breaking news
Bhadradri
-
ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్
● సమస్యల సత్వర పరిష్కారానికి కృషి ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్సూపర్బజార్(కొత్తగూడెం): జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియలో భాగంగా అన్ని 33 కేవీ లైన్లలోని 38 ఫీడర్ల పనులు పూర్తిచేసినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. 11 కేవీ లైన్లలోని 252 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్ రాస్తున్నట్లు తెలిపారు. దీంతో నిర్వహణ పనులను కూడా సమర్థవంతంగా ట్రాక్ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. విద్యుత్ అంతరాయాలు, ట్రాన్సఫార్మర్ల వైఫల్యాలు వంటి వివరాలను కూడా సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ పోల్ నంబర్ ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకుని, సిబ్బంది సత్వరమే అక్కడికి చేరుకుంటారని అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రియల్ టైమ్లో కచ్చితమైన సమాచారం పొందే అవకాశం ఉండటంతోపాటు వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని, ఫీడర్ల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్ఈ వివరించారు. -
దేవేరుల గనులు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ తీరంలో ప్రాణహిత దగ్గర నుంచి మొదలు పెడితే పాపికొండల వరకు ప్రాచీన జీవజాతులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఒకప్పటి దండకారణ్యంలో భాగంగా ఉన్న జిల్లాలో ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. పినపాక మండలం పాండురంగాపురం దగ్గర రాకాసి గూళ్లు (పురాతన సమాధులు), ములకలపల్లి మండలం అక్షరలొద్ది, ఒంటిమిట్టగుండుల దగ్గర రాక్ పెయింటింగ్లు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. బౌద్ధ విహారాలు, రాష్ట్ర కూటులు, కాకతీయులు కట్టించిన ఆలయాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అయితే, చరిత్ర గర్భంలో కలిసిపోయిన దేవీదేవేరులను సింగరేణి సంస్థ వెలుగులోకి తెచ్చింది. విభిన్నంగా.. ఖని అంటే గని అనే అర్థం. ఆరంభంలో సింగరేణి గనులకు నంబర్లతో లేదా ఆ గనికి పర్యవేక్షకుడిగా ఉన్న అధికారుల పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొత్తగూడెంలో అధికారి పేరు మీద బర్లి పిట్ గని ఉండేది. బొగ్గును వెలికితీసే పద్ధతిని బట్టి ఇల్లెందులో 21 పిట్, స్ట్రట్పిట్ ఉండగా, ఇతర ఏరియాల్లో 5 ఇంక్లైన్, 7 ఇంక్లైన్, 8 ఇంక్లైన్, సెంచరీ ఇంకై ్లన్ పేర్లతో గనులు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకుల పేర్ల మీదుగా కూడా గనులు వచ్చాయి. ఇల్లెందులో జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా జవహర్ఖని (జేకే), రామకృష్ణాపూర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్రఖని (ఆర్కే), మణుగూరులో టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ప్రకాశంఖని (పీకే) ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. భూపాలపల్లి ఏరియాలో గనులను కాకతీయఖని (కేకే), బెల్లంపల్లిలో శాంతిఖని, మందమర్రిలో కల్యాణిఖనిగా నామకరణం చేశారు. కొన్ని గనులు అక్కడున్న గ్రామం పేరుతో కూడా వచ్చాయి. మణుగూరులో కొండాపూర్ ఓసీ, ఇల్లెందులో పొలంపల్లి గనులు ఉన్నాయి. రామగుండం దగ్గర గోదావరి నది తీరంలో బొగ్గు గనులు రావడం, అక్కడ కార్మిక బస్తీలు పెరిగిపోవడంతో ఏకంగా గోదావరిఖని (రామగుండం) పేరుతో కార్పొరేషన్ ఏర్పాటైంది. కానీ, సింగరేణి వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఒక్క కొత్తగూడెం ఏరియాలోనే వెంకటేశ్ఖని, పద్మావతిఖని అంటూ దేవుడి పేర్లతో గనులు వచ్చాయి. వెలుగులోకి వెంకటేశ్వరుడు పద్మావతిఖనికి సమీపంలో వెంకటేశ్వరుడి విగ్రహం లభ్యమైంది. అప్పటికే కొత్తగూడెంలో 1 నుంచి 6 వరకు నంబర్లతో గనులు వచ్చాయి. దీంతో 1957లో మొదలైన గనికి వెంకటేశ్ఖని, ఆ తర్వాత వీకే–7గా పేరు పెట్టారు. 70 ఏళ్లకు పైగా వీకే, పీవీకే పేర్లతో కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆయువుపట్టుగా పద్మావతి, వెంకటేశ్ గనులు నిలిచాయి. గత చరిత్రకు గుర్తుగా ఇక్కడున్న ఓ కొండపై శ్రీభూనీల సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సింగరేణి నిర్మించింది. బొగ్గు నిక్షేపాలు తరిగిపోవడంతో వీకే గని 2021లో మూతపడింది. తాజాగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ఏకకాలంలో భూగర్భ, ఓపెన్కాస్ట్ పద్ధతుల్లో బొగ్గును వెలికి తీసే వీకే మెగా మైన్గా మళ్లీ వెలుగులోకి వచ్చింది. బుద్ధుడికీ ఓ గని.. కొత్తగూడెం సమీపంలో కారుకొండ దగ్గర గౌతమ బుద్ధుడి విగ్రహాలు వెలుగు చూశాయి. వీటిని ఆర్కియాలజీ సంస్థ రక్షిత స్థలాలుగా ప్రకటించింది. ఈ చరిత్రకు గౌరవాన్ని కల్పిస్తూ గౌతంఖని పేరుతో ఒక ఓపెన్కాస్ట్ మైన్ను సింగరేణి సంస్థ 1991లో ప్రారంభించింది. ఈ గనిలో పని చేసే కార్మికుల కోసం కట్టించిన కాలనీకి గౌతంపూర్ కాలనీగా పేరు పెట్టింది. అయితే, ఈ గని కూడా 2021లో మూతపడింది.స్వాతంత్య్రానికి ముందే సింగరేణి బొగ్గు గనులు ఇల్లెందు, బెల్లంపల్లిలో ప్రారంభయ్యాయి. ఆ తర్వాత కొత్తగూడేనికి 1936లో విస్తరించాయి. ఈ క్రమంలో తొలి గనిగా ప్రస్తుత హెడ్ ఆఫీస్ దగ్గర బర్లిపిట్ మొదలైంది. అయితే, ఇక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఈ గని మూతపడింది. ఆ తర్వాత రామవరం దగ్గర గనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అక్కడున్న కొండలు, గుట్టల్లో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తుండగా అక్కడ భూమి పొరల్లో మరుగున పడిన ఓ శిలా విగ్రహం లభ్యమైంది. ఆనవాళ్లను బట్టి పద్మావతిదేవి విగ్రహంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో 1952లో మొదలైన గనిని పద్మావతిఖని పేరుతో పిలవడం మొదలైంది. కొత్తగూడెంలో బొగ్గు బావులకు దేవుళ్ల పేర్లు -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హాజరుకావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ఐటీడీఏలో గిరిజన దర్బార్భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో.. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. ‘మిల్లెట్’ మహిళకు సత్కారంభద్రాచలం: ఐటీడీఏ సహకారంతో స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన మహిళను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించారు. భద్రాచలం గిరిజన మహిళలు మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. వీరి స్ఫూర్తి కథపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్కీ బాత్లో ప్రస్తావించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కొమరం భీమ్ భవనంలో మిల్లెట్ బిస్కెట్ తయారీదారు వెంకటలక్ష్మి ఘనంగా సత్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, ధనసరి సీతక్క, పురస్కారం అందజేశారు. -
వంటింటిపై భారం
● గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెంపు ● రూ. 952కు చేరిన 14.2 కేజీల సిలిండర్ రేటు ● పెరిగిన ధరతో జిల్లాపై రూ. 2.81కోట్ల భారంపాల్వంచరూరల్: పశ్చిమాసియాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశంలోని చమురు సంస్థలు వంట గ్యాస్ ధర పెంచాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.842 ఉండగా, గతేడాది రూ. 50 పెంచడంతో రూ.892కు చేరింది. శనివారం నుంచి మరో రూ. 60 పెంచడంతో ప్రస్తుతం రూ.952కు పెరిగింది. పెరిగిన ధరతో జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై రూ.2,81,44,500 భారం పడుతోంది. వంట గ్యాస్ ధరలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే గ్యాస్ ధర పెంపుతో మరింత భారం పడిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కమర్షియల్ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,953 ఉండగా, రూ.114 పెంపుతో ప్రస్తుతం రూ.2,067కు పెరిగింది. జిల్లాలో 4,69,075 మంది గృహ వినియోగదారులు జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు 4,69,075 మంది ఉన్నారు. ఇందులో సింగిల్ సిలిండర్ వినియోగదారులు 2,41,175 మంది, రెండు సిలిండర్లు కలిగినవారు 98,868 మంది ఉన్నారు. దీపం కనెక్షన్లు 53,405, కార్పొరేట్ రెస్పాన్స్ బిలిటీ పర్సన్(సీఎస్ఆర్) కనెక్షన్లు 2465, ఉజ్వల పథకం కనెక్షన్లు 73,162 ఉన్నాయి. -
హెచ్పీవీ టీకాతో కేన్సర్ నిర్మూలన
ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ అంకిత్చుంచుపల్లి: హెచ్పీవీ టీకాతో మహిళల్లో గర్భాశయ ముఖ కేన్సర్ను నివారించవచ్చని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. టీకాల కార్యక్రమాన్ని ఆదివారం ఆయన కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కలెక్టర్ అంకిత్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. వ్యాక్సినేషన్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అర్హులైన బాలికలందరికీ టీకా అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, డీఎంహెచ్ఓ తుకారామ్ రాథోడ్, డీసీహెచ్ఎస్ రవిబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధామోహన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పాల్గొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించాలి పాల్వంచ: పద్నాలుగు ఏళ్లు నిండి, 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ రవిబాబు అన్నారు. ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్, హరీష్, సీతమ్మ, రాంప్రసాద్, సిబ్బంది ఎస్.కృపామణి, ఎం.రమాదేవి, సల్మా పాల్గొన్నారు. సింగరేణి సీఎండీని కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే రుద్రంపూర్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతిని శనివారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం సింగరేణి డైరెక్టర్లు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు, నాయకులు ఎస్కే సాబీర్పాషా, వంగా వెంకట్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’లో టాప్
● రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందంజ ● గ్రౌండింగ్ అయిన ఇళ్లలో 70 శాతం పూర్తిసాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయిన ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా అగ్రస్థానాన నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి, జనగామ, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గ్రౌండింగ్ అయిన ఇళ్లలో 70.25 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం విశేషం.ప్రణాళికాయుతంగా పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పొరపాట్లకు తావివ్వకుండా ప్రభుత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించడమే కాక, ఆ నిధులతోనే మోడల్హౌస్లు నిర్మించి చూపించింది. వీటి ఆధారంగా అధికారులు మేసీ్త్రలు, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్తో బెడ్రూమ్, ఇంటి లోపల గదులు, వరండాల్లో టైల్స్ వేశారు. డాబా మెట్ల కింద మరో టాయిలెట్ నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు, రంగులు వేయడం ఇలా అన్ని పనులూ ఈ బడ్జెట్లోనే ఎలా పూర్తిచేయొచ్చో వివరించారు. ఐదు జిల్లాల్లో జెట్ స్పీడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఊపందుకుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం గ్రౌండింగ్ అయిన 14,470 ఇళ్లల్లో 10,165 నిర్మాణాలు పూర్తి కాగా 70.25 శాతంతో అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 58.34 శాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి, 57.50 శాతంతో జనగామ, 57.31 శాతంతో వరంగల్, 31.71 శాతంతో యాదాద్రి భువనగిరి రెండు నుంచి ఐదో స్థానం వరకు దక్కించుకున్నాయి. ఖమ్మం జిల్లాకు 16,524 ఇళ్లు.. ఖమ్మం జిల్లాకు తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 26 గ్రామాల్లో 867 ఇళ్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లో 15,657 ఇళ్లు కేటాయించారు. మొత్తంగా 16,524 మంజూరు కాగా.. 2,054 ఇళ్లు మినహా మిగతావి పునాదులు, గోడలు, స్లాబ్ దశల్లో ఉన్నాయి. మొత్తం 988 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూస్తున్నారు. ఎవరైనా ఇళ్లు ప్రారంభించకపోతే అవగాహన కల్పిస్తున్నారు. -
ఇష్టంతోనే విద్య..
వృత్తి విద్యా కోర్సులతో పాటు రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే విశ్వాసంతో డిగ్రీ కోర్సులను ఎంపిక చేసుకున్నా. తల్లిదండ్రులకు చదువుపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో మంచి కళాశాలను ఎంచుకొమ్మని మాకే చెబుతున్నారు. కొన్ని అంశాల్లో మాత్రం వారి సూచనలు పాటిస్తున్నాం. – వేముల నందిని, డిగ్రీ ద్వితీయ సంవత్సరంతల్లిదండ్రులు, స్నేహితుల సలహాలు, సూచనలతో ఎంచుకున్న కోర్సులోనే చదువుతున్నా. అందరి తల్లిదండ్రులు కూడా చదువు విషయంలో పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా చూడాలి. తద్వారా విద్యార్థులు లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. – జి.చంద్రమౌనిక, డిగ్రీ విద్యార్థిని -
బాధితులకు అండగా..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోనిభరోసా సెంటర్ మహిళలకు అండగా నిలుస్తోంది. 2024, ఫిబ్రవరి 6న ప్రారంభించగా, లైంగిక నేరాల బాధితులకు సమగ్ర సహా యం అందిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 214 కేసులు భరో సా సెంటర్లో నమోదయ్యాయి. వాటిలో 163 పోక్సో కేసులు, 35అత్యాచార కేసులు, 16ఇతర కేసులు ఉన్నాయి. బాధితులకు రూ.45లక్షల పరిహారం అందించాలని 113దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. రూ.18లక్షలు మంజూరు కాగా,49 మందికి పరిహారం అందించారు. అదనంగా విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ ద్వారా 15మందికి రూ.1,10,000 సహాయం అందజేశారు. భరోసా కేంద్రంలో మొత్తం 214 కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించారు. బాధితులకు మానసిక సహాయం, వివిధ థెరపీలు, నిరంతర ఫాలో అప్ సేవలు అందిస్తున్నారు. భరోసా కేంద్రం సేవలు భరోసా కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 214 కేసులు నమో దు చేశాం. బాధితులకు న్యాయం, వైద్య సహాయం అందిస్తున్నాం. మానసిక పరి రక్షణ, పునరావాససేవలు అందించడంలో భరోసా సెంటర్ నిరంతర కృషి చేస్తోంది. –చల్లా అరుణ, భరోసా సెంటర్ ఎస్ఐ -
మా ఊళ్లో మద్యం వద్దు
దుమ్ముగూడెం:మండల పరిధిలోని గౌ రారం గ్రామపంచాయతీలో మద్యం విక్రయించొద్దని గ్రామసభలో తీర్మానించారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా విధించాలని నిర్ణయించారు. శనివారం సర్పంచ్ శ్యామల రవి వర్మ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. మూడు అంశాలు విద్యపై అవగాహన, మత్తు పదార్థాల నిరోధంపై అవగాహన, మద్యపాన నిషేధంపై చర్చించారు. గ్రామ మహిళలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకు న్న తర్వాత మద్యపాన నిషేధం పాటించాలని నిర్ణయించినట్లు పాలకవర్గ సభ్యులు తెలి పారు. గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకట ప్పయ్య మత్తు పదార్థాలవల్ల కలిగే నష్టాలపై అవగాహ న కల్పించారు. అనంతరం సీఐని పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నం రమేష్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సోడె శ్రీనివాసరావు, ముర్రం వీరభద్రం, కల్లూరి ఆదినారాయణ, సోందె నర్సింహారావు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం -
మహిళల రక్షణే ధ్యేయంగా..
● సత్వర సేవలందిస్తున్న జిల్లా షీ టీమ్ ● రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం సొంతం సూపర్బజార్(కొత్తగూడెం): మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న జిల్లా షీ టీమ్ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. మహిళలు, యువతులు, బాలికలకు అండగా నిలబడుతోంది. ఆకతాయిలు, ఇతరులెవరైనా వేధింపులకు పాల్ప డితే నిర్భయంగా సంప్రదించేలా షీ టీం ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ బృందాలను కూడా నియమించారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్లకు గురైనా, తప్పుడు మెసేజ్లు వచ్చినా, రాంగ్ కాల్స్తో ఇబ్బంది పెట్టినా, ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినా, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా షీ టీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవలని, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేరుగా లేదా 8712682131 నంబర్కు లేదా డయల్ 100కు ఫోన్చేసి సమాచారం అందించి సమస్యలు పరిష్కరించుకోవాలని షీ టీమ్ అధికారులు కోరుతున్నారు.గతేడాది జిల్లా వ్యాప్తంగా 472 ఫిర్యాదులు స్వీకరించాం. 76 మందికి కౌన్సెలింగ్ ఇచ్చాం. 346 పెట్టీ కేసులు, 50 కేసులు ఎఫ్ఐఆర్ చేయించి బాధితులకు న్యాయం అందించాం. షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, నూతన చట్టాలు, సైబర్ క్రైమ్స్ తదితర విషయాలపై జిల్లా వ్యాప్తంగా 152 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం. –రమాదేవి, షీ టీం ఎస్ఐ -
సంస్థను మరింత అభివృద్ధి చేద్దాం
● సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ● కొత్తగూడెంలో వీకే–7 కోల్మైన్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం రుద్రంపూర్: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోపాటు లోతుగా చర్చించి సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేద్దామని, ఇందుకోసం జనరల్ అసిస్టెంట్ నుంచి జీఎంల వరకు అందరూ సహకరించాలని సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి అన్నారు. శనివారం ఆయన కొత్తగూడెంలోని వీకే–7 కోల్మైన్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఆ తర్వాత పీవీకే–5 ఇంక్లైన్ గని ఆవరణలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గనిలో సీములు, ఉత్పత్తి, నిక్షేపాల నిల్వ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగినితో కొబ్బరికాయలు కొట్టించారు. కార్మికులకు స్వయంగా ప్రసాదం తినిపించారు. అనంతరం గనిలోకి దిగి బొగ్గు ఉత్పత్తి ప్రదేశాన్ని సందర్శించారు. కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థలో సబార్డినేటర్లు ఎవరూ లేరని, అందరూ ఒకే కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. గనుల్లో 60 శాతం, ఓసీల్లో 90శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఈ నెల 6న మణుగూరు ఏరియాలో సందర్శించి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. త్వరలో సమసలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కార్మిక సంక్షేమానికి కృషి చేస్తామని, సింగరేణి సంస్థ ప్రత్యేకమైన పబ్లిక్ సెక్టార్ అని, రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందిస్తోందని వివరించారు. అందరిని సమన్వయం చేసుకుంటూ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. తొలుత యూనియన్ నాయకులను శాలువాలతో సన్మానించారు. కాగా, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతిని కలెక్టర్ అంకిత్ కలిశారు. మొక్క అందజేశారు. జిల్లా మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని సీఎండీని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమాల్లో శిక్షణ కలెక్టర్ సౌరభ్శర్మ, సింగరేణి డైరెక్టర్లు కేవీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, తిరుమలరావు, సీడీఎన్ శ్రీనివాస్ రావు, కొత్తగూడెం జీఎం ఎం.శాలేంరాజు, ఇతర అధికారులు కోటిరెడ్డి, మోహన్రావు, రామకృష్ణ శ్యాంప్రసాద్, కార్మిక నాయకులు ఎండీ రజాక్, వంగా వెంకట్, మల్లికార్జున్రావు పాల్గొన్నారు. -
నిర్ణయాధికారం అంతంతే!
స్నేహితుల సూచనసమాజం2468మా తల్లిదండ్రుల నిర్ణయం8కుటుంబంనా సొంత నిర్ణయంఇంజనీరింగ్, మెడిసిన్ వైపే.. తమ పిల్లలు ఇంటర్ పూర్తి చేయగానే వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదువులకే తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డిగ్రీ (బీఎస్సీ) కోర్సుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే డిగ్రీతో కొన్ని ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉన్నా.. ఆ దిశగా తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ సగం మంది విద్యార్థినులు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు, మిత్రులు, ఇతర కుటుంబ పెద్దల సలహాలు, సూచనలతోనే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. అయితే మేజర్లమైన తమకు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తే తమకు ఆసక్తి గల కోర్సులు చదివి భవిష్యత్కు బంగారు బాట వేసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. సొంత నిర్ణయంతోనే రాణించగలమని చెబుతున్నారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే విద్య ఎంతో ముఖ్యం. అయితే ఇప్పటికీ సగం మంది విద్యార్థినులు తమ సొంత నిర్ణయంతో కాకుండా తల్లిదండ్రుల అభీష్టం మేరకే కోర్సులను ఎంచుకుంటున్నారు. ఒకవేళ తమకు ఆసక్తి గల కోర్సులు చదవాలన్నా తల్లిదండ్రులను ఒప్పించడం వారికి అంత సులభం కావడం లేదు. సొంత నిర్ణయాలతో చదివే వారు సగం మంది వరకు ఉన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 18 – 25 ఏళ్ల మధ్య వయసు గల పలువురు విద్యార్థినులను ‘సాక్షి’ శనివారం ప్రశ్నించగా తమ మనోగతాన్ని పంచుకున్నారు. – కొత్తగూడెం అర్బన్/ఖమ్మం సహకారనగర్నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సర్వే -
వైద్య సేవలు బలోపేతం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం)/సుజాతనగర్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్శర్మతో కలిసి వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ కార్యక్రమాలపైనా సమీక్షించారు. జిల్లా లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజువారీ వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా 99 రోజుల యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. నాలుగు దశల్లో అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో తొలి దశలో మార్చి 6 నుంచి 31వ తేదీ వరకు మాతా, శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ పనితీరుపై ప్రతీ నెల సమగ్ర నివేదికను అందించాలని డీఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రు లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది కొరతపై అధికారులు కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాంరాథోడ్, డీసీహెచ్ఓ రవిబాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్యశిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ చెప్పారు. సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతీరోజు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చొప్పున వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ వైద్య శిబిరాల్లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, గైనకాలజీ, డెంటల్, ఆఫ్తమాలజీ వంటి ఆరు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శిబిరాలకు వచ్చే రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు మెరుగైన చికిత్స కోసం పైస్థాయి ఆస్పత్రులకు రిఫర్ చేయాలని పేర్కొన్నారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఈ వైద్య శిబిరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు శిబిరాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాంరాథోడ్, మేయర్ మూడు గణేశ్, తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, మెడికల్ ఆఫీసర్ రమేశ్, ఎంపీడీఓ భారతి తదితరులు పాల్గొన్నారు. -
అండగా ఉంటాం..
ఖమ్మంమయూరిసెంటర్: పారిశుద్ధ్య కార్మికులకు కేఎంసీ ఎళ్లవేళలా అండగా నిలుస్తుందని మేయర్ పునుకొల్లు నీరజ భరోసాఇచ్చారు. ‘తెల్లవారుజాము నుంచే విధుల్లో నిమగ్నమవుతారు. ఆరోగ్యాలను పణంగా పెట్టి చెత్తా, చెదారం శుభ్రం చేస్తుంటారు. ఆ దుమ్ము, ధూళిలో పనిచేస్తూ ప్రజలకు క్లీన్ ఖమ్మాన్ని పరిచయం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులతో మేయర్ నీరజ చర్చావేదిక నిర్వహించారు. కార్మికులు ఉత్సాహంగా పాల్గొని తమ సమస్యలను మేయర్కు వివరించగా.. తక్షణమే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే నగరంలోని 50వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో మేయర్ రిపోర్టర్గా మారి, అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. రక్షణ పరికరాలు వాడాలి.. ‘మీ ఆరోగ్యంపైనే నగర ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉంది. పారిశుద్ధ్య పనులు నిర్వహించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పరికరాలను ఉపయోగించాలి. కార్పొరేషన్ అందిస్తున్న గ్లౌజులు, బూట్లు, యాప్రాన్ తప్పనిసరిగా వాడాలి’ అని నీరజ సూచించారు. శనివారం తెల్లవారుజామునే కార్మికులు విధులకు హాజరు కాగా.. నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఓ టీస్టాల్లో వారితో కలిసి మేయర్ టీ తాగారు. ఈ సందర్భంగా వారి సాదక బాధకాలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేఎంసీ అందిస్తున్న సదుపాయాలు, విధులు నిర్వహిస్తున్న సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధి నిర్వహణ సమయంలో బూట్లు, గ్లౌజులు వేసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సూచించారు. దీనిపై కార్మికులు మాట్లాడుతూ సామగ్రి అందడంలో ఆలస్యం అవుతోందని, మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి సామగ్రి అందించాల్సి ఉందన్నారు. గ్లౌజులు, బూట్లు అందజేయాలని కోరారు. అలాగే ఒకే జత యాప్రాన్ ఉందని, ఒకేసారి రెండు జతల యాప్రాన్లు ఇవ్వాలని, పెద్ద పండుగల సమయంలో సెలవులు ఇవ్వాలని కోరారు. వేతనాలు పెంచాలన్నారు. దీనిపై స్పందించిన మేయర్ గ్లౌజులు, చీపుర్లు, యాప్రాన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పండుగల సమయంలో వెసులుబాటును బట్టి సెలవులు ఇవ్వాలని అధికారులకు మేయర్ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాపర్తి శరత్, ఎన్విరాన్మెంట్ ఏఈ ఎం.శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, జవాన్లు జ్యోతి, స్వాతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మీ కాలనీలో సమస్యలున్నాయా..? ‘నగర పాలక సంస్థ అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి..? మీ కాలనీలో పారిశుద్ధ్య, ఇతర సమస్యలేమైనా ఉన్నాయా..? అంటూ కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ రిపోర్టర్గా మారి కాలనీ వాసులను ప్రశ్నించారు. నగరంలోని 50వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో శనివారం ఆమె స్థానిక మహిళలతో మాట్లాడారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్ తరఫున వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానికులతో మాట్లాడుతూ తాను ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజనని, సమస్యలుంటే తనకు వివరించాలని కోరారు. ●మేయర్ : ఆర్టీసీ కాలనీలో నగర పాలక సంస్థ సేవలెలా ఉన్నాయి.? స్థానికులు: కాలనీలో రోజువారీ చెత్త సేకరణ బాగా జరుగుతోంది. రోడ్ల సౌకర్యం బాగుంది. చిన్న చిన్న సమస్యలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేవు. 50వ డివిజన్లో ఉన్న ఆర్టీసీ కాలనీలో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ●మేయర్ : డ్రెయిన్లు ఎలా ఉన్నాయి..? కార్మికులు శుభ్రం చేస్తున్నారా..? స్థానికులు: డ్రెయిన్లలో చెత్త పేరుకుపోతోంది. రెగ్యులర్గా శుభ్రం చేయించడం లేదు. మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేయించండి. పారిశుద్ధ్య కార్మికులతో చర్చా వేదికలో ఖమ్మం మేయర్ నీరజ -
ఇద్దరికి గద్దర్ అవార్డులు
డైరెక్టర్ సాయిలు కాంపాటి, గేయ రచయిత నంద కిశోర్లకు.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు చలన చిత్ర రంగంలో విశేష సేవలందించిన వారికి 2025 ఏడాదికిగాను రాష్ట్ర ప్రభుత్వం శనివారం గద్దర్ అవార్డులు ప్రకటించగా, వాటిలో జిల్లాకు రెండు దక్కాయి. రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన సాయిలు కాంపాటి ఉరఫ్ జగదీశ్ చంద్రబోస్కు గద్దర్ అవార్డు వచ్చింది. దీంతోపాటు అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర చిత్రంలో ‘ నా కొడుకా’ పాట కు ఉత్తమ గేయ రచయితగా నంద కిశోర్ అవార్డు అందుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురానికి చెందిన కిశోర్ ఏడాది కాలంగా ఇక్కడి జిల్లా విద్యా విభాగంలో కన్సల్టెంట్గా పని చేస్తున్నాడు. తొలిపాటకే అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. మహిళలు ఆదర్శంగా నిలవాలికలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): సమాజంలో మహిళలు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని అన్నారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లెనీనా కూడా మాట్లాడారు.అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, మహిళా కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి. వీరబాబు పాల్గొన్నారు. నేటి నుంచి హెచ్పీవీ వ్యాక్సినేషన్చుంచుపల్లి: జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్ఓ తుకారామ్ రాథోడ్ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం జనరల్ హాస్పిటల్, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట, బూర్గంపాడు, మణుగూరు, భద్రాచలం, చర్ల ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 3 నెలలపాటు వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని, పద్నాలుగేళ్లు నిండి, 15 ఏళ్లలోపు ఉన్న బాలికలకు వ్యాక్సిన్ ఇస్తామని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,393 మంది బాలికలను గుర్తించామని వివరించారు. -
బంగారు మధుపర్కపాత్ర వితరణ
రూ. 14 లక్షలతో తయారు చేయించిన ఎన్ఆర్ఐ దంపతులు భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి శనివారం రూ.14 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు మధుపర్క పాత్ర ను అమెరికాకు చెందిన అజరాపు శేషగిరిరావు, సరోజిని దంపతులు దేవస్థానం ఈఓ కె.దామోదర్రావుకు అందజేశారు. దాతలు తొలుత ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు మధుపర్క పాత్రను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ పాత్రను రోజూ నిత్యకల్యాణంలో ఉపయోగించాలని కోరారు. స్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఐదుగురు అరెస్ట్ సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం నెహ్రూబస్తీ రైలు పట్టాల సమీపంలో ఈ నెల 4వ తేదీన నరేశ్కోరి (40)పై హత్యాయత్నం ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ కరుణాకర్ శనివారం తెలిపారు. రైలు పట్టాలవద్ద స్నేహితుడితో మాట్లాడుతున్న నరేశ్పై నాతరి శ్రీనాథ్, లోకేశ్, శివసంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు అలియాస్ ఐలయ్య దాడిచేశారు. రోకలిబండతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితికి చేరాడు. అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా మారింది. ఇదిలా ఉండగా.. నెహ్రూబస్తీలో నిర్మలకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని ఐలయ్య కొన్నినెలల క్రితం ఆక్రమించాడు. అతడి వద్ద నిర్మల రూ.4లక్షలు అప్పుగా తీసుకుంది. అనా రోగ్యం కారణంగా ఆమె అప్పు తిరిగి ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లింది. దీంతో 18నెలల నుంచి ఆ ఇంట్లో ఐలయ్య కుటుంబంతో ఉంటున్నాడు. అప్పు గా తీసు కున్న డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినా ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో నిర్మలకు నరేశ్ మద్దతు ఇస్తున్నాడని ఉద్దేశపూర్వకంగా నరేశ్పై దాడి చేసిన ఐదుగురు నిందితులను శనివారంఅరెస్టుచేసి, వారిపై హత్యా యత్నం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. -
తల్లిదండ్రులు సూచించిన కాలేజీల్లోనే..
విద్య నభ్యసించే విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్లో స్థిరపడాలంటే అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలపై మాకున్న అవగాహన మేరకే కోర్సులు ఎంపిక చేసుకుంటున్నాం. అయితే ఏ కాలేజీలో చేరాలనేది మాత్రం మా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. – కొల్లి శ్యామల, పీజీ ప్రథమ సంవత్సరంచదువు విషయంలో తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో కళాశాలలు, కోర్సుల ఎంపికలో మాకు కొంత స్వేచ్ఛ ఇచ్చినా తుది నిర్ణయం మాత్రం వారిదే. ఏదేమైనా మా ఉన్నతికి దోహదం చేసేలా వారే ఆలోచిస్తున్నారు. కొన్ని సమయాల్లో మేం చెప్పింది కూడా వారు వింటున్నారు. – పచ్చిపాల మహేశ్వరి, పీజీ ప్రథమ సంవత్సరం -
చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం
అశ్వాపురం: ఊపిరితిత్తుల సమస్యతో మండలంలోని అమ్మగారిపల్లి జీపీ కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన పాయం రుత్విక్ (2) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రతురితమైన కథనానికి పలువురు స్పందించారు. జనం కోసం మనం సంస్థ బాధ్యులు రూ.20 వేలు అందించగా.. అశ్వాపురం మండల అధికారులు, పినపాక గ్రామస్తులు రూ.22 వేలు ఇవ్వగా.. మొత్తం రూ.42 వేలను శుక్రవారం చిన్నారి చికిత్స పొందుతున్న అంకుర ఆస్పత్రికి వెళ్లి అందించారు. కార్యక్రమంలో యూడీసీ పద్మావతి, అమ్మగారిపల్లి సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శులు వేణుప్రియ, ఎస్కే అజార్, దొడ్డా శరత్, సంస్థ ప్రతినిధులు రోహిత్, అజార్, అంకుష్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
‘ప్రజాపాలన’తో భవిష్యత్
● మెరుగైన పాలనే లక్ష్యంగా కార్యక్రమం ● రెవెన్యూ, అటవీ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ● ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా సంక్షేమానికి ప్రాధాన్యత ● ‘99 రోజుల కార్యాచరణ’ సన్నాహక సమావేశంలో మంత్రులు పొంగులేటి, శ్రీహరిసాక్షి ప్రతినిఽధి, ఖమ్మం: ప్రజలకు మేలైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పేరిట చేపడుతున్న 99రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇది 99 రోజులకే పరిమితం కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర వేదికగా, భవిష్యత్ ప్రణాళికకు దిక్సూచిలా నిలుస్తుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో డ్రెయినేజీ నిర్మాణాల్లో లోపాలను సరిచేయడమే కాక ఏ అధికారి హయాంలో పొరపాటు జరిగిందో వారిని బాధ్యులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్వే చేపట్టండి.. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ, రెవెన్యూ భూముల వివాదాల పరిష్కారానికి 99 రోజుల ప్రణాళికను వేదికగా చేసుకోవాలని పొంగులేటి సూచించారు. సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు తదితర నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్నందున కలెక్టర్లు, డీఎఫ్ఓలు, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా సరిహద్దులను ఖరారు చేయాలని తెలిపారు. పది అంశాలకు సంబంధించి ప్రణాళిక క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు జరిగేలా చూడాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లకు తహసీల్దార్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించి వారానికోసారి భోజన నాణ్యత పరిశీలించాలని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆసక్తి లేకపోతే అదే గ్రామంలో మరొకరికి కేటాయించాలని సూచించారు. తద్వారా ఈనెలాఖరుకు మొదటి విడత ఇళ్లన్నీ గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. ఇంకా వైద్యరంగం పనితీరు మెరుగయ్యేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అలాగే, జీపీలకు పెద్ద ఎత్తున వస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎకో పార్కుల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రైతులకు భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈనెల 12న ఉమ్మడి జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు... గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళికాయుతంగా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆర్థిక స్థితిగతులు సహకరించకున్నా పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అర్హులకు చేర్చాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగానే ప్రజల్లో ప్రభుత్వంపై స్పందన ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, రాందాస్నాయక్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.●ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పంచాయతీ, మున్సిపల్ పాలకవర్గాలను పాలక వర్గాలను భాగస్వాములను చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న కోతలు సమస్య, ఆహార నాణ్యత, రైతులకు అవగాహనపై దృష్టి సారిస్తూనే ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సరఫరాతో కూడిన టాయిలెట్స్ నిర్మించాలని తెలిపారు. ●కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఇంటి కోసం రూ.20వేలు మంజూరైన వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తిరస్కరించకుండా అర్హులకు కేటాయించాలని సూచించారు. రెండో విడతలో అర్హులు అధికంగా ఉంటే లాటరీ పద్ధతి అనుసరించాలని తెలిపారు. ●అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే అధికారులు – ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ●ఖమ్మం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వ సూచనల మేరకు అమలు చేస్తామని వెల్లడించారు. ●భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ప్రతీ మండలానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. నెల కన్నా ఎక్కువ సమయం పెండింగ్ ఫైళ్లను పది రోజుల్లో క్లియర్ చేయాలన్నారు. -
భక్తి శ్రద్ధలతో మొక్కులు
గుండాల: మండలంలోని యాపలగడ్డ మెట్టినింట్లో కొలువైన సమ్మక్క, ఆమె పతిదేవుడు పగిడిద్దరాజుతో పాటు రోళ్లగడ్డలో దూలుగొండ ముసలమ్మ తల్లికి భక్తులు శుక్రవారం మొక్కులు సమర్పించారు. గురువారం రాత్రి గంగా స్నానం చేయించి గద్దెనెక్కించారు. ఆపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయ పూజారులు, వడ్డెలు అర్రెం వంశీయులు ఆచార సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సెలపయ్యను నైవేద్యంగా సమర్పించగా, పెద్దసంఖ్యలో భక్తులు దర్శించకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఐ తిరుపతి, ఎస్ఐ సైదా రవూఫ్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అరెం, ఈసం వంశీయులు పాల్గొన్నారు. -
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
మణుగూరు టౌన్: యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, సమష్టి కృషితో లక్ష్య సాధనకు కృషి చేయాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి అన్నారు. శుక్రవారం మణుగూరు ఏరియాలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్(పీఅండ్పీ) కె.వెంకటేశ్వర్లుతో కలిసి పర్యటించారు. తొలుత పీకేఓసీ–2 గనిని వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓసీలో షావెల్స్ భారీ యంత్రాల పనితీరును పరిశీలించి, బొగ్గు నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం ఓసీ–4లో సర్ఫేస్ మైనర్ భారీ యంత్రం ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కోల్ బెంచ్లో బొగ్గు నాణ్యత పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జీఎం కార్యాలయంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏరియా ఉత్పత్తి లక్ష్యాలు అధిగమిస్తున్న తీరును, కొత్త ప్రాజెక్ట్ వివరాలను జీఎం దుర్గం రాంచందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీడీఎన్) టి.శ్రీనివాస్, అధికారులు శ్రీనివాసచారి, రమేశ్, వేణుమాధవ్, శ్రీనివాస్, వెంకట్రావు, రాంబాబు, రమేశ్, జ్యోతిర్మయి, సౌరబ్ సుమన్, సురేశ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి -
‘ప్రజాపాలన’లో భాగస్వాములు కావాలి
సూపర్బజార్(కొత్తగూడెం): అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన పనులను సమగ్ర ప్రణాళికతో అమలు చేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, వైద్య ఆరోగ్య సేవల విస్తరణ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు, అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత తదితర కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని వివరించారు. కోతులు, వీధి కుక్కల సమస్యలను నియంత్రించాలని, ఎల్ఆర్ఎస్ టాక్స్ వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. యూరియా సమర్థ వినియోగం, బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, లింకేజీ రుణాల మంజూరు కార్యక్రమాలను, 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని అన్నారు. జూలూరుపాడు: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జూలూరుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ అంకిత్ సందర్శించారు. కార్యాలయం లోపల, పరిసరాలను పరిశీలించారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ షెడ్యూల్ ప్రకారం చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు టి.శ్రీనివాస్, అజయ్, తులిసీరామ్, ఖాదర్మియా పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
లక్ష్యం చేరుకుంటారా..?
ఇల్లెందు/సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా మా ర్కెటింగ్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ఆదాయ లక్ష్య సాధనకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. వార్షిక ఆదాయ లక్ష్యం రూ. 22,65,42,000 కాగా 11నెలల్లో రూ. 15,04,77,000 ఆదాయాన్ని మాత్రమే సాధించింది. మిగిలిన రూ.7.61 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చిలో సాధించేందుకు కృషి చేస్తున్నా రు. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం, చర్ల మండలాల్లో వ్యవ సాయ మార్కెట్లు ఉన్నాయి. జిల్లాలో మార్కెట్ శాఖకు అనుబంధంగా 18 చెక్పోస్టులు ఉన్నాయి. 15 నాబార్డు, 34 నాన్ నాబార్డు గోడౌన్లు ఉన్నా యి. ఇవి కాకుండా కొత్తగూడెం మార్కెట్ యార్డుకు అనుబంధంగా 44 గదులు, భద్రాచలం మార్కెట్ యార్డుకు అనుబంధంగా 21 గదులు ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం మార్కెట్ ఫీజు రూపంలో సమకూరుతుంది. కొనుగోలు కేంద్రాలకు మార్కెటింగ్ శాఖ ద్వారా కాటాలు, టార్పాలి న్లు, మాయిశ్చర్ పరికరాలను అందజేస్తారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల నుంచి కూడా మార్కెట్ ఫీజు లభిస్తుంది. అయినప్పటికీ లక్ష్యసాధనలో విఫలమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కూడా మొక్కజొన్న కొనుగోళ్లు జరగడం వల్ల మార్కెట్ ఫీజును పొందలేక పోవడం కూడా ఆదాయ లక్ష్యసాధనకు అడ్డంకిగా మారింది. వానాకాలం సాగులో పత్తి ప్రకృతి వైపరీత్యాల కారణంగా సరైన దిగుబడి లేకపోవడంతో కొనుగోళ్లు మందగించాయి. దీంతో మార్కెట్ ఫీజు ఆదాయానికి గండి పడింది. వార్షిక లక్ష్య సాధనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. వానాకాలం సీజన్లో పత్తి దిగుబడి బాగా తగ్గడంతో కొనుగోళ్ల సందర్భంలో మార్కెట్ ఫీజు తగ్గింది. మొక్కజొన్న కొనుగోళ్లను మార్క్ఫెడ్ కూడా చేస్తుండడంతో అక్కడి నుంచి కూడా మార్కెట్ ఫీజు రాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల నిర్దేశిత లక్ష్యం సాధించడం కష్టతరంగా మారింది. –జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకంజిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూపర్బజార్(కొత్తగూడెం): సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా న్యాయవాదులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి పాటిల్ వసంత్ మాట్లాడుతూ న్యాయరంగంలో మహిళల ఎదుగుదల అభినందనీయమని అన్నారు. మహిళలు న్యాయం, సమానత్వం, ధర్మాన్ని కాపాడే శక్తిగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె.గోపీకృష్ణ, కార్యదర్శి బి.మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్, ప్రసాద్, ఆడపాల పార్వతి, కె చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాలాజీ ఆదాయం రూ.5 లక్షలుములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. గతేడాది బ్రహ్మోత్సవాల తదుపరి నుంచి ఇప్పటివరకు హుండీలోని వేసిన నగదును లెక్కించారు. మొత్తం రూ. 5,34,196 ఆదాయం సమకూరినట్లు ఆలయ బాధ్యులు తెలిపారు. గతేడాది కంటే రూ. 23 వేల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
నేలకొండపల్లి: ఇంటర్ పరీక్షలు రాసి రెండు బైక్లపై వస్తున్న విద్యార్థులు కారును ఢీకొట్టడమే కాక పరస్పరం ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం అనంతనగర్– నేలకొండపల్లి మధ్య శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. కోరట్లగూడెంకు చెందిన బచ్చలకూరి అభిరామ్, అమ్మగూడెంకు చెందిన వాసంశెట్టి ఉదయ్, ఆరెగూడెంకు చెందిన బోయిన ఉదయ్ నేలకొండపల్లిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి బైక్పై ఇళ్లకు బయలుదేరారు. సదాశివాపురానికి యండ్రాతి విశాల్, జె.జశ్వంత్, కొంగరకు చెందిన పొట్టా ఆకాష్ అనంతనగర్లో పరీక్షరాసి మరో బైక్పై వెళ్తున్నారు. వీరి బైక్లు అనంతనగర్ – నేలకొండపల్లి మధ్య మూలుమలపు సమీపానికి చేరగా నేలకొండపల్లి నుంచి కూసుమంచి వైపు వెళ్తున్న కారును ఢీకొట్టి ఆపై పరస్పరం ఢీకొన్నా యి. దీంతో బైక్లపై వెళ్తున్న ఆరుగురు విద్యార్థులు ఎగిరిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో అభిరామ్ పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా వారికి సైతం గాయాలై స్పృహ కోల్పోవడంతో స్థానికులు పాకనాటి కన్నారెడ్డి, బచ్చలకూరి నాగరాజు తదితరులు సీపీఆర్ చేస్తూ 108లో నేలకొండపల్లి ప్రభు త్వ ఆస్పత్రికి అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. క్షతగాత్రులను తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య పరామర్శించారు. -
ఘనంగా సామూహిక వివాహాలు
మణుగూరు టౌన్: మణుగూరులోని అన్నారం గ్రామంలో దానధర్మట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం 200 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకురాలు గంటా రాధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 200 ఆదివాసీ జంటలు పాల్గొన్నాయి. మైసూరు అవధూత దత్తపీఠం బాధ్యుల సమక్షంలో వేడుకలు జరిపారు. మేళతాళాలు, వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళసూత్రం, మెట్టెలు, పట్టు వస్త్రాలు, పీటలు తదితర పెళ్లి సామగ్రిని ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్ పర్సన్ గంటా రాధ మాట్లాడుతూ 2021 నుంచి పలు దఫాలుగా అన్నారం గ్రామంలో 720 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి రూ.1.20 కోట్లు వరకు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కాగా, 200 నూతన జంటలు, వారి బంధువులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.దాన ధర్మట్రస్ట్ ఆధ్వర్యంలో 200 ఆదివాసీ జంటలకు పెళ్లిళ్లు -
సామాన్యుడి ఊసేది?
శ్రీరామనవమి ఘడియలు సమీపిస్తున్నాయి. సీతారాముల కల్యాణం, పట్టాభిషేకాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక, సెక్టార్ల విభజన పనులు జోరందుకున్నాయి. భద్రాచలంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు స్వాగత ద్వారాలు సిద్ధమవుతున్నాయి. కరకట్టకు దిగువన బాపు రామాయణ ఇతివృత్తాల చిత్రాలు రంగులద్దుకుంటున్నాయి. తానీషా కల్యాణ మండపంలో తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు వీఐపీ సెక్టార్ల విభజన, సీటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ సామాన్య భక్తులు ప్రశాంతంగా కల్యాణం వీక్షించేలా కల్పించాల్సిన వసతులపై ఎవరూ నోరు మెదపడంలేదు. –భద్రాచలం ఏటా పెరుగుతున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలతో మిథిలా స్టేడియంలోని సెక్టార్లు కిక్కిరిసి పోతున్నాయి. దీంతో ఈసారి సీఎం సెక్టార్తో పాటు ఇతర గ్యాలరీలపై అధికారులు కొత్త మ్యాప్లను సిద్ధం చేశారు. గతంలో సీఎం సెక్టార్లో 250 సీటింగ్ ఉండగా, మరో 50 పెంచి 300 మంది కూర్చునేలా మార్చారు. అందులోనే జ్యుడీషియల్, ఇతర ప్రధాన ప్రొటోకాల్ విభాగం ఉండే విధంగా సెక్టార్ను విభజించేలా యోచిస్తున్నారు. దీనిని సెక్టార్–1గా నామకరణం చేశారు. ఇక గతంలో ముందు వరుసలో వీవీఐపీ, తర్వాత వీఐపీ గ్యాలరీ ఉండేది. వీవీఐపీ పాస్లకు తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వీఐపీ, వీవీఐపీ.. రెండింటిని కలిపి ఒకటే సెక్టార్గా మార్చారు. దీనిని సెక్టార్–2గా పేర్కొంటున్నారు. సీటింగ్ కెపాసిటీ 500గా నిర్ణయించారు. ఇది సీఎం సెక్టార్కు వెనుక భాగంలో సగం వరకు ఉండగా, మరో సగం ఉభయదాతల సీటింగ్గా మార్చారు. రూ. 7500 విలువగల టికెట్పై భార్యాభర్తలు ఇద్దరు కల్యాణంలో పాల్గొనవచ్చు. ఈ సెక్టార్లో 800 టికెట్లు ఉండగా, 1600 సీటింగ్ ఉండనుంది. రూ.2500 విలువతో 1100, రూ.2000 విలువతో 380 టికెట్లతోపాటు రూ.1000, రూ. 300, రూ.150 విలువ గల టికెట్లకు సెక్టార్లను కేటాయిస్తున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమికి ముమ్మరంగా ఏర్పాట్లు మంత్రి సమీక్షలో సామాన్యుల చర్చేది? ఏటా శ్రీరామనవమికి ముందు డివిజన్, జిల్లా స్థాయిలో పలుమార్లు అధికారులు, మంత్రులు సైతం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 1న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమీక్ష జరిపారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు వీఐపీలకు కేటాయించిన సెక్టార్లపైనే చర్చించారు. సామాన్య భక్తులకు కల్పించాల్సిన వసతులపై సమావేశంలో కనీసం చర్చ రాకపోవటం శోచనీయం. రాముడి కల్యాణానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కల్పించాల్సిన వసతులపై దేవస్థానం, జిల్లా ఉన్నతాధికారులు విస్మరించటంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు. గ్యాలరీలలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయటం లేదు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు గతేడాది ఏర్పాటు చేసిన ఫాగ్మిస్ట్ను ఈసారి ప్రధాన సెక్టార్లకే పరిమితం చేయకుండా ఇతర గ్యాలరీల్లో కూడా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
రేషన్.. అయోమయం!
● నిర్దేశిత గడువు లేకుండా బియ్యం పంపిణీ ● ఒక్కో నెలలో ఒక్కో తేదీ వరకు ఇస్తున్న డీలర్లు ● స్పష్టతలేక బియ్యం తీసుకోలేకపోతున్న లబ్ధిదారులు ● షాపుల నిర్వహణలో కొరవడుతున్న సమయపాలనకొత్తగూడెంఅర్బన్: రేషన్ బియ్యం పంపిణీలో నిర్దేశిత తేదీలు, సమయం లేకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు బియ్యం తీసుకోలేకపోతున్నారు. గతంలో ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం 1వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభిస్తున్నా.. ఒక నెల 20వ తేదీ వరకు, మరో నెల 15వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు. దీంతో 15వ తేదీ తర్వాత వెళ్లిన లబ్ధిదారులకు బియ్యం అందడంలేదు. పంపిణీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేస్తారనేది డీలర్లు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల వద్ద కూడా ఈ విషయంపై స్పష్టత లేదు. ఎప్పటివరకు బియ్యం పంపిణీ చేయాలనే విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయిస్తారని, ఆ ప్రకారమే పంపిణీ చేస్తున్నామని డీలర్లు చెబుతున్నారు. నిర్దేశిత కట్ ఆఫ్ తేదీ లేకపోవడంతో తాము కూడా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతుంటారు. ఎక్కువ మంది లబ్ధిదారులు రేషన్ తీసుకోవడంతో ఆ తర్వాత షాపులకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుంది. కానీ కొద్ది నెలలుగా 15, 16, 17 తేదీల్లో ఎప్పుడు బంద్ చేస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్లకు వెళ్లినవారు, ఇతర అత్యవసర పనులు ఉన్నవారు రేషన్ షాపులకు వస్తే ఈ నెల కోటా పూర్తయిందని డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టి రేషన్ బియ్యం పంపిణీకి కట్ ఆఫ్ డేట్ నిర్ణయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గోదాం నుంచి రేషన్షాపునకు బియ్యం రావడం ఆలస్యమైతే మాత్రం గడువు పెంచుతున్నారని చెబుతున్నారు. సమయపాలన పాటించని డీలర్లు జిల్లా పౌరసరఫరాల అధికారుల పర్యవేక్షణ, పరిశీలనలు లేకపోవడంతో డీలర్లు సమయపాలన పాటించడం లేదు. రేషన్షాపులు తెరిచే సమయం లబ్ధిదారులకు తెలిపి, ఆయా సమయాల్లోనే బియ్యం అందించాలని అధికారులు చెబుతుంటే, రేషన్ డీలర్లు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్షాపులు ఎప్పుడు తెరుస్తారోనని కొందరు షాపుల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డీలర్లు తమకు అనుకూలమైన సమయంలో షాపులు తెరుస్తున్నారని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. షాపులు తెరిచేందుకు కచ్చితమైన సమయం, తేదీలు నిర్ణయించాలని అధికారులను కోరుతున్నారు. జిల్లాలోని రేషన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. కట్ ఆఫ్ తేదీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తారు. రేషన్షాపులు తెరిచే సమయాలను ప్రజలకు తెలియజేసి, ఆ సమయానుసారంగా తెరిచి లబ్ధిదారులకు బియ్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. – ప్రేమ్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రేషన్షాపులు 443 ఆహార భద్రత 2,92,196అంత్యోదయ 21,148అన్నపూర్ణ 03మొత్తం కార్డులు 2,93,263ప్రతీనెల బియ్య 5,384.762 మెట్రిక్ టన్నులు -
ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టిన బైక్..
సత్తుపల్లిటౌన్: ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల మనోజ్(16), గద్దల కార్తీక్(18) సత్తుపల్లిలో ఓ కన్సల్టెన్సీలో పని చేస్తున్నారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై మర్లపాడు వెళ్లి వస్తుండగా సదాశివునిపేట శివాలయం సమీపాన రోడ్డు ప్రక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు కాగా మనోజ్, గద్దల కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు. కాగా, వీరిద్దరికి ఒకే గ్రామం కావడమే కాక ఒకే వీధి కావడంతో సిద్ధారం వాసులు పెద్దసంఖ్యలో చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.ఘటనా స్థలంలోనే ఇద్దరు యువకులు మృతి -
విద్యుదాఘాతంతో రైల్వే ఉద్యోగి మృతి
మణుగూరుటౌన్: మండలంలోని రైల్వేస్టేషన్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. రైల్వే సిగ్నల్ విభాగంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రంగ నవీన్ (33) ఇటీవల కారు కొనుగోలు చేశాడు. కారును పార్కింగ్ చేసేందుకు పాత రన్నింగ్ రూం వద్ద షెడ్ తొలగిస్తుండగా వైర్ తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఏడాది క్రితం నవీన్కు వివాహం జరగగా ఆయన భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. వీరి వివాహ వార్షికోత్సవం శుక్రవారమే. ఇదేరోజు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యను హత్యచేసిన వ్యక్తికి జీవితఖైదు సూపర్బజార్(కొత్తగూడెం): భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. చుంచుపల్లి మండలం విద్యానగర్కు చెందిన లకావత్ సైదులు తన పెద్ద కుమార్తె స్నేహను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు జీపీ కట్టుకుంటతండా వాసి భూక్య శ్రీధర్కు ఇచ్చి 2021 జులై 30న వివాహం జరిపించాడు. వారం రోజుల్లోనే అత్తింటి వేధింపులతో స్నేహ పుట్టింటికి తిరిగి వచ్చింది. తండ్రి సర్దిచెప్పి తిరిగి భర్త వద్దకు పంపాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తిరిగి మళ్లీ స్నేహ తిరిగి వచ్చింది. కాగా, 2023 మే 20వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య స్నేహపై భర్త భూక్య శ్రీధర్ పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో శ్రీధర్కు కూడా గాయాలయ్యాయి. స్నేహను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. స్నేహ తండ్రి ఫిర్యాదు మేరకు భర్త భూక్య శ్రీధర్, అత్త భూక్య అచ్చమ్మ, మామ భూక్య భాస్కర్పై అప్పటి ఎస్ఐ కె.సుమన్ కేసు నమోదు చేయగా అప్పటి సీఐ ఎ.రమాకాంత్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. 17 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి భూక్య శ్రీధర్పై నేరం రుజువు కావడంతో జీవితఖైదు, రూ.వెయ్యి జరిమానా విధించారు. అత్తమామలపై కేసు కొట్టివేశారు. రేషన్ బియ్యం పట్టివేతజూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటలోని కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. జూలూరుపాడుకు చెందిన నాగేశ్వరరావు చుట్టుపక్కల గ్రామాల నుంచి రేషన్ బియ్యం కొని, మాచినేనిపేట శివారులోని నరసింహారావు కోళ్ల ఫారంలో డంప్ చేశాడు. స్థానిక సీఐ శ్రీలక్ష్మి, పోలీస్ సిబ్బంది సమాచారం మేరకు దాడి చేసి, 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ సుమారు రూ.51 వేలు ఉంటుందని తెలిపారు. నాగేశ్వరరావు, నరసింహారావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ద్విచక్రవాహనం చోరీపాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మగుడి వద్ద మరో ద్విచక్రవాహనం చోరీకి గురైంది. దుమ్ముగూడెం మండలం రేగుంటకు చెందిన ఎస్.జీవన్ గత నెల 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి బైక్పై వచ్చి, సమీపాన పార్కింగ్ చేసి ఆలయంలోకి వెళ్లి వచ్చేసరికి బైక్ చోరీకి గురైంది. ఘటనపై ఆయన శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.సురేశ్ తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు? జల్సాలకు అలవాటుపడిన దుమ్ముగూడెం ప్రాంత యువకులు ద్విచక్రవాహనాలను చోరీచేసి తాకట్టు పెడుతున్నాడని సమాచారం. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సదరు వ్యక్తి 26 బైక్లు చోరీ చేసినట్లు గుర్తించగా, విచారణ కొనసాగుతోందని సమాచారం. పశువులు పట్టివేతభద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న పశువులను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్ల నుంచి హైదరాబాద్కు వాహనంలో తొమ్మిది పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించి, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్ఐ శ్యాంప్రసాద్ తెలిపారు. -
రామయ్య ఆలయానికి రెండు వీల్చైర్లు
భద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం పట్టణానికి చెందిన రామరాజు కాటన్ డిస్ట్రిబ్యూటర్ నీలి దేవిప్రసాద్ శుక్రవారం రెండు వీల్చైర్లను వితరణగా అందజేశారు. ఆలయ ఈఓ కె.దామోదర్రావుకు వీటి ని అందజేయగా దాతను ఆయన అభినందించారు. ఏఈఓ శ్రావణ్కుమార్, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉద్యోగులు సాయిబాబా, రజిని, రాము, శివరామకృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ, నిమ్స్మే (హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యాన గిరిజన యువత, రైతులకు తేనెటీగల పెంపకంపై ఐదు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 18 –40 ఏళ్ల లోపు వారు శిక్షణ కు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళ లు, పురుషులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్లతో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్కు రావాలని పీఓ సూచించారు. ఇసుక తరలుతోంది..అశ్వారావుపేటరూరల్: మండలంలోని నారాయణపురం జీపీ జగన్నాథపురం శివారులో గల పెద్దవాగు నుంచి కొద్ది రోజులుగా వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలు, రాత్రి తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా వాగు వద్ద వందలాది ట్రాక్టర్లు ఇసుక కోసం బారులుదీరి క్యూలో కనిపించాయి. అయినా, సరే అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు స్థానికులు బారులుదీరిన ఇసుక ట్రాక్టర్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. తుమ్మల చొరవపై హర్షం దమ్మపేట: తెలంగాణ హార్టికల్చర్, ఆయిల్ఫెడ్పై ప్రైవేట్ పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యం హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను తొలగింపజేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ను ఏర్పాటు చేసినందుకుగాను రాష్ట్ర పామాయిల్ సలహాదారు కమిటీ సభ్యులు ఆలపాటి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. టీజీ ఆయిల్ఫెడ్ సాధించిన ఓఈఆర్నుప్రామాణికంగా తీసుకోకుండా ప్రైవేట్ కంపెనీల ఓఈఆర్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం రైతులను దోచుకోవడమేనని పేర్కొన్నారు. విధుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలిపాల్వంచ: విధుల్లో ఉద్యోగులు తప్పక భద్రతా చర్యలు పాటించాలని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్రావు అన్నారు. శుక్రవారం స్థానిక కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో 55 వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి విధిగా భద్రతా సూత్రాలను పాటిస్తూ, పరికరాలను ధరించాలని సూచించారు. కార్యక్రమంలో సెఫ్టీ కమిటీ చైర్మన్, ఎస్ఈ బి.శివరాంరెడ్డి, ఎస్ఈలు టి.సత్యనారాయణ, పి.కృష్ణ, డీవైసీసీఏ రామారావు, ఇన్చార్జ్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, సెఫ్టీ డీఈ సమ్మయ్య, ఎస్పీఎఫ్ ఆర్ఐ పీరా, ఏడీఈ వెంకటేశ్వర్లు, నాగయ్య, ఏఈలు మహే శ్, నాగరాజు, రజిని, సిబ్బంది పాల్గొన్నారు. మహిళను వేధించిన వ్యక్తికి జైలుఇల్లెందు: పట్టణంలోని 24 ఏరియాకు చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి వేధించాడు. ఈ కేసులో ఇరువైపులా వాదనలు విన్న ఇల్లెందు కోర్టు న్యాయమూర్తి డి.కీర్తిచంద్రికరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. కృష్ణకు ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.5వేలు జరి మానా విధించారు. 2018లో మహిళను వేధించిన కృష్ణపై అందిన ఫిర్యాదు మేరకు ఆనాటి సీఐ డి.వేణుచందర్ కేసు నమోదు చేసి, కోర్టు లో చార్జిషీటు దాఖలు చేశారు. -
మెరుగైన విద్య అందించాలి
జూలూరుపాడు: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా కృషి చేయాలని డీఈఓ, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం ఆమె జూలూరుపాడు కేజీబీవీని తనిఖీ చేశారు. కిచెన్ రూమ్, స్టోర్ రూమ్లో నిత్యావసర సరుకులు, కూరగాయలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రిపరేషన్ విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయాన్ని సందర్శించి, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక(99 రోజుల యాక్షన్ ప్లాన్)పై అధికారులతో సమావేశమయ్యారు. ఎంపీడీఓ పూరేటి అజయ్, అధికారులు తాళ్లూరి రవి, తులసీరామ్, పద్మజ, రామారావు పాల్గొన్నారు.డీఈఓ బి.నాగలక్ష్మి -
జెడ్పీ మాజీ చైర్పర్సన్కు పలువురి నివాళి
టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి అంత్యక్రియలను ఆమె స్వగ్రామం టేకులపల్లి మండలం తెలుగూరులో శుక్రవారం నిర్వహించారు. గుండెపోటుతో గురువారం ఆమె మృతిచెందగా మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు. తన రాజకీయ గురువైన వెంకటనారాయణ సతీమణి మృతదేహం వద్ద ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాక పాడె మోసి అంత్యక్రయల్లో పాల్గొన్నారు. అలాగే, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, నాయకులు కోరం లక్ష్మి, కోరం సురేందర్, ఉమ, కోరం హన్మంతు, వెంకన్న, నర్సింగ్ లక్ష్మయ్య, కాలె ప్రసాద్, బండ్ల రజిని, శ్రీనివాస్, ఈది గణేశ్, జానీ తదితరులు నివాళులర్పించారు. -
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
చండ్రుగొండ: మండల కేంద్రమైన చండ్రుగొండలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనగా.. ఒక లారీ డ్రైవర్ మృతి చెందాడు. మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి 108 ఆంబులెన్స్లో తరలించారు. ఈ ఘటనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ప్లైవుడ్ లోడుతో తమిళనాడు నుంచి రాయపూర్ వెళ్తున్న లారీ, భద్రాచలం నుంచి విజయవాడ వైపు తవుడు లోడుతో వెళ్తున్న లారీ చండ్రుగొండలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాయపూర్ వెళ్తున్న లారీ ముందు టైరు పగిలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు లారీల ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. ఎస్ఐ శివరామకృష్ణ, సిబ్బంది స్థానికుల సాయంతో వారిని బయటకు తీసి కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ రామ్మూర్తి(42) మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి గురైన లారీలు రోడ్డుకు అడ్డుగా ఉండటంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఎస్ఐ, సిబ్బంది రెండు జేసీబీలతో లారీలను పక్కకు జరిపించి రెండు గంటల పాటు శ్రమించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట
● విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించం ● మణుగూరులో కలెక్టర్ అంకిత్ సుడిగాలి పర్యటన మణుగూరు టౌన్: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. గురువారం ఆయన మణుగూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత 100 పడకల ఆస్పత్రిని తనిఖీ చేసి వార్డులు, ఔషధ నిల్వల గది, ఔట్ పేషెంట్ విభాగం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలలను సందర్శించి తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు సిద్ధం కావాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలని హెచ్ఎం నాగశ్రీని ఆదేశించారు. అనంతరం గుండు సింగారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖఅధికారి స్వర్ణలత లెనీనా, 100 పడకల ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్, వైద్యులు గౌరీశంకర్, నిఖిల్, ఉపాధ్యాయులు మహాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంఈఓ స్వర్ణజ్యోతి, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ అంకిత్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలను తనిఖీ చేస్తామని చెప్పారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించొద్దని అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, డీఎల్ఎంటీ సాయికృష్ణ, ఆయా పార్టీల నాయకులు నోముల రమేష్, జయశ్రీలక్ష్మి, రాంబాబు, ఎల్.బాలరాజు, ఎ.సత్యనారాయణ, ఎన్నికల సిబ్బంది నవీన్ ఉన్నారు. -
రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక
పాల్వంచరూరల్ : వన్యప్రాణి సంరక్షణకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న చాతకొండ వైల్డ్లైఫ్ రేంజర్ పాయం కనకమ్మ, బీఎఫ్ఓ బి.కల్పన అంతర్జాతీయ మహిళా దినోత్సవ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారని ఎఫ్డీఓ బి.బాబు గురువారం తెలిపారు. చాతకొండ రేంజర్ కనకమ్మ 2002లో ఎఫ్బీఓగా ఉద్యోగంలో చేరి 2005లో సెక్షన్ అధికారిగా, 2010లో డీఆర్ఓగా, 2024లో వైల్డ్లైఫ్ డివిజన్ చాతకొండ రేంజర్గా పదోన్నతి పొందారు. ఆక్రమణకు గురైన 623 ఎకరాల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఆమె సేవలను గుర్తించిన అటవీ శాఖ ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసిందని వివరించారు. వైల్డ్లైఫ్ డివిజన్ మల్లారం బీట్లో బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న భూక్య కల్పన ప్రస్తుతం లా కోరు చదువుతున్నారని, 2012లో ఏబీఓగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అంకిత భావంతో పనిచేశారని తెలిపారు. వీరిద్దరూ ఈనెల 8న హైదరాబాద్లో పీసీసీఎఫ్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారని వెల్ల డించారు. -
సరికొత్త కళ !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కళ తప్పిన కొత్తగూడెం ఏరియాకు మళ్లీ జీవం రానుంది. మూడేళ్లుగా ఊరిస్తున్న వెంకటేశ్ఖని మెగా ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ గ్రౌండ్ మైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి అధికారికంగా మొదలవబోతోంది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అవసరమైన చర్యలు చేపడుతోంది. రెండేళ్లుగా ఎదురుచూపులు గతంలో మూతబడిన వెంకటేశ్ఖని (వీకే) భూగర్భ గని, గౌతంఖని ఓపెన్కాస్ట్ మైన్లను ప్రస్తుతం నడుస్తున్న పద్మావతి భూగర్భ గనితో అనుసంధానం చేస్తూ వెంకటేశ్ఖని మెగా ఓపెన్కాస్ట్ కమ్ అండర్గ్రౌండ్ మైన్ ప్రాజెక్టును చేపట్టాలని సింగరేణి 2021లో నిర్ణయించింది. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం ఈ గని నుంచి 2024 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలి. కానీ పర్యావరణ అనుమతులు, సాంకేతిక చిక్కుల కారణంగా గత రెండేళ్లుగా మొదలు కాలేదు. ఎట్టకేలకు గతేడాది నవంబర్ నుంచి ఈ గనిలో పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మార్చి మొదటి వారం వరకు నిర్విరామంగా ఉపరితలంలో మట్టిని (ఓవర్ బర్డెన్)ని తొలగిస్తూ రాగా, ఇటీవల బొగ్గు నిల్వలు వెలుగు చూశాయి. 35 ఏళ్ల పాటు ఉత్పత్తి.. వీకే మెగా ఓసీలో 317 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కనీసం 190 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికి తీసే అవకాశముంది. ఇక్కడ లభించే బొగ్గు సబ్బిటుమినస్ రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ బొగ్గును థర్మల్ పవర్ ప్లాంట్లలో ఎక్కువగా వినియోగిస్తారు. సాలీనా ఈ బొగ్గు గని నుంచి 6.30 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇందులో 5.30 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఓసీ విధానంలో, ఒక మిలియన్ మెట్రిక్ టన్ను బొగ్గును అండర్గ్రౌండ్ నుంచి వెలికి తీస్తారు. ఇక్కడ 2,403 హెక్టార్ల పరిధిలో బొగ్గును వెలికి తీసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొత్త బొగ్గు గని అందుబాటులోకి రానుండడంతో కార్మికులతో కొత్తగూడెం మళ్లీ కళకళలాడనుంది. ఈ గని జీవిత కాలం 35 ఏళ్లు ఉండనుంది. వెయ్యి మంది పర్మనెంట్, అంతే సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు గని పనుల్లో బిజీ కానున్నారు. వరుసగా మూతబడిన గనులు దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కొత్తగూడెంలో సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీస్తోంది. ఈ క్రమంలో వెంకటేశ్ ఖని(వీకే)ని 1954లో ప్రారంభించింది. ఈ గని పరిధిలోకి వచ్చే భూభాగం అడుగున 300 మీటర్ల కంటే లోతులో నిల్వ ఉన్న బొగ్గును ఇక్కడ దశాబ్దాల తరబడి తవ్వి తీశారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోవడంతో 2021లో మూసేశారు. ఈ గనికి ఒక వైపున పద్మావతిఖని –5 పేరుతో 1991లో భూగర్భ గనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 అడుగుల కంటే దిగువన భూగర్భంలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. వెంకటేశ్ ఖనికి మరోవైపున గౌతంఖని పేరుతో ఓపెన్ కాస్ట్ మైన్ను 1991లోనే మొదలుపెట్టారు. భూ ఉపరితలం నుంచి 300 అడుగుల లోతు వరకు ఉన్న బొగ్గును వెలికి తీశారు. నిల్వలు అడుగంటి పోవడంతో ఈ గని 2021లోనే మూత పడింది. ఇప్పుడు ఈ మూడు గనులను కలుపుతూ వెంకటేశ్ఖని మెగా ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ గ్రౌండ్ మైన్ అందుబాటులోకి రానుంది. భూ ఉపరితలం నుంచి 300 నుంచి 450 అడుగుల లోతులో ఉన్న బొగ్గునే వీకే 7 గని ద్వారా దాదాపు 65 ఏళ్లకు పైగా వెలికి తీశారు. కానీ 300 అడుగుల పైన కూడా భారీ స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వీకే భూగర్భ గని పై భాగంలో ఉన్న బొగ్గు నిల్వలను ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వెలికితీస్తారు. ఇక్కడ బొగ్గు నిల్వ ల కోసం తీసే ఓవర్ బర్డెన్ మట్టితో గతంలోనే మూతపడిన గౌతంఖని ఓపెన్ కాస్ట్లో ఏర్పడిన ఖాళీలను(గుంతలు) పూరిస్తారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గనిగా కొనసాగుతున్న పద్మావతి భూగర్భ గనిని కూడా వీకే పరిధిలోకి తీసుకొస్తారు. పద్మావతి ఖనిలో బొగ్గు ఉత్పత్తి 2030 వరకు జరగనుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఓపెన్ కాస్ట్ పద్ధతిలో బొగ్గు వెలికి తీయనున్నారు. కాగా, కొత్తగూడెం ఏరియా జీఎం శాలేంరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వీకే 7 మెగా ఓసీలో బొగ్గు ఉత్పత్తిని శనివారం ఉదయం 8 గంటలకు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పీవీకే అండర్ గ్రౌండ్ మైన్ను పరిశీలిస్తారని చెప్పారు. బొగ్గు ఉత్పత్తికి సిద్ధమైన వెంకటేశ్ ఖని మెగా ఓసీ -
ఉత్తమ వైద్య సేవలు అందించాలి
● భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ‘నీతి ఆయోగ్’ ● మాతా, శిశు మరణాల తగ్గింపు చర్యలు భేష్ అంటూ ప్రశంస భద్రాచలంఅర్బన్ : ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నీతి ఆయోగ్ బృందం సభ్యులు వైద్యులకు సూచించారు. గురవారం వారు భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఎస్ఎన్సీయూ వార్డులో నవజాత శిశువులకు అందిస్తున్న వైద్యం, వారి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. మాతా, శిశు మరణాల రేటు తక్కువగా ఉండడాన్ని గమనించి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. జిల్లాలోని ఇతర ఆస్పత్రుల కంటే భద్రాచలంలో పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్లోనూ ఇలాగే పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ కన్సల్టెంట్ ఉమాంగ్ కటోచ్, అసిస్టెంట్ కన్సల్టెంట్ నవనీత్, మైనార్టీ అధికారి సంజీవరావు, ఏరియా ఆస్పత్రి ఆర్ఎంఓ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.దుమ్ముగూడెం : మండలంలోని పర్ణశాల టీబీ ఆస్పత్రి, దుమ్ముగూడెంలోని అంగన్వాడీ కేంద్రం, నర్సాపురం జెడ్పీ పాఠశాలను నీతి ఆయోగ్ బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాల్లో విద్య, వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు పర్యటిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రిలో గల సౌకర్యాలపై ఆరా తీశారు. టీబీ పేషెంట్లకు సమయానుకూలంగా వైద్యం చేయాలని, సరిపడా మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు. అంగనవాడీ కేంద్రంలో చిన్నారులకు బలవర్థక ఆహారం అందించాలని చెప్పారు. నర్సాపురం పాఠశాలలో పిల్లల విద్యాభ్యాసాన్ని తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నీతి అయోగ్ ద్వారా ఈ పాఠశాలలో 54 మంది బాలబాలికలకు సైకిళ్లు అందజేశామని, వాటిని సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం సీడీపీఓ జ్యోతి, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి పుల్లారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీధర్, పర్ణశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేణుకా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
బూర్గంపాడు : పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. మండలంలోని మోరంపల్లి బంజర జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె పరిశీలించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని, తద్వారా పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండగా ఉపాధ్యాయులను అభినందించారు. డీఈఓ నాగలక్ష్మి -
హత్యకేసులో నిందితుల అరెస్టు
● వ్యక్తిగత కక్షలతోనే దారుణం ● వివరాలు వెల్లడించిన ఏడూళ్ల బయ్యారం సీఐ కరకగూడెం: మండలంలోని అశ్వాపురంపాడు వలస ఆదివాసీ గ్రామంలో గత నెల 28న అర్ధరాత్రి జరిగిన సీపీఎం నేత కొవ్వాసి వెంకటేశ్వర్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏడూళ్ల బయ్యారం సీఐ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన కరకగూడెం పోలీస్స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో అశ్వాపురంపాడుకు చెందిన వజ్జ భీమరాజు, మడివి మంగయ్య, మడివి నందయ్యతో పాటు, హత్యకు సహకరించిన వంకా బాలాజీ (సారపాక), మడకం లక్ష్మయ్య (తాళ్లగొమ్మూరు)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హత్య జరిగిన వెంటనే మృతుడి భార్య సునీత.. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు గ్రామంలో విచారణ చేపట్టగా ఘటన సమయంలో గ్రామంలోకి కొత్త వ్యక్తులు రావడం, కొందరి కదలికలు అనుమానాస్పదంగా ఉండడాన్ని పోలీసులు గమనించారని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారని, ఆ తర్వాత విచారణలో నేరాన్ని అంగీకరించారని తెలిపారు. రూ.50 వేల సుపారీ ఇచ్చి.. నిందితుడు భీమరాజు గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లినప్పుడు మృతుడు వెంకటేశ్వర్లు అతడికి బెయిల్ రాకుండా అడ్డుకున్నాడని కోపం పెంచుకున్నాడు. మరో నిందితుడు మంగయ్య కుటుంబ విషయాల్లో తలదూర్చి అతడి భార్యలను విడగొట్టేలా వెంకటేశ్వర్లు ప్రవర్తిస్తున్నాడని భావించాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు అడ్డు తొలగించుకోవాలని భీమరాజు తన ముఠాతో కలిసి నిర్ణయించుకున్నాడు. అతడికి జైలులో పరిచయమైన బాలాజీకి రూ.50 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని, అతడి స్నేహితుడు లక్ష్మయ్యతో కలిసి పథకం వేశారు. ఫిబ్రవరి 28న అర్ధరాత్రి నిద్రిస్తున్న వెంకటేశ్వర్లును గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. విచారణ అనంతరం నిందితుల నుంచి హత్యకు వాడిన గొడ్డలి, రక్తపు మరకలున్న బట్టలు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని సీఐ వివరించారు. సమావేశంలో ఎస్సైలు పీవీఎన్.రావు, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
గద్దెనెక్కిన ఇలవేల్పులు
● వనం రాకతో నిండు జాతర ప్రారంభం ● పోటెత్తిన భక్తజనం గుండాల: డోలీ చప్పుళ్లు.. భక్తుల నృత్యాలు.. పూనకాల నడము వన దేవత సమ్మక్క తల్లి గద్దైపెకి రావడంతో జాతర పరిపూర్ణత సంతరించుకుంది. ముందురోజు పగిడిద్దరాజు గద్దెలపైకి రాగా మొక్కుల చెల్లింపులు జోరందుకున్నాయి. వడ్డెలు, పూజారులు వనాన్ని గద్దైపె ప్రతిష్ఠించడంతో నిండుజాతర ప్రారంభమైంది. గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర గురువారం అంగరంగ వైభవంగా సాగింది. అరెం వంశీయులు పూజలతో వన దేవతలకు స్వాగతం పలికారు. గుట్ట నుంచి వనం తీసుకవస్తూ మార్గ మధ్యంలో పగిడిద్దరాజు – సమ్మక్క దేవతలకు ఎదురిళ్లు కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఇలవేల్పులను గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజారులు, వడ్డెలు, తలపతులు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు జోగు నిర్వహించి, రాత్రి 8 గంటలకు దేవతలకు గంగాస్నానం చేయించి గుడి నింపారు. వన దేవతలను గద్దెల వద్దకు చేర్చే క్రమంలో వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవతలను తీసుకొస్తుండగా పూజారులు, భక్తులు మంటలపై నుంచి నడిచివచ్చారు. దారి పొడవునా డోలి వాయిద్యాలు, ఆదివాసీల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పగిడిద్దరాజు జాతరకు ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దేవతలను దర్శించుకున్న భక్తులు బెల్లం, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లు, మేకలు బలిచ్చారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గుండాల సీఐ తిరుపతి, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. మేడారం ట్రస్టుబోర్డు చైర్పర్సన్ ఇర్ప సుకన్య, మాజీ చైర్మన్ అరెం లచ్చు పటేల్ పగిడిద్దరాజు – సమ్మక్క దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు అర్రెం అప్పయ్య, లక్ష్మీనర్సు, పెద్ద కాంతారావు, చిన్న కాంతారావు, నాగేశ్వరరావు, బిక్షం, లక్ష్మీనారాయణ, సత్యం, సందీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దినోత్సవం సందర్భంగా పోటీలు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ వెల్లడిసూపర్బజార్(కొత్తగూడెం): జాతీయ మహిళా దినోత్సవం, సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకుని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అవగాహన పెంచే లక్ష్యంతో ‘ఫ్రేమ్స్ ఆఫ్ జస్టిస్’ పేరుతో రీల్, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నామని, యువత, న్యాయశాస్త్ర విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచడంతో పాటు చట్టంపై అవగాహన కల్పించడమే పోటీల ఉద్దేశమని పేర్కొన్నారు. రీల్ / వర్టికల్ వీడియో గరిష్టంగా 90 సెకన్లు ఉండాలని, షార్ట్ ఫిల్మ్ /ఎక్స్ప్లెయినర్ వీడియో గరిష్టంగా 180 సెకన్లు ఉండాలని సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీల్లో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు అర్హులని, ఏదైనా ప్రాంతీయ భాషలో వీడియోలు ఉండాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలో చేసే వీడియోలకు తప్పనిసరిగా ఇంగ్లిష్/హిందీలో సబ్టైటిల్స్ ఉండాలన్నారు. జోన్ల వారీగా విజేతలను ప్రకటించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని, మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ. 5 వేలు ఉంటుందని వివరించారు. ఎంట్రీలను తమ కాలేజీల ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పంపించాలని తెలిపారు. వివరాలకు 95058 02249 నంబర్లో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్లో ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు https://kothagudem. docourts. gov.in వెబ్సైట్ను చూడాలని పేర్కొన్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మెప్మా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ కోసం దేశంలో పటిష్టమైన చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు, సఖి టీమ్ సోషియో కౌన్సిలర్ బి.రాజమణి, పారా లీగల్ వలంటీర్ భారతి, రూప తదితరులు పాల్గొన్నారు. -
మద్యం అమ్మితే రూ. 25 వేల జరిమానా..
కరకగూడెం: మండలంలోని వెంకటాపురం గ్రామంలో మద్యపాన నిషేధానికి పంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. ఈ మేరకు సర్పంచ్ చౌలం కేశవరావు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయించినా, రవాణా చేసినా రూ.25వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అక్రమ విక్రయాల సమాచారం అందించిన వారికి రూ.2 వేల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. అనంతరం ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో తీర్మాన ప్రతిని అందజేశారు. వెంకటాపురం గ్రామస్తుల తీర్మానం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ వెలికితీత, ప్రోత్సాహానికి పరీక్షలు భద్రాచలం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీయడంతో పాటు ప్రోత్సహించేందుకు ముందస్తు పరీక్షలు దోహదపడతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని ఏజీహెచ్ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఆందోళనకు గురికాకుండా వార్షిక పరీక్షలు రాసేలా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 89 గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో 395 మంది పరీక్షలు రాశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీడీ అశోక్, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు. శిక్షణతో జీవనోపాధి పొందాలినిరుద్యోగ గిరిజన యువతకు ఐటీడీఏ వైటీసీ ద్వారా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పొందాలని రాహుల్ సూచిచారు. ఎలక్ట్రానిక్ విభాగంలో శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. అభ్యర్థులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే అవకాశముండగా.. మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. ఆ తర్వాత పీఓ గిరిజన మాల్ పనులను పరిశీలించారు. ఏపీఓ డేవిడ్రాజ్, జేడీఎం హరికృష్ణ, శిక్షకురాలు భవాని, ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేష్, వార్డెన్ దీనాకుమారి పాల్గొన్నారు. -
మేము సైతం.. భాగమవుతాం..
భద్రాచలం: దేవుడిపై తమకు గల భక్తిని పలువురు పలు రకాలుగా చూపిస్తుంటారు. కొందరు భజనలు, కీర్తనల ద్వారా నీరాజనం పలుకుతారు. మరి కొందరు ఉపవాసాలు, నిరంతర పూజలతో కొలుస్తుంటారు. తెలుగు వారి ఇలవేల్పుగా, అందరి బంధువుగా కీర్తిస్తున్న భద్రాద్రి రామయ్య ఎందరికో ఆరాధ్య దైవం. స్వామివారి దర్శనానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. శ్రీరామనవమి రోజున ఆయన కల్యాణ మహోత్సవాన్ని తిలకించి, తలంబ్రాలు స్వీకరించడమే పరమానందంగా భావించే వారు ఒకప్పుడు. కానీ ప్రస్తుతం భక్తులు ఆ తలంబ్రాల తయారీలో భాగస్వాములై రామయ్యపై తమ భక్తిని చాటుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు భక్తులు నిష్టగా గోటితో తలంబ్రాలు వొలుస్తూ, పాదయాత్రగా రామయ్య చెంతకు చేరుకుని సమర్పిస్తున్నారు. ఇలా వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతుండడం విశేషం. ప్రతీ గింజపై శ్రీరామ ఆవాహనం.. సాధారణంగా ఒడ్లను రోట్లో దంచి బియ్యంగా చేస్తారు. కానీ ప్రతీ గింజనూ గోటితో వొలుస్తూ వాటిపై శ్రీరామ నామ ఆవాహనం చేస్తూ కఠోర నిష్టతో యజ్ఞంలా ఈ క్రతువు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోరుకొండకు చెందిన అప్పారావు బృందం దీనికి ఆద్యులు కాగా, ఆ తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించింది. వారు గత రెండు దశాబ్దాలుగా పొలం దున్నడం నుంచి నాట్లు వేసి, కోత కోసి, గోటితో వొలిచే వరకు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. గత పదేళ్లుగా తెలంగాణలోని పలు జిల్లాల భక్తులు సైతం గోటి తలంబ్రాలు తీసుకొస్తున్నారు. శ్రీరామనవమికి రెండు, మూడు నెలల ముందు నుంచే వరి ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు శ్రీరామ నామ స్మరణ చేస్తూ వొలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నవమికి ముందు ఆయా గ్రామాల నుంచి కోలాటాలు, పాదయాత్రగా భద్రాచలం చేరుకుని సమర్పిస్తున్నారు. ఆలయ అర్చకులు వీటిని స్వామి వారి చెంత పూజలు చేశాక, కల్యాణ తలంబ్రాలలో వినియోగిస్తారు. దేవస్థానం నుంచి ఆదరణ అంతంతే.. కాగా నియమ నిష్టలు, కఠోర దీక్షతో మండు టెండల్లో కాళ్లకు చెప్పులు సైతం ధరించకుండా రామయ్య చెంతకు వచ్చే వారికి ఆలయంలో దక్కే ఆదరణ తక్కువనే చెప్పాలి. కేవలం ఉచిత దర్శన సౌకర్యం, మధ్యాహ్నం నిత్యన్నదాన ప్రసాద అవకాశం మాత్రమే కల్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం కల్పించలేకపోతున్నారు. దీంతో భక్తులే భద్రాచలంలో స్థానిక వస్త్ర వ్యాపారిని సంప్రదించగా ఆయన తన మిత్ర బృందంతో ఆరేళ్లుగా అన్ని రకాల టిఫిన్లు, టీతో పాటుగా మజ్జిగ ఉచితంగా అందిస్తున్నారు. తొలుత 500 మందికి అందించగా, ఈ ఏడాది 5 వేల మందికి నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు నడిచి వచ్చే భక్తులకు ఆలయం ఆధ్వర్యంలో సరిపడా డార్మెటరీ గదుల వసతి కల్పించలేకపోతున్నారు. దారి పొడవునా గ్రామాల్లో భక్తులు సేద తీరేందుకు, బస చేసేందుకు డార్మెటరీ గదులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గోటి తలంబ్రాలను కఠిన నిష్టతో, క్రమశిక్షణతో వొలిచాం. ప్రతీ గింజకు శ్రీరామ నామస్మరణ చేస్తూ పాల్గొన్నాం. సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాలలో భాగస్వామ్యం కావటం చాలా సంతోషంగా ఉంది. – జె.శ్రీలక్ష్మి, మోరంపల్లి బంజరమూడు జిల్లాల వ్యాప్తంగా గోటి తలంబ్రాలను ఒలిచే కార్యక్రమాన్ని గత పదేళ్లుగా చేపడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దేవస్థానం తగిన గుర్తింపు ఇచ్చి వసతుల కల్పన పెంచాలి. తద్వారా ఇతర భక్తుల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామగ్రామాన ధర్మప్రచారం పెరుగుతుంది. – వల్లభనేని నాగేశ్వరరావు, ధర్మ జాగరణ సమితి జిల్లా ప్రముఖ్ -
8న సేవాలాల్ మహరాజ్ జయంతి
సూపర్బజార్(కొత్తగూడెం): సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఈనెల 8న కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బంజారా సంఘాలు. వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయంతి వేడుకల నిర్వహణకు తొమ్మిది కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కన్వీనర్గా రమేష్ రాథోడ్. కో కన్వీనర్గా మాజీ కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ నాయక్ వ్యవహరిస్తారని చెప్పారు. ఈ మేరకు కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్యతో సమావేశం నిర్వహించి వేడుకల వివరాలు తెలియజేశారు. ఆ తర్వాత వేడుకలు నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. -
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీసీ
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అధ్యక్షతన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అధికారులకు వివరించారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ.. జిల్లాలో 99 రోజుల కార్యక్రమాల నిర్వహణకు కలెక్టర్ నేతృత్వంలో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. వీసీలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులు సమన్వయంతో పనిచేయాలిడీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ సుజాతనగర్: వైద్యులు సమన్వయంతో పని చేసి బాధితులకు ఉత్తమ సేవలు అందించాలని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ సూచించారు. స్థానిక పీహెచ్సీని గురువారం తయన తనిఖీ చేశారు. మిషన్ హెల్త్–100 ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ హెల్త్–100 కార్యక్రమంపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు శిబిరానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి వైద్య కేంద్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ కార్నర్ను బలోపేతం చేసి, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అన్ని ఆరోగ్య సూచికలను మెరుగుపరచే దిశగా కృషి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి, మిషన్ హెల్త్–100 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మృతిటేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి(79) గురువారం గుండెపోటుతో పాల్వంచలో మృతి చెందారు. ఆమె మృతదేహన్ని స్వగ్రామమైన టేకులపల్లి మండలం ప్రెగళ్లపాడు పంచాయతీ పరిధి తెలుగూరుకు తీసుకొచ్చారు. కాగా, విజయలక్ష్మి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. 2006లో టేకులపల్లి జెడ్పీటీసీగా ఆమె గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ – సీపీఎం కూటమికి సమానంగా సీట్లు రావడంతో టాస్ ద్వారా విజయలక్ష్మికి చైర్పర్సన్గా అవకాశం దక్కింది. ఆమె భర్త వెంకటనారాయణ కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగారు. ప్రత్యర్థుల చేతిలో ఆయన 1991లో హత్యకు గురయ్యారు. రేషన్ డీలర్పై కేసు నమోదుజూలూరుపాడు: మండలంలోని సురారం రేషన్ డీలర్పై సివిల్ సప్లై అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం లేదనే ఫిర్యాదు మేరకు డీఎస్ఓ ప్రేమ్కుమార్ ఆదేశాలతో సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయకుండానే 12 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఏసీఎస్ఓ వరదరాజులు మాట్లాడుతూ.. ప్రతీ నెల 78.10 క్వింటాళ్ల బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఫిబ్రవరి 28న రేషన్ దుకాణానికి మొత్తం బియ్యం వచ్చాయని, మార్చి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా 5వ తేదీ వరకు కూడా సరఫరా చేయలేదని వివరించారు. అయతే ప్రస్తుతం వచ్చిన 78.10 క్వింటాళ్ల సన్న బియ్యంతోపాటు, గతంలో నిల్వ ఉన్న 10.96 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలకు గాను 77.06 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. డీలర్ భీముడుపై కేసు నమోదు చేసి, ప్రస్తుతానికి సురారం రేషన్ షాపు నిర్వహణ బాధ్యతను కాకర్ల రేషన్ డీలర్కు అప్పగించామని తెలిపారు. ఈ మేరకు సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో భద్రాచలం సివిల్ సప్లై డీటీ జి.రాజులు, ట్రైనీ డీటీ వడ్డె భార్గవ్, ఆర్ఐ ఎన్.వెంకట్వేర్లు పాల్గొన్నారు. -
ఉద్యోగులు క్రీడల్లో రాణించాలి
పాల్వంచ: నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులకు క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు అన్నారు. గురువారం స్థానిక కేటీపీఎస్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా మైదానంలో టీజీ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటర్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు కేటీపీఎస్ 5, 6, 7 దశలతో పాటు బీటీపీఎస్, శ్రీశైలం, పులిచింతల, కేటీపీపీ, విద్యుత్సౌధ, వైటీపీఎస్లకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఈ మాట్లాడుతూ.. క్రీడలతో ఉద్యోగుల మధ్య ఐకమత్యం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఈలు ఎస్.యుగపతి, జి.రాజ్కుమార్, డివైసీసీఏ నాగరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, సెక్రటరీలు టి.మహేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ నిధులొచ్చాయి..
బూర్గంపాడు: నిధుల లేమితో రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిన గ్రామపంచాయతీ లకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత డిసెంబర్లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు కొలువుదీరటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదలవుతున్నాయి. 2024–25కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు 15 రోజుల క్రితం మొదటి విడతగా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమయ్యాయి. మళ్లీ రెండో విడత నిధులు కూడా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమవుతున్నాయి. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వెసులుబాటు కలిగింది. ఏడాదిన్నరపాటు రూపాయి ఇవ్వని ప్రభుత్వాలు ఏడాదిన్నరపాటుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామపంచాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదు. గ్రామపంచాయతీల్లో అత్యవసర పనులకు పంచా యతీ కార్యదర్శులు అప్పులుచేసి సొంతంగా ఖర్చు చేశారు. అప్పటికే గ్రామాల్లో పనులు చేసిన గత పాలకవర్గాలకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించా ల్సి ఉంది. ఈ పరిస్థితులు పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా పరిణమించాయి. రోజువారీ ట్రాక్టర్ డీజిల్కు, మరమ్మతులకు, బ్లీచింగ్ కొనుగోలుకు, వీధిలైట్ల కొనుగోలుకు ఇతర అత్యవసర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంతంగా ఖర్చుచేశారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరాక తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను కార్యదర్శులు సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు తెలియజేశారు. గత పాలకవర్గాలకు ఊరట ప్రభుత్వం నిధులు విడుదల చేయటంతోపాటు ఆ నిధులను పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు విని యోగించాలని ప్రభుత్వం సర్క్యూలర్ విడుదల చేసింది. ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు టైడ్, అన్టైడ్ నిధులుగా విభజిస్తారు. ప్రస్తుతం విడుదల చేసిన టైడ్ నిధులను కేవలం పెండింగ్ బిల్లులు చెల్లించేందుకే వినియోగించాలని ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యూలర్లో పేర్కొంది. దీంతో గతంలో గ్రామపంచాయతీ పనులకు ఖర్చు చేసిన కార్యదర్శులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ పాలకవర్గ సభ్యులకు ఒకింత ఊరట లభించనుంది. పెండింగ్ బిల్లులు కూడా సీరియల్ ప్రకారం చెల్లించాల్సి ఉంది. రెండో విడతలో రూ.17.85 కోట్లు జిల్లాలోని 471 గ్రామపంచాయతీలకు ఇటీవల రూ.11.90కోట్ల ఆర్థికసంఘం నిధులు జమయ్యా యి. ఈ నిధులను పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కొత్త పాలకవర్గాల అనుమతితో చెక్కులు సిద్ధం చేస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. తొలి విడత నిధుల్లో పెండింగ్ బిల్లులు తమకు చెల్లించాలంటే, తమకు చెల్లించాలని పలువురు పోటీ పడుతున్న తరుణంలో రెండో విడత నిధులు విడుదల కావటం కొంత ఊరటనిచ్చినట్లయింది. రెండో విడతగా రూ.17.85కోట్ల నిధులను ప్రభుత్వం గ్రామపంచా యతీ ఖాతాల్లో జమచేసింది. వెంటవెంటనే గ్రామపంచాయతీలకు నిధులు కావటంతో కొత్త పాలకవర్గాలకు పాత బిల్లుల తలనొప్పులు తగ్గనున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాలు ప్రస్తు తం వస్తున్న నిధులు పెండింగ్ బిల్లులకే చెల్లించటంతో కొత్తగా ఏ పనులు చేపట్టలేకపోతున్నామనే ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామపంచాయతీలకు రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రెండు విడతలుగా జిల్లాలోని జీపీలకు రూ.29.75 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులను సీరియల్ ప్రకారం పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం చేపట్టే అత్యవసర పనులకు ఈ దఫా రానున్న నిధుల్లో బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. –సుధీర్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి -
మే 11 నుంచి రైతు సంఘం జాతీయ మహాసభలు
ఇల్లెందు: మే 11, 12, 13 తేదీల్లో ఇల్లెందులో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అనుబంధ అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలు ఇల్లెందులో నిర్వహించనున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చెల రంగయ్య, నాయకులు ప్రదీప్సింగ్ ఠాగూర్ వెల్లడించారు. రెండు రోజులుగా ఇల్లెందులో జరుగుతున్న సంఘం సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘం పనితీరును సమీక్షించుకోవడంతో పాటు లోపాలను అధిగమించేందుకు నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాలను బలోపేతం చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతీనిధులు ఈ మహాసభలకు హాజరవుతారని తెలిపారు. 11వ తేదీన ఇల్లెందులో భారీ ర్యాలీ, బహిరంగసభ ఉంటాయని వివరించారు. అభిమానులు ఆర్థిక సాయం అందించి సభల విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ మహాసభలకు ఇతర పార్టీల అనుబంధ సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం భారత్కు నష్టం అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుందని, ఇది దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని మాస్లైన్ జాతీయ నాయకులు ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు. అమెరికా పేద దేశాలపై అప్రజాస్వామికంగా యుద్ధం చేస్తోందని, ప్రజలను నిర్దాక్ష్యిణ్యంగా హతమారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ – అమెరికా ఒప్పందాన్ని నిరసిస్తూ ఈనెల 23న దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు శిబిగిరి, పరితోషిదాస్, నిరంజన్ బేరా, దేవరావు, ఎస్కే గౌస్, బి.రాము, అరుణ, బుర్ర వెంకన్న, పాయం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి మాల్ట్’లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
భద్రాచలంటౌన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న గిరి మాల్ట్లో వివిధ పోస్టుల భర్తీకి ఏపీఓ డేవిడ్ రాజ్ స్థానిక వైటీసీ భవనంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సేల్స్ అసోసియేట్, క్యాషియర్, స్టాక్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన యువతీ, యువకులు 15 మంది హాజరు కాగా, వ్యాపార లావాదేవీలపై నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. ఇంకా ఎవరైనా ఇంటర్వ్యూకు రాలేకపోయిన వారు ఉన్నా తమ కార్యాలయంలోని భవిత సెల్లో సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పీవీటీజీ అధికారి గన్యా, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు. వెంకటరెడ్డి సేవలు మరువలేనివి కామేపల్లి: మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మాజీ మంత్రి 10వ వర్ధంతి సందర్భంగా బుధవారం కొత్తలింగాల క్రాస్లోని ఆయన విగ్రహానికి వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడడమేకాక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలు, పార్టీకి సేవలు చేశారని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన వెంకట్రెడ్డి ఆశయ సాధనకు కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కోరారు. ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్మిత్ర, నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, చరణ్రెడ్డి, మానుకొండ రాధాకిషోర్, జగన్నాథరెడ్డి, గింజల నర్సింహారెడ్డి, మేకల మల్లిబాబుయాదవ్, ధనియాకుల హన్మంతరావు, తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, రెడబోతు గోపీరెడ్డి పాల్గొన్నారు. సమర్థవంతంగా వినియోగించాలిచుంచుపల్లి: 102, 108 అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ సూచించారు. జిల్లాలోని 102, 108 వాహనాల కోఆర్డినేటర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో, గర్భిణులను ప్రభుత్వాస్పత్రులకు తరలించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. డీపీఎంఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు పదోన్నతులు కల్పించండి..
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశలో పనిచేస్తున్న కార్మికులకు ఇన్ చార్జ్ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.రామారావు అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ జె.సూర్యనారాయణకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కర్మాగారంలో 2024–25 డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్వహించినట్లు చెప్పారు. జేపీఏ నుంచి ఫోర్మెన్ గ్రేడ్–1 వరకు 25 మంది కార్మికులకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్గా ఇద్దరికి పదోన్నతులు రావాల్సి ఉందన్నారు. వైటీపీఎస్లో గత నెలలోనే ఉత్తర్వులు ఇచ్చారు కానీ, పెండింగ్లో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీ.సత్యరాజ్ స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్ సయ్యద్, టి.రాములు పాల్గొన్నారు. -
రామయ్య పెళ్ల్లికొడుకాయెనే!
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ముందుగానే వచ్చిందా అన్నట్లుగా భద్రగిరి మురిసింది. భక్తిశ్రద్ధలతో అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమలు దంచగా, తలంబ్రాల తయారీలో మహిళల ఉత్సాహం.. మరో వైపున శ్రీరామనామ స్మరణలు చేస్తూ గోటి తలంబ్రాలతో పాదయాత్రగా వచ్చిన భక్తజనం.. వెరసి మిథిలా స్టేడియం కళకళలాడింది. ఆనందోత్సాహాల నడుమ రామయ్య పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. వసంతం చల్లుకున్న శ్రీ సీతారాములు దర్శనమివ్వగానే ‘మా రామయ్య పెళ్లికొడుకాయెనే’ అంటూ భక్తులు మురిసిపోయారు. ఒకరోజు ఆలస్యంగా.. ప్రతీ ఏడాది ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. ఈసారి చంద్రగ్రహణం రావడంతో ఈ వేడుకలను బుధవారం ప్రారంభించారు. తొలుత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా ఉత్తర ద్వారం వద్ద ఆశీనులు చేశారు. అర్చకులు, వేదపండితులు స్వామివారికి, రోళ్లు, రోకళ్లకు సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేశారు. ఆ తర్వాత పసుపు కొమ్ములు దంచి కల్యాణ వేడుకలను ప్రారంభించారు. బియ్యంలో పసుపు, రోజ్వాటర్, గులామ్, సుగంధ ద్రవ్యాలు, అత్తర్ కలిపి తలంబ్రాలు తయారు చేశారు. వాటిని ఆలయ అధికారులు శిరస్సుపై ధరించి స్వామివారి మూలమూర్తుల పాదాల చెంతన ఉంచారు. కాగా ప్రతీ ఏడాది పాదయాత్రగా గోటి తలంబ్రాలతో వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మిథిలా స్టేడియ ప్రాంగణం నిండిపోయింది. తలంబ్రాల తయారీలో మహిళా భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. భద్రాచలానికి చెందిన స్నేహితుల బృందం.. గోటి తలంబ్రాలు తీసుకొచ్చిన సుమారు 8 వేల మందికి అల్పాహారం, టీ, మజ్జిగ అందించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారాములకు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు సువర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృతంతో కలశాభిషేకం, సహస్ర ధారలతో స్నపనం జరిపారు. ఆస్థాన గాయకులు రామదాసు కీర్తనలను ఆలపిస్తుండగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి నక్షత్ర హారతి సమర్పించారు. అర్చకులు శ్రీ సీతారాములపై రంగులు చల్లి వసంతోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భక్తులపై, ఈఓ దంపతులపై రంగులు చల్లారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఆలయ ఈఓ దామోదర్రావు, స్థానాచార్యులు స్థలశాయి, ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు బూసిరెడ్డి అంకిరెడ్డి, అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హోలీ వేడుకలు
సూపర్బజార్(కొత్తగూడెం): నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్లో బుధవారం ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రోహిత్రాజ్ సైతం సంబరాల్లో పాల్గొని జోష్ నింపారు. మొదట జిల్లా పోలీస్ అధికారులంతా కలిసి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి హోలీ వేడుకలకు రావాలని ఎస్పీని ఆహ్వానించారు. అక్కడ అధికారులు, సిబ్బంది రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. అనంతరం ఎస్పీతో కలిసి అధికారులంతా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు చేరుకుని బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అధికారులు, సిబ్బంది తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్నబాబు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల బ్రోచర్లు ఆవిష్కరణ
భద్రాచలంటౌన్: ఐటీడీఏ పరిధిలోని మోడల్ క్రీడా పాఠశాలల్లో 2026 – 27 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్ను పీఓ బి.రాహుల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు) పాఠశాలల్లో 40 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 9 నుంచి 11 ఏళ్ల లోపు వయసు ఉండి, ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికై న వారికి ఉచిత వసతి, పౌష్టికాహారం, స్పోర్ట్స్ కిట్లతో పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీడీ అశోక్, క్రీడల అధికారి గోపాలరావు పాల్గొన్నారు. ఎల్ఎల్బీ సీటు సాధించడం అభినందనీయం.. టేకులపల్లి మండలం సంపత్నగర్కు చెందిన నిరుపేద ఆదివాసీ యువకుడు పూనెం హరీష్ ప్రతిష్టాత్మక న్యూఢిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ సీటు సాధించడం అభినందనీయమని పీఓ రాహుల్ అన్నారు. ఈ మేరకు ఐటీడీఏ తరఫున ప్రోత్సాహకంగా రూ.30వేల చెక్కును బుధవారం తన చాంబర్లో విద్యార్థి తండ్రి లక్ష్మయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జాతీయ స్థాయి వర్సిటీలో సీటు సాధించిన హరీష్ తోటి విద్యార్థులకు ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పగిడిద్దరాజు జాతర షురూ..
గుండాల: మేడారం సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. మేడారం జాతర అనంతరం మాఘమాసంలో సమ్మక్క–పగిడిద్దరాజుల నాగవెళ్లి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశస్తులు, పూజారులు, వడ్డెల ఆధ్వర్యంలో ఆ గ్రామంలోని గుట్ట నుంచి పడగ(జెండా)ల రూపంలో పగిడిద్దరాజును స్థానిక గద్దెల వద్దకు చేర్చారు. తొలుత రాత్రి గర్భగుడి వద్ద ఆభరణాలకు, పడగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును డప్పువాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో ఊరేగింపు ద్వారా గద్దెలపై ప్రతిష్టించి సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం వనం(సమ్మక్క దేవత) రాకతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం జోగుకు వెళ్లి, రాత్రి దేవతలకు గంగాస్నానం చేయిస్తారు. దేవతలకు నాగవెళ్లి జరుపుతారు. శుక్రవారం తెల్ల వారుజామున గుడి మెలిగి, దేవతలకు సెలపెయ్యను హారం ఇస్తారు. ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జారతలో భారీగా దుకాణాలు వెలిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బంబోబస్తు ఏర్పాటు చేశారు. దూలుగొండ ముసలమ్మ జాతర ప్రారంభం ఈసం వంశీయుల ఇలవేల్పు దూలుగొండ ముసలమ్మ(దేవత) జాతర బుధవారం రోళ్లగడ్డలో ఘనంగా ప్రారంభించారు. ఈసం, మాడె వంశీయులు, పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలతో మండ మెలుగుట, గుడి మెలుగుట కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం దేవతను గద్దెలపై ప్రతిష్టించడంతో నిండు జాతర ప్రారంభమవుతుంది. శుక్రవారం మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజన సంప్రదాయాలతో గర్భగుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. నేడు అమ్మవారి రాకతో నిండు జాతర -
లోక్యాతండాలో ఘనంగా ‘డూండ్’
కూసుమంచి: హోలీ పర్వదినం జరుపుకోవడంలో ప్రత్యేకంగా నిలుస్తున్న మండలంలోని లోక్యాతండాలో వేడుకలు బుధవారం రెండో రోజుకు చేరాయి. ఈమేరకు అనాదిగా వస్తున్న డూండ్ వేడుకను తండా వాసులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గత హోలీ నుంచి ఇప్పటి వరకు తండాలో జన్మించిన మగబిడ్డలకు అన్నప్రాసన, నామకరణం చేయడాన్ని డూండ్గా పిలుస్తారు. ఈమేరకు గేర్యా(వేడుకల పెద్దలు) తండావాసులతో కలిసి కోలాటం ఆడుతూ డూండ్ జరుపుకునే వారి ఇళ్లకు వెళ్లారు. అక్కడ కోలాటం కర్రలతో పొడవాటి కర్రను కొడుతూ పాటలు పాడుతూ తల్లీబిడ్డలను దీవించారు. కాగా, బుధవారం తెల్లవారుజామున తండాలో నిర్వహించిన కామ దహనంలో పెద్దలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని పూజలు చేశారు.వేడుకలో చిన్నారితో తల్లి రెండో రోజుకు చేరిన హోలీ వేడుకలు -
అక్రమంగా పసికందు దత్తత
ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇల్లెందు: పట్టణంలోని 14 నంబర్ బస్తీ(వెంగళరావు నగర్)కు చెందిన నెల రోజుల చిన్నారిని హైదరాబాద్కు అక్రమ దత్తత ఇచ్చారు. ఈ విషయమై అంగన్వాడీ సూపర్వైజర్ కె.రోహిణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని వెంగళరావు నగర్కు చెందిన దీపిక–సాగర్ దంపతుల మూడో సంతానం, నెల రోజుల పాపను హైదరాబాద్కు చెందిన దూల్పేట్– ఆసీఫ్ నగర్కు చెందిన రాహుల్ అమర్ ప్రకాష్ రాతి– చంద్రాబాయిలకు గత నెల 28న దత్తత ఇచ్చారు. సమాచారం రావడంతో అంగన్వాడీ టీచర్ శారద, సూపర్వైజర్ రోహిణి, చైల్డ్ హెల్ప్లైన్ (డీసీపీ) ఆఫీసర్ భారతి వెంగళరావు నగర్లోని దీపిక–సాగర్లను విచారించారు. దత్తత చట్టరీత్యా చెల్లదని సూచించారు. ఈ ఘటనపై సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సమ్మిరెడ్డి తెలిపారు. -
గల్లంతైన వ్యక్తుల మృతదేహాలు లభ్యం
కన్నీరుమున్నీరుగా రోదించిన కుటుంబీకులు మణుగూరు టౌన్: మల్లేపల్లి ఇన్టేక్వెల్ ప్రాంతంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... సింగరేణి పునరావాస గ్రామమైన పద్మగూడేనికి చెందిన పద్దం ప్రసాద్(35) కొత్తగూడెం పీవీ కే–5 గనిలో జనరల్ అసిస్టెంట్గా, గుండ్ల సింగారం గ్రామానికి చెందిన గుండి నాగేశ్వరరావు(40) వాల్వో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు మరి కొందరు స్నేహితులతో కలిసి మంగళవారం హోలీ ఆడాక స్నానం చేసేందుకు వెళ్లారు. వారిలో ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడే ప్రయత్నంలో ప్రసాద్, నాగేశ్వరరావు గల్లంతయ్యారు. గాలింపు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ప్రసాద్కు భార్య, ముగ్గురు పిల్లలు, నాగేశ్వరరావుకు భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాల వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాటా ఏస్ వాహనం బోల్తాదుమ్ముగూడెం: సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని చంద్రుగూడెంలో మిర్చి కూలీలతో మండలానికి వస్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. బుధవారం ఛత్తీస్గఢ్ నుంచి 20 మంది కూలీలతో వస్తున్న వాహనం చంద్రుగూడెం దగ్గర బోల్తా పడింది. దీంతో గాయపడ్డ వారిని ములకపాడు వైద్యశాలకు తరలించారు. డాక్టర్ రుక్మాకర్ రెడ్డి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని 108 ద్వారా భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. నాటుసారా స్వాధీనంభద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న నాటుసారాతోపాటు ఓ వ్యక్తిని జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ ఎస్సై గౌతమ్ కథనం ప్రకారం.. బుధవారం భద్రాచలం పట్టణంలోని కొత్త మార్కెట్, భగవాన్ దాస్ కాలనీ ఏరియాలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్పై తరలిస్తున్న 16 లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సారా తరలిస్తున్న భగవాన్ దాస్ కాలనీకి చెందిన వేముల వెంకన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. -
తేలని పంచాయితీ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రెండేళ్ల క్రితం అకస్మాత్తుగా వచ్చిన భారీ వరదలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలవనరుగా ఉన్న అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. నాటి నుంచి ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అప్గ్రేడ్ చేయడంలో రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ తెగడం లేదు. దీంతో ఆయకట్టు పరిధిలోని ఇరు రాష్ట్రాల రైతులతో పాటు జిల్లాకు చెందిన మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. 16 వేల ఎకరాల ఆయకట్టు.. పెద్దవాగు ప్రాజెక్టును 1981లో నిర్మించారు. దీని కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న అశ్వారావుపేట, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 16 వేల ఎకరాలు సాగవుతుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు తెలంగాణలో ఉండిపోగా 13వేల ఎకరాల ఆయకట్టు ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. దీంతో ప్రాజెక్టు నిర్వహణ ఎవరు చేపట్టాలనే అంశంపై 2014 నుంచి సందిగ్ధత నెలకొంది. ఆయకట్టులో సింహభాగం ఉన్న ఏపీ సర్కారు ప్రాజెక్టు మెయింటెనెన్స్కు ముందుకు రాలేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పోటెత్తిన వరద.. పెద్దవాగు ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 40 వేల క్యూసెక్కులు. ఇక్కడ నీరు నిల్వ ఉంచడం, కిందికి వదిలేందుకు వీలుగా 18 అడుగుల ఎత్తుతో మూడు గేట్లు నిర్మించారు. అయితే 2024 జూలై 17న రెండు, మూడు గంటల వ్యవధిలోనే 90వేల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పటికే ప్రాజెక్టులో 16 అడుగుల ఎత్తున నీళ్లు నిలిచి ఉన్నాయి. పై నుంచి భారీ వరద మొదలైన తర్వాత గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించగా.. నిర్వహణ లోపాల కారణంగా మూడో గేటు మొరాయించింది. వరద అంతకంతకూ పెరిగి గేట్లు, మట్టికట్ట మీదుగా నీరు ప్రవహించింది. దీంతో రైట్ కెనాల్ తూము దగ్గర రెండు వేర్వేరు చోట్ల మొత్తంగా 60 మీటర్ల మేర గండి పడింది. అంతేకాక ట్యాంక్బండ్ సైతం 150 మీటర్ల మేరకు బలహీనపడింది. వాటాపై తేలని పంచాయితీ ప్రాజెక్టు మరమ్మతులు, అప్గ్రేడ్ పనులకు అయ్చే ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని ఒప్పందం చేసుకున్నారు. 2024లో వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని కట్ట ఎత్తు పెంచడంతో పాటు రెగ్యులేటరీ గేట్ల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచాలని నిర్ణయించారు. దీనికోసం రూ.101 కోట్ల ఖర్చు వస్తుందని ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)కు విన్నవించారు. అయితే, ఈ ప్రాజెక్టు కింద మొత్తం 16 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇందులో 13 వేల ఎకరాలు ఏపీ పరిధిలో, అశ్వారావుపేట మండల పరిధిలో మూడు వేల ఎకరాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పెద్దవాగు కోసం వెచ్చించే నిధుల్లో 85 శాతం ఏపీ భరిస్తే 15 శాతం తాము చెల్లిస్తామని తెలంగాణ అంటోంది. మరోవైపు 82, 18 శాతం నిష్పత్తిలో ఖర్చు భరించాలని ఏపీ వాదిస్తోంది. గతేడాది ఏప్రిల్లో జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలోనూ ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో పెద్దవాగు కింద అధికారికంగా మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంటే అనధికారికంగా మరో రెండు వేల ఎకరాల వరకు సాగవుతోంది. ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికే 2024, 2025 సీజన్ పంటలను రైతులు కోల్పోయారు. ప్రస్తుతం వేసవి వచ్చింది. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. ఇరు రాష్ట్రాల మధ్య కేవలం రూ.3 కోట్ల విషయంలోనే పంచాయితీ తెగడం లేదు. కాగా, గురువారం హైదరాబాద్లో జీఆర్ఎంబీ సమావేశం జరగనుంది. కనీసం ఈ సమావేశంలోనైనా పెద్దవాగు ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావడంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ విభాగాలు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. వరదలతో కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్ట్ -
ప్రగతి ప్రణాళిక సమర్థంగా అమలుచేయాలి
● పాఠశాలలు, వసతి గృహాలను పర్యవేక్షించాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశంసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి 15 వరకు కార్యాలయాలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ ఉంటుందన్నారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, రికార్డుల నిర్వహణ, ప్రజలకు సకాలంలో సేవలందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణులు, చిన్నారులపై ప్రత్యేక పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. 13 నుంచి 18 వరకు అరైవ్–ఎలైవ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 20 నుంచి 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షించనున్నట్లు చెప్పారు. 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, నో డ్రగ్స్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆ తర్వాత వరుసగా వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇలా 99 రోజుల పాటు కార్యాచరణ అమలు చేస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. ప్రతీరోజు నిర్వహించిన కార్యక్రమాల పూర్తి వివరాలతో ప్రగతి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా పురోగతి, సమస్యలు, తీసుకున్న చర్యలు తదితర వివరాలు సమగ్రంగా నివేదికలో పొందుపరచాలని సూచించారు. కార్యక్రమం అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబూరావు, డీఎస్ఓ ప్రేమ్కుమార్, పౌరసరఫరాల డీఎం త్రినాథ్ బాబు, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.సుజాతనగర్: మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ అంకిత్ బుధవారం తనిఖీ చేశారు. పాఠశాల వసతి, సదుపాయాలు, తరగతుల నిర్వహణ, హాజరు పట్టికతో పాటు విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. బాగా చదివి మంచి మార్కులు సాధించాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. వసతి గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల పరిస్థితుల గురించి వార్డెన్ బ్యూలారాణిని ఆడిగి తెలుసుకున్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
చండ్రుగొండ: చండ్రుగొండలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఉదంతం ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. రైతులు, సోదరులు మరకాల దుర్గారెడ్డి, మరకాల కృష్ణారెడ్డి తమ చేలో పత్తి సాగు చేశారు. పంట చేను మధ్యలో వేపచెట్టు కింద కాలభైరవ విగ్రహం ఉంది. విగ్రహాన్ని పక్కకు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున తవ్వకాలు చేశా రు. అనంతరం గోతిని పూడ్చేశారు. కొంతకా లం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలభైవుడి విగ్రహాన్ని వెలి కిల పడేశారు. క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇది గమనించిన రైతులు భయంకంపితులయ్యారు. శ్రీనగర్కాలనీకి (ఉత్తరపంటు కాలనీ) సమీపంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి నిందితులను శిక్షించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్దుమ్ముగూడెం : మండలంలో అక్రమంగా ఇసుక తోలుతున్న ఆరు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీతారాంపురం వద్ద గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని, స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. బోనకల్ లో.. బోనకల్: మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపాన వైరా నది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు బుధవారం సీజ్ చేశారు. చిన్నమండవకు చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లతో బ్రాహ్మణపల్లి వద్ద వైరా నదిలోకి దిగి ఇసుకను లోడ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈమేరకు రెండింటి యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పొదిల వెంకన్న తెలిపారు. రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం తాళ్లమడలో బుధవారం తెల్లవారుజామున రహదారి వెంట నడిచి వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టడంతో అక్కడి డికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చేసరికి సదరు వ్యక్తి మృతదేహం నుజ్జునుజ్జయిందని గుర్తించారు. దీంతో పోలీసులు మరో వాహనంలో మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య సత్తుపల్లిరూరల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్తుపల్లి వెంగళరావునగర్ కాలనీకి చెందిన కొల్లిపర మల్లికార్జున్(25) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఆయన బుధవారం ఇంట్లో ఎవరురూలేని సమయాన ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లికార్జున్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో మహిళ.. కొణిజర్ల: భర్త, కుమారుడు మద్యానికి బానిసలై చెప్పినా వినడం లేదన్న మనస్తాపంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుది. కొణిజర్ల ఎస్సై జి.సూరజ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తనికెళ్లకు చెందిన నంద్యాల లక్ష్మి(50) పెద్ద కుమారుడు ఎనిమిది నెలల క్రితం మృతి చెందాడు. ఆమె భర్త వెంకటేశ్వర్లు, చిన్నకుమారుడు మద్యానికి బానిసలై ఎంత చెప్పినా మానడం లేదు. దీంతో మనస్తాపంతో ఉంటున్న లక్ష్మి మంగళవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఈక్రమాన బుధవారం ఓ వెంచర్ విగతజీవిగా కనిపించడం, పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వైన్ షాపులో బీరు సీసాతో దాడిపాల్వంచ: వైన్షాపులో మద్యం తాగి గోల చేస్తున్నవారిని వారించినందుకు గొడవ పడి బీరు సీసాతో తలపగుల గొట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాత సురారానికి చెందిన కేటీపీఎస్ ఆర్టిజన్ బోడా అశోక్కుమార్ బుధవారం రాత్రి అంబేద్కర్ సెంటర్లోని విజయదుర్గ వైన్స్లో మద్యం తాగుతున్నాడు. అక్కడ నలుగురు వ్యక్తులు బీరు సీసాలు పగులగొట్టి గోల చేస్తున్నారు. ఈ క్రమంలో ఎందుకు గోల చేస్తున్నారని ప్రశ్నించగా.. అసభ్యపదజాలంతో దూషించి బీరు సీసాతో తలపై కొట్టి పరారయ్యారు. దీంతో అశోక్ కుమార్కు గాయమైంది. దాడి చేసిన వెంగళరావు కాలనీ, రేగళ్ల ప్రాంతాలకు చెందిన లకావత్ సోమన్న, బానోత్ హరి, పవన్, సోనులపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
అశ్వారావుపేటరూరల్: అగ్ని ప్రమాదంలో పూరిల్లు కాలిపోయిన ఘటన మండలంలోని కోయరంగాపురంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కారం మల్లయ్య, ఆయన భార్య కూలీ పనులకు వెళ్లాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని సామగ్రితో పాటు నిత్యావసరాలు, బీరువా, పట్టాదారు పాసుపుస్తకాలు, కుమార్తె సర్టిఫికెట్లు కాలిబూడిదయ్యాయి. సమచారం అందుకున్న అశ్వారావుపేట అగ్నిమాపకశాఖ సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే రూ.3లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు రూ.30వేల విలువైన నిత్యావసరాలు, దుస్తులు, వంట సామగ్రి అందించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త చిన్నంశెట్టి నరసింహారావు రూ.5వేలు, మాజీ జెడ్పీటీసీ జేకేవీ రమణారావు రూ.5వేలు అందజేశారు. -
కల్యాణోత్సవాలకు నేడు శ్రీకారం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో రామయ్య నేడు పెళ్లి కుమారుడిగా మారనున్నాడు. పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో పనులు ప్రారంభిస్తారు. సాధారణంగా ఫాల్గుణ పౌర్ణమి రోజునే పనులు ప్రారంభించాల్సి ఉన్నా.. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో బుధవారానికి మార్చారు. కాగా, నేడు స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం తదితర పూజలు నిర్వహిస్తారు. తలంబ్రాల తయారీ వేడుకకు మిథిలా స్టేడియం ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం వద్ద అధికారులు ఏర్పాట్లు చేయగా, వసంతోత్సవం, డోలోత్సవం బేడా మండపంలో జరుగనున్నాయి. వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత.. శ్రీ సీతారాముల కల్యాణానికి పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాలు కలపడంతో పనులు ప్రారంభించడం సంప్రదాయం. ఈ కార్యక్రమంలో ఇటీవల భక్తులను భాగస్వాములను చేయడంతో భద్రగిరి క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. గతంలో ఆలయంలో పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ వేడుకను చేపట్టగా, ప్రస్తుతం మిథిలా స్టేడియం ప్రాంగణంలోకి మార్చడంతో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది 300 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయాలని అఽధికారులు భావిస్తున్నారు. పసుపు, కుంకుమ దంచి, ప్రత్యేక గులాములతో తలంబ్రాలు సిద్ధం చేయడం భద్రగిరిలో మాత్రమే ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా బుధవారం నిత్యకల్యాణం రద్దు చేయగా గురువారం యథావిధిగా నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఇక నేడు వసంతోత్సవం సందర్భంగా సహస్రధారతో స్నపనం, అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని ఊయలలో ఆశీనులు చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృత స్నపనం, సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చన జరగనున్నాయి. కాగా, మేళతాళాలు, వేద మంత్రాల నడుమ అర్చకులు పవిత్ర గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి మంగళవారం రాత్రి వసంతోత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం యాగశాలలో వాస్తుహోమం నిర్వహించారు. రామయ్య కల్యాణ తంతులో తలంబ్రాలు కీలకం. వీటి తయారీలో పరోక్షంగా భాగస్వాములయ్యేందుకు భక్తులు గత కొన్నేళ్లుగా గోటితో ఒలిచి బియ్యం సిద్ధం చేస్తున్నారు. నిష్టగా, కఠోర దీక్షతో శ్రీరామనామస్మరణ చేసుకుంటూ గోటితో ఒలుస్తున్నారు. వీటిని రామయ్య సన్నిధికి తీసుకొచ్చి భద్రగిరి ప్రదక్షిణ చేశాక స్వామివారి తలంబ్రాలలో కలుపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో తయారు చేస్తున్న భక్తులు పాదయాత్రగా భద్రాచలం తరలివచ్చి సమర్పిస్తుండడం విశేషం. కోరుకొండకు చెందిన అప్పారావు బృందం గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన నారు వేసి, పంట కోశాక గోటితో తలంబ్రాలు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. -
చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులు
భద్రాచలంఅర్బన్ : తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శిశువుకు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణం పోశారు. ఆళ్లపల్లి మండలం బూసురాయికి చెందిన మడకం శివ అనే నాలుగు నెలల బాలుడి కుడికాలు పూర్తిగా కాలిపోయి ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు సెప్పిస్, రక్తహీనత, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా తల్లిదండ్రులు జనవరి 27వ తేదీన భద్రాచలం ఆస్పత్రికి తీసుకొచ్చారు. 2.8 కేజీల బరువుతో ఉన్న శివను పిల్లల వైద్యులు రాజశేఖర్ రెడ్డి, క్రాపా విజయ్తో పాటు ఎన్ఆర్సీ వార్డు వైద్యులు పూజ, సిబ్బంది 36 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుతూ మెరుగైన వైద్యం అందించారు. బరువు పెరిగేందుకు అవసరమైన ఆహార పదార్థాలు అందించారు. ఇతర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు కృషి చేశారు. దీంతో కాలు గాయం నయం కావడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడిన బాలుడిని మంగళవారం డిశ్చార్జ్ చేశారు. శిశువు ఆస్పత్రిలో చేరినప్పుడు 2.8 కేజీలు ఉండగా డిశ్చార్జ్ అయ్యే సమయానికి 4.25 కేజీలకు పెరగడం విశేషం. శిశువు పూర్తిగా కోలుకోవడానికి కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అభినందించారు. 36 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన డాక్టర్లు -
రైలు ఢీకొని వలస కూలీ మృతి
చండ్రుగొండ: చండ్రుగొండ రైల్వేస్టేషన్లో గూడ్స్ రైలు ఢీకొని వలస కూలీ మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన సోయం రాములు (50) వ్యవసాయ కూలీ పనుల కోసం కొంతమంది తో కలిసి వచ్చి రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. స్టేషన్ లూప్లైన్లో ఆగి ఉన్న రైలు దాటి న రాములును కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందా డు. రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహిత అదృశ్యంములకలపల్లి: వివాహిత అదృశ్యమైన ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సైమధుప్రసాద్ కథనంప్రకారం.. సీతారాంపురం గ్రామానికిచెందిన సున్నంమహాలక్ష్మి, భర్త చంటితో కలసి జీవనం సాగిస్తోంది. ఆదివారం రాత్రి బంధు వుల ఇంటికి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులను విచారించినా జాడ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. బాలిక అదృశ్యంపై.. భద్రాచలంఅర్బన్ : బాలిక అదృశ్యంపై స్థానిక టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆశ్వాపురం గ్రామానికి చెందిన బాలిక భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ట్రైనీ నర్సుగా పని చేస్తోంది. 1వ తేదీ రాత్రి డ్యూటీకి వచ్చిన బాలిక.. 2వ తేదీన ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను ఆరా తీశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి మంగళవారం భద్రాచలం టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందని ఎస్ఐ శ్యాంప్రసాద్ తెలిపారు. -
నాచారం రోడ్డుకు మహర్దశ
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాలను కలిపే నాచారం రోడ్డుకు మహర్దశ పడుతోంది. సుమారు 12 కి.మీ. దూరం సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.43 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రహదారిని విస్తరించడమే కాక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రహదారి మీదుగా రేపల్లెవాడ, మేడేపల్లి, గంగుల నాచా రం, కాలనీ నాచారం, భద్రుధ్రుతండా, మునియతండా, ఒంటిగుడిసె తదితర గ్రామాలకు ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారు. నాచారం – రేపల్లెవాడ మధ్య ఉన్న వాగు వర్షాకాలంలో పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం నాలుగు లేన్లుగా విస్తరణలో భాగంగా లోలెవల్ వంతెన స్థానాన హై లెవల్ వంతెన నిర్మిస్తే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అంతేకాక నాచారంలో ప్రసిద్ధి చెందిన శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. రహదారి అభివృద్ధితో భక్తుల రాకపోకలు సులువు కానున్నాయి. రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉండే ఈ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ నిధులు మంజూరు చేయించగా, త్వరలో పనులు మొదలుకానున్నాయి.రూ.43 కోట్లతో నాలుగు లేన్లుగా విస్తరణ -
కాసులకు కక్కుర్తి..
● రూ.కోట్ల కోసం కొత్త రూట్లు ● బతికుండగానే చంపేస్తున్న వైనం ● ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బీమా మోసాలు బూర్గంపాడు: ఈజీ మనీ కోసం అన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఓ వైపు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొందరు రూ.కోట్ల కోసం కొత్త రూట్లు వెదుకుతున్నారు. బీమాను అడ్డుపెట్టుకుని మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. బతికున్న వారి కీ డెత్ సర్టిఫికెట్లు ఇప్పించి సొమ్ము కాజేస్తున్నారు. మరికొందరు బీమా డబ్బు కోసమే తోటివారిని చంపేస్తున్నారు. హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారు. బీమా మోసాలలో ఏజెంట్లు, కొందరు అధికారులే కీలకంగా వ్యవహరించడం ‘కంచే చేను మేసిన చందంగా’ మారింది. ఇటీవల బీమా మోసాలు, నేరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండగా బయటకు రాని ఘటనలు మరెన్నో ఉన్నాయి. పెరుగుతున్న మోసాలు.. జిల్లాలో బీమా మోసాలు, నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పదినెలల క్రితం సారపాకలోని భాస్కర్నగర్కు చెందిన ఓ వ్యక్తికి ఒక ఎల్ఐసీ ఏజెంట్ పాలసీ చేయించాడు. బీమా పొందిన వ్యక్తి భార్యనే నామినీగా నమోదు చేయించాడు. మూడేళ్ల పాటు పాలసీ నగదు కూడా ఏజెంటే చెల్లించాడు. ఆ తర్వాత పాలసీదారుడు చనిపోయినట్లుగా ఏపీలోని కుక్కునూరులో డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. దాన్ని ఎల్ఐసీ కార్యాలయంలో అందించి నామినీ గా ఉన్న పాలసీదారుడి భార్యకు రూ.10లక్షల చెక్కు ఇప్పించాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం బీమా సొమ్ము పంచుకునే విషయంలో విభేదాలు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సదరు ఏజెంట్ నుంచి బీమా సొమ్మును రికవరీ చేసిన ఎల్ఐసీ.. ఆ తర్వాత ఏజెంట్తో పాటు పాలసీదారుడు, నామినీ, మధ్యవర్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. హత్య చేసి.. సొమ్ము కాజేసేలా.. బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడిని హతమార్చి, అతడి పేరున రూ. 2 కోట్ల బీమా కాజేసేందుకు ఇద్దరు పథక రచన చేశారు. 23 ఏళ్ల ఆ యువకుడి పేరున రూ.2 కోట్లకు ఓ బ్యాంకులో బీమా చేయించి ప్రీమియం కూడా వారే చెల్లించారు. సదరు బ్యాంకులో ఇన్సూరెన్స్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ యువకుడి ఇంటి పేరు కలిగిన మరో వ్యక్తిని నామినీగా నమోదు చేయించి బీమా సొమ్ము కాజేసేందుకు పథకం రూపొందించారు. ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి ఆ ఇద్దరూ కలిసి యువకుడిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగాా కొట్టి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఈ వ్యవహారం బెడిసికొట్టడంతో కటకటాల పాలయ్యారు. హత్యయత్నానికి గురైన యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బూర్గంపాడు/అశ్వాపురం: మండలంలోని సీతా రాంపురం గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్లయిన వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులు తమ బంధువులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫి కెట్లు సృష్టించి వారి పేరున పెద్దమొత్తంలో బీమా సొమ్ము కాజేశారు. బంధువులతో పాటు మారుమూల గ్రామాల్లోని అమాయకులను నమ్మించి మొత్తం 39 మంది పేరున బీమా చేయించారు. కొంతకాలం ప్రీమియం కూడా వారే చెల్లించారు. ఆ తర్వాత పాలసీదారులు మరణించినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఎల్ఐసీ సంస్థకు సమర్పించారు. ఈ క్రమంలో వారికి రూ.1.52 కోట్ల బీమా సొమ్ము అందింది. ఈ సొమ్ములో ఏజెంట్లయిన భార్యాభర్తలు అగ్రభాగం తీసుకుని, కొందరు పాలసీదారులకు కొద్ది మొత్తం అందించినట్లు సమాచారం. అయితే దంపతులైన ఈ ఇద్దరు ఏజెంట్ల నుంచే ఎక్కువగా డెత్ కేసులు వస్తుండగా అనుమానం వచ్చిన ఎల్ఐసీ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలు తెలుసుకున్నారు. సంస్థను మోసగించిన వారిపై పోలీసులకు ఫిర్యా దుచేశారు. ఇలాంటి ఘటనలు కొన్ని మాత్రమే వెలుగు చూస్తుండగా, చాలా ఘటనలు బయటకు రాకుండానే కొందరు కోట్లు కొల్ల గొడుతున్నారనే చర్చ సాగుతోంది. -
ఇఫ్టూ రాష్ట అధ్యక్షుడిగా రాంసింగ్
ఇల్లెందు: భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్టూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఇల్లెందుకు చెందిన బి.రాంసింగ్ నియమితులయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మధార్, ఉపాధ్యక్షుడిగా కె.భాస్కర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా జి.నరసింహ, కోశాధికారిగా ఎన్.సురేష్తో పాటు కార్యవర్గ సభ్యులుగా దుర్గా ప్రసాద్, మూతి రాంబాబు, లింగ్యా, సనప రాంబాబు, కె కృష్ణ, కాంతారావు ఎన్నికయ్యారు. ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైరు చోరీపాల్వంచరూరల్: ఒకేరోజు రాత్రి నాలుగు గ్రామాల్లోని నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పునుకుల, నాగారం, తోగ్గూడెం, జగన్నాధపురం గ్రామాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గతనెల 27న దుండగులు ధ్వంసం చేసి సుమారు 40 కిలోల కాపర్వైర్లను ఎత్తుకెళ్లారు. దాని విలువ రూ.20వేలకు పైగానే ఉంటుందని విద్యుత్శాఖ రూరల్ ఏఈ రవీందర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ వెల్లడించారు. చిన్న బాబుకు పెద్ద కష్టం..వైద్యం చేయించలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు అశ్వాపురం: మండల పరిధిలోని అమ్మగారిపల్లి పంచాయతీ కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన పాయం నరసింహారావు, రాధ దంపతుల కుమారుడు తేజరిత్విక్ చిన్న వయస్సులోనే పెద్ద జబ్బుతో బాధపడుతున్నాడు. రెండేళ్ల చిన్నారికి ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకగా 10 రోజుల క్రితం మణుగూరులో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్యం విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కూలీ నాలి చేసి పొట్టగడుపుకునే నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు డబ్బులు లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థల వారు స్పందించి తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని ఆ దంపతులు కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు 8897728091 (పాయం నరసింహారావు) నంబర్కు ఫోన్ పే చేయాలని వేడుకుంటున్నారు. చిన్నారిపై అత్యాచార యత్నం : పోక్సో కేసు ఏన్కూరు: చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిపై పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఏన్కూరులోని ఓ కాలనీకి చెందిన ఆరున్నర సంవత్సరాల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన వీరభద్రం ఇంట్లో ఎవరూ లేని సమయాన అత్యాచార యత్నం చేయబోయాడు. దీంతో చిన్నారి గట్టిగా రోదిస్తూ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఘటనపై పాప కుటుంబీకుల ఫిర్యాదుతో వీరభద్రంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.సంధ్య తెలిపారు. తప్పుడు పత్రాలతో ప్లాట్ల అమ్మకం ఖమ్మంఅర్బన్: నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్లు అమ్మి తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం బల్లేపల్లి ప్రాంతంలో 200 గజాల చొప్పున రెండు ప్లాట్లను వి.వెంకట్రెడ్డి, టి.వెంకటేశ్వర్లు తప్పుడు డాక్యుమెంట్లతో తనకు అమ్మారని రావుల అనిల్కుమార్రెడ్డి పేర్కొన్నాడు. ప్లాట్లో ఇంటి నిర్మాణ అనుమతి కోసం మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకోగా తప్పుడు డాక్యుమెంట్లుగా తేలిందని తెలిపారు. ఈమేరకు అనిల్కుమార్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ‘నవ’ ఉద్యోగి దుర్మరణం
పాల్వంచ: పాల్వంచ నవభారత్ సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ లిమిటెడ్ ఉద్యోగి దుర్మరణం చెందగా.. హోలీ పండుగ రోజున కుటుంబంలో విషాదం అలముకుంది. స్థానిక శ్రీనగర్ కాలనీకి చెందిన మాచర్ల ఉమా మహేశ్వరరావు(40) నవ లిమిటెడ్ కర్మాగారంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తు అక్కడే క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం తోటి ఉద్యోగితో కలిసి ఉమా మహేశ్వరరావు కూరగాయలు కొనేందుకు నవభారత్ సెంటర్కు బయలుదేరాడు. సెంటర్లో యూటర్న్ తీసుకుంటుండగా ఇల్లెందు మండలం ధనియాలపాడుకు చెందిన జబ్బా ప్రశాంత్ పల్సర్ బైక్పై అతివేగంగా వచ్చి వీరి మోటర్ సైకిల్ను ఢీ కొట్టాడు. దీంతో వెనుక కూర్చున్న ఉమా మహేశ్వరరావు ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తోటి ఉద్యోగి దుర్గాప్రసాద్, ప్రశాంత్తో పాటు అతడి బైక్పై కూర్చున్న మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ప్రమాద జోన్గా నవభారత్ సెంటర్ ఇటీవల పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా నవభారత్ సెంటర్ ప్రమాదభరితంగా మారింది. ఈ సెంటర్లోనే యూటర్న్ పాయింట్ ఉండడం, రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రద్దీగా మారింది. ఈ రహదారిపై వాహనాల రాకపోకలు కూడా అధికంగా ఉంటాయి. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఇక్కడ ప్రమా ద సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పండుగపూట విషాదంమణుగూరు టౌన్: మణుగూరు ము న్సిపాలిటీ పరిధిలోని మల్లెపల్లి సమీపంలో హోలీని పురస్కరించుకుని గోదావరి వద్ద స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకు న్న సీఐ నాగబాబు, ఎస్ఐ శ్రావణ్ ఘట నా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించగా.. గుండి నాగేశ్వరరావు, పద్దం ప్రసాద్ గల్లంతయినట్లు తెలిసింది. వారి ఆచూకీ కోసం పడవలో తిరుగుతూ గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుఇల్లెందురూరల్: భూ ఆక్రమణపై ప్రశ్నించినందుకు దాడిచేసి కులం పేరుతో దూషించినట్లు వచ్చిన ఫిర్యాదుతో ముద్దుంగుల సాందయ్య, లక్ష్మి, సతీష్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ మంగవారం తెలిపారు. తిలక్నగర్కు చెందిన చింతల సరోజకు చెందిన భూమిని కొంత ఆక్రమించుకొని భూపేష్నగర్కు చెందిన పై ముగ్గురు సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమ నెలకొల్పారు. సదరు భూమి ఆక్రమణపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధితురాలు సరోజ ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. -
వేసవి ముంగిట్లోకి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతను ఎదుర్కొనేందుకు ఫ్యాన్లకు బదులుగా కూలర్లు, ఏసీలు ఆన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. అయితే, బొగ్గు నిల్వ
కేటీపీఎస్లో నిల్వ ఉన్న బొగ్గుడేంజర్ బెల్స్!2,880 మెగావాట్ల సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తిలో జిల్లాకు ఆది నుంచీ తెలంగాణలోనే ప్రత్యేక స్థానం ఉంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (పాల్వంచ)లోని వివిధ యూనిట్ల నుంచి 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(మణుగూరు)లో 1,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా జిల్లా నుంచి 2,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదవుతుండగా.. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలను వినియోగిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో గృహావసర విభాగంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. మరోవైపు రబీ సీజన్లో సాగువుతున్న వరి పొట్ట దశకు చేరుకుంది. దీంతో రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలోనూ మోటార్ల వినియోగం పెరగనుంది. వేధిస్తున్న బొగ్గు కొరత విద్యుత్ ఉత్పత్తి నిరంతరం కొనసాగేందుకు ప్రతీ కేంద్రంలో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా 15 రోజులకు తగ్గకుండా నిల్వలు ఉంచుతారు. కానీ ప్రస్తుతం కేటీపీఎస్, బీటీపీఎస్ల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. నాలుగైదు రోజులకు మించి ఇక్కడ నిల్వలు లేవని సమాచారం. కేటీపీఎస్లో వివిధ దశల్లో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లకు ప్రతీరోజు 22,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 21 రోజులకు అవసరమైన 4,72,500 మెగావాట్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉండాలి. కనీస స్థాయిలో 15 రోజులను పరిగణనలోకి తీసుకున్నా.. 3,37,500 టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ 80 వేల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే నాలుగు రోజుల బఫర్ స్టాక్ ఉంది. బీటీపీఎస్లో కొంచెం మెరుగ్గా పదిరోజులకు అటుఇటుగా సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. సింగరేణి నుంచి తగ్గిన సరఫరా కేటీపీఎస్, బీటీపీఎస్లకు ప్రధానంగా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా జరుగుతోంది. ఒప్పందం ప్రకారం బీటీపీఎస్కు ప్రతీ రోజు 18వేల టన్నులు, కేటీపీఎస్కు 22,500 టన్నుల బొగ్గు సింగరేణి నుంచి రావాల్సి ఉంది. కానీ కేటీపీఎస్కు సగటున 19 వేల టన్నుల బొగ్గే వస్తోంది. జనవరి మధ్య నుంచి ఇలా ప్రతీరోజు బొగ్గు సరఫరాలో కోత పడుతోంది. ఫలితంగా ఈ రెండు ప్లాంట్లలోనూ 21 రోజులకు సరిపడా ఉన్న బఫర్ స్టాక్ తగ్గుతూ వస్తోంది. దీంతో వేసవి మొదలై విద్యుత్ డిమాండ్ తీవ్ర దశకు చేరుకునే సమయంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది.జిల్లాలోని పవర్ ప్లాంట్లకు ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల నుంచి ఎక్కువగా బొగ్గు సరఫరా అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క సత్తుపల్లి ఏరియానే నిర్దేశిత లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేసింది. ఎప్పుడూ లక్ష్యాన్ని సాధించే మణుగూరు ఏరియా ఈసారి విఫలమైంది. ఇల్లెందు, కొత్తగూడెంతో పాటు భూపాలపల్లి ఏరియా కూడా లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయాయి. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు సింగరేణి సంస్థ బొగ్గు సరఫరా చేయలేకపోతోంది. దీనికి తోడు ఈ బొగ్గు నాణ్యతలోనూ జెన్కో నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదేమైనా.. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది.విద్యుత్ కేంద్రాల్లో తగ్గిన బొగ్గు నిల్వలు కర్మాగారానికి అవసరమైన బొగ్గు నిల్వలు పెంచాలని ఇప్పటికే సింగరేణి అధికారులను కోరాం. ప్రస్తుతం వస్తున్న బొగ్గు కంటే వినియోగం అధికంగా ఉండడంతో నిల్వలు తగ్గుతున్నాయి. 15 రోజుల కంటే ఎక్కువగా ఉపయోగపడేలా నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం వారం రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంటోంది. మార్చిలో దాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – ఎం.ప్రభాకర్ రావు, కేటీపీఎస్ 5,6 దశల సీఈ -
మత సామరస్యానికి ప్రతీక.. రంజాన్
పాల్వంచ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని నటరాజ్ సెంటర్ జమ మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంచుతాయన్నారు. ఉపవాస దీక్షలు కుటుంబంతో పాటు సమాజంలో శాంతి, ప్రేమ, సోదరభావం, దాతృత్వం పెంపునకు దోహాదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాథం, మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, ఫయాజ్, అభీద్, అక్బర్, మస్తాన్, గౌస్, కుర్షీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–నామ్.. 2.0
● ఖమ్మం మార్కెట్లో కొత్త వెర్షన్ అమలు ● తద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు ● సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో పూర్తి వివరాలుఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ 2.0 వెర్షన్ను ప్రవేశపెట్టింది. రైతులకు డిజిటల్ మార్కెటింగ్ను మెరుగుపర్చడం, పంట వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాన్ని సులభం చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ–నామ్ విధానం అమల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లలో 2.0 వెర్షన్ను ప్రవేశపెడుతుండగా జాబితాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కూడా చోటు దక్కింది. 2011–12లో ప్రారంభం రైతులు పండించిన పంటలకు డిమాండ్ మేర ధర దక్కేలా చూడడం, మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం 2011–12లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆనాడే ఖమ్మం మార్కెట్లోనూ మొదలైంది. ఆపై 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చ ర్ మార్కెట్) విధానాన్ని ప్రవేశపెట్టగా ఖమ్మం సహా రాష్ట్రంలోని 57 మార్కెట్లలో అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ వ్యవస్థను మరింతగా ఆధునికీకరిస్తూ 2.0 వెర్షన్ను అమల్లోకి తీసుకొచ్చింది. పాత వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం ద్వారా మరింత వేగవంతమైన, పారదర్శకమైన ఆన్లైన్ సేవలు అందనున్నాయి. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం లభిస్తుందని, అంతర్ రాష్ట్ర వాణిజ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే, పంట నాణ్యత తనిఖీకి ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత అందుబాటులో వచ్చి రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ.. వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్ సేవలను అప్గ్రేడ్ చేసే బాధ్యతను డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఇంటిలిజెన్స్(డీఎంఐ) పర్యవేక్షణలో ఎస్ఎఫ్ఏసీ(స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం)కు అప్పగించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఖమ్మం మార్కెట్లో 2.0 వెర్షన్ అమలవుతుండగా.. ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతులకు సమగ్ర సమాచారం ఈ–నామ్ 2.0 ద్వారా రైతు పంట విక్రయాలకు సంబంధించి పూర్తి సమాచారం వారికిఅందుతుంది. గత వెర్షన్లో పంటకు లాట్ ఐడీ ఇవ్వటం, ఆ లాట్ ఆధారంగా బిడ్డింగ్, ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వంటి ప్రక్రియలు ఉండేవి. ప్రస్తుత వెర్షన్లో లాట్ ఐడీ ఇవ్వడమే కాక రైతుల ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లు కూడా అనుసంధానిస్తున్నారు. తద్వారా పంట బిడ్డింగ్లో నిర్ణయించిన ధర రైతు ఫోన్కు మెసేజ్ రూపంలో చేరుతుంది. అలాగే, విక్రయం తర్వాత తూకం, నిర్ణయించిన ధర, రైతులకు అందే పైకం వివరాలతో పాటు కమీషన్ కూడా ఆ మెసేజ్లో ఉంటాయి. ఇక తక్పట్టీ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. పత్తి, అపరాల విక్రయాల్లో అమలు ఖమ్మం మార్కెట్లో ప్రధానంగా పత్తి, మిర్చి పంటలతో పాటు పెసలు, కందులు, మినుములే కాక మొక్కజొన్న పంట క్రయవిక్రయాలు కూడా జరుగుతాయి. ఇందులో పత్తి, అపరాల పంటలకు ఇప్పటికే ఈ–నామ్ అమలు చేస్తున్నారు. ఇవే పంటలకు ప్రస్తుతం 2.0 వెర్షన్ అమలు చేయడం మొదలుపెట్టారు.కేంద్రప్రభుత్వం రూపొందించిన ఈ–నామ్ 2.0 వెర్షన్ రైతులకు ఎంతో ప్రయోజనకరం. పంట విక్రయాల్లో పారదర్శకత మరింతగా పెరుగుతుంది. మద్దతు ధర లభించడమే కాక మోసాలకు తావుండదు. ఖమ్మం మార్కెట్లో సమర్థంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాం. – పి.ప్రవీణ్కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ -
తిరుకల్యాణ తేదీ తెలియక తికమక
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): సుప్రసిద్ధ బాలాజీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకల్యాణ వేడుక తేదీలో నెలకొన్న మీమాంస జాతరపై తీవ్ర ప్రభావం చూపింది. సహజంగా ప్రతీ సంవత్సరం హోలీ రోజున స్వామివారి కల్యాణ క్రతవు నిర్వహిస్తారు. ఈ క్రమంలో రంగుల పండుగ రోజునే తిరుకల్యాణం, మహాజాతర అంటూ అన్నివర్గాల్లోనూ నాటుకుపోయింది. అయితే ఈ ఏడాది చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే కల్యాణం జరిపించడం, ఈ విషయమై తగిన ప్రచారం కల్పించకపోవడంతో భక్తుల రాకపై ప్రభావం చూపింది. ఎప్పుడూ వచ్చే సంఖ్యలో కనీసం సగం మంది కూడా హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఇక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమైన ఫిబ్రవరి 28వ తేదీనే ఆలయ మేనేజర్ పాకాల వెంకటరమణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. గతంలో కనీసం రెండు వారాల ముందు నుంచే కరపత్రాల పంపిణీ, గ్రామాల్లో ఆటోల్లో మైక్ ప్రచారం చేసేవారు. ఈ దఫా ఇంటింటి ప్రచారం నామమాత్రంగా సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో చారిత్రక ప్రాథాన్యత కలిగిన ఎదుర్కోలు వేడుక సమమంలో మైక్లు సరిగా పనిచేయకపోవడంతో భక్తులు అమోయమానికి గురయ్యారు. ఈ విషయమై ఆలయ మేనేజర్ వెంకటరమణను వివరణ కోరగా.. స్వామివారి తిరుకల్యాణానికి భక్తులు తగ్గిన మాట వాస్తవమేనని, హోలీ రోజునే కల్యాణం నిర్వహిస్తారని ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని చెప్పారు. అయితే గ్రహణం ఉండడంతో ముందే నిర్వహించాల్సి వచ్చిందన్నారు. శక్తి మేరకు విసృతంగా ప్రచారం చేపట్టామని, ఆరువేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయగా,నాలుగు వేల మంది వరకు వచ్చారని తెలిపారు. ప్రచార లోపమే కారణమా ? -
పెద్దమ్మతల్లి ఆలయం మూసివేత
పాల్వంచరూరల్ : చంద్రగ్రహణం సందర్భంగా పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంతోపాటు, శివాలయాన్ని అర్చకులు మంగళవారం మూసివేశారు. ఉదయం 7.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు మహానివేదన సమర్పించాక ద్వార బంధనం చేశారు. తిరిగి బుధవారం తెల్లవారుజామున అలయ సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడితే చర్యలుగుండాల: అటవీ జంతువులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ కృష్ణాగౌడ్ హెచ్చరించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన ఆళ్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అడవులతో పాటు వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టొద్దని కోరారు. అడవులను, ప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలకూ ఉందన్నారు. పోడు భూముల పేరుతో అడవులను నరకడం, వేసవికాలంలో అడవులకు నిప్పు పెట్టడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆళ్లపల్లి, రేగళ్ల ఎఫ్ఆర్వోలు కిరణ్ కుమార్, జశ్వంత్ కుమార్ పాల్గొన్నారు. ఇరాన్పై అమెరికాది నేర పూరిత దాడిఇల్లెందు: అమెరికా, జియోనిస్టు ప్రభుత్వమైన ఇజ్రాయిల్ కలిసి నేరపూరితంగా ఇరాన్పై సైనిక దాడులు నిర్వహిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ నాయకుడు ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు. ఇల్లెందులో మంగళవారం జరిగిన సంఘం ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సైనిక దాడుల విషయంలో శాంతి స్వావలంబనకు మద్దతుగా నిలవకుండా మౌనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే, భారత వ్యవసాయం, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఇండో – యూఎస్ వాణిజ్య ఒప్పందంపై చర్చించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ రాష్ట్రాల నాయకులు పరితోష్ దాస్, సిబిగిరి, నిరంజన్ బేరా, దేవరావు, ఎస్కే.గౌస్, బి.రాము, గుమ్మడి నర్సయ్య, ముద్ధా భిక్షం, నాగేశ్వరరావు, రాము, వెంకన్న పాల్గొన్నారు. రీజియన్లో అదనంగా 86 బస్సులు సత్తుపల్లిటౌన్: BÈtïÜ QÐ]l$Ã… ÈhĶæ$¯ŒS-ÌZ VýS™ól-yé-¨™ø ´ùÍõÜ¢ D çÜ…Ð]l-™èlÞÆý‡… 86 Mö™èl¢ ºçÜ$Þ-Ë$ ¯]lyìl-í³-çÜ$¢-¯é²-Ð]l$° BÆŠḥG.çÜ-ÇÆ>… ™ðlÍ´ëÆý‡$. çÜ™èl$¢-ç³-ÍÏ yìl´ù¯]l$ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ™èl°T ^ólíܯ]l BĶæ$¯]l ºçÜ$ÞÌS íœsŒæ-¯ðl-‹Ü¯]l$ ç³ÇÖÍ…-^èl-yýlÐól$ M>MýS ºÝët…yŠæ-ÌZ ÝûMýS-Æ>Å-ÌSOò³ BÆ> ¡Ô>Æý‡$. A¯]l…-™èlÆý‡… BÆŠ‡-G… Ð]l*sêÏ-yýl$™èl* Ððl$Æý‡$-OVðS¯]l Æý‡Ðé×ê MýS͵…^èl-yýlÐól$ ÌS„ýSÅ…V> A§ýl-¯]lç³# ºçÜ$Þ-Ë$ HÆ>µ-r$-^ól-Ô>-Ð]l$° ™ðlÍ ´ëÆý‡$. D ¯ólç³-£éů]l B§éĶæ$… ò³…^ól-Ìê E§øÅ-VýS$-Ë$ MýS–íÙ ^ólĶæ*-ÌS° çÜ*_…^éÆý‡$. B™èl-Æ>Ó™èl ¿ýæ{§ýl-™é Ð鯸™èlÞ-ÐéÌS çÜ…§ýl-Æý‡Â…V> V>ÅÆó‡-iÌZ Æý‡„ýS-׿ {糆fq ^ólƇ$$…^éÆý‡$. -
గ్రామాభివృద్ధి కోసం ఎన్ఆర్ఐ రూ.లక్ష విరాళం
ముదిగొండ: స్వగ్రామం అభివృద్ధికి తన వంతు సాయంగా ఓ ఎన్ఆర్ఐ(ప్రవాస భారతీయుడు) ముందుకొచ్చాడు. ఈమేరకు ముదిగొండ వాసి వేగినాటి నాగభూషణం సోమవారం సర్పంచ్ కట్టకూరి ఉపేందర్కు రూ.లక్ష విరాళం చెక్కు అందజేశారు. ఆయన ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఏర్పడగా, గ్రామాభివృద్ధికి అండగా నిలుస్తానన్న హామీతో రూ.లక్ష చెక్కు అందజేశారు. నూతన సర్పంచ్తో పాటు పాలకమండలి, యువకులు ఇటీవల కోతుల బెడదను నివారించేందుకు కృషి చేయడంతో పాటు గ్రామంలో అంతర్గత రహదారుల వెంట ముళ్ల పొదలను తొలగించారు. ఈనేపథ్యాన విరాళం అందజేసిన నాగభూషణంను స్థానికులు అభినందించారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
● నేడు స్వల్పకాలమే స్వామివారి దర్శనం ● చంద్ర గ్రహణంతో ప్రధానాలయం మూసివేతభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దర్శనానికి నేడు బ్రేక్.. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దర్శనానికి బ్రేక్ పడింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదిన జరిపి ఉద యం 6.30 నుంచి 7.30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అనంతరం మధ్యాహ్నిక ఆరాధన చేసి 8.30 గంటలకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు తెరిచి ఆలయ శుద్ధి, శాంతి హోమం చేశాక 8.30 గంటలకు దర్శన అవకాశం కల్పిస్తారు. కాగా, నేడు నిత్యకల్యాణాన్ని రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. వెండి లక్ష్మీరూపుల వితరణ హైదరాబాద్కు చెందిన పుచ్చ రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్ దంపతులు లక్ష్మీ రూపం గల 333 వెండి బిళ్లలను సోమవారం ఆలయ అధికారులకు వితరణగా అందజేశారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో ఫాల్గుణ ఉత్తర పూర్ణిమ రోజున వెండి లక్ష్మీ పూజలు జరగనుండగా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఒక్కొక్కరికి ఒక గ్రాము వెండి బిల్లలు అందించనున్నారు. ఈ మేరకు చంద్రశేఖర్ దంపతులు వెండి బిళ్లలు అందించారని, వీటి విలువ రూ.లక్ష ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్కుమార్, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్, స్వర్ణ కుమారి పాల్గొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకో..
సూపర్బజార్(కొత్తగూడెం): సుమారు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహించగా, జిల్లా నలు మూలల నుంచి ఫిర్యాదుదారులు పోటెత్తారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంద్రనాఽథ్, డీపీఓ సుధీర్తో కలిసి కలెక్టర్ అంకిత్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి, తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల్లో కొన్ని.. ● కొత్తగూడెంకార్పొరేషన్ 3వడివిజన్ వెంగళరావు కా లనీ బస్తీదవాఖాన అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారని, గత కలెక్టర్ చొరవతో రూ.20లక్షలు వెచ్చించి నూ తన భవనం నిర్మించినా రోడ్డు సౌకర్యం లేక ప్రా రంభించలేదని తాళ్లూరి సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుచేయగాడీఎంహెచ్ఓకు ఎండార్స్ చేశారు. ● భద్రాచలానికి చెందిన శేషగిరిరావు.. తనకు గతంలో జారీ చేసిన సదరమ్ సర్టిఫికెట్లో 57 శాతం వైకల్యం ఉండగా ఇటీవల 2శాతం తగ్గించారని, మళ్లీ 57 శాతంతో సర్టిఫికెట్ మంజూరు చేయాలని వినతిపత్రం అందించగా డీఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ● చుంచుపల్లి మండలం పెనగడపలో రెండు వాటర్ ప్లాంట్లు ఉన్నా తాగునీరు అందడం లేదని, మూడు కిలోమీటర్ల దూరంలోని రాంపురానికి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని, వేసవికాలం అయినందున ఒక్క ప్లాంట్ అయినా తెరిపించాలని స్థానికులు వినతిపత్రం అందించారు ● సింగరేణి సీఎస్సార్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని మాయాబజార్, 5 ఇంక్లైన్్, ఎస్ఆర్టీ నగర్ వాసులు వినతిపత్రం అందజేశారు. అలాగే, నిరుద్యోగులకు డీఎల్ఆర్ ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ● చర్ల మండలానికి చెందిన తడికల నాగరాజు తన కుమార్తె వివాహానికి కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోగా తిరస్కరించారని, పునర్ పరిశీలించి మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వగా భద్రాచలం సబ్ కలెక్టర్కు ఎండార్స్ చేశారు. -
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ
పాల్వంచరూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, కస్తూర్బా గాంధీ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అంకిత్ సోమవారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థిని ఆలస్యంగా రావడంతో.. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థినిని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. పాల్వంచ పట్టణంలోని కస్తూర్బా గాంధీ స్కూల్ కేంద్రంలో మృతశిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని సోమవారం పరీక్ష రాసేందుకు తండ్రితో కలిసి పరీక్షా కేంద్రానికి వచ్చింది. అప్పటికే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేశారు. పరీక్షకు ఉదయం 9.15 గంటల వరకు అనుమతి ఉందని, విద్యార్థిని 10.15 గంటలకు రావడంతో అనుమతించలేదని చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు. దుబాయ్లో మంత్రి తుమ్మల.. అక్కడి పరిస్థితులతో తిరుగు ప్రయాణం ఒకరోజు వాయిదా ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. గతనెల 22న ఆయన అల్లుడు డాక్టర్ కల్యాణ్శేఖర్ వైద్యుల సదస్సు నిమిత్తం దుబాయ్ వెళ్లారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో మంత్రి తుమ్మల తన కుమార్తె మోహిని, ఇతర కుటుంబీకులతో కలిసి 23వ తేదీన దుబాయ్ వెళ్లారు. అయితే, కళ్యాణ్శేఖర్ మరికొద్ది రోజులు అక్కడే చికిత్స పొందాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఇంతలోనే మంత్రి తుమ్మల ఈనెల 4న భారత్కు తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నా, అక్కడి పరిస్థితుల కారణంగా విమానం రద్దవడంతో టికెట్ను ఈనెల 5వ తేదీకి మార్పు చేసినట్టు క్యాంప్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మంత్రి దుబాయ్లో చిక్కుకున్నారనే వార్తల్లో వాస్తవం లేదని, పరిస్థితుల దృష్ట్యా ప్రయాణం వాయిదా పడిందే తప్ప ఇబ్బందులు లేవని తెలిపారు. రైలులో జార్ఖండ్ వాసి మృతిఖమ్మంక్రైం: బెంగళూరు నుంచి జార్ఖండ్ వెళ్తున్న వ్యక్తి రైలులో మృతి చెందాడు. జార్ఖండ్లోని పాలము జిల్లా సరాహువాకు చెందిన మహేష్ దేవర్(40) పొట్టకూటి కోసం కొన్నాళ్ల క్రితం బెంగళూరు వెళ్లాడు. అక్కడి కూలీ పనులతో జీవనం సాగిస్తుండగా అనారోగ్యం బారిన పడడంతో సహచరులు జార్ఖండ్ వెళ్లేందుకు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కించారు. మార్గమధ్యలోనే మహేష్ తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆయన సహచరులు ఇచ్చిన సమాచారంతో రైలు ఖమ్మం స్టేషన్కు అర్థరాత్రి చేరుకునే సరికి జీఆర్పీ, ఆర్పీఎఫ్, 108 సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే, మహేష్ను పరీక్షించిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్నేహితులు సోమవారం స్వస్థలానికి తీసుకెళ్లారు. విద్యుత్ వ్యవస్థ రక్షణకు లైట్నింగ్ అరెస్టర్లు ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చినప్పడు విద్యుత్ వ్యవస్థను రక్షించేలాచర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్ లైన్లు, పంపిణీ వ్య వస్థ, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, ఇతర పరికరా లు నష్టపోకుండా లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 109 లైట్నింగ్ అరెస్టర్లను అమర్చగా, ఇవి మెరుపు, పిడుగు సమయాన కలిగే అధిక వోల్టోజీని భూమిలోకి పంపిస్తాయని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు పదోన్నతులు సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ ఉద్యోగులు పలువురికి పదోన్నతులు కల్పించారు. హెడ్ ఓవర్మెన్ గ్రేడ్–ఏ నుంచి గ్రేడ్–ఏ1గా ఐదుగురికి, గ్రేడ్–బీ నుంచి గ్రేడ్–ఏలోకి ఏడుగురికే కాక టైం రెటెడ్ వేకెన్సీలను ద్వారా ఐదుగురికి పదోన్నతి దక్కింది. అలాగే, కెరీర్ గ్రోత్ స్కీం ద్వారా కిష్టారం ఓసీలో ఒకరికి, జేవీఆర్ ఆర్సీహెచ్పీలో మెకానికల్ గ్రేడ్–బీ నుంచి గ్రేడ్–ఏ ఇంకొకరికి పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఉద్యోగులకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పదోన్నతి పత్రాలు అందజేశారు. పీఓ ప్రహ్లాద్, ప్రాజెక్టు అధికారులు డి.శ్రీనివాసరావు, బి.రాజేశ్వరరావు, జి.కళ్యాణ్రామ్, నాయకులు సుధాకర్, బి.కోటేశ్వరరావు, నర్సింహారావు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వన్యప్రాణికి హాని!
పాల్వంచరూరల్: ఎన్ని చట్టాలు చేసినా వేటగాళ్ల వేటుకు వన్యప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. ఏటా అటవీ శాఖ, వైల్డ్లైఫ్ శాఖల అధికారులు జంతు సంరక్షణ చైతన్య దినోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నా అటవీ జంతువులకు హాని కలుగుతూనే ఉంది. అటవీశాఖ రికార్డులో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చే. 2021–2022లో జిల్లాలో జంతువుల వధపై 25 కేసులు నమోదయ్యాయి. 2022లో 31 కేసులు, 2023లో 6, 2024లో 3, 2025లో 4 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది పాల్వంచ వైల్డ్లైఫ్ విభాగం అధికారులు 303 ఉచ్చులు, బాణాలు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం క్రమంగా ఆక్రమణకు గురి అవుతుండటంతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణు ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందినే ఆరోపణలు ఉన్నాయి. వేసవిలో జంతువులు నీళ్ల కోసం వచ్చే క్రమంలో వేటుగాళ్లు ఉచ్చులు పెట్టి వధిస్తున్నారు. కిన్నెరసానిలో విభిన్న జంతువులు.. జిల్లాలో అటవీ విస్తీర్ణం 10 లక్షల ఎకరాల్లో ఉండగా, కిన్నెరసాని అభయారణ్యం 634.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కిన్నెరసాని అభయారణ్యంలో విభిన్న రకాల జంతువులు ఉన్నాయి. ఇటీవల పులులు కూడా సంచరించిన విషయం విదితమే. అడవి గేదెలు, దున్నలు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుజులు కూడా ఉన్నాయి. కిన్నెరసాని రిజర్వాయర్లో వేల సంఖ్యలో మోరేజాతి మొసళ్ళు ఉన్నాయి. నెమళ్లు, కుందేళ్లు, కొండముచ్చులు, ఇలా అనేక రకాల జంతువులు అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై ప్రత్యేక నిఘా పెట్టాం. బీట్లవారీగా పర్యవేక్షణచేపట్టాం. రాత్రి పూట కూడా కన్పించే అధనాతన సాంకేతిక పరిజ్ఞానం కలి గిన రెండు థర్మల్ డ్రోన్లతో నిత్యం గమనిస్తున్నాం. పెట్రోలింగ్ చేస్తున్నాం. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అటవీ ప్రాంతంలో 30 బేస్క్యాంప్లను ఏర్పాటు చేసి 150 మంది సిబ్బందిని కూడా నియమించాం. –జి.కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారినేడు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంజంతువుల సంరక్షణ కోసం 1972 నుంచి వైల్డ్లైఫ్ చట్టాలు అమలు చేస్తున్నారు. అయినా వేట గాళ్లు వన్యప్రాణుల ఉసురుతీస్తూనే ఉన్నారు. గతేడాది జూన్ 15న ములకలపల్లి రేంజ్లో వేటగాళ్లు నాటు తుపాకులతో సంచరిస్తూ పట్టుబడ్డారు. మే 26న అశ్వారావుపేట రేంజ్లో కస్తూరి జింక అవశేషాల ను పట్టుకున్నారు. ఏప్రిల్ 17న దమ్మపేట రేంజ్లో వండిన దుప్పి మాంసాన్ని పట్టుకున్నారు. ఏప్రిల్ 9న నాటుతుపాకులు కలిగిన ముగ్గురు అరెస్ట్ అయ్యారు. దమ్మపేట రేంజ్లోని పెద్దగొల్లగూడెంలో మేకల గుంపులో వచ్చిన దుప్పి పిల్లలను వేటా డి మరి చంపారు. తాజాగా ఈ నెల1న ఖమ్మం జిల్లా కారేపల్లి రేంజ్లోని ముచ్చర్ల రామస్వామి గుట్ట సమీపంలో అడవి పంది మాంసాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని ఇద్దరిపై కేసు పెట్టారు. -
ఈసారీ ఇక్కట్లేనా ?
నవమి పండగ ముంగిట్లోకి వచ్చేసింది. భద్రాచలంలో ఇప్పటికే పనులు చకచకా సాగుతున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం వస్తారు. అయితే వారికి భద్రగిరిలో వసతి సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించే అవకాశం అందుబాటులో ఉన్నా.. ఒడిసి పట్టుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలం అవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅందుబాటులో 78 గదులు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో కాటేజీలు, హోటళ్ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆగుతూ సాగుతూ వచ్చాయి. గదుల నిర్మాణం నాలుగేళ్ల క్రితమే పూర్తయినా కిటీకీలు, తలుపుల బిగింపు వంటి పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే గతేడాది కాలంగా ఈ పనుల్లోనూ కదలిక వచ్చింది. 2024 డిసెంబర్ నాటికి అందుబాటులో తెస్తామని అధికారులు ప్రకటించినా.. చివరకు 2025 డిసెంబర్ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్రోడ్ వద్ద నిర్మిస్తున్న హరిత హోటల్లో 42 గదులు, కిన్నెరసాని డ్యాంసైట్ దగ్గర ఎకో టూరిజంలో భాగంగా నిర్మించిన హరితా హోటల్లో 36 గదుల నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఇక్కడ పర్యాటకులు విడిది చేసేందుకు 78 గదులతో పాటు డార్మిటరీలు, బార్, రెస్టారెంట్, మూడు చిన్న ఫంక్షన్ హాళ్లు, ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ ఉన్నాయి. ఆదరణ బాగుంటుంది.. శ్రీరామనవమి, ముక్కోటి, హనుమాన్ జయంతి పండుగలతో పాటు ఇతర పర్వదినాలు, వరుస సెలవులు వచ్చినప్పడు భద్రాచలానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా నవమి, ముక్కోటి సందర్భంగా భద్రాచలంలో వసతి దొరకడం కష్టంగా మారుతోంది. ఇతర జిల్లాల నుంచి డ్యూటీపై వచ్చే ప్రభుత్వ సిబ్బందికి కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో భద్రాచలానికి కేవలం గంట ప్రయాణ దూరంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచలోని ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటారు. శ్రీరామనవమికి కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు అన్ని హోటళ్లలో గదులు ముందుగానే బుక్ అయిపోతాయి. కనీసం ఈ నవమికై నా హరితా హోటళ్లను అందుబాటులోకి తీసుకొస్తే పర్యాటకులు/భక్తులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఆరంభంలోనే ఈ హోటళ్లకు మంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొత్తగూడెం, కిన్నెరసాని దగ్గర త్వరలో అందుబాటులోకి రాబోయే హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది నవంబర్లో ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్ణీత గడువు ముగిసినా, పర్యాటక శాఖ ఆశిస్తున్న అన్ని రకాల అర్హతలు ఉన్న కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో హోటల్, కాటేజీలు పర్యాటకులకు అందుబాటులోకి రాకుండా పోయాయి. మొదటి దఫాలో టెండర్లు ఎందుకు రాలేదు? ప్రైవేటు సంస్థలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయనే అంశంపై ఇంతవరకూ చర్చ జరగలేదు. మరోవైపు ఇంత భారీ స్థాయిలో హోటళ్లు నిర్మించినా, వీటి ప్రారంభోత్సవానికి ఉన్న అడ్డంకులు ఏంటీ? వాటిని ఎలా అధిగమించాలి అనే అంశంపై ప్రభుత్వం తరఫున మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల నుంచి చొరవ కరువైంది. వెరసి ఈ హోటల్ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడనేది అంతుచిక్కని అంశంగా మారింది. మరోవైపు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాకపోవడంతో హోటల్ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. హరిత హోటల్ నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించాం. ఈ మేరకు గత నవంబర్లో టెండర్లు పిలవగా, ఆశించిన ఫలితం రాలేదు. మరోసారి టెండర్లు పిలిచి, అర్హత సాధించిన సంస్థకు బాధ్యతలు అప్పగించి, హోటళ్లను ప్రారంభిస్తాం. – రామకృష్ణ (డీఈ, టూరిజం కార్పొరేషన్) -
పుంజుకుంటున్న మిర్చి ధర
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర మళ్లీ కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ‘తేజా’ రకం మిర్చి క్వింటాకు జెండాపాట ధర రూ.19వేలుగా పలికింది. వారం క్రితం రూ.18వేలు ఉన్న ధర క్రమంగా రూ.వేయి పెరిగింది. మిర్చి విక్రయాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాగా అప్పట్లో రూ.21,150గా ఉన్నా మళ్లీ తగ్గింది. ఫిబ్రవరి చివరి వారంలో రూ. 18వేలకు పడిపోగా, ఇప్పుడు రూ.వేయి మేర పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. విక్రయాలు పెరుగుతున్న వేళ సాధారణంగా పంట విక్రయాలు పెరిగితే డిమాండ్తో పాటు ధర తగ్గుతుంది. కానీ ఇప్పుడు పంట విక్రయాలు పెరుగుతున్న వేళ ధర కూడా పుంజుకుంటోంది. పంట సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడి కూడా అంతంతే ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కాగా, గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.13వేల నుంచి రూ.14వేల ధర పలికింది. అప్పుడు పంట సాగు ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తి అధికంగా రావడడంతో ఏప్రిల్లో రూ.12 వేల లోపునకు పడిపోయింది. దేశీయ మార్కెట్ డిమాండ్ ఆధారంగానే.. గత ఏడాది ఖమ్మం మార్కెట్కు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నిత్యం లక్ష బస్తాల మిర్చి విక్రయానికి వచ్చేది. కానీ ఇప్పుడు25 వేల నుంచి 30వేల బస్తాలు దాటడం లేదు. ఇక గతంలో మాదిరి విదేశీ ఆర్డర్లు లేకపోవడంతో దేశీయ మార్కెట్లో డిమాండ్ ఆధారంగానే ధరలు నమోదవుతున్నాయి. స్థానిక వ్యాపారులు పంట కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ఇంకొందరు నాగ్పూర్, కోల్కతా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తేదీ ధర ఫిబ్రవరి 24 18,000ఫిబ్రవరి 25 8,200ఫిబ్రవరి 26 18,375ఫిబ్రవరి 27 18,600మార్చి 02 19,000 -
గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు
డీఎస్పీ ఆదినారాయణ చండ్రుగొండ: గంజాయి విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. చండ్రుగొండ పోలీస్స్టేషన్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఎస్, స్థానిక పోలీసులు దామరచర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. వారిని ఆపి తనిఖీ చేయగా రూ.10.50 లక్షల విలువైన 21.150 కేజీల గంజాయి లభ్యమైంది. విచారించగా ఒడిశాకు చెందిన కారం లక్ష్మయ్య, మరో బాలుడు, విజయవాడకు చెందిన మేకల శ్రీనివాసరావు గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలింది. ఈ సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంకరకగూడెం: మండలంలోని వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపాడులో సీపీఎం నేత కొవ్వాసి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురైన ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సోమవారం ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సైలు సురేష్, పీవీఎన్ రావు సందర్శించారు. హత్య జరిగిన స్థలాన్ని మరోసారి పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించి గ్రామస్తులను విడివిడిగా విచారించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు గ్రామంలో సంచరించారా?, హత్యకు వ్యక్తిగత కక్షలేమైనా కారణమా?, ఇతర రాజకీయ, సామాజిక అంశాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. -
ఆయిల్పామ్ గెలల ధర పెంపు
టన్నుకు రూ.21,546గా నమోదు అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్ఫెడ్ ప్రకటించిన ఆయిల్పామ్ గెలల ధర మరో మారు రికార్డు స్థాయికి చేరింది. గతనెల ధర కంటే ప్రస్తుతం మరో రూ.1,090 పెరిగింది. 2023లో టన్ను గెలల ధర రూ.23 వేలకు చేరగా ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో నమోదైన రూ.20,456 ధరే అత్యధికంగా రికార్డు కెక్కింది. అయితే ఇప్పుడు టన్నుకు రూ.1,090 చొప్పున పెరిగి రూ.21,546కు చేరింది. కాగా గడిచిన మూడేళ్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గత నెల రూ.20 వేలు దాటడమే రికార్డు కాగా, ఫిబ్రవరిలో రైతులు ఫ్యాక్టరీకి తరలించిన గెలల ధర రూ.21,546గా నిర్ధారించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ఫాం క్రూడాయిల్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మంచి ధర లభింస్తుండగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్గాంధీని కలిసిన డీసీసీ అధ్యక్షురాలుకొత్తగూడెంఅర్బన్: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్లో తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాగా, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న ఆయనను కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని రాహుల్కు వివరించామని తెలిపారు. ఆయనను కలిసిన వారిలో నాయకులు ఆళ్ల మురళి, చీకటి కార్తీక్, జగన్ ఉన్నారు. గిరిజనుల సమస్యలకు పరిష్కారంభద్రాచలం: గిరిజనులు సమర్పించే సమస్యల దరఖాస్తులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఐటీడీఏ డీడీ అశోక్ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసి న గిరిజన దర్బార్లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు అఽధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కాగా తొలుత మాజీ లోక్సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు సున్నం రాంబాబు, మధుకర్, వేణు, అరుణకుమారి, లక్ష్మీనారాయణ, గన్యా, ఉదయ్, నారాయణ రావు, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కరాటే పోటీలో ప్రతిభదమ్మపేట : ఖమ్మం జిల్లా వి.ఎం.బంజరలోని నిర్వహించిన ఆలిండియా కరాటే చాంపియన్ షిప్ పోటీలో నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించారు. శ్రీవిద్య, తేజస్విని, కై రున్నీసా గోల్డ్ మెడల్ గెలుచుకోగా, అదే పాఠశాలకు చెందిన అనుశ్రీజ, సంజన రజత పతకాలు, నందిని, సాత్విక కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయా విద్యార్థులను హెచ్ఎం బజ్జూరి సరళ, కరాటే మాస్టర్ పవన్ కృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు. -
‘ఉడుములబండ’లో పోడు వివాదం
అశ్వారావుపేటరూరల్: పోడు భూముల విషయంలో సోమవారం అటవీశాఖ అధికారులు, పోడు సాగుదారులకు మధ్య వివాదం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు గిరిజనులకు తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు గిరిజనులు స్వల్పంగా గాయపడ్డారు. అశ్వారావుపేట మండలం, దమ్మపేట ఫారెస్టు రేంజ్లోని దురదపాడు బీట్ ఉడుములబండ గ్రామ శివారులో గడిచిన 30 ఏళ్లుగా 28 గిరిజన, వలస ఆదివాసీ కుటుంబాలు 300 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నాయి. వీరిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 30 ఎకరాలకు పోడు పట్టాలు అందించారు. మిగిలిన వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వే చేసినా పోడు పట్టాలు రాలేదు. ఈ క్రమంలోనే కొందరు గిరిజనేతరులు పోడు వ్యవసాయంపై అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోడు పట్టాలు లేని భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టేందుకు సోమవారం దమ్మపేట ఫారెస్టు రేంజ్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో జేసీబీలతో తరలివచ్చారు. పోడు భూముల్లో కందకాలు తీసేందుకు అటవీ అధికారులు యత్నించడంతో అక్కడికి చేరుకున్న పోడు సాగుదారులు అడ్డుకున్నారు. జేసీబీలను ముట్టడించడంతో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో గిరిజనులు కణితి కన్నయ్య, మల్లేష్, సుబ్బారావుకు తీవ్రగాయాలు కాగా, చంద్రమ్మ, నాగమణి, ఝాన్సీ, గంగరాజులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, పోడు సాగుదారులపై అటవీ అధికారులు దాడులకు పాల్పడటంతో తగదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి దాడులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు. -
నేత్రపర్వంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఎదుర్కోలు ఉత్సవానికి తోడ్కొని వెళ్లిన అర్చకులు.. ఆ కార్యక్రమ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ మండపంపై కొలువుదీర్చి.. వేద పండితులు ప్రతాపురం గిరిధరాచార్యులు, ఆలయ ప్రఽధానార్చకులు ప్రతాపురం ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వైభవోపేతంగా కల్యా ణం జరిపించారు. భక్తుల సౌకర్యార్థం పలుప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కల్యాణ వేడుకకు భారీగా భక్తులు హాజరుకాగా, అన్నప్రసాదం అందించారు. సర్పంచ్ లకావత్ లక్ష్మి, ఆలయ మేనేజర్ పాకాల వెంకట రమణ, శివాలయ పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు, చైర్మన్ మల్లెల నర్సింహారావు, పర్సా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ములకలపల్లిలో..మూకమామిడిలోని సమ్మక్క, సారలమ్మ. వీర్ల అంకమ్మ, రుక్మిణీ, సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని సోమవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. దేవాలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాల సడుమ మహా సుదన్శన సహిత చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం ఎరుర్కోలు ఉత్సవం, రాత్రి 10 గంటలకు సంతాన వేణుగోపాల స్వామి, రుక్మిణీ, సత్యభామ వివాహ క్రతువును కనులపండువగా నిర్వహించారు. -
ఆకస్మిక తనిఖీలు చేస్తా..
సూపర్బజార్(కొత్తగూడెం): ‘బాఽధ్యతగా పనిచేయండి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేస్తా.. కారణం లేకుండా ఎవరైనా కార్యాలయాలను వీడి వెళితే చర్యలు తప్పవు’ అని కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా వాణికి తప్పకుండా జిల్లా అధికారులే హాజరు కావా లని ఆదేశించారు. ఆ రోజు శాఖా పరమైన పనుల నిమిత్తం ఎక్కడికై నా వెళ్లినా ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తుంటారని, ఆ సమయంలో సంబంధిత అధికారులు లేకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. అన్ని శాఖల పనులపై సమీక్షలు ఉంటాయని, జిల్లా అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలని సూచించారు. శాఖా పరమైన ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని, స్థానికమైనా, సెక్రటేరియట్ స్థాయిదైనా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. శ్రీపాదరావుకు ఘన నివాళి అసెంబ్లీ స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని కలెక్టర్ అంకిత్ కొనియాడారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో స్పీకర్గా విశిష్ట పాత్ర పోషించారని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ అంకిత్ హెచ్చరిక -
●మూడేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ రాలే
ఈయన కొత్తగూడెం కార్పొరేషన్ 25వ వార్డు గాజులరాజం బస్తీకి చెందిన వృద్ధ దివ్యాంగుడు రామనబోయిన అశోక్. దివ్యాంగ పింఛన్ కోసం మూడేళ్లుగా ప్రజావాణిలో వినతులు ఇస్తూనే ఉన్నాడు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో కొత్త కలెక్టర్ అయినా తన గోడు ఆలకిస్తారేమోననే ఆశతో సోమవారం మరోసారి వచ్చాడు. గతంలో ఏడుసార్లు దరఖాస్తు చేశానని, ఇప్పుడు ఎనిమిదోసారి అని చెప్పాడు. కాగా, అశోక్కు ఒక కాలు లేకపోవడంతో అతి కష్టంగా కలెక్టరేట్ మెట్లు ఎక్కాడు. ఇప్పటికై నా విచారణ జరిపి తనకు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నాడు. -
భూదాన్ దందా !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూమిలో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకున్న నిరుపేదల ఆశలు అడియాసలయ్యాయి. సొంతింటి స్థలంపై పేదల ఆశలను ఆసరాగా చేసుకున్న కొందరు రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. కొన్నేళ్లుగా ఈ తంతు సాగడంతో ఈ మొత్తం రూ.10 కోట్లకు చేరిందని అంచనా. ఇంతలోనే అనుమతులు లేవని ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడంతో తాము మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఇప్పటి వరకు పోలీసులు 30 మందిని అరెస్టు చేయగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. చివరకు బాధితులై.. ఇళ్లు కోల్పోయిన వారిలో నిజమైన నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం వారికి నిలువనీడ లేకపోగా.. రెక్కలు, ముక్కలు చేసుకొని పోగేసిన డబ్బు ముఠా సభ్యులకు ఇచ్చి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డబ్బు వసూలు చేసిన ముఠా సభ్యులను బాధితులు నిలదీశారు. అంతేకాక మోసపోయిన వారి ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటికే 30 మందిని అరెస్టు చేయగా, ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని అధికారులు సూచించారు. ఏదేమైనా స్థలం కోసం రూ.లక్షలు ముట్టజెప్పడంతో ఇంటి నిర్మాణానికి రూ.లక్షల్లో అప్పు చేసిన నిరుపేదలు చివరకు బాధితులుగా మిగిలిపోవడం అందరికీ ఆవేదన కలిగిస్తోంది. ముఠా సభ్యుల ఆస్తులేంటి? ఇంటి జాగా కోసం రూ.లక్షల్లో వసూలు చేసిన వారి పేర్లతో ఫిర్యాదులు అందడంతో పోలీసులు వారిని అరెస్టుచేయడమే కాక ఆస్తుల వివరాలను సేకరిస్తున్నా రు. ముఠాలో సభ్యులు ఏ ప్రాంతం వారు, ఎందరు.. వీరి స్వస్థలాల్లో కుటుంబీకులు, బంధువుల పేర్లపై ఏమేం ఆస్తులు ఉన్నాయి, ఇటీవల ఏవైనా కొనుగోలు చేశారా అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.కోట్లలో ఉంటుందని భావిస్తుండగా.. ఆ మొత్తాన్ని ముఠా నుంచి బాధితులకు ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పోలీసు యంత్రాంగం విచారణలో వేగం పెంచింది. 10వ తేదీలోగా పూర్తి భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో పేదలను ఆదుకుంటామని ప్రకటించిన మంత్రి పొంగులేటి.. ఈనెల 15వరకు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయిస్తామని వెల్లడించారు. దీంతో అర్హుల గుర్తింపు సర్వేను ఈనెల 10లోగా పూర్తిచేసి జాబితాను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. పేదలు స్థలం కోసం డబ్బు ఎంత ఇచ్చారనే వివరాలూ సర్వేలో నమోదు చేస్తున్నట్లు సమాచారం.ఖమ్మం నగరానికి ఆనుకుని వైరా రోడ్డు సమీపాన ఉన్న భూదాన్ భూమి ఎకరం ధర బహిరంగ మా ర్కెట్ ఆధారంగా రూ.కోట్లలో ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 31.7 ఎకరాల విలువ రూ. 250 కోట్లుగా కలెక్టర్ ప్రకటించడంతో ఎంత హాట్ కేకో అర్థమవుతుంది. నగరానికి సమీపాన ఉన్నందున కాస్త స్థలం దొరికినా నీడ ఏర్పాటుచేసుకోవచ్చని నిరుపేదలు ఆశించారు. ఇదే అదునుగా ముఠాగా ఏర్పడిన కొందరు రూ. లక్ష నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. ఈ తంతు ఏళ్లుగా కొనసాగడంతో స్థలం పొందిన వారిలో కొందరు గుడిసెలు, మరికొందరు రేకులు, కొంచెం స్థోమత ఉన్న వారు స్లాబ్తో ఇంటి నిర్మాణం చేపట్టారు. తక్కువ ఖర్చుతో గూడు దక్కిందని ఆనందపడుతుండగానే కూల్చివేతలతో ఆ సంతోషం ఆవిరైపోయింది.భూదాన్ భూముల్లో ఇంటి స్థలం ఇప్పిస్తామంటూ కొందరు డబ్బు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ముఠా సభ్యులు రూ.1.25కోట్లు వసూలు చేశారని తెలుస్తోంది. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలి. ప్రత్యేక బృందాలతో విచారణ చేపడుతుండగా.. పేదలను మోసగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – సునీల్దత్, ఖమ్మం పోలీస్ కమిషనర్ -
బదిలీ కలెక్టర్ జితేష్కు ప్రశంసలు
సూపర్బజార్(కొత్తగూడెం): MýSÌñæ-MýSt-ÆŠ‡-V> Ñ«§ýl$-Ë$ °Æý‡Ó-Ç¢…_ º¨ÎOò³ Ððlâ¶æ$¢¯]l² h™ól-‹Ù Ñ.´ë-sìæ-ÌŒæ¯]l$ çœ$¯]l…-V> çܯéÃ-°…^éÆý‡$. ÝùÐ]l$-ÐéÆý‡… Æ>{† MýSÌñæ-MýSt-Æó‡-sŒæ-ÌZ h™ól-‹Ù ÒyøP-Ë$, Mö™èl¢ MýSÌñæ-MýStÆŠ‡ A…MìS™Œæ ÝëÓVýS™èl çÜ¿ýæ °Æý‡Ó-íßæ…^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> A«¨M>Æý‡$-Ë$, {ç³gê {糆°«§ýl$-Ë$, E§øÅVýS çÜ…çœ*ÌS ¯éĶæ$-MýS$-Ë$ {ç³Ôèæ…-çÜÌS Ð]lÆý‡Û… MýS$Çí³…^éÆý‡$. ´ësìæÌŒæ AË$ò³Æý‡$-VýS-MýS$…yé çÜ$yìl-V>Í ç³Æý‡Å-r¯]l-ÌS-™ø hÌêÏ AÀ-Ð]l–-¨®, {ç³gê çÜ…„óSÐ]l$… MøçÜ… ´ër$-ç³-yéz-Æý‡° õ³ÆöP-¯é²Æý‡$. Mö™èl¢-VýS*-yðl…, AÔ>Ó-Æ>Ð]l#-õ³r GÐðl$Ã-ÌôæÅ-Ë$ MýS*¯]l…-¯ól° Ýë…ºÕÐ]l-Æ>Ð]l#, gêÆð‡ B¨¯éÆ>Ķæ$-׿, MýSÌñæ-MýStÆŠ‡ A…MìS™Œæ, Gïܵ Æøíßæ-™Œæ-Æ>k, Isîæ-yîlH ï³K Æ>çßæ$ÌŒæ, ¿ýæ{§é-^èl-ÌS… çÜ»Œæ MýSÌñæ-MýStÆŠ‡ Ð]l$–×êÌŒæ-{ÔóæçÙt, A§ýl-¯]lç³# MýSÌñæ-MýStÆý‡$Ï yîl Ðól׿$-Vø´ëÌŒæ, ѧéÅ-^èl…-§ýl¯]l, hÌêÏ ArÒÔ>-RꫨM>Ç MýS–Úë~-VúyŠæ {ç³çÜ…-W…^éÆý‡$. çÔ>Ë$ÐéÌS-™ø çÜ™èlP-Ç…_ Ððl$Ððl$…sZ-ÌS¯]l$ A…§ýl-gôæ-Ô>Æý‡$. Mö…§ýlÆý‡$ A«¨M>Æý‡$-Ë$ ¿êÐø§ólÓ-VýS…-™ø MýS±²âýæÏ ç³Æý‡Å…™èl-Ð]l$-Ķæ*ÅÆý‡$. hÌêÏ-ÌZ° ç³°^ól-íܯ]l gêqç³-M>Ë$ Ð]l$Æý‡$-Ð]l-Ìôæ-°Ð]l°, {ç³gê{ç³-†°-«§ýl$-Ë$, A«¨M>Æý‡$-Ë$ ç³NÇ¢Ýë¦-Ƈ$$-ÌZ çÜçßæ-MýS-Ç…^éÆý‡…r* º¨Î MýSÌñæ-MýStÆŠ‡ h™ól-‹Ù MýS–™èl-fq™èl-Ë$ ™ðlÍ´ëÆý‡$. Mö™èl¢VýS*yðl… Ðól$Ķæ$ÆŠḥæÐ]lÊyŠæ VýS×ôæ‹Ù, ´ësìæÌŒæ MýS$r$…º çÜ¿¶æ$Å-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. చీఫ్ సూపరింటెండెంట్ తొలగింపు ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ను విధుల నుంచి తొలగించారు. ఇటీవల పరీక్ష హాల్లో ఓ విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని మరో విద్యార్థికి అందించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సదరు విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదుతో సోమవారం సీఎస్ను విధుల నుంచి తొలగించామని డీఐఓఈ రవిబాబు తెలిపారు. -
17 ఏళ్లయినా చెక్కుచెదరని బాలిక మృతదేహం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 2009లో అనారోగ్యంతో పదేళ్ల బాలిక మృతిచెందగా ముస్లింల సంప్రదాయం ప్రకారం ఖబరస్తాన్లో ఖననం చేశారు. అయితే ఆ మృతదేహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న వీడియో ప్రస్తు తం వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నంబర్–2 బస్తీకి చెందిన అబ్దుల్ అజమ్ఖాన్ నాలుగు రోజుల కిందట గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భౌతికకాయాన్ని 17 ఏళ్ల క్రితం మృతిచెందిన తన అన్న కూతురు నస్రీన్ సమాధి పక్కన ఖననం చేసేందుకు గోతి తవ్వుతుండగా బాలిక మృతదేహం కనిపించింది. సహజంగా ఖననం చేసిన ఏడాదిలోపే మృతదేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ 17 ఏళ్లయినా మృతదేహం అలాగే ఉండగా, పైన కప్పిన వస్త్రం రంగు మారకుండా, చెదలు పట్టకుండా ఉండటంతో అంతా షాక్ అయ్యారు. ఇదేదో మహిమగా భావించిన కుటుంబీకులు, మత పెద్దలు మరోమారు ప్రార్థన చేసి ఖననం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఇల్లెందులో చర్చనీయాంశంగా మారింది. -
ప్రజా ప్రభుత్వం కాదు.. గడ్డపార సర్కారు
● రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్లు కూల్చేశారు ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఖమ్మంఅర్బన్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు రామచందర్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని.. గడ్డపార సర్కారు అని ఎద్దేవా చేశారు. వెలుగుమట్లలోని భూదాన్ భూములను ఆదివారం ఆయన పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కనీస కనికరం లేకుండా కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములపై ఉన్నత న్యాయస్థానం ‘యథాతథ స్థితి’ కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. పత్రాలు అసలైనవి కావని కుంటి సాకులు చెబుతూ భారీ యంత్రాలతో ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, రోగులు అని కూడా చూడకుండా ఇళ్ల నుంచి బయటకు లాగారని అన్నారు. ఆ తర్వాత ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్లో తలదాచుకున్న బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో బీజేపీ పేదలకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో గునపం పట్టుకుని ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇల్లు కూల్చే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. బాధితులకు అదే ప్రాంతంలో 100 గజాల చొప్పున స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రామచందర్రావు డిమాండ్ చేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా ఇన్చార్జ్ బి.మహిపాల్ రెడ్డి, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఉప్పర్ల శారద, గల్లా సత్యనారాయణ, శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, దొడ్డ అరుణ, రజినీ రెడ్డి, కుమళి శ్రీనివాసరావు, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, నీరుకొండ ఉషారాణి, పమ్మి అనిత, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి, శ్రీ రామనేని మణి, నకిరేకంటి వీరభద్రం పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి జిల్లా నలుమూలలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ప్రజావాణికొత్తగూడెంఅర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల జిల్లాఅధికారులు సకాలంలో హాజ రుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉద యం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నేడు ఐటీడీఏలో గిరిజన దర్బార్భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనుల తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అందజేయాలని కోరారు. తహసీల్లో కూడా.. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో కూడా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు మరో ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలా శయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించా రు. 393 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,475 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.11,040 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నెమలి జాతరకు ప్రత్యేక బస్సులుమఽధిర : ఏపీలోని గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా సోమవారం మధిర బస్టాండ్ నుంచి నెమలి వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డీఎం ఆర్.రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 5 గంటల నంచి మధిర బస్టాండ్లో బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు నెమలి నుంచి మధిరకు బస్సులు తిరుగుతుంటాయని పేర్కొన్నారు. మధిర నుంచి నెమలికి పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30 చార్జీ ఉంటుందని వివరించారు. -
పతకాల వేటలో తహసీల్దార్
● ఓవైపు విధి నిర్వహణ.. మరోవైపు పరుగు ప్రాక్టీస్ ● జాతీయస్థాయిలో 23 పతకాలు పాల్వంచరూరల్: అంకుఠిత దీక్ష, పట్టుదలతో ఒకవైపు తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు రన్నింగ్ను ప్రాక్టిస్ చేస్తూ పోటీల్లో పాల్గొని పఽతకాలను గెలుచుకుంటున్నారు. సమాజంలో గుర్తింపునకు ఉద్యోగం ముఖ్యం కాదని.. ఆటలతోనూ తమ ప్రతిభను నిరూపించుకోవచ్చనే సంకల్పంతో పయనిస్తున్నారు పాల్వంచ తహసీల్దార్ దారా ప్రసాద్. వీలున్నప్పుడల్లా రాష్ట్ర, జాతీయస్థాయి మార్తన్(పరుగు పందెం) పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 22 పతకాలను గెలుచుకున్నారు. ఇప్పటివరకు సాధించిన పతకాలు.. ● 2024లో సిద్దిపేట, కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీల్లో విజయం సాధించి రెండు పతకాలు సాధించారు. ● 2025లో ఎన్ఎండీసీ ఆధ్వర్యాన నిర్వహించిన అంతర్జాతీయస్థాయి మార్తన్ పరుగు పందెం పోటీల్లో పాల్గొని 42 కిలోమీటర్లు దూరాన్ని 6.30 గంటల్లో పూర్తిచేయాల్సి ఉండగా.. తహసీల్దార్ కేవలం 5.25 గంటల వ్యవధిలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి పతకాన్ని కేవసం చేసుకున్నారు. ● ముంబైలో జనవరిలో జరిగిన పోటీల్లో పాల్గొని 42 కిలోమీటర్ల దూరాన్ని 4.13 గంటల సమయంలోనే లక్ష్యాన్ని సాధించారు. ● గతేడాది అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన అల్ఫామార్తన్ పోటీల్లో పాల్గొని 21 కిలోమీటర్ల పరుగును 2.16 గంటల సమయంలోనే పూర్తి చేసి పతకాన్ని కై వసం చేసుకున్నారు. ● కోల్కత్తాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 25 కిలోమీటర్ల నిర్ధేశించిన సమయంలోపు చేరుకుని పతకాన్ని గెలుచుకున్నారు. జనవరి 18న ముంబైలో జరిగిన పోటీలో పాల్గొని పతకాన్ని సాధించారు.ఒక వైపు విఽధినిర్వహణతో పాటు ప్రతీ రోజు వేకువ జామున సర్దార్పటేల్ స్టేడియంలో క్లబ్ మిత్రులతో కలిసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా. విధినిర్వహణలో ఒత్తిడిని అధికమించేందుకు వాకింగ్, రన్నింగ్ చేస్తా. వచ్చే నెల ముంబైలో జాతీయస్థాయి మార్తన్ పోటీల్లో పాల్గొనేందుకు సాధన చేస్తున్నా. – దారాప్రసాద్, తహసీల్దార్, పాల్వంచ -
ఆరోగ్యంపై అవగాహన..
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఖమ్మం సైక్లింగ్ క్లబ్ సభ్యులు సైక్లింగ్ కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం నుంచి సైక్లింగ్ ప్రారంభించి సైకిల్పై 70 కిలోమీటర్ల ప్రయాణించి ఆదివారం కొత్తగూడెం చేరుకున్నారు. అనంతరం కొత్తగూడెం సైక్లింగ్ క్లబ్ సభ్యులతో కలిసి సుమారు 50 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి అటవీ ప్రాంతాన్ని, జగ్గారం గొత్తి కోయల నివాసాలను, పోడు భూములను, అటవీ శాఖ ప్లాంటేషన్లను సందర్శించారు. సెంట్రల్ పార్క్లో అందరూ మొక్కలు నాటారు. సంరక్షణకు ఒక మొక్కకు రూ. 500 చొప్పున విరాళం అందించారు. ఈ సందర్భంగా ఖమ్మం సైక్లింగ్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ మహేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య రక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఖమ్మం సైక్లింగ్ క్లబ్ ఉపాధ్యక్షుడు, కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ యు. కోటేశ్వరరావు, సైక్లింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో ఉంది
ఖమ్మంక్రైం : నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో ఉందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, పోలీస్ ఫ్యామిలీ గృహ భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నివారణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా పోలీస్ సిబ్బంది, వారి పిల్లలను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీస్ సిబ్బంది కుటుంబాలకు మెరుగైన వసతి కల్పించేందుకు జిల్లా కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో గృహాలు నిర్మించామని తెలిపారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేసుల పురోగతి, మహిళలు, శిశువుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు. మాదక ద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా నివారణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పదేళ్లుగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ఇది సాధారణ సమస్య కాదని అన్నారు. స్వీయ అవగాహనతోనే సైబర్ మోసాలకు కళ్లెం వేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ రూపొందించిన సైబర్ సింబా కార్యక్రమాన్ని జిల్లాలో కూడా అమలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన ఆరైవ్, ఆలైన్ కార్యాక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీబ్యూరో, ఈగల్ దేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్నాయని అన్నారు. బేసిక్ పోలీసింగ్, చట్టాలపై లోతైన అవగాహన కోసం దృష్టి పెట్టాలని, పోలీస్ స్టేషన్ రికార్డు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సునీల్దత్, అడిషనల్ డీసీపీలు ప్రసాద్రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేష్, సర్వర్, సత్యనారాయణ, ఫణిందర్, సుశీల్సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.డీజీపీ శివధర్రెడ్డి వెల్లడి -
అడవిలో చెలరేగిన మంటలు
అశ్వాపురం: మండల మొండికుంట గ్రామ సమీపంలో తుమ్మలచెరువు రహదారి మార్గంలో గుట్టపై ఆదివారం రాత్రి అడవిలో మంటలు చెలరేగాయి. అడవి తగలబడటం పర్యావరణానికి ముప్పు అని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. అటవీ శాఖ అధికారులు అడవులు కాలిపోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెండు ట్రాక్టర్లు ఢీకొని యువకుడు మృతిచింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు ట్రాక్టర్లు ఢీకొని బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన శ్రీరామ నాగయ్య (19) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగయ్య బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన బుంగ రాంబాబు శనివారం రాత్రి నాగయ్యకు ఫోన్ చేసి ఇసుక రవాణా చేసేందుకు తన ట్రాక్టర్కు డ్రైవర్గా రావాలని కోరాడు. రాంబాబు ట్రాక్టర్ను తీసుకుని ముదిగొండ మండలం గంధసిరి మున్నేరుకు వెళ్లి ఇసుక లోడ్ చేయించుకుని ఆదివారం తెల్లవారుజామున చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీకి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చిన్నమండవ గ్రామానికి చెందిన కాశిమాల రాజ్కుమార్కు చెందిన ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోగా రెండు ట్రాక్టర్లు ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడిపోయాయి. ట్రక్కులోని ఇసుక నాగయ్యపై పడి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి పుల్లమ్మ రాజ్కుమార్ నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతిచెందాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వీరేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలి
● ఆయన ఒక అద్భుతమైన వక్త, రచయిత ● వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంమామిళ్లగూడెం : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, అద్భుతమైన వక్త, రచయిత, కవి, ప్రజాస్వామ్యవాది, గొప్ప దేశభక్తుడు అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావుతో కలిసి అక్షర నీరాజనం పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులు, పీఠాల కోసం వాజ్పేయి ఎప్పుడూ రాజీపడలేదని, ఓటమిని సైతం హుందాగా స్వీకరించారని తెలిపారు. ప్రపంచ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి అని ఉద్ఘాటించారు. వాజ్పేయి పాలనా దక్షత, నిస్వార్థ సేవ నేటి తరానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. గతంలో జనసంఘ్, కమ్యూనిస్టు, కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ వంటి రాజకీయ పక్షాలకు నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉండేవని, నేటి రాజకీయాల్లో అవి పూర్తిగా లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రసార మాధ్యమాలు కూడా వివాదాలకు ఇస్తున్న ప్రాధాన్యతను సమాజానికి మేలు చేసే విషయాలకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. పరభాషా పదమైన అమ్మను సూచించే ఆంగ్ల పదం వాడితే వస్తుప్రదర్శనశాలలో పెట్టే శవం అని అర్థం వస్తుందని, అమ్మ అని పిలవడంలో ఉన్న కమ్మదనం ఆంగ్ల పదాల్లో ఏమాత్రం లేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మాట్లాడుతూ వాజ్పేయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు కశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు ఆయనను ఐక్యరాజ్యసమితికి పంపడం దేశ ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో వాజ్పేయి శతజయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, మందడపు ప్రభాకర్ రెడ్డి, సామాజిక సమరసత జాతీయ కళా విభాగం కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అప్పల ప్రసాద్, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
రామభ క్తుల పాదయాత్ర
అశ్వారావుపేటరూరల్: మైళ్ల కొద్ది దూరాన్ని ఆ శ్రీరాముడే నడిపిస్తున్నాడని, ఏటా శ్రీరామ నవమి పండుగ ముందు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి కాలినడక వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని రామభక్తుల బృందంతెలిపారు.ఏపీలో ని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామం నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలోగల భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయానికి 120మంది భక్తులు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. ఈ బృందం ఆదివారం మధ్యాహ్నం అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం వద్దగల శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు చేరింది. అనంతరం రామ నామాన్ని జపిస్తూ.. భద్రాచలానికి వెళ్లారు. వరకట్న వేధింపులపై కేసు నమోదు పాల్వంచరూరల్: అదనపుకట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న భర్త, అత్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన పామర్తి ప్రనూష ఏపీ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన పామర్తి దుర్గారావుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎస్ఎస్శ్రీ కూతురు ఉంది. అయితే కొద్దిరోజులుగా భర్త మద్యానికి అలవాటు పడి అదనపు కట్నం తేవాలని నిత్యం వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, ఈ విషయాన్ని అత్తకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆదివారం ప్రనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు భర్తతో పాటు అత్త కృష్ణవేణిలపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలుగుండాల: ద్విచక్ర వాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కథనం ప్రకారం.. ఆళ్లపల్లి మండలంలోని జాకారం గ్రామానికి చెందిన పాయం క్రిష్ణ మర్కోడు నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈక్రమంలో నడిమిగూడెం–జాకారం మధ్య జల్లేరు వాగు బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడిని 108లో ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించారు. ఆగి ఉన్న స్కార్పియోను ఢీకొట్టిన లారీ..టేకులపల్లి: రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కార్పియోను వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న మాజీ సర్పంచ్, ఆయన కుమారుడు ప్రాణాలతో బయట పడ్డారు. టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం కొత్తతండా(పి) మాజీ సర్పంచ్ భూక్య పాపానాయక్ తన కుమారుడు రాజేష్తో కలిసి స్కార్పియోలో ఆదివారం టేకులపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈక్రమాన డీజిల్ కొట్టించేందుకు కుడివైపు ఉన్న బంకు వైపు క్రాస్ అయ్యేందుకు రోడ్డుకి ఎడమ వైపు వాహనాన్ని ఆపాడు. ఈ సమయాన ఇసుక లోడు కోసం భద్రాచలం వైపు వెళ్తున్న టీజీ07డబ్ల్యూ 3456 నంబర్ గల లారీ వేగంగా దూసుకొచ్చి స్కార్పి యోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కార్పి యో ముందుకు దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగి వాహనంపై పడింది. వాహనంలో ఉన్న ఇద్దరికి ఏమీ కాలేదు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకుని లారీని పోలీసుస్టేషన్కు తరలించా రు.బాధితుడి ఫిర్యాదుమేరకు సూర్యాపేటకు చెం దిన లారీ డ్రైవర్ మరికంటి రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలిఖమ్మం మామిళ్లగూడెం : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఖమ్మం టీటీడీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానతల కారణంగా ఇప్పటికీ చట్టసభల్లో బలహీనవర్గాల వారికి సరైన ప్రాతినిథ్యం దక్కడం లేదని, ఈ అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యత పాలకులదేనని చెప్పారు. బీసీ రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం భూదాన్ భూమిని పరిశీలించి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, టీఎన్జీఓస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, పార్టీ నాయకులు చిర్రా రవి, నూనె భాస్కరరావు, స్వర్ణకుమార్, షేక్ మహబూబ్ పాషా, షేక్ ఫకృద్దీన్, పమ్మి రవి, నజీమా, సత్యనారాయణ, జగదీష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
సీపీఎం నేత దారుణ హత్య..
● కత్తితో పొడిచి హతమార్చిన గుర్తు తెలియని దుండగులు ● గ్రామంలో పోలీసుల మోహరింపు కరకగూడెం: మండలంలో వలస ఆదివాసీ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఆదివారం కరకగూడెం మండలం పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పోలీసుల ఇలా వివరించారు. మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కొవ్వాసి వెంకటేశ్వర్లు (50) సుమారు 20 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి గ్రామంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ పోడుభూమి కొట్టి వ్యవసాయం చేసుకుంటూ, కూలిపనులు చేస్తూ భార్య, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. ఆయన స్థానికంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేశ్వర్లును కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్ల డించారు. ఈ మేరకు కరకగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పీ.వీ.ఎన్.రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ బందోబస్తు.. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో హత్య ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు. కాగా, విషయం తెలుసుకున్న మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి, ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, స్థానిక ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు వ్యక్తిగత కక్షలేమైనా కారణమా లేదా ఇతర కోణాలేమైనా ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్చరీ పోటీల్లో 12 మంది ఎంపిక
పాల్వంచరూరల్: మండలపరిధి కిన్నెరసానిలోని గిరిజన క్రీడాపాఠశాల మైదానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం ఆర్చరీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–15, అండర్–13, అండర్–10 బాలబాలికల జిల్లా స్థాయి ఎంపికలు చేసినట్లు ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య తెలిపారు. 10వ ఇండియన్ రౌండ్లో బాలుర విభాగంలో ఎం.విక్రాంత్, బి.అభియరామ్నాయక్, పి.సాయి, బి.శ్రీహర్షితరామ్నాయక్, జి.స్వాతిక్, కె.చేగువీరా, బాలికల విభాగంలో డి.అశ్వికప్రకాశ్, మానశ్వినీ, వి.రిత్విక, కన్యాశ్రీ, రీనా, శరణ్య, మనుశ్రీలు ఎంపికయ్యారని పేర్కొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో బడ్డీకొట్టు దగ్ధం
కొణిజర్ల: షార్ట్ సర్క్యూట్తో బడ్డీ కొట్టు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కొణిజర్లకు చెందిన గొడ్డుగొర్ల నవ్య తన తల్లితో కలిసి ఎస్సీకాలనీ సమీపంలో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నది. శనివారం దుకాణం మూసి ఇంటికి వెళ్లగా రాత్రి 11.30 సమయంలో దుకాణం నుంచి మంటలు, పొగ కనిపించడంతో పక్కింటి వారు నవ్యకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా కిరాణా సరుకులు, ఫ్రిజ్, రూ.7 వేలు నగదు కాలిపోయాయని నవ్య వాపోయింది. సర్పంచ్ చింతల పుష్పావతి ఉపేందర్, మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావు తదితరులు దుకాణాన్ని సందర్శించారు. నవ్య స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడవిపంది మాంసం స్వాధీనం కామేపల్లి: ముచ్చర్ల రామస్వామి గుట్ట సమీపంలో అడవి పంది మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఆముదాల కృష్ణయ్య, వెంకటేశ్వర్లు వద్ద ఎనిమిది కేజీల అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లగూడెం సెక్షన్ ఆఫీసర్ శిల్ప తెలిపారు. -
విభజనపై నీలినీడలు !
ఖమ్మంవ్యవసాయం: నూతన సహకార సంఘాల ఏర్పాటు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని జిల్లాల సహకార అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో పెద్ద సంఘాలను గుర్తించి... వాటిని ఒకటి నుంచి మూడు సంఘాల వరకు విభజించాలంటూ 2025 జనవరిలో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 906 సహకార సంఘాలు ఉండగా, మరో 345 నూతన సంఘాల ఏర్పాటుకు అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయి. అయితే సహకార బ్యాంకు, సహకార సంఘాలకు వెన్నుదన్నుగా ఉండే నాబార్డ్(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలెప్మెంట్) ఈ నూతన సంఘాల ప్రతిపాదనలను పరిశీలించి, ఏర్పాటుకు గల అర్హతలపై అధ్యయనం చేసింది. సంఘాల ఆదాయం, ఉద్యోగుల వేతనాల వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని కొత్త సంఘాల ఏర్పాటు కంటే ప్రస్తుతం ఉన్న సంఘాలను బలోపేతం చేయడమే మేలని స్పష్టం చేసింది. నాబార్డ్ సూచించిన అర్హతల ఆధారంగా రాష్ట్రంలో 12 నూతన సంఘాల ఏర్పాటుకు మాత్రమే అవకాశం ఉంది. భారీగా ప్రతిపాదనలు.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం సహకార సంఘాలు ఉన్నాయి. మొత్తంగా 101 సహకార సంఘాలు పాత ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి జిల్లాలో 21, బయ్యారం, గార్ల, వాజేడు, వెంకటాపురంలో నాలుగు పీఏసీఎస్లు ఉన్నాయి. అయితే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని నూతన మండలాల్లో కొత్తగా, పెద్ద సహకార సంఘాలను గుర్తించి ఇంకొన్ని కలిపి 58 పీఏసీఎస్లు ఏర్పాటు చేయాలని రెండు జిల్లాల సహకార శాఖలు నిర్ణయించాయి. ఖమ్మం జిల్లాలో 39, భద్రాద్రి జిల్లాలో 19 సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. ఎక్కడెక్కడ అంటే.. ఖమ్మం జిల్లాలో వీవీ పాలెం సొసైటీ నుంచి అల్లీపురం, వేపకుంట్ల, మంచుకొండ సొసైటీ నుంచి ఈర్లపుడి, టేకులపల్లి ఏపీఎఫ్ఎస్సీఎస్ నుంచి గువ్వలగూడెం, మద్దులపల్లి, ఏదులాపురం సొసైటీ నుంచి గోళ్లపాడు, ఎం.వెంకటాయపాలెం, తల్లంపాడు, కల్లూరుగూడెం సొసైటీ నుంచి పెరికసింగారం, పాలేరు, నేలకొండపల్లి నుంచి అప్పలనర్సింహాపురం, తిరుమలాయపాలెం నుంచి పిండిప్రోలు, జల్లేపల్లి, బీరోలు నుంచి కాకరవాయి, సుబ్లేడు సొసైటీలను కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. అలాగే చింతకాని పీఏసీఎస్ నుంచి పందిళ్లపల్లి, నాగిలిగొండ, నాగులవంచ నుంచి పాతర్లపాడు, ముదిగొండ నుంచి బాణాపురం, వనంవారి కిష్టాపురం, మధిర నుంచి సిరిపురం, మడుపల్లి, కాకర్లపల్లి నుంచి బుగ్గపాడు, కల్లూరు నుంచి ముచ్చవరం, చెన్నూరు నుంచి చండ్రుపట్ల, తల్లాడ నుంచి బిల్లుపాడు, కారాయిగూడెం నుంచి కుప్పెనకుంట్ల, పెనుబల్లి నుంచి లంకపల్లి, టేకులపల్లి ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అంతేకాక కేజీ మల్లెల నుంచి అడసర్లపాడు, గార్లొడ్డు నుంచి నాచారం, తిమ్మారావుపేట, కారేపల్లి నుంచి కోమట్లగూడెం, గోపవరం నుంచి పల్లిపాడు, పెద్దగోపతి, వైరా నుంచి గొల్లపూడి, గన్నవరం, గరికపాడు నుంచి విప్పలమడక, కామేపల్లి నుంచి కొత్త లింగాలను నూతన సంఘాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు నుంచి పడమటి నర్సాపురం, గుంపెన నుంచి అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట నుంచి నాచారం, గండుగులపల్లి, ముల్కలపల్లి నుంచి జగన్నాథపురం, పొగళ్లపల్లి, పూసుగూడెం, అశ్వాపురం నుంచి మిట్టగూడెం, గుండాల నుంచి ఆళ్లపల్లి, బూర్గంపాడు నుంచి మోరంపల్లి బంజర, పినపాక నుంచి కరకగూడెం, దుమ్ముగూడెం నుంచి నర్సాపురం, బేతంపూడి నుంచి బోడు, కోయగూడెం, బొమ్మనపల్లి, పాల్వంచ నుంచి యానంబైలు, కొత్తగూడెం నుంచి లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్లో నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అన్నీ కాదు కొన్నే.. నాబార్డ్ నిర్దేశించిన అర్హతల ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 నుంచి 5 నూతన సహకార సంఘాలు మాత్రమే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు సహకార శాఖలో చర్చ జరుగుతోంది. సంఘాల ఆదాయం, వ్యాపారం, ఉద్యోగుల వేతనాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క సహకార సంఘం(టేకులపల్లి నుంచి గువ్వలగూడెం), భద్రాద్రి జిల్లాలో నాలుగు నూతన సంఘాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు బావిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో నూతన మండలాలను ఏర్పాటు చేయడంతో ఆ ప్రామాణికంగా నూతన సహకార సంఘాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అంతేగాక ఏజెన్సీ ప్రాంతంగా కొంత మేరకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నాబార్డ్తో మాట్లాడి అర్హతల విషయంలో సడలింపులు చేస్తే నూతన సహకార సంఘాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గ్రామాల్లో కొందరు రాజకీయ నాయకులు నూతన సహకార సంఘాల పదవులపై కన్నేసి వాటి ఏర్పాటుకు ఎదురుచూస్తుండటం గమనార్హం. ఖమ్మంలోని డీసీసీబీ కార్యాలయంనూతన పీఏసీఎస్ల ఏర్పాటుపై సందిగ్ధం -
5 క్వింటాళ ్ల బొగ్గు చోరీ..
అశ్వాపురం: మణుగూరులోని సింగరేణి కొండాపురం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి మండలంలోని భారజల కర్మాగారానికి రోప్వే ద్వారా బకెట్లలో సరఫరా అవుతున్న బొగ్గును కొందరు అక్రమంగా దొంగిలించి మండల పరిధిలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఐదు క్వింటాళ్ల బొగ్గును దొంగిలించి ట్రాక్టర్లో మణుగూరుకు చెందిన ఉడతనేని శ్రీను గొందిగూడెం వద్ద తన ఇటుక బట్టీలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో శ్రీనుతో పాటు డ్రైవర్ గోవింద శ్రీనివాస్ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. రాత్రి సమయాల్లో చోరీ.. మణుగూరు నుంచి భారజల కర్మాగారానికి రోప్వే ద్వారా బొగ్గు ఆకాశమార్గంలో బకెట్లలో సుమారు 10 కిలోమీటర్ల సరఫరా అవుతుంది. అయితే బొగ్గును రాత్రి సమయాల్లో కొందరు వ్యక్తులు చోరీ చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో బొగ్గు చోరీపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని, అక్రమ బొగ్గు రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
భక్తులు మెచ్చేలా ‘నవమి’
● అధికారులు సమన్వయంతో పని చేయాలి ● శ్రీరామనవమి ఏర్పాట్ల సమీక్షలో మంత్రి పొంగులేటి ● గైర్హాజరైన ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీస్..భద్రాచలం: భక్తులు మెచ్చేలా శ్రీసీతారాముల కల్యాణ ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం భద్రాచలంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. నవమి ప్రణాళికల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భద్రాచలం చుట్టు పక్కల ఆర్అండ్బీ రోడ్లకు, చర్ల–వెంకటాపురం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, రెండు బ్రిడ్జిలపై, భద్రాచలంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, బందోబస్తు, సెక్టార్లు, కల్యాణ వేదిక వద్ద జరిగే తోపులాట నియంత్రించేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఫుడ్ పరీక్షలు, లడ్డూ ప్రసాద తనిఖీల అనంతరమే విక్రయాలు జరగాలన్నారు. సీఎం సెక్టార్లో ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా సమీక్ష సమావేశానికి గైర్హాజరైన భద్రాచలం ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. మహబాబూబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ సీఎం సెక్టార్లో జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ వీఐపీ సెక్టార్లలోకి పాస్లు లేకుండా వచ్చే వారిని నియంత్రించాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ రోహిత్ రోజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ట, ఎంవీఐ సంగం వెంకట పుల్లయ్య, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వా మి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈఓ దామోదర్రావు ప్రారంభించారు. ఫిబ్రవరిలో 1,99,248 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఈఓ తెలిపారు. రేపు రామాలయం మూసివేత -
సేంద్రియం.. సత్ఫలితం
సామాజిక స్పృహతో.. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యారం లక్ష్మీరెడ్డి గత 30 ఏళ్లుగా పత్తి, వరి సాగు చేస్తున్నాడు. పంటల సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యాన వరిలో ఐదారు సార్లు కొట్టిన పురుగు మందు బియ్యాన్ని ఎలా తినాలని ఏడేళ్ల క్రితమే పత్తి, వరి సాగు తగ్గించి బొప్పాయి సాగు ప్రారంభించాడు. తొలుత ఇబ్బందులు ఎదురైనా సేంద్రియ విధానాలతో బొప్పాయి కాయ సైజులో పెద్దదిగా, రుచిలో మేటిగా అందరినీ ఆకర్షించింది. దీంతో ముంబై, పుణే నుంచి వ్యాపారస్తులు స్వయంగా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే పుచ్చసాగు చేపట్టగా.. అది కూడా సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్ష్మీరెడ్డికి ఫోన్ చేసి సాగు విధానాలపై ఆరా తీశారు. మిర్చి సవాల్.. మూడేళ్లుగా మిర్చిసాగు రైతులకు సవాల్గా మారింది. పంటను నల్లి తామర ఆశించగా.. పురుగుమందులు వినియోగం పెంచినా ఫలితం లేక మార్కెట్లో ధరలు కూడా పతనమవుతుండడంతో చాలామంది మిర్చి సాగు మానేశారు. ఈ తరుణాన రైతు లక్ష్మీరెడ్డి సేంద్రియ పద్ధతిలో చీడపీడల నివారణకు వేపనూనె, జీవామృతంతో పాటు పొన్నుస్వామి ఆర్గానిక్ మందులను వినియోగించి మిర్చి సాగు చేపట్టాడు. మిగతా రైతుల తోటలు నల్లితామరతో ఎండిపోయినా లక్ష్మీరెడ్డి మిర్చి తోట పచ్చగా ఆరోగ్యంగా ఉండడంతో నాలుగెకరాల్లో పండిన మిర్చిని స్థానికులే కొనుగోలు చేశారు. ఏటా సాగు చేస్తుండగా మండల వాసులు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేశారు. ఇటీవల వరకు పనిచేసిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మిర్చి తోటలను పరిశీలించి అభినందించారు. లక్ష్మీరెడ్డిని ఆదర్శంగా తీసుకుని మిగతా రైతులు కూడా సేంద్రియ విధానాలను పాటించాలని సూచించారు. ఆర్గానిక్ మందులు ఇచ్చిన తమిళనాడుకు చెందిన పొన్నుస్వామి కూడా లక్ష్మీరెడ్డి తోటను పరిశీలించి అభినందించారు. అదే గ్రామానికి చెందిన రైతులు దారం వెంకటేశ్వరరెడ్డి, పోతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఉపేందర్ కూడా సేంద్రియ సాగు విధానాలే పాటిస్తున్నారు. అధిక దిగుబడి సాధించాలంటే పంటల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులను విపరీతంగా వినియోగించాల్సి వస్తోంది. దీంతో ఒకింత దిగుబడి పెరిగినా.. పెట్టుబడి భారం అదేరీతిలో ఉంటుంది. ఈక్రమాన వ్యవసాయ ఉత్పత్తులపై విషప్రభావం పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యాన ఓ రైతు సేంద్రియ సాగుపై దృష్టి సారించి సత్ఫలితాలు పొందడంతో మరికొందరు రైతులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. – బూర్గంపాడుసాగులో కొత్త ఒరవడి.. -
ముప్పిడి సాంబయ్య లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీకి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ శనివారం రాత్రి లొంగిపోయారు. ఆయనతోపాటు మరో 14 మంది మావోయిస్టులు కూడా సాయుధ పోరుబాట వీడారు. ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బొలాంగిర్–బార్ఘడ్–మహాసముంద్ జిల్లాలతో కూడిన డివిజన్ కమిటీ లొంగిపోతామంటూ ఫిబ్రవరి 23న ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్శర్మకు లేఖ రాసింది. తమ భద్రతకు హామీ ఇస్తే మార్చి 2 లేదా 3వ తేదీలోగా లొంగిపోతామని పేర్కొంది. ఛత్తీస్గఢ్ సర్కార్ నుంచి లొంగుబాటుకు గ్రీన్సిగ్నల్ రావడంతో ఫిబ్రవరి 28నే వికాస్ తన దళంతో కలిసి లొంగిపోయారు. ఇందులో సాంబయ్య ఒక్కరే తెలంగాణకు చెందినవారు కాగా మిగిలిన 14 మంది ఛత్తీస్గఢ్ వారు. సంకోచించకుండా లొంగిపోండి.. లొంగుబాటు ప్రక్రియను సజావుగా జరిపించేందుకు ఛత్తీస్గఢ్కు చెందిన మీడియా ప్రతినిధులు రంగంలోకి దిగా రు. వీరి ద్వారా శనివారం సాయంత్రం మహాసముంద్ జిల్లాలో అటవీ గ్రామమైన హర్తొండాకు 4 కి.మీ. దూరంలో ఒక వాగు ఒడ్డున ఉన్న పొలానికి మావోయిస్టులు చేరుకున్నారు. అక్కడి నుంచి మీడియా ప్రతినిధి ఫోన్ ద్వారా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్శర్మతో వికాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎలాంటి సంకోచం లేకుండా లొంగిపోవచ్చని విజయ్శర్మ తెలిపారు. ఆదివారం మహసముంద్ జిల్లాలో తన పర్యటన ఉందని, ఆ సమయానికి అక్కడకు చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. మీ బృందంలో ఎంత మంది ఉన్నారు. ఎన్ని ఏకే 47లు తెచ్చారని విజయ్శర్మ ప్రశ్నించగా మొత్తం 15 మంది వచ్చామని, మూడు ఏకే 47లు తెచ్చామని సాంబయ్య బదులిచ్చారు. ఖాళీ దిశగా ఒడిశా మావోయిస్టు పార్టీకి దండకారణ్యం తర్వాత అతిపెద్ద బేస్గా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే గతేడాది జనవరిలో ఒడిశా సరిహద్దులో గరియాబంద్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతితోపాటు 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత జూన్లో జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆంధ్రా–ఒడిశా బోర్డర్ జోన్కు నాయకత్వం వహిస్తున్న గాజర్ల గణేశ్ అలియాస్ ఉదయ్తో పాటు చైతే మృతి చెందారు. నవంబర్ 18న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లోనూ ఈ కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత డిసెంబర్ 25న జరిగిన ఎన్కౌంటర్లో ఒడిశా బాధ్యతలు చూస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు మరణించాడు. ఇలా వరుసగా ఒడిశాలో ఆ పార్టీ నష్టపోతుండగా తాజాగా బీబీఎం కమిటీ సైతం కనుమరుగైంది. చివరగా ఒడిశా కమిటీలో కలహంది–కందమాల్–బౌద్–నయాగడ్ డివిజన్ కమిటీనే యాక్టివ్గా ఉంది. 12 మంది సభ్యులున్న ఈ కమిటీ కూడా జనవరి చివరి వారంలో లొంగిపోయే ప్రయత్నం చేసింది. ఈ కమిటీలో లొంగుబాటు ప్రయత్నాలు చేసిన అన్వేశ్ అనే మావోయిస్టును తోటి నక్సలైట్ సుక్రు చంపేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఈ కమిటీలోనూ తొమ్మిది మంది మావోలే మిగిలి ఉన్నారు. -
వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ
భద్రాచలం: పునర్వసు నక్షత్రం సందర్భంగా శనివారం భద్రగిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. కంచర్ల గోపన్న సేవా సమితి, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో భక్తులు, అర్చకుల శ్రీరామ నామస్మరణల నడుమ కోలాహలంగా సాగింది. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాల వేసి హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్రావు, కంచర్ల గోపన్న సేవా సమితి నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం.. దేవస్థానంలో స్వామి వారి మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిచారు. కంప్యూటర్ల వితరణ దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన డాక్టర్ కవిత రూ.1,59,300 విలువైన మూడు కంప్యూటర్లను వితరణగా అందజేశారు.రామయ్యకు సువర్ణ తులసీ అర్చన -
సర్వేపైనే ఆశలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. శుక్రవారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక సర్వే శనివారం కూడా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 21మంది తహసీల్దార్లు సర్వేలో పాల్గొంటున్నారు. భూదాన్ భూముల్లో మొత్తం 705 ఇళ్లను కూల్చగా.. అందులో ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు తేల్చారు. ఈమేరకు సర్వే పూర్తయ్యాక అర్హులకు ఇళ్లస్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్వగ్రామాల్లో వివరాల సేకరణ ఇళ్లు కోల్పోయిన వారిలో నిజమైన అర్హులను తేల్చేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. జిల్లాలోని 21మంది తహసీల్దార్లు, సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు. రెండు రోజులుగా రెవెన్యూ సిబ్బంది టీటీడీసీ, అంబేద్కర్ భవన్లో ఉంటున్న బాధితులతో మాట్లాడి పేరు, గ్రామం, కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలు, ప్రభుత్వం నుంచి గతంలో సాయం పొందారా.. సొంత ఇల్లు ఉందా.. తదితర వివరాలు సేకరించారు. ఇందులో ఇతర ప్రాంతాల వారి విషయమై అక్కడి తహసీల్దార్లకు సమాచారం ఇచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల బాధితులు రెవెన్యూ అధికారుల సర్వేలో భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు ఏయే ప్రాంతాల వారో తేలింది. ఆపై వారి సామాజిక, ఆర్ధిక స్థితిగతులు ఆరా తీస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారిలో ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల వారే కాక ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల వాసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన బాధితులు 182 మంది, జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారు 107 మంది, ఏపీ రాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. కొనసాగిన పరామర్శలు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరామర్శలు శనివారం కూడా కొనసాగాయి. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు భూదాన్ భూములను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని, భూదాన్ భూముల్లోనే ప్రభుత్వం ఇళ్లు కట్టించేలా ఒత్తిడి తీసుకొస్తామని భరోసా కల్పించారు. బీజేపీ జాతీయ నాయకుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, విమలక్క తదితరులు పర్యటించారు. బతుకు దెరువు కోసం వలస వచ్చిన నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే కూలగొట్టడం ఏమిటని నేతలు ప్రశ్నించారు.భూదాన్ భూముల్లో కూల్చిన ఇళ్లు 705 -
భూదాన్ భూములు పేదలకే చెందాలి
ఖమ్మంమామిళ్లగూడెం: భూదాన్ భూములు అంటేనే పేదల కోసమని, అవి వారికి మాత్రమే చెందాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఖమ్మం సమీపాన వెలుగుమెట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించాక మాట్లాడారు. గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అన్నారు. కూల్చిన ప్రాంతంలోనే బాధితులకు ఇళ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 62 ఎకరాల భూదాన్ భూముల్లో సెంట్ కూడా పోకుండా పేదలకు చెందేవరకు పోరాటం చేస్తానని తెలిపారు. కాగా, అక్రమంగా భూదాన్ భూముల్లో పట్టాలు చేసి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఇళ్లు కూల్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 14 వేల ఎకరాలు, నల్లగొండలో 12 వేలు, మహబూబ్నగర్లో 15 వేలు, ఖమ్మంలో 6 వేల ఎకరాలు.. ఇలా మొత్తం 65 వేల ఎకరాల భూదాన్ భూములు అగ్రవర్ణాల కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు. అలాంటప్పుడు ఖమ్మంలోనే పేదలు గూడు కట్టుకుంటే ఎందుకంత కక్షో ప్రభుత్వం చెప్పాలని మల్లన్న సూచించారు. పేదల నుంచి లాక్కున్న భూమిని బిల్డర్లకో, కబ్జాదారులకో కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. బీసీల ఓట్లు కావాలి కానీ వారి జీవితాలను మాత్రం నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాగా, బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. తక్షణ సాయం కింద ప్రతీ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆయన వెంట పార్టీ నేత వట్టె జానయ్యయాదవ్ తదితరులు ఉన్నారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
3న పెద్దమ్మతల్లి ఆలయం మూసివేత
పాల్వంచరూరల్ : చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3వ తేదీన పెద్దమ్మతల్లి ఆలయంతో పాటు పక్కనున్న శివాలయాన్ని మూసివేయనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు, మహానివేదన అనంతరం ద్వార బంధనం చేసి, తిరిగి బుధవారం ఆలయ సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల తర్వాత ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి సెమినార్లో ప్రతిభఇల్లెందురూరల్: జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్లో రొంపేడు బాలికల ఆశ్రమ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు ఎం.పార్వతి ప్రతిభ చాటారు. జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు సెమినార్లో పాల్గొనే అవకాశం లభించగా.. సంబంధిత అంశాలపై ప్రసంగాల అనంతరం జిల్లాకు ఒకరు చొప్పున ఉత్తమ ప్రదర్శకులుగా ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. కాగా, జిల్లా నుంచి ఆ అవకాశం పార్వతికి దక్కింది. సెమినార్ అనంతరం బెస్ట్ పర్ఫామెన్స్ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె అందుకున్నారు. రాష్ట్ర స్థాయి సెమినార్లో ప్రతిభ కనబర్చిన పార్వతిని ఎంఈఓ ఉమాశంకర్, ఏటీడీఓ భారతీదేవి, రొంపేడు హెచ్ఎం పద్మ అభినందించారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11–45 గంటలకు భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్లను మంత్రి సన్మానించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తారు. అలాగే, సాయంత్రం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి పాల్గొంటారు. ఫిజికల్ సైన్స్ టీచర్ల జిల్లా కమిటీ ఎన్నిక టేకులపల్లి: ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్(ఎఫ్పీఎస్టీ) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కొత్తగూడెంలోని ఆనందఖని జెడ్పీహెచ్ఎస్లో శనివారం ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడిగా టేకులపల్లి జీహెచ్ఎస్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఎం.మోహన్రావు, ప్రధాన కార్యదర్శిగా ఏ.శంకర్రావు(జెడ్పీహెచ్ఎస్, నెల్లిపాక బంజర), గౌరవ అధ్యక్షులుగా ఎన్.రాజశేఖర్(ఏఎంఓ), గౌరవ కార్యదర్శిగా ఎస్.కే.సైదులు(సీఎంఓ) ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారిగా ఎస్.యశోద(పాల్వంచ), ఇతర పదవులకు జి.అనురాధ(కొత్తగూడెం), ప్రభుసింగ్(ఇల్లెందు), జె.లక్ష్మి(రుద్రంపూర్), బి.బాసు(భద్రాచలం), బి.బిచ్చ(ములకలపల్లి), ఉమాదేవి(బూర్గంపాడు), డి.రామిరెడ్డి(పినపాక), టి.పాపారావు(పాల్వంచ), సీహెచ్.శ్రీనివాస్(భద్రాచలం), కె.నాగేశ్వరరావు(మణుగూరు), రామకృష్ణ(భద్రాచలం), పి.దుర్గాశైలజ(పాల్వంచ), ఎం.ఎం.భాస్కరాచారి(దమ్మపేట), బి.దేవీ లాల్(కొత్తగూడెం), ఎస్.శాంతకుమారి(జూలూరుపాడు), ఎం.రఘు(ఇల్లెందు)ను ఎన్నుకున్నారు. నూతన కమిటీని డీఎస్ఓ సంపత్కుమార్ తదితరులు అభినందించారు. -
ప్రజలకు తోడుగా నిలిస్తేనే గుర్తింపు
● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ● ఖమ్మంలో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణఖమ్మంమయూరిసెంటర్: ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించడమే కమ్యూనిస్టు కార్యకర్తకు అసలైన గుర్తింపు అని.. ఆ విషయంలో యర్రా శ్రీకాంత్ ఆదర్శంగా నిలిచారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు కొనియాడారు. ఖమ్మం బోసు బొమ్మ సెంటర్లో ఏర్పాటుచేసిన శ్రీకాంత్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించాక, సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులు ప్రజల మధ్య నీటిలో చేపలా ఉండాలని, శ్రీకాంత్ అదే మార్గం అనుసరించినందునే ఇప్పుడు ఘన నివాళి అర్పిస్తున్నారని చెప్పారు. రాబోయే కేఎంసీ ఎన్నికల్లోనూ ప్రజల పక్షాన నిలబడే వారినే గెలిపించాలని ఆయన కోరారు. కాగా, మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. బూర్జువా పార్టీలు రకరకాల రూపాల్లో ప్రజలను ఆకర్షిస్తాయని, కులమత భావాలను రెచ్చగొట్టి వారి మార్గంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాయని చెప్పారు. ఈమేరకు కమ్యూనిస్టులు ప్రజల్లో ఉంటూ వారిని మేల్కొల్పాలని సూచించారు. సీపీఎం పోరాటాలతోనే పేదలకు పట్టాలు సీపీఎం పోరాట ఫలితంగానే ఖమ్మంలో 6,670 మంది పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోరాటంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కాగా, భూదాన్ భూముల్లో పదేళ్లుగా పేదలు ఉంటుండగా, ఇప్పుడు ఇళ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. తొలుత ఖమ్మం గాంధీచౌక్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా, శ్రీకాంత్ మనవళ్లు ప్రదర్శించిన కర్రసాము ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు మాచర్ల భారతి, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మాదినేని రమేష్, పొన్నం వెంకటేశ్వర్లు, పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, యర్రా రమేష్, యర్రా రంజిత్, చింతలచెరువు కోటేశ్వరరావు, శీలం సత్యనారాయణరెడ్డి, మడుపల్లి గోపాల్రావు, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, శ్రీకాంత్ సతీమణి యర్రా సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్లైన్లకు పైసల్లేవ్!
● వేసవిలో అగ్నిప్రమాదాలతో వనాలకు ముప్పు ● నిధుల్లేక ఫైర్లైన్లు ఏర్పాటు చేయని అధికారులు ● అటవీశాఖ ఫైర్ బ్లో బృందాలతో కొంత మేలుపాల్వంచరూరల్: అటవీ ప్రాంతంలో వేసవిలో అగ్ని ప్రమాదాలు జరకుండా అటవీశాఖ ఫైర్లైన్స్ ఏర్పా టు చేయడంతోపాటు బ్లోయర్లను వినియోగిస్తుంది వేసవి ప్రారంభానికి ముందే ఫైర్లైన్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, క్యాంపా నిధులులేని కారణంగా అటవీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఫైర్లైన్స్ ఏర్పాటుకు ముందుకు రావడంలేదు. వైల్డ్లైఫ్ డివిజన్లో మాత్రం ఇతర నిధులను ఖర్చుచేసి నూతనంగా 50 కిలోమీటర్ల దూరం విస్తీర్ణంలో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్డీఓ బాబు తెలిపారు. 637 చదరపు కిలోమీటర్లలో దట్టమైన అడవి జిల్లాలోని దట్టమైన అడవి 637.34 చదరపు కిలోమీటర్లు, మధ్యస్థాయి 1.502,71 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. 6 డివిజన్లు, 24 రేంజ్లు, 944 బీట్లతో అటవీశాఖ సంరక్షణ చర్యలు చేపడుతోంది. వేసవిలో చెట్ల ఆకులు నేలరాలుతాయి. అడవిలోకి వెళ్లిన వారు బీడీలు, చుట్టలు, సిగరెట్లు కాల్చివేయడం ద్వారా ఎండిన ఆకులకు నిప్పు అంటుకుని అగ్ని ప్రమాదాలు సంభవించి అడవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. వీటి నివారణకు ప్రత్యేక ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల గుర్తింపు జిల్లాలో అధికంగా, తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను అటవీశాఖ గుర్తించింది. గుండాల, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, చర్ల, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 2024–2025 సంవత్సరంలో 122.65 కిలోమీటర్ల మేర ఫైర్లైన్ల విస్తరణకు రూ.19.45 లక్షలు ఖర్చు చేశారు. 2025–2026లో 479 కిలోమీటర్ల ఫైర్లైన్స్ ఏర్పాటుకు రూ.55.60 లక్షలు వ్యయం చేశారు. అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాల నివారణకు ఏటా ఏర్పాటు చేస్తున్న ఫైర్లైన్స్ పనులతో వెయ్యి మంది గిరిజనులకు ఉపాధి లభిస్తోంది. దాదాపు నెలరోజులపాటు పనులు చేపడతారు. కానీ ఈ ఏడాది ఫైర్లైన్స్ ఏర్పాటుకు రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో అటవీ సంరక్షణకు ప్రమాదం ఏర్పడటంతోపాటు గిరిజనులు ఉపాధి కూడా కోల్పోయినట్లయింది. అయితే డివిజన్కు మూడు బృందాల చొప్పున జిల్లాలోని ఆరు డివిజన్లలో 18 ఫైర్ బ్లో బృందాలను అగ్ని ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు సిబ్బంది ఉంటారని అధికారులు తెలిపారు. వేసవికాలంలో అడవులకు నిప్పు అంటుకుని ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు సమాచారం ఇచ్చేందుకు ఏటా అటవీశాఖ బీట్ల వారీగా ఫైర్ వాచర్లను నియమిస్తుంది. నిధుల్లేని కారణంగా ఈ ఏడాది ఫైర్వాచర్లను నియమించలేదు. దీంతో అగ్నిప్రమాదం సంభవిస్తే సమాచారం అందే అవకాశం లేక అటవీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాగా, క్యాంపా పథకం నిధులు లేకపోవడంతో కొత్త స్కీమ్ వస్తే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులు నిరీక్షిస్తున్నారు.జిల్లా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పట్టిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవించే ఐదు ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాం. డివిజన్కు మూడు చొప్పున ఫైర్ బ్లోయర్లను అందించాం. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. –కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి -
పేదల ఇళ్లు కూల్చడం అన్యాయం
ఖమ్మంఅర్బన్: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. కూల్చివేతలు జరిగిన ప్రదేశాన్ని శనివారం సాయంత్రం పరిశీలించగా.. బాధితులు తమ సమస్యను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఏళ్లుగా ఇక్కడే తాత్కాలిక నివాసా లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ ఇళ్లు కట్టుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూల్చివేతతో రోడ్డున పడ్డామన్నారు. అనంతరం విమలక్క మా ట్లాడుతూ.. భూదాన్ భూముల్లో పేదలు ఇళ్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం కూల్చి వేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పేదలకు ఒక నీతి, పెద్దలకు మరో నీతి అమలు చేయడం సరైంది కాదన్నారు. పాలకులు మారినా పేదల పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. బాధితులకు భూదాన్ భూముల్లోనే నివాసాలు ఏర్పాటు చేసేంత వరకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున అండగా నిలిచి పోరాడుతామని పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్భవన్ పునరావాస కేంద్రంలో ఉంటున్న వారిని సైతం విమలక్క పరామర్శించారు. కార్యక్రమంలో స్పర్శ భాస్కర్, న్యాయవాది మేకల సుగుణారావు, అరుణోదయ మల్సూర్, కొమ్ము రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక అధ్యక్షురాలు విమలక్క -
పిచ్చికుక్క స్వైరవిహారం
నేలకొండపల్లి: మండలంలోని ముజ్జుగూడెంలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానికులపైకి దూసుకొచ్చిన కుక్క వారు పరుగులు తీసినా వెంట పడి కరిచింది. ఈ ఘటనలో బి.వెంకటేశ్వర్లు, అక్బర్, బుర్రయ్య, అక్షయ్కుమార్, జాహిద్, ఎస్కే రెహాన్, వీరయ్య, యాదయ్య తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆపై ఆచార్లగూడెం వైపు వెళ్లిన కుక్కను స్థానిక యువత వెంబడించి హతమార్చటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, తీవ్ర గాయాలైన వీరయ్యను ఖమ్మం తరలించారు. ఈమేరకు డీఎంహెచ్ఓ రామారావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, డీఎల్పీఓ తదితరులు ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే, ముజ్జుగూడెం వెళ్లి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని పాలకవర్గాలకు సూచించారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, వైద్యాధికారి మంగళ, సర్పంచ్లు శీలం వెంకటలక్ష్మి, కొలికపొంగు ఉప్పలమ్మ, బొడ్డు వసంత, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు -
గిరిమాల్ట్ పనుల్లో వేగం పెంచండి
భద్రాచలం : భద్రాచలంలో జరుగుతున్న గిరి మాల్ట్ పనులను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పనులు పరిశీలించాక మాట్లాడుతూ.. గిరిజనులు చేసే ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా గిరి బజార్ను గిరి మాల్ట్గా మారుస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి నాటికి గిరిమాల్ట్ ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. గిరిజన మహిళలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ప్రజలకు కల్తీ లేని నిత్యావసరాలు లభ్యమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ మధుకర్, డీఈ హరీష్, టీఏ శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘పది’ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇలెందు/ఇల్లెందురూరల్ : గిరిజన విద్యార్థుల ఉన్నతి కోసం అనేక సంస్కరణలు చేపట్టామని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకుని ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. శనివారం ఆయన ఇల్లెందులోని బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉద్దీపకం వర్క్బుక్లోని అంశాలతో పాటు అక్షరమాల, అధికారుల పేర్లను పిల్లలతో బోర్డుపై రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు ముగిసేంత వరకు పదో తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపించొద్దని ఆదేశించారు. ఉదయం, సాయంత్రం స్టడీ హవర్లు నిర్వహించాలని కోరారు. ఆ తర్వాత మోదుగలగూడెంలో సూరప్ప యాష్ బ్రిక్ యూనిట్ను ప్రారంభించి మాట్లాడారు. రూ. 25 లక్షల వ్యయంతో నెలకొల్పిన ఈ యూనిట్ను గిరిజన మహిళలు కలిసికట్టుగా నిర్వహించి జీవనోపాధి పొందడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ డేవిడ్రాజ్, జేడీఎం హరికృష్ణ, హెచ్ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి పాల్వంచ: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని పీఓ రాహుల్ అన్నారు. శనివారం స్థానిక ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల ప్రాజెక్టులను తిలకించి అభినందించారు. అనంతరం డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓ ఎస్.చంద్రమోహన్, సైన్స్ ఉపాధ్యాయులు డి.రమాదేవి, రామనాధం, అనిత, స్వామి, సోమ్లా పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
● తరలింపులో అటవీ శాఖ ఉద్యోగి హస్తం.? ● స్థానికుల సమాచారంతో వెదురు కలప స్వాధీనం
ఫారెస్ట్ వెదురు ప్రైవేటు నర్సరీలకు! అశ్వారావుపేటరూరల్: అటవీ శాఖ డిపోకు తరలించాల్సిన వెదురు కలపను ఆ శాఖలోని ఓ ఉద్యోగి సహకారంతో పలు ప్రైవేటు నర్సరీలకు తరలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దమ్మపేట ఫారెస్టు రేంజ్ పరిధిలోని అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం బీట్లో ఉన్న ప్లాంటేషన్లో వెదురు బాదులు నరికి డిపోకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం దమ్మపేట ఫారెస్టు డిపోకు తరలించేందుకు లాట్లుగా పేర్చి సిద్ధంగా ఉంచిన వెదురు బాదులను ఓ నర్సరీ యజమాని అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఫారెస్టులోని ఓ కింది స్థాయి ఉద్యోగి సహకారంతో మూడు ట్రాక్టర్లలో తరలించుకుపోయాడు. మండలంలోని నారంవారిగూడెం కాలనీ, అచ్యుతాపురం వద్దగల పామాయిల్ తోటల్లో అక్రమంగా నిల్వ చేశాడు. గుర్తించిన స్థానికులు అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అశ్వారావుపేట, దమ్మపేట ఫారెస్టు రేంజర్లు మురళీకృష్ణ, శ్రీనివాసరావు దాడులు నిర్వహించి వెదురు కలపను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దమ్మపేట ఫారెస్టు రేంజర్ను వివరణ కోరగా.. రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన 12,500 వెదురు బాదులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. లక్షా 50వేల వరకు ఉంటుందని తెలిపారు. విచారణ చేపట్టి, ఉద్యోగుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ
భద్రాచలంటౌన్/ములకలపల్లి: పార్టీలో వలస నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ఏళ్ల తరబడి జెండా మోసిన అసలైన కార్యకర్తలను పక్కనబెడుతున్నారని ఆరోపిస్తూ శనివారం ములకలపల్లి నుంచి భద్రాచలం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీనియర్ నాయకుడు పాలకుర్తి రత్నభూషణం ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు రామయ్యకు, అలాగే అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికై నా పార్టీ అధిష్టా నం స్పందించి నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొలుత ములకలపల్లిలో భక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రమాద స్థలిని పరిశీలించిన ఎస్పీఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల స్టేజీ సమీపంలో ఈనెల 25న జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ రోహిత్రాజు శనివారం పరిశీలించారు. డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ తాటిపాముల సురేష్తో కలిసి ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు, అతని తండ్రి ఆరోగ్య పరిస్థితులను వాకబు చేశారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నేషనల్ హైవే అఽధికారుల సహకారంతో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పెట్రోల్ బంక్ పరిసరాల్లో రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మసీద్ ప్రాంగణంలో ఎగిసిన మంటలుపాల్వంచ: పట్టణంలోని ఇందిరా కాలనీ వద్ద గల మసీద్ ప్రాంగణంలో చెత్తకు గుర్తు తెలి యని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. మసీద్ ప్రాంగణం సుమారు నాలుగైదు ఎకరా ల్లో ఉండటం, అక్కడ చెట్లు, చెత్తా చెదారం భారీ ఎత్తున ఉండటంతో భారీ ఎత్తున మంట లు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మజీద్ కమిటీ సమాచారంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. కేంద్ర స్కాలర్షిప్నకు ఎంపికఅశ్వారావుపేటరూరల్: కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)కు అశ్వారావుపేట జిల్లా పరి షత్ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఎంపికై నట్లు హెచ్ఎం పి.హరిత తెలి పారు. ఈ మేరకు ఆమె శనివారం వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎ.వీరేన్, బి.మణిచందనరాజు స్కాలర్షిప్ పరీక్షలో ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ.12వేల చొప్పున కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుందన్నా రు. ఎంపికై న విద్యార్ధులను ఈ సందర్భంగా హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం వెలుగుమట్ల లో ఇటీవల కూల్చివేసిన ఇళ్లను ఆదివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ పరిశీలించనున్నారు. భూదాన్ భూము ల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో పలువురు గిరిజనులు ఉండగా, వారికి పునరావాసం కల్పించకుండా కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయి లో పరిశీలన, బాధితులను పరామర్శించేందుకు హుస్సేన్నాయక్ వస్తున్నారని నాయకులు తెలిపారు. -
60 ట్రాక్టర్ల ఇసుక సీజ్
మణుగూరుటౌన్: మండల పరిధిలోని కొండాయిగూడెం ప్రాంతంలో అక్రమ ఇసుక నిల్వలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. శనివారం ఆర్ఐ గోపి, జీపీఓ శివకుమార్, మండల సర్వేయర్ నరేష్ తనిఖీలు నిర్వహించి సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. రెండు ఇసుక లారీలు..మణుగూరు టౌన్: రామానుజవరం గ్రామంలోని ఓ ప్రదేశం నుంచి గుట్టుచప్పుడు కాకుండా లారీల్లో ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని శనివారం కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నగేశ్ తెలిపారు. విచారణ జరిపి జేసీబీలను సీజ్ చేయడంతోపాటు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హత్య కేసులో నిందితుడి రిమాండ్ తిరుమలాయపాలెం: మండలంలోని పడమటితండాకు చెందిన రామచంద్రు తన కుమార్తెను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించగా.. హత్య చేసిన బానోతు సాయిని శనివారం కోర్టులో హాజరుపర్చినట్లు కూసుమంచి సీఐ సంజీవ్ తెలిపారు. ఫిబ్రవరి 24న ఈ హత్య జరగగా, నిందితుడు అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు. విచారణ అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచామని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్ఐ కూచిపూడి జగదీశ్ పాల్గొన్నారు. -
వేణుగోపాలుడి కల్యాణానికి వేళాయె..
బూర్గంపాడు: పవిత్ర గోదావరి ఒడ్డున ఇరవెండి గ్రామంలో కొలువుదీరిన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి తిరుకల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయానికి రంగులు వేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కల్యాణం జరుగనుంది. కల్యాణానికి ముందు ధ్వజారోహణం, గరుడముద్ద ల కార్యక్రమం నిర్వహిస్తారు. పిల్లలు లేనివారు గరుడముద్దలు స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి ఆలయానికి ఎదురుగా అష్టభుజాలు కలిగిన సత్తెమ్మతల్లి ఆలయం ఉండగా ఆ తల్లి స్వామివారికి రక్షణగా ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. పూర్వం స్వామివారిని పూజించేందుకు వెండితో చేసిన పూలు వాడేవారని, అందుకే ఈ గ్రామానికి విరివెండిగా, ఆ తర్వాత ఇరవెండిగా పేరొచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను తాళ్లూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు తాళ్లూరి పంచాక్షరయ్య, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్, సర్పంచ్ గుండి బాబూరావు.మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ -
సేవాలాల్ బోధనలు పాటించాలి
ఇల్లెందు: సంత్శ్రీ సేవాలాల్ మహరాజ్ బోధనలు పాటించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. శనివారం సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల ముగింపు సందర్భంగా ఇల్లెందులో ర్యాలీ, సభ, భోగ్ భండారో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో మహరాజ్కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎస్పీ రోహిత్రాజుతో కలిసి ఆయన జ్యోతిప్రజ్వలన చేసిన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ మార్గం మానవాళి పురోభివృద్ధికి దహదపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం మెరుగు పర్చేందుకు సేవాలాల్ కృషి చేశాడని కొనియాడారు. ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ సేవాలాల్ను ఆదర్శంగా తీసుకుని గిరిజనులు అభివృద్ధి వైపు పయనించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ మార్కెట్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, భూక్యా నాగేశ్వరరావు, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సేవాలాల్ సేన నాయకులు ప్రేమ్ చంద్ నాయక్, రాజ్కుమార్, కున్సోత్ రాము, నాగార్జున్, బానోతు శారద, రోజా, బానోతు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
క్రీడాభివృద్ధిలో చెరగని ముద్ర
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా క్రీడారంగ అభివృద్ధిలో కలెక్టర్గా జితేష్ వి.పాటిల్ చెరగని ముద్ర వేశారు. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రోత్సాహం కల్పించారు. నిరుపయోగంగా ఉన్న పాల్వంచ మినీ స్టేడియాన్ని వినియోగంలోకి తెచ్చి, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఇల్లెందులో స్టేడియం నిర్మాణ పనులకు అదనంగా రూ.1.5 కోట్లు కేటాయించారు. కొత్తగూడెంలో రైఫిల్ షూటింగ్ సెంటర్, బాక్సింగ్ రింగ్, తైక్వాండో మ్యాట్స్ ఏర్పాటుకు చొరవ చూపారు. గిరిజన విద్యార్థుల్లో సైక్లింగ్ను ప్రోత్సహించి స్పోర్ట్స్ సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు 15 టేబుల్ టెన్నిస్ బోర్డులు, కబడ్డీ క్రీడకు మూడు సెట్ల మ్యాట్లు సమకూర్చారు. ఫుట్బాల్ క్లబ్లు ఏర్పాటు చేసి క్రీడా సామగ్రిని అందజేశారు. ఎన్జీఓ హైఫై ఫౌండేషన్ సహకారంతో నవభారత్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో బాస్కెట్బాల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శ్రీరామచంద్ర గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో హాక్రీ మైదానం ఏర్పాటుకు తోడ్పాటునందించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ. 71 లక్షలతో క్రీడా సామగ్రి కొనుగోలు చేశారు. రూ. 5కోట్లను అశ్వారావుపేట మినీ స్టేడియానికి కేటాయించారు. క్రీడా కోర్సు ఫీజులను చెల్లించడంతోపాటు ఆర్చరీ, సైక్లింగ్, సాఫ్ట్బాల్ తదితర క్రీడల కోసం అంతర్జాతీయ స్థాయి పరికరాలను తెప్పించారు. కలెక్టర్గా పనిచేసిన జితేష్ వి.పాటిల్ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. క్రీడా శాఖలో గణనీయమైన మార్పులు తెచ్చారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన బదిలీ కావడంతో జిల్లా క్రీడాకారులు, క్రీడా సంఘాల బాధ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. నూతన శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చొరవ చూపారు. కలెక్టర్ ప్రోత్సాహంతోనే జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపి సీఎం కప్లో ఒకేసారి 54 పతకాలు సాధించారు. –పరంధామరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారికలెక్టర్గా క్రీడాకారులకు తోడ్పాటునందించిన జితేష్ వి.పాటిల్ -
‘కొత్తగూడెం–పాల్వంచ’ కార్పొరేషన్గా మార్చాలి
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పేరును కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. కార్పొరేషన్కు కొత్తగూడెం పేరు మాత్రమే ఉందని, పాల్వంచ పేరు చేర్చాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వారి మనోభావాలను గౌరవిస్తూ పేరు మార్చాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పేరు మార్పు కోసం తక్షణమే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని లేఖ -
‘లైన్’ మారుతోంది...
మధిర ఇంజనీరింగ్ సెక్షన్ ఏర్పడి 65ఏళ్లు అవుతోంది. ఇప్పుడు మధిరను విజయవాడ డివిజన్లో కలపాలని తీసుకున్న నిర్ణయం బాధ కలిగిస్తోంది. సొంత రాష్ట్రం వదిలి వెళ్తున్న భావన వస్తోంది. ప్రజలు, ఉద్యోగుల మేలు కోసం మధిరను సికింద్రాబాద్ డివిజన్లోనే కొనసాగించాలి. – మోదుగు సైదులు, రైల్వే ఉద్యోగి, మధిరమధిర: మధిర రైల్వేస్టేషన్ ఇప్పటివరకు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. అయితే, ఈ ప్రాంతాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి విజయవాడ డివిజన్లోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మధిరతో పాటు తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లు ఆ డివిజన్లో విలీనమవుతాయి. ఏపీకి సరిహద్దుగా ఉన్న ఈ స్టేషన్ల ద్వారా నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టికెట్ల అమ్మకాలతోనే మధిర స్టేషన్కు నెలకు సుమారు రూ.30 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు డివిజన్ను మార్చడం ద్వారా కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే కొనసాగుతాయి. ఫలితంగా రైల్వే ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా సికింంద్రాబాద్ బదులు విశాఖపట్నం లేదా విజయవాడ వెళ్లక తప్పని పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. హాల్టింగ్పై ప్రభావం మధిర సహా మూడు స్టేషన్లను సౌత్ కోస్టల్ జోన్లో విలీనం చేయడం ద్వారా మధిర స్టేషన్లో ఆగుతున్న పలు రైళ్ల హాల్టింగ్ ఎత్తివేసే అవకాశం ఉంది. డివిజన్ మార్పులో భాగంగా 533/0 కి.మీ.గా ఉన్న మధిర సెక్షన్ పరిధి 525/0 వరకు తగ్గిపోతుంది. ఫలితంగా మూడు స్టేషన్లు ఏపీలోని విజయవాడ డివిజన్లోకి వెళ్తాయి. మధిర రైల్వేస్టేషన్కు దశాబ్దాల చరిత్ర ఉన్నందున తెలంగాణలోని సికింద్రాబాద్ డివిజన్లోనే కొనసాగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. త్వరలోనే కొత్త జంక్షన్లు భవిష్యత్లో ఎర్రుపాలెం, మోటమర్రి రైల్వే జంక్షన్లుగా అప్గ్రేడ్ కానున్నాయి. ఎర్రుపాలెం నుంచి అమరావతి కి రైల్వేలైన్ నిర్మాణం ఆమోదించడంతో ఎర్రుపాలెం జంక్షన్ అవుతుంది. తద్వారా మధిరలో పలు రైళ్లకు హాల్టింగ్ తొలగించి ఎర్రుపాలెంలో ఇస్తారు. అంతేకాక మోటమర్రి కూడా జంక్షన్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ స్టేషన్కు ప్రాధాన్యత ఇస్తారు. మధిర స్టేషన్కు కొద్ది కి.మీ. దూరంలోనే ఎడమ వైపు ఎర్రుపాలెం, కుడివైపు మోటమర్రి జంక్షన్లు ఏర్పడితే మధిర స్టేషన్ బోసిపోయే అవకాశముంది. ఇక ఇప్పుడు డివిజన్ కూడా మారిస్తే ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యల కోసం నానా పాట్లు పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాక టికెట్ల ద్వారా స్టేషన్కు వస్తున్న రోజువారీ రూ.లక్ష ఆదాయం, వాహనాల పార్కింగ్, స్టాళ్ల టెండర్ల రుసు ము కూడా విజయవాడ డివిజన్కే జమ అవుతుంది. ఇంకొన్ని సమస్యలు మధిర, తొండలగోపవరం, ఎర్రుపాలెం స్టేషన్ల్లను విజయవాడ డివిజన్కు మార్చడం ద్వారా ఉద్యోగుల కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే కొనసాగుతాయి. మధిరలో ఆగాల్సిన రైళ్లలో మార్పులు వచ్చి ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఏదైనా సమస్య వస్తే విజయవాడకు వెళ్లాల్సి వస్తుంది. ఇక మధిర రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణ పనులు కలగానే మిగిలిపోతాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని డివిజన్ మార్చకుండా ఎంపీలు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు, ఉద్యోగులు కోరుతున్నారు.మధిర స్టేషన్లో ఏదైనా రైలుకు హాల్టింగ్ కల్పించాలన్నా, ప్రయాణికులకు సమస్యలు ఎదురైనా స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ దృష్టికి తీసుకెళ్తారు. ఆపై వారు సికింద్రాబాద్ జోన్ రైల్వే జనరల్ మేనేజర్తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కానీ ఇప్పుడు డివిజన్ మారితే ప్రజాప్రతినిధులకు దృష్టికి సమస్యలను తీసుకెళ్తాక వారు నూతనంగా ఏర్పడే విశాఖపట్నం జనరల్ మేనేజర్తో మాట్లాడాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల వినతులపై ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ రైల్వే ఉన్నతాధికారులు కానీ పెద్దగా స్పందించే అవకాశం ఉండదు. ఇప్పటికే పద్మావతి, కరీంనగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే మార్గాన మధిర రైల్వేస్టేషన్లో ఆగుతున్నా తిరుగు ప్రయాణంలో ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం లేదు. ఇలాంటి సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోతాయి. -
ఎన్ఎంఎంఎస్కు నాగుపల్లి విద్యార్థుల ఎంపిక
దమ్మపేట: మండల పరిధిలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)కు అర్హత సాధించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న కందిమళ్ల శ్రీవిద్య, పగడాల నవదుర్గాప్రసాద్, నల్లబోతుల హాసిని గతేడాది నవంబరులో జరిగిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. వీరికి సంవత్సరానికి రూ. 12,000 చొప్పున 12వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందిస్తుందని హెచ్ఎం బజ్జూరి సరళ తెలిపారు. -
పెళ్లికి నెలే.. పనులవుతాయా?
నిర్మాణం పూర్తికాని ప్రసాద్ పథకంలో చేపట్టిన డార్మెటరీ భవనం భద్రాచలంలో ప్రసాద్ పథకం పనులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ విధానంలో 2022, డిసెంబర్ 28న ప్రారంభించారు. నిర్మాణాల కోసం మిథిలా స్టేడియం వెనుక భాగంలో ఉన్న రెండు ఎకరాలను కేటాయించారు. ఇక్కడ జీ ప్లస్ 2 భవనం నిర్మిస్తున్నారు. అన్నప్రసాద మండపం సైతం ఇందులోనే ఉండేలా ప్రణాళిక రూపొందించారు. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024 జూలై 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. పూర్తి కాకపోవడంతో 2024 డిసెంబర్ వరకు, ఆ తర్వాతో మూడోసారి 2025 జూన్ వరకు గడువు పొడిగించారు. అప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో నాలుగో సారి మళ్లీ పొడిగించారు. పనుల గడువు పెంచుతున్నారే తప్ప భవన నిర్మాణం పూర్తి చేయడంలేదు. ఇప్పటివరకు మొదటి ఫ్లోర్ పనులు కూడా పూర్తికాలేదు. వేధిస్తున్న వసతి కష్టాలు ముక్కోటి, శ్రీరామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు భద్రగిరి వస్తారు. ఇటీవల కాలంలో సెలవు రోజుల్లో కూడా భక్తుల రాక పెరిగింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు వసతి దొరకడంలేదు. దేవస్థానానికి చెందిన కాటేజీలు పరిమితంగా ఉండటం, వసతి గదులు తక్కువగా ఉండటంతో ప్రైవేట్ లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా నిర్వాహకులు వారాంతపు రోజుల్లో రెండు వేల నుంచి 5 వేల వరకు అద్దె వసూళ్లు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల భక్తులకు ఆర్థికభారమవుతోంది. కొందరు భక్తులు కరకట్ట, గోదావరి తీరం పాన్పులవుతున్నాయి. ప్రస్తుతం నిత్యాన్నదాన సత్రాన్ని మిథిలా స్టేడియానికి పక్కన ఉన్న ఓ భవనంలో నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే వరద నీరు సత్రాన్ని ముంచెత్తుతుంది. ఆ రోజుల్లో భక్తులకు అన్నదాన ప్రసాద సమస్యలు వస్తున్నాయి. తిరుపతి, షిరిడీ తదితర ప్రాంతాలా తరహాలో ఉదయం, రాత్రి వేళల్లో అన్నదానం నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ప్రసాద్ పథకంలో చేపట్టిన జీప్లస్ 2 భవనం పూర్తయితే కొంత మేర ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. శ్రీరామనవమికి నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో ఈసారి కూడా భక్తులకు వసతి కష్టాలు తప్పవు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, టూరిజం శాఖ అధికారుల అలసత్వంతో పనులు వేగంగా సాగడంలేదు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించాల్సి వస్తుండటంతో ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని అధికారులు అంతర్గతంగా పేర్కొంటున్నారు. ఇక బ్రిడ్జి సమీపంలో చేపట్టిన టూరిజం రెస్టారెంట్ పనులు తుది దశకు చేరాయి. భవన నిర్మాణం పూర్తి కాగా, ప్రస్తుతం పార్కింగ్ పనులు నడుస్తున్నాయి. నాలుగు వైపులా పార్కింగ్, ఇతర పనులను పూర్తి చేస్తే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవమికి రెస్టారెంట్ను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మూడేళ్లుగా సాగుతున్న ప్రసాద్ పథకం పనులు -
భూసార పరీక్షలతో ప్రయోజనం
అశ్వారావుపేటరూరల్: అన్నదాతలు పంటలు సాగు చేసే ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం జమీమా అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లాయిగూడెం గ్రామంలో వ్యవసాయ కళాశాల, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామ సమీపంలోని పొలాల్లో మట్టి నమూనాలు సేకరించారు. గ్రామంలోని వీధులు, పరిసరాల్లో ఉన్న కలుపు, పిచ్చి మొక్కల్ని తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటు కోడి గుడ్ల ఇంకుబేటర్ సెంటర్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ సంగం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసార పరీక్షలు, కార్డుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డాక్టర్ ఝాన్సీరాణి, డాక్టర్ శ్రీజన్, రైతులు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రో క్తంగా జరిపారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాపారావు, రామిరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి సేవలో శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జిశ్రీలంక సుప్రీం కోర్టు జడ్జి ఎస్.సురాజ్ రాజాజీ దంపతులు శుక్రవారం శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. జడ్జి దంపతులకు అర్చకులు స్వాగతం పలకగా, ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. కాగా న్యాయమూర్తి దంపతులు పాల్వంచ సమీపాన గుడిపాడులో పునర్నిర్మించిన శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం జరిగిన ధ్వజస్తంభం, విగ్రహాల ప్రతిష్ఠాపనకు హాజరయ్యారు. శుక్రవారం పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనంచుంచుపల్లి: జిల్లాలోని పలువురు గ్రామపంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం కలిగింది. 317 జీఓ ద్వారా 2022లో భద్రాద్రి కొత్తగూడెం జోన్కు బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇతర జోన్ల నుంచి జిల్లాకు 28 మంది పంచాయతీ కార్యదర్శులు వచ్చారు. తాజాగా 190 జీఓతో వెసులుబాటు కల్పించటంతో వారిలో 19 మందికి డిప్యూటేషన్ అవకాశం వచ్చింది. జిల్లాకు చెందిన 19 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం రిలీవ్ అయ్యారు. వీరందరూ కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో స్థానచలనం పొందారు. పలువురు పంచాయతీ కార్యదర్శులను పాలకవర్గాలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
రైతులు ఆర్థికంగా నష్టపోవొద్దు
అశ్వారావుపేటరూరల్: పొగాకు పంటను సాగు చేసే రైతులు బోర్డు పరిమితులకు లోబడి పంటను సాగు చేయాలని, అధికంగా సాగు చేసి, ఆర్థికంగా నష్టపోవొద్దని పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ సురేంద్ర కుమార్ సూచించారు. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు ఆర్ఎం, అధికారులు, శాస్త్రవేత్తల బృందం శుక్రవారం అశ్వారావుపేట మండలంలో సాగు చేస్తున్న పొగాకు క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఊట్లపల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని తెలిపారు. సాగు మెలుకువలు పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, సీటీఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బయ్య, బోర్డు అధికారులు పాల్గొన్నారు. పొగాకు బోర్డు ఆర్ఎం సురేంద్ర కుమార్ -
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
● మరో నలుగురికి జరిమానా విధింపు అశ్వారావుపేటరూరల్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష, మరో నలుగురికి జరిమానా విధించారు. స్థానిక ఎస్ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేటకు చెందిన కళ్లేపూడి అశోక్, మరో నలుగురు మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కారు. వారిపై కేసులు నమోదు చేసి శుక్రవారం దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి.భవానీరాణి ఎదుట హాజరు పరిచగా.. అశోక్కు ఆరు రోజుల జైలు శిక్ష, మిగిలిన నలుగురికి ఒకొక్కరికీ రూ.10 వేలు చొప్పున మొత్తం జరిమానా విధించినట్లు ఎస్ఐ వెల్లడించారు. చెల్లని చెక్కు కేసులో రెండేళ్ల జైలు ఖమ్మంలీగల్: ఓ వ్యక్తి అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన గొర్రె సతీశ్ వద్ద భద్రాద్రి జిల్లా కొత్త గొల్లగూడెంనకు చెందిన గోసు నాగభూషణం 2019 అక్టోబర్లో రూ.8 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2021 అక్టోబర్లో రూ.9.50లక్షలకు చెక్కు ఇచ్చినా ఆయన ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురయ్యాడు. దీంతో సతీశ్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం నాగభూషణంకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి పరిహారం చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. వ్యక్తికి మూడు రోజుల జైలు ఇల్లెందు: మద్యం సేవించి ఆటో నడిపిన కేసులో ఇల్లెందు పట్టణానికి చెందిన కట్టబోయిన ప్రవీణ్కు ఇల్లెందు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి.ఇందిర మూడు రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. ఇల్లెందుకు చెందిన ప్రవీణ్ మద్యం సేవించి వాహనం నడుపుతూ టేకులపల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. వారు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ దుమ్ముగూడెం: మండలంలోని మారేడుబాక ఎంపీపీఎస్కు చెందిన 8 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేశారు. అందులో 8 మందికి కడుపునొప్పి, వాంతులు కావడంతో హుటాహుటిన నర్సాపురం వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం ఇళ్లకు పంపించారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పరీక్షించగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్ సుభాష్ తెలిపారు. ఏసీబీ తనిఖీలు వైరా: వైరాలోని మత్స్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఉద్యోగుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నాయనే ఫిర్యాదులతో తనిఖీకి వచ్చామని ఏసీబీ డీఎస్పీ రమేష్బాబు తెలిపారు. ఉదయాన్నే చేరుకున్న అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకోవడమే కాక రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగించారు. డీఎస్పీ మాట్లాడుతూ 2022లో మత్స్యశాఖ సొసైటీల నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ అప్పటి ఎఫ్డీఓ బుచ్చి బాబు పట్టుబడ్డాడని, ఆనాటి రికార్డులతో పాటు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వైరా ఎఫ్డీఓ కార్యాలయం కింద 55 సొసైటీలు ఉండగా పర్యవేక్షణ లోపం, రికార్డుల్లో అవకతవకలను గుర్తించామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డు సమీపాన శుక్రవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఏన్కూరుకు చెందిన దుగ్గిరాల కన్నమ్మ(50) గురువా రం అర్ధరాత్రి గార్లఒడ్డు నుండి కాలినడకన ఏన్కూరు వస్తుండగా మార్యమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది, ఘటనాస్థలికి ఎస్ఐ నారబోయిన సంధ్య చేరుకుని వివరాలు సేకరించడమే కాక, కన్నమ్మ కుమారుడు నర్సింహా రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కరెంట్ స్తంభం పైనుంచి పడి వ్యక్తి.. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపల్ పరిధి లోని ముద్దలపల్లి వద్ద కొత్త కరెంట్ స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పడిన భూక్యా మురళి(34) మృతిచెందాడు. తల్లాడ మండలం మల్సూరుతండాకు చెందిన మురళి, అదే గ్రామస్తులు కొందరితో కలిసి మద్దులపల్లి ఏరియాలో కొత్త కరెంట్ స్తంభాలు వేసే పనికి గురువారం వచ్చాడు. ఈమేరకు పైకి ఎక్కిన ఆయన వైర్ లాగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై మురళి భార్య సుప్రియ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఖమ్మం స్టేషన్లో మధిర వాసి.. ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్లో మధిరకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. మధిర మండలం ఖమ్మంపాడుకు చెందిన సామినేని శ్రీనివాసరావు(40) కుటుంబ కలహాలతో మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నాడు. అనారోగ్యం బారిన పడిన ఆయన శుక్రవారం రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద మృతిచెందినట్లు గుర్తించగా, ఆయన భార్య భవానికి సమాచారం ఇచ్చినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించారు. -
ఆయిల్పామ్లో తెల్లదోమ
● ఆకుల రసం పీలుస్తుండడంతో నష్టం ● పైరు ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం ● నివారణ చర్యలపై అధికారుల సూచనలు ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్పామ్ తోటలు ఉన్నాయి. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఈ తోటలతో దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో ఎక్కువమంది రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం 1.20 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుండగా.. ఇటీవల ఆయిల్పామ్ తోటలను తెల్లదోమ ఆశించడం, ఆకులు, పంటపై ఈ తెగులు దాడితో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి తదితర మండలాల్లో ఈ తెల్లదోమ ఉధృతి కనిపిస్తోంది. వాతావరణంలో తేమ పెరగడం, చల్లని వాతావరణం కారణంగా తెల్లదోమ ఆశిస్తోందని ఉద్యాన అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవి మొదలవుతున్న తరుణాన తెల్లదోమ ఆశించటం రైతులను కలవరపరుస్తోంది. తద్వారా పైరు ఎదుగుదల తగ్గడంతో పాటు దిగుబడి పడిపోయే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యాన సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల్లోని ఆయిల్పామ్ తోటల్లో ఖమ్మం జిల్లా ఉద్యానాధికారి ఎంవీ మధుసూదన్ ఇటీవల తెల్లదోమ ఉధృతిని గుర్తించగా, నివారణ చర్యలపై రైతులకు పలు సూచనలు చేశారు. లక్షణాలు ఆయిల్పామ్ మొక్కలపై ఆకుల దిగువ భాగాన తెల్లదోమ నివసిస్తూ రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అంతేకాక ఆకులు ముడుచుకుంటాయి. ఫలితంగా మొక్కల పెరుగుదల తగ్గుతోంది. ఈ తెల్లదోమ తేనె వంటి పదార్థాన్ని విడుదల చేయడం వల్ల ఆకులపై నల్లటి పొర (సూటీ మోల్డ్) ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది. ఇది పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నివారణ చర్యలు పొలంలో కలుపు మొక్కలను తొలగించి శుభ్రత పాటించాలి. పసుపు స్టిక్కీ ట్రాప్లు ఏర్పాటు చేయాలి. తీవ్ర దాడి ఉన్నప్పుడు ఉద్యాన అధికారుల సూచన తీసుకున్నాక ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థియామెథోక్సామ్ 0.25 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, జీవ నియంత్రణ కోసం వేపనూనె 10,000 పీపీఎం 1.5 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాక రైతులు తోటను తరచుగా పరిశీలిస్తూ తెల్ల ఈగ లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అవసరమైతే సూచనల కోసం ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని మధుసూదన్ సూచించారు. -
భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం
భద్రాచలం: శ్రీసీతారామ చంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందిస్తున్నట్లు ఆలయ ఈఓ కె.దామోదర్రావు అన్నారు. గురువారం ఆయన నిత్యాన్నదాన సత్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ప్రసాద నాణ్యత అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం అందిస్తున్నామని ఈఓ తెలిపారు. అమలాపురంలో రామయ్య కల్యాణం ఏపీలోని అమలాపురంలో జరిగిన స్వామి వారి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ధర్మప్రచారంలో భాగంగా అమలాపురానికి ప్రచారరథం ద్వారా వెళ్లిన స్వామి వారికి శోభాయాత్ర నిర్వహించి, కల్యాణాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు జరిపించారు. ఆర్చరీ ఎంపిక పోటీలకు ట్రయల్స్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాస్థాయి ఆర్చరీ మినీ అండర్–15, 13, 10 విభాగాల్లో బాలురు, బాలికల ఎంపికకు ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ బాధ్యులు సాధుల సారంగపాణి, పుట్టా శంకరయ్య తెలిపారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కన్వీనర్లుగా స్పోర్ట్స్ స్కూల్ హెచ్ఎం బి.చందు, పీడీ ఎస్.బాలసుబ్రహ్మణ్యం, క్రీడాకారుల ఎంపిక అనంతరం కోచింగ్ ఇన్చార్జ్లుగా జి.మారప్ప, ఎ.దుర్గయ్య, కె.కళ్యాణ్, పి.నగేశ్ వ్యవహరిస్తారని తెలిపారు. రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్లలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అండర్–10కు 2016, జనవరి 1 తర్వాత, అండర్–13కు 2013 జనవరి 1 తర్వాత, అండర్–15 విభాగానికి 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వారు వివరించారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ కేవీ కృష్ణారావు నియమితులయ్యారు. అలాగే, ఉమ్మడి జిల్లా చైర్మన్గా పుసుపులేటి నాసరయ్యను నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ ఒక ప్రక్రటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు, నాసరయ్య మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కుల సాధనతో పాటు వారి సంక్షేమ అవసరాల కోసం పాటుపడతామని తెలిపారు. రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్కు ఉపాధ్యాయులు కొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ఏటా జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్కు జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వారిలో పాత కొత్తగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి గుంటి అనురాధ, మణుగూరు జెడ్పీహెచ్ఎస్ నుంచి కలం పరమయ్య, రొంపేడు ఏజీహెచ్ఎస్ నుంచి ఎం.పార్వతి ఉన్నారని జిల్లా సైన్స్ అధికారి సంపత్కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో జరిగే సెమినార్లో ప్రసంగించనున్నారు. వీరిని డీఈఓ బి.నాగలక్ష్మి, నాగరాజుశేఖర్, సైదులు, ఎంఈఓలు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆగ్రహం మధిర: మండలంలోని దెందుకూరు జెడ్పీహెచ్ఎస్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రజాప్రతినిధులతోపాటు గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు వారి తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిసింది. ఈమేరకు సమాచారంతో శుక్రవారం సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించగా, అది తన వ్యక్తిగత విషయమని ఉపాధ్యాయుడు బదులిచ్చాడు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ విషయమై హెచ్ఎం రాజకుమారిని వివరణ కోరగా... శనివారం స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయగా, బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. కాగా, ఘటనపై అధికారులు విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
గిరిజన యువతకు శిక్షణతో ఉపాధి
భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత ఐటీడీఏ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని వైటీసీ ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు 60 రోజులపాటు డ్రోన్ సర్వీస్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీపై శిక్షణఇచ్చారు. శిక్షణ పూర్తి కాగా, గురువారం పీఓ తన చాంబర్లో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అధునాతన ట్రెండ్కు తగినట్లుగా డ్రోన్లను వ్యవసాయ రంగంలో సైతం ఉపయోగించొచ్చని సూచించారు. డ్రోన్, డాటా ఎంట్రీ శిక్షణ పొందిన 15 మందికి భువనగిరి ఆరాధ్య ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ఎడిలిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్లోని రైట్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉపాధి అవకాశాలు రాగా, పీఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, సైదులు, రాంబాబు, హరికృష్ణ, గోపీనాథ్, సులోచన, అరుణ, రాహుల్, సమ్మయ్య పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
డిజిటల్ క్రాప్ సర్వేతో పంటల నమోదు
సూపర్బజార్(కొత్తగూడెం): డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) యాప్ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రబీలో సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 396 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వీటిలో 291 గ్రామాలకు డిజిటల్ మ్యాప్లు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ మ్యాప్లు అందుబాటులో ఉన్న చోట వలంటీర్ల ద్వారా డీసీఎస్ యాప్ సహాయంతో పంటల నమోదు చేపడుతున్నారు. మొత్తం బుకింగ్కు అందుబాటులో ఉన్న ఫార్మ్ ఫీల్డ్లు 1,70,105 ఉన్నాయి. విస్తీర్ణం 2,27,714 ఎకరాలుగా ఉంది. డిజిటల్ క్రాప్ సర్వేకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో సాధారణ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తున్నారు. డిజిటల్ మ్యాప్లు లేని గ్రామాలు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, డిజిటల్ సంతకం చేయని ఫీల్డ్స్, భూరికార్డులు అందుబాటులో లేని ప్రాంతాల్లో సాధారణ క్రాప్ బుకింగ్ జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 291 మంది వలంటీర్లను క్రాప్ బుకింగ్ కోసం తాత్కాలిక పద్ధతిన వ్యవసాయ శాఖ నియమించింది. వలంటీర్లు తమకు కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఫీల్డ్ను ప్రత్యక్షంగా పరిశీలించి డిజిటల్ సర్వేను నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వలంటీర్ల ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైతులు తమ ప్రాంతాల్లో వలంటీర్లకు సహకరించి పంటల నమోదు చేయించుకోవాలి. వలంటీర్లకు ప్రతి ఫీల్డ్ క్యాప్చర్కు రూ.7 చొప్పున చెల్లిస్తాం. –బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి -
ఉద్యోగులకు పీఎంఈ పరీక్షలు నిర్వహించాలి
కొత్తగూడెంఅర్బన్: అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణాలను అనుసరించి సింగరేణిలోని ఉద్యోగులకు పీఎంఈ పరీక్షలు నిర్వహించాలని సింగరేణి డైరెక్టర్ (పీపీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. డీజీఎంఎస్ (డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ) సహకారంతో శుక్రవారం రెండో రోజు జోనల్ వర్క్షాప్లో భాగంగా ఓహెచ్ఎస్ వైద్యులకు బొగ్గు గనుల్లో పనిచేసే ఉద్యోగులకు చేసే రేడియోగ్రాఫ్ క్లాసిఫికేషన్పై ఇల్లెందు క్లబ్లో నిర్వహించిన కార్యక్రమం ముగిసింది. సీఎంఓ ఆర్.కిరణ్రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కె.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఉద్యోగులందరికీ పీఎంఈ పరీక్షలు నిర్వహించడమే కాకుండా పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని చెప్పారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వైద్యులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో కౌశిక్సర్కార్, కె.సాయిబాబు, గోపాల్తివారి, ఎం.ఉష, పి.రమేశ్బాబు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
● పీఆర్ డిప్యూటీ కమిషనర్ విద్యాలత చింతకాని: నూతనంగా ఎన్నికై న వార్డుసభ్యులు గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విద్యాలత సూచించారు. మండల పరిఽషత్ కార్యాలయంలో వార్డుసభ్యుల శిక్షణ శిబిరాన్ని గురువారం సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. వార్డుల్లో సమస్యలను గుర్తిస్తూ పరిష్కారంలో వార్డుసభ్యుల పాత్ర కీలకమైందన్నారు. అలాగే, విధులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, ఎంపీఓ పర్వీన్ ఖైసర్ పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఓ వ్యక్తికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రోటరీనగర్కు చెందిన తేజావత్ రవికుమార్ వద్ద పెనుబల్లి మండలం లింగగూడెంకు చెందిన చీకటి వెంకటేశ్వరనాథ్ బెనర్జీ 2019 అక్టోబర్లో రూ.25లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత 2021 ఏప్రిల్లో రూ.27లక్షలకు గాను మూడు చెక్కులు ఇచ్చిన ఆయన ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురయ్యాడు. దీంతో రవికుమార్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం వెంకటేశ్వరనాథ్కు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.27లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. బిల్డర్ అదృశ్యంపై ఫిర్యాదు ఖమ్మం అర్బన్: ఇంటి నుంచి వెళ్లిన ఓ బిల్డర్ తిరిగి రాకపోవడంతో గురువారం ఖమ్మం అర్బన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఖమ్మం విద్యానగర్ కాలనీకి చెందిన కొండపర్తి సురేష్ బిల్డర్గా వ్యవహరిస్తున్నాడు.బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోగా, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన తండ్రి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
నవమి ఏర్పాట్లు షురూ
● భద్రగిరిలో కల్యాణ వేదికకు రంగులు వేస్తున్న కార్మికులు ● 4న సంప్రదాయబద్ధంగా పెండ్లి పనులు ప్రారంభం ● మిథిలా స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● మార్చి 27న శ్రీరామనవమి, 28న పట్టాభిషేకం వేడుకలు భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మార్చి 27, 28వ తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భక్తులకు వసతితోపాటు స్టేడియంలో, ఆలయంలో, పర్ణశాలలో తాత్కాలిక పనులకు టెండర్లు ఖరారు చేశారు. రూ.1.30 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. ఇందులో ప్రధానమైన రంగుల పనులను ప్రారంభించారు. కల్యాణ మండపంలోని షెడ్లతోపాటు కల్యాణ వేదికకు రంగులను అద్దుతున్నారు. మార్చి 3న హోలీ పౌర్ణమి రోజు సంప్రదాయబద్ధంగా స్వామివారి కల్యాణం ప్రారంభించాల్సి ఉంది. ఆ రోజు గ్రహణం కావడంతో 4న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 4నే పసుపు, కుంకుమలను దంచి తలంబ్రాలను కలపే వేడుకతో పెండ్లి పనులు ప్రారంభం కానున్నాయి. హోలీ రంగులతో కల్యాణ రామయ్య దర్శనం ఇవ్వనుండగా, ఆ రోజునే స్వామివారిని పెండ్లి కొడుకుగా చేసే వేడుకగా భావిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్లను సిద్ధం చేస్తున్నారు. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్లకు అందించనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర వీఐపీలకు వీటిని అందిస్తారు. టికెట్లను ఆన్లైన్లో ఉంచాల్సి ఉంది. రూ. 7,500 విలువైన 250 ఉభయదాతల టికెట్లను విక్రయించనున్నారు. ఫాగ్మిస్ట్ను మళ్లీ పెడదాం: కలెక్టర్ జితేష్ భక్తులకు వేసవి తాపాన్ని తీర్చేందుకు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా స్టేడియంలో ఫాగ్మిస్ట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. గురువారం ఆయన బదిలీని ప్రభుత్వం ప్రకటించాక శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ దామోదర్కు, ఏఎస్పీలకు పలు సూచనలు చేశారు. సీఎం, వీఐపీ, ఇతర గ్యాలరీలను పరిశీలించారు. వీఐపీలకు ఇబ్బందుల తలెత్తకుండానే సామాన్య భక్తులు ప్రశాంతంగా కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముందు వరుసలో ఉన్న సీఎం సెక్టార్ను రెండు విభాగాలుగా విభజించి సీఎం, మంత్రులకు ఒక వైపు, మరో వైపు జ్యుడీషియల్ విభాగానికి కేటాయించాలని చెప్పారు. వేదికపైకి అర్చకులు తప్ప, ఇతరులెవరూ వెళ్లకుండా తక్కువ ఎత్తులో శాశ్వత బారికేడ్లను ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈఈ రవీందర్కు సూచించారు. రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షా సమావేశంలో సూచించిన మేరకు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. బదిలీపై వెళ్లిన శ్రీరామనవమి చేసిన అనుభవం ఉండటంతో తన సహకారం, సూచనలు ఉంటాయని సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్టతో అన్నారు. వ్యవసాయరంగం సంతృప్తి నిచ్చింది కలెక్టర్గా పనిచేసిన కాలంలో జిల్లాలో వ్యవసాయం రంగ అభివృద్ధికి చేసిన పనులు తనకు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ‘సాక్షి’తో అన్నారు. భద్రాచలం వచ్చిన ఆయనను సాక్షి పలుకరించగా ఈ విధంగా స్పందించారు. అతి తక్కువ కాలంలోనే జిల్లాలో ఉన్న ప్రకృతి వనరులను, ఎకో టూరిజానికి అనుసంధానం చేస్తూ చేసిన ప్రయత్నాలు చేశామని అన్నారు. ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయటంతోపాటు గోదావరి తల్లికి ప్రవేశపెట్టిన గోదావరి హారతి శాశ్వతంగా నిలిచిపోయేలా భక్తులు ఆదరించాలని కోరారు. -
ఆక్రమణల పేరుతో పేదలకు అన్యాయం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఆక్రమణల కూల్చివేత పేరుతో ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూదాన్ భూముల్లోనే అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయాన పేదలకు ఇళ్ల స్థలాలను ఆశచూపి రూ.50వేలు మొదలు రూ.5లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలన్నారు. కాగా, పేదల నివాసాలను అధికార యంత్రాంగం నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయడం గర్హనీయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నిస్తే, కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించిందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇక్కడే స్థలాలు కేటాయించాలని, అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయంగా ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని రంగారావు కోరారు. అలాగే, నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబం ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు అగ్రకుల దురహంకారంతో రెండేళ్ల పాప మరణానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
గురుకుల బాలికల ప్రతిభ
కారేపల్లి: కారేపల్లిలోని మైనార్టీ గురుకుల బాలికల విద్యాలయం విద్యార్థినులు జాతీయ స్థాయి రబ్బీ క్రీడలో ప్రతిభ చాటారు. ఈనెల 22, 23వ తేదీల్లో తమిళనాడు రాష్ట్రం చైన్నెలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా రబ్బీ పోటీల్లో 9వ తరగతి విద్యార్థినులు కె.సుజాత, ఎం.అక్షిత, బి.కరుణ ప్రతిభ కనబరిచి జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకంగా నిలిచారు. పతకాలతో పాటు రూ.48వేల నగదు ప్రోత్సాహకం అందుకున్న విద్యార్థినులు గురువారం కారేపల్లి చేరుకోగా ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, ప్రిన్సిపాల్ సావిత్రి ఆధ్వర్యాన బస్టాండ్ సెంటర్లో స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా పాఠశాలకు తీసుకెళ్లి సన్మానించారు. పీడీ జారె అనూష, పీఈటీ నాగేంద్రమ్మ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మొర్రేడు వాగులో జేసీబీ సీజ్
పాల్వంచరూరల్: మండల పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధి భోజ్యాతండా సమీపంలో మొర్రేడు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు వినియోగిస్తున్న జేసీబీని గురువారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మొర్రేడు వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ‘మొర్రేడు ఖాళీ’ శీర్షికన గురువారం సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. మొర్రేడువాగులో ఉన్న జేసీబీని స్వాధీనం చేసుకుని, జరిమానా విధిస్తామని తహసీల్దార్ దారా ప్రసాద్ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షటేకులపల్లి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ ఆటో డ్రైవర్కు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. మద్యం తాగి ఆటో నడిపిన కేసులో ఇల్లెందు పట్టణానికి చెందిన కట్టబోయిన ప్రవీణ్కు ఇల్లెందు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి.ఇందిర శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించారు. ఈ మేరకు ఎస్ఐ రాజేందర్ వివరాలు వెల్లడించారు. రూ. 2 లక్షల సొత్తు చోరీచర్ల: మండలంలోని కుదునూరులో గురువారం మధ్యాహ్నం రూ. 2 లక్షల విలువైన సొత్తు చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కాశిమల్ల సుధాకర్ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్.కొత్తగూడెంలోని బ్యాంకు వద్దకు వెళ్లగా భార్య గ్రామంలోని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలకు వెళ్లింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగుల గొట్టి రూ.10 వేల నగదు, రూ 1.50 లక్షల విలువైన 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి పట్టీలను అపహరించుకుపోయారు. సీఐ ఎ.రాజువర్మ కుదునూరుకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి
ఖమ్మంమయూరిసెంటర్: వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారందరికీ ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేసేంత వరకు పునరావాస కేంద్రాలు నిర్వహించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ భవన్లో ఉన్న వెలుగుమట్ల నిర్వాసితులను పరామర్శించారు. అనంతరం వెలుగుమట్ల ప్రాంతంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రతీ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందించాలని, ఇళ్ల కూల్చివేతకు గురైన కుటుంబాలకు ఎటువంటి షరతులు లేకుండా అదే స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శులు దండి సురేష్, నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, వామపక్ష పార్టీల నాయకులు వై.విక్రమ్, శింగు నర్సింహారావు, సీ.వై.పుల్లయ్య, సీహెచ్.శిరోమణి, మేకల శ్రీనివాసరావు, యర్రా శ్రీనివాసరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎంకేవీవైలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
మణుగూరు టౌన్: మండలంలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐలో పీఎంకేవీవై పథకం ద్వారా ఏర్పా టు చేసిన షార్ట్ టర్మ్ కోర్సులలో ప్రవేశానికి విద్యార్థులు, యువత దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి.రవి తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. పీఎంకేవీవై పథకం కింద అసిస్టెంట్ ఎలక్ట్రిషీయన్, మెకానికల్ మెయింటెనెన్స్ కోర్సులలో మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండి, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. మార్చి నెల నుంచి మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆసక్తి,అర్హత కలిగి అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలిఇల్లెందు: విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడంతోపాటు నైతిక విలువలు పాటించాలని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, విద్యా విభాగం జీఎం, సెక్రెటరీ ఎస్.వెంకటాచారి తెలిపారు. గురువారం ఇల్లెందు సింగరేణి హైస్కూల్ 50వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షురాలు వీసం రమా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు, డీజీఎం కరస్పాండెంట్ తుకారం, సిబ్బంది పీవీ నరసింహ, రవీందర్, శ్రీనివాస్, ధనలక్ష్మి పాల్గొన్నారు. మత ప్రచారం అడ్డగింతదమ్మపేట: దమ్మపేటలో గురువారం కొందరు పోలీసుల అనుమతితో మత ప్రచారం నిర్వహిస్తుండగా మరో మతానికి చెందిన యువకులు అడ్డుకుని హంగామా సృష్టించారు. స్థానిక వీధుల్లో గురువారం ఓ మతానికి చెందిన వారు ప్రచారం చేస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణి చేస్తున్నారు. ప్రచారం చేయడాన్ని యువకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్ఐ కిషోర్రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. చట్ట పరిధిలో తాను ప్రచారానికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలిభద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖలో ద్వితీయ శ్రేణి భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఉన్నతీకరించాలని, గిరిజన సంక్షేమ పాఠశాలల, ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుటారి రాజు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట గిరిజన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లను, డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి, టైం స్కేళ్లను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. అన్ని హాస్టళ్లను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేయాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.హరిలాల్, జె.రాంబాబు, బి.ప్రసాదరావు, కె.మాధవరెడ్డి, మునిగడప రామాచారి, ఎం.ప్రతాప్ సింగ్, బి.ప్రకాష్ రావు, బి.రవి బి.వీరన్న, బి.సుందర్, మోహన్ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పనితీరు బాగుంది ● జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ అశ్వారావుపేటరూరల్: పట్టణంలోని చిన్నంశెట్టి బజార్లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ జిల్లా మానిటరింగ్ అధికారి అమృతలూరి నాగరాజశేఖర్ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థుల సామర్థ్యాలు, వర్క్, నోట్ పుస్తకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు సమర్థవంతంగా పని చేస్తున్నారని, గ్రంథాలయ నిర్వహణ తీరు కూడా బాగుందని అభినందించారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఎన్ రిసోర్స్ పర్సన్ శ్రీశైలం, కార్తీక్, ఉపాధ్యాయులు బాబూరావు, కావ్య పాల్గొన్నారు. -
రైతుల ఆందోళనతో గ్రామసభ వాయిదా
ఇల్లెందురూరల్: రైతుల ఆందోళన పెసా గ్రామసభను అధికారులు వాయిదా వేశారు. మండలంలోని సీఎస్పీబస్తీ గ్రామపంచాయతీ కమ్యూనిటీ హాల్లో సర్వే నంబర్ 549 పరిధిలో 151.85 హెక్టార్ల భూమిని సింగరేణి సంస్థకు అప్పగించేందుకు గురువారం పెసా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ జేకే ఓసీ విస్తరణ ప్రాజెక్ట్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. పట్టాలు ఉన్నా, లేకున్నా నిర్వాసితులకు పరిహారం ఇస్తామని గతంలో నిర్వహించిన పెసా గ్రామసభలో అప్పటి ఆర్డీఓ స్వర్ణలత హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సర్వే నంబర్ 549 పరిధిలో సాగులో ఉన్న ప్రతీ రైతుకు పరిహారం ఇవ్వాలని కోరారు. ఎఫ్ఆర్వో చలపతిరావు మాట్లాడుతూ అటవీభూమిలో నిర్వాసితులైన రైతులు తమ భూమి ఆధారాలు అందజేయాలని సూచించారు. తహసీల్దార్ రవికుమార్ కూడా ఇదే విషయాన్ని పేర్కొనడంతో రైతులు నిరసన తెలిపారు. పోడియం వద్దకు వచ్చి దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్నామని, గతంలో తమ వద్ద వసూలు చేసిన శిస్తు రశీదులను, గతంలో తమకు రెవెన్యూ అఽధికారులు జారీ చేసిన పట్టాలను చూపించారు. సదరు భూమి అటవీశాఖకు సంబంధించినదే అయితే నాటి నుంచి అటవీశాఖ అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రశ్నించారు. దీంతో సర్వే నంబర్ 549కి సంబంధించి సరిహద్దులు ఏర్పాటు చేసి, సాగులో ఉన్న భూమి ఏ శాఖ పరిధిలో ఉందో తేల్చేందుకు వారం రోజుల్లో క్షేత్రపర్యటన చేస్తామని తహసీల్దార్ తెలిపారు. దీంతో గ్రామసభను వాయిదా వేశారు. గ్రామసభలో పెసా ఉపాధ్యక్షుడు పినబోయిన వెంకటేశ్వర్లు, ఎంపీవో చిరంజీవి, కార్యదర్శి షర్మిల తదితరులు పాల్గొన్నారు. బిడ్డను లాలిస్తూ సర్పంచ్ లావణ్య గ్రామసభకు తన ఇద్దరు చిన్నపిల్లలతో హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహిస్తూ మధ్యలో ఏడుస్తున్న పిల్లలను లాలించారు. పాలకోసం ఏడుస్తున్న బిడ్డను లాలించి పక్కనే ఉన్న విశ్రాంతి గదిలోకి వెళ్లి చిన్నారి ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. సాగుదారులందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
● మహిళ తండ్రిని హతమార్చిన వ్యక్తి ● ఆపై పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిందితుడు తిరుమలాయపాలెం: ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని వృద్ధుడైన ఆమె తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి ఆయనను కత్తితో పొడిచి హతమార్చడమే కాక పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. తిరుమలాయపాలెం మండలం పడమటితండాలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బోడియాతండాకు చెందిన బానోతు సాయి అత్తగారి ఊరైన పడమటితండాలో 20ఏళ్లుగా మెకానిక్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే గుగులోతు రామచంద్రు(55) పెద్ద కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైనా భర్తను వదిలివేసి ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంట్లో ఉంటోంది. ఆమెతో సాయికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా రామచంద్రు ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం బంధువు ఇంట్లో కార్యానికి వెళ్లగా అక్కడికి సాయి కూడా రావడంతో తన కుమార్తెతో సంబంధంపై నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై సాయి కత్తితో రామచంద్రుపై దాడి చేయడంతో కన్నుమూశాడు. ఆ తర్వాత నిందితుడు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తండాలో ఉద్రిక్తత... పోలీసుల మోహరింపు వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన రామచంద్రును సాయి హతమార్చడంతో పడమటితండాలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని ఆయన బంధువులు అడ్డుకున్నారు. అంతేకాక సాయిని చంపి పగ తీర్చుకుంటామని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. రామచంద్రు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఆయన బంధువులతో జరుపుతున్న చర్చలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. -
నిర్మాణ దశలోనే కూలిన సన్సైడ్లు
అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల గ్రామ పంచాయతీ కట్టంవారిగూడెం గ్రామంలో రూ.11 లక్షలతో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రం భవనం సన్సైడ్లు నిర్మాణదశలోనే కూలిపోయాయి. నాసిరకంగా అంగన్వాడీ భవన నిర్మాణం చేపడుతున్నారని ఈ నెల 26న సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. గురువారం అంగన్వాడీ భవనం సన్సైడ్ కూలిపోయింది. నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.నాసిరకంగా అంగన్వాడీ భవన నిర్మాణం -
ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి
● మేం అధికారంలోకి వచ్చాక ఇక్కడే గృహప్రవేశాలు ● తప్పు చేయకుంటే మంత్రులెందుకు రావడం లేదు ? ● వెలుగుమట్లలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘ఎవరూ అధైర్యపడొద్దు.. ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి.. మీ కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన కాగితాలతో అవసరమైతే సుప్రీంకోర్టుకు పోదాం. అసెంబ్లీ, మండలిలో పోరాడుతాం.. మేం అధికారంలోకి రాగానే మళ్లీ ఇదే వెలుగుమట్లలో ఇళ్లు కట్టించి గృహప్రవేశం చేయిస్తామని కేసీఆర్ చెప్పమన్నారు’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ఖమ్మంఅర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం అంబేద్కర్ భవన్లోని పునరావాస కేంద్రంలో ఉంటున్న వారితో కేటీఆర్ మాట్లాడారు. ఐకమత్యంతో పోరాడండి.. ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నందున ధైర్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. వంద మందికి అక్కడో, ఇక్కడో స్థలాలు ఇస్తాం.. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ లాక్కెళ్లి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారన్నారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, మంత్రులు పిలిచి చిచ్చుపెట్టే ప్రయత్నం చేసినా ఐక్యంగా కొట్లాడి విజయం సాధించాలని సూచించారు. మీకు అండగా ఉంటాం.. ఓపీడీఆర్ బాధ్యులు పట్టాలు ఇప్పించినా వారిని ప్రభుత్వం నానా మాటలు అంటోందని కేటీఆర్ తెలిపారు. బాధితులకు పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ రవిచంద్ర అండగా ఉంటారన్నారు. బుధవారమే తాము రావాలని ప్రయత్నించినా ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. పేదలకు భూములు దక్కేలా అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని, శాసనసభ, మండలిలో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇక్కడి పేదలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పార్టీయే మొత్తం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. మంత్రులు ఇక్కడికి రావాలి.. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులు, కలెక్టర్ ఇక్కడికి రావాలని కేటీఆర్ సూచించారు. ఏ తప్పు జరగకపోతే వారే వచ్చి వివరించొచ్చు కదా అని ప్రశ్నించారు. ఆర్డీఓను ముందు పెట్టి ఇళ్లు కూలగొట్టించాక.. ఇప్పుడు మంత్రులందరూ మంచోళ్లంటూ ఆర్డీఓపై నెపం పెట్టి బదిలీ చేశారన్నారు. మంత్రులకు ధైర్యం ఉంటే, తప్పు చేయకపోతే ఎందుకు రావడం లేదో చెప్పాలని సూచించారు. కన్నీరుమున్నీరైన బాధితులు భూదాన్ భూముల్లో కూల్చివేతల ప్రాంతాన్ని కేటీఆర్ పరిశీలించి పలువురు మహిళలతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా వేలాదిమంది పోలీసులతో వచ్చి బెదిరించి ఖాళీ చేయించారని వారు వాపోయారు. నిలువ నీడ లేక మాడిపోతున్నామని, గూడు లేకపోవడంతో కూలీ పనులకు వెళ్లలేక, పిల్లల చదువు సాగడం లేదని పట్టాలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పార్టీ ఖమ్మం, భ ద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాతా మధుసూదన్, రేగా కాంతారావు, నేతలు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, లింగాల కమల్రాజ్, కూరాకుల నాగభూషణంతో పాటు డాక్టర్ చెరుకు సుధాకర్, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 900 కుటుంబాలు ఉంటున్న స్థలంపై జిల్లాలోని ముగ్గురు మంత్రుల కన్ను పడిందని కేటీఆర్ విమర్శించారు. తమ హయాంలో పేదలకు చెడు చేయకపోగా కరెంట్, నీళ్లు ఇచ్చామని, 400 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమిని కూడా కాపాడి పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం రోజు కేసీఆర్ 4లక్షల మందితో మీటింగ్ పెట్టినా ఎవరికీ హాని జరగలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం చుట్టూ వంద ఎకరాల కొన్నవారు, ఈ స్థలంపై కన్నేసిన వారే మాఫియాగా మారారని ఆగ్రహ ం వ్యక్తం చేశారు. పేదల అవస్థలు చూసి కేసీఆర్ తమను పంపించారని తెలిపారు. -
దర్శన భాగ్యం దక్కేనా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమికి భద్రాచలం వచ్చే భక్తులకు సీతారాముల కల్యాణం కనులారా వీక్షించే అవకాశం కల్పించే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు నవమికి సంబంధించిన ఏర్పాట్లలో వేగం పెంచింది. కల్యాణం చూసేది ఇలా.. వచ్చే నెల 27వ తేదీ శ్రీరామనవమి రోజున భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను భక్తులు స్వయంగా తిలకించేందుకు వీలుగా ఆలయం వెలుపల ఉన్న మిథిలా స్టేడియంలో వివాహ తంతు జరిపిస్తారు. అందులో భాగంగా కల్యాణ మండపం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. సీఎం, మంత్రులు, జ్యుడీషియల్ విభాగానికి ఒక గ్యాలరీ, ఆ తర్వాత సిఫార్సు లేఖలతో వీఐపీలకు మరో గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత సామాన్య భక్తుల కోసం ఉయభదాతలు (ఇద్దరికి కలిపి రూ.7500 టికెట్), రూ. 5,000, రూ. 2,000, రూ.500, రూ.250 చొప్పున టికెట్లు విక్రయిస్తారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని చూసేందుకు వీలుగా వీరందరికీ వేర్వేరు సెక్టార్లు కేటాయిస్తారు. ఈ సెక్టార్లకు ఆవల ఉచితంగా కల్యాణాన్ని తిలకించే అవకాశం భక్తులకు ఉంటుంది. ఆ అడ్డంకులు లేకుండా ఉభయదాతలకు ప్రతీసారి ఎదురువుతున్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం ఎదురుగా నిర్మించిన భారీ షెడ్డు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ షెడ్డు పరిధిలోకి వచ్చే వీవీఐపీ, వీఐపీ, ఉభయదాతల సెక్టార్ల విభజనలో మార్పులు చేసే అవకాశం అధికార యంత్రాంగానికి దక్కింది. సీఎం, ఇతర ప్రముఖులకు సంబంధించిన గ్యాలరీకి మండపం ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించనున్నారు. తర్వాత మిగిలిన ప్రదేశాన్ని అడ్డంగా కాకుండా నిలువుగా రెండు భాగాలుగా విభజించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అందులో ఒకకవైపు వీఐపీ గ్యాలరీ ఉంటే మరో వైపు ఉభయదాతల గ్యాలరీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తద్వార వీవీఐపీ, వీఐపీ వెనుకకాకుండా వారికి సమాంతరంగా కూర్చుని కల్యాణం చూసే అవకాశం ఉయభదాతలకు కలుగుతుంది. టికెట్ కొన్నా.. తప్పని తిప్పలు శ్రీరామనవమి టికెట్లలో అత్యంత ప్రీమియం కేటగిరికి చెందిన ఉభయదాతలే కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక వారి తర్వాత వచ్చే రూ.5,000, రూ.2,000, రూ.500, రూ 250 టికెట్లు కొన్న భక్తుల పరిస్థితి మరీ దారుణం. పేరుకే భద్రాచలం వచ్చినట్టు కానీ, మిథిలా స్టేడియంలో ఏ సెక్టార్లో కూర్చున్నప్పటికీ కల్యాణ మండపంలో సీతారాముల వివాహ వేడుకను సరిగా చూడలేని పరిస్థితి నెలకొంది. మిథిలా స్టేడియంలో నేల సమతలంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు భద్రాచలంలో వేసవి తీవ్రత ఎక్కువ కావడంతో భక్తుల కోసం ఏర్పాటు చేసే చలువ పందిళ్లు దర్శనానికి అడ్డుగా నిలుస్తున్నాయి. మిథిలా మారేదెప్పుడో..? మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం, గ్యాలరీలకు మధ్య విజిబులిటీ (వీక్షణత) సరిగా ఉండదనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ ఈ లోపాన్ని సవరించే ప్రయత్నాలు జరగడం లేదు. ప్రతీసారి సీఎం గ్యాలరీ, వీవీఐపీల గ్యాలరీ ఏర్పాట్లపైనే అఽధికార గణం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ చేతులు దులుపుకుంటోంది. ఈసారి షెడ్డు అందుబాటులోకి రావడంతో ఉభయదాతల టికెట్లు కొన్నవారికి మేలు జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో భద్రాచలం వచ్చే భక్తులందరూ రామయ్య కల్యాణం కనులార చూసేలా మిథిలా స్టేడియంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మండపానికి ఎదురుగా ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత వీవీఐపీ గ్యాలరీలో ప్రజాప్రతినిధులు కూర్చుంటారు. తర్వాత సిఫార్సు లేఖలతో రూ.500 టికెట్తో వీఐపీ పాస్ల గ్యాలరీ ఉంటుంది. దాని తర్వాత స్థలాన్ని రూ.7500 టికెట్లు కొనుగోలు చేసే ఉభయదాతల గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే అత్యంత ఖరీదైన టికెట్ కొనుగోలు చేసినా తమకు దగ్గరి నుంచి కల్యాణం స్పష్టంగా చూసే అవకాశం కలగడం లేదనే అసంతృప్తి ప్రతీసారి ఉభయదాతల టికెట్లు ఉన్న వారి నుంచి వస్తోంది. భద్రాద్రిలో మొదలైన శ్రీరామ నవమి ఏర్పాట్లు -
కలెక్టర్గా అంకిత్ సక్సేనా
● ఉదయం ఉత్తర్వులు, సాయంత్రం బాధ్యతల స్వీకరణ ● టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా బదిలీ అయిన జితేష్ వి పాటిల్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా నూతన కలెక్టర్గా అంకిత్ సక్సేనా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా నియమితులయ్యారు. కాగా, అంకిత్ సక్సేనాకు జితేష్ వి పాటిల్తో పాటు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్.. వేదపండితుల మత్రోచ్ఛరణల నడుమ స్వాగతం పలికారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి 8 – 8.30 గంటల మధ్యలో అంకిత్ సక్సేనా బాధ్యతలు స్వీకరిస్తారని జిల్లా అధికారులకు ముందుగా సమాచారం అందినా.. రెండు గంటల ముందుగానే ఆయన కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్హౌస్కు చేరుకున్నారు. ఆర్డీఓ మధు అక్కడ స్వాగతం పలికి కలెక్టరేట్కు తీసుకొచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో సమావేశమై జిల్లా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే కలెక్టర్ బాధ్యతలు స్వీకరించే విషయం మీడియాకు సమాచారం అందించకపోవడం గమనార్హం. నిజామాబాద్లో అదనపు కలెక్టర్గా.. 2019 తెలంగాణ బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఉత్తరప్రదేశ్ కు చెందిన అంకిత్ సక్సేనా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మొదట ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. తన అకడమిక్ కెరీర్లో టాపర్గా నిలిచారు. ముస్సోరి లోని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పూర్తి చేశారు. తర్వాత వివిధ జిల్లాలో సహాయ కలెక్టర్గా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహించారు. తాజాగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ బదిలీలో భాగంగా జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్గా 2024 జూన్ 15న బాధ్యతలు స్వీకరించిన జితేష్ వి పాటిల్ పరిపాలనలో తనదైన మార్క్ చూపించారు. రైతుబిడ్డగా ఐఏఐస్ స్థాయికి ఎదిగిన ఆయన.. రైతుల పక్షపాతిగా పేరుగాంచారు. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడితో పాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందంటూ అవగాహన కల్పించారు. బయోచార్, మునగ సాగు, కౌజు పిట్టల పెంపకం, మేకపాల ప్రాముఖ్యత, అజోల్లా, మట్టి ఇటుకల వాడకం, యువతకు ఫర్నిచర్ తయారీలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇంకుడుగుంతల నిర్మాణం తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేశారు. పరిపాలనలో పారదర్శకత, జిల్లాలో సుడిగాలి పర్యటనలతో అన్ని వర్గాల వారి ప్రశంసలు అందుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి సంపూర్ణ అభియాన్ అవార్డు, నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు, జల్సంచయ్–జల్ భాగీదారీ అవార్డులు సాధించారు. అయితే ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై మాత్రం కొంత నిర్లక్ష్యం వహించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో గురువారం జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా వెళ్తున్నారు.


