత ప్రభుత్వంపై నెపం నెడుతోందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణభవన్లో మంగళవారం జరిగిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై ఈ సమావేశంలో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లుగా మారారని, కాంగ్రెస్కు దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి లక్కీలాటరీలో మంత్రి పదవి దక్కించుకొని అహంకారంతో మాట్లాడుతున్నారు..పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం అని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రల ను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బలంగా నిలబడుతుందని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం లేదు వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తమ పార్టీ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు పట్ల ఏ మాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి దేహాలను మూడు రోజులైనా గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు. -
పేరు పెట్టి.. కానుక ఇచ్చి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన లావణ్య, రాంబాబు దంపతులు తమ కుమారుడికి పేరు పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు తమ బిడ్డను తీసుకువచ్చారు. బాబుకు ఏ అక్షరంతో పేరు పెట్టాలని కేటీఆర్ అడిగినప్పుడు, ’సు’అనే అక్షరంతో పేరుపెట్టాలని బ్రాహ్మణులు సూచించిన విషయాన్ని ఆ దంపతులు కేటీఆర్కు తెలియజేశారు. దీంతో ‘సూర్యాంశ్’అనే పేరును ఆ చిన్నారికి కేటీఆర్ పెట్టారు. తమ కుమారుడికి కేటీఆర్ పెట్టిన పేరు ఆయన కుమారుడు హిమాన్షు లాగా ధ్వనిస్తుండటంతో దంపతులు సంతోషిచారు. తమ అభిమాన నేతతో గడిపిన ఈ క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని వారు భావోద్వేగంతో చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి ‘కేసీఆర్ కిట్’ను బహూకరించారు. -
వినిపించని ప్రజా‘వాణి’!
భద్రాచలం: డివిజన్, మండలాల పరిధిలోనే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేపట్టిన ‘ప్రజావాణి’కి ప్రజల నుంచి స్పందన కరువైంది. సాధారణంగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తారు. అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్, మండలాల పరిధిలోనే నిర్వహించాలని మూడు వారాల క్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగూడెంలో ఆర్డీఓ, భద్రాచలంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో, మండలాల్లో తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమస్యలపై వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచ్చే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇన్వార్డ్ ఇన్చార్జ్ను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి స్పందన కరువు.. కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ కలెక్టరేట్, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నా.. ప్రజలు మాత్రం ఫిర్యాదులు ఇచ్చేందుకు రావడం లేదు. భద్రాచలం సబ్ కలెక్టరేట్లో మూడు వారాలుగా ఒక్క సమస్య కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మండల కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫిర్యాదుదారులు రాక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఈ సోమవారం భద్రాచలం మండల కార్యాలయంలో ఒకటి, దుమ్ముగూడెంలో ఐదు, చర్లలో ఏడు, బూర్గంపాడులో ఐదు, అశ్వాపురంలో ఏడు, పినపాకలో ఆరు, కరకగూడెంలో మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మణుగూరులో మాత్రం 51 మంది పలు సమస్యలపై వినతులు ఇచ్చారు. ప్రచార లోపమే కారణం ! ప్రజావాణి కార్యక్రమాలకు స్పందన కరువవడానికి ప్రచార లోపమే కారణమని పలువురు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అధికారులు ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత పోస్టులు పెడుతుండడంతో ప్రజలకు ఆలస్యంగా సమాచారం అందుతోంది. ఇక నిరక్షరాస్యులు, సోషల్ మీడియాకు దూరంగా ఉండేవారికి ప్రజావాణి సమాచారం అసలు తెలియడమే లేదు. దీనికి తోడు మండల, డివిజన్ కార్యాలయాల్లో ఇప్పటికే ఆయా సమస్యలపై వినతపత్రాలు అందజేసిన వారు.. పరిష్కారం కాకపోతే నేరుగా కలెక్టర్కు విన్నవించేవారు. కలెక్టర్ దృష్టికి వెళితే సమస్య పరిష్కారం అయ్యేది. అయితే ఇప్పుడు మండల, డివిజన్ కేంద్రాల్లోనే వినతులు ఇస్తే అవి పరిష్కారం కావనే భావనతో పలువురు గ్రీవెన్స్కు రావడం లేదని తెలుస్తోంది. ఇకపై కలెక్టరేట్లోనే ప్రజావాణి నిర్వహించాలని, లేదంటే డివిజన్, మండలాల్లో నిర్వహించే గ్రీవెన్స్పై విస్తృత ప్రచారం చేయాలని పలువురు కోరుతున్నారు. మండల కేంద్రాల్లోనూ అదే పరిస్థితి -
స్వల్పంగా పెరుగుతున్న గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 32 అడుగుల నీటిమట్టం ఉండగా.. శనివారం రాత్రి 33.60 అడుగులకు చేరుకుని మళ్లీ తగ్గింది. ఎగువన ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో మళ్లీ ఆదివారం ఉదయం నుంచి 36.20 అడుగులకు, సోమవారం మధ్యాహ్నం 39.20 అడుగులకు చేరింది. రాత్రి 9 గంటల సమయాన 39.50 అడుగులుగా నమోదైంది. దీంతో అధికారులు స్నానఘట్టాల వద్ద ఐరెన్ మెష్లు అడ్డుపెట్టి భక్తులు నదిలోకి దిగకుండా చూస్తున్నారు. నానో యూరియా వినియోగించాలిసుజాతనగర్: నానో యూరియాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు అన్నారు. స్థానిక సొసైటీ గోడౌన్లోని యూరియా నిల్వలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఒకరికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, కనీసం రెండు బస్తాలు ఇచ్చేలా చూడాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యూరియా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. యూరియా బస్తాలకు బదులు నానో యూరియా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నర్మద, ఏఈఓ ప్రనూష తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ మధు దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగూడెం, జూలూరుపాడు, అశ్వారావుపేట, సుజాతనగర్, దమ్మపేట, ఇల్లెందు, పాల్వంచ, ములకలపల్లి మండలాల నుంచి ప్రజలు హాజరై వినతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎఓ శకుంతల, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలికొత్తగూడెంఅర్బన్: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ఇందుకోసం సైన్స్ సెమినార్లు ఉపయోగపడతాయని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లాస్థాయి సైన్స్ సెమినార్లో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయి సెమినార్లో ప్రథమ స్థానం సాధించిన వారు రాష్ట్రస్థాయికి, అక్కడ ప్రథమ స్థానంలో నిలిచినవారు జాతీయ స్థాయి సెమినార్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. కాగా, ‘క్వాంటం ఏజ్ బిగిన్స్, పొటెన్షియల్స్ అండ్ చాలెంజెస్’ అంశంపై జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 25 మంది విద్యార్థులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఇల్లెందు టీటీడబ్ల్యూఆర్ఎస్కు చెందిన బి.లాస్యశ్రీ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై ందని, ద్వితీయ స్థానంలో కొమ్ముగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వేదవ్యాస నిలవగా, కళ్యాణ రమణి, పూజిత ప్రోత్సాహక బహుమతి సాధించారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా జి.అనురాధ, ఎస్.యశోద వ్యవహరించారు. -
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం దర్బార్లో దరఖాస్తులు అందించవద్దని, నిరుద్యోగులు, ప్రతిభ కలిగిన యువత స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశారు. ఆన్లైన్లో నమోదు చేసి అర్హతల మేరకు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామానికి చెందిన సులోచన, ఇతర మహిళలు నూతన ఇసుక సొసైటీ ఏర్పాటుకోసం, ములకలపల్లి మండలం పాత జెండాలపాడు గ్రామానికి చెందిన రమేష్ పొలంలో సోలార్ కనెక్షన్ ఇప్పించాలని, అశ్వారావుపేట మండలం అంజుబాకకు చెందిన రాజేశ్వరి భూ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఈఈ సత్యానందం, ఏఓ రాంబాబు, ఇన్చార్జ్ ఎస్ఓ భాస్కరన్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, వివిధ శాఖల అధికారులు ఉదయ్కుమార్, రాజారావు, ప్రభాకర్రావు, ఆదినారాయణ, హరికృష్ణ, నారాయణరావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
కొత్తగూడెంటౌన్: ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో సోమవారం ఆయన పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్లను) గుర్తించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదుల సహకారం తీసుకోవాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, సతీష్కుమార్, రవీందర్రెడ్డి, చంద్రభాను తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
శ్రీకృష్ణుడిగా భద్రగిరి రామయ్య
భద్రాచలం : ‘జో అచ్యుతానంద.. జోజో ముకుందా..’ అంటూ చిలిపి కృష్ణయ్యగా మారిన భద్రాద్రి రామయ్యకు వేదపండితులు, అర్చకులు జోలలు పాడారు. దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చిన రామచంద్రస్వామిని తిలకించిన భక్తులు తరించారు. రామయ్య సన్నిధిలో సోమవారం ఊంజల్ సేవను వైభవోపేతంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం సోమవారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలు కనులపండువగా జరిపారు. స్వామి వారికి సాయంత్రం దర్బార్ సేవ నిర్వహించాక బేడా మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో వేంచేపు చేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఆస్థాన గాయకులు, అర్చకులు జోలలు..లాలలు పాడారు. స్వామివారికి పంచామృతాభిషేకం చేసి తొమ్మిది రకాల ప్రసాదాలను నివేదన చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు కేఈ స్థలశాయి భాగవతంలోని శ్రీ కృష్ణ జనన ఘట్టాన్ని భక్తులకు వివరించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం దేవస్థానం ఆధ్వర్యంలో ఉట్ల పండుగ నిర్వహించనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముత్తంగి అలంకరణలో రామయ్య.. దేవస్థానంలో మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
రజాకార్లతో రణం చేసి..
కృష్టా జిల్లా నందిగామ తాలూకాలో పరిటాల సమీపాన పోలీస్ హెడ్క్వార్టర్పై విప్లవకారులు దాడి చేసి ఆయుధాలు సంపాదించారు. ఆ తర్వాత మోటమర్రిలో మిలిటరీ క్యాంపుపైనా దాడి చేశారు. ఆపై మైదాన ప్రాంతాల్లోని జమీందార్ల గడీలు, ఇళ్లపై దాడులు చేస్తూ ఆయుధ సంపత్తి పెంచుకున్నారు. దీంతో గ్రామ దళాలకు బర్మార్లు, గెరిల్లా పోరాటం చేసేవారికి షాట్గన్లు, ఆపై స్థాయిలో ఉండేవారికి 12 బోర్ రైఫిళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీరితో 50 గ్రామాల్లో ప్రత్యేక రక్షక దళాలు ఏర్పడ్డాయి. మరోవైపు గిరిజన ప్రాంతాలకు వెళ్లిన కామ్రేడ్లు ‘ఫారెస్టు’ జులుంను అడ్డుకుని కోయ ప్రజల నమ్మకం పొందారు. ఫలితంగా 1948 ఏప్రిల్ నాటికి జిల్లాలో సుమారు వేయి మంది కోయ సభ్యులు గెరిల్లా పోరాటంలో భాగస్వాములయ్యారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్ర మహాసభ ప్రభావం ఎక్కువగా ఉండేది. చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, సర్వదేవభట్ల రామనాథం వంటి నాయకులు ఇక్కడ పార్టీని బలోపేతం చేశారు. 12వ ఆంధ్ర మహాసభ 1945లో ఖమ్మంలో సుమారు ఇరవై వేల మందితో జరిగింది. ఈ సభ స్ఫూర్తితోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడగలమనే ధీమా విప్లవకారులకు వచ్చింది. దీంతో 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం వరంగల్ జిల్లాలోని విస్నూర్ గడి కేంద్రంగా రగులుకుంది. దీంతో ముందుజాగ్రత్తగా ఖమ్మం, మధిర, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఇల్లెందు, పాల్వంచ, ములకలపల్లి వంటి ప్రాంతాల్లో రజాకార్లు క్యాంపులు ఏర్పాటుచేశారు. గ్రామాల్లోకి కమ్యూనిస్టులు రాకుండా, సంఘాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాల్వంచలో కోయదళంపై దాడి.. వేంసూరు సంస్థానంలో భూపంపిణీ చేసిన దళాలు తమ తదుపరి కార్యక్షేత్రంగా పాల్వంచ సంస్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ 120 మంది ఆదివాసీ/కోయ యువకులతో గెరిల్లా దళం ఏర్పాటు కాగా, భూపంపిణీ మొదలైంది. దాన్ని అణచివేసేందుకు నిజాం సర్కార్ వేయి మంది సైనికులను పాల్వంచ తాలూకాకు పంపింది. పదిహేను రోజుల పాటు జరిగిన పోరులో ఎనిమిది మంది నిజాం సైనికులు చనిపోయారు. అలాగే, గెరిల్లా దళ నాయకుడు ముత్యాలు మృతిచెందగా మరో ఆరుగురిని నిజాం సర్కార్ ఉరి తీసింది. ఆ తర్వాత రజాకార్ దళాలు ములకలపల్లిలో క్యాంపు ఏర్పాటు చేశాయి. పాల్వంచలో నష్టపోయిన కోయ దళాలు ములకలపల్లిలోని రజాకార్ క్యాంపుపై దాడులు చేశాయి. చివరకు బతుకుజీవుడా అంటూ ఈ క్యాంపును ఎత్తివేయాల్సి వచ్చింది. గుంపెన పోరాటం.. అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో 1948లో రజాకార్లకు – సాయుధ పోరాట యోధులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. వట్టికుంట నాగేశ్వరరావు నేతృత్వంలో గుంపెనలో సమావేశమైన 70మంది సభ్యులతో కూడిన దళాన్ని కల్లూరు నుంచి భారీ సంఖ్యలో వచ్చిన రజాకార్లు చుట్టుముట్టారు. దీంతో విప్లవకారులు ప్రాణాలకు తెగించి పోరాడుతూ అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఒక గెరిల్లా, మరో ఇద్దరు గుంపెన గ్రామస్తులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత దళాల నిర్వహణపై కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. సాయుధ దళంలో 20కి మించి సభ్యులు ఉండకూదనే తీర్మానం చేశారు. కార్మిక సంఘం ఏర్పాటు.. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రహస్యంగా ఏర్పడింది. హెడ్డాఫీసులో క్లర్క్గా పనిచేస్తున్న శేషగిరిరావు పోరాటంలో మొదటి అడుగు వేశారు. శేషగిరిరావు నేతృత్వంలో సాయుధ దళాలు రంగంలోకి దిగి కార్మికుల హక్కుల కోసం పోరాడాయి. ఫలితంగా కాంట్రాక్టు విధానం రద్దయి ఉద్యోగులనే గుర్తింపు వచ్చింది. మహిళలు, పిల్లలను గనుల్లో పని చేయించడంపై నిషేధం విధించగా.. ఉపాధి కోల్పోయిన మహిళలకు సింగరేణి పవర్ ప్లాంట్లలో పని కల్పించారు. చివరకు శేషగిరిరావును 1948 ఏప్రిల్లో నెల్లిపాక వద్ద నిజాం పోలీసులు కాల్చి చంపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటం జోరందుకునే సమయంలో 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీస్ చర్యతో నిజాం సర్కార్ కుప్పకూలింది. హైదరాబాద్ స్టేట్ భారత్లో విలీనమైంది. ఆ తర్వాత జరిగిన మలి దశ పోరాటానికి భద్రాద్రి జిల్లా అడవులే కేంద్ర స్థానాలయ్యాయి. రైతాంగ పోరాటానికి బాటలు వేసిన ఖమ్మం మహాసభ 2 -
వెదురు సాగు లాభదాయకం
ములకలపల్లి : వెదురు సాగు ఎంతో లాభదాయకమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని మూకమామిడి, మొగరాలగుప్ప గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పలువురు రైతుల చేలల్లో వెదురు మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. సుమారు 1000 కి.మీ. నుంచి నాణ్యమైన వెదురు మొక్కలు తెప్పించినట్లు తెలిపారు. ఎకరానికి 160 మొక్కలు పెంచొచ్చని, వీటికి ముళ్లు ఉండవని, తక్కువ కాలంలో గడలు ఏపుగా పెరుగుతాయిని వివరించారు. మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంటుదని, రెండేళ్ల పాటు అంతరపంటగా బొబ్బెర, పెసర, జొన్న వంటి పంటల సాగుతో అదనపు ఆదాయం పొందొచ్చని చెప్పారు. పంట మార్పిడి పద్ధతి పాటించాలని, చేపల చెరువులు, కౌజు పిట్టల పెంపకంపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. అనంతరం మూకమామిడిలో అసంపూర్తిగా ఉన్న జీపీ కార్యాలయ భవనాన్ని పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని పీఆర్ ఏఈ సురేశ్ను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, తహసీల్దార్ భూక్యా గన్యా, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏడీఏ రవికుమార్, ఎంఏఓ అరుణ్బాబు, ఏపీఓ హుస్సేన్, ఏఈలు వరప్రసాద్, గఫూర్ పాషా పాల్గొన్నారు. విత్తన సేకరణ భేష్.. అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు పంచాయతీ బంజర నెల్లిపాక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చేపట్టిన విత్తన సేకరణ భేష్ అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రశంసించారు. హెచ్ఎం విమల ఆధ్వర్యంలో సేకరించిన 362 రకాల విత్తనాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. విత్తనాల సేకరణలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీమయని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంఈఓ వీరస్వామి, ఎంపీఓ ముత్యాలరావు, ఏపీఓ సీతరాములు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.‘మునగ తోటలో అంతరపంటగా బెండతోట సాగు చేస్తున్నారా .. సంతోషంగా ఉంది’ అంటూ మహిళా రైతును కలెక్టర్ అభినందించారు. మొగరాలగుప్ప శివారులో ఎకరం విస్తీర్ణంలో మహిళా రైతు వెంటకమ్మ సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించారు. ఒకే భూమిలోపామాయిల్, మధ్యలో మునగ, ఖాళీ ప్రదేశంలో బెండ సాగు చేయడంపై అభినందించారు. ఆమెను పిలిచి మరీ ఫొటో దిగారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
లభ్యంకాని మరో మహిళ ఆచూకీ
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కూలీలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో ఇంకా ఓ మహిళా కూలీ ఆచూకీ తెలియరాలేదు. సోమవారం కూడా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు పరిసరాలతోపాటు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగాయి. గత శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో అశ్వారావుపేట మండలంలోని గోపన్నగూడెం–కన్నాయిగూడెం వాగును దాటే క్రమంలో ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు కూలీల్లో ఇద్దరు కూలీలు పాలడుగుల చెన్నమ్మ(60), పచ్చిసాల వరలక్ష్మి(55) గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా, వీరిలో చెన్నమ్మ మృతదేహాన్ని అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామ శివారులోని చెక్ డ్యాం వద్ద పోలీసులు గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. మరో మహిళ వరలక్ష్మి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. దీంతో స్థానిక అధికారులతోపాటు ఏపీ అధికారులు, ఎన్డీఆర్ఎస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. వాగు దట్టమైన ప్రాంతం గుండా ప్రవహించడంతో మార్గమధ్యలోని అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు సాధ్యం కావడంలేదు. దీంతో ఏపీ పోలీసులు డ్రోన్ కెమెరా సాయంతో ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. మండలంలోని అనంతారం, నెమలిపేట, నారాయణపురం, బచ్చువారిగూడెం మీదుగా పెదవాగు వరదనీటి ప్రవాహంలో బోటు సాయంతో సిబ్బంది గాలింపు కొసాగిస్తుండగా, స్థానిక తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, ఎస్సై రామ్మూర్తి పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులైనా వరలక్ష్మి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. మూడు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు -
అతివల ఆరోగ్యంపై నజర్
చుంచుపల్లి: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు గ్రామస్థాయి నుంచి నగరాల వరకు అన్ని చోట్లా ‘స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. ఇటీవల కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాస్క్ఫోర్స్ సమావేశంలో తగిన సూచనలు చేశారు. బుధవారం నుంచి జిల్లాలోని 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పల్లె దావాఖానాలు, మరో 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 153 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల పరిధిలో మహిళలకు వైద్యపరీక్షలు చేయనున్నారు. పక్షంరోజులపాటు స్పెషల్ డ్రైవ్ పక్షం రోజులపాటు స్వాస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ స్పెషల్ డ్రైవ్ జరగనుంది. ఆరోగ్య మహిళ, ఏసీడీ సెంటర్లు, కేన్సర్ డే కేర్ సెంటర్లతో పాటు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి ఏడాది సెప్టెంబరులో నిర్వహించే పోషణ్ మా ప్రోగ్రామ్ కూడా ఈ కార్యక్రమాలతో కలిపి నిర్వహించనున్నారు. మారిన జీవనశైలి, వాతావరణం కారణంగా కొందరు మహిళలు వ్యాధులు బారిన పడుతున్నారు. శిబిరాల్లో హైబీపీ, షుగర్, ఓరల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్ తదితర పరీక్షలు చేపట్టనున్నారు. రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్షయ బారిన పడే ప్రమాదం ఉన్న మహిళలను గుర్తించి టీబీ పరీక్షలను చేయనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సికెల్ సెల్ ఎనీమియా పరీక్షలతోపాటు బాధితలకు కార్డులను అందించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. గైనకాలజీ, నేత్ర, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్ తదితర వైద్యులు శిబిరాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. రోగ నిర్ధారణ అయితే తగిన చికిత్స, మందులు అందిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని మార్గదర్శకాల్లో సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా మహిళల అనారోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుంది.జిల్లాలోని ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ అమలుపై వివిధ శాఖలకు దిశా నిర్దేశం చేశారు. అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. అందరి సహకారంతో విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – డాక్టర్ ఎస్.జయలక్ష్మి, డీఎంహెచ్ఓ -
బొప్పాయి సాగుకు నగదు ప్రోత్సాహకం
జూలూరుపాడు: బొప్పాయి సాగు చేస్తే ఎకరానికి రూ. 12 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తామని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జె.కిషోర్ అన్నారు. బొప్పాయి సాగు చేసిన జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల రైతులు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోగా తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొప్పాయి తోటలకు ఎంఐడీహెచ్ పథకం ద్వారా 40 శాతం సబ్సిడీ, ఎకరానికి రూ.12వేల ప్రోత్సాహకం అందించనున్నట్లు చెప్పారు. ఎకరం విస్తీర్ణంలో 1,234 మొక్కలు అవసరమని, తొమ్మిది నెలల్లో దిగుబడి వస్తుందని తెలిపారు. ఎకరానికి 30 టన్నుల మేర దిగుబడి ఉంటుందని చెప్పారు. ఇసుక లారీ ఢీకొని దంపతులకు గాయాలు దుమ్ముగూడెం : మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఇసుక లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలయ్యాయి. బండిరేవు గ్రామానికి చెందిన గాలి అచ్చుతరావు–స్వరూప దంపతులు తమ గ్రామం నుంచి భద్రాచలం వెళ్తుండగా చిన్ననల్లబల్లి గ్రామంలో ఇసుక లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వరుసగా వస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు నిలిపివేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇసుక లారీలను పంపించారు. కారు, లారీ ఢీ : ఒకరికి గాయాలుఅశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రధాన రహదారిపై కారు, లారీ అదుపు తప్పి ఢీకొని రహదారి వెంబడి పొలాల్లోకి దూసుకుపోయాయి. ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా 108లో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
న్యూఢిల్లీలో ఉపాధ్యాయుల సాంస్కృతిక ప్రదర్శన
దుమ్ముగూడెం : సీసీఆర్టీ న్యూఢిల్లీలో జరుగుతున్న ఎన్ఈపీ–2020 శిక్షణలో సోమవారం మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు ఎం.మోహన్కుమార్ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ కళలు, విద్య, ఆహార విధానం, సంస్కృతి తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం నుంచి హాజరైన ఉపాధ్యాయులు తెలంగాణ సంప్రదాయ వేషధారణలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. ‘ఐకార్’లో అశ్వారావుపేట విద్యార్థుల ప్రతిభఅశ్వారావుపేట: ఐకార్ నిర్వహించే జాతీయ స్థాయి అగ్రికల్చరల్ పీజీ ప్రవేశ పరీక్షలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల 2021 బ్యాచ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే హేమంత కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐఈఈ పీజీ 2025 ప్రవేశ పరీక్షలో దనసరి నాగ చైతన్య శభరి (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్)లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు, కేటగిరీలో 1వ ర్యాంకు, బండ అఖిల్ కీటక శాస్త్రంలో 11, 2 ర్యాంకులు, హలావత్ చిన్నారి అగ్రానమీ)లో 64, 02, తిప్పా నాగ వినయ్కుమార్ ప్లాంట్ సైన్సెస్ 166, 73, రమావత్ కళ్యాణి కీటకశాస్త్రంలో 187, 06, మృత్తిక శాస్త్రంలో షేక్ సఫీనా 60, 24, దేవరసెట్టి యమున 104, 49, మద్దెల యామని 131, 33 ర్యాంకులు సాధించినట్లు వివరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు. ఉపాధి హామీ పనులపై ప్రజావేదికకరకగూడెం: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సోమవారం ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో ఏపీడీ ఎన్.రవి, విజిలెన్స్ ఆఫీసర్ రమణారావు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు మండలవ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీల్లో రూ.5,94,54,175 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఆ పనుల్లో గుర్తించిన లోపాలకు సంబంధించి ఆయా పంచాయతీలపై రూ.55,261 రికవరీకి ఆదేశించారు. రూ.11,000 పెనాల్టీ విధించారు. పంచాయతీ కార్యదర్శులు పని ప్రదేశంలో కూలీల మస్టర్లపై రోల్ కాల్ చేయకపోవడం, హాజరు గణనలో తప్పిదాలు, మస్టర్లపై అధికారుల సంతకాలు లేకపోవడం, పనుల ప్రదేశాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. 4వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లో పర్యటించి చేసిన ఉపాధి పనులను తనిఖీ చేసి, గ్రామసభల ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. ఎంపీడీఓ కుమార్, ఎంపీఓ మారుతీ యాదవ్ పాల్గొన్నారు. ఆదివాసీ విద్యార్థినికి బంగారుపతకంకారేపల్లి: మండలంలోని తొడితలగూడేనికి చెందిన ఆదివాసీ విద్యార్థిని ఎట్టి ప్రియకు బంగారు పతకం లభించింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తిచేసిన ఆమె యూనివర్సిటీ స్థాయి ఫలితాలు సాధించడంతో బంగారు పతకం ప్రకటించారు. ప్రియ తండ్రి రమణ ఆమె చిన్నతనంలోనే మృతిచెందగా, తల్లి కోటేశ్వరి కూలి పనులకు వెళ్తూ చదివించింది. అటవీ జంతువుల వేటకు కరెంట్ ఉచ్చులుకామేపల్లి: అటవీజంతువులను వేటాడేందుకు కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేయగా, కామేపల్లి మండలంలో అధికారులు గుర్తించారు. మండలంలోని హరి శ్చంద్రాపురం శివారు పంట చేలల్లో జంతువులను వేటాడేందుకు గుర్తు తెలియని వ్యక్తులు 11 కేవీ విద్యుత్ లైన్ నుంచి నేరుగా వైర్లను అమర్చారు. ఈ నేపథ్యాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఉద్యోగులు పరిశీలిస్తుండగా ఉచ్చులు బయటపడ్డాయి. దీంతో అటవీ అధికారులకు సమాచా రం ఇచ్చి వైర్లను తొలగించారు. కాగా, ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
ఉమ్మడి జిల్లా మార్కెట్ చైర్మన్ల ఫోరం ఏర్పాటు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఏర్పాటైంది. రాష్ట్ర ఫోరం తరహాలో ఉమ్మడి జిల్లా ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మార్కెట్లకు గాను తొమ్మిది మార్కెట్లకు పాలకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సమావేశమైన చైర్మన్లు ఫోరం ఏర్పాటు చేసుకున్నారు. ఫోరం గౌరవ అధ్యక్షుడిగా ఖమ్మం ఏఎంసీ చైర్మన్ యరగర్ల హన్మంతరావును ఎన్నికయ్యారు. అలాగే, అధ్యక్షుడిగా బండారు నరసింహారావు(మధిర), ఉపాధక్షులుగా బాగం నీరజ(కల్లూరు), కార్యదర్శిగా దోమ ఆనంద్బాబు(సత్తుపల్లి), సహాయ కార్యదర్శిగా టి. సీతమ్మ(భద్రాచలం),, కోశాధికారిగా ఇరుప శ్రీనివాసరావు(చర్ల)ను ఎన్నుకున్నారు. త్వరలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విధులు నిర్వర్తిస్తామని హన్మంతరావు తెలిపారు.గౌరవ అధ్యక్షుడిగా హన్మంతరావు -
ఆదర్శనీయుడు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కొత్తగూడెంఅర్బన్: దేశం గర్వించదగ్గ ఇంజనీర్, ఆదర్శనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని సింగరేణి డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హెడ్డాఫీస్ వద్ద భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు. విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిగా తీసుకుని ఇంజనీరింగ్లో ప్రగతి చాటాలని సూచించారు. ఇంజనీర్లు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ విలువలతో కూడిన ఇంజనీరింగ్ పనితనంతో నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సింగరేణి జీఎంలు డి.వెంకటేశ్వర్లు, కె.సాయిబాబు, సీహెచ్.శ్రీనివాస్, టి.వెంకట రామి రెడ్డి, బి.శ్రీనివాస రావు, జీవీ కిరణ్ కుమార్, మురళీధర రావు, ఎస్.వెంకటాచారి, ఎస్.వి.రామమూర్తి , ఎం.కనకయ్య, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ టి.లక్ష్మీపతి గౌడ్, గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ ఎస్వి.రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పీతాంబరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
ఫలించిన రైతుల భగీరథ ప్రయత్నం
అశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువు ఆయకట్టు రైతుల భగీరథ ప్రయత్నం ఫలించింది. చెరువు తూముల షట్టర్లు మరమ్మతులకు గురై నిండు కుండలా ఉన్నా చెరువు రెండు షట్టర్లు లేవక నీరు రాక ఇబ్బంది పడుతున్న రైతుల కష్టాలు తీరాయి.తుమ్మలచెరువు అలుగు తూము షట్టరును సోమవారం మెకానిక్ కొమ్ము మల్లయ్య, కొమ్ము వీరయ్య, కల్లెం భీష్మారెడ్డి సహకారంతో రైతులు షట్టరును ఎత్తారు. నీటిపారుదల శాఖ అధికారులు, గజ ఈతగాళ్ల వల్ల సాధ్యకాని పనిని మెకానిక్ కొమ్ము మల్లయ్య చైన్ బ్లాక్ సాయంతో పట్టు వదలకుండా రైతుల సహకారంతో తుమ్మలచెరువు ప్రధాన తూము, అలుగు తూము షట్టరులు లేపి రైతులకు నీరు అందించాడు. భీష్మారెడ్డి సాహసంతో 20 అడుగుల నీళ్లలో మునిగి షట్టరుకు లంగర్ వేయగా చైన్బ్లాక్తో షట్టరును పైకి ఎత్తారు. రెండు రోజుల క్రితం కొమ్ము మల్లయ్య ప్రధాన తూమును లేపాడు. దీంతో ఆయకట్టు రైతులు కొమ్ము మల్లయ్య, వీరయ్య, భీష్మారెడ్డిని అభినందించారు. పట్టువదలని విక్రమార్కులు మల్లయ్య, వీరయ్య, భీష్మారెడ్డి -
యూరియా కోసం రైతుల తోపులాట
జూలూరుపాడు: జూలూరుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద సోమవారం యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. రైతులు సోమవారం ఉదయం 5 గంటలకే పీఏసీఎస్కు చేరుకుని తమవంతు కోసం వరుసలో చెప్పులు పెట్టుకున్నారు. 6 గంటల నుంచి సుమారు 250 మంది రైతులు క్యూలైన్లో బారులుదీరారు. పీఏసీఎస్ ఉద్యోగులు కూపన్లు ఇవ్వడం ప్రారంభించాక, కూపన్లకు తమవరకు వస్తాయో, రావోననే ఆందోళనతో కొందరు రైతులు క్యూలైన్ నుంచి ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ఘర్షణకు దారితీసింది. మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు నచ్చజెప్పడంతో సద్దుమణిగింది. పీఏసీఎస్ ఉద్యోగులు 100 మంది రైతులకు కూపన్లు అందించి, ఒక్కో యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు. మరో 150 మంది రైతులు యూరియా దొరకక నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై సహకార సంఘం సెక్రటరీ రమణారెడ్డిని వివరణ కోరగా.. కూపన్ పొందిన రైతులకు ఒక యూరియా బస్తా చొప్పున అందించామని, సహకార సంఘం కార్యాలయంతోపాటు, పడమటనర్సాపురం రైతు వేదికలో కూడా యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 250 మంది వస్తే 100 మందికే ఒక్కో బస్తా చొప్పున పంపిణీ -
ఏపీ పోలీసుల దౌర్జన్యం
● స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఓ ఇంట్లోకి చొరబాటు ● కోడిపుంజుల నెపంతో మహిళపట్ల దురుసు ప్రవర్తన ● సీసీ కెమెరాల ధ్వంసం, హార్డ్ డిస్క్ల స్వాధీనం ● ఆంధ్రా పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న దమ్మపేట గ్రామస్తులు దమ్మపేట : దమ్మపేట గ్రామంలోని కాపుల బజార్లో సోమవారం ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఏపీ పోలీసులు, మహిళపై దురుసుగా ప్రవర్తించారు. సీసీ కెమెరాలను పగులకొట్టారు. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామానికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు పందెం కోడి పుంజులను దమ్మపేటకు చెందిన వ్యక్తి దొంగిలించాడనే నెపంతో వచ్చారు. చింతలపూడి పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డు, రంగనాథ్తోపాటు మరో 20 మంది వ్యక్తులు నాలుగు కార్లలో దమ్మపేటలోని కాపుల బజారుకు వచ్చారు. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా, అనుమతి తీసుకోకుండా గోపవరపు శేషు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటికి ఉన్న రెండు గేట్లను మూసేసి, ఇంటి ముందు ఉన్న రెండు సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శేషు భార్య రాజేశ్వరి ప్రశ్నించగా... నీ భర్త కోడిపుంజుల దొంగతనాలతోనే ఇంత సంపాదించాడా అంటూ పోలీసులు ఆమె పట్ల దురుసుగా మాట్లాడారు. బలవంతంగా బీరువా తెరిపించి శేషు ఆధార్ కార్డు తీసుకున్నారు. వారు పెంచుకుంటున్న కోడి పుంజులను పోలీసులతో వచ్చిన వ్యక్తులు స్వాధీనం చేసుకుని, ఆమెను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో ఆ వీధిలో నివాసం ఉంటున్న గ్రామస్తుల వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఏపీ పోలీసులను, వారితో వచ్చిన వ్యక్తులను, వాహనాలను అడ్డుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళపై దౌర్జన్యం ఏమిటని నిలదీశారు. పోలీసులను, వారి కారును కదలన్వికుండా దాదాపు నాలుగు గంటలపాటు ముట్టడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఏపీ పోలీసుల వాహనాన్ని దమ్మపేట స్టేషన్కు తరలించారు. బాధిత మహిళ రాజేశ్వరి చింతలపూడి పోలీసుల దౌర్జన్యంపై దమ్మపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
వర్షానికి కొట్టుకుపోయిన వేరుశనగ చేలు
అశ్వారావుపేట: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అశ్వారావుపేట మండలంలోని పలు వ్యవసాయ క్షేత్రాలు నీట మునుగుతున్నాయి. పండువారిగూడెం గ్రామానికి చెందిన కలిదిండి వెంకట నర్సింహ రాజు 40 ఎకరాల్లో వేరుశనగ నాటేందుకు చేను సిద్ధం చేసుకున్నాడు. శుక్రవారం నాటికి 20 ఎకరాలు విత్తనాలు వేశారు. ఆ తర్వాత వర్షం రావంతో 20 ఎకరాల్లో వేరుశనగ విత్తనాలు కొట్టుకుపోయాయి. ఎకరానికి రూ.50 వేలు చొప్పున రూ.10 లక్షలు నష్టపోయినట్లు రైతు వాపోతున్నాడు. రామన్నగూడెం, నారాయణపురం గ్రామాల్లో కూడా వేరుశనగ చేలు నీట మునిగాయి. వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.ఎకరానికి రూ. 50 వేల చొప్పున నష్టం -
రాజ్యలక్ష్మి మోటార్స్లో షార్ట్ సర్క్యూట్
పాల్వంచ: పట్టణంలోని బీసీఎం రోడ్లో ఉన్న రాజ్యలక్ష్మి మోటార్స్లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలు వ్యాపించి షోరూం నుంచి దట్టమైన పొగ వస్తుండటంతో స్థానికులు గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని షట్టర్లు తెరిచి చూడగా, భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్నట్లు గుర్తించారు. నిర్వాహకుల సమాచారంతో కొత్తగూడెం నుంచి ఫైర్ ఇంజన్తో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటల్లో కొత్త, పాత వాహనాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. పూర్తి అంచనా వేయాల్సి ఉందన్నారు.రూ.20 లక్షల విలువైన కొత్త, పాత వాహనాలు దగ్ధం -
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.రామయ్య సేవలో ఎన్నికల కమిషనర్శ్రీసీతారామ చంద్రస్వామివారిని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. అనంతరం దేవస్థాన అనుబంధ ఆలయాలను సందర్శించగా అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఈఓ దమోదర్రావు, ఏఈఓ శ్రవణ్కుమార్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, ఆర్ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం, భద్రాచలంలో నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొత్తగూడెం డివిజన్కు సంబంధించి కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో, భద్రాచలం డివిజన్కు సంబంధించి భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర సమస్యలు ఉన్నవారు కలెక్టరేట్లోని ఇన్వార్డ్ సెక్షన్లో తమ దరఖాస్తులను అందించి రశీదు పొందాలని, వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపిస్తామని వివరించారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని పేర్కొన్నారు. భద్రాద్రితో విడదీయరాని బంధం కవి సమ్మేళనంలో గజల్ శ్రీనివాస్భద్రాచలంటౌన్: భద్రాచలానికి రామయ్య దర్శనంతోపాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చానని భద్రాద్రితో తనకు విడదీయరాని బంధం ఉందని ప్రముఖ గజల్ సింగర్, మాస్ట్రో గజల్ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని తాతగుడి సెంటర్లో ఉన్న లైబ్రరీ హాల్లో ఆంధ్ర సారస్వత పరిషత్, భద్రాద్రి కవి గాయకుల ఆధ్వర్యంలో ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సమ్మేళనానికి ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన గాయకులు తమ గానాలతో అలరించారు. చివరిలో గజల్ శ్రీనివాస్ గజల్స్ గానం సంగీత ప్రియులను మైమరిపించింది. నిర్వాహకులు గాయకులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ జిల్లా అధ్యక్షురాలు చిట్టే లలిత, పామరాజు తిరుమలరావు, కళాకారులు, గాయకులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. కార్టూన్ పోటీలకు ఎంట్రీల ఆహ్వానంఖమ్మంగాంధీచౌక్ : వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు వికాసం శీర్షికతో కార్టూన్ పోటీలు నిర్వహించనున్నట్లు సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 5,116, ద్వితీయ బహుమతిగా రూ. 3,116, తృతీయ బహుమతి రూ. 2,116తో పాటు మూడు ప్రత్యేక నగదు బహుమతులు రూ. 516 చొప్పున, ప్రశంసాపత్రాలు అందిస్తామని వివరించారు. వయసుతో నిమిత్తం లేకుండా ఒక్కొక్కరు రెండు కార్టూన్లు పంపొచ్చని, ఏ4 సైజ్లో ఉండాలని, గతంలో ప్రచురితమైనవి పంపొద్దని సూచించారు. అక్టోబర్ 10 నాటికి నిర్వాహకులకు అందాలని, విజేతలను అక్టోబర్ 29న ప్రకటిస్తామని, తెలుగు మహాసభల సందర్భంగా నగదు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. కార్టూన్లను 98660 84124 వాట్సాప్ నంబర్కు పంపించాలని కోరారు. -
వందేళ్లు పటిష్టంగా ఉండేలా..
పాల్వంచరూరల్: రెండు గుట్టల మధ్య నిర్మించిన కిన్నెరసాని ప్రాజెక్ట్ నాటి ఇంజనీర్ల ప్రతిభకు దర్పణం పడుతోంది. సరైన వాహనాలు, యంత్రాలులేని కాలంలో పటిష్ట కట్టడం నిర్మించారు. ఏపీఎస్ఈబీ (ప్రస్తుతం జెన్కో) సంస్థ రూ.5.58 కోట్లతో కిన్నెరసాని గ్రామ సమీపంలో కిన్నెరసాని నదిపై ప్రాజెక్ట్ నిర్మించింది. 1962 నుంచి 1972 వరకు నిర్మాణ పనులు చేపట్టారు. నాటి ఇరిగేషన్శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ రామకృష్ణరాజు నేతృత్వంలో పది మంది ఇంజనీర్లు కలిసి 13 క్రస్ట్ గేట్లతో రెండు దశల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తిచేశారు. స్కాపర్లు, ఎడ్లబండ్లను వినియోగించి స్థానికంగా లభించిన రాళ్లు, ఇసుక, తోగ్గూడెం నుంచి కంకరను తీసుకొచ్చి నిర్మాణం జరిపారు. ఇందుకోసం పదేళ్లపాటు ఐదువేల మంది కార్మికులు పనులు నిర్వహించారు. బరువులు మోసేందుకు గాడిదలను వినియోగించినట్లు చుట్టుపక్కల ప్రజలు చెబుతున్నారు. రాష్ట్ర నలుమూలల విద్యుత్ పంచే పాల్వంచలోని కేటీపీఎస్కు కిన్నెరసాని ద్వారానే నీరు అందుతోంది. ఎన్ఎండీసీ, నవభారత్ పరిశ్రమలకు, 10 వేల ఎకరాలకు సాగు నీరు, కొత్తగూడెం కార్పొరేషన్కు తాగునీరు అందిస్తోంది. ఆరు దశబ్దాలు గడిచినా, రిజర్వాయర్కు ఎన్నోమార్లు వరద పోటెత్తినా ప్రాజెక్ట్ పటిష్టత దెబ్బతినలేదు. కిన్నెరసాని ప్రాజెక్ట్ రూపకల్పన, కట్టినతీరు నేటి ఇంజనీర్లకు ఆదర్శనీయం. సౌకర్యాలు అందుబాటులోలేని రోజుల్లో వందేళ్ల వరకు ఏ సమస్యా రాకుండా నిర్మించారు. ప్రాజెక్టు గేట్ల కింద స్లూయిస్ను పటిష్టంగా నిర్మించారు. నిర్మాణం ఎంతో శ్రమతో కూడుకున్నది. అప్పటి ఇంజనీర్ల పనితీరు అద్భుతంగా ఉంది. –బి.అర్జున్, జలవనరులశాఖ ఈఈ1962లో కిన్నెరసాని ప్రాజెక్ట్ నిర్మాణం -
కదనరంగంలో కొదమసింహాలై...
తెలంగాణ సాయుధ పోరాటం అనగానే దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, భీంరెడ్డి నర్సింహారెడ్డి తదితర ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన పోరాట యోధులే గుర్తుకొస్తారు. ఆరోజుల్లో పల్లెల్లో అరాచక పాలనకు కేంద్రాలుగా ఉన్న దొరల గడీలు, వారికి మద్దతుగా నిలిచిన నైజాం సర్కార్, అతని క్రూరసైన్యంలో భాగమైన రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను వారు ఏకం చేశారు. చేతిలో రాళ్లు, వడిసేల, గుత్ప(కర్రలు)లనే ఆయుధాలుగా చేసుకుని పోరాటం చేశారు. అయితే ఈ పోరాటంలో విప్లవకారులకు విల్లంబులు ఎక్కుపెట్టడం నుంచి జిలిటెన్ స్టిక్స్తో దాడులు చేయడం వరకు నేర్పింది ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా.. నేటి భద్రాద్రి జిల్లానే. కానీ ఈ చారిత్రక అంశాలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. దీంతో సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా పాత్ర ఈనాటి ప్రజానీకానికి ఎక్కువగా తెలియకుండా పోయింది. ఆనాటి వివరాలను ‘సాక్షి’ వెలికితీసే ప్రయత్నంలో వెలుగుచూసిన అంశాలపై నేటి నుంచి ప్రత్యేక కథనాలు.. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంపోరాట నేపథ్యం భారత దేశంలో ఓ వైపు బ్రిటిష్ సామ్రాజ్యం కొనసాగుతుంటే వారి సహకారంతో నిజాం రాజులు హైదరాబాద్ స్టేట్లో పాలన సాగించారు. రాష్ట్ర సాగుభూమిలో దాదాపు నాలుగో వంతుకు పైగా జమీందార్లు, దేశ్ముఖ్ల చేతుల్లో ఉండేది. సాధారణ రైతులు ఈ జమీందార్ల భూముల్లో సాగు చేసిన తర్వాతే తమ సొంత పొలాలను దున్నుకోవాల్సి వచ్చేది. చేతి వృత్తుల వారు ఉచితంగా అన్ని రకాల సేవలు చేయాల్సి వచ్చేది. సామాన్యులు రేయింబవళ్లు గొడ్డు చాకిరీ చేసినా నోట్లోకి నాలుగు వేళ్లూ పోయేవి కాదు. మరోవైపు భారత స్వాతంత్య్ర సమరంలో అగ్రభాగాన ఉన్న కాంగ్రెస్.. స్వదేశీ సంస్థానాల విషయంలో జోక్యం చేసుకోకూడదనే నిర్ణయం కారణంగా నైజాం రాజ్యంలోని ప్రజల కడగండ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబికే ఆగ్రహ జ్వాలలను ఒడిసిపట్టుకునే రాజకీయ పరిస్థితులు లేవు. నిజాం రాజ్యంలో తెలుగును అధికార భాషగా మార్చాలనే నినాదంతో ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టులు ముందుకొచ్చారు. దున్నేవాడిదే భూమి నినాదంతో ప్రజల్లో నమ్మకం పొందారు. ప్రజలను సమీకరించి దొరల పెత్తనానికి సవాల్ విసిరారు. అలా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 జూన్ 4న మొదలైంది. ఫలించిన ‘అల్లూరి’ శిక్షణ.. భద్రాచలం నుంచి విశాఖపట్నం మధ్య ఉన్న తూర్పు కనుమల్లో అల్లూరి సీతారామరాజు నిర్వహించిన గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులను ఆకర్షించింది. దీంతో భద్రాచలం ఏజెన్సీలోని వరరామచంద్రాపురం(వీఆర్ పురం) మండలం పేరంటాలపల్లిలో అల్లూరి సీతారామరాజు సమకాలికుడు, ఉద్యమ సహచరుడిగా పేరున్న సింగరాజు సాధువు వద్దకు శిక్షణ కోసం విప్లవకారులు వెళ్లారు. అక్కడ సుమారు 200 మంది గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ తీసుకుని తిరిగి పోరు భూమికి వచ్చారు. మరోవైపు ఇల్లెందు, కొత్తగూడెం బొగ్గు గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాల గిడ్డంగులపై విప్లవకారులు దాడులు చేశారు. ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లిన బాంబులనే ఆ తర్వాత సైనిక వాహనాలు పేల్చివేయడానికి, నిజాం పోలీసు క్యాంపులపై దాడులు చేయడానికి ఉపయోగించారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో ప్రత్యేక కోయ దళాలు వెలిశాయి. దీంతో నిజాం రజాకార్లపై శిక్షణ పొందిన విప్లవకారుల పోరాటానికి జిల్లా వేదికగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో కమ్యూనిస్టుల ప్రభావం ఈ జిల్లాపై ఎక్కువగా పడింది. మధిర, ఇల్లెందు వంటి పట్టణాలే కాక పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేట సంస్థానాల్లో వేలాది ఎకరాలు కలిగిన భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. కార్మికులు సంఘాలను ఏర్పాటు చేసుకుని నిజాం నిరంకుశ విధానాలకు ఎదురుతిరిగారు. మరోవైపు రోజురోజుకూ గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం పెరిగిపోతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు కాశీం రజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరుతో ప్రత్యేక సేనలు గ్రామాల్లో అడుగుపెట్టాయి. దీంతో కమ్యూనిస్టు విప్లవకారులు, రజాకార్ల మధ్య జిల్లాలోని అనేక గ్రామాల్లో పోరాటాలు జరిగాయి.సాయుధ పోరాటంలో ప్రత్యేకం.. ఉమ్మడి ఖమ్మం 1 -
చెక్కు చెదరలే..
● దుమ్ముగూడెం ఆనకట్ట నిర్మించి 160 ఏళ్లు ● నిర్మాణంలో బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ప్రతిభ నేడు ఇంజనీర్స్ డేఅశ్వాపురం/భద్రాచలంటౌన్: దుమ్ముగూడెం ఆనకట్ట, కిన్నెరసాని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రతిభకు దర్పణం పడుతున్నాయి. ఏ స్థాయిలో వరదలు వచ్చినా తట్టుకోగలుగుతున్నాయి. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా ఆ ప్రాజెక్ట్ల నిర్మాణం గురించి తెలుసుకుందాం. గోదావరి నదిపై 160 ఏళ్ల క్రితం 1865లో సర్ ఆర్థర్ కాటన్ దుమ్ముగూడెం ఆనకట్టను రాతి కట్టడంతో నిర్మించారు. 160 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు. గోదావరికి పలుమార్లు వరదలు వచ్చినా దెబ్బతినలేదు. ఆనకట్ట ఆధారంగా మణుగూరు భారజల కర్మాగారం నిర్మించగా గోదావరి నుంచి నీరు సేకరించి భారజలం ఉత్పత్తి చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజీవ్సాగర్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసి పనులు చేపట్టగా బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్గా మార్చి పనులు చేపట్టింది. సీతమ్మ సాగర్ నిర్మాణం సైతం చేపడుతోంది. ఇక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఆనకట్ట వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ, శీతాకాలంలో నీరు జాలువారుతూ, వేసవికాలంలో అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాలకు వారధిగా మూడు కాలాల్లో ఒక్కో అందంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జల రవాణా కోసం.. జల రవాణాను అభివృద్ధి చేసే క్రమంలో బ్రిటీష్ ఇండియా ఆనకట్ట నిర్మాణం చేపట్టింది. నదిలో జల ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో కూడా రవాణా ఆగకుండా నిత్యం నీరు ప్రవహించే విధంగా దుమ్ముగూడెం నిర్మాణం చేపట్టారు. గోదావరి నది మధ్యలో ఉండే లంకకు ఇరువైపులా రెండు ఆనకట్టలు నిర్మించారు. మొదటి దుమ్ముగూడెం లంక, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం మధ్య, రెండో లంకకు దుమ్ముగూడేనికి మధ్య ఉన్నాయి. ఇక్కడి నుంచి రాజమండ్రి వరకు లాంచీల ద్వారా వాణిజ్య రవాణా సాగేది. నిర్మాణంలో కాటన్ ఇంజనీరింగ్ ప్రతిభ చూపాడు. కోడి గుడ్డు సొన, సున్నం, బంకమట్టిని పశువులతో గానుగ ఆడించి ఆ మిశ్రమంతో రాళ్లను పేర్చి ఆనకట్ట నిర్మించారు. అప్పటి నుంచి జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి, పారిశ్రామిక వనరుగా మారింది. -
‘విత్తనం నుంచి మహావృక్షంగా’ పుస్తకావిష్కరణ
ఖమ్మంగాంధీచౌక్: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవిత చరిత్రపై రచయిత నరేష్ రాసిన ‘విత్తనం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం’ పుస్తకాన్ని స్థానిక ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో పలువురు రచయితలు, కవులు ఆదివారం ఆవిష్కరించారు. అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో దాసరోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ కడవెండి వేణుగోపాల్, కవులు, రచయితలు, సాహితీవేత్తలు సీతారాం, అట్లూరి వెంకటరమణ, సైదులు, ఐనాల నయీమీ పాషా, వురిమళ్ల సునంద, వనజీవి రామయ్య సతీమణి జానకమ్మ, నామా పురుషోత్తం, రాచమళ్ల ఉపేందర్, సయ్యద్ షఫీ, కన్నెగంటి వెంకటయ్య, రమణ, బ్రహ్మం, నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో కొత్త రూల్..
● సీసీఐకి పత్తి విక్రయించాలంటే స్లాట్ బుకింగ్ తప్పనిసరి ● అందుకోసం ‘కాపాస్ కిసాన్’ యాప్ ఏర్పాటు ● పత్తి దిగుబడి గుర్తించేందుకు జిల్లా కమిటీలు ● ఉమ్మడి జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లులు ఖమ్మంవ్యవసాయం: పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులు పొందేందుకు సీసీఐ ఈ ఏడాది కొత్త నిబంధన విధించింది. రైతులకే మద్దతు ధర దక్కేలా నిబంధనలు కఠినం చేస్తోంది. సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ‘కాపాస్ కిసాన్’ యాప్ రూపొందించింది. పంట సాగు చేసిన రైతులు ఈ యాప్లో వివరాలు నమోదు చేస్తే.. సాగు చేసినవారే సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయించే అవకాశం ఉంటుంది. రైతుల ఆధార్కు బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని 9 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పత్తి దిగుబడులను గుర్తించేందుకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయనుంది. యాప్ ద్వారా వివరాల నమోదు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి ‘కాపాస్ కిసాన్’ యాప్లో రైతులు తాము సాగుచేసిన పంట వివరా లు నమోదు చేస్తే.. బుకింగ్ నంబర్ జారీ చేస్తారు. దీని ఆధారంగా స్లాట్ బుక్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు లేదా వ్యవసాయ అధికారు లు, జిన్నింగ్ మిల్లుల వద్ద ఉన్న మార్కెటింగ్ అధికారుల ద్వారా స్లాట్ బుక్ చేయాలి. నిర్దేశించిన సమయంలో రైతులు పత్తిని జిన్నింగ్ మిల్లుకు తగిన ప్రమాణాలతో తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. 4.46 లక్షల ఎకరాల్లో సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 4,46,958 ఎకరాల్లో పత్తిసాగుచేశారు. ఖమ్మంలో 2,25,613, భద్రాద్రిలో 2,21,345 ఎకరాల్లో పత్తి సాగైంది. ఖమ్మంజిల్లాలో 27,07,356 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో 22,13,450 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 8 నుంచి 12 వరకు తేమశాతం కలిగిన పంటను మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. గతేడాది 8 శాతం తేమ కలిగిన పత్తికి క్వింటాకు రూ.7,521 ఇవ్వగా, ఈ ఏడాది రూ.8,110గా (రూ.589 పెరిగింది) నిర్ణయించింది. పంటను లూజ్గా విక్రయానికి తీసుకురావాలి. జిల్లా కమిటీలకు బాధ్యత పత్తి దిగుబడులను గుర్తించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీలను ఏర్పా టు చేయనుంది. వాతావరణం, నేలలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని పత్తి దిగుబడులను ఈ కమిటీలు గుర్తిస్తాయి. వర్షాధారంగా పత్తి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. నీటి ఆధారంగా 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు వస్తుంది. జిల్లా కమిటీలు నిర్ణయించిన దిగుబడి ఆధారంగా రైతులు పంట విక్రయించుకోవాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై నిబంధనల్లో మార్పులు కౌలు రైతులు పంట విక్రయించేందుకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ల సౌక ర్యం కల్పించింది. అయితే, గతేడాది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని దళారులు రైతులకు చెందాల్సిన మద్దతు ధరను కొల్లగొట్టారు. అధికారులూ సహకరించి అడ్డంగా దొరికిపోయి రాష్ట్రవ్యాప్తంగా సస్పెండ్ అయ్యారు. దీంతో ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారుల అనుమతులు ఉంటేనే తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించే విధంగా నిబంధనలు మార్చారు. కాగా, అక్టోబర్ నుంచి కొను గోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ●జీఆర్ఆర్ ఇండస్ట్రీస్ వెంకటగిరి ఖమ్మం రూరల్. ●శ్రీసాయి బాలాజీ జిన్నింగ్ అండ్ ఆయిల్ మిల్, తల్లంపాటు ఖమ్మం రూరల్. ●అమరావతి టెక్స్టైల్స్ దెందుకూరు, మధిర. ●మంజీత్ కాటన్ మిల్ మాటూరు, మధిర. ●శ్రీ శివగణేశ్ కాటన్ ఇండస్ట్రీస్ ఇల్లెందులపాడు, మధిర. ●ఉషశ్రీ కాటన్, జిన్నింగ్ మిల్స్, సువర్ణాపురం, ముదిగొండ. ●స్టాప్లరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, తల్లాడ. ●జీఆర్ఆఆర్ జిన్నింగ్ మిల్స్, పొన్నెకల్, ఖమ్మంరూరల్. ●శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్, గోల్తండా, తిరుమలాయపాలెం. భద్రాద్రి జిల్లాలో సీసీఐ కేంద్రాలు ●లక్ష్మీప్రియ జిన్నింగ్ మిల్, కారేపల్లి. ●మంజిత జిన్నింగ్ మిల్స్, కొత్తగూడెం. ●అనూశ్రీ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు. ●శ్రీ లక్ష్మీనరసింహ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు. ●శ్రీరామా జిన్నింగ్ మిల్స్, అశ్వాపురం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట విక్రయంలో కూడా రైతులు ఇబ్బందులు పడకుండా స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ రైతులకు ఎంతో మేలైంది. నిర్దేశించిన సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. –ఏంఏ అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మంతేమశాతం ఆధారంగా నిర్ణయించిన పత్తి ధర (రూ.లలో) తేమశాతం మద్దతు ధర 8 శాతం 8,110 9 శాతం 8,029 10 శాతం 7,948 11 శాతం 7,867 12 శాతం 7,786 -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ చైర్మన్ బి.నాగేశ్వరరావు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
చెక్డ్యాంలో మహిళ మృతదేహం లభ్యం
అశ్వారావుపేటరూరల్: వాగు దాటే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు మహి ళా కూలీల్లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్య మైంది. కాగా, మరో మహిళ ఆచూకీ ఇంకా దొరకలేదు. మండలంలోని గోపన్నగూడెం – కన్నాయిగూడెం మార్గంలో ఉన్న వాగును ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు దాటుతున్న క్రమంలో పాలడుగల చెన్నమ్మ (60), పచ్చితల వరలక్ష్మి(55) గల్లంతైన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెదవాగు వెంబడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతారం గ్రామ సమీపంలోని వాగు చెక్ డ్యాం వద్ద చెన్నమ్మ మృతదేహాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో కూలీ వరలక్ష్మి ఆచూకీ కోసం అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సీఐ నాగరాజు, ఎస్ఐ యయాతిరాజుతోపాటు ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో గాలిస్తున్నారు. గోదావరి తీరంలో పాము కలకలంభద్రాచలంటౌన్: గోదావరి తీరంలో స్నాన ఘట్టాల వద్ద ఒక పాము కలకలం సృష్టించింది. భక్తులు ఆదివారం ఉద యం గోదావరిలో స్నానాలు ఆచరించేందుకు దిగే క్రమంలో ఒక పాము కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యా రు. స్థానికలు వచ్చి పామును దూరంగా తరిమారు. కొండ చిలువ లాగా ఉండడంతో భక్తులు ఆ ప్రదేశంలో స్నానాలు చేసేందుకు భయపడ్డారు. వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదుఇల్లెందు: బాధితుడి నుంచి ఫీజు తీసుకుని, హైకోర్టులో కేసు అప్పీల్ చేస్తానంటూ బురిడీ కొట్టించిన వ్యక్తిపై ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు అందింది. పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన ఎస్కే ఫకీర్సాహెబ్, తన భార్యకు మధ్య జరిగిన గొడవలపై కొత్తగూడెం కోర్టులో కేసు దాఖలు చేశారు. కాగా, ఫకీర్సాహెబ్ తన భార్యకు ప్రతీ నెల రూ.10 వేలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రతీ నెలా తన భార్యకు రూ.10 వేలు భరణం చెల్లించే స్తోమత లేదని, హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఇల్లెందు జేకే కాలనీకి చెందిన ఓ లీడర్ ద్వారా ఓ న్యాయవాది పరిచయమై హైకోర్టులో అప్పీల్ చేస్తానని, రూ.10 వేల భరణం తగ్గించేలా చేస్తానని నమ్మబలికాడు. కేసు వాదించేందుకు రూ.35 వేలు ఫీజు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా ఈ కేసు హైకోర్టులో అప్పీల్ చేయకపోవటం, కొత్తగూడెం కోర్టు నుంచి భరణం చెల్లింపు నోటీసులు వస్తుండటంతో అనుమానం వచ్చిన ఫకీర్సాహెబ్ హైకోర్టు బార్ కౌన్సిల్ను సంప్రదించాడు. సదరు వ్యక్తి న్యాయవాది కాదని, హైకోర్టు బార్ కౌన్సిల్లో తన పేరు లేదని బార్ కౌన్సిల్ నుంచి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఈ విషయమై ఫకీర్సాహెబ్ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ టి.సురేశ్ను వివరణ కోరగా ఫకీర్సాహెబ్ నుంచి ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. పోలీసుల సూచన మేరకు ఇల్లెందు బార్ అసోసియేషన్లో కూడా బాధితుడు ఫిర్యాదు చేశాడు. పేకాటస్థావరంపై దాడిఖమ్మంక్రైం: పేకాట స్థావరంపై ఖమ్మం టూటౌన్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. బైపాస్రోడ్డులోని నూతన బస్టాండ్ సమీపంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచరం మేరకు టూటౌన్, టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. గుంటూరు చెందిన వ్యక్తితో పాటు ఖమ్మానికి ఆరుగురు పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి రూ.45 వేలు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిపై కేసు రఘునాథపాలెం: వ్యవసాయ భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా అడ్డుకున్న ముగ్గురిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని చింతగుర్తికిచెందిన రైతు భరత్ తన భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన అశోక్, అనిలా, వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు. -
అర్హత కోల్పోయాం.. న్యాయం చేయండి..
పాల్వంచ: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివినప్పటికీ నీట్ 2025–26 కౌన్సెలింగ్లో అర్హత కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ.. తెలంగాణలో పుట్టి పెరిగిన తాము పక్కనే ఆంధ్రాలో ఇంటర్ చదివామని, ఇటీవల ప్రభుత్వం జీఓ 33 తెచ్చి ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివిన వారికి ఇక్కడ సీట్లు కేటాయించబోమని ప్రకటించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎండీ పెరహన, హైమావతి, శివలక్ష్మి, ఎలమర్తి రవిబాబు, శ్రీనివాసరావు, రోహిణి, వషిత, అక్షయ్, మానస, నిమిషా, నోమిత తదితరులు పాల్గొన్నారు. -
ఓసీల్లోని నీటిని ఎత్తిపోయాలి
మణుగూరు టౌన్: వర్షాల వల్ల ఉపరితల గనుల్లోకి చేరే నీటిని వీలైనంత త్వరగా బయటకు ఎత్తిపోయాలని, బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలను నివారించాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన ఓఎన్జీసీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సునీల్కుమార్, జనరల్ మేనేజర్ ఎస్ఎస్ మాయల్ కిరణ్లతో కలిసి పగిడేరు జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ను సందర్శించారు. 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అవకాశాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి పీకేఓసీ–2లో వరద నీరు చేరిన ప్రదేశాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. నిలిచిన నీటిని బయటకు పంపే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జీఎంలు దుర్గం రాంచందర్, కనకయ్య, శ్రీనివాస్, ఇతర అధికారులు పంకజ్, రాజ్కుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్, వీరభద్రరావు, శ్రీనివాసచారి, కనకయ్య, బీఎస్ రావు, వీరభద్రుడు, సురేశ్, శ్రీనివాస్, దయాకర్, బబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు -
ఇల్లెందులో 120 ఏళ్ల భవనాలు
పురాతన కాలంలో డంగు సున్నంతో, 24 ఇంచుల గోడలతో భవనాల నిర్మాణం చేశారు. బలంగా ఉండేందుకు ఐరన్ దూలాల మీద స్లాబ్ నిర్మాణం చేసేవారు. అప్పటి ఇంజనీర్లంతా మన్నికకు ప్రాధాన్యత ఇచ్చారు. నూటికి నూరుశాతం నిధులు సక్రమంగా వినియోగిస్తే ఇప్పుడైనా మన్నిక కలిగిన భవనాలు నిర్మించవచ్చు. –రామకృష్ణ, డీఈ, పంచాయతీ రాజ్ విభాగంఇల్లెందు: సుమారు 120 ఏళ్ల క్రితం ఇల్లెందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాల అన్వేషణ జరిగింది. ఆ సమయంలో బ్రిటీష్ అధికారుల కోసం నిర్మించిన భవనాలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. నాటి ఇంజనీర్ల మేధస్సుతో నిర్మించిన కట్టడాల్లో ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇల్లెందు చెరువు నుంచి నీటిని ఫిల్టర్ బెడ్ వరకు మోటారు లేకుండా నేరుగా చెరువులోకి తరలించేందుకు సైఫన్ నిర్మాణం చేపట్టారు. అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఫిల్టర్ బెడ్ వరకు చెరువు నుంచి సుమారు 5 ఫీట్ల లోపల పైపులైన్ ఏర్పాటు చేసి చెరువులో ఓ సైఫన్తో అనుసంధానం చేశారు. సైఫన్ ద్వారా నీరు పైపులైన్లోకి చేరి ఫిల్టర్ బెడ్కు చేరేలా నిర్మించారు. నేటికీ ఆ సైఫన్ చెక్కు చెదరలేదు. నాడు రెవ. సీబీ వార్డ్ కోసం నిర్మించిన భవనంలో ప్రస్తుతం మిషన్ స్కూల్ కొనసాగుతోంది. నాడు ఏరియా కాలరీ మేనేజర్లు నివాసం ఉన్న భవనాల్లో సీఎస్ఐ చర్చి, కోర్టు, సింగరేణి సూపర్ బజార్ ఏర్పాటు చేశారు. మెయిన్రోడ్డు పాఠశాల, ఎంపీడీఓ ఆఫీస్, ఆర్అండ్బీ గెస్ట్హౌస్, పోస్టాఫీసు భవనాలు బ్రిటిష్ కాలంలోనే నిర్మించినవే. -
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ సరదాగా గడిపారు. 526 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.28,780 ఆదాయం లభించింది. 230 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్కు రూ.13,900 ఆదాయం లభించినట్లు నిర్వావహకులు తెలిపారు. కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేతపాల్వంచరూరల్: ఎగువ ప్రాంతాల నుంచి కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 1700 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్లోకి చేరుతుండగా, రెండు గేట్లు ఎత్తిఉంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూరిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ఆదివారం 405.50 అడుగులుగా నమోదైంది. -
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలోని జిమ్నాజియం హాల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి మహిళల ఖేలో ఇండియా వెయిట్లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం సతీమణి నందిని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. తొలుత జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం పలు కేటగిరిల్లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షు డు వి.శ్రుతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్య దర్శి కె.క్రిష్టోఫర్బాబుతోపాటు శివగణేశ్, దొంగల వినోద్కుమార్, హనుమంతరాజు, రవి, సుధాకర్, సీహెచ్ నాగరాజు, సిద్ధార్థనాగిరెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పోటీలకు రాష్ట్రంలోని నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్స్కూల్, ఖమ్మం,వరంగల్ తదితర జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. జూనియర్ బాలికల 44 కేజీల విభాగంలో సింధు, బి.గౌతమి, 48 కేజీల కేటగిరిలో శ్రీపాద శ్రీజ, ఎం.సహస్ర, బి.అలేఖ్య, 53 కేజీల కేటగిరిలో ఎ.ట్రోనీ, పి.అర్చన, వై.అంజలి, 58 కేజీల విభాగంలో ఎం. స్వాతి, జి.శ్రుతి, ఎ.వర్షిత, 63 కేజీల కేటగిరిలో టి.ఆర్చన, కె.స్వాతి, ఎం.గౌరీ, 69 కేజీల కేటగిరిలో వి.హరిత, బి.హరిణి, 77 కేజీల విభాగంలో బి.తో షిని, బింధుప్రియ, కీర్తన, 77 కేజీల పైకేటగిరిలో వి.సహస్ర, లిబికా, మహేశ్వరీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. -
ఇంటింటా ఓటీటీ!
కరకగూడెం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): ఒకప్పుడు వారాంతంలో కొత్త సినిమా విడుదలైతే థియేటర్లలోనే చూడాలన్న తపన. అందుకోసం క్యూ కట్టి టికెట్ సాధించడం ఓ అనుభవం! అయితే, కుటుంబాలతో సహా థియేటర్లకు వెళ్లడంలో ఇక్కట్లు, టికెట్లు, ఇతర ఖర్చుల భారం వెరసి గతమంతా జ్ఞాపకంగా మిగిలిపోయే పరిస్థితి ఎదురవుతోంది. ఇదే సమయాన థియేటర్లకు వెళ్లకుండానే అదే వినోదం మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్, స్మార్ట్ టీవీల్లోకి చేరింది. ఈ మార్పుకు కారణం ఓటీటీ ప్లాట్ఫాంలు. ఇన్నాళ్లు ప్రధాన నగరాలు, ఓ మోస్తరు పట్టణాలకే పరిమితమైన ఆండ్రాయిడ్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పల్లెలకు సైతం చేరడంతో.. వారికీ ఓటీటీలు అందుబాటులోకి వచ్చినట్లయింది. వినోద విప్లవానికి నాంది ఓటీటీ అనేది కేబుల్, డీటీహెచ్ వంటి వ్యవస్థలను దాటుకుని ఇంటర్నెట్ ద్వారా కంటెంట్ అందించే వేదిక. దీనినే ’వీడియో ఆన్ డిమాండ్’అని కూడా అంటారు. దీంతో సినిమా చూసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా.. ఏ పని చేస్తున్నా.. సినిమా చూస్తూ మధ్యలో ఆపేసి మళ్లీ కుదిరినప్పుడే చూడొచ్చు. ప్రపంచంలోని అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు, క్రీడలు, వార్తలు ఇలా అన్నీ ఒకరి సినిమా టికెట్ ధరతో కుటుంబమంతా చూసే అవకాశం దక్కడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆకర్షణగా ఒరిజినల్ కంటెంట్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా, ఆహా వంటి ఓటీటీ ప్లాట్ఫాంలు సొంతంగా వెబ్ సిరీస్లు, సినిమాలు రూపొందిస్తున్నాయి. కొత్త టాలెంట్, వినూత్న ఆలోచనలకు ఇవి వేదికగా నిలుస్తున్నాయి. అభిరుచి కలిగిన నిర్మాతలు, దర్శకులు తమ సృజనాత్మకతను చాటడానికి అవకాశం ఏర్పడుతోంది. హద్దుల్లేని వినోదం ఓటీటీల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అన్ని ప్రపంచ భాషల్లోనూ కంటెంట్ అందుబాటులో ఉంది. డబ్బింగ్, సబ్ టైటిళ్లతో ఫ్రెంచ్, స్పానిష్ సినిమాలు కూడా ఇంట్లోనే చూడగలుగుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనే కాక నిర్వహణ భారంతో థియేటర్లు మూతపడగా కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఈ ధోరణి కొనసాగుతూ ప్రేక్షకులకు వినోదం మరింత చేరువవుతోంది. కొన్ని పరిమితులు, సవాళ్లు కూడా.. ఓటీటీ వినోదానికి కొన్ని పరిమితులున్నాయనే చెప్పాలి. అధిక డేటా వినియోగం, ఇంటర్నెట్ నాణ్యత సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ప్రతీ ప్లాట్ఫాంకి సబ్్రస్కిప్షన్ తీసుకోవడం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయినా ఇలాంటి సమస్యలు ఓటీటీల వినోద ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే కొత్త ఆలోచనలు, ప్రతిభావంతులైన దర్శకులు, రచయితలకు అవకాశాలు చూపుతున్నాయి. ఓటీటీలు ఒక వరం అన్నిసార్లు థియేటర్లకు వెళ్లలేం. కానీ ఓటీటీలో నచ్చిన సినిమా కుదిరిన సమయంలో చూడొచ్చు. ఏ భాష అయినా తెలుగు వెర్షన్లో చూడగలుతున్నాం. ఒకసారి సబ్స్రైబ్ చేసుకుంటే ఎన్నో సినిమాలు చూసే అవకాశం ఉంది. – ఈసం దీపిక, పద్మాపురం కుటుంబమంతా ఆస్వాదించే అవకాశం ఓటీటీ వచ్చాక ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తున్నాం. నాకు పాత సినిమాలంటే చాలా ఇష్టం, ఓటీటీలు, యూట్యూబ్లో అన్నీ ఉంటున్నాయి. కుటుంబమంతా కలిసి గడిపే సమయం పెరిగింది. ఇది సంతోషాన్ని ఇస్తోంది. – కొత్తకొండ మురళి, కరకగూడెం ఔత్సాహికులకు అవకాశాల గని.. మారుమూల గ్రామానికి చెందిన నాకు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనేది కల. ఓటీటీ వేదికగా ఆ అవకాశం దక్కింది. ఇటీవల ’మోతెవరి లవ్ స్టోరీ’వెబ్ సిరీస్లో నటించా. ఓటీటీలు, ఇంటర్నెట్ ద్వారా నాలాంటి ఎందరికో అవకాశాలు లభిస్తున్నాయి. – తొలెం శ్రీనివాస్, నటుడు, పినపాక -
రెండు వాగులు.. ఆరు ప్రాణాలు!
ఆసిఫాబాద్/అశ్వారావుపేటరూరల్: వాగు నీరు ఆరుగురిని మింగేసింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి పనులకోసం వచ్చి ఇద్దరు ఏలూరు వాసులు గల్లంతయ్యారు. వివరాలు.. ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో పడి నలుగురు మృతిచెందారు. దాబా గ్రామానికి చెందిన మోర్లె నిర్మలాబాయి, ఆమె కుమారుడు గణేశ్, మరో ఇద్దరు బాలికలు వాడై మహేశ్వరి, ఆదె శశికళ శనివారం చికిలి వాగులో ఖాళీ యూరియా సంచులు కడిగేందుకు వెళ్లారు. నిర్మలాబాయి యూరియా సంచులు కడుగుతుండగా ఒక సంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న గణేశ్ ఆ సంచిని తెచ్చేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు అక్కడే ఉన్న బాలికలు శశికళ, మహేశ్వరి కూడా వాగులోకి దిగారు. వారుకూడా నీళ్లలో మునుగుతుండటం గమనించిన నిర్మలాబాయి రక్షించే ప్రయత్నంలో వారితో పాటే మునిగిపోయింది. గమనించిన నిర్మలాబాయి చిన్న కూతురు లలిత అరుస్తూ వెళ్లి చుట్టుపక్కల ఉన్న వారికి సమాచారం అందించింది. దీంతో వారంతా వాగులో గాలించగా నిర్మలబాయి (33), గణేశ్ (12), మహేశ్వరి (10), శశికళ (8) మృతదేహాలు లభ్యమయ్యాయి. సీఐ సత్యనారాయణ, ఎస్సైలు మహేందర్, మ«ధుకర్ ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. వాగులో కొట్టుకుపోయి కూలీల గల్లంతు.. వ్యవసాయ పనులు చేసేందుకు వచ్చిన కూలీల్లో ఇద్దరు వా గు ప్రవాహంలో గల్లంతయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావు పత్తి పొలంలో కలుపు తీసేందుకు కూలీలను మాట్లాడాడు. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడుకు చెందిన పాలడుగుల చెన్నమ్మ (60), పచ్చితల వరలక్ష్మి (55)తోపాటు మరో ఐదుగురు శనివారం వచ్చారు. అయితే, మధ్యాహ్న భోజనం తర్వాత భారీ వర్షం మొదలవడంతో కూలీలంతా ఇళ్లకు బయలుదేరారు. పొలానికి కొద్ది దూరంలోఉన్న అశ్వారావుపేట మండలం గోపన్నగూడెం–కన్నాయిగూడెం వాగు దాటుతున్నా రు. ఈ క్రమంలో ఎగువ నుంచి గుబ్బల మంగమ్మ వాగు, కొండవాగు ఉధృతంగా ప్రవహించడంతో కూలీలు ఒడ్డుకు పరుగులు తీశారు. వీరిలో వెనకాల ఉన్న చెన్నమ్మ, వరలక్ష్మి మాత్రం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. అశ్వారా వుపేట ఎస్సై యాయతీ రాజు, అగి్నమాపక శాఖ అధికారులతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలి వద్ద గాలించినా రాత్రి వరకు కూలీల ఆచూకీ లభ్యం కాలేదు. -
‘ప్రీ ప్రైమరీ’ని అంగన్వాడీల్లోనే కొనసాగించాలి
చర్ల: ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా నాలుగో మహాసభ శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐసీడీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రీ ప్రైమరీ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖలో విలీనం చేయడం సరికాదని అన్నారు. ఫేస్ క్యాప్చర్ యాప్ రద్దు చేసి, అంగన్వాడీ టీచర్లకు 5జీ మొబైల్ ఫోన్లను అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, యూనియన్ జిల్లా కార్యదర్శి జి.పద్మ, అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, ఉపాధ్యక్షురాలు పాయం రాధాకుమారి, నాయకులు ఎం.విజయశీల, శకుంతల, వీరభద్రమ్మ, స్వరూప, కళావతి, రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, భాను, జయసుధ కమలాదేవి గజలక్ష్మి, జానకి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి -
ఎట్టకేలకు ‘మత్స్య’ టెండర్లు..
పాల్వంచరూరల్: జిల్లాలో ఉచిత చేప పిల్లల(సీడ్) పంపిణీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 2025–2026 సంవత్సరానికి టెండర్ ప్రక్రియ రెండు రోజుల క్రితం ముగిసింది. మూడుసార్లు ఆన్లైన్లో టెండర్లు నిర్వహించినా ఒక్కరూ పాల్గొనలేదు. శుక్రవారం చివరిసారిగా నిర్వహించిన ప్రక్రియలో నలుగురు టెండర్లు దాఖలు చేశారు. ఆంధ్రాకు చెందిన ఇద్దరు, జిల్లా నుంచి మరో ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ప్రక్రియ పూర్తిచేసి ఈ నెలాఖరులోగా జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కోటి 20 లక్షల చేప పిల్లల పంపిణీ ఈ ఏడాది జిల్లాలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో కోటి 20 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 550 చెరువుల్లో చేప పిల్లలను పోయాలని ప్రణాళిక రూపొందించింది. ఈసారి చిన్న చెరువులు, కుంటల్లో చేప పిల్లల పెంపకం చేపట్టొద్దని మత్స్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చేపపిల్లలను చెరువుల్లో పోసే సీజన్ ప్రారంభమైందని, పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాగా గతేడాది కూడా ఆలస్యంగా, అది కూడా 86 లక్షల చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో చేపల పెంపకానికి 734 చెరువులు, కుంటలు ఉండగా, 70 మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఉన్నాయి. ఇందులో 3,248 మంది సభ్యులు ఉన్నారు. 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక కిన్నెరసానిలోని మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో అధికారులు ముందుగానే గుడ్లను(స్పాన్) పోశారు. రెండు నెలలపాటు పెంచాక గిరిజన మత్స్యకార సొసైటీలకు 20 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. రేపు అదనపు కలెక్టర్ సమక్షంలో పరిశీలన ఆన్లైన్ టెండర్లు నిర్వహించగా నలుగురు బిడ్లు దాఖలు చేశారు. ఫారాలను అదనపు కలెక్టర్ సమక్షంలో సోమవారం పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం ఉంటే మత్స్యశాఖ కమిషనర్కు పంపి, ఆమోదం పొందుతాం. తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు టెండర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. –ఎండీ ఇంతియాజ్ అహ్మద్ఖాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
కేటీపీఎస్ సొసైటీ ప్రెసిడెంట్గా కేశులాల్
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్గా నూనావత్ కేశులాల్ నాయక్, జనరల్ సెక్రటరీగా సిద్ది ప్రశాంత్, ట్రెజరర్గా వీరమల్లు రఘుకృష్ణ, వైస్ ప్రెసిడెంట్గా వల్లమల్ల ప్రకాష్లను ఎన్నుకున్నారు. నాలుగు పోస్టులకూ పోటీ ఏర్పడటంతో ఏకగ్రీవం చేసేందుకు తొలుత ప్రయత్నించారు. పోటీ అనివార్యం కావడంతో శనివారం ఉదయం ఎన్నికల అధికారి గంగాధర్, డీఎస్ఓ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా, నూతనంగా ఎన్నికై న 13 మంది డైరెక్టర్లు ఓట్లు వేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నూనావత్ కేశులాల్ నాయక్కు 9 ఓట్లు, దానం నర్సింహారావుకు 4 ఓట్లు వచ్చాయి. సెక్రటరీ పదవికి పోటీ చేసిన సిద్ది ప్రశాంత్కు 10 ఓట్లు, డోలీ శ్రీనివాసరావు 3 ఓట్లు, ట్రెజరర్గా పోటీ చేసిన వీరమల్ల రఘుకృష్ణకు 9, బుద్దార్ధి మహేందర్కు 4, వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన వల్లమల్ల ప్రకాష్కు 9, ధర్మరాజుల నాగేశ్వరరావుకు 4 ఓట్లు వచ్చాయి. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులు కేశులాల్ నాయక్, సిద్ది ప్రశాంత్లు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నుకున్న డైరెక్టర్లు -
ట్రెండింగ్లో నానో బనానా!
● నెటిజన్లను ఆకట్టుకుంటున్న త్రీ డీ చిత్రాలు ● సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఫొటోలు చుంచుపల్లి: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గూగుల్ రోజురోజూకూ సరికొత్త ఆలోచనలకు తెరలేపుతోంది. గూగుల్ జెమిని పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్ను విడుదల చేసింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తోంది. జెమిని 1.0 వెర్షన్ను ఇప్పటికే పలు వేరియంట్లలో తీసుకొచ్చారు. జెమిని అల్ట్రా, జెమినీ ప్రో, జెమిని నానో బనానా 3డీ ఏఐ వంటి డివైజ్ల వరకు అన్నింట్లో పనిచేస్తుంది. వీటి ద్వారా ఇప్పటికే పరిశోధనా పత్రాల్లో గ్రాఫ్లు, గణాంకాలను రూపొందిస్తున్నారు. విద్యార్థుల హోంవర్క్లోనూ జెమినీ టూల్స్ సాయపడుతున్నాయి. కాగా గూగుల్ జెమిని యాప్నకు నానో బనానా సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్స్ను తాజాగా విడుదల చేసింది. ఇందులోని నానో బనానా 3డీ ఫొటో ఎడిటింగ్ టూల్తో అదిరిపోయే త్రీడీ ఫొటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తమ త్రీడీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మురిసిపోతున్నారు. ఈ ఫొటోలకు నెటిజన్లను బాగా ఆకర్షితులవుతున్నారు. క్షణాల్లో త్రీడీ ఫొటో.. ప్రస్తుతం నానో బనానా ట్రెండ్ నడుస్తోంది. సెకన్ల వ్యవధిలో అద్భుతమైన 3డీ ఫొటోలను క్రియేట్ చేసుకోవచ్చు. తొలుత గూగుల్ జెమిని వెబ్సైట్/ యాప్ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ట్రై నానో బనానా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు + అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కావాల్సిన ఫొటోను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇంగ్లిష్లో క్రియేట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ప్రకారం 3డీ ఇమేజ్ సిద్ధమవుతుంది. ఆ ఫొటోను డౌన్లోడ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఫొటోను అప్లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించాలని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్–సెల్ఫ్ లుక్తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్లలో ఇది ఒకటి. యాక్షన్ ఫిగర్, వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా ఫొటోలను సృష్టించుకోవచ్చు. నచ్చిన ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా ఫొటో క్రియేట్ చేసుకోవచ్చు. ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఇప్పటివరకు 200 మిలియన్ల మంది జెమిని టూల్ ద్వారా 3డీ ఫోటోలు క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు నచ్చిన ఫొటోలను రూపొందించుకుంటూ ఆనందపడుతున్నారు. నానో బనానా 3డీ యాప్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. నేను కూడా అప్లోడ్ త్రీడీ చిత్రాలను రూపొందించుకున్నాను. సోషల్ మీడియా పోస్టు చేయడంతో బాగున్నాయని మిత్రులు అభినందించారు. –చింతల చిరంజీవి, కొత్తగూడెం ప్రస్తుతం జెమిని ఏఐ నానో బనానా 3డీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన ఫొటోలను రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ 3డీ చిత్రాలు ఊపేస్తున్నాయి. –మనోజ్కుమార్ -
గిరిజన విద్యార్థికి ఆర్థికసాయం
భద్రాచలంటౌన్: ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీలో సీటు సాధించిన పాయం కాంతారావుకు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శనివారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. దుమ్ముగూడెం మండలం తాటివారిగూడెం గ్రామానికి చెందిన పాయం కాంతారావుకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకంగా రూ.30 వేలు అందించామని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపకుండా నెలకు కొంత ఆర్థిక వెసులుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు వర్క్ షాప్ దమ్మపేట: మండలంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో దమ్మపేటలోని బోటనీ బాలాజీ ప్రైవేట్ స్కూల్లో ట్రైనింగ్ వర్క్ షాపును శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లయన్స్క్లబ్ ప్రోగ్రామర్ కొండపల్లి రేణుక హాజరై మాట్లాడారు. పాఠ్యాంశాల బోధనలో అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. శిక్షణకు సంబంధించిన మెటిరీయల్ను అందజేశారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ బాధ్యులు లక్కినేని నరేంద్రబాబు, అంకత మహేశ్వరరావు, వేణు, కోటగిరి మోహన్రావు, సూర్యారావు, చలపతి, అమృతవల్లి తదితరులు పాల్గొన్నారు. సీతారాం ఏచూరికి నివాళి ములకలపల్లి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య అన్నారు. పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సాయుధ తెలంగాణ పోరాట వారోత్సవాల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తొలుత కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలోత్ రావూజా, గౌరి నాగేశ్వరరావు, నిమ్మల మధు, పాయం అమల తదితరులు పాల్టొన్నారు. జామాయిల్ చెట్లు నరికివేత టేకులపల్లి: సింగరేణి ఆధ్వర్యంలో టేకులపల్లి నుంచి పెట్రాంచెలక స్టేజీ వరకు పదేళ్ల క్రితం జామాయిల్ చెట్లను నాటారు. తుమ్మలచెలక స్టేజీలో కరెంటు తీగలకు అడ్డు వస్తున్నాయంటూ శుక్రవారం స్థానికులు కొందరు జామాయిల్ చెట్లను నరికివేశారు. ఆ కలపను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. రోజూ అదే మార్గంలో రాకపోకలు సాగించే సింగరేణి, ఫారెస్టు అధికారులు మాత్రం చెట్లు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవడంలేదు. ములకలపల్లిలో..ములకలపల్లి: మండల పరిధిలోని రామాంజనేయపురం గ్రామ శివారు సీతారామ ప్రాజెక్ట్ కాలువ సమీపంలో సుమారు పది జామాయిల్ చెట్లను శనివారం రాత్రి అక్రమంగా నరికివేశారు. కలపను ట్రాక్టర్లో తరలించేందుకు సమాయత్తమయ్యారు. స్థానికుల ద్వారా సమాచారంతో పరిశీలించేందుకు మీడియా వెళ్లగా గమనించిన అక్రమార్కులు ఉడాయించారు. ఈవిషయమై టీఎస్ఎఫ్డీసీ ప్లాంటేషన్ మేనేజర్ పీఎం సైదానాయక్ను వివరణ కోరగా.. దుంగలు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నామని, డిపోకు తరలిస్తామని తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచింతకాని: మండలంలోని నాగిలిగొండకు చెందిన ఉచ్చర్ల కల్యాణ్(31) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈనెల 11న పురుగుల మందు తాగాడు. దీంతో ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై ఆయన తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. కాగా, కల్యాణ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఈనెల 16 నుంచి ‘యాత్రాదానం’
● దాతలు కోరుకున్న రోజుల్లో బస్సుల ఏర్పాటు ● ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సరిరాం ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక రోజుల్లోఅనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళ్లేళా టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరిట కార్యక్రమాన్ని రూపొందించిందని ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తాము కోరుకున్న రోజుల్లో పర్యటనకు తీసుకెళ్లేలా విరాళం అందజేయొచ్చని తెలిపారు. విరాళం ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు సమకూరుస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం సమీప ఆర్టీసీ డిపోల్లో సంప్రదించాలని ఆర్ఎం సూచించారు.దూరం ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్లగ్జరీ రాజధాని (కి.మీల్లో.) (రూ.ల్లో) 0–200 26,707 32,587 29,752 43,507 201–300 32,587 32,587 29,752 43,507 301–400 38,782 38,782 35,002 43,507 401–500 44,977 44,977 40,252 50,962 -
ఖమ్మం.. సాహిత్య గుమ్మం
ఖమ్మంగాంధీచౌక్: ఆధునిక సాహిత్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఖమ్మం కేంద్రంగా నిలుస్తోందని కవి, విమర్శకులు, మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో కవి వంశీకృష్ణ తల్లి తాటికొండల భ్రమరాంబ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఈ పురస్కారాన్ని నరసింహారెడ్డికి అందజేయగా ఆయన మాట్లాడారు. భక్త రామదాసు, ప్రముఖ భాషావేత్తలు నడియాడిన నేలపై సాహిత్య పురస్కారం అందుకోవడం తనకు ప్రత్యేకమని తెలిపారు. అనంతరం రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి, కుటుంబీకులు రాసిన భ్రమరాంబ స్మృతి గీతాల సంపుటి ‘నెనరు–నెమరు’ను ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కవి, సంపాదకులు ఆనందాచారి మాట్లాడగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహామండలి సభ్యులు ప్రసేన్తో పాటు మువ్వా జయశ్రీ, వంశీకృష్ణ, సీతారాం, రవిమారుత్, ఇబ్రహీం, నిర్గుణ్, సుభాషిణి, నీలిమ, వీఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. ‘నెనరు–నెమరు’ సంపుటి ఆవిష్కరణలో వక్తలు -
సొంతింటి పథకానికే కార్మికుల మొగ్గు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 11,12 తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. శనివారం యూనియన్ బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం ఏరియాలోని వివిధ డిపార్ట్మెంట్లలో ఓటింగ్ నిర్వహించగా 2,575 మంది ఓటేశారని తెలిపారు. వారిలో 2,651 మంది సొంతింటి కోసమే ఓటువేశారని, 11 ఓట్లు క్వార్టర్లు కావాలని వేశారని, 3 ఓట్లు చెల్లలేదని వివరించారు. కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి బ్యాలెట్ ఓటింగ్కు ఆటంకం కల్పించేందుకు కుట్రలు పన్నారని, యాజమాన్యంతో కూడా ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. కార్మికుల అభిప్రాయం ప్రకారం యాజమాన్యం స్పందించి సొంతింటి పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.రాజారావు, వై.వెంకటేశ్వర్లు, భూక్య రమేష్, లిక్కి బాలరాజు, గడల నరసింహారావు, లక్ష్మణరావు, ఎల్లగొండ రామ్మూర్తి, కార్తీక్, సామర్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్లో వెల్లడి -
ప్రైవేటు పాఠశాల ఎదుట మృతదేహంతో ధర్నా
భద్రాచలంటౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపిస్తూ శనివారం కుటుంబ సభ్యులు, కుల, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సరిహద్దు ఏపీలోని ఎటపాక గ్రామానికి చెందిన నాగమోహనాచారి–సరిత దంపతుల కుమారుడు లోకేష్ శనివారం పాఠశాలకు వచ్చి ఆడుకుంటూ కింద పడిపోయాడు. దీంతో పాఠశాల సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. సీఐ నాగరాజు పాఠశాలకు వద్దకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణ -
ప్రజల కోసం పోరాడిన సురవరం
● సుధాకర్రెడ్డి మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు ● సంస్మరణ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిఖమ్మంమయూరిసెంటర్: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల కోసం పోరాడిన నికార్సయిన కమ్యూనిస్టు సురవరం సుధాకర్రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇటీవల మృతి చెందిన సురవరం సంస్మరణ సభ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం నిర్వహించగా ఆయన చిత్రపటం వద్ద వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజాఉద్యమ గొంతుకగా సురవరం పనిచేశారని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాక పేద ప్రజలకు తీరని లోటన్నారు. కాగా, మతం, సైన్స్కు ప్రాంతీయ భేదం లేనట్లే కమ్యూనిజానికి సైతం ప్రాంతీయత లేదన్నారు. కమ్యూనిజం విడిపోయి బలహీనపడినా మళ్లీ ఐక్యతతో బలపడతామని తెలిపారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే సుధాకర్రెడ్డి లాంటి అమరులకు ఇచ్చే నివాళి అని చెప్కాపరు. కాగా, వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాన్ని నేటి తరానికి వివరిస్తూ బలమైన ప్రజాఉద్యమ నిర్మాణాల కోసం డిసెంబర్ 26న ఖమ్మంలో శత వసంత ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పోరాటాలను నడిపిన సురవరం ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డాక్టర్ రవీంద్రనాథ్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవునూరి మధు, నున్నా నాగేశ్వరరావు, మహ్మద్ మౌలానా, కె.రాంనారాయణ, ఆకుతోట ఆదినారాయణ, జమ్ముల జితేందర్రెడ్డి, స్పర్శ భాస్కర్, రవిమారుత్, పోట్ల మాధవరావు, డాక్టర్ వై.ప్రసాద్, వడ్డె నారాయణరావు, యర్రా బాబు, జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, క్లెమెంట్, మహ్మద్ సలాం, పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్కు విశేష స్పందన
కొత్తగూడెంటౌన్: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా 11 కోర్టుల పరిధిలో దాదాపుగా 4576 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యా యి. కొత్తగూడెం కోర్టులో సివిల్ కేసులు 32, క్రిమి నల్ కేసులు 2,023, పీఎల్సీ కేసులు 278, మో టార్వాహన ప్రమాద కేసులు 24, మొత్తం 2,333 కేసులకు పరిష్కారం లభించింది. వాహన ప్రమాద కేసుల్లో రూ.1.82కోట్ల పరిహారం బాధితులకు లభించింది. ఇల్లెందు సివిల్ కేసులు 12, క్రిమినల్ కేసులు 363, పీఎల్సీ కేసులు 132, భద్రాచలంలో క్రిమినల్ కేసులు 1,106, పీఎల్సీ కేసులు 74, మణుగూరులో క్రిమినల్ కేసులు 489, పీఎల్సీ కేసులు 67 పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యా యమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ పలు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకున్నారని, కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. చిన్న తగాదాలను లోక్అదాలత్లో పరిష్కరించుకుని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూ చించారు. అదాలత్కు వచ్చిన కక్షిదారులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో పులిహోర, తాగునీరు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, న్యాయమూర్తులు కే.సాయిశ్రీ, బి. రవికుమార్, వినయ్కుమార్, పీవీడీ లక్ష్మి, గోపికృష్ణ, భాగం మాధవరావు, వి.పురుషోత్తమరావు, నిరంజన్రావు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏదీ సన్నద్ధత..?
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరిశోధనాత్మక విద్యలో వెనుకబడుతున్నారు. ఇన్స్పైర్, సైన్స్ఫేర్లకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన జిల్లా సైన్స్ ఆఫీసర్ (డీఎస్ఓ) పోస్టును భర్తీ చేయడంలో విద్యాశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. విద్యార్థి దశలోనే టెక్నాలజీ రంగంలో మొబైల్స్, ఇంటర్నెట్, మెడిసిన్, పర్యావరణం, వాయు కాలుష్యం, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. నూతన ఆవిష్కరణలతో సైన్స్ పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఇందుకు జిల్లా సైన్స్ ఆఫీసర్ దిశానిర్దేశం చేయాల్సి ఉంది. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జిల్లా సైన్స్ ఆఫీసర్ పోస్టు ఖాళీగానే ఉంది. భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినా పైరవీలు ఎక్కువ కావడంతో నియామకాన్ని నిలిపివేశారు. కొరవడిన పర్యవేక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ నుంచి సైన్స్ పోటీలు, అవగాహన కార్యక్రమాలపై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఎన్జీసీ ఆధ్వర్యంలో సైన్స్ యాక్టివిటిలు, క్విజ్ పోటీలు నిర్వహించగా, జిల్లా నుంచి కొద్ది మంది విద్యార్థులే పాల్గొన్నారు. వారు కూడా చివరి స్థానంలో నిలిచారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్ఫేర్ ఇన్స్పైర్ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. ఆ పోటీలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, దరఖాస్తులు చేయించాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులను సిద్ధం చేయాలి. గతేడాది ఎంపికై న ఇన్స్ఫైర్ పోటీల్లో ఎంపికై న 113 ప్రాజెక్టులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సైన్స్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం పాఠశాలలో ఇవేమీ జరగడంలేదు. -
ఎంఆర్ఐ అందుబాటులో లేక..
పాల్వంచ: రాష్ట్రంలోనే అతిపెద్ద, గిరిజన ప్రాంతమైన జిల్లాలో ఎంఆర్ఐ(మ్యాగ్నటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్), ఎంఆర్ఏ(మ్యాగ్నటిక్ రెజొనెన్స్ యాంజియోగ్రఫీ) స్కానింగ్లు అందుబాటులో లేవు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే పరిస్థితి ఉండటంలేదు. ఎంఆర్ఐ కోసం ఖమ్మం వెళ్లాల్సివస్తోంది. దీనివల్ల భారీ ఖర్చు కూడా పెరుగుతోంది. ఒక్కో స్కానింగ్కు కనీసం రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతోంది. దీంతో బాధితులపై భారం పడుతోంది. ఎంఆర్ఐ, ఎంఆర్ఏ స్కానింగ్ మిషన్లు లేక జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీని ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రైవేటులో కూడా ఒకే మిషన్ అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఖమ్మం వెళుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేస్తాం. –డాక్టర్ రవిబాబు, డీసీహెచ్ఎస్జిల్లా సుమారు 7,483 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, 2011 జానాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1,069,261 ఉంది. ప్రస్తుతం ఇంకా పెరిగింది. ఆంధ్రా ఒడిశా, ఛత్తీస్గఢ్ సరి హద్దులుగా ఉండటంతో ప్రధాన రహదారులపై వాహన రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల శాతం కూడా అధికంగానే ఉంటోంది. తీవ్రంగా గాయపడినా, శరీరంలో అనారోగ్య సమస్య వచ్చినా ఎంఆర్ఐ, ఎంఆర్ఏ స్కానింగ్ రిపోర్ట్ల ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తుంటారు. జిల్లావ్యాప్తంగా కేవలం కొత్తగూడెంలోనే ప్రైవేట్ లాబ్లో ఒకే ఒక్క మిషన్ అందుబాటులో ఉంది. జిల్లాలోని వైద్యులంతా స్కానింగ్ కోసం బాధితులను అక్కడికే పంపిస్తున్నారు. మిషన్ ఖరీ దు సుమారు రూ.6కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొందరు వైద్యులు కమీషన్ల కోసం ఎంఆర్ఐ, ఎంఆర్ఏ స్కానింగ్లు రాస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకే మిషన్ ఉండటంతో నిర్వాహకులు కూడా అధిక మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. భారీఖర్చుతో కూడినది కావడంతో ఆర్థిక స్తోమత లేనివారు ఎంఆర్ఐ తీసుకోవడం ఇబ్బందిగా మారింది. జిల్లా ప్రధానాస్పత్రిలో ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, బూర్గంపాడులలో సీహెచ్సీలు ఉండగా, కనీసం జిల్లా ప్రధానాస్పత్రిలోనైనా ఎంఆర్ఐ, ఎంఆర్ఏ స్కా నింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురా వాలని ప్రజలు కోరుతున్నారు. -
కుండపోత వర్షం.. పోటెత్తిన వరద
● దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరులలో భారీ వర్షం ● లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి చేరిన వర్షపునీరు ● పలుచోట్ల రహదారులు మునిగి రాకపోకలకు అంతరాయంఅశ్వారావుపేటరూరల్/దమ్మపేట/మణుగూరుటౌన్: జిల్లాలో శనివారం పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. అశ్వారావుపేట, దమ్మపేట, మణుగూరు మండలాల్లో కుండపోత వాన పడింది. చెరువులు, నీటి కుంటలు నిండి వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి, దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది. దమ్మపేట ప్రధాన రహదారిని వరద నీరు ముంచెత్తగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం గ్రామాన్ని వరద పోటెత్తింది. గ్రామంలోని ప్రధాన, అంతర్గత రోడ్లు జలమయంగా మారాయి. వాగొడ్డుగూడెం–అశ్వారావుపేట మార్గంలోని లోలెవల్ చప్టా మునిగిపోయింది. మద్దికొండ–కేశప్పగూడెం మధ్యలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అనంతారం, నారాయణపురం, ఖమ్మంపాడు ప్రాంతాల్లో పెదవాగు ఉధృతంగా ప్రహిస్తోంది. కుండపోత వర్షంతో కట్టువాగు, మొట్లవాగు ఉధృతంగా ప్రవహించగా మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో సురక్షా బస్టాండ్ వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ వరద నీటి మళ్లింపు చర్యలు చేపట్టారు. సీఐ నాగబాబు, ఎస్ఐ రంజిత్ ట్రాఫిక్ను మళ్లించారు. సింగరేణి ఓసీ–4 గనిలో బొగ్గు, ఓబీ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
కొత్త రైళ్ల జాడేది..?
తొమ్మిది నెలలుగా నడవని బెళగావి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు ఉదయం వేళ కాకతీయ, రాత్రి సమయంలో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు కరోనాకు ముందు మణుగూరు నుంచి కొల్హాపూర్ వరకు రైలు నడిచింది. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో బయల్దేరి వెళ్లేది. సికింద్రాబాద్ – బేగంపేట – లింగంపల్లిల మీదుగా కొల్హాపూర్ వరకు నడవడంతో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండేది. పశ్చిమ హైదరాబాద్లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సౌకర్యంగా ఉండేది. కరోనా సమయంలో ఈ రైలును రద్దు చేశారు. ఆ రైలు స్థానంలో 2022లో మణుగూరు – బెళగావి రైలు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ–కాజీపేట మార్గంలో జరుగుతున్న మూడో లైను నిర్మాణ పనుల కారణంగా బెళగావిని ప్రతీ మూడు నాలుగు నెలలకోసారి రద్దుచేసేవారు. చివరగా 2024 డిసెంబరు 18న రైలును రద్దు చేయగా, ఆ తర్వాత మళ్లీ రైలును ప్రారంభించే అంశంపై రైల్వేశాఖ పెదవి విప్పడం లేదు. మరోవైపు మూడో లైను నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సాయంత్రం రైళ్లేవి జిల్లా కేంద్రం నుంచి ఉదయం 5 గంటలకు కాకతీయ, 6 గంటలకు సింగరేణి, మధ్యాహ్నం 1:45 గంటలకు విజయవాడ ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. రాత్రి వేళ 10:45 గంటలకు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. సాయంత్రం సమయంలో ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. గతంలో బెళగావి ట్రైన్ అందుబాటులో ఉండేది. వివిధ పనుల మీద కొత్తగూడెం వచ్చే సింగరేణి కార్మికులు సైతం ఈ రైలు ద్వారా వరంగల్/కాజీపేటకు చేరుకుని అక్కడి నుంచి మరోరైలు ద్వారా మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. బెళగావిని తిరిగి ప్రారంభించకపోవడంతో ఇటు హైదరాబాద్, అటు కోల్బెల్ట్ ఏరియాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. కరోనాకు ముందు నడిచిన మణుగూరు–కాజీపేట ప్యాసింజర్ రైలు పగటి వేళ వరంగల్ – కొత్తగూడెం మధ్య రాకపోకలు సాగించేవారికి ఉపయుక్తంగా ఉండేది. ఐదేళ్ల క్రితం దీన్ని రద్దు చేసిన రైల్వే శాఖ తిరిగి ప్రారంభించే ఊసే ఎత్తడం లేదు. డోర్నకల్ – భద్రాచలంరోడ్ ప్యాసింజర్ది ఇదే పరిస్థితి. డిమాండ్లకే పరిమితం భద్రాచలంరోడ్ – పెద్దపల్లి– నిజామాబాద్ మీదుగా షిరిడీకి రైలు నడిపించాలనే డిమాండ్తో ఇచ్చిన వందలాది అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. భద్రాచలంరోడ్/మణుగూరుల నుంచి తిరుపతి వరకు రైలు నడిపించాలనే డిమాండ్ సైతం ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడం లేదు. కనీసం డోర్నకల్ మీదుగా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లకు భద్రాచలంరోడ్/మణుగూరుల నుంచి కనీసం ఐదారు స్లీపర్ కోచ్లను పంపే అంశాన్ని కూడా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల సందర్భంగా వందలాది ప్రత్యేక ట్రైన్స్ను ప్రకటించే రైల్వేశాఖ ఏర్పాటు చేస్తున్నా అందులో ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించడం లేదు. ఆఖరికి ముక్కోటి, శ్రీరామనవమి వంటి పర్వదినాలప్పుడు భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా రైళ్లను నడిపించడంపై కొన్నేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూ వస్తోంది. సింగరేణి బొగ్గు రవాణా చేసేందుకు రోజూ జిల్లా మీదుగా 14కు తగ్గకుండా మాల్గాడీలు (గూడ్సు రైళ్లు) నడుస్తున్నాయి. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రైల్వేకు దక్కుతోంది. ఇదే సమయంలో మాల్గాడీల్లో కనీసం సగం సంఖ్యలో అయినా ఇక్కడి ప్రజల అవసరాలకు తగినట్లు రైళ్లను నడిపించడం లేదు. రైల్వేశాఖ మొక్కుబడిగా నాలుగు రైళ్లతోనే నాలుగైదేళ్లుగా సరిపెడుతోంది. ఈ అంశంపై ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్లు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం రద్దయిన బండ్లను పునఃప్రారంభించని రైల్వే శాఖ -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాక ప్రజలను చైతన్యవంతులను చేసేలా పత్రికలు వ్యవహరిస్తాయి. అలాంటి పత్రికల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలన్నా... ప్రజలకు ఏమేం వసతులు కావాలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంలో పత్రికలు కీలకంగా నిలుస్తాయి. కానీ ఏపీలో ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్జి, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు. – ఎస్.విజయ్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
కదలని దస్త్రం!
మంత్రులు దృష్టిసారించినాభద్రాచలం: గోదావరి కరకట్టలో భాగంగా చేపట్టిన క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు ముందుకు పడటం లేదు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కరకట్ట నిర్మాణం దాదాపుగా పూర్తయినా జాతీ య రహదారిపై క్రాసింగ్ బ్రిడ్జి పెండింగ్లో పడిపోయింది. గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణగా 2000 సంవత్సరంలో కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల మేర పనులు అప్పుడు ఆగిపోయాయి. ఆ పనులను రూ. 38 కోట్లతో పూర్తి చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు చేపట్టింది. 2024 జూన్ నాటికి పనులు పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటివరకు మట్టి, రిటైనింగ్, ఇతర పనులు పూర్తయ్యా యి. కరకట్టలో నిర్మాణంలో భాగంగా విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై తలపెట్టిన ఓవర్ క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణంలో మాత్రం కదలిక లేదు. సీడీఓ అనుమతుల్లో జాప్యం నిర్మాణ పనుల బాధ్యత తీసుకున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బ్రిడ్జి డిజైన్ను రూపొందించి అనుమతి కోసం హైదరాబాద్లోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ)కు పంపించింది. రెండు నెలలు గడిచినా అక్కడి నుంచి అనుమతి రాలేదు. సీడీఓ సూచనల ప్రకారం పలుమార్లు డిజైన్లో మార్పులు చేశారు. మళ్లీ ఇటీవల కరకట్ట రిటైనింగ్ వాల్, ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ సీడీఓ అధికారులు సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో బ్రిడ్జి కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో డిజైన్ ఫైనల్ కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇలాంటి పనులను తగిన బడ్జెట్ను అందచేస్తే ఆయా శాఖలే పూర్తి చేస్తాయి. తమదికాని నిర్మాణాలను ఒప్పుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు పనులు పూర్తి చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఓవర్ క్రాసింగ్ బ్రిడ్జి, కరకట్ట, అప్రోచ్ రోడ్డులకు సంబంధించి డిజైన్ సీడీఓకు పంపించాం. వారి సూచనల ప్రకారం చేర్పులు, మార్పులతో నూతన డిజైన్ రూపొందిస్తాం. వీలైనంత తొందరగా పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. – సయ్యద్ అహ్మద్ జానీ, ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం డివిజన్బ్రిడ్జి డిజైన్ను సీడీఓ ఆమోదించాక ఆర్అండ్బీ, నేషనల్ హైవే శాఖలు ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత దస్త్రం ప్రభుత్వం వద్దకు పంపితే నిధులు కేటాయిస్తుంది. గతంలో కరకట్టకు రూ.38 కోట్లు విడుదల చేయగా, ప్రస్తుతం ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇప్పటికే పలుమార్లు కరకట్టను పరిశీలించారు. అయినా క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణంలో కదలికలేదు. ఇప్పటికై నా దృష్టి సారించి త్వరితగతిన ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ప్రజలు కోరుతున్నారు. -
దాడులు నిలిపేయాలి
సమాజ శ్రేయస్సు, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఏపీలో ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో మూలస్తంభంగా వ్యవహరించే పత్రికా రంగంపై దాడులను నిలిపేయాలి. ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై నమోదుచేసిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. – మోదుగు వేలాద్రి, టీజీవోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి -
●పాఠశాలలో ‘తెర’గతి గది
మండలంలోని మారుమూల కొత్త కావడిగుండ్ల గ్రామంలో ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయినులు విధులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 30 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల భనవంలో ఒకే తరగతి గది ఉండగా, అందులో ఐదు తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో ఉపాధ్యాయులు వరండాకు గ్రీన్ షీట్ను ఏర్పాటు చేసి మరో తరగతి గదిని ఏర్పాటు చేసుకుని పాఠాలు బోధిస్తున్నారు. – అశ్వారావుపేటరూరల్ -
గొంతు నొక్కేయడం కక్షే..
పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేయడం సరికాదు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం, అక్కడ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ప్రజల పక్షాన నిలిచే వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. – సింగం జనార్ధన్, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్, ఖమ్మం -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు
ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరించేలా తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పుపడుతున్నారు. ‘సాక్షి’ తెలుగు దినపత్రికకు చెందిన పలు ఎడిషన్ కేంద్రాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇక ప్రభుత్వం హామీల అమలులో చేస్తున్న జాప్యంపై ప్రజల పక్షాన వార్తల ప్రచురిస్తే మాత్రం కేసులు నమోదు చేసి సాక్షి కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తాజాగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను అక్కడి ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునేలా చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడ్డారు. – ఖమ్మం సహకారనగర్ / ఖమ్మం లీగల్ -
పోడు భూములకు పట్టాలివ్వాలి
బూర్గంపాడు/భద్రాచలంటౌన్: అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలని, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ నుంచి భద్రాచలం ఐటీడీఏ వరకు సుమారు 10 కిలోమీటర్ల శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పత్తి పంటలను ధ్వంసం చేయడం, గిరిజన రైతులపై అటవీ అధికారులు దాడులు చేయడం మానుకోవాలని కోరారు. బూర్గంపాడు మండలంలో 2005 కంటే ముందు నుంచే గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇంకా 90 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలి ఇవ్వాల్సి ఉందని అన్నారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి సున్నం రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, రావులపల్లి రవికుమార్, మువ్వా వెంకటేశ్వర్లు, నరెడ్డి వుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, ఈనంశెట్టి పూర్ణచంద్ర రావు, పేరాల శ్రీనివాస్, జంగం మోహన్ రావు, శ్రీనివాస్, సాధనపల్లి సతీష్, అలవాల సీతారామ రెడ్డి, సోందె కుటుంబ రావు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారి కి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారి కి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపా రు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యక పూజలు చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. జూలూరుపాడు మార్కెట్కు రూ.3 కోట్లుజూలూరుపాడు: జూలూరుపాడు వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి రూ.3.03 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర మార్కెటింగ్శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. శుక్రవారం మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్తో కలిసి ఆయన జూలూరుపాడు శాశ్వత వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి కేటా యించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 25న టెండర్ ప్రక్రియ జరుగుతుందని, అనంతరం మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఓ నరేందర్, ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి బజారు, సిబ్బంది పాల్గొన్నారు. 15న సైన్స్ సెమినార్కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 15న జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ – చాలెంజెస్‘అనే అంశంపై జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో సెమినార్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సెమినార్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఒక్కరు లేదా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. గరిష్టంగా ఐదు చార్టులు, పవర్ పాయింట్కు సంబంధించి ఐదు స్లైడ్లు ప్రదర్శించవచ్చని, పోటీలో పాల్గొనే విద్యార్థులు వివరాలను నమోదు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజ శేఖర్ను సంప్రదించాలని కోరారు. కిన్నెరసాని నుంచి నీటి విడుదలపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1600 క్యూసెక్కుల వరదనీరు రావడంతో శుక్రవారం నీటిమట్టం 405.20 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్ట్కు చెందిన ఒక గేటును ఎత్తి ఉంచి 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. -
ఈజీగా రాజీ!
● నేడు జాతీయ లోక్ అదాలత్ ● జిల్లాలోని 5 కోర్టుల్లో నిర్వహణ ● పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపెండింగ్లో ఉన్న, రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలి. – విక్రాంత్ కుమార్ సింగ్, ఏఎస్పీ, భద్రాచలంభద్రాచలం డివిజన్ పరిధిలోని న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధికారులు జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రాజీమార్గంతో ఎక్కువ కేసుల పరిష్కారానికి సహకరించాలి. – శివనాయక్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, భద్రాచలం భద్రాచలంఅర్బన్: బాధితులు ఏళ్లపాటు కోర్టులు చుట్టూ తిరగకుండా, సత్వరమే కేసులు పరిష్కరించేలా న్యాయస్థానాలు లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నాయి. లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం లోక్ అదాలత్ల ద్వారా ఏటా వేల సంఖ్యలో పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్నాయి. బాధితులకు సత్వరమే న్యాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 13న జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, దమ్మపేట, ఇల్లెందు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. తీర్పు అంతిమం.. రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్క రించుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే తీర్పే అంతిమం. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుల విషయంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందూ అప్పీల్ చేయడం కుదరదు. లోక్ అదాలత్ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి. పరిష్కారం చూపే కేసులు.. క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాదా, రోడ్డు ప్రమాదం, చిట్ ఫండ్, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చు. దొంగతనం, బ్యాంకు రికవరీ, సెల్ఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం చెక్ బౌన్స్ కేసులు, కార్మిక సంబంధిత కేసులు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు కూడా పరిష్కరించుకోవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. లోక్ అదాలత్తో ప్రయోజనాలు ● సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి. ● ఫార్మల్ కోర్టు విచారణ అవసరం లేకుండా సులభంగా పరిష్కారం. ● లీగల్ ఫీజులు, కోర్టు ఖర్చులు తగ్గుతాయి. ● తక్కువ ఖర్చుతో, శాంతియుతంగా వివాదాలను ముగించే అవకాశం. -
స్ట్రక్చరల్ సమావేశం బహిష్కరణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి యాజమాన్యం మొండివైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని బహిష్కరించినట్లు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ( ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏడాదికాలంలో మూడుసార్లు నిర్వహించిన సమావేశాల్లో అంగీకరించిన అంశాలపై యాజమాన్యం ఇప్పటివరకు సర్క్యులర్ జారీ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సొంతింటి పథకంపై కమిటీ వేసినా ఇంతవరకు సమావేశం నిర్వహించలేదన్నారు. ఏసీబీ బూచి చూపి మెడికల్ బోర్డ్ను నిలిపివేయడం యాజమాన్య తప్పిదమేనని అన్నారు. గతంలోలాగే మెడికల్ బోర్డ్ నిర్వహించాలని కోరారు. కంపెనీ వాస్తవ లాభాలు ప్రకటించి, 35శాతం కార్మికులకు వాటాను చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు మిరియాల రంగయ్య, సారయ్య, వీరభద్రయ్య, సమ్మయ్య, ఎల్లయ్య, వెంకటి, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నేతలు సీతారామయ్య, రాజ్కుమార్ -
రైతులకు తప్పని యూరియా వెతలు
ఇల్లెందు/పాల్వంచరూరల్: రైతులకు యూరియా వెతలు తీరడంలేదు. పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజామునుంచే బారులుదీరుతున్నారు. గు రువారం వరకు పాల్వంచ పట్టణంలోని సహకార సొసైటీ కార్యాలయంలో అధికారులు యూరి యా పంపిణీ చేశారు. శుక్రవారం జగన్నాథపురం రైతువేదికలో పంపిణీ చేపట్టారు. దీంతో జగన్నాథపురం, కేశవాపురం, సోములగూడెం, తోగ్గూడెం, నాగారం, రంగాపురం, దంతలబోరు, బండ్రుగొండ, సంగం తదితర గిరిజన గ్రామాల రైతులు తరలివచ్చారు. దీంతో రైతువేదిక నిండిపోయింది. 320 మంది రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా, 220మంది రైతులకే యూరియా పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇంకా 100 మందికి యూరి యా దొరకలేదు. మిగిలిన రైతులకు సోమవారం లోడ్ వస్తే పంపిణీచేస్తామని ఏఓ శంకర్ తెలిపారు. ఇక ఇల్లెందులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం వద్దకు రొంపేడు, మసివాగు, ముత్తారపుకట్ట తదితర గ్రామాల నుంచి తెల్లారేసరికే రైతులు చేరుకున్నారు. రోజంతా క్యూలైన్లో నిలబడలేక చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూశారు. ఇల్లెందు, చల్లసముద్రం, సుదిమళ్ల, కొమరారం కేంద్రాలుగా యూరియా పంపిణీ కేంద్రాలు తెరిచి 1,860 మెట్రిక్ టన్నుల యూరియా ను సుమారు 10 వేల మంది రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నాయి. అయినా పంటలకు సరిపడా యూరియా అందక రైతులు గోస పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఏడీఏ సుధాకర్, సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, సీఈఓ సత్యం, స్టాక్ అసిస్టెంట్ లక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
అశ్వాపురం: ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరంలో శుక్రవారం కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. క్రమశిక్షణ అలవర్చుకోవాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్కుమార్ భద్ర, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, తహసీల్దార్ మణిధర్, విద్యార్థులు పాల్గొన్నారు. నానో యూరియాతో ఇన్సూరెన్స్ సౌకర్యంటేకులపల్లి: నానో యూరియాతో రైతులకు రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. శుక్రవారం టేకులపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో డీఏపీ పిచికారీపై డెమో ద్వారా రైతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్కో యూరియా నాలుగు బాటిళ్లు కొన్నవారు బిల్లు భద్రపరచుకోవాలని చెప్పారు. రైతు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఇన్సూరెన్స్ లభిస్తుందని తెలిపారు. డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత, ఏఓ అన్నపూర్ణ, శ్రావణి, విశాల పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
వరంగల్ లీగల్: స్నేహితుడిని హత్య చేసిన కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ తండాకు చెందిన పాల్తియా రమేశ్కు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి శుక్రవారం తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి తెలిపిన వివరాలు... పాల్తియా రమేశ్, హనుమకొండ రాయపురకు చెందిన యంజాల శివ మిత్రులు. వీరిద్దరు పాత ఇనుప సామగ్రి, చిత్తు కాగితాలు, ఖాళీ సీసాలు విక్రయిస్తూ జీవిస్తుండగా డబ్బు పంపకాల్లో తేడాతో గొడవలు మొదలయ్యాయి. రమేశ్ బాల్యం నుంచే చోరీ కేసుల్లో వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జైళ్లలో శిక్ష అనుభవించాడు. మళ్లీ వరంగల్ చేరుకొని శివను కలవగా, 2023 సెప్టెంబర్ 13వ తేదీన గొడవ పడగా, శివ నిద్రించేందుకు హనుమకొండలోని మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అయితే, ప్రతిసారి తనతో గొడవ పడుతున్నాడని భావించిన రమేశ్.. కాసేపటికి శివ వద్దకు వెళ్లి విచక్షణరహితంగా కొట్టి బంగ్లా పైనుంచి కిందికి నెట్టేయడమే కాక కర్ర, బండరాళ్లతో కొట్టి చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోయాడు. అనంతరం రమేశ్ పోలీసులకు లొంగిపోగా విచారణలో నేరం రుజువు కావడంతో రమేశ్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యంభద్రాచలంటౌన్: పట్టణంలోని కరకట్ట రోడ్డులో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వయసు సుమారు 43 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదుటేకులపల్లి: నకిలీ స్టాంపు పేపర్లు సృష్టించిన వ్యవహారంలో ఏడుగురు వ్యక్తులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ కథనం ప్రకారం... లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన సోమరాజు వెంకట రాజా రాంప్రసాద్, అతని కుటుంబ సభ్యులకు సంపత్ నగర్ గ్రామం గంగారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 303/2/157లో ఉన్న 70 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. ఆ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఏడుగురు వ్యక్తులు కలిసి నకిలీ స్టాంపు పేపర్లను మోసపూరితంగా సృష్టించారు. బాధితుడు వెంకట రాజా రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు మాళోతు నాగలక్ష్మి, భూక్య భావ్సింగ్, గుగులోత్ సక్కుబాయి, మాళోతు బలరాం, మెట్ల వెంకటేశ్వర్లు, ఏలూరి కోటేశ్వర్రావు, కోరం చిట్టిబాబులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నంఇల్లెందురూరల్: మండలంలోని పూబెల్లి బీట్ ఆఫీసర్ రాణి శుక్రవారం ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యుల కథంనం ప్రకారం.. పూబెల్లి శివారులో కోతుల బెడద తగ్గించుకునేందుకు రైతు చేను పక్కనే చెట్లను తొలగిస్తుండగా బీట్ అధికారి అడ్డుకుంది. ఈ విషయంలో సదరు రైతు పురుగుల మందు తాగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. నాటి నుంచి రాణి మానసికంగా ఒత్తిడికి గురవుతోంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఖమ్మంలో శుభ కార్యానికి వెళ్లగా ఆమె ఇంట్లో ఉన్న టాబ్లెట్లు మింగింది. గమనించిన బంధువులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇల్లెందు రేంజ్ అటవీసిబ్బంది, యూనియన్ నాయకులు కోటి, మురళి తదితరులు రాణిని పరామర్శించారు. -
కేటీపీఎస్ సొసైటీ అధ్యక్ష పీఠం ఎవరికో?
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ అధ్యక్ష పీఠం కోసం మంతనాలు జోరందుకున్నాయి. పాలక మండలి పదవుల కోసం ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానిక డీఏవీ పాఠశాలలో సొసైటీ డైరెక్టర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం అర్ధరాత్రి ముగిసింది. ఎన్నికల్లో బీసీ కేటగిరీలో తోట అనిల్ కుమార్, కోన నాగేశ్వరరావు, ఎస్సీ ఉమెన్ విభాగంలో దాసరి వీరమణి, ఓసీ ఉమెన్ విభాగంలో రావు స్పందన, ఎస్టీ విభాగంలో నూనావత్ కేశులాల్, ఎస్సీ జనరల్ విభాగంలో వల్లమల ప్రకాశరావు, జనరల్ విభాగంలో దానం నరసింహారావు, డోలీ శ్రీనివాసరావు, వీరమల్లు రఘుకృష్ణ, సిద్ది ప్రశాంత్, బుద్దార్ధి మహేందర్, ధర్మరాజుల నాగేశ్వరరావు, సిద్దెల హుస్సేన్లు డైరెక్టర్లులుగా గెలుపొందారు. విజేతలు రంగులు పులుముకుని సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పాలక మండలి అధ్యక్ష పీఠం కోసం గతంలో పనిచేసిన దానం నర్సింహారావు, ధర్మరాజుల నాగేశ్వరరావులు పోటీ పడుతున్నారు. చెరో రెండేళ్ల చొప్పున అధ్యక్ష పదవిలో ఉండేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. సెక్రటరీ పోస్టు కోసం డోలి శ్రీనివాసరావు, కోన నాగేశ్వరరావు, కోశాధికారిగా మహేందర్, కేశులాల్లు పోటీ పడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్గా తోట అనిల్కుమార్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కొత్తపాలక వర్గం కొలువు దీరేలా కార్మిక సంఘాల నాయకులు చొరవ తీసుకుంటున్నారు.పాలక మండలి పదవుల కోసం పావులు కదుపుతున్న డైరెక్టర్లు -
ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే
● క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నమోదు ● అక్టోబర్ 25 వరకు నమోదుకు గడువు బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా పంటల నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. గతేడాది సీసీఐ పత్తి విక్రయాల్లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యవసాయశాఖ పంటల నమోదును పక్కాగా చేస్తోంది. ఏఈఓలు వానాకాలంలో రైతులు సాగు చేసిన పంటల చేలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల వివరాలు, విస్తీర్ణం, ఏ పంట వేశారు, రైతు ఆధార్కార్డు నంబర్, ఫోన్ననంబర్ తదితర వివరాలను డీసీఎస్(డిజిటల్ క్రాప్ సర్వే) యాప్లో నమోదు చేస్తున్నారు. తొలుత పట్టా భూములలో పంట నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఆ తర్వాత నాన్ డిజిటల్ సైన్ భూముల్లో సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 2.10 లక్షల ఎకరాలలో పత్తి సాగు ఈ ఏడాది జిల్లాలో సుమారు 2.10 లక్షల ఎకరాలలో పత్తి, 1.85లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. మిర్చి, అపరాల సాగు ఇంకా కొనసాగుతోంది. అక్టోబర్ 25 వరకు పంటల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది, ఇప్పటికే జిల్లాలో 40శాతం మేర నమోదు పూర్తయింది. డిజిటల్ క్రాప్ సర్వేలో పంటలు నమోదు చేసుకుంటే సీసీఐలో పత్తి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవు. గతేడాది చాలామంది రైతులు క్రాప్ బుకింగ్ చేసుకోకపోవటంతో పత్తి, ధాన్యం అమ్మకాల సమయంలో నానా అగచాట్లు పడ్డారు.గతేడాది పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు పత్తి విక్రయించుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)రాసి ఇచ్చారు. కొందరు ఏఈఓలు వ్యాపారులకు కూడా టీఆర్లు ఇవ్వడం, వాటిని మార్కెటింగ్శాఖ అధికారులు ధ్రువీకరించటంతో సీసీఐ పత్తి అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. కొందరు వ్యవసాయశాఖ అధికారులు, 17మంది మార్కెటింగ్శాఖ కార్యదర్శులపై సస్పెన్సన్ వేటు పడింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించాకే వివరాలు నమోదు చేస్తున్నారు. పంట నమోదు చేసుకుంటే పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందించేందుకు వీలుంటుంది. పంట నమోదు చేసుకోకుంటే ఏ పథకాలకు కూడా అర్హులు కాలేరని అధికారులు చెబుతున్నారు. -
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
దమ్మపేట: అంతరాష్ట్ర గంజాయి ముఠాను శుక్రవారం దమ్మపేట పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్మపేట స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. దమ్మపేట పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి ఎస్సై సాయికిషోర్ రెడ్డి మండలంలోని పట్వారిగూడెం గ్రామ శివారులో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వెళ్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా రూ.43 లక్షల విలువైన 86 కేజీల గంజాయి లభించింది. కారులో ఎనిమిది మంది వ్యక్తులు ఉండగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. నిందితుల్లో సీఐఎఫ్ఎఫ్ కానిస్టేబుల్ పోలీసులు పట్టుకున్న ఐదుగురిలో ఏపీలోని మోతుగూడేనికి చెందిన పనగుడు శివకృష్ణ, తమిళనాడుకు చెందిన జయరామన్ మహేష్కుమార్, కృష్ణమూర్తి మారియప్పన్, కందసామి రంజిత్, రాము వసంత్ ఉన్నారు. వీరిలో శివకృష్ణ సీఐఎస్ఎఫ్లో కానిస్టేబు ల్. ప్రస్తుతం డిప్యూటేషన్పై ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తూ కేరళలో నివాసం ఉంటున్నాడు. పరారైన వారిలో ఏపీలోని రాజమండ్రికి చెందిన ఓ మహిళ, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. గంజాయి అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్లో ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు వీర, లక్ష్మయ్య, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారు..
టేకులపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచర్, ఆయా పోస్టుల నియామకాల్లో అనర్హులకు పోస్టింగ్లు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. నోటిఫికేషన్ రద్దు చేసి అర్హులను నియమించాలని కోరారు. శుక్రవారం మండలంలోని తావుర్యాతండా పంచాయతీ స్టేషన్ తడికలపూడి ప్రాథమిక పాఠశాల వద్ద పలువురు బాధితులు సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. స్టేషన్తడికలపూడి ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్, ఆయా ఇద్దరు శుక్రవారం విధుల్లో చేరేందుకు రావడంతో వివాదం మొదలైంది. ఈ పంచాయతీకి చెందిన తమకు అన్ని అర్హతలున్నా నిబంధనలకు విరుద్ధంగా ఇతర పంచాయతీల నుంచి టీచర్, ఆయాలను నియమించారని బాధిత అభ్యర్థులు బాదావత్ మంగ, బానోతు మంజుల, బొర్ర స్వరూపారాణి, బాణోతు జ్యోతి, గుగులోత్ దివ్య భారతి ఆరోపించారు. ఈ విషయమై ఎంఈఓ జగన్ను వివరణ కోరగా.. టీచర్, ఆయా నియామకాలు జరగలేదని, దరఖాస్తులను అమ్మ ఆదర్శ కమిటీలకు పంపించామని తెలిపారు. వారు ఎంపిక చేసి వివరాలు పంపిస్తే, కలెక్టర్కు నివేదిస్తామని పేర్కొన్నారు. కాగా పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో 21 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించనున్నారు. వీటిల్లో స్టేషన్ తడికలపూడి ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. పాఠశాలల్లో టీచర్, ఆయా పోస్టుల భర్తీకి గత నెల 26న నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టేషన్ తడికలపూడి పాఠశాలలో బాధితుల ఆందోళన -
వేతన వెతలు..
● ‘ఆశ్రమ’ వంట కార్మికులకు ఆరు నెలలుగా జీతాల్లేక ఇక్కట్లు ● గుదిబండగా మారనున్న జీఓ 64 ● ఉమ్మడి జిల్లాలో 490 మంది డైలీవేజ్ వర్కర్లు ● సమస్యల పరిష్కారానికి నేటి నుంచి సమ్మెబాటకరకగూడెం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులు గత ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 64.. వారికి గుదిబండగా మారింది. దీంతో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 60 ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 490 మంది డైలీ వేజ్ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. అసలే అరకొర.. అందులోనూ జాప్యం ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వంట కార్మికులకు చెల్లించే అరకొర వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ ఉంటున్నాయి. దీంతో నిత్యావసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 64 అమల్లోకి వస్తే తమ వేతనం సగానికి సగం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈజీఓ అమలైతే.. ప్రస్తుతం నెలకు రూ.26వేలు పొందే కార్మికుడి వేతనం.. రూ.11,700కు పడిపోవచ్చని తెలుస్తోంది. ఈ జీఓ అమలు చేయొద్దని, తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద కార్మికులు, ఆయా సంఘాల నాయకులు భారీ ఆందోళన చేసి, మంత్రి అట్లూరి లక్ష్మణ్కు వినతిపత్రం అందజేశారు. పాత వేతన విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఐటీడీఏ అధికారులకు సమ్మె నోటీసు అందించారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ మణెమ్మను వివరణ కోరగా వేతనాలు చెల్లించడానికి నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొత్త జీఓ ప్రకారం తీసుకునేందుకు కార్మికులు అంగీకరించడం లేదని తెలిపారు. జీతాలు లేక అప్పుల పాలయ్యాం. ఆరు నెలలుగా జీతం ఆగిపోతే ఎలా బతకాలి. ఇప్పుడిస్తు జీతాలే సరిపోవడం లేదు. ఇక కొత్త జీఓ అమలైతే ఇంకా తగ్గుతాయని అంటన్నారు. పాత జీతాలు ఇవ్వడంతో పాటు కొత్త జీఓ రద్దు చేయాలి. – కౌసల్య, డైలీవేజ్ కార్మికురాలు, ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాలల కార్మికుల కష్టాలు చెప్పలేనివి. ఆరు నెలల వేతనాలు పెండింగ్ ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ జీతాలు ఇవ్వకపోగా ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చి వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోంది. కార్మికులకు అన్యాయం జరిగితే సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. –కె.బ్రహ్మచారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడుఆరు నెలలుగా జీతాలు లేవు. ఈ జీతంపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. ఎండాకాలమైనా, వానాకాలమైనా కష్టపడి విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నాం. ఇప్పుడిచ్చే వేతనాలే అరకొరగా ఉన్నాయి. ఇక కొత్త జీఓతో జీతాలు ఇంకా తగ్గుతాయంటున్నారు. ప్రభుత్వం మా గోడు విని న్యాయం చేయాలి. – ముసలయ్య, డైలీవేజ్ కార్మికుడు, చిరుమళ్ల ఆశ్రమ పాఠశాల -
టీఎల్ఎంతో సులభంగా..
దమ్మపేట: టీఎల్ఎం(బోధన అభ్యసన సామగ్రి) వినియోగంతో బోధన, అభ్యాసన ప్రక్రియ మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా మండలాల స్థాయిలో టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేశారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలకు ఏటీడీఓ స్థాయిలో ఈ నెల 1న పార్కలగండి, ఇతర ప్రాంతాల్లో టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ నెల 16న భద్రాచలం గిరిజన భవన్లో గిరిజన పాఠశాలలకు జిల్లాస్థాయి మేళా నిర్వహించనున్నారు. ఇతర యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలకు మండలస్థాయిలో మేళాలు కొనసాగుతున్నాయి. మరో వారంలో వాటికి కూడా జిల్లాస్థాయి మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా.. ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యాంశాల బోధనలో టీఎల్ఎంను వినియోగిస్తే బోధన సులభతరం అవుతుంది. విద్యార్థుల్లో ఆసక్తి కూడా పెంపొందుతుంది. ఈ క్రమంలో నమూనా చిత్రాలు, మ్యాపులు, బొమ్మలు, చార్టులు, దృశ్య, శ్రవణ పరికరాలతో ఉపాధ్యాయులు బోధన అభ్యసన సామగ్రిని రూపొందించి మేళాలో ప్రదర్శించారు. పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలకు నిర్వహించిన టీఎల్ఎం మేళాలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన బోధన అభ్యసన పరికరాలను పరిశీలించి అభినందించారు. టీఎల్ఎంను జోడించి బోధించడం ద్వారా విద్యార్థులకు నేర్చుకోవాలని ఆసక్తి పెరగడంతోపాటు దృశ్య అనుభూతి కలుగుతుందని తెలిపారు. టీఎల్ఎం తయారీతో ఉపాధ్యాయుల అంతర్గత ప్రతిభ కూడా బయటకు వస్తుందని పేర్కొన్నారు. బోధన అభ్యసన సామగ్రి బోధన ప్రక్రియను సులభతరం చేసి, విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఉపయోగపడే ప్రతీ వస్తువు, వనరు, పరికరం, సాధనం బోధన అభ్యసన సామగ్రిగా చెప్పవచ్చు. ఈ తరహా బోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటి ద్వారా ఉపాధ్యాయుడు బోధనను అత్యంత ప్రభావవంతంగా నిర్వహించవచ్చు. విద్యార్థులు కూడా చురుగ్గా నేర్చుకుంటారు. అభ్యసన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. సమాచారం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. విద్యార్థుల్లో ఆలోచన, విమర్శనాత్మక శక్తి పెరుగుతుంది. దృశ్య, శ్రవణ, దృశ్య–శ్రవణ సాధనాలను టీఎల్ఎం బోధనలో ఉపయోగిస్తారు. దృశ్య సాధనాలుగా చిత్రాలు, పోస్టర్లు, నమూనాలు, మ్యాపులు, బొమ్మలను ఉపయోగిస్తారు. శ్రవణ సాధనాలుగా ఆడియో టేపులు, పాటలు, కవితలు, ప్రసంగాలను వినియోగిస్తారు. దృశ్య–శ్రవణ సాధనాలుగా టెలివిజన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మల్టీమీడియా ప్రజెంటేషన్లను ఉపయోగిస్తారు. టీఎల్ఎంతో ప్రయోజనాలు ●ఉపాధ్యాయుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. ●విద్యార్థులకు అభ్యసన పట్ల సన్నద్ధతతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ●ఇంద్రియ అనుభవాల ద్వారా ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. ●దృశ్య, శ్రవణ పరికరాల ద్వారా నేర్చుకున్న పాఠ్యాంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ●తరగతి గదిలో అభ్యసన వాతావరణం మెరుగుపడుతుంది. ●కష్టతరమైన పాఠ్యాంశాలు నేర్చుకోవడం సులభతరం అవుతుంది. ●వాస్తవ ప్రపంచ పరిచయం, సమస్యల పరిష్కారం, ఆలోచనా శక్తి పెంపొందుతుంది. ●చదువులో వినోదాన్ని, ఆచరణాత్మకతను, అనుభూతిని కలిగిస్తుంది.మెరుగుపడనున్న బోధన, అభ్యసన ప్రక్రియ టీఎల్ఎం ద్వారా తరగతి గదిలో బోధనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు, సమగ్ర అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయి. అవగాహన, ఇంద్రియ అనుభవంతో నేర్చుకోవడం వల్ల పాఠ్యాంశాలు దీర్ఘకాలం గుర్తుంటాయి. – విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు, మొద్దుల గూడెం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాల బోధనలో బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగిస్తే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తితోపాటు అవగాహన పెరుగుతుంది. బోధనలో దృశ్య, శ్రవణ సాధనాల వినియోగం వల్ల ప్రత్యక్ష అనుభూతి పెరిగి, కష్టతరమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి. టీచర్ల బోధన కూడా మెరుగుపడుతుంది. – కీసర లక్ష్మి, ఎంఈఓ, దమ్మపేట -
సర్కారు సేవలకు సై!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సర్కారు దవాఖానాల్లో వైద్యుల పోస్టులు భర్తీ చేయడం, రోగ నిర్ధారణ పరీక్షలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తుండడంతో ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుండగా, పేషెంట్ల తాకిడి పెరుగుతోంది. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఐపీ, ఓపీ రికార్డులే అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చర్ల సామాజిక ఆస్పత్రిలో నిన్నామొన్నటి వరకు 50 మంది వరకు ఓపీ రికార్డు ఉండగా ఇప్పుడది 220కి పెరిగింది. మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరిలో ఎనిమిది ప్రసవాలు మాత్రమే జరగగా, ఆగస్టు నాటికి ఆ సంఖ్య 100 దాటింది. గోదావరి తీరానికి రెండువైపులా ఉన్న ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్ సేవలు అందుబాటులోకి రావడంతో ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. అశ్వారావుపేట ఏజెన్సీలోనూ ఇదే తరహా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో ఆర్ఎంపీల దూకుడుకు బ్రేకులు పడుతున్నాయి. శస్త్ర చికిత్సలూ అదే స్థాయిలో.. సాధారణ వైద్య సేవలకు తోడు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు సైతం పెరిగాయి. భద్రాచలం ఆస్పత్రిలో ప్రతీ నెల సగటున 14 మందికి కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. పాల్వంచ, భద్రాచలం ఆస్పత్రుల్లో ఎముకలకు (ఆర్థోపెడిక్) సంబంధించి నెలకు 50 వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా ప్రారంభించారు. ఇల్లెందు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చికిత్స విజయవంతంగా నడుస్తోంది. ఇక్కడ నెలకు 200 మందికి పైగా ఫిజియోథెరపీ సేవలు పొందుతున్నారు. దంత విభాగంలోనూ జిల్లా వాప్తంగా ప్రతీ నెల 300 పైగా శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ సేవలు మెరుగవడంతో ఇక్కడ అందే వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఉదాహరణకు ఇల్లెందు ఆస్పత్రిని పరిశీలిస్తే ఇక్కడ 100 పడకలు ఉండగా గత నాలుగైదు నెలలుగా 120 మందికి పైగా ఇన్ పేషెంట్లు(ఐపీ) ఉంటున్నారు. దీంతో ఇక్కడ కొత్తగా ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి స్థలం దొకరని పరిస్థితి నెలకొంది. రక్త నిల్వ కేంద్రాలు గతంలో జిల్లాలో ఎక్కడ రక్తం అవసరమైనా కొత్తగూడెం, భద్రాచలం ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా మణుగూరు, అశ్వారావుపేటలోనూ రక్త నిల్వ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఇల్లెందులోనూ ప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో కలిపి డయాలసిస్ కోసం 54 మిషన్లు అందుబాటులో ఉండగా 400 మందికి డయాలసిస్ చేసే వీలుంది. కాగా ప్రస్తుతం రోగుల సంఖ్య 350 లోపే ఉంది. అయితే స్పెషాలిటీ సేవలు అందించే వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్య మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ అనూహ్యంగా డిమాండ్కు సరిపడా నర్సులు లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు జిల్లా వ్యాప్తంగా 90 మంది నర్సుల అవసరం ఉంది. మరోవైపు ఆస్పత్రుల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లకు సైతం గత నాలుగు నెలల నుంచి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య చికిత్సలు రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సబ్ సెంటర్ల నుంచి ఏరియా ఆస్పత్రుల వరకు వైద్య సిబ్బంది అహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. అయితే వీటికి అందాల్సిన ఆస్పత్రి అభివృద్ధి నిధులు(హెచ్డీఎఫ్) రెండు, మూడేళ్లుగా పెండింగ్లో ఉంటున్నాయి. ఈ నిధులు అందుబాటులో ఉంటే ఆస్పత్రుల్లో అసరమైన అత్యవసర మందుల కొనుగోలు, చిన్న చిన్న మరమ్మతులు చేయించే అవకాశం ఉంటుంది. ఏళ్లుగా హెచ్డీఎఫ్ నిధులు లేక ప్రతీ పనికి కలెక్టర్ అందించే ప్రత్యేక నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఏజెన్సీ జిల్లాల్లో గతంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు. ఏ జబ్బు చేసినా ఖమ్మం, కొత్తగూడెంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. – జి.రవిబాబు, డీసీహెచ్ఎస్ మూడు రోజులు క్రితం జ్వరం రావడంతో ఇల్లెందు ఆస్పత్రికి వచ్చా. పెద్ద డాక్డర్లు పరీక్షించి బెడ్ ఇచ్చారు. ఇప్పుడు జ్వరం తగ్గుముఖం పట్టింది. రోజూ గ్లూకోజ్ పెట్టి ఇంజెక్షన్లు వేస్తున్నారు. ప్రైవేట్లో అయితే రూ.10వేలకు పైగా ఖర్చయ్యేది. ఇక్కడ రూపాయి ఖర్చులేకుండా రోగం నయం చేస్తున్నారు. – సీహెచ్ విజయ, రేపల్లెవాడ, ఇల్లెందు మండలం -
మట్టి ట్రాక్టర్ల అడ్డగింత
అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గురువారం గ్రామస్తులు పట్టుకున్నారు. మండలంలోని జమ్మిగూడెం శివారు చెరువు శిఖం భూముల్లో నుంచి మూడు రోజులుగా జేసీబీతో మట్టి తవ్వి ఏడు ట్రాక్టర్లతో తరలించి విక్రయిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకుని పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ సిబ్బంది, ఆర్ఐ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమతులు లేవని గుర్తించి ట్రాక్టర్లను తహసీల్కు తరలించారు. కాగా, తవ్వకాలు చేసిన జేసీబీతోపాటు మరో మూడు ట్రాక్టర్లను మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వ్యక్తులు తప్పించడం గమనార్హం. ట్రాక్టర్లను అడ్డుకున్న వారిలో స్థానికులు మిద్దిన కొండయ్య, మిద్దిన రాములు, సింగలూరి కృష్ణ, దానపు సింగయ్య, లక్కదాసు శ్రీను, రెడ్డి లక్ష్మి, దానపు జయమ్మ ఉన్నారు. అక్రమార్కులు! -
గందరగోళంగా ‘కేటీపీఎస్’ ఓట్ల లెక్కింపు
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. బుధవారం కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం వైటీపీఎస్, బీటీపీఎస్ నుంచి పోలింగ్ బాక్స్లను పాల్వంచకు తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో డీఏవీ పాఠశాలలో బుధవారం రాత్రి 9 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గురువారం రాత్రి వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఫలితాల కోసం అభ్యర్థులు, ఉద్యోగులు కౌంటింగ్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫలితాల్లో వెల్లడిలో తీవ్ర జాప్యం కావడం విమర్శలకు దారి తీసింది. తొలుత పోలిగ్ బాక్స్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారని, అది ఎటూ తేలకపోవడంతో ఆ తర్వాత అన్ని బాక్స్లను ఒక్కచోట కలిపి మళ్లీ లెక్కింపు చేపడుతున్నారని పలువురు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు వెల్లడవుతుండగా కేటీపీఎస్ సొసైటీ ఫలితాలు మాత్రం 24 గంటలపాటు లెక్కించినా తేలలేదు. మొత్తం 2,996 ఓట్లకుగాను 2,543 ఓట్లు పోలుకాగా, ఆ ఓట్లను లెక్కించేందుకు అధికారులు హైరానా పడుతున్నారు. ఆరుగురు డైరెక్టర్ల గెలుపు ఎస్సీ మెన్ కేటగిరీలో వల్లమల్ల ప్రకాష్ 237 ఓట్లతో సొసైటీ డైరెక్టర్గా గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. కేశులాల్, తోట అనిల్కుమార్, కోన నాగేశ్వరరావు, ఆర్. స్పందన, వీరస్వామి డైరెక్టర్లుగా విజయం సాధించారు. రాత్రి 10 గంటలు దాటినా మరో ఏడుగురి డైరెక్టర్ల ఫలితాలు వెల్లడి కాలేదు. కాగా విజేతలు, వారి మద్దతుదారులు రంగులు చల్లుకుని విజయోత్సవాలు నిర్వహించారు. ఫలితాల కోసం పడిగాపులు కాసిన ఉద్యోగులు, అభ్యర్థులు -
విద్యుత్ సిబ్బంది సాహసం
మద్దుకూరు సాగునీటి ప్రాజెక్ట్లో మరమ్మతులు చండ్రుగొండ: మండలంలోని మద్దుకూరు సాగునీటి ప్రాజెక్ట్లో నుంచి వెళ్లే విద్యుత్లైన్ పిడుగుపాటుకు మరమ్మతులకు గురికాగా, గురువారం విద్యుత్ సిబ్బంది నీటిలోనే మరమ్మతులు పూర్తి చేశారు. మద్దుకూరు ప్రాజెక్ట్ మీదుగా మద్దుకూరులోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి చండ్రుగొండలోని 33/11 సబ్స్టేషన్కు స్టాండ్బై విద్యుత్ లైన్ ఉంది. బుధవారం పిడుగుపాటుకు ప్రాజెక్ట్ మధ్యలో విద్యుత్లైన్ ఇన్సులేటర్ తెగిపోయింది. దీంతో రెండు సబ్స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో సిబ్బంది దాదాపు 10 అడుగుల లోతులో నీటిలో ప్రయాణించి, తాడు మోకుల ద్వారా స్తంభం వద్దకు చేరుకుని మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో పలువురు విద్యుత్ సిబ్బందిని అభినందించారు. పోలీసు అదుపులో గంజాయి విక్రేతలు? ఐదుగురు అనుమానితులను దమ్మపేటలో విచారిస్తున్న పోలీసులు! అశ్వారావుపేట: మండలంలోని ఆసుపాక గ్రామం గంజాయి రవాణాకు హబ్గా మారిందని ప్రచారం సాగుతోంది. దమ్మపేట పోలీస్ స్టేషన్లో సీఐ పింగళి నాగరాజు రెడ్డి ఆసుపాకకు చెందిన కొందరు వ్యక్తులను మూడు రోజులుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆసుపాకకు చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం భద్రాచలంలో గుమస్తాగా పని చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడ్డ పరిచయాలతో గుట్కా, ఖైనీ, గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గంజాయిని ఆసుపాకలో డంప్ చేసి ఇతర ప్రాంతాలకు వేరే వ్యక్తుల ద్వారా చేరవేసేవాడని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అశ్వారావుపేట పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. గురువారం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో ఓ కారును స్వాధీనం చేసుకుని, ఇతర రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సీఐ నాగరాజు రెడ్డిని సంప్రదించగా.. ప్రచారం వాస్తవం కాదని తెలిపారు. ప్రహరీని ఢీకొట్టిన ట్రాక్టర్గోడ కూలి వృద్ధురాలి మృతిదమ్మపేట: ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రహరీ కూలి మీద పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని లచ్చాపురం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లచ్చాపురం గ్రామానికి చెందిన అబ్బిశెట్టి నారాయణమ్మ(65) తన ఇంట్లో లోపలవైపు ప్రహరీకి ఆనుకుని కూర్చుంది. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామానికి చెందిన యువకుడు రావుల సాయి ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడుపుతూ నారాయణమ్మ ఇంటి ప్రహరీని ఢీకొట్టాడు. దీంతో గోడ కూలి పడి ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్మణుగూరు టౌన్: తోగ్గూడెం ఆలయ సమీపంలోని సమ్మక్క–సారక్క ఫంక్షన్ హాల్లో గురువారం కొందరు పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు చేశారు. పేకాటరాయుళ్లు వట్ట రాంబాబు, చనుమోలు పూర్ణచంద్రరావు, నంబూరి శ్రీనివాసరావు, చావ సత్యనారాయణ, తాతా రమణ, శ్రీరామోజు అనంతరాములు, గుదే వెంకట్రావు, వెల్లంకి కిశోర్, గడ్డం మల్లికార్జునరావు, తోటకూర వెంకటేశ్వరరావు, బట్ట మేకల చంద్రశేఖర్, మాదినేని రాధాకృష్ణ, అడపా వెంకటేశ్వర్లు, కాసబోయిన శ్రీను, ఆరే నవీన్కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగబాబు తెలిపారు. రూ.1.69 లక్షల నగదు, 15 సెల్ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం
కరకగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కరకగూడెంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరోగమనంలోకి వెళ్తోందని విమర్శించారు. మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన వట్టివాగు ప్రాజెక్ట్ను రద్దు చేశారని ఆరోపించారు. కొత్త టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి మూన్నాళ్ల ముచ్చటగా వదిలేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు ఊకే రామనాథం, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బుడగం రాము, రంజిత్ కుమార్, చిరంజీవి, రాంబాబు, కృష్ణ, ప్రసాద్, వేణు, ప్రభాకర్, సుధాకర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
అమరుల త్యాగాలు మరువలేనివి
● సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● హాజరైన ఎస్పీ రోహిత్రాజ్, డీఎఫ్ఓ కిష్టాగౌడ్ చుంచుపల్లి: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. అటవీ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొత్తిగోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అడవులు వనరులు మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువుగా నిలుస్తాయని చెప్పారు. అడవుల సంరక్షణలో ఉద్యోగుల కృషి ఎనలేనిదని అన్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారని అభినందించారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ అటవీ సిబ్బందికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని తెలిపారు. అటవీ సిబ్బంది నిత్యం ప్రమాదాలు ఎదుర్కొంటూ అడవులను కాపాడుతున్నారని అన్నారు. డీఎఫ్ఓ కిష్టాగౌడ్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు తమకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. అంతకుముందు ప్రకాశం స్టేడియం నుంచి సెంట్రల్ పార్కు వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, వివిధ విభా గాల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ మెడికల్ స్టోర్ తనిఖీ రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు అవసరమయ్యే ఔషధాలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాన రహదారి నుంచి స్టోర్కు వచ్చే రోడ్డు మరమ్మతు చేయాలని, స్టోర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మందుల నిల్వకు ర్యాక్లు, బరువైన బాక్సులు ఎత్తడానికి అవసరమైన యంత్రాలు సమకూర్చాలని సిబ్బంది కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సీనియర్ ఫార్మసీ అధికారి శారద, ఫార్మసిస్ట్ రామచందర్ ఉన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువు దీరిన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి గురువారం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆ తర్వాత హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు.శరన్నవరాత్రుల ప్రచార రథం ప్రారంభం..పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల విజయంతానికి ప్రత్యేక రథం ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రథాన్ని పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో చెవుగాని పాపారావు, పెండ్లి రామిరెడ్డి, శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు.22 నుంచి డీఎల్ఈడీ థియరీ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఈనెల 22 నుంచి 27 వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయని, చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8919279238 నంబర్లో సంప్రదించాలని సూచించారు.జాతీయ స్థాయి టోర్నీకి ఉపాధ్యాయుడి ఎంపికదుమ్ముగూడెం : మండలంలోని ఆర్లగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్యామల ఆంజనేయులు అలిండియా సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ టోర్నమెంట్కు ఎంపికయ్యారు. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన షటిల్ విభాగంలో అండర్ – 40 విభాగంలో ఆయన ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆంజనేయులును గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కారం సర్వేష్, పూనెం నర్సింహారావు తదితరులు అభినందించారు.‘ఆది కర్మయోగి’వివరాలు సమర్పించాలిభద్రాచలంఅర్బన్ : ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన వివరాలు, ప్రతిపాదనలు పంపించాలని ఏటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఐటీడీఏ కార్యాలయం నుంచి 19 మండలాల అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా, మండల లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 19 మండలాల పరిధిలోని 130 గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ పథకంపై ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉందనే వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు, లక్ష్మీనారాయణ, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దళిత బంధు యూనిట్ల తనిఖీ
జూలూరుపాడు: మండల కేంద్రంలో గతంలో మంజూరైన దళిత బంధు యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరగిరి ప్రీతమ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అడ్డగోలుగా ఇచ్చిందని, కొందరు లబ్ధిదారులు యూనిట్లను అమ్ముకున్నారని తెలిపారు. అలాంటి యూనిట్లను గుర్తించేందుకే తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, దళిత బంధు లబ్ధిదారుడు మోదుగు రామకృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాళోత్ మంగీలాల్ నాయక్, నాయకులు గోపు రామకృష్ణ, పోతురాజు నాగరాజు, మెంతుల కృష్ణ పాల్గొన్నారు. రామయ్యను దర్శించుకున్న ప్రీతమ్.. భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో పూజల అనంతరం వేదాశీర్వచనం చేసి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. అనంతరం టూరిజం శాఖ హోటల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ్కు ఘన సన్మానంసుజాతనగర్: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రీతమ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పతి కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొందయ్య, నాయకులు గద్దల రమేష్ పాల్గొన్నారు. -
జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం
చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం, జర్నలిస్టుల హక్కుల రక్షణకు పాలకులు పాటుపడాలి. అంతేతప్ప ప్రభుత్వం – ప్రజలకు వారధిగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఫాసిస్టు చర్యగా భావిస్తున్నాం. – ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్), ఖమ్మం జిల్లా అధ్యక్షుడు -
మునగ, వెదురు సాగు లాభదాయకం
డీఆర్డీఓ విద్యాచందనములకలపల్లి: మునగ, వెదురు పంటల సాగు ఎంతో లాభదాయకమని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని మూకమామిడి పంచాయతీలో సాగు చేస్తున్న మునగ తోటలను పరిశీలించారు. మహిళా రైతులతో మాట్లాడి, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో వెదురు సాగు చేస్తున్న మహిళా సమాఖ్య గ్రూపు సభ్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డీపీఎం సమ్మక్క, ఇంచార్జ్ ఎంపీడీఓ రామారావు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు. వైకల్యం అధిగమించి ఉన్నతస్థాయికి ఎదగాలిజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ కొత్తగూడెంటౌన్: వైకల్యం అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎం. రాజేందర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం బాబుక్యాంప్లోని భవిత సెంటర్లో గురువారం ప్రపంచ బధిరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మూగ, చెవిటి పిల్లలకు కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముగ్గురు బధిర పిల్లలకు వినికిడి పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అంగవైకల్యం అడ్డురాదని, అలాంటి వారిని అందరూ ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వాలు దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డిస్ట్రిక్ వేల్పేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనినా, ఎంఈఓ బాలాజీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి సిబ్బంది పఫీన్ తదితరులు పాల్గొన్నారు. రైతు వేదికల్లోనూ యూరియా విక్రయాలుడీఏఓ బాబూరావు ఇల్లెందురూరల్: యూరియా సరఫరాలో సమస్యతో రైతులు పీఏసీఎస్ విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరకుండా ఇక నుంచి రైతు వేదికల్లోనూ యూరియా అందుబాటులో ఉంచుతామ ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. మండలంలోని సుదిమళ్ల, రేపల్లెవాడ రైతు వేదికల్లో యూరియా విక్రయాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇల్లెందులో ఇప్పటికే మూడు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడీఏ లాల్చంద్, ఏవో సతీష్, రైతులు పాల్గొన్నారు. నేటి నుంచి సింగరేణి వ్యాప్తంగా క్రీడలుకొత్తగూడెంఅర్బన్: సింగరేణి వ్యాప్తంగా గురువారం నుంచి క్రీడా పోటీలు ప్రారంభంకానున్నాయి. 2025–26 సంవత్సరానికి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపీఎస్–జీఏ) ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లో క్రీడలు నిర్వహించనున్నారు. కార్పొరేట్ ఏరియాలో 12న ఫుట్బాల్ పోటీలతో క్రీడలు ప్రారంభమై, సెప్టెంబర్ 28న సాంస్కృతిక కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఇందుకోసం ప్రకాశం స్టేడియం, సీఈఆర్, కేసీఓఏ క్లబ్ సిద్ధమవుతున్నాయి. ఇతర ఏరియాల్లో కూడా క్రీడా మైదానాలు, క్లబ్ భవనాలు వేదికలుగా నిలుస్తున్నాయి. క్రీడా పోటీల సమన్వయానికి అధ్యక్షుడిగా జి.వి.కిరణ్ కుమార్ (జిఎం, పర్సనల్ వెల్ఫేర్–సీఎస్ఆర్ )తోపాటు మరికొందరు బాధ్యులను నియమించారు. ఏరియా స్థాయి విజేతలను ప్రాంతీయస్థాయి, ఆపై సంస్థ స్థాయి పోటీలకు పంపనున్నారు. ఎస్పీని కలిసిన డీఎస్పీకొత్తగూడెంటౌన్: ఎస్పీ బి.రోహిత్రాజును జిల్లా సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేటర్ సెంటర్ డీఎస్పీ బి.అశోక్ మర్యాదపూర్వకంగా కలిశా రు. సీఐగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై గురువారం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీని కలిసి పూల మొక్కను అందజేశారు. -
జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా..
ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్ర జరుగుతోంది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్కడి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జర్నలిస్టులను ఏదోలా లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో సాక్షిపై, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఆధారాలు లేకున్నా సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డిపై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడాన్ని మానుకోవాలి. – కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఈ ఏడాది భారీగా నష్టపోయాం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ కారణంగా ఏడాది కాలంలో క్షేత్రస్థాయి నుంచి అగ్రనాయకుల వరకు మొత్తంగా 366 మంది విప్లవకారులు మృతి చెందినట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ వెల్లడించింది. ఈనెల 21 నుంచి 27 వరకు సీపీఐ (మావోయిస్టు) 21వ వార్షికోత్సవాలను నిర్వహించుకోవాలంటూ పార్టీ శ్రేణులకు నాయకత్వం ఈ నెల 6న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 17 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 26 మంది జిల్లా కమిటీ సభ్యులు, 86 మంది ఏరియా కమిటీ /ప్లాటూన్ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు 152 మంది, స్థానిక నిర్మాణాల సభ్యులు 38 మంది ఉన్నారని అందులో వెల్లడించారు. అలాగే మృతిచెందిన వారిలో వివరాలు తెలియని వారు మరో 43 మంది వరకు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ స్థాయిలో సభ్యులను కోల్పోవడం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అయితే దీనిని అధిగమించి ముందుకు సాగాలని కేడర్కు ఆ పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. అందువల్లే పార్టీకి నష్టాలు.. కేంద్ర కమిటీ రూపొందించిన ఎత్తుగడలను, గెరిల్లా యుద్ధ నియమాలను సరిగా అమలు చేయకపోవడం వల్లనే ఆపరేషన్ కగార్ కారణంగా ఎక్కువగా నష్టపోయినట్టు నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. కార్యక్షేత్రాన్ని చిన్న ప్రాంతాలకే పరిమితం చేయకుండా విశాల భూభాగాలకు మార్చాలని, కేంద్రీకృత పద్ధతిలో కాకుండా వికేంద్రీకృత పద్ధతిలో పని చేయాలని కేడర్కు సూచించింది. చట్టబద్ధ, చట్ట వ్యతిరేక, రహస్య – బహిరంగ పోరాటాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పేర్కొంది. పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాలలో ప్రజలను విప్లవ ఉద్యమం వైపు సమీకరించాలని కోరింది. మానసిక యుద్ధం ఎదురు కాల్పుల్లో పోలీసుల వైపు కూడా భారీ నష్టాలు చోటు చేసుకుంటున్నాయని, కానీ వాటిని బయటకు వెల్లడించకుండా ప్రభుత్వం మానసిక యుద్ధం చేస్తోందని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. కర్రిగుట్టల దగ్గర చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో 45 – 50 మంది జవాన్లు మరణించారని, మరో 70 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ ఆపరేషన్ మొదలైన తర్వాత 16 రోజుల పాటు భద్రతా దళాలు అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయని, చివరకు తమ నుంచి పారిపోయి సరెండెర్ అయిన మాజీ మావోయిస్టును పట్టుకుని, అతడి సాయంతోనే ఆపరేషన్లో భద్రతా దళాలు ముందుకుసాగాయని పేర్కొంది. ఇతర ఆపరేషన్లలోనూ ఇలాంటి పరిస్థితే భద్రతా దళాలకు ఎదురైందని, అందుకే ప్రతీ గెరిల్లా సభ్యుడికి 30 నుంచి 100 మంది వంతున భద్రతా దళాలను మోహరిస్తున్నారని తెలిపింది.శాంతి చర్చలకు సిద్ధంప్రజా ప్రయోజనాల రీత్యా శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టు పార్టీ మరోసారి ప్రకటించింది. అయితే అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ను ఆపేయాలని, ఉద్యమ ప్రాంతాల్లో సాయుధ బలగాల క్యాంపులు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించింది. -
రాముడి ఆదాయం రూ.1.52 కోట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఆలయ ఈఓ దామోదర్ రావు ఆధ్వర్యంలో దేవస్థానంలోని హుండీలను తెరిచి చిత్రకూట మండపానికి తరలించారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు లెక్కింపు చేపట్టారు. 72 రోజులకు రూ.కోటి 52 లక్షల 59 వేల 499ల నగదు, మిశ్రమ బంగారం 0.089 గ్రాములు, మిశ్రమ వెండి కేజీ వచ్చినట్లు ఈఓ తెలిపారు. యూఎస్ డాలర్లు 624, సౌత్రాఫికా ర్యాండ్స్ 450, ఆస్ట్రేలియా డాలర్లు 10, యూఏఈ దిరామ్స్ 10, కెనడా డాలర్లు 230, యూరప్ యూరోలు 30తోపాటు మరికొన్ని ఇతర దేశాల మాదక ద్రవ్యం వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నగదును బ్యాంకర్లుకు అందజేవారు. లెక్కింపులో ఆలయ ఏఈవోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమనీయం... కల్యాణంరామయ్య స్వామివారి నిత్యకల్యాణం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భద్రాచలంలో 72 రోజుల హుండీ కానుకల లెక్కింపు -
గ్రామాల్లో మళ్లీ ‘రెవెన్యూ’
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్రామ పాలనకు పునర్వైభవం సంతరించుకోనుంది. గ్రామ పరిపానాధికారుల(జీపీఓ)ల నియామకంతో గ్రామస్థాయిలో రెవెన్యూ పాలన పునరుజ్జీవం పోసుకోనుంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, దీని కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని 2020లో గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేసింది. వీఆర్వో, వీఆర్ఏలను ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగైంది. ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఐదేళ్లుగా గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడ స్తంభించాయని భావించిన ప్రస్తుత ప్రభుత్వం తిరిగి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జీపీఓల నియామకానికి శ్రీకారం చుట్టింది. దీంతో మళ్లీ గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందనున్నాయి. గతంలో వీఆర్ఓ, వీఆర్ఎలుగా విధులు నిర్వహించిన వారికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా నిర్ణయించి, ఆసక్తి ఉన్న వారికి అర్హత పరీక్ష నిర్వహించారు. గతంలో జిల్లాలో 329 మంది వీఆర్ఏలు, 247 మంది వీఆర్ఓలు ఉండగా, వారిలో 176 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో 67 మంది వీఆర్ఏలు, 109 మంది వీఆర్ఓలు ఉన్నారు. గ్రామస్థాయిలో కీలకం జీపీఓలు గ్రామస్థాయిలో కీలకంగా మారనున్నారు. భూభారతి, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలవడం, ఓటర్ల జాబితాలో కీలకంగా వివిధ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ప్రాథమిక నివేదికలో విధులను నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా తయారీలో కీలకంగా మారడంతో పాటు ఎన్నికల సమయంలో బీఎల్ఓలుగా వ్యవహరించనున్నారు.జిల్లాలోని 23 మండలాల్లో 376 రెవెన్యూ గ్రామాలను 204 క్లస్టర్లుగా నిర్ణయించారు. ఆసక్తి ఉండి పరీక్ష రాసిన 176 మందితో పాటు మరో 18 మందిని అడిషనల్ జీపీఓలుగా ఎంపిక చేశారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఇంకా 10 మందిని జీపీఓలుగా నియమించాల్సి ఉంది. గత సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా జీరో సర్వీసుగా నిర్ణయిస్తారని జరుగుతున్న ప్రచారం కారణంగా కూడా కొందరు జీపీఓలుగా రాకుండా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన విధులను తిరిగి నిర్వహించే అదృష్టం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు అవసరమైన సేవలను అంకిత భావంతో అందిస్తాం. మాకు ఈఅవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు. – కాక శ్రీను, జీపీఓల అధ్యక్షుడు ప్రజలకు గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి తిరిగి అవకాశం రావడం పునర్జన్మగా భావిస్తున్నాను. తిరిగి మా విధులను మేము నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు రుణపడి ఉంటాం. శాయశక్తులా ప్రజలకు మా సేవలను పారదర్శకంగా అందిస్తాం. –పోడెం వరలక్ష్మి, జీపీఓల కోశాధికారి గ్రామరెవెన్యూ వ్యవస్థ బలోపేతమవుతోంది. ప్రజలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు వ్యయప్రయాసలతో వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామస్థాయిలో జీపీఓల విధులను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. –డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్ -
మహిళా శక్తికి ప్రతీక.. ఐలమ్మ
సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్య సాహసంతో పోరాడిన చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, శ్రామిక జన విముక్తి కోసం ఐలమ్మ చాటిన పోరాటపటిమ నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత, బీసీ సంఘం నాయకులు అజిత్కుమార్, ముదిగొండ రాంబాబు, సర్వేష్, జంగంపల్లి రాజు, దురిశెట్టి కుమార్, విజయలక్ష్మి, కొదుమూరి సత్యనారాయణ, కాపర్తి వెంకటాచారి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 17 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: మహిళల ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా నిలుస్తుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్ నారీ–స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో స్వాస్థ్ నారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల ఆరోగ్య కేంద్రాల్లో సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. మారిన జీవనశైలి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారని, శిబిరాల్లో వ్యాధుల నిర్ధారణ జరిగితే తగిన చికిత్స, అవసరమైన మందులు అందించవచ్చని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ, శక్తిమంతమైన కుటుంబ నిర్మాణం, సమాజాభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీసీహెచ్ఓ రవిబాబు, డీపీఓ చంద్రమౌళి, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, మున్సిపల్ కమిషనర్లు సుజాత, శ్రీకాంత్ తదితరరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
పరిషత్ ఓటర్లు 6,69,048 మంది
చుంచుపల్లి: జిల్లాలో జిల్లా, మండల పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 6,69,048 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. ఈ మేరకు బుధవారం జెడ్పీ అధికారులు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న జిల్లాలోని 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సిద్ధం చేశారు. ఆ ప్రకారమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్ల జాబితాపై అధికారులు కసరత్తు చేశారు. గత ఫిబ్రవరిలో ప్రచురించిన జాబితా కంటే ప్రస్తుత జాబితాలో 12,126 మంది ఓటర్లు తగ్గారు. జిల్లాలోని 233 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండగా, ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలకు తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియటంతో ప్రత్యేకాధికారులను నియమించారు. మండల ప్రజా పరిషత్ పాలనను జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, జిల్లా పరిషత్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో పరిషత్ ఎన్నికలు కొంత ఆలస్యమవుతాయనే ప్రచారం జరుగుతోంది. దసరా తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.రెండు విడుతలుగా..జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు అధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని ఓటర్ల జాబితాలను, పోలింగ్ కేంద్రాలపై కసరత్తు చేశారు. ఈ నెల 6న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాను మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించారు. 8న మండల, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 9న అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం జెడ్పీ అధికారులు బుధవారం తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించారు. త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికలను జిల్లాలో రెండు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 22 మండలాలకు తొలుత 12 మండలాలు, తర్వాత 10 మండలాలకు పోలింగ్ జరగనుంది.ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిజిల్లాలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 22 జెడ్పీటీసీలు, 233 ఎంపీటీసీలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. తుది ఓటర్ల జాబితాలతో పాటు పొలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాం. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా పోలింగ్కు సిద్ధంగా ఉన్నాం.– బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓమండలాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా...మండలం; పురుషులు; మహిళలు; ఇతరులుఆళ్లపల్లి; 4,641; 4,673; 0అన్నపురెడ్డిపల్లి; 8,363; 8,569; 0అశ్వాపురం; 16,069; 17,278; 0అశ్వారావుపేట; 14,927; 15,770; 2భద్రాచలం; 19,624; 21,136; 1బూర్గంపాడు; 24,676; 25,673; 2చండ్రుగొండ; 11,640; 12,214; 1చర్ల; 15,686; 16,963; 4చుంచుపల్లి; 18,743; 19,814; 5దమ్మపేట; 21,288; 23,255; 0దుమ్ముగూడెం; 17,370; 19,389; 3గుండాల; 6,629; 6,701; 0జూలూరుపాడు; 13,681; 14,303; 1కరకగూడెం; 6,393; 6,476; 0లక్ష్మీదేవిపల్లి; 15,845; 16,725; 1మణుగూరు; 17,924; 18,556; 0ములకలపల్లి; 13,887; 14,493; 0పాల్వంచ; 13,972; 14,947; 2పినపాక; 13,227; 14,122; 1సుజాతనగర్; 7,109; 7,311; 1టేకులపల్లి; 20,677; 21,391; 0ఇల్లెందు; 22,674; 24,220; 0 -
వేధిస్తున్న సిబ్బంది కొరత
● పశువైద్య శాఖలో 69 పోస్టులు ఖాళీ ● మూగజీవాలకు సక్రమంగా అందని వైద్యం ● ఏడాది కాలంగా భర్తీ చేయని ఉన్నతాధికారులు పాల్వంచరూరల్: పశుసంవర్థక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పశువులకు సక్రమంగా వైద్యసేవలు అందడంలేదు. జిల్లాలో 2018–2019 లెక్కల ప్రకారం పశుసంపద 4.55 లక్షలు ఉన్నాయి. ఇందులో తెల్లపశువులు 2.80 లక్షలు, నల్లపశువులు (గేదెలు) 1.70లక్షలు, మేకలు 2.50 లక్షలు, గొర్రెలు 2.60 లక్షలు, నాటుకోళ్లు 1.38 లక్షలు, పందులు 3,180, కుక్కలు 30వేలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 80 పశువైద్యశాలలు ఉండగా, వీటిలో ఆరు ప్రాంతీయ పశువైద్యశాలలు, 30 ప్రాథమిక పశువైద్యశాలలు, 44 పశువైద్యశాలల ఉపకేంద్రాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అధికారులు, సిబ్బంది కలిపి 219 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. మరో 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాల్వంచ పట్టణంలోని ఏరియా పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఇన్చార్జితో నెట్టుకొస్తున్నారు. పశువైద్యంపై ప్రభావం వెటర్నరీ శాఖలో ఖాళీ పోస్టులు ఏడాది నుంచి భర్తీ చేయడంలేదు. సిబ్బంది కొరతతో జిల్లాలోని పశు సంపదపై ప్రభావం పడుతోంది. పశువులు, గేదెలు అనారోగ్యం బారిన పడి సకాలంలో వైద్యసేవలు అందక మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పశుసంవర్థక శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.హోదా మొత్తం ప్రస్తుతం ఖాళీలు పోస్టులు ఉన్నది డిప్యూటీ డైరెక్టర్ 1 1 0 అసిస్టెంట్ డైరెక్టర్లు 8 6 2 వెటర్నరీ అసిస్టెంట్లు 30 28 2 ఆఫీస్ సూపరింటెండెంట్లు 2 2 0 సీనియర్ అసిస్టెంట్లు 6 4 2 జూనియర్ అసిస్టెంట్లు 10 10 0 టైపిస్ట్ 1 1 0 లైవ్స్టాక్ ఆఫీసర్లు 10 5 5 జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు 18 14 4 లైవ్ స్టాక్ అసిస్టెంట్లు 24 24 0 వెటర్నరీ అసిస్టెట్లు 23 11 12 ఎన్యూమరేటర్ 1 1 0 వెటర్నరీ వ్యాక్సినేటర్లు 14 3 11 డ్రైవర్లు 2 1 1 ఆఫీసు అటెండర్లు 69 39 30 219 150 69 -
వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రాంతీయ ఆస్పత్రులు మణుగూరు, ఇల్లెందు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు పాల్వంచ, చర్లలో మత్తు డాక్టర్లు, గైనకాలజీ, రేడియాలజీ, జనరల్సర్జన్, పిల్లల వైద్య నిపుణుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయని, అభ్యర్థులు ఈ నెల 20లోపు కలెక్టరేట్లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 93472 77353 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. 2,680 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు పంపిణీ ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్కు బుధవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,680 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ ఎరువును ఖమ్మం జిల్లాకు 1,380, భద్రాద్రి జిల్లాకు 800, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయగా.. పోలీసు పహారాలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలికొత్తగూడెంటౌన్: ఈ నెల నెల 13న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. బుధవారం జిల్లా కోర్టులోని లైబ్రరీహాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అందరూ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకొచ్చేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని తెలిపారు. మునగ సాగుతో ఆదాయంజిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు టేకులపల్లి: మునగ సాగుతో అనేక లాభాలు ఉన్నాయని, రైతులు మునగ సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన టేకులపల్లిలో మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య విలువలు, పోషకాలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల మునగకు మార్కెట్లో ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆ తర్వాత శంభునిగూడెంలో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీని పరిశీలించారు. డ్రోన్ ద్వారా ఎకరానికి రూ. 300తో నానో యూరియా, పురుగుల మందు పిచికారీ చేయవచ్చని, తద్వారా కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చని చెప్పారు. డీపీడీ సరిత, ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈవోలు శ్రావణి, రమేష్ రైతులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్పై నిర్లక్ష్యం తగదు
మణుగూరు రూరల్: కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించిందని, ఆ ప్రాజెక్ట్పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం కూలిపోతుందంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్ కావాలనే తప్పుడు నివేదికలను ప్రకటించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టుబడిగా పెడితే, 20 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.50లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే కుట్రలు పన్నుతున్నాయని, రానున్న రోజుల్లో ప్రజలే ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అసత్య ఆరోపణలు మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, పోశం నర్సింహరావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టం రాంబాబు,నూకారపు రమేష్, వేర్పుల సురేష్, అక్కి నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
కోలాహలంగా ‘కేటీపీఎస్’ ఎన్నికలు
పాల్వంచ/మణుగూరురూరల్: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలు బుధవారం కోలాహంగా జరిగాయి. కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 2,100 మంది సభ్యులకు 1,728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణుగూరులోని బీటీపీఎస్ ఎస్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో 500 మంది ఉద్యోగస్తులకు గాను 450మంది ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వైటీపీఎస్లో 396 మంది ఓటర్లకుగాను 367 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్ల ను ఆకర్షించేలా ఫ్లకార్డులు, కరపత్రాలు, గుర్తులను సూచిస్తూ అభ్యర్థులు సందడి చేశారు. పోటీలో ఉన్న 37 మంది డైరెక్టర్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రా ల వద్ద ఉద్యోగులను కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. సొసైటీలో మొత్తం 2,996 మంది ఓటర్లు ఉండగా, 2,545మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. మొత్తం84.94శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 84.94 శాతం పోలింగ్ -
యూరియా పక్కదోవ పట్టిందని ఆందోళన
పాల్వంచ: కో ఆపరేటివ్ సొసైటీ సిబ్బంది యూరి యా బస్తాలను పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం సొసైటీ కార్యాలయం నుంచి నుంచి 15 బస్తాల యూరి యాను ఆటోలో ఎక్కించి మహబుబాబాద్కు పంపించే ప్రయత్నం చేస్తుండగా స్థానిక రైతులకు అనుమానం వచ్చి ఆందోళన చేపట్టారు. యూరియా కోసం వచ్చిన వ్యక్తి స్థానికుడు కాదంటూ వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ బీసీఎం రహదారిపై నిరసన తెలిపారు. దీంతో సీఐ సతీష్కుమార్, ఎస్ఐ సుమన్లు అక్కడికి చేరుకుని ఆటోను స్టేషన్కు తరలించారు. రైతులను శాంతింపజేశారు. ఆత్మకమిటీ టెక్నికల్ అసిస్టెంటే సూత్రధారి? యూరియా బస్తాల అక్రమ తరలింపునకు ఆత్మకమిటీ టెక్నికల్ అసిస్టెంట్ సూత్రధారి అని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బుధవారం అతని తండ్రి ఓ ఆటోను పాల్వంచ సొసైటీకి పంపించగా, బిల్లులు లేకుండా 15 యూరియా బస్తాలో ఆటోలో ఎక్కించాడు. రైతులు గమనించి ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు సదరు వ్యక్తి కార్యాలయం నుంచి బయటకు వెళ్లి దొంగ బిల్లులు సృష్టించి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సిబ్బంది సహకారంతో టెక్నికల్ అసిస్టెంట్ అక్రమంగా యూరియా తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై సీనియర్ అసిస్టెంట్ లక్ష్మిని వివరణ కోరగా.. యూరియా బస్తాలను స్లిప్ల ప్రకారం ఇచ్చామని, అవి ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయం తమకు సంబంధం లేదన్నారు. ఎస్ఐ సుమన్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. -
కొనసాగుతున్న టిమ్ డ్రైవర్ల నిరసన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్లు చేపట్టిన నిరసన మూడో రోజు బుధవారం కూడా కొనసాగింది. 42 మంది టిమ్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు 10 సర్వీసులను తగ్గించారు. ఫలితంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు యూనియన్ల నాయకులు జేఏసీగా ఏర్పడి, టిమ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డీఎం తిరుపతిని కోరారు. లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పారు. భద్రాచలానికి డిపోనకు చెందిన టిమ్ డ్రైవర్ నాగరాజు పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తోటి డ్రైవర్లు తెలిపారు. కాగా భద్రాచలం డిపోలో సేప్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ (ఎస్డీఐ)గా విధులు నిర్వహిస్తున్న పోకల సురేష్ తన పోస్టుకు మంగళవారం రాత్రి రాజీనామా చేశారు. -
పాఠశాలలకు ప్రోత్సాహకాలు
● జాతీయిస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ. లక్ష నగదు ● స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్తో సర్కారు స్కూళ్ల ఎంపికలు ● 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారుల వెల్లడి కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, అభివృద్ధి, విద్యార్థుల నైపుణ్యం, హరిత వాతావరణం ప్రమాణికాలుగా రేటింగ్, నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా 200 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో స్కూల్కు రూ.లక్ష నగదును ప్రోత్సాహకంగా అందించనున్నారు. సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజులపాటు దేశవ్యాప్త విహార కేంద్రాల సందర్శనకు తీసుకెళ్లనున్నారు. ఇవీ అర్హతలు.. గతంలో స్వచ్ఛ పురస్కారాలు అందజేసే వారు. ప్రస్తుతం రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సమాజంలో శుభ్రతపై అవగాహన పెంచడం, పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనం వైపు మలచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాలను వర్గీకరించడం, నీటి వినియోగంలో మితవ్యయం పాటించడం, వర్షపునీటి సేకరణకు ఏర్పాట్లు, విద్యార్థుల్లో పర్యావరణ స్నేహపూర్వక అలవాట్లను పెంపొందించడం, స్వచ్ఛ విద్యాలయం, మరుగుదొడ్ల శుభ్రత, తాగునీటి సదుపాయం, తరగతి గదుల శుభ్రత, దినసరి పరిశుభ్రత కార్యక్రమాలు, పాఠశాలల్లో మొక్కల పెంపకం, విద్యుత్ పొదుపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న పాఠశాలలను పరిశీలించి రేటింగ్ ఇవ్వనున్నారు. అర్హతలున్న పాఠశాలలు ఈ నెల 30 లోగా దరఖాస్తులను అందజేయాలి. జిల్లాలో అర్హతలు కలిగిన పాఠశాలలు ఎక్కువగానే ఉన్నాయని, ఆయా పాఠశాలలన్నీ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. కేటగిరీలు ఇలా... జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, సబ్బుతో చేతులు కడగడం, వినియోగం, నిర్వహణ, ప్రవర్తన మార్పు, సామర్థ్య నిర్మాణం, జీవన శైలిలో మార్పులు, పాఠశాలల్లోని నిర్మాణాలు, మరుగుదొడ్లు, నీటి వసతి, హరితావరణం, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యకర వాతావరణం వంటి కేటగిరీలలో రేటింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలో మొత్తం 1,685 పాఠశాలలు ఉన్నాయి. డీఈఓ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు 1,081, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 310, సోషల్ వెల్ఫేర్ 09, మైనారిటీ వెల్ఫేర్ 07, బీసీ వెల్ఫేర్ 11, ఎయిడెడ్ 30, ప్రైవేట్ (అన్ ఎయిడెడ్) 223, జూనియర్ కళాశాలలు 14 ఉన్నాయి. ఇవన్నీ రేటింగ్ పరిధిలోకి రానున్నాయి. 0–50 మార్కులు: ఒక నక్షత్రం 51–74 మార్కులు: రెండు నక్షత్రాలు 75–80 మార్కులు: మూడు నక్షత్రాలు 81–89 మార్కులు: నాలుగు నక్షత్రాలు 90–100 మార్కులు: ఐదు నక్షత్రాలు జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి ఆన్లైన్లోనే స్వీయ నివేదికలు సమర్పించాలి. రేటింగ్లో మెరుగైన పాఠశాలలకు జాతీయ స్థాయిలో ఎంపిక చేస్తారు. రూ. లక్ష ప్రోత్సాహక బహుమతి అందిస్తారు. రేటింగ్ ప్రక్రియలో పాల్గొనే పాఠశాలల ఆవరణ అందంగా పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చర్యలు తీసుకోవాలి. –బి. నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి గతంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పేరుతో ఈ అవార్డులను ఇచ్చేవారు. ఈ సంవత్సరం నుంచి స్వచ్ఛ, హరిత విద్యాలయ రేటింగ్ పేరుతో అమలు చేస్తున్నారు. అవార్డుల వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో పాఠశాల పట్ల బాధ్యత పెరుగుతుంది. సమాజంలో స్వచ్చ భారత్ –హరిత భారత్ లక్ష్యాల సాధనకు తోడ్పడుతుంది. –ఎస్కే సైదులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి -
విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి
మణుగూరు టౌన్/అశ్వాపురం: విద్యార్థినులకు చదువుతోపాటు పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం మణుగూరు మండలంలోని గుట్ట మల్లారంలో గిరిజన సంక్షేమ గురుకుల బాలి కల, జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. వంటగది, సామగ్రి, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి మెనూ అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. విషకీటకాలు సంచరించే అవకాశం ఉన్నందున రాత్రివేళ బయటకు రావొద్దని విద్యార్థులకు చెప్పారు. జీసీసీ కార్యాలయం నుంచి బియ్యం సరఫరాలో జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు తెలుపగా, వెంటనే అధికారులతో మాట్లాడారు. కొందరు విద్యార్థులు వైరల్ ఫీవర్తో బాధపడుతుండగా పీహెచ్సీ వైద్యులతో మాట్లాడి చికిత్స అందించారు. అశ్వాపురం రైతువేదికలో నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్ పథకంలో భాగంగా నిర్వహించిన గ్రామస్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు గిరిజనులకు అందేలా మండల లెవల్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మామిళ్లవాయి, తుమ్మలచెరువు, పాములపల్లి, గొందిగూడెం గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి పథకాల గురించి వివరించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు అంశాలపై తహసీల్దార్తో చర్చించారు. ఆ తర్వాత తహసీల్దార్ డేవిడ్రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు. -
రికార్డుల తనిఖీ
మణుగూరు రూరల్: మండల పరిషత్ కార్యాల య ప్రాంగణంలోని మెప్మా కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం.విద్యాచందన బుధవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. మెప్మా ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం తోగ్గూడెంలోని సర్క్యూలేటరీ ఆక్వా సిస్టం, కొర్రమీను చేపల పెంపకం కేంద్రం, కూనవరంలో మునగ తోటను సందర్శించారు. మునగ సాగు వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలి పారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని ఐకేపీ సంఘాల గోదాంను, ఎస్హెచ్జీ మహిళా సంఘాల సభ్యులకు దసరా కానుకగా అందించే చీరల పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల అమలుపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ము న్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంపీఓ పి వెంకటేశ్వరరావు, అహ్మదుల్లా పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలిపాల్వంచ: విద్యుత్ అంతరాయాలను తగ్గించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వినియోగ దారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ రావు సూచించారు. బుధవారం జెన్కో ట్రైనింగ్ సెంటర్లో విద్యుత్ సరఫరా–అంతరాయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ అంతరాయాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, విద్యుత్ నియంత్రికల నిర్వహణ, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న కార్యక్రమాలు, వినియోగదారులకు, రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది రక్షణ పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ఎల్సీ యాప్ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసు నమోదుదమ్మపేట: భార్య మీద హత్యాయత్నం చేసిన భర్తపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా టీ.నర్సాపురం మండలం సోములపాలేనికి చెందిన మునీశ్వరికి మండలంలోని తాటిమల్లప్పగుంపునకు చెందిన వాడే బుజ్జిబాబుతో వివాహం జరిగింది. భర్త ప్రవర్తన సరిగాలేదని మునీశ్వరి గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె భర్త నుంచి వేరుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో భార్యపై పగ పెంచుకున్న బుజ్జిబాబు బుధవారం మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట పిల్లల కోసం వేచి చూస్తున్న భార్య మునీశ్వరిపై కొడవలితో దాడి చేశారు. దీంతో మెడపై, కుడి చేతికి గాయాలై రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం ఆమెను ఏపీలోని జంగారెడ్డిగూడెం తరలించారు. బాధితురాలి సోదరి పోడియం సుంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతిసత్తుపల్లిరూరల్: ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘసటన సత్తుపల్లి మండలం సత్యంపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేట గ్రామంలో సోయం శివ, సంధ్యారాణి దంపతుల సంవత్సరం వయసు గల కుమార్తె మోక్షదుర్గ.. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ మూతలేని ఇంకుడుగుంతలో పడింది. కుటుంబ సభ్యులు గమనించకపోవడతో కొద్ది సేపటికి చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత చిన్నారి కోసం వెదుకుతుండగా ఇంకుడుగుంతలో మృతదేహం కనిపించింది. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్విజయ్కుమార్ బుధవారం సత్యంపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పిడుగుపాటుతో ముగ్గురు కూలీలకు అస్వస్థత
టేకులపల్లి: వరి చేనులో పని చేస్తున్న ముగ్గురు వ్యవసాయ కూలీలు బుధవారం పిడుగు పాటుతో అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని ప్రెగళ్లపాడు పంచాయతీ తూర్పుగూడెం గ్రామానికి చెందిన ఈసం రాజమ్మ, కొడెం పాపమ్మ, గొగ్గెల శిరీష గ్రామం సమీపంలోని స్టేషన్బేతంపూడి గ్రామంలో వరి పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం భారీ వర్షంతోపాటు వరి పొలంలో పిడుగు పడటంతో కూలీలు స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యారు. వారిని రైతులు సమీపంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. పిడుగుపాటుకు కూలిన పోర్టికోసుజాతనగర్: మండలంలో బుధవారం సుమారు 3 గంటలపాటు భారీవర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాఘవాపురంలో తెల్లబోయిన పెద్ద శ్రీను ఇంటి పొర్టికో పిడుగుపాటుతో కూలిపోయింది. ఆర్ఐ కాంతారావు పరిశీలించి సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వర్షం ప్రభావంతో మండల కేంద్రం చెరువును తలపించింది. దొంగలకు దేహశుద్ధిపాల్వంచరూరల్: కిన్నెరసాని వాగు ఒడ్డున, పంట పొలాల వద్ద ఉన్న వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మండలంలోని నాగారం గ్రామ శివారులో వ్యవసాయ విద్యుత్ మోటార్లతోపాటు ద్వి చక్రవాహనాల ఇంజన్లను చోరీ చేస్తుండగా మంగళవా రం రాత్రి స్థానికులు ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు పారిపోయాడు. నిందితులు బూర్గంపాడు పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు తేలడంతో వారిని బూర్గంపాడు పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఐ సురేష్ బుధవారం తెలిపారు. సైబర్ కేసు నమోదుదమ్మపేట: దమ్మపేట పోలీసు బుధవారం సైబర్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని లచ్చాపురం గ్రామానికి చెందిన కంపాటి చిలకమ్మ(32) సెల్ఫోన్కు కొద్దినెలల క్రితం తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు అర్జించవచ్చంటూ ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.2,80,000 ఓ యాప్లో పెట్టుబడిగా పెట్టింది. లాభాలు రాకపోవడంతో గత నెల 16న ఎన్సీఆర్పీ పోర్టల్లో ఆన్లైన్లో ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.80,264ను స్తంభింపజేశారు. బాధితురాలు బుధవారం స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.