breaking news
Bhadradri
-
అధికారులకు నివేదించాం
ఢిల్లీకి చెందిన ఎన్జీఓ సంస్థ రాష్ట్రీయ మహిళా కోష్ రుణాల రికవరీకి సంబంధించిన సమస్య సీరియస్గా ఉన్న మాట వాస్తవమే. సమస్య తీవ్రతను జిల్లా అధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – సంతోష్కుమార్, సెర్ప్ ఏపీఎం 92 కేజీల గంజాయి స్వాధీనందమ్మపేట: మండలంలోని అచ్యుతాపురం గ్రామ శివారులో ఉన్న పామాయిల్ క్షేత్రంలో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి కథనం ప్రకారం... అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుజ్జుల వెంకటేశ్వరరావుకు దమ్మపేట అర్బన్ కాలనీ శివారులో పామాయిల్ తోట ఉంది. సోమవారం వెంకటేశ్వరరావు తోటకు వెళ్లగా గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి 92 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.46,17,500 ఉంటుందని, ప్యాకెట్లను తోటలో దాచి ఉంచిన ముద్దాయిల కోసం విచారణ చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
‘మహిళా కోష్’తో వణుకు!
● 2006లో ఢిల్లీ ఎన్జీఓ నుంచి రూ. 7 కోట్ల రుణాలు.. ● ఉమ్మడి జిల్లాలో 14 మండలాల్లోని మహిళా సమాఖ్యలకు మంజూరు ● రుణాల రికవరీకి అక్కడి కోర్టు నుంచి తరచూ నోటీసుల జారీ ● తాజాగా మరోసారి నోటీసు రావడంతో మహిళా సమాఖ్యల ఆందోళనచండ్రుగొండ: మహిళా సమాఖ్యల రుణాల రికవరీపై ఢిల్లీకి చెందిన ఎన్జీఓ రాష్ట్రీయ మహిళాకోష్ సీరియస్గా పావులు కదుపుతోంది. తాజాగా మండల సమాఖ్య బాధ్యులకు శుక్రవారం నోటీసలు రావడంతో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో మహిళా సంఘాల్లో వణుకు పుడుతోంది. సెర్ప్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మహిళా సంఘాల సభ్యులు మనోవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2006 ఏడాది రాష్ట్రీయ మహిళాకోష్ సంస్థ 14 మండలాల్లో మహిళా సమాఖ్యలకు రూ. 7 కోట్ల రుణాలను మంజూరు చేసింది. చండ్రుగొండ, కొత్తగూడెం, ములకలపల్లి, దమ్మపేట, సత్తుపల్లి, మధిర, వేంసూరు, బోనకల్, చింతకాని, గార్ల, కామేపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ, తిరుమలాయపాలెం మండలాల్లో ఒక్కో మండలానికి రూ. 50 లక్షల చొప్పున రుణాలను రెండు విడతలుగా ఇచ్చారు. అప్పట్లోనే సదరు నిధుల నుంచి ఒక్కో గ్రామ సమాఖ్యకు రూ. 1.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రుణాలను పంపిణీ చేశారు. 2011 ఏడాది వరకు సక్రమంగానే వాయిదాలు చెల్లించారు. రుణాల నిధుల కేటాయింపు సమయంలో ఎన్జీఓ మండల సమాఖ్య అధ్యక్ష,కార్యదర్శులతోపాటు కోశాధికారిని ఢిల్లీ పిలిపించి వారినే బాధ్యులను చేస్తూ రుణ మొత్తాలను అప్పగించింది. 2011 ఏడాది తర్వాత మండల సమాఖ్యలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఉన్న మండల సమాఖ్య బాధ్యుల స్థానంలో కొత్తవారు ఎన్నికయ్యారు. దీంతోపాటు అప్పటి ఇందిరాక్రాంతి పథం అధికారులు, సిబ్బంది బదిలీపై వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రీయ మహిళాకోష్ రుణాలు వాయిదాల చెల్లింపులను ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఎన్జీఓ అక్కడి మెట్రోపాలిటిన్ కోర్టును ఆశ్రయించింది. 2014 ఏడాది కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు మండల సమాఖ్య మహిళల ఇళ్లకు వచ్చి నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచే కేసు సాగుతూ వచ్చింది. తాజాగా ఢిల్లీకి చెందిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మహిళా సంఘాలకు మరో మారు నోటీసులు జారీ చేశారు. దీంతో సమాఖ్య మహిళలు ఆందోళన చెందుతున్నారు. భారీగా వడ్డీ భారం మహిళా సమాఖ్యలు తీసుకున్న రాష్ట్రీయ మహిళాకోష్ రుణాల వడ్డీ ప్రస్తుతం తడిసి మోపైడెంది. చండ్రుగొండ మండలానికి అప్పట్లో 32 సంఘాలకు రూ. 50 లక్షలు రుణాలు ఇచ్చారు. అందులో 2011 ఏడాది వరకు రూ. 37 లక్షలు తిరిగి చెల్లించారు. అందులో రూ. 13 లక్షల వరకు అసలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వడ్డీతో మొత్తం రూ. 60 లక్షలకు చేరుకుంది. ఇదే పరిస్థితి ఉమ్మడిజిల్లాలోని మిగిలిన 13 మండలాల్లో కూడా నెలకొంది.రికవరీ నిధులు గోల్మాల్ చేశారా? 2011 ఏడాది తర్వాత రికవరీ ఎందుకు ఆగిపోయిందంటే.. ప్రస్తుతం ఉన్న అధికారుల నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. రికవరీ సొమ్మును అప్పటి అధికారులు, సిబ్బంది కాజేశారా ? లేదా గ్రామసమాఖ్యలే కట్టలేదా? అనే విషయం కూడా తేలని పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు కూడా ప్రస్తుతం సెర్ప్ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. -
రామయ్య భూముల్లో అక్రమంగా నిర్మాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన భూముల ఆక్రమ కొనసాగుతోంది. పట్టణ సరిహద్దులోని ఏపీ పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న దేవస్థాన భూముల్లో కొందరు ఆక్రమణదారులు సోమవారం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయ అధికారులు, సిబ్బంది వెళ్లి అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ హైకోర్టు పురుషోత్తపట్నంలోని 889.50 ఎకరాల ఆలయ భూములను దేవస్థానానికి అప్పగించాలని న్యాయస్థానం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, పోలీసు అధికారులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోకో పంటకు ఉద్యాన శాఖ రాయితీసూపర్బజార్(కొత్తగూడెం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కోకో పంటకు కూడా ఉద్యానశాఖ రాయితీ లభిస్తుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగా కిషోర్ తెలి పారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ పంటకు సెమీ షేడ్ అవసరమైనందున ఆయిల్పామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చని సూచించారు. హెక్టార్కు 500 మొక్కలు అవసరమవుతాయ ని తెలిపారు. మొదటి సంవత్సరం హెక్టారుకు రూ.18 వేలు, రెండో సంవత్సరం రూ. 12 వేలు.. మొత్తం రూ.30 వేలు ఉద్యాన శాఖ ద్వారా మంజూరు చేస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అన్నపై తమ్ముడి హత్యాయత్నంటేకులపల్లి: భూవివాదం కారణంగా అన్నపై తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి టేకులపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని మూడు తండాకు చెందిన గుగులోత్ రవి సోమవారం రాత్రి టేకులపల్లి జీపీ ఆఫీసు సెంటర్లోని బేకరీ వద్దకు వెళ్లా డు. ఆయన తమ్ముడు (బాబాయి కొడుకు) గుగులోత్ వినోద్కుమార్ కూడా రావడంతో ఇటీవల విక్రయించిన గుంటన్నర భూమి విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో వినోద్ కత్తితో రవిని బలంగా పొడవగా గాయాలయ్యాయి. ఆపై వినోద్ పారిపోగా, రవిని కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విష యం తెలియడంతో ఎస్ఐ రాజేందర్, సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, అదే సమయంలో వినోద్ భార్య అటు వైపు రాగా స్థానికులు దేహశుద్ధి చేస్తుండడంతో ఎస్ఐ ఆమెను పోలీసుస్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా వినోద్కుమార్ కత్తి తీసుకుని సెంటర్కు వెళ్లి తన స్నేహితులతో రవిని పిలిపించి హత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఇద్దరి మధ్య రూ.2.50లక్షల నగదు వివాదంతో దాడి జరిగిందని ఇంకొందరు చెబుతున్నారు. అదుపుతప్పి లారీ బోల్తాఅశ్వారావుపేటరూరల్: ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సోమవారం అశ్వారావుపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా హాలియా నుంచి కోల్కతాకు బత్తాయి కాయల లోడుతో వెళ్తున్న లారీ వ్యవసాయ కళాశాల వద్ద ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ స్వల్పంగా ధ్వంసం కాగా, దాంట్లో ఉన్న బత్తాయి కాయలు దెబ్బతిన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ హనుమంతులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికు ల కథనం ప్రకారం.. బొజ్జాయిగూడెం గ్రామపంచా యతీ కొల్లాపురం గ్రామానికి చెందిన ప్రణీత్కుమార్ (24), స్నేహితుడు కుంజ జలమయ్య బైక్పై కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో హనుమంతులపాడు గ్రామంలో ఆగి ఉన్న బోర్వెల్ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణీత్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, జలమయ్య చికిత్స పొందుతున్నాడు. చండ్రుగొండలో ఒకరు..చండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం .. మండలంలోని తిప్పనపల్లి తండాకు చెందిన తేజావత్ రమేష్ అలియాస్ గోపి (35) ఆదివారం రాత్రి కిరాణషాపునకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో చండ్రుగొండ నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన గోపిని కొత్తగూడెం చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యఇల్లెందురూరల్: అమ్మ డబ్బులివ్వలేదని క్షణికావేశానికి గురై ఓ యువకుడు పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొల్లాపురం గ్రామానికి చెందిన పూనెం వంశీ (23) అతిగా మద్యం తాగుతున్నాడు. సోమవారం డబ్బుల కోసం తల్లితో ఘర్షణ పడి క్షణికావేశంలో ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దుగినేపల్లి వాసికి డాక్టరేట్
పినపాక: పినపాక మండలంలోని దుగినేపల్లికి చెందిన పంతగాని చందర్రావు సోమవారం వరంగల్లో జరిగిన కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డాక్టరేట్ అందుకున్నారు. ఫిజిక్స్ విభాగంలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక పత్రానికి డాక్టరేట్ ప్రకటించగా, యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ ప్రతాప్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు చందర్రావును అభినందించారు. కాళేశ్వరరావుకు...పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానికి చెందిన మంత్రి సూర్యప్రకాశ్రావు – సువర్ణాదేవి దంపతుల కుమారుడైన కాళేశ్వరరావు అర్ధశాస్త్ర విభాగంలో డాక్టరేట్ సాధించారు. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. భద్రాచలం వాసి మంజులాదేవికి... భద్రాచలంటౌన్: భద్రాచలంకు చెందిన బుడగం మంజులాదేవి ‘సాహిత అకాడమీ అవార్డు విన్నింగ్ నోవెల్స్ – స్టడీ ఆఫ్ సెలెక్ట్ ఇంగ్లిష్ నొవెల్స్‘ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేయూలో సోమవారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకున్నారు. దుమ్ముగూడెం వాసికి బంగారు పతకాలుదుమ్ముగూడెం: దుమ్ముగూడేనికి లంక కనకదుర్గ కేయూ స్నాతకోత్సవంలో చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతు ల మీదుగా మూడు బంగారు పతకాలు అందుకున్నారు. ఎమ్మెస్సీ గణితం పూర్తిచేసిన ఆమె బంగారు పతకాలు అందుకోగా కుటుంబీకులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. -
మళ్లీ మొదటికొచ్చిన నిర్వాసితుడి సమస్య
● ఎమ్మెల్యే చొరవతో గత ఏడాది భూకేటాయింపు.. ● సాగును అడ్డుకున్న సింగరేణి అధికారులుఇల్లెందు: సింగరేణి నిర్వాసితుడు, ఇల్లెందుకు చెందిన సుందర్లాల్ లోథ్ భూ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఏడేళ్ల పాటు ఆయన పోరాడగా గత ఏడాది ఆగస్టులో ఎమ్మెల్యే కోరం కనకయ్య హామీ తో భూమి కేటాయించారు. అయితే, సదరు భూమి లో సాగు పనులను సింగరేణి అధికారులు అడ్డుకోవడంతో మళ్లీ సమస్య మొదలైంది. తాతముత్తాల నుంచి సంక్రమించిన భూమిలో సింగరేణి ఓసీ ఏర్పాటు చేసినా తనకు పరిహారం చెల్లించకపోగా, పని కూడా కల్పించలేదని ఇల్లెందుకు చెందిన సుందర్లాల్ ఏళ్ల తరబడి నిరసన తెలిపారు. ఎడ్లబండిపై ఇసుక తీసుకొచ్చి అమ్ముతూ జీవనం సాగించే ఆయన అదే బండికి బ్యానర్లు కట్టి నిరసన కొనసాగించాడు. మూడేళ్ల క్రితం ఎడ్లబండితో ప్రగతిభవన్కు బయల్దేరగా పోలీసులు అడ్డుకోవడంతో బస్సులో వెళ్లి తన ఆవేదన వివరించారు. ఆపై ఓసారి సెల్ టవర్ ఎక్కడం, మరో మారు సుందర్లాల్ కుమారుడు సంజయ్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆపై 2022 డిసెంబర్లో జీఎం కార్యాలయం వద్ద ఎడ్లబండిని నిలిపి ఎద్దులతో మూత్రం పోయించాడని కేసు పెట్టడంతో జరిమానా విధించారు. చివరకు గత ఏడాది ఆగస్టులో సంజయ్ దేశంలో జీవించే అవకాశం లేదంటూ నేపాల్కు పయనమై మార్గమధ్యలో చిత్రీకరించిన వీడియో వైరల్గా మారింది. దీంతో ఎమ్మెల్యే కనకయ్య ఆయనతో ఫోన్లో మా ట్లాడి వెనక్కి రప్పించారు. ఆపై ఇల్లెందు – కారేపల్లి బైపాస్ రోడ్లో సోలార్ ప్లాంట్ ఎదుట ఆరు ఎకరా ల భూమి చూపించగా అందులో సాగుపనులు మొ దలుపెట్టాడు. కానీ సింగరేణి అధికారులు అక్కడ సాగు చేయొద్దని అడ్డుకోవడంతో చేసేదేం లేక సోమవారం ఇల్లెందులోని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏళ్లనాటి తమ సమస్యకు శాశ్వ త పరిష్కారం చూపించాలని కోరాడు. -
మావోయిస్టులతో అభివృద్ధికి ఆటంకం
కరకగూడెం: అభివృద్ధికి ఆటంకం మావోయిస్టులేనని జిల్లా అడిషనల్ ఎస్పీ నరేందర్ పేర్కొన్నారు. మండలంలోని రేగళ్ల గొత్తికోయ గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావో యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ లకు పోలీస్శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మా వోయిస్టులకు సహకరించొద్దని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అనంతరం చిన్న పిల్లలకు పలకలు, పుస్తకాలు, మహిళలకు నిత్యావసర వస్తువులు, యువతకు వాలీబాల్ కిట్లు అందజేశారు. పొలం పనులకు వెళ్లే మహిళలకు ప్లాస్టిక్ రైన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పీవీఎన్.రావు పాల్గొన్నారు. -
విద్యుత్ కోతలపై ఆందోళన
జూలూరుపాడు: అప్రకటిత విద్యుత్ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భేతాళపాడు గ్రామస్తులు జూలూ రుపాడు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో నరకయాతన పడుతున్నామని అన్నారు. రాత్రి వేళలో ఏ కొద్దిపాటి వర్షం కురిసినా కరెంట్ పోతుందని పేర్కొన్నారు. విద్యుత్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శ్రీధర్, మండల కార్యదర్శి యాసా నరేష్లు సంఘీభావం తెలి పారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని జూలూరుపాడు విద్యుత్శాఖ ఇన్చార్జి ఏఈ నరసింహారావు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డిబోయిన గోవిందు, శ్రీను, చలమల నరసింహారావు, రెడ్డిబోయిన నవీన్, చౌడం సాయికుమార్, ధరావత్ బాల కిషన్, నాగభూషణం, గుగులోత్ భాస్కర్, బానోత్ సుగుణరావు, వెంకటేష్, రేగళ్ల సీతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పర్ణశాలలో అభివృద్ధి పనులు
● ప్రసాద్ పథకంలో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ● కొనసాగుతున్న కాటేజీ, బయో టాయిలెట్ల నిర్మాణందుమ్ముగూడెం: భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం అనుబంధ ఆలయం పర్ణశాలకు ప్రసాద్ పథకంతో మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్(ప్రసాద్) పథకం కింద పర్ణశాల రామాలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. దీంతో కాటేజీల నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం స్లాబ్ లెవల్ వరకు పూర్తయింది. నార చీరల ప్రాంతం వద్ద బయో టాయిలెట్లు నిర్మిస్తున్నారు. ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి భద్రాచలం ప్రధాన ఆలయానికి అనుసంధానం చేశారు. పనులు పూర్తయితే పర్ణశాల ఆలయంతోపాటు గ్రామ రూపురేఖలు సైతం మారనున్నాయి. రూ.4 కోట్లు కేటాయింపు పర్ణశాల అభివృద్ధికి గతంలో కేటాయించిన నిధులతో నిర్మాణ పనులు జరుగుతుండగా భద్రాచలం ఆలయానికి కేటాయించిన నిధుల్లో మిగిలిన మరో రూ.4 కోట్లను పర్ణశాలకు మళ్లించారు. ఆ నిధులతో ఓపెన్ షెడ్ నిర్మాణం, ఆలయ ఆవరణలో గ్రానైట్ రాయితో ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. భక్తులు వేచి ఉండేందుకు, భవిష్యత్లో ఏర్పాటు చేయబోయే అన్నదానం కార్యక్రమానికి అనువుగా మరో రెండు షెడ్లను నిర్మించనున్నారు. గ్రామం చుట్టూ హైమా స్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. శ్రీ సీతా రామలక్ష్మణులు 14 ఏళ్లపాటు పంచవటీ కుటీరం ఏర్పాటు చేసుకుని వనవాసం చేసిన పుణ్యస్థలం పర్ణశాలలో అభివృద్ధిపనులు సాగుతుడటంతో భక్తు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ సజావుగా పూర్తయితే భక్తుల రద్దీ, ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశంఉంది. వ్యాపారం పెరుగుతుంది.. పర్ణశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయితే భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో వ్యాపారాలు సైతం మంచిగా సాగుతాయి. భక్తులు రాత్రి పూట సేద తీరేలా ఉండేందుకు కూడా నిర్మాణాలు చేపట్టాలి. –గోసంగి నరసింహారావు, పర్ణశాల గ్రామస్తుడు -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పులికాదు.. తోడేలు !పాదముద్రలు సేకరించిన అటవీ అధికారులు పాల్వంచరూరల్ : పాండురంగాపురం – నర్సంపేట పరిసరాల్లో పెద్దపులి సంచారం ఉదంతం వైరల్ కావడంతో పాల్వంచ అటవీ శాఖ రేంజర్ సురేష్, డీఆర్ఓ సిబ్బందితో కలిసి సోమవారం పాండురంగాపురం నుంచి ఉప్పుసాక మార్గంలో పరిశీలించారు. అక్కడ లభించిన పాదముద్రలు నక్క లేదా తోడేలుకు సంబంధించినవని గుర్తించారు. పులి పాదముద్ర అయితే 10 సెం.మీ.వెడల్పు, 14 సెం.మీ. పొడవు ఉంటుందని, ఇక్కడున్న పాదముద్రలు 6 సెం.మీ. వెడల్పు, 7 సెం.మీ.పొడవు మాత్రమే ఉన్నాయని వివరించారు. పరిసర ప్రాంత రైతులు, ప్రజలు కూడా పులి ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారని, పులి సంచారం ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని రేంజర్ సూచించారు. మహిళలంతా ఎస్హెచ్జీలో సభ్యులుగా ఉండాలిడీఆర్డీఓ విద్యాచందన చుంచుపల్లి: జిల్లాలోని ప్రతీ మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలని, అవసరమైతే కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని డీఆర్డీఓ ఎం.విద్యాచందన సెర్ప్ సిబ్బందికి సూచించారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్త సంఘాల్లో బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి, 2025 – 26 భవిష్యత్ ప్రణాళికను వివరించారు. బ్యాంకు లింకేజీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 101 శాతం ప్రగతి సాధించామని, ఈ ఏడాదిలో 100 శాతం ప్రగతి సాధించాలని అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాలను ప్రతీ మహిళ వినియోగించుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు స్కూల్ యూనిఫామ్ తయారీ చార్జీలు మొత్తం రూ. 97,98,058 మంజూరయ్యాయని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు జిల్లాలో 9 బస్సులు కేటాయించామని, ఒక్కో బస్సును రూ.36 లక్షల చొప్పున మండల సమాఖ్య ద్వారా కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చామని తెలిపారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓ (సెర్ప్) నీలేష్ పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ఎప్సెట్ కౌన్సెలింగ్ ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో గత వారం రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఈ కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ చందా సుధాకర్ తెలిపారు. కాగా, సోమవారం 800 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 760మంది హాజరయ్యారని వెల్లడించారు. -
కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్ !
● ఇంటర్ విద్యార్థులకు నేటికీ అందని వైనం ● పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్న బాలికలు ● విద్యాశాఖ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలుకరకగూడెం: గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల బాలికలకు విద్యనందించడంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు బోధన సాగుతోంది. ఇంటర్ బోర్డు నిర్దేశించిన సిలబస్ను అనుసరించి తెలుగు అకాడమీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా ప్రచురితమైన పుస్తకాలను ఇక్కడ బోధిస్తుండగా ఇవి ఇంగ్లిష్ మీడియంలో ఉంటాయి. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇంటర్ విద్యార్థినులకు ఇప్పటికీ కొత్త పాఠ్యపుస్తకాలు అందలేదు. దీంతో పాత పుస్తకాలతో చదువు కొనసాగిస్తున్నారు. జిల్లాలో పాల్వంచ, టేకులపల్లి, బూర్గంపాడు, గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, ములకలపల్లి, చండ్రుగొండ, భద్రాచలం, దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, చర్ల, పినపాక మండలాల్లో మొత్తం 14 కేజీబీవీలు ఉండగా 1,310 మంది ఇంటర్ విద్యనభ్యసిస్తున్నారు. పేద విద్యార్థినులపై నిర్లక్ష్యమా.. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా కేజీబీవీల్లో ఇంటర్ పుస్తకాలు సరఫరా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రణాళిక, సమన్వయ లోపంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో నిరుపేద విద్యార్థినులే ఎక్కువగా చేరుతుంటారని, వారి భవిష్యత్తో ప్రభుత్వం ఆడుకోవద్దని కోరుతున్నారు. త్వరలోనే అందజేస్తాం.. కస్తూర్బా విద్యార్థినిలకు పుస్తకాల సరఫరాలో జాప్యం జరి గింది నిజమే. సాంకేతిక కారణాలు, ప్రింటింగ్ ప్రక్రియలో ఆలస్యమైంది. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. త్వరలోనే అన్ని కస్తూర్బా విద్యాలయాలకు పుస్తకాలను అందజేస్తాం. ప్రస్తుతం వారి అభ్యసనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నాం. – అన్నామణి, జీసీడీఓ పుస్తకాలు లేక అర్థం కావడం లేదు పుస్తకాలు లేకపోవడంతో లెక్చరర్లు చెప్పే పాఠాలు సరిగా అర్థం కావడం లేదు. పాఠం చెప్పాక తిరిగి చదువుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి కష్టంగా ఉంది. పాత పుస్తకాలు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. త్వరగా కొత్త పుస్తకాలు ఇవ్వాలి. – ఎం.లావణ్య, ఇంటర్ ఫస్టియర్, కేజీబీవీ భట్టుపల్లి అభ్యసనంపై ప్రభావం.. కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యార్థినులకు పుస్తకాలు అందకపోవడంతో అభ్యసనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాఠాలను అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలు వినడం తప్ప వాటిని తిరిగి సాధన చేయలేకపోతున్నామని బాలికలు అంటున్నారు. కొత్త పుస్తకాలు రాకపోవడంతో గతేడాది చదివిన విద్యార్థినుల పాత పుస్తకాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని, ప్రభుత్వమే త్వరగా పుస్తకాలు పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి
భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని అన్నారు. మత్స్య సొసైటీల ఏర్పాటు, ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాలు, పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, పోడు పట్టాల్లో పేర్ల మార్పు తదితర అంశాలపై పలువురు దరఖాస్తులు సమర్పించారని వివరించారు. గిరిజన దర్బార్లో వచ్చిన ఆర్జీలన్నీ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికీ విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఆర్సీఓ అరుణ కుమారి, ఉద్యానవనాధికారి ఉదయ్కుమార్, ఈఈ హరీష్, రాజారావు, ఆదినారాయణ, చంద్రకళ, భార్గవి, చలపతి, రామ్ కుమార్, మోహన్, స్వాతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
విద్యుదుత్పత్తిపై ముందస్తు ప్రణాళిక ఉండాలి
పాల్వంచ: విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని టీజీ జెన్కో డైరెక్టర్(థర్మల్) వై.రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.లక్ష్మణ్, జనరేషన్ సీఈ పి.రత్నాకర్తో కలిసి కోల్ ప్లాంట్, వ్యాగన్ టిప్లర్, బీఓబీఆర్లో పర్యటించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో ఇంజనీర్లకు బదిలీ పాలసీ రూపొందించాలని పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ల నాయకులు డైరెక్టర్లు రాజశేఖర్రెడ్డి, లక్ష్మయ్యకు వినతిపత్రం అందించారు. ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులు భర్తీ చేయాలని, కేటీపీఎస్లో నూతన కర్మాగారం, క్వార్టర్లు నిర్మించాలని, పింఛన్ పాలసీ అమలు చేయడంతో పాటు పీఎల్ఎఫ్ పాలసీ అలవెన్స్ మంజూరు చేయాలని నాయకులు ఉమామహేశ్వరరావు, సంపత్, రాజేష్, రాజబాబు, చంద్రకళాధర్, అరుణ్, నరేందర్, రామారావు, కృష్ణ, అక్బర్, వెంకట్రావు తదితరులు కోరారు. జెన్కో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి -
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాలు ఉండడంతో కలెక్టర్తో పాటు కొందరు జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి హాజరు కాలేదు. ఇక మోహర్రం పండుగ, వ్యవసాయ సీజన్ కావడంతో ఫిర్యాదుదారులు కూడా అంతంతమాత్రంగానే వచ్చారు. -
‘మారెళ్లపాడు’ పనుల్లో వేగం పెంచాలి
అశ్వాపురం/భద్రాచలంఅర్బన్/చుంచుపల్లి : సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ‘నేను వచ్చేదాకా పనులపై పర్యవేక్షణ చేయరా.. అంత సమయం లేదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయాలని ఏడాది క్రితమే చెప్పినా.. ఇంతవరకూ ప్రారంభించలేదని మండిపడ్డారు. ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు సోమవారం వచ్చిన తుమ్మల.. నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్పాటిల్తో ఫోన్లో మాట్లాడారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేలా నిర్మాణ సంస్థను ఆదేశించాలన్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ–1లో భాగంగా మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మలచెరువుకు నీరందించి 16 వేల ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మొదట పినపాక, ఆ తర్వాత కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, ప్రధాన కాల్వ పనులు పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు సాగుతున్నాయని వివరించారు. రామాలయ అభివృద్ధి నా చిరకాల వాంఛ.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి తన చిరకాల వాంఛ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో రూ.1.15 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంటల్ర్ లైటింగ్, డివైడర్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. మాడ వీధుల విస్తరణకు ఇళ్లు తొలగించిన ప్రదేశాన్ని పరిశీలించాక మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి భూసేకరణ ముఖ్యమని తెలియగానే.. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.33 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఆగమశాస్త్ర పండితుల సూచనల ఆధారంగా పనులు జరుగుతాయన్నారు. జీవజాతులకు ఉపయోగపడే మొక్కలు నాటాలి.. మనుషులతో పాటు పక్షులు, కోతుల వంటి జీవజాతులకు ఉపయోగపడేలా పండ్ల మొక్కలు విరివిగా నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోల్పోయిన అటవీ సంపద పునరుద్ధరణకు వనమహోత్సవం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. వాతావరణ సమతుల్యత పరిరక్షణకు మొక్కలు నాటడమే ముఖ్యమని చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అన్ని రవాణా మార్గాలకు కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, ఎస్పీ రోహిత్రాజు, నీటిపారుదల శాఖ ఎస్ఈలు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏడాది దాటినా ఎందుకు ప్రారంభించలేదు.. అధికారుల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం భద్రాద్రి ఆలయ అభివృద్ధే లక్ష్యమని స్పష్టీకరణ అటవీ సంపద పునరుద్ధరణకు కృషి చేయాలని పిలుపుమంత్రి రాకతో హడావిడి .. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు మంత్రి తుమ్మల సోమవారం రావడంతో అధికారులు హడావిడిగా ఆదివారం పనులు ప్రారంభించారు. శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు గడిచినా ఎర్త్వర్క్, బ్లాస్టింగ్ పనులు మాత్రమే చేపట్టారు. పంప్హౌస్ నిర్మాణ ప్రధాన పనులు మొదలే కాకపోవడం గమనార్హం. పొదెం వీరయ్యకు ఆహ్వానమేదీ ?మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించిన వనమహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యను అటవీ శాఖ అధికారులు విస్మరించారు. కార్యక్రమానికి ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ప్లెక్సీలో సైతం కనీసం ప్రొటోకాల్ ప్రకారమైనా ఆయనతో పాటు ఎంపీ రఘురాంరెడ్డి ఫొటో పెట్టకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. -
పరిశ్రమల ఊసేది?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాడ జిల్లాలో అంతంతగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో గర్వంగా చెప్పుకున్న నూతన పారిశ్రామిక విధానం – టీఎస్ ఐ పాస్ ద్వారా లేదంటే ప్రస్తుత ‘ప్రజాపాలన’లో కానీ జిల్లాకు చెప్పుకోదగ్గ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రాలేదు. అప్పట్లో హడావిడి.. ప్రతీ నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని గత ప్రభుత్వ హయాంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో అవసరమైన ప్రభుత్వ స్థలాలు లేవని తేల్చేశారు. మిగిలిన మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇల్లెందు మండలం లచ్చగూడెం, అశ్వాపురం మండలం గొందిగూడెం, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. కానీ ఆ తర్వాత ఈ అంశంలో అడుగు ముందుకు పడలేదు. దీనిపై రాజకీయ నాయకుల నుంచి చొరవ లేకపోవడం, జిల్లా అధికారుల వైపున క్రియాశీలత లోపించడంతో కొత్త పరిశ్రమల స్థాపన ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా మారింది. ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా అనువైన స్థలాలు, బ్యాంకు రుణాలు లేవంటూ కాలం గడుపుతున్నారు. రుణాలు వచ్చేది ఎలా? సారపాక ఐటీసీ, పేపర్ పరిశ్రమ నుంచి వెలువడే కలప గుజ్జు ఆధారంగా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ(1/70 పరిధిలో లేదు)లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అనేకం వెలిశాయి. ఇదే తరహాలో సింగరేణి, థర్మల్ పవర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలకు అనుబంధంగా మధ్య, చిన్న, కుటీర తరహా పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే అవకాశముంది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించే వీలుంది. అయితే జిల్లాలో అత్యధిక ప్రాంతం 1/70 చట్టం పరిధిలో ఉండడంతో పరిశ్రమల స్థాపన అవసరమయ్యే మూలధనం సమకూర్చుకునే విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రుణాల మంజూరుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. గిరిజన ప్రణాళిక కావాలి.. ఏజెన్సీ జిల్లాలో పరిస్థితులు, వెనుకబాటుతనంతో పాటు ఇక్కడ అమల్లో ఉండే చట్టాలను అనుసరించి పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరముంది. జిల్లాలో ఉన్న సహజ వనరులు, ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పరిశ్రమలు, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్ట్యా ఇక్కడ ఏ పరిశ్రమలు స్థాపించవచ్చనే అంశంపై రోడ్మ్యాప్ సిద్ధం చేయాలి. అలాగే నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చేందుకు ఐటీడీఏతో పాటు గిరిజన సంక్షేమ శాఖలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఇవేమీ లేకుండా మైదాన ప్రాంతాలకు అన్వయించే విధానాలనే వెనుకబాటు తనం, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం ఉండే ఏజెన్సీ ప్రాంతంలో కూడా అమలు చేయడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఇలా చేయడం వల్లే జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కనీస స్థాయిలో కూడా లేకుండా పోయాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జాడలేని చిన్న, మధ్య తరహా ఫ్యాక్టరీలు మైదాన ప్రాంతాల్లో ఏర్పాటుకు స్థలాలు కరువు ఏజెన్సీ ఏరియాలో అందని బ్యాంకు రుణాలు జిల్లాలో మందకొడిగా పారిశ్రామిక పురోగతి నిరుపయోగంగా స్థలాలు.. కొత్తగూడెం నగర నడిబొడ్డున వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ గతంలో అనేక మంది లీజుకు తీసుకున్నారు. కొందరు తూతూ మంత్రంగా యూనిట్లు స్థాపించి ఆ తర్వాత మూలన పడేశారు. ఇక జిల్లా కేంద్రం పరిధిలోని రామవరంలో బేరియం ఫ్యాక్టరీ స్థలం నిరుపయోగంగా మారి దట్టమైన అడవిని తలపిస్తోంది. పరిశ్రమల కోసం పక్కన పెట్టి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూముల లెక్క తీస్తే జిల్లా కేంద్రంలోనే కొత్త పరిశ్రమలకు అవసరమైనంత స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇక్కడైతే బ్యాంకు రుణాలకు ఇబ్బంది ఉండదు. అయితే ఈ అంశాన్ని కనీసం పట్టించుకునే వారు లేరు. -
ఉన్నత చదువులకు ‘ఓపెన్’
● పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశం ● ఈనెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 56 స్టడీ సెంటర్లుఖమ్మంసహకారనగర్: ఓపెన్ స్కూల్ అనేది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఓ వరం లాంటిది. వివిధ కారణాలతో విద్యను అభ్యసించలేకపోయిన వారు, చదువును మధ్యలోనే నిలిపివేసిన వారు, తమ వయసుతో సంబంధం లేకుండా మళ్లీ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదవకాశాన్ని ఇచ్చింది. ఓపెన్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యను అందిస్తారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ఈ ఓపెన్స్కూల్స్లో చేరేందుకు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2008వ విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధా నం ప్రారంభం కాగా.. అప్పటి నుంచే పదో తరగతి ప్రారంభించారు. 2010–11వ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ను ప్రారంభించారు. 56 కేంద్రాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 56 ఓపెన్ స్కూల్ కేంద్రాలుండగా... అందులో ఖమ్మం జిల్లాలో 25 సెంటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 31 కేంద్రాలున్నాయి. చిన్నప్పటి నుంచి చదువుకోకపోయినా సరే నేరుగా పదో తరగతిలో చేరే అవకాశం వీటి ద్వారా కలుగుతుంది. వయోజనులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తాము ఉన్నత విద్యావంతులుగా మారేందుకు కృషి చేసుకోవచ్చు. అర్హతలిలా... పదో తరగతిలో చేరాలనుకునే వారికి 31–08–2025 నాటికి 14 సంవత్సరాలు నఉండాలి. ఇంట ర్మీడియట్లో చేరేందుకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. చదివిన తరగతులకు సంబంధించిన టీసీ, బోనఫైడ్ జత చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారు మాత్రం తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 11 వరకు గడువు.. ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందాలనుకునే ఈ నెల11వ తేదీ వరకు దరఖాస్తులు అధ్యయన కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా అపరాధ రుసుం పదో తరగతికి రూ.100, ఇంటర్మీడియట్కు రూ.200లతో ఆగస్టు(వచ్చే నెల) 12వ తేదీ వరకు మీ సేవా, ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు పదో తరగతికి జనరల్ పురుషులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీలు, మహిళలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్మీడియట్కు జనరల్ పురుషులకు రూ.1,800, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దివ్యాంగులకు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి అడ్మిషన్ పొందేందుకు గాను వయస్సు ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీని తెలిపే ఏదైనా పాఠశాల రికార్డు షీట్/టీసీ లేదా మున్సిపల్ అధికారి/ తహసీల్దార్/జిల్లా జన న మరణ రిజిస్ట్రార్ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువపత్రం సమర్పించాలి. వచ్చే నెల 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉన్న వారు తమ ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు తీసుకెళ్లాలి. అలాగే ఇంటర్లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ అదనంగా సమర్పించాల్సి ఉంటుంది. కొత్త కేంద్రాలివే... ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి ఆసక్తి పెరుగుతున్న క్రమంలో జిల్లాలో కొత్తగా జెడ్పీహెచ్ఎస్ రఘునాథపాలెం, జెడ్పీహెచ్ఎస్ ఏదులాపురం, జీహెచ్ఎస్ నేలకొండపల్లి, జెడ్పీహెచ్ఎస్ తల్లాడలలో అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ కరకగూడెం, అశ్వాపురం మండలం జెడ్పీహెచ్ఎస్ మిట్టగూడెం, జెడ్పీహెచ్ఎస్ ఆళ్లపల్లి, జీహెచ్ఎస్ టేకులపల్లి, జెడ్పీహెచ్ఎస్ చండ్రుగొండ, జెడ్పీహెచ్ఎస్ ఎర్రగుంట (అన్నపురెడ్డి మండలం), జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీదేవిపల్లిలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. సద్వినియోగం చేసుకోవాలి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఓపెన్ స్కూల్ ఒక మంచి అవకాశం. చదువులు మధ్యలో ఆపేసిన వారు, చదవాలనుకునే వారు ఇందులో అడ్మిషన్ పొందొచ్చు. పది, ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారు ఈ నెల 11 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. – సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం ఉన్నత విద్యకు దోహదం ఓపెన్ స్కూల్లో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారున్నారు. అభ్యర్థుల ఆసక్తి మేరకు ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో కొత్తగా 11 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అధ్యయన కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. – మద్దినేని పాపారావు, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గత మూడేళ్లలో అడ్మిషన్లు, ఫలితాలిలా.. ఖమ్మం జిల్లా సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఇంటర్మీడియట్ ఫలితాల శాతం 2022–23 770 26.3 995 48.53 2023–24 789 40.44 881 44.71 2024–25 607 40.44 797 57.93 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2022–23 671 23.66 856 40.48 2023–24 623 32.28 788 50.97 2024–25 538 31.04 728 51.19 -
కవిత్వంతో సామాజిక చైతన్యం
కొత్తగూడెంఅర్బన్: కవులు తమ కవిత్వంతో సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం రగిలిస్తారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత, ప్రముఖ ప్రజా, ప్రకృతి కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం వైపు నడిపించేందుకు కవులు, రచయితలు ఎంతో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారని, అలాంటి వారిని గుర్తించి సత్కరించడం శుభపరిణామం అన్నారు. ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ జే.బీ.శౌరీ మాట్లాడుతూ జయరాజ్ సామాజిక ఉద్యమాల యోధుడని పేర్కొన్నారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అంబేద్కర్ వాదులు, సామాజిక ఉద్యమకారులు, ప్రకృతి ప్రేమికులను అభినందించారు. కాగా జయరాజుతో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరో 14 మందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు తాళ్లూరి వెంకటేశ్వరరావు, కోచ్ మాస్టర్ షమీ ఉద్దీన్, ఎస్.కె.బాసిత్, కాల్వ దేవదాస్, మొక్కల వెంకటయ్య, వేల్పుల భాస్కర్, ప్రకృతి వైద్యులు సుగుణారావు, కోచైర్మన్ కూసపాటి శ్రీను, బిక్కసాని నాగేశ్వరరావు, ఎర్రా కామేష్, మారపాక రమేష్ కుమార్, శనగ వెంకటేశ్వర్లు, కోచర్ల కమలారాణి పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు కేటాయించాలి
ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యులకు రాజీవ్ స్వగృహ ప్లాట్లు కేటాయించాలని సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు కోరారు. ఆదివారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జరిగిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సుమారు 3,500 మంది సభ్యులు ఉన్నారని, ఇందులో సగం మందికే ఇళ్ల స్థలాలు వచ్చాయని, మిగతా వారికి రాజీవ్ స్వగృహ ప్లాట్లు నాలుగు బ్లాక్లు టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలకు కేటాయించాలని తీర్మానించామని అన్నారు. మధ్య తరగతి ఉద్యోగులు టీఎన్జీవోస్లో అధికంగా ఉన్నారని, అందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం టీఎన్జీవోస్ సెంట్రల్ కమిటీకి ఎన్నికై న బాలకృష్ణ, జైపాల్ విజయ్కుమార్తో పాటు ఇటీవల పదోన్నతులు పొందిన ఎర్రమల శ్రీనివాసరావు, నాగరాజును సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కొణిదన శ్రీనివాస్, నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, శ్రీధర్ సింగ్, ప్రకాశరావు, కరణ్సింగ్, తాళ్లూరి శ్రీకాంత్, చంద్రశేఖర్, ఏలూరి హరికృష్ణ, రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్లో ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ కె.మహీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి 20 మంది పాల్గొన్నారు. వారిలో కొత్తగూడేనికి చెందిన సీహెచ్ కృతిక కిడ్స్ జావెలిన్ త్రోలో రజత పతకం, కిన్నెరసానికి చెందిన డి.లోకేష్ ట్రయలాన్లో రజత పతకం, కాచనపల్లికి చెందిన వై.శృతిహాసన్ ట్రయలాన్లో రజత పతకం, భద్రాచలానికి చెందిన వి.సంజనశ్రీ 60 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం, కిన్నెరసానికి చెందిన కె.దిలీప్ ట్రయలాన్లో కాంస్య పతకం సాధించారు. విజేతలను జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, కోచ్లు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ తాగిన బాలుడు.. ● తల్లిదండ్రుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయంకరకగూడెం: మండలంలో ఇటీవల థమ్సప్ బాటిల్లో నిల్వ ఉంచిన గడ్డిమందును తాగి ఒక బాలు డు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మరవకముందే అలాంటిదే మరో ఘటన స్థాని కంగా కలకలం రేపింది. అయితే ఈసారి తల్లిదండ్రుల సకాలంలో స్పందించడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన మూడేళ్ల బాలుడు ఆదివారం ఉదయం ఆడుకుంటూ గ్రా మంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఖాళీ స్ప్రైట్ బాటిల్లో నిల్వ ఉంచిన హైడ్రోజన్ పెరాకై ్సడ్ ద్రావణాన్ని చూసి మంచినీళ్లు అనుకుని తాగేసి ఇంటికి వచ్చాడు. ఆతర్వాత కొద్దిక్షణాల్లోనే బాలుడు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయి వాంతులు, విరేచనాలు చేసుకుంటూ స్పృ హ కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంకటే మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించడంతోవారంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుండడంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు విషపూరిత పదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచాలని, ముఖ్యంగా మంచి నీళ్లు లేదా కూల్డ్రింక్స్ బాటిళ్లలో రసాయనాలను నిల్వ చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. ‘అబద్ధాలతోనే రేవంత్ పాలన’ఖమ్మంరూరల్: అబద్ధాలు చెబుతూ సీఎం రేవంత్రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎదులాపురం సాయిగణేశ్నగర్లోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, బీఆర్ఎస్ అంటే భరోసా అని, కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్, కేటీఆర్ను తిట్టటమే రేవంత్రెడ్డి పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు నిధులు ఎగ్గొట్టారని, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లో అర్ధరాత్రి వరకు నిలడబడాల్సి వస్తోందని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్ విసిరిన సవాల్ స్వీకరించి చర్చకు రావాలని సూచించారు. సమావేశంలో బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, జర్పుల లక్ష్మణ్నాయక్, కోటి సైదారెడ్డి, ఉదయ్, సొడేపొంగు ప్రశాంత్, మాదాసు ఆదాం తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో ఉద్యోగాలు లేవు..ఖమ్మంమయూరిసెంటర్: ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు లేవని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఖమ్మం నగర 5వ మహాసభ ఆదివారం నగరంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించారు. సభకు ముందు నగరంలో సీపీఐ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. హేమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగం నిర్వీర్యమైందని, దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందని విమర్శించారు. అలీన విధానానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. మతోన్మాద బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడారు. సభలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహ్మద్ మౌలానా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, బీజీ క్లెమెంట్, నగర కార్యదర్శి జానీమియా, మహ్మద్ సలాం, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్, మేకల శ్రీనివాసరావు, జ్వాలా నర్సింహారావు, యానాలి సాంబశివారెడ్డి, నూనె శశిధర్, ఏనుగు గాంధీ పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి జలాభిషేకం
పాల్వంచరూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆదివారం తొలి ఏకాదశి పండుగ కావడంతో మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, భక్తులు క్యూలైన్ ద్వారా దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్. రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. అమ్మవారికి వెండి తాంబాళం బహూకరణ పెద్దమ్మతల్లి అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్త దంపతులు పొల్కంపల్లి ప్రసాద్, అరుణ రూ.7,116 విలువైన వెండి తాంబాళం బహూకరించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. -
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
దుమ్ముగూడెం: మండలంలోని మారాయిగూడెం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్య కారణంగా పత్తిపాక గ్రామానికి చెందిన సోడి లక్ష్మి(45) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మి గత కొంతకాలంగా బీపీతో బాధపడుతూ శుక్రవారం కింద పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా వైద్యం చేసిన సదరు ఆర్ఎంపీ భద్రాచలం తరలించాలని సూచించగా.. వారు అక్కడకు తీసుకెళ్లి చూపించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మంకు రిఫర్ చేయగా.. అంబులెన్స్లో వారితో పాటే సదరు ఆర్ఎంపీ వెళ్లడం.. మార్గం మధ్యలో తరచూ అపుతూ వెళ్లడంతో ఖమ్మం చేరేసరికి ఆలస్యమైంది. అయినా చికిత్స అందించే క్రమానికి మరింత ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందింది. లక్ష్మి మృతికి ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటంబసభ్యులు ఆర్ఎంపీకి దేహశుద్ధి చేసినట్టు తెలిసింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ..ములకలపల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. కొత్తగంగారం అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఎస్సై కిన్నెర రాజశేఖర్ ఇలా తెలిపారు. అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన కుర్సం అర్జున్రావు(38) స్నేహితులతో కలిసి ట్రాక్టర్పై ములకలపల్లి మండలంలోని పాతగుండాలపాడు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మూత్రవిసర్జన నిమిత్తం ట్రాక్టర్ను కొత్తగంగారం అటవీ ప్రాంతంలో ఆపగా.. అటు వైపుగా వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న అర్జున్రావుతలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్యపద్మఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి స్వాధీనం పాల్వంచరూరల్: ఒరిస్సా నుంచి తీసుకొచ్చి స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి సోములగూడెం వైపు వెళ్లే మార్గంలో ఆదివారం ఎస్సై సురేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో జామాయిల్ తోటలో పాల్వంచకు చెందిన షకీర్, గోపి, జగన్నాధపురం గ్రామానికి చెందిన చరణ్, శ్రీరాంలు అనుమానస్పదంగా సంచరించడంతో వారిని పట్టుకుని విచారించారు. దీంతో వారి వద్ద ఒరిస్సాలోని బెజంగూడా నుంచి రూ.19వేల విలువ కలిగిన 380 గ్రామాల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బీపీతో గిరిజన మహిళ మృతివ్యక్తి దుర్మరణంనలుగురిపై కేసు నమోదు -
క్రీడా పాఠశాలలతో ఉజ్వల భవిష్యత్..
● స్పోర్ట్స్ స్కూళ్లలో చేరేందుకు బాలబాలికల ఆసక్తి ● చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ● గత ఏడేళ్లలో రాష్ట్రస్థాయి పోటీలకు 106 మంది ఎంపిక ● ఏటా జూన్లో మండల, జిల్లాస్థాయి పోటీల నిర్వహణకొత్తగూడెంటౌన్: ‘మాకు క్రికెట్ అంటే ఇష్టం.. ధోనిలా ఆడతాం. పీటీ ఉషలా పరుగెడతాం. గోపీ చంద్, సైనా నెహ్వాల్లా బ్యాడ్మింటన్ ఆడతాం.’ అంటూ చిన్నారులు క్రీడపట్ల ఆసక్తి చూపుతున్నా రు. నచ్చిన క్రీడలను ఎంచుకుని రాణించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొందరు క్రీడా పాఠశాలల్లో చేరి రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేందుకు శ్రమ పడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తుండటంతో తల్లి దండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. క్రీడా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఫ్రీ హాస్టల్ వసతి కల్పిస్తోంది. చదువుతోపాటు క్రీడల్లో శిక్షణనిస్తోంది. వివిధ క్రీడా పోటీలకు రాష్ట్రం తరఫున విద్యార్థులను పంపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారులు క్రీడా పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతుండగా, తల్లిదండ్రులు తోడ్పాటునందిస్తున్నారు. ఏటా జూన్లో ఎంపికలు ప్రతి ఏడాది క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు జూన్లో ఎంపికలు నిర్వహిస్తారు. మూడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నాలుగో తరగతిలో అడ్మిషన కల్పిస్తారు. గత నెల 26న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎంపికలు నిర్వహించారు. జిల్లా యు వజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న విద్యార్థులను రాష్ట్రంలోని మూడు స్పోర్ట్స్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లలో ప్రభుత్వ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 4వ తరగతిలో చేర్చితే, 12వ తరగతి వరకు విద్యాభ్యాసంతో ఫ్రీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్రీడల్లో శిక్షణనిస్తూ వివిధపోటీలకు విద్యార్థులు హాజరయ్యలా చూస్తారు. ఈసారి రాష్ట్రస్థాయి పోటీలకు 20 మంది.. గత జూన్లో జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో ఎంపికలు నిర్వహించారు. 170 మంది చిన్నారులు పోటీ పడగా 20 మంది బాలబాలికలు ఎంపికయ్యారు. వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నారు. ఏ చిన్నారిని పలకరించినా జాతీయస్థాయిలో రాణిస్తామని, పతకాలు సాధిస్తామని చెబుతున్నారు. గత ఏడేళ్లలో జిల్లా నుంచి సుమారు 106 మందికి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2018 ఏడాదిలో 20 మంది, 2019లో ఆరుగురు, 2020లో పది మంది, 2022 సంవత్సరంలో 20, 2023 ఏడాదిలో 17 మంది, 2024లో 13 మంది, 2025 ఏడాదిలో 18 మంది ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. -
నేడు ప్రజావాణి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో సోమవారం ఉద యం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటి ల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధి కారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. డ్యామ్, జలా శయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి సౌందర్యాల నడుమ సేదతీరారు. 510 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ. 27,630 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూ రిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,030 ఆదా యం సమకూరి నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐటీఐ విద్యార్థులకు ఎక్స్లెంట్ అవార్డుమణుగూరు టౌన్: ప్రభుత్వ ఐటీఐలో చదువుకు ని ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు పూర్వ విద్యార్థులు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ నుంచి ఎక్స్లెంట్ అవార్డులు అందుకున్నారు. మణుగూరు ఐటీఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. అవార్డు గ్రహీతలు సమీర్, ద్వారకామైలను అభినందించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందిన విద్యార్థులను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారని తెలిపా రు. నేటి నుంచి శిక్షణకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ల నిర్వహణపై రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 21 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశామని, వీటి నిర్వహణపై ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు ఈనెల 7, 8 తేదీల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, భద్రాచలంలోని కొర్రాజులగుట్ట ఉన్నత పాఠశాలలో శిక్షణ ఉంటుందన్నారు. ల్యాబ్లో అత్యాధునిక పరికరాలను వినియోగం, ప్రాజెక్ట్లు తయారీ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మానవ హక్కుల వేదిక విచారణబూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్ బీట్లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో ఇటీవల ఫా రెస్ట్ అధికారులకు, ఆదివాసీ మహిళలకు మధ్య జరిగిన దాడి ఘటనపై మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిజనిర్ధారణ విచారణ చేపట్టారు. వేదిక ప్రతినిధులు బాధిత ఆదివాసీ మహిళలతో మాట్లాడి పూర్తి వివరా లు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వలస ఆదివాసీ మహిళలపై దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈఘటనపై ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పం దించకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి పోడు సాగుచేసుకుంటున్న వారందరికీ పట్టాలివ్వాలని కోరారు. కొసగుంపు ఘటనపై జ్యుడీషియరీ ఎంక్వైరీ చేయాలని, బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొసగుంపులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, విద్య, వైద్యం, తాగునీటి వసతులను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్ రాజు, ఖాదర్బాబా, జిల్లా అధ్యక్షుడు దాగం ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి దిలీప్, రమేష్ బండారి, ఊకే ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న స్వరం
పుష్కరాల తరుణంలోభద్రాచలం: గోదావరి పుష్కరాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ క్రతువులో లక్షల కొద్దీ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారందరికీ తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తాత్కాలిక వసతులు, శాశ్వత నిర్మాణాలు, మరుగుదొడ్లు, అన్నదానసత్రాలు వంటివి నిర్మించాలి. కానీ భద్రాచలంలో ఇప్పటికే భూ సమస్య వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పుష్కరాల అభివృద్ధి పనులకు భూమెక్కడ అనే ప్రశ్న తలెత్తోంది. ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేస్తే 2027 జూలైలో జరిగే పుష్కరాలకు భూ సమస్య తీరుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. వసతులు పరిమితం.. అద్దెలు అధికం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం భద్రాచలం వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దేవస్థానం కాటేజీలు, వసతి గదులు మాత్రం స్వల్ప స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారాంతపు సెలవు దినాల్లో రూ. వేలల్లో అద్దె వసూలు చేస్తున్నారు. పది వేల మంది భక్తులు వస్తేనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే పుష్కరాల సమయంలో రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తారు. దీంతో వసతి సమస్య జఠిలంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా శాశ్వత, తాత్కాలిక వసతి నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రంలో పుష్కరాల పనులకు భూ సర్వే చేస్తున్నారు. ఐదు పంచాయతీలను కలిపితే భూమి అందుబాటులోకి.. ప్రస్తుతం భద్రాచలానికి మూడు వైపులా కిలోమీటరు పరిధి మించి విస్తీర్ణం లేదు. కానీ ఏపీలో కలిసిన గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం గ్రామాలు ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగానే ఉన్నాయి. రాష్ట్రాలు వేరయినా దైనందిక కార్యక్రమాలు, పనులు భద్రాచలంతోనే ముడిపడి ఉన్నాయి. ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపితే భద్రాచలానికి భూమి అందుబాటులోకి వస్తుంది. పురుషోత్తపట్నంలో స్వామి వారికి సుమారు 900 ఎకరాల భూమి ఉంది. దీంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. చర్ల రోడ్డులో ఉన్న ఎటపాక, కూనవరం రోడ్డులో ఉన్న గుండాల పంచాయతీల్లో అటు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను నియంత్రించవచ్చు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీల విలీన డిమాండ్పై స్వరం మరింత పెరుగుతోంది. ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి మా అభిప్రాయం తెలుసుకోకుండా ఏపీలో విలీనం చేసి అన్యాయం చేశారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పార్టీలన్నీ ఏకమై కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలి. రానున్న పుష్కరాల సమయంలో అందరి దృష్టీ భద్రాచలం వైపే ఉంటుంది. పంచాయతీలకు ఇదే సరైన తరుణంగా భావించి ఎంపీలు చొరవ చూపాలి. – బండారు వీరభద్రం, కన్నాయిగూడెం, విలీన గ్రామపంచాయతీ వాసిమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ చూపాలి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారానే విలీనం పూర్తయ్యే అవకాశం ఉండటంతో పార్లమెంట్ సభ్యుల పాత్రే కీలకం. ఎన్నికల ముందు ఎంపీ బలరాంనాయక్ సైతం ఇదే హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఇతర ఎంపీల సహాయ సహకారాలతో పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తాలని బలరాంనాయక్ను భక్తులు కోరుతున్నారు. నిజామాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను ఇటీవల కలిసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదే విషయమై విన్నవించారు. పుష్కరాల తరుణంలోనైనా విలీన పంచాయతీలు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. ఏపీ విలీన పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ వసతి, సౌకర్యాలకు భూ సమస్య కూడా తీరే అవకాశం భద్రాచలంలో భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లకు స్థలం మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు గళమెత్తాలని విన్నపాలు -
మంత్రిని కలవకుండా మహిళల అరెస్ట్
కొత్తగూడెంటౌన్: మంత్రిని కలవకుండా తొమ్మిది మంది మహిళలను టూటౌన్ పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. మాయాబజార్, రుద్రంపూర్లకు చెందిన తొమ్మిది మంది పల్లపు కొమరమ్మ, బండారి లీలావతి, గుంజా నాగమణి, కల్లూరి రేణుకా, ఓర్పు, అనుషా, ఓర్పు రాజేశ్వరి, పల్లపు శారద, బండా ప్రవళిక, పల్లపు శైలజాతోపాటు ఓర్పు వెంకన్న, పల్లపు రాజేష్లు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఇవ్వలేదని పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ సమస్య చెప్పుకుందామంటే సీఐ అరెస్ట్ చేసి, వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కాగా మంత్రి పర్యటన ముగిశాక పోలీసులు వారిని వదిలిపెట్టారు. -
రామాలయంలో తొలి ఏకాదశి సందడి
భద్రాచలం: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం ఘనంగా జరిపారు. కాగా, ఈ నెల 10న ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గిరిజన ఉత్సవం దమ్మక్క సేవాయాత్రను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు. -
వణికిస్తున్న విషజ్వరాలు..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్వల్ప కాలంలోనే జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని ఆదేశాల జారీ చేసినా.. తూతూమంత్రంగా నిర్వర్తిస్తుండడంతో ఏజెన్సీ గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తి తగ్గడం లేదు. పారిశుద్ధ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మురుగు కాల్వల్లో వ్యర్థాలు, పూడిక తీయక నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతూ సీజనల్ వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా తయారైంది. ఆస్పత్రులు కిటకిట.. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రి ఓపీ 100 నుంచి 200కి పైగా ఉంటుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనూ సాధారణ రోజులో కంటే రెండింతలు ఎక్కువే వస్తున్నారు. ప్రస్తుతం విష జ్వరాలు, డెంగీ వ్యాధులు ప్రబలే కాలం కావడంతో రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యాన గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటా సర్వే చేస్తుండగా జ్వరపీడితులు ఆర్ఎంపీలను ఆశ్రయించడం లేదా జ్వరం తగ్గకపోతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ప్రైవేట్లో దోపిడీ... విషజ్వరాలు ప్రబలడంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. యజమానులు, వైద్యులు అడిగినంత చెల్లించుకోవాల్సి వస్తోంది. ఏజెన్పీ గ్రామాల్లో విషజ్వరాలు పెరిగిపోతుండడంతో స్థానికంగా ఏ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినా రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. ముఖ్యంగా మెడికల్ మాఫియా జోరు కొనసాగుతోంది. గతంలో డెంగీ, చికెన్గున్యా వ్యాధులకు పరీక్షల పేరిట రూ.1800లు వసూలు చేయగా ఇప్పుడు భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇక సీబీపీ, టైఫాయిడ్, మలేరియా, సీఆర్పీ పేరుతో రూ.2 వేలకు బదులు రూ.800లు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ రేట్లను కొంతమంది మాత్రమే అనుసరిస్తున్నారని, ఇంకొందరు అవసరం లేకున్నా ఇతర పరీక్షలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు ల్యాబ్ల వారితో కుమ్మకై ్క రోగుల వద్ద నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. విషజ్వరాలు విస్తరించకుండా అవగాహన కల్పించాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నామమాత్రంగా పర్యటన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీలో విజృంభిస్తున్న దోమలు జిల్లాలో ఇప్పటికే 25 మలేరియా, 9 డెంగీ కేసుల నిర్ధారణ రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు పంచాయతీల్లో పడకేసిన పారిశుద్ధ్యంసర్కారు లెక్కలకు పదింతలు తేడా... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకరాం ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మలేరియా, 7 డెంగీ కేసులు నమోదయ్యాయి. కాగా ఈ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతకు పదిరెట్లు బాధితులు ఉంటున్నారని తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జ్వర పీడితులు భారీగా చేరుతున్నప్పటికీ అధికారుల లెక్కల్లో ఆ కేసులు నమోదు కావడం లేదు. వాటి కూడా పరిగణలోకి తీసుకుంటే కేసుల సంఖ్య భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలు స్తోంది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ముందస్తు చర్యలు చేపట్టాం. దోమల నివారణ చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రజలు వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రుల్లో చూపించుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ -
లింక్ పంపి.. డబ్బులు చోరీ..
రఘునాథపాలెం: స్మార్ట్ఫోన్ను ప్రతీ ఒక్కరు విరవిగా వాడుతున్నారు. బ్యాంకింగ్ సేవలు, పేమెంట్ యాప్స్ వాడకం ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలు కూడా స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే, అమాయక ప్రజలు సైబర్ మోసాల బారినపడుతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు తప్పుడు యాప్స్, గిఫ్ట్ లింకులు, ఫేక్ కాల్స్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరాల్లోనే కాక, రూరల్ ప్రాంతాల్లోనూ మొబైల్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే వంటివి విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు మొబైల్కు సందేశాల రూపంలో ‘గిఫ్ట్ లభించింది‘, ‘మీకు లాటరీ వచ్చింది‘, లేదా ‘వివరాలు అప్డేట్ చేయాలి‘ అంటూ తప్పుడు లింకులు పంపుతున్నారు. అమాయకులు వాటిని ఓపెన్ చేస్తే, వారి ఫోన్ హ్యాకింగ్కు గురై ఖాతాల్లోని డబ్బులు మాయమవుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో ఒక్క వారం వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు నష్టపోయారు. ఇక పరువు పోతుందని భావించి చాలామంది మోసపోయిన విషయాన్ని బయటపెట్టడంలేదు. కాగా, సైబర్ మోసగాళ్లు మరో పంథాను ఎంచుకుంటున్నారు. ‘మీ పిల్లలు కేసులో ఇరుక్కున్నారు.. డబ్బులు పంపించకపోతే అరెస్ట్ చేస్తాం’ అంటూ వాట్సాప్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా మోసాలతో భయపడిన కొన్ని కుటుంబాలు డబ్బులు పంపించిన ఘటనలు ఉన్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ‘ఏ సందేశమైనా, యాప్ అయినా డౌన్లోడ్ చేసేముందు తాను ఎవరితో డీలింగ్ చేస్తున్నానో తెలుసుకోవాలి. ఎవరికై నా డబ్బులు పంపేముందు నమ్మదగిన వ్యక్తుల దగ్గర సలహా తీసుకోవాలి’ అని అధికారులు సూచిస్తున్నారు. సక్రమమైన బ్యాంకింగ్ యాప్ల ద్వారామాత్రమే లావాదేవీలు చేయాలని, గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రజలను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు అప్రమత్తంగా ఉండాలి.. ప్రతీ ఒక్కరు సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత మేర తెలిసిన వారి ద్వారానే యాప్ల ద్వారా లావాదేవీలు సాగించాలి. వచ్చిన ప్రతి మేసేజ్లను క్లిక్ చేయకుండా తెలియక పోతే తెలిసిన వారికి చూపించిన తర్వాతనే ముందుకు సాగాలి. సైబర్ మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించి బ్యాంక్ లావాదేవీలను ఆపించాలి. కొత్త వ్యక్తులు పంపే లింక్లను ఓపెన్ చేయొద్దు. ఓటీపీలను చెప్పేముందు ఒకటికి రెండు సార్లు ఆరా తీయాలి. – ఉస్మాన్షరీఫ్, సీఐ రఘునాథపాలెం -
ఎవరూ నిరాశ చెందొద్దు
కొత్తగూడెంఅర్బన్: భవిష్యత్లో గుడి లేని గ్రామం ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండదని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడతలో ఇళ్లు రానివారు నిరాశకు గురి కావొద్దని, రెండో విడతలో మంజూరు చేస్తామని తెలిపారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, చుంచుపల్లి మండలాల లబ్ధిదారులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులతో కలిసి ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎస్ఆర్టీ నగర్, మాయాబజార్ ప్రాంతాల నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిఏకాదశి రోజున ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతీ సోమవారం ఖాతాల్లో నగదు.. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామని, ఇందులో రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం వడివడిగా సాగుతోందని అన్నారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు, రూ. 500కే వంట గ్యాస్, రేషన్ కార్డుల పంపిణీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, నాలుగు రోజుల క్రితమే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా అందించామని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, కొందరు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి గుండు సున్న ఖాయమని స్పష్టం చేశారు. పదేళ్లలో రూ. 8.19 లక్షల కోట్ల అప్పు రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ 8 లక్షల 19 వేల కోట్ల రూపాలయ అప్పు చేసిందని మంత్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రామవరంలో భూములకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలని కోరారు. కొత్తగూడెంలో జర్నలిస్టులకు బీపీఎల్ కోటాలో స్థలాలు మంజూరు చేయాలని అన్నారు. కొత్తగూడెం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల ప్రక్రియను హోల్డ్లో పెట్టారని, దానిని ఎత్తివేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, అదనపు కలెక్టర్ విద్యాచందన, నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, మండే వీరహనుమంతరావు, రజాక్, ఆళ్ల మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే విడతల్లో మిగిలినవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా ఖాయం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ -
తొలి పండగకు సిద్ధం..
● హిందువులకు మొదటి పండుగగా పేరు ● ముస్తాబైన వైష్ణవ ఆలయాలు ● ఉపవాసాలు, దానధర్మాలతో మోక్షం నేడు తొలి ఏకాదశికొత్తగూడెంటౌన్: హిందువులకు ఎంతో విశిష్టమైన పండగలో మొదటి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చే ఈ పండగను దేవశయన ఏకాదశి లేదా పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢశుద్ధ ఏకదశి తిథి సందర్భంగా నేడు(ఆదివారం) పండుగను జరుపుకుంటారని అర్చకులు, వేదపండితులు చెబుతున్నారు. ఏడాది కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది మొదటిది కాగా తలెగు పండుగలన్నీ దీంతోనే ప్రారంభమవుతాయి. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లి నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారని చెబుతారు. ఇక సూర్యుడు దక్షిణం వైపుకు మరలిన తరుణాన ఈ రోజు నుంచి దక్షిణయానం ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా గోపద్మవ్రతాన్ని కార్తీకమాస శుక్లపక్షం వరకు జరుపుకుంటారు. ఇందుకోసం శ్రీవైష్టవి ఆలయాలను నిర్వాహకులు ముస్తాబుచేయడంతో పాటు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. విశిష్ట పూజలు. ఏకాదశి రోజున కొందరు చతుర్మాస వ్రతాలు ప్రారంభిస్తారు. సూర్యోదయానికి ముందే శ్రీహరిని పూజించి, విష్ణువు ప్రతిమను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి చక్కెర పొంగళి నైవేధ్యంగా పెడతారు. అంతేకాక కర్పూర హారతులిచ్చి భక్తులు ఉపవాసంతో వైష్ణవ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. గోపూజ చేయడం మంచిదని, పితృ దేవతలకు ప్రీతికరమైన పేలాల పిండిని తినాలని పెద్దలు, అర్చకులు చెబుతున్నారు. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తేమోక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. తొలి ఏకాదశితో పండగలు మొదలు.. గ్రీష్మ రుతువు ముగిసి, వర్ష రుతువు ప్రారంభమైన సందర్భంగా పండగను జరుపుకోవడం ఆనవాయితీ. తొలి ఏకాదశికి హైందవ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండుగ కావడంతో అందరూ నేడు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. మొదటి పండగ.. తొలి ఏకాదశి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండుగ కావడంతో ఈ రోజు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయి. పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. – శ్రీధరాచార్యులు, రామవరం శివాలయం అర్చకుడు -
ఇద్దరు దొంగల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట ప్రాంతంలో శనివారం సాయంత్రం రూ.లక్ష విలువ గల సామగ్రి ఉన్న బ్యాగును అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా.. కరకట్ట ప్రాంతంలో ఫొటోలు తీసేందుకు అవసరమైన కెమెరా ఇతర సామగ్రి ఉన్న ఒక బ్యాగును ఇద్దరు వ్యక్తులు అపహరించే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బ్లూకోట్ టీం అక్కడకు చేరుకొని వారిని స్టేషన్కు తరలించి విచారించగా.. పాల్పంచ పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన చలపతి, ఉపేంద్రగా తెలిసింది. -
బీఏఎస్కు విద్యార్థుల ఎంపిక
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఖమ్మం జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల (బీఏఎస్)ల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి గత నెల 20వ తేదీన లక్కీ డ్రా ద్వారా విద్యార్థినులను ఎంపిక చేయగా పలువురు చేరలేదు. దీంతో కొత్త వారి ఎంపికకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఖమ్మం డీడీ విజయలక్ష్మి ఆధ్వర్యాన డ్రా తీశారు. అధికారులు హరీశ్, అశోక్కుమార్, నారాయణరెడ్డి, రాములు, రాంబాబు, రాజేందర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఎదగాలి కొత్తగూడెంఅర్బన్: మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని ట్రెయినీ కలెక్టర్ సౌరబ్శర్మ అన్నారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఆర్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెప్మా డీఎంసీ, ఏడీఎంసీ, టీఎంసీ బి.వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శాంతకుమార్, మౌలాల్, సరిత, ఆర్పీలు పాల్గొన్నారు. కేన్సర్ బాధితురాలికి ఆర్థిక చేయూత కొత్తగూడెంటౌన్: కొత్తగూడెంకు చెందిన సింధు కేన్సర్తో బాధపడుతుండగా చికిత్సకు వసుధ ఫౌండేషన్ బాధ్యులు చేయూతనిచ్చారు. కొత్తగూడెంలో శనివారం ఎస్పీ రోహిత్రాజు చేతుల మీదుగా రూ.10 వేల చెక్కు అందజేశారు. ఫౌండేషన్ కన్వీనర్ విగేశ్న శ్రీనివాసరాజు, రమేష్ పాల్గొన్నారు. జయప్రదం చేయండి సింగరేణి(కొత్తగూడెం): ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్బీకేఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలోని రైటర్ బస్తిలో జరిగిన విప్లవ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మె విజయవంతం ద్వారా కేంద్రానికి కనువిప్పు కలిగించాలని కోరారు. నాయకులు గౌనీ నాగేశ్వరరావు, ఎన్. సంజీవ్, మ ల్లీఖార్జన్రావు, శ్రీను, కృష్ణ, శరత్, రామకృష్ణ, రాజేష్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. 10న తెలంగాణ జాగృతి సమావేశం సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ జాగృతి జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని కొత్తగూడెం క్లబ్లో ఈనెల 10న నిర్వంహించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో శనివారం జరిగిన సన్నాహాక సమావేశంలో జాగృతి రాష్ట్ర నాయకుడు రూప్సింగ్, సదానందంగౌడ్, మహిళా అధ్యక్షురాలు మాధవి మాట్లాడారు. ఈనెల 10న జరిగే సమావేశానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానుండగా, సీఐటీయూ పట్టణ కార్యదర్శి వీరన్న నేతృత్వంలో పలువురు జాగృతిలో చేరనున్నారని తెలిపారు. జిల్లా కన్వీనర్ పవన్నాయక్, నాయకులు సింధుతపస్వి, బత్తుల వీరయ్య, ఎం.డీ.హుస్సేన్, నవతన్, కిరణ్కుమార్, వరప్రసాద్, సాదిక్పాషా పాల్గొన్నారు. -
‘ఉద్యానం’ సతమతం!
● జిల్లా ఉద్యాన శాఖలో ఖాళీ పోస్టులు ● ఉన్న అధికారులపై పెరుగుతున్న పనిభారం ● కనీసం కార్యాలయాలు కూడా లేని దుస్థితి సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా ఉద్యాన శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కలెక్టరేట్లోని ఉద్యాన శాఖ కార్యాలయం తప్ప జిల్లాలో మరెక్కడా ఉద్యానశాఖకు కనీసం కార్యాలయాలు లేవు. దీంతో అధికారులు రైతు వేదికల నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో జిల్లా ఉద్యాన శాఖాధికారిగా పనిచేసిన అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ స్థానంలో జంగా కిషోర్ను ఇన్చార్జ్గా నియమించారు. ప్రస్తుతం జిల్లా ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. మరో వైపు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చొరవతో కొందరు రైతులు లాభదాయకమైన మునగసాగుపై దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పండ్లు, కూరగాయల సాగు చేపడితే ఆదాయం పెరుగుతుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కానీ వీటిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే ఉద్యాన శాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఆరుగురు హార్టికల్చర్ ఆఫీసర్లు జిల్లా కేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో టెక్నికల్ హార్టికల్చర్ ఆఫీసర్ ఒకరు ఉండగా, అశ్వారావుపేట, అశ్వాపురం, దమ్మపేట, ఇల్లెందు, పాల్వంచ కేంద్రాల్లో మరో ఐదుగురు హార్టికల్చర్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. అశ్వారావుపేట హార్టికల్చర్ ఆఫీసర్ పరిధిలో ములకలపల్లి, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, దమ్మపేట ఆఫీసర్ పరిధిలో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వాపురం ఆఫీసర్ పరిధిలో పినపాక, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, ఇల్లెందు ఆఫీసర్ పరిధిలో ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, పాల్వంచ ఆఫీసర్ పరిధిలో జూలూరుపాడు, సుజాతనగర్, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాలు ఉన్నాయి. రైతు వేదికలే కార్యాలయాలు హార్టికల్చర్ ఆఫీసర్లకు ఎక్కడా కార్యాలయాలు లేవు. జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా 67 రైతువేదికలు ఉన్నాయి. వీటి నుంచే అధికారులు శాఖాపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ కార్యకలాపాలు ఉన్నపుడు ఉద్యానశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాఖాపరమైన విధులతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల విధులు, సర్వే వంటి పనులు, వరద సహాయక కార్యక్రమాలు తదితర బాధ్యతలు కూడా కేటాయిస్తుండటంతో ఉద్యాన అధికారులు పనిభారంతో సతమతమవుతున్ననారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. ఉద్యాన శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్న అధికారులతోనే రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నాం. ఉద్యాన శాఖ నుంచి వివిధ పంటలకు ఇస్తున్న రాయితీలపై అవగాహన కల్పిస్తున్నాం. – జంగా కిషోర్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారి ఎక్స్టెన్షన్ అధికారులే లేరు ప్రతీ హార్టికల్చర్ ఆఫీసర్కు ఇద్దరు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు సహాయకులుగా ఉండాలి. జిల్లాలో 12 మంది టెక్నికల్ ఆఫీసర్లను ఉండాల్సి ఉండగా, అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉన్న అధికారులపైనే పనిభారం పడుతోంది. జిల్లాలో 2019 వరకు ఎనిమిది మంది ఎక్సటెన్షన్ ఆఫీసర్లు విధులను నిర్వహించారు. వారు ఇతర ప్రాంతాలకు బదిలీ కావడంతో అప్పటి నుంచి ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఎస్సైకు గోల్డ్ మెడల్
భద్రాచలంఅర్బన్: జోనల్ డ్యూటీ మీట్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన భద్రాద్రి జోనల్ డ్యూటీ మీట్ ఈనెల 4న ముగిసింది. జోనల్ పరిధిలో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వరంగల్, మహబుబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పలు విభాగాల్లో పోటీపడ్డారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 19 మెడల్స్ రాగా వీరిలో భద్రాచలం టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంజి స్వప్నకు రెండు విభాగాలలో గోల్డ్ మెడల్ సాధించింది. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
కొత్తగూడెంఅర్బన్ : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం క్లబ్లో జరిగే కార్యక్రమంలో చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. చుంచుపల్లి మండలం ఎస్ఆర్టీ, మాయాబజార్, వనమా కాలనీ నిర్వాసితులకు ఇంటి స్థలాల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం– రూప్లా తండా హైలెవల్ బ్రిడ్జి పనులకు, ఒంటి గంటకు చింతపెంటిగూడెంలో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాల్వంచలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొననున్నారు. ఆర్థికాభివృద్ధి సాధించాలిఇల్లెందురూరల్: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. శనివారం ఆమె మండలంలోని రొంపేడులో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నెలకొల్పేందుకు స్థల పరిశీలన చేశారు. కొమ్ముగూడెం గ్రామపంచాయతీ నాయకులగూడెం గ్రామంలో పౌల్ట్రీ మదర్ యూనిట్ నిర్మాణ పనులను, బొజ్జాయిగూడెం గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంపీడీవో ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏపీఎం దుర్గారావు పాల్గొన్నారు. జనన ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలికొత్తగూడెంఅర్బన్: జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఫార్మాట్లలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న 4,369 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవని మండల విద్యాధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆధార్ కార్డుల జారీకి ముందుగా జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆర్డీఓలకు సూచనలు చేశారని వివరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు పొందాలని, ఆ తర్వాత పాఠశాలల్లో, ఎంఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆధార్ కార్డు పొందాలని వివరించారు. తహసీల్దార్ నుంచి పొందిన రెసిడెన్స్ సర్టిఫికెట్ ద్వారా ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాలని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి పేరు కూడా ఆధార్ లేని కారణంగా యూడైస్ వెబ్సైట్లో నమోదు చేయకుండా ఉండొద్దని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యుడు తమ్మినేని వీరభద్రం సింగరేణి(కొత్తగూడెం): దేశ రక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శనివారం మంచికంటి భవన్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరల చట్టం తేవాలని డిమాండ్ చేశారు. నాయకులు పోతినేని సుదర్శన్, మధు, యలమంచిలి రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్, అన్నవరకు కనకయ్య, వంశీకృష్ణ, బ్రహ్మాచారి, కే.పుల్లయ్య, ఎండీ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెర ఒక్కటే.. సినిమాలు రెండు
ఒకప్పుడు థియేటర్లో ఒకే సినిమా నాలుగు ఆటలు ● మల్టీప్లెక్స్ల రాకతో మారిన ప్రదర్శన విధానం ● సింగిల్ స్క్రీన్లలోనూ సింగిల్ సినిమాలకు తగ్గిన క్రేజ్ ● ట్రెండ్కు తగ్గట్టు ప్రతీ పూట వేర్వేరు చిత్రాల ప్రదర్శనకొత్తగూడెం నగరంలోని ఓ థియేటర్ మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు.. ఇళ్లలోకి టీవీలు వచ్చాక థియేటర్ల కథ ముగుస్తుందనే ప్రచారం జరిగింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ పేరుతో డాల్బీ డిజిటల్, డిజిటల్ ట్రాక్ సౌండ్ (డీటీఎస్), డాల్బీ ఆట్మోస్ పేరుతో సౌండ్ క్వాలిటీ, కుషన్, కపుల్ చైర్స్ వంటి సౌకర్యాలతో ఏసీ హాళ్లు వచ్చాయి. దీంతో ఎంటర్టైన్మెంట్లో థియేటర్లు మరింత అగ్రస్థానానికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకే ప్రాంగణంలో రెండుకు మించి స్క్రీన్లు, మూడుకు పైగా సినిమాలు ప్రదర్శించడం మొదలైంది. టాయిలెట్స్ మొదలు స్క్రీన్ వరకు అన్నింటా బెస్ట్ సర్వీస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ సినిమాకు సరికొత్త కేరాఫ్ అడ్రెస్గా మల్టీప్లెక్స్లు నిలిచాయి. ఓటీటీల రాకతో.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ సినిమా థియేటర్ల పాలిట మృత్యుపాశంగా మారింది. ఓ వైపు మల్టీప్లెక్స్ హవా పెరుగుతుంటే మరోవైపు ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్లు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. రీజినల్, ఇంటర్నేషనల్ కంటెంట్ లోకల్ లాంగ్వేజ్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వినోద రంగంలో థియేటర్లకు గట్టి ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రేక్షకుడిని ఇంటి నుంచి థియేటర్కు రప్పించాలంటే స్టార్ పవర్ లేదంటే మంచి కంటెంట్ ఉండక తప్పని పరిస్థితి ఎదురైంది. థియేటర్ల మూసివేత గతంతో పోల్చితే స్టార్డమ్ ఉన్న నటుల నుంచి వచ్చే సినిమాల తగ్గిపోవడం, ఓటీటీలో మంచి కంటెంట్ వస్తుండటంతో థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి ఎదురైంది. శుక్రవారం సినిమా విడుదలైతే సోమవారం నుంచి ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటంతో షోలు క్యాన్సిల్ చేయడం రివాజుగా మారింది. కొన్ని థియేటర్లయితే క్రేజ్ ఉన్న సినిమా విడుదలైనప్పుడు తెరవడం, ఆ తర్వాత మూత వేయడం చేస్తున్నారు. తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు గుండెకాయలా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో థియేటర్లు మూతపడిపోవడం మొదలైంది. ఒకప్పుడు ఖమ్మంలో పదకొండు థియేటర్లు ఉంటే ఇప్పుడు కేవలం ఐదే మిగిలాయి. కొత్తగూడెంలో ఏడుకు బదులు నాలుగు, పాల్వంచలో నాలిగింటా రెండు, ఇల్లెందులో మూడు, మణుగూరు, భద్రాచలంలలో మూడింటా రెండు థియేటర్లే నడుస్తున్నాయి. ఇక మండల కేంద్రాల్లోని థియేటర్లు ఎప్పుడో మూతపడ్డాయి. ఒకే రోజు రెండు, మూడు సినిమాలు.. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తమ పంథాను మార్చుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్లలో నాలుగు షోలలో ఒకే సినిమా నడిపించడగా ఇప్పుడు ఒకే రోజు రెండు, మూడు సినిమాలు నడిపించే పద్ధతిని అమల్లోకి తెస్తున్నారు. సినిమాలో ఉండే కంటెంట్, వచ్చే ప్రేక్షకులను బట్టి షోలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఖమ్మం వినోద థియేటర్లో హాలీవుడ్ చిత్రం జురాసిక్పార్క్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మార్నింగ్, మ్యాట్నీ షోలు ఉండగా ఫస్ట్ షో, సెకండ్ షోలలో ఇంగ్లిష్ వెర్షన్ ప్రదర్శించారు. ఇదే సినిమా కొత్తగూడెం ఏషియన్ మహేశ్వరి, భద్రాచలం విజయ్భాస్కర్లలో మ్యాట్నీ, సెకండ్షోలు ఉండగా మిగిలిన షోలలో కన్నప్ప, కుబేరా సినిమాలు ఆడిస్తున్నారు. ఈ ట్రెండ్ ఆర్నెళ్ల క్రితమే మొదలైనా పాపులారిటీ ఉన్న సినిమాలు ఇలా ఆడకపోవడంతో ఈ అంశం వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి వేర్వేరు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంతో ఒకే థియేటర్లో వేర్వేరు షోలకు వేర్వేరు సినిమాలు ప్రదర్శించే అవకాశం చిక్కింది. ట్రెండ్కు తగ్గట్టు సింగిల్ స్క్రీన్లే మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. -
అక్రమ కలప రవాణాపై ముమ్మర తనిఖీ..
ఇల్లెందురూరల్: మండలలోని ఇల్లెందు రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత వారం రోజులు గా బొజ్జాయిగూడెం, కొత్తూరు పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా టేకు కలప తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఇప్పటివరకు రూ.2.70 లక్షలు విలువ చేసే 124 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు మరింత లోతుగా విచారణ నిర్వహిస్తే కలప అక్రమ తరలింపులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై ఇల్లెందు రేంజ్ ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ చలపతిరావును వివరణ కోరగా.. టేకు కలప అక్రమంగా తరలిపోయినట్లు నిర్థారించుకుని తనిఖీలు ప్రారంభించాం. ఇంకా తనిఖీలు కొనసాగించి అనుమానితులపై విచారణ కొనసాగిస్తాం. ఇప్పటివరకు రూ.2.70 లక్షల టేకు దుంగలు స్వాధీనం -
వృద్ధురాలిని కాపాడిన గజ ఈతగాడు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఓ వృద్ధురాలని ఓ గజ ఈతగాడు కాపాడాడు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలి కుమారుడు రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అంతేకాక ఆమెకూ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా.. తన కుమారుడు మరణం తర్వాత తనను ఎవరూ పట్టించుకోవడంలేదని మనస్థాపంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈనేపథ్యాన శనివారం నదిలో దూకగా.. స్థానిక గజ ఈతగాడు ప్రసాద్ గమనించి వృద్ధురాలిని కాపాడాడు. తర్వాత ఆమె బాధను ఈతగాడితో పంచుకోక ఆమెకు భోజనానికి కావాల్సిన నగదును అందజేశాడు.మహిళా రెస్క్యూ టీమ్కు సర్టిఫికెట్ల ప్రదానంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన 13మందితో కూడిన మహిళా జట్టుకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ హైదరాబాద్లో శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. జీఎం(రెస్క్యు) శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఈడీ ఎస్డీ.సుభానీ తదితరులు అందజేశారు. వార్డెన్ బాధ్యతల కోసం పోటాపోటీ పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో వార్డెన్ బాధ్యతల కోసం పలువురు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం రెండు గ్రూపులుగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ పునఃప్రారంభమయ్యాక శంకర్ వార్డెన్ విధులు నిర్వర్తిస్తుండగా, ఈనెల 3న వెంకటేశ్వర్లుకు హెచ్ఎం రామారావు అప్పగించారు. ఇదే బాధ్యతల కోసం పీడీ అంజయ్య పోటీ పడుతుండడంతో సమస్యను డీడీ దృష్టికి తీసుకవెళ్లారు. అయితే, ఈ ఏడాది వెంకటేశ్వర్లునే కొనసాగించాలని కొందరు ఉపాధ్యాయులు తీర్మానం చేసినట్లు సమాచారం. ఇంతలోనే రెగ్యులర్ హెచ్ఎం రామారావు సెలవులో వెళ్లగా ఇన్చార్జ్ బాధ్యతలు శంకర్కు అప్పగించారు. రెండు పశువుల మృతి చర్ల: మండలంలోని కుదునూరుకు చెందిన దొడ్డా వేమయ్యకు చెందిన రెండు ఆవులు, ఒక లేగదూడ శుక్రవారం మేతకు వెళ్లి సాయంత్రం రాలేదు. ఈక్రమాన రాత్రి సమయాన ప్రధాన రహదారిపై ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో రెండు ఆవులు మృతి చెందగా, లేకదూడకు తీవ్ర గాయాలయ్యాయి. ఆవుల విలువ రూ.30వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. -
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
పాల్వంచ: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ అన్నారు. శనివారం జెన్కో ట్రైనింగ్ సెంటర్లో విద్యుత్ సరఫరా అంతరాయాలపై జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. నూతనంగా నిర్మాణం చేపడుతున్న విద్యుత్ నియంత్రికలు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది పూర్తి రక్షణ పరికరాలు వాడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆదేశించారు. అనంతరం డైరెక్టర్ను అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, జిల్లా సూపరింటెండెంట్ మహేందర్, డీఈలు, ఏడీఈలు, అకౌంట్స్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకునే అవకాశం ఉంది. తాలిపేరుకు వరద ఉధృతిరెండు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్కు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో రెండు రోజుల నుంచి ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం ప్రాజెక్ట్ 25 గేట్లలో రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి ఉంచి 2,105 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని నీటిమట్టాన్ని 71.74 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. పంట పొలాలకు సాగునీటిని విడుదల చేసేందుకు సరిపడా నీరు ప్రాజెక్ట్లో ఉందని డీఈ తిరుపతి తెలిపారు. -
పీరీల పండగకు వేళాయే ు..
● త్యాగానికి ప్రతీకగా మొహర్రం ● పండుగకు ముస్తాబైన పీరీలు ● కులమతాలకతీతంగా భక్తుల పూజలు నేడు పీరీల పండుగ కొత్తగూడెంటౌన్: న్యాయం, ధర్మం, సత్యం వంటి మానవీయ విలువలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధం చేసిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకంగా జరుపుకునే పండగ మొహర్రం. ఈ పండగలో భాగంగా కులమతాలకు అతీతంగా పీర్ల పండుగను జరుపుకుంటారు. పండుగ నాడు భక్తులంతా పీరీలను వీధుల్లో ఊరేగిస్తుండగా.. భక్తులు కొబ్బరికాయలు, ఊద్లుతో మొక్కులు తీర్చుకుంటారు. పీరీల ముస్తాబు.. పీర్ల పండుగను జరుపుకునేందుకు ఆదివారం ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇందుకు అషుర్ఖానాల్లోని పీర్లను ముస్తాబు చేసి పీరీలకొట్టంలో మానిక్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 76కు పైగా అషూర్ఖానాలు ఉండగా.. కొత్తగూడెం సూపర్బజార్, రామవరంలోని మార్కెట్ ఏరియాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పీర్ల పంజా(పీర్ల దేవుళ్ల ప్రతిమ)లను కూర్చోబెట్టి అమరవీరులను, పెద్దలను స్మరిస్తూ ఎర్రగా మండే నిప్పు కణికల్లో నడిచి తమ భక్తిని చాటుతారు. తెల్లవారుజాము నుంచే సందడి తెల్లవారు జామున పీరీలతో వీధుల్లోని ఇంటింటికి ఊరేగింపుగా తీసుకెళ్లగా.. భక్తులు కులమతాలకు అతీతంగా మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. తిరిగి పండుగ రోజు సాయంకాలం వీటిని మార్కెట్లలో ఏర్పాటు చేయగా.. అందరూ అక్కడకు చేరుకుని ఆడిపాడి సందడి చేస్తారు. ఇందుకు దర్గాల్లో పీరీలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇస్లాం నూతన సంవత్సరం.. మహ్మద్ప్రవక్త మనవడు ఇమా మ్ హుస్సేన్ వారి మనవడు సహచరుల ప్రాణత్యాగాలకు ప్రతీకగా మొహర్రంను జరుపుకుంటారు. కులమతా లకు అతీతంగా షరబత్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేస్తారు. ఇది అన్ని వర్గాలకు ఇష్టమైన పండుగ. – యాకుబ్పాషా, నూరియా హనఫీయా ఎడ్యుకేషనల్ సొసైటీ, పాల్వంచత్యాగానికి గుర్తు.. త్యాగాలకు గుర్తుగా మొహర్రం పండుగను జరుపుకుంటాం. పీర్లను ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులకు ఆశీర్వచనాలు, ఊద్లాంటివి అంది స్తాం. ఇస్లాంకు మూలమైన మానవతావాదానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. వీరత్వం నుంచి స్ఫూర్తి పొందిన పండగా..అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటారు. – బాబా, అసూర్ఖానా నిర్వాహకుడు, వేణుగోపాల్నగర్కాలనీ, రామవరం -
జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
ఇల్లెందు: విత్తనాలు సేకరించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థులకు చాలెంజ్ విసరడంతో మండలంలోని ముత్తారపు కట్ట ఎంపీపీఎస్ స్కూల్ విద్యార్థులు 120 రకాల విత్తనాలు సేకరించి మండల స్థాయి విజేతలుగా నిలిచారు. శనివారం ఇల్లెందు మండలస్థాయి విత్తన సేకరణ చాలెంజ్ ప్రదర్శన పట్టణంలోని జేబీఎస్ హైస్కూల్లో నిర్వహించారు. శుక్రవారం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిగిన పోటీల్లో గర్ల్స్ హైస్కూల్, జేబీఎస్, 21 ఫిట్ జెడ్పీ హైస్కూల్, మొయిన్ రోడ్ హైస్కూల్, చల్లసముద్రం, కొమరారం, సుభాష్నగర్ల పరిధి నుంచి ఒక్కో స్కూల్ నుంచి పోటీల్లో పాల్గొనగా.. ముత్తారపు కట్ట ఎంపీపీఎస్ జిల్లాస్థాయికి ఎంపికై నట్లు ఎంఈఓ ఉమాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ హెచ్ఎం కబ్బాకుల రవి, టీచర్ ఆరెం రవికుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు లలిత, అరుణ్కుమార్, లాలు, కల్పన, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
యాచకురాలి బిడ్డను బడిలో చేర్పించిన ఉపాధ్యాయుడు
మణుగూరు టౌన్: ఓ యాచకుడు అడుక్కుంటూ వచ్చే ఆదాయంతోనే భార్యాబిడ్డను పోషించేవాడు.. ఆయన మృతితో భార్య కుటుంబ పెద్దగా యాచననే ఎంచుకుంది. ఈక్రమంలోనే బిడ్డను కూడా వెంట తీసుకెళ్తుండటం గమనించిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమెకు నచ్చజెప్పారు. ఆ బిడ్డను బడిలో చేర్పించి స్థానికుల మన్ననలు అందుకున్నారు.మణుగూరు మున్సి పాలిటీ కార్యాలయానికి సమీపాన రహదారి వెంట ఉంటున్న ధన.. తన బిడ్డ యేసుమణిని సైతం యాచనకు తీసుకెళ్తోంది. గతనెలలో నిర్వహించిన బడిబాటలో మండలంలోని శివలింగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు మాలోతు భద్రు తదితరులు ధనకు అవగాహన కల్పించగా పాఠశాలలో చేర్పించింది. ఒకటి, రెండు రోజులు యేసుమణి పాఠశాలకు వచ్చినా.. ఆ తర్వాత నుంచి రావడం లేదు.ఈ నేపథ్యంలో, శుక్రవారం భద్రు తల్లిబిడ్డను రోడ్డు పక్కన గుర్తించాడు. దీంతో యేసుమణిని పాఠశాలకు పంపించాలని కోరారు. పుస్తకాలు, పెన్నులు కొనడం తనవల్ల కాదని ధన బదులిచ్చింది. ఈమేరకు పాఠశాల నుంచి యూనిఫాం తెప్పించిన ఉపాధ్యాయుడు యేసుమణికి వేయించి.. షాప్కు తీసుకెళ్లి బ్యాగ్, ఇతర సామగ్రి కొనిచ్చారు. అనంతరం తన బైక్పైనే పాఠశాలకు తీసుకెళ్లారు. రోజూ విద్యార్థిని పాఠశాలకు పంపించేలా పర్యవేక్షిస్తానని కూడా స్పష్టం చేసిన ఉపాధ్యాయుడు భద్రును స్థానికులు అభినందించారు.చదవండి: 20 మంది విద్యార్థులుంటే కొత్తగా స్కూల్ -
చేప చెరువుకు చేరేనా?
● ఊసేలేని ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ● ప్రతిపాదనలు కూడా రూపొందించని అధికారులు ● జిల్లావ్యాప్తంగా నిరీక్షిస్తున్న మత్స్యకారులు పాల్వంచరూరల్: ఉచిత చేప పిల్లలు ఈసారి చెరువులకు చేరే పరిస్థితి కన్పించడంలేదు. జూలైలో చేప పిల్లలను చెరువులో వదిలితే మత్స్యకారులు ఉపాధి, ఆదాయం పొందుతారు. కానీ చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా పంపలేదు. జిల్లాలో గతేడాది 734 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. ఆలస్యంగా పంపిణీ చేయడంతోపాటు కేవలం 86 లక్షల చేపపిల్లలను మాత్రమే చెరువుల్లో వదిలి చేతులు దులుపుకున్నారు. ఈసారి సీజన్ ప్రారంభమైనా పంపిణీ ప్రక్రియపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో మత్స్యకారులు నిరీక్షిస్తున్నారు. 734 చెరువులు, కుంటల్లో పెంపకం జిల్లాలో చేపలు పెంచే చెరువులు, కుంటలు 734 ఉన్నాయి. 70 మత్స్య పారిశ్రామిక సొసైటీల ఆధ్వర్యంలో పెంపకం చేపడుతున్నారు. వీటిల్లో 3,248 మంది సభ్యులు ఉండగా, చేపల పెంపకం ద్వారా సుమారు 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది 86 లక్షల చేప పిల్లలను, అంతకుముందు సంవత్సరం 1,93,76,000 చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. ఈసారి పంపిణీ ఊసేలేదు. కిన్నెరసానిలో ఉత్పత్తి కేంద్రం.. కిన్నెరసానిలో మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేప గుడ్లు(స్పాన్) పోసి రెండు నెలలపాటు పెంచి గిరిజన మత్స్యకార సొసైటీలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. 20 లక్షల చేప పిల్లలను పెంచేలా ఇక్కడ 13 తొట్లు నిర్మించగా, ప్రస్తుతం కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. గతేడాది 12 లక్షల చేప పిల్లలను మాత్రమే పెంచారు. ఈసారి మాత్రం గుడ్లు ఇంతవరకు పోయలేదు. గుడ్లు తీసుకురావాల్సిఉంది ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగితే జిల్లాలో 1.75 కోట్ల చేప పిల్లల పంపిణీ కోసం సిద్ధం చేసి పంపిస్తాం. కిన్నెరసాని ఉత్పత్తి కేంద్రానికి చేప గుడ్లను కరీంగనగర్ నుంచి తేవాల్సి ఉంది. –ఇంతియాజ్ అహ్మద్, జిల్లా మత్స్యశాఖ అధికారిసమయం దాటితే.. చేప పిల్లలను సీజన్ ప్రారంభంలో చెరువుల్లో వదిలితే 8,9 నెలల్లో చేపలు పెరిగి ఆశించిన దిగుబడి లభిస్తుంది. కానీ అదును దాటాక చేప పిల్ల లను పోసినా ఉపయోగం ఉండదు. ఆలస్యమైతే చేపలు ఎదగపోవడంతోపాటు దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా జూలైలో 50, 60 రోజుల చేప పిల్లలను చెరువుల్లో వదులుతారు. ఫిబ్రవరి, మార్చి నాటికి చేప ఎదుగుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీకి ప్రతిపాదనలే రూపొందించలేదు. గుడ్లు తెచ్చి పిల్లల పెంపకం చేపట్టలేదు. జూలై తర్వాత పిల్లలను కొనుగోలు చేసి వదిలినా చేప ఎదిగే అవకాశం ఉండదు. మార్చి నాటికి చెరువుల్లో నీట్టిమట్టం కూడా తగ్గిపోతుందని, ఈ ఏడాది ఉచిత చేప పిల్లలు లేనట్టేనని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. -
బాల్యం వికసించేలా..
● ఆపరేషన్ ముస్కాన్తో బాలకార్మికులకు విముక్తి ● ఈ నెల 31 వరకు కార్యక్రమాలు ● జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు ● గత మూడేళ్లలో 251 మంది గుర్తింపు, సంరక్షణకొత్తగూడెంటౌన్: అనాథలు, బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆపరేషన్ ముస్కాన్తో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తోంది. బాల కార్మికులను గుర్తించి వారి భవిష్యత్కు అండగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మికుల కోసం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022 నుంచి 2025 వరకు దాదాపుగా 251 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కలిగించినట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినా తెలిపారు. హోటళ్లు, బట్టల షాపులు, ఇటుకల నిర్మాణ, భవన నిర్మాణ ప్రదేశాలు, బేకరీలు, సినిమాహాళ్లతోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతూ బాలకార్మికులను గుర్తిస్తున్నారు. జిల్లా సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖలు, బాలల సంరక్షణ బృందాలు, చైల్డ్లైన్(1098), బాలల సంక్షేమ సమితి, ప్రత్యేక బాలల విభాగం, జాతీయ బాల కార్మిక విభాగాల సమన్వయంతో సబ్ డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలకార్మికులను రక్షిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ఆలనాపాలనకు నోచుకోని పిల్ల లు, తప్పిపోయిన పిల్లలు, అనాథలు, బాల కార్మికులుగా దుర్భర జీవితం సాగిస్తున్న చిన్నారులకు ఆపరేషన్ ముస్కాన్తో భరోసా కల్పిస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికలతో పనులు చేయిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఏటా జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్, జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుర్తించిన బాల కార్మికులకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద బాల సహాయక కిట్లు ఇవ్వడంతోపాటు సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తోంది. బాలలతో పనులు చేయించడం నేరం బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్ చేపడుతున్నాం. 31వ తేదీ వరకు తనిఖీలు కొనసాగిస్తాం. బాలబాలికలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తాం. బాల కార్మికులను గుర్తించి వారికి విద్య నేర్పించేందుకు కృషి చేస్తాం. బాలకార్మికులతో ఎవరైనా పనులు చేయిస్తే 1098కు సమాచారం ఇవ్వాలి. స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమశాఖ అధికారి గత మూడేళ్లలో విముక్తి కల్పించిన బాలల వివరాలు ఏడాది ఆపరేషన్ బాలురు బాలికలు మొత్తం 2022 స్మైల్ 30 05 35 2022 ముస్కాన్ 56 12 68 2023 స్మైల్ 22 09 31 2023 ముస్కాన్ 28 05 33 2024 స్మైల్ 14 07 21 2024 ముస్కాన్ 21 02 23 2025 స్మైల్ 33 07 40 మొత్తం 204 47 251 -
ఆదివాసీల సంక్షేమానికి కృషి
కొత్తగూడెంఅర్బన్: ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని గంగమ్మ కాలనీ గొత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పిల్లలకు విద్య నేర్పిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వర్షాకాలంలో ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం 27 కుటుంబాలకు దుప్పట్లు, దోమ తెరలను పంపిణీ చేశారు. విద్యుత్, మొబైల్ నెట్వర్క్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మద్దె గుంపునుకు చేరుకుని అక్కడ నివసిస్తున్న ఆదివాసీ ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జి.నరేందర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, కార్తీక్, లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
900 గ్రాముల గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 900 గ్రాముల గంజాయిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎస్ఐ సంధ్య ఆధ్వర్యాన తనిఖీలు చేస్తుండగా.. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ మోహిత్ గంజాయి అమ్ముతూ కొత్త బస్టాండ్ సమీపంలోని గుట్టపై పట్టుబడ్డాడు. ఆయన నుంచి రూ.30 వేల విలువైన 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాక కొనుగోలుకు వచ్చిన గోపాలపురం, జహీర్పురవాసులు బాదావత్ ప్రవీణ్, దూర్ సందీప్, దోన్వాన్ సాయివినయ్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక సీజ్ పాల్వంచ: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పట్టణ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన లారీ ఇసుకను రెవెన్యూ ఆర్ఐ రవికుమార్ సీజ్ చేశారు. అనంతరం ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాంట్రాక్టర్స్కాలనీలో చోరీ? పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్కాలనీలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు సమాచారం. స్థానికుల కథనం మేరకు.. ఓ మహిళ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా.. ఘటనపై విచారిస్తున్నామని తెలిపారు. ఒక్కటే గుక్క.. ఊపిరి తీసింది.. కరకగూడెం: శీతలపానియం సీసా కనిపిస్తే తీసుకుని ఒక్క గుక్క వేశాడు.. అంతే అదే ఆ బాలుడి ప్రాణాలు బలికొంది. అందులో ఉన్నది పురుగులమందు అని తెలియక తాగిన బాలుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి తనువుచాలించాడు. మండలంలోని చొప్పల గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల రెండో సంతానం వరుణ్ తేజ (5) గత నెల 29న ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో తన తండ్రి గ్రామంలో ఓ వ్యక్తి అడిగాడని ఖాళీ శీతలపానియం సీసాలో గడ్డిమందు పోసి ఇంటి ముందు పెట్టి ఊర్లోకి వెళ్లాడు. అది చూసిన వరుణ్ తేజ తాగాడు. కొన్ని క్షణాల్లోనే తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పలువురు దాతలు కూడా ఆర్థిక సాయం చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి వరుణ్ తేజ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. మృత్యువుతో పోరాడి ఓడిన బాలుడు వరుణ్ తేజ -
రామాలయంలో సెక్యూరిటీ పటిష్టం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. రెండు డోర్ ఫ్రేమ్లను, మెటల్ డిటెక్టర్, ఆరు హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్లను కొనుగోలు చేసి శుక్రవారం ఆలయంలో అమర్చారు. ఎస్పీఎఫ్ సిబ్బంది భక్తులను తనిఖీ చేసి అనుమతించారు. ఈఈ రవీందర్ పర్యవేక్షించారు. వస్త్ర దుకాణ టెండర్దారుడికి రూ.లక్ష జరిమానా అన్యమత ప్రచారం చేసే కవర్లను దేవస్థానంలో వినియోగించినందుకు దేవస్థానం అఽధికారులు వస్త్ర దుకాణ టెండర్దారుడికి రూ.లక్ష జరిమానా విధించారు. నెల రోజుల క్రితం ఆంధ్రాకు చెందిన ఓ భక్త జంట స్వామివారి వస్త్రాలను ఆలయ ప్రాంగణంలో కొనుగోలు చేయగా, వాటిని ఆ దుకాణ దారుడు ఓ కవర్లో పెట్టి ఇచ్చారు. పరిశీలించగా కవరుపై అన్యమత ప్రచారం ఉంది. ఆ దంపతులు ఈఓకు ఫిర్యాదు చేయగా, ఏఈవో శ్రవణ్కుమార్ను విచారణకు ఆదేశించారు. ఆయన విచారించి ఇచ్చిన నివేదిక ఆధారంగా, దేవాదాయ శాఖ నిబంధనలను అతిక్రమించి అన్యమతం ప్రచారం చేసినందుకు ఈఓ రూ.లక్ష జరిమానా విధించారు. మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు -
నానో యూరియాతో సత్ఫలితాలు
ఇల్లెందురూరల్: సత్వర ప్రయోజనం అందించే నానో యూరియా వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు సూచించారు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యూరియా విక్రయ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఇల్లెందుకు చేరిన యూరియా, విక్రయం, ప్రస్తుతం ఉన్న నిల్వల వివరాలు తెలుసుకున్నారు. విక్రయ కేంద్రం వద్ద ఉన్న రైతులతో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష ఎకరాల వరకు మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రోజూ 40 టన్నుల యూరియా ఇల్లెందుకు రవాణా అవుతోందని తెలిపారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్, ఏడీఏ లాల్చంద్, ఏవో సతీష్, పీఏసీఎస్ సీఈవో హీరాలాల్, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు -
కొత్తగూడెం టూ కిరండోల్
కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ● రెడ్కారిడార్లో రైల్వే కనెక్టివిటీ పెంపునకు చర్యలు ● కచ్చితమైన సమాచారం కోసం లైడార్ సర్వేకు ఆదేశాలు ● గతంలోనే ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టిన అధికారులుదేశవ్యాప్తంగా ప్రాథమిక సర్వే రిపోర్టులను పరిశీలించిన రైల్వేశాఖ అందులో ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఏ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఫలానా రైల్వే లైను నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ కేటాయింపునకు ముందు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను చేపడుతుంది. రైలుమార్గం వెళ్లే దారిలో వర్షాల ప్రభావం, వరద, కాంటూరు లెవల్స్, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ఉపయోగించాలి? నిర్మాణ ప్రదేశాలకు మ్యాన్ పవర్ను ఎలా పంపాలి, వారికి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి. నిర్మాణ సామగ్రిని చేరవేయడం ఎలా? అనే ప్రతీ అంశంలో క్షుణ్ణంగా వివరాలను సేకరించి రిపోర్టు తయారు చేస్తారు. సమగ్ర వివరాల సేకరణసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కొత్తగూడెం – కిరండోల్ కొత్త రైల్వేలైన్ నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టాలని గత నెల 28న ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం, కిరండోల్ ప్రాంతాల మధ్య 180 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో కొత్తగూడెం నుంచి పాండురంగాపురం వరకు ఇప్పటికే రైలుమార్గం అందుబాటులో ఉంది. మణుగూరు–భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) సెక్షన్లో ఉన్న పాండురంగాపురం నుంచి కిరండోల్ వరకు కొత్తగా 160.33 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించాల్సి ఉంటుంది. గోదావరి నదిపై వంతెన నిర్మించడంతోపాటు పాండురంగాపురం రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం వరకు 9.50 కిలోమీటర్ల మేర నూతన మార్గం నిర్మించాల్సి ఉంది. ఆ తర్వాత దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రునిపేట, అడవి రామవరంల మీదుగా మరో 12.32 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోకి ఈ మార్గం ప్రవేశిస్తుంది. గంగ్రేల్, గొల్లపల్లి, చింతల్నార్, నీలంపల్లి , తమోడిల మీదుగా కిరండోల్కు ఈ మార్గం చేరుకుంటుంది. 160 కిలోమీటర్ల లైన్లో తెలంగాణ పరిధిలో 22 కిలోమీటర్లు ఉండనుంది. ప్రకటన వచ్చినా నిధులు కేటాయించలే.. భద్రాచలం–మల్కన్గిరి (ఒడిశా) కొత్త లైను నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చజెండా ఊపింది. రెండు పట్టణాల మధ్య 173 కిలోమీటర్ల మేరకు రైల్వేలైను నిర్మించేందుకు 2022 జూన్లో ప్రాథమిక సర్వే రిపోర్టు వచ్చింది. ఇందులో ఒడిశా పరిధిలో మల్కన్గిరి, బదాలి, కోవాసిగూడ, రాజన్గూడ, మహరాజ్పల్లి స్టేషన్లు ఉండగా ఆంధ్రప్రదేశ్లో కన్నాపురం, కూటుగుట్ట, పల్లు, నందిగామ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురం స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలుమార్గం దారిలో గోదావరి, శబరి నదులతోపాటు పలు ప్రాంతాల్లో 213 వంతెనలు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3,592 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత రెండేళ్లకు వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతున్నట్టు 2024 ఆగస్టులో కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కానీ గత రైల్వే బడ్జెట్లో ఈ లైనుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదే విధంగా మణుగూరు – రామగుండం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి రైల్వేలైన్ల పరిస్థితి కూడా సర్వేల దశను దాటి అడుగు ముందుకు పడటం లేదు.లైడార్ సర్వేకు నిర్ణయం.. ప్రస్తుతం కిరండోల్కు విశాఖపట్నం నుంచి మాత్రమే రైలుమార్గం అందుబాటులో ఉంది. ఈ మార్గం నిడివి 440 కి.మీలుగా ఉంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా కొత్తగూడెం–కిరండోల్ రైలుమార్గాన్ని నిర్మిస్తామంటూ 2014/15లో బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించింది. ఆ తర్వాత 2018 ప్రాథమిక సర్వే చేపట్టింది. 2023 సెప్టెంబర్లో ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టారు. కానీ ఆ తర్వాత ఈ లైను విషయంలో ఉలుకూపలుకు లేకుండా పోయింది. తాజాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం–కిరండోల్ మార్గం తెర మీదకు వచ్చింది. దీంతో రెండోసారి ఫైనల్ లొకేషన్ సర్వే చేపడుతున్నారు. ఈసారి మరింత కచ్చితమైన సమాచారం కోసం లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సర్వే కూడా చేపట్టాలని నిర్ణయించారు. -
ప్రైవేట్ మందులే దిక్కు..
● పల్లెల్లో కానరాని పశువైద్యం ● మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ● ఏడు నెలలుగా నిలిచిన సరఫరా ● ప్రైవేట్లో మందులు కొంటేనే పశువులకు వైద్యం బూర్గంపాడు: జిల్లాలో పశువైద్యం ప్రైవేట్లో మందులు కొంటేనే సాధ్యపడుతోంది. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలోని పశు వైద్యశాలలకు ఏడునెలలుగా మందుల సరఫరా నిలిచిపోయింది. గత నవంబర్లో వచ్చిన మందులే తప్ప ఇంతవరకు సరఫరా జరగలేదు. పశువులకు ఏదైనా రోగమొచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి గాయపడినా పశు వైద్యశాలల్లో మందులు లేవు. దీంతో పశువుల పెంపకందారులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో మందులు కొనుక్కుంటేనే వైద్యం అందించే పరిస్థితులున్నాయి. పశు వైద్యశాలల్లో మందుల కొరతతో సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్న ఘటనలు ఎదురవుతున్నాయి. కనీసం నట్ట ల నివారణ మందులు కూడా పశు వైద్యశాలల్లో లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లుగా నట్టల మందులు కరువు.. జిల్లాలో 2.12లక్షల గేదెలు, ఆవులు ఉన్నాయి. సుమారు 3.25లక్షల మేకలు, గొర్రెలున్నాయి. ఇవి కాకుండా పందులు, పెంపుడు కుక్కలు కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. పశువులకు, జీవాలకు వైద్యసేవలు అందించేందుకు జిల్లాలో 80 ప్రభుత్వ పశువైద్యశాలలున్నాయి. పశువులకు వైద్యం చేసేందుకు డాక్టర్లు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నా రు. అయితే పశువుల ఆస్పత్రులకు మందుల కొర త తరచుగా వేధిస్తోంది. వర్షాకాలం పశువులు, జీవాలలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ తరుణంలోనే పశువులకు, జీవాలకు ప్రభుత్వపరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని పశువైద్యశాలల్లో యాంటీ బయాటిక్స్ కొరత ఎక్కువగా ఉంది. వ్యాధుల నివారణకు యాంటీ బయాటిక్స్తో పాటుగా బలానికి ఇచ్చే సపోర్టింగ్ మందులు (విటమిన్, మినరల్స్) కూడా అందుబాటులో లేవు. అనారోగ్యంతో ఆస్పత్రులకు తీసుకువచ్చిన పశువులకు తక్షణ శక్తి కోసం ఇచ్చే సెలెన్ బాటిళ్లు కూడా లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. మేకలు, గొర్రెలకు మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులు వేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా నట్టల నివారణ మందుల సరఫరా లేకపోవటంతో జీవాల పెంపకందారులు ప్రైవేట్ దుకాణా ల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. కనీసం నట్టల నివారణ మందులు కూడా లేకపోవటం ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. వైద్యం కోసం పశువుల పెంపకందారులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే మందుల చీటీ రాయించుకుని ప్రైవేట్ దుకాణాల్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే వైద్యం చేసే పరిస్థితులున్నాయి. -
స్వర్ణకవచ ధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: అశ్వారావుపేటలోని ప్రాంతీయ ఆస్పత్రిలో మత్తు వైద్య నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈనెల 10వ తేదీ లోగా ఐడీఓసీలోని జిల్లా ఆస్పత్రుల ప్రధాన కార్యాలయంలో అందజేయాలని కోరారు. వైద్య నిపుణుడికి నెలకు వేతనం రూ.1.50 లక్షలు చెల్లించనున్నట్లు తెలిపారు. స్కౌట్ మాస్టార్ పోస్టులకు.. పాల్వంచరూరల్: జిల్లాలోని 23 మండలాల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన స్కౌట్ మాస్టార్లు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్కౌట్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గద్దల రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు స్కౌట్ మాస్టార్లుగా అర్హులని పేర్కొన్నారు. పాల్వంచ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న మహిళాశక్తి హోటల్లో దరఖాస్తులు అందజేయాలని, ఎంపికై న స్కౌట్ మాస్టార్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తారని వివరించారు. తాలిపేరులోకి వరదనీరు..చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరుతోంది. రెండు నెలలపాటు సాధారణ నిర్వహణ పనులను పూర్తి చేసిన అధికారులు శుక్రవారం ప్రాజెక్ట్ 25 స్పిల్వే గేట్లను దించివేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరదనీరు వస్తుండగా, గేట్లను దించిన దగ్గర నుంచి ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. కనిష్ట నీటిమట్టం 69 మీటర్లు, గరిష్ట నీటిమట్టం 74 మీటర్లు కాగా, గురువారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 70.65 మీటర్లుగా నమోదైంది. నాలుగైదు రోజులపాటు వరద ప్రవాహం కొనసాగితే ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. డీఈ తిరుపతి, ఏఈలు ఉపేందర్, సుమన శుక్రవారం ప్రాజెక్ట్ను పర్యవేక్షించారు. -
విత్తన చాలెంజ్లో సత్తా
టేకులపల్లి: కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఇచ్చిన విత్తన చాలెంజ్ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలలు సత్తా చాటాయి. 13 కేజీల 985 గ్రాముల విత్తనాలు సేకరించి సులానగర్ కాంప్లెక్స్లోని హనుమాతండా ఎంపీపీఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంఈఓ అజ్మీర జగన్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి కాంప్లెక్స్లో 4 కేజీల 600 గ్రాములతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సులానగర్ కాంప్లెక్స్లో 13 కేజీల 985 గ్రాములతో ఎంపీపీఎస్ హనుమాతండా , బొమ్మనపల్లి కాంప్లెక్స్లో కేజీతో ఎంపీపీఎస్ బొమ్మనపల్లి, ముత్యాలంపాడు కాంప్లెక్స్లో 4 కేజీల 900 గ్రాములతో ఎంపీయూపీఎస్ తావుర్యాతండా, బోడు కాంప్లెక్స్లో 2 కేజీల 900 గ్రాములతో ఎంపీపీఎస్ బర్లగూడెం, కుంటల్ల కాంప్లెక్స్లో 4 కేజీలతో ఎంపీపీఎస్ దాసుతండా పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు, విజేత పాఠశాలల హెచ్ఎంలు మోహన్రావు, దేవ దాసు, మంగీలాల్, రామచంద్రసింగ్, అజ్మీర జగన్నాయక్, స్వర్ణలత, పద్మ, జైల్సింగ్, రమేశ్బాబు, విజయనిర్మల పాల్గొన్నారు. విజేతగా నిలిచిన హనుమాతండా పాఠశాల -
డంపింగ్యార్డులో గిరిజనుల నిరసన
అశ్వారావుపేటరూరల్: తమ పట్టా భూములను జాయింట్ సర్వే చేసి అప్పగించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్నంగా ఓ డంపింగ్యార్డు లో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని రామన్నగూడేనికి చెందిన 150 మంది గిరిజనులకు సర్వే నంబర్లు 30,36, 39లో 573 ఎకరాలకు సంబంధించి తమ పూర్వీకుల నుంచి పట్టాలు కలిగి ఉన్నారు. కాగా, ఈ భూములు కొన్నేళ్లుగా అటవీ, ఎఫ్డీసీ ఆధీనంలో ఉండగా ఆయా భూముల్లో టేకు, వెదు రు ప్లాంటేషన్లు ఉన్నాయి. ఈ భూములను నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్తోపాటు హైకోర్టు పూర్వ పట్టాలు ఉన్న గిరిజనులకు సర్వే చేసి అప్పగించా లని 13 ఏళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఈ భూములను జాయింట్ సర్వే చేసేందుకు రెవెన్యూ, ఫారెస్టు, ఎఫ్డీసీ అధికారులు ముందుకు రాకపోవడంతో ఏళ్లుగా గిరిజనులు తమ భూము లు అప్పగించాలని దశలవారీగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా రామన్నగూడెం పంచాయతీ డంపింగ్ యార్డులో బాధిత గిరిజనులు తమ వద్ద ఉన్న పూర్వ పట్టాలను చేతుల్లో పట్టుకొని గంటపాటు నిరసన వ్యక్తం చేసి, జాయింట్ సర్వే చేయాలని డిమాండ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
టీఎల్యూడీ పద్ధతిలో బయోచార్ తయారీ
సుజాతనగర్: టీఎల్యూడీ (టాప్ లిట్ అప్డ్రాఫ్ట్) పద్ధతిలో నాణ్యమైన బయోచార్ తయారు చేయవచ్చని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని వేపలగడ్డకు చెందిన కుందూరు లక్ష్మీనారాయణరెడ్డి వెల్డింగ్ దుకాణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బయోచార్ యూనిట్ ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 30 కిలోల వేస్ట్ కట్టె ముక్కలను చిన్నచిన్న ముక్కలుగా చేసి మండించడం ద్వారా 10 కిలోల నాణ్యమైన బయోచార్ను కలెక్టర్ తయారు చేయగలి గారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలా తయారైన బయోచార్ను ఆవుపంచకం (ఆవుపేడ మొదలైనవి)తో కలిపి కొన్ని రోజులు నిల్వ ఉంచి ఆరబెట్టి, పొడిగా చేసి పంటలకు ఎరువుగా ఉపయోగించాలని సూచించారు. జిల్లాలోని రైతువేదికల ద్వారా బయోచార్ తయారీ విధానం గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విరివిగా లభించే తుమ్మ చెట్టు కొమ్మలు, రహదారులు, కరెంట్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను ఉపయోగించి తక్కువ ఆక్సిజన్లో టీఎల్యూడీ పద్ధతిలో బయోచార్ తయారు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు బయోచార్ తయారు చేసి, విక్రయించడం ద్వారా లాభం పొందొచ్చని సూచించారు. బయోచార్ తయారీ సమయంలో ఉత్పన్నమయ్యే వేడిని ఎలా ఉపయోగించుకోవచ్చో, బయోచార్ తయారీ విధానాన్ని మరింత తక్కువ ఖర్చు తో, సులభతరంగా రైతులు ఉపయోగించుకునేలా రూపొందించడానికి వివిధ పద్ధతులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీడీ విద్యాచందన, ఎంపీడీఓ బి.భారతి, ఏఓ నర్మద తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ -
సింగరేణిలో 21 మంది అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 21 మంది ఫైనాన్స్ అధికారులను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్వోడీ ఏజే మురళీధర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీఅయిన వారిలో డీజీఎం, ఫైనాన్స్ మేనేజర్, ఇద్దరు డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్లు, 8 మంది సీనియర్ అకౌంట్ ఆఫీసర్లు, నలుగురు మేనేజ్మెంట్ ట్రైనీలు, ఐదుగురు జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరూ ఈ నెల 12వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య
సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి నిర్వహించారు. తొలుత కొమరయ్య చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమరయ్య అని కీర్తించారు. తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది దొడ్డి కొమరయ్య పేరని వ్యాఖ్యానించారు. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్పవీరుడని కొనియాడారు. మాజీ సీఎం రోశయ్యకు నివాళి బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య జయంతి నిర్వహించారు. మొదట రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ పనినైనా నిబద్ధతతో చేసే ఆయన ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా రాష్ట్రానికి విశేష సేవలందించారని కొనియాడారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, క్రీడల అధికారి పరంధామరెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, బీసీ సంక్షేమాధికారి ఇందిర, కురుమ సంఘం సభ్యులు దూడల బుచ్చయ్య, లింగయ్య, రవికుమార్, చంద్రశేఖర్, దూడల కిరణ్, సుంక ప్రవీణ్, కోటిలింగం, సంపత్కుమార్, కె.రవి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏలో..భద్రాచలం: మాజీ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్యకు ఐటీడీఏలో శుక్రవారం ఘనంగా నివాళుల ర్పించారు. పీఓ బి.రాహుల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ ఆలయ పరిసరాల్లో భక్తులు బస చేసే, భక్తులు వచ్చే పలు ప్రదేశాలను సందర్శించారు. రామాలయం, అన్నదాన సత్రం, గోదావరి కరకట్ట, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడుతూ శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియానికి సులువుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంబేద్కర్ సెంటర్లోని మహనీయుల విగ్రహాలను సందర్శించి, మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో డేవిడ్ రాజ్, మణెమ్మ, హరీష్, భాస్కరరావు, ఉదయ్ కుమార్, రమేష్, వేణు, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రావు, హరికృష్ణ, ఆదినారాయణ, అలివేలు మంగతాయారు, శ్రీనివాస్, రవీందర్, వెంకటేశ్వర్లు, వీరభద్రం పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సజావుగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జయలక్ష్మి సూచించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడారు. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా కోసం కమ్యూనిటీ స్క్రీనింగ్పై దృష్టి సారించాలని, శిశువులకు యాంటెనటల్ కేసుల నమోదు చేయాలని, రోగనిరోధక కవరేజీని వందశాతం సాధించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ స్పందన, డాక్టర్ పుల్లారెడ్డి, సీహెచ్ఓ నాగభూషణం, బి.సోమ్లా నాయక్, జిల్లా స్థాయి పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఫోన్లు తనిఖీ.. పోలీసులకు ఫిర్యాదుఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా కార్మిక సంఘాల నేతల ఫోన్లు విజిలెన్స్ బృందం తనిఖీ చేసిన విషయమై ఓ కార్మిక సంఘం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసులు అటు కార్మిక సంఘాల నేతలను, సింగరేణి ఎస్అండ్పీసీ నేతలను పోలీస్ స్టేషన్కు పిలిచి వాకబు చేశారు. రెండు రోజుల కిందట రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు వేర్వేరు కార్మిక సంఘాల నేతల ఫోన్లు సింగరేణి విజిలెన్స్ విభాగం టీంసభ్యులు తనిఖీ చేశారు. ఓ నేత ఫోన్ నుంచి డేటా డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో డ్యూటీలో ఉన్న తన ఫోన్ అనుమతి లేకుండా స్వాధీనం చేసుకుని తనిఖీ చేయడంపై సదరు నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు రహస్యంగా సింగరేణి అధికారులను విచారిస్తున్నారు. చేయూత పెన్షన్లపై అవగాహనచుంచుపల్లి: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోస్టల్ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లకు చేయూత పెన్షన్లపై శుక్రవారం ఐడీఓసీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భర్త/భార్య చనిపోతే భాగస్వామి పెన్షన్ పొందడం, పెన్షన్ డ్రా చేయని ఖాతాలు, చనిపోయిన వారి పేర్లను తొలగించటం, పంచాయతీ కార్యదర్శి ధ్రవీకరణ వంటి అంశాలపై సెర్ప్ డైరెక్టర్ గోపాలరావు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ ఎం విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటి సీఈఓ చంద్రశేఖర్, డీపీఓ చంద్రమౌళి, సెర్ప్ అదనపు డీఆర్డీఓ నీలేష్, సిబ్బంది కె.చంద్రశేఖర్, రవి, లోకేష్ పాల్గొన్నారు. కేటీపీఎస్లో ఆర్టిజన్కు కరెంట్ షాక్పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో ఓ ఆర్టిజన్ కార్మికుడు విద్యుదాఘతానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. సీతారాంపట్నం సబ్స్టేషన్ పరిధిలో పనిచేసే ఆర్టిజన్ కార్మికుడు ఆర్.కాంతారావు కేటీపీఎస్ కర్మాగారంలో స్విచ్ యార్డ్ వద్ద 220 కేవీ లైన్ జంపర్లను కలిపేందుకు గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇండక్షన్ జరిగి కరెంట్ షాక్కు గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సీఆర్పీ చేసి కేటీపీఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొత్తగూడెం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తోటి కార్మికులు తెలిపారు. వైద్యం వికటించిందని ఆందోళన పాల్వంచ: వైద్యం వికటించిందని బాధితురాలు ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించింది. బాధితురాలి కథనం ప్రకారం.. వికలాంగులకాలనీకి చెందిన భూక్యా అరుణ శాసీ్త్రరోడ్ రెండోబజార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి నీరసంగా ఉందని చెప్పడంతో వైద్యుడు రెండు చేతులకు క్యాన్లా పెట్టారు. అనంతరం చేతులు రెండు వాచిపోయి గడ్డలు వచ్చాయి. దీంతో కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లగా వైద్యం వికటించిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకు రూ.లక్ష వరకు ఖర్చు అయింది. ఇంకా చికిత్స అందించాల్సి ఉందని తెలపడంతో ఇచ్చే స్తోమత లేదని వాపోయారు. అందుకు కారణమైన పాల్వంచ ఆస్పత్రికి అరుణ కుటుంబ సభ్యులు వచ్చి బైఠాయించి ఆందోళన తెలిపారు. దీంతో ఆస్పత్రి వైద్యులు పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిందని, పరిశీలిస్తున్నామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాంకుడోత్ వినోద్ (35) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. బోయితండా పంచా యతీ లక్ష్మీనారాయణతండాకు చెందిన వాంకుడోత్ వినోద్, అదే గ్రామానికి చెందిన ప్రేంకుమార్ బైక్పై ఇల్లెందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మామిడిగూడెం వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను తప్పింబోయి నేరుగా చెట్టుకు ఢీకొన్నారు. ప్రమాదంలో వినోద్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రేంకుమార్కు గాయాలయ్యాయి. ఇతడిని స్థానికులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అపస్మారక స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి ఇల్లెందురూరల్/ఇల్లెందు: మండలంలోని సుభా ష్నగర్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తుతెలియ ని వ్యక్తి రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఇల్లెందు పోలీసులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యు ల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 87128 2070 నంబర్లో సంప్రదించాలని ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కోరారు. రేషన్ బియ్యం పట్టివేతజూలూరుపాడు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. సుజాతనగర్ మండలం చింతలతండాకు చెందిన మాలోత్ వినోద్కుమార్ జూలూరుపాడు మండల పరిసర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలుచేసి, అధికధరకు అమ్ముకుంటున్నాడు. గుండ్లరేవు గ్రామం నుంచి వినోద్కుమార్ తన ట్రాలీలో రేషన్బియ్యాన్ని సుజాతనగర్ వైపు తరలి స్తుండగా భేతాళపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ట్రాలీని స్వాధీనం చేసుకుని, వినోద్కుమార్ను అదుపులోకి తీసుకున్నామని, బియ్యం విలువ సుమారు రూ.11,000 ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవి పేర్కొన్నారు. వివాహిత ఆత్మహత్యబూర్గంపాడు: మండల కేంద్రంలోని ముదిరాజ్బజార్కు చెందిన నీరుడు సంధ్య (38) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంధ్య తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కుటుంబసభ్యులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శుక్రవారం భర్త శేషయ్య పనులకు వెళ్లిన తరువాత సంధ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కుమారులు చంద్రశేఖర్, లోకేశ్ ఉన్నారు. మృతురాలి చెల్లెలు మేకల లీలావతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని సీతారాంపురం శివారు వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందగా శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫలించిన ‘అంగన్వాడీ బాట’
● కొత్తగా 13,760 మంది చిన్నారుల చేరిక ● ఐదేళ్లు నిండిన 6,154 మంది పాఠశాలల్లో చేరిక ● టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మరింతమంది చేరే అవకాశం భద్రాచలంఅర్బన్ : రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 10 నుంచి 17 వరకు నిర్వహించిన ‘అమ్మమాట – అంగన్ వాడీ బాట’ కార్యక్రమం విజయవంతమైంది. అంగన్వాడీ కేంద్రాలు అందించే సేవలను తల్లిదండ్రులకు వివరించడంతో జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 13,760 మంది చిన్నారులు చేరగా, 3,966 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. పౌష్టికాహారం, ఆటపాటలతో విద్య.. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం, గుడ్డు, మురుకులు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు కూడా పాలు, గుడ్డు వంటి పోషకాహారం అందుతోంది. ఆటపాటలు, కథలు, సంభాషణ నైపుణ్యాలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పుతున్నారు. పుట్టిన వెంటనే తల్లులు, చిన్నారుల పేర్లను అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయడం ద్వారా బాలింతలకు పోషకాహారం, చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నారు. ఖాళీల భర్తీతో మరింత బలోపేతం.. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 1,869 మంది టీచర్లు, 1,103 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇంకా 191 టీచర్ పోస్టులు, 957 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమీప కేంద్రాల టీచర్లు ఖాళీగా ఉన్న కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది వారికి అదనపు భారంగా మారుతోంది. గతేడాది నుంచి ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపినా ఇంకా భర్తీ చేయలేదు. పోస్టుల భర్తీతో పాటు ఆయా సెంటర్లకు పక్కా భవనాలు నిర్మిస్తే లబ్ధిదారులకు మరింతగా సేవలు అందే అవకాశం ఉంటుంది. ఆరు నెలలుగా అద్దె పెండింగ్ కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు ఆరు నెలలుగా అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. అద్దె చెల్లించక ఇంటి యజమానుల నుంచి ఒత్తిడి ఎదురవుతోందని వాపోతున్నారు. అలాగే, రెండేళ్లుగా ఈవెంట్ బిల్లులు, మూడేసి నెలలుగా ఆరోగ్యలక్ష్మి, గ్యాస్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలో 785 అంగన్వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఒక్కో భవనానికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల చొప్పున ఆరు నెలలుగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అలాగే, సంక్షేమశాఖ ద్వారా అమలయ్యే కార్యక్రమాలు వివరించేందుకు ఈవెంట్లకు రూ.200 నుంచి రూ.500 వెచ్చిస్తుండగా ఒక్కో సెంటర్కు దాదాపు రూ.6 వేల నుండి రూ.9 వేల వరకు చెల్లించాల్సి ఉంది. అంగన్వాడీలకు వచ్చేలా చర్యలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమీప చిన్నారులు చేరేలా అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాం. వారం రోజుల్లోనే మంచి ఫలితాలు నమోదయ్యాయి. చిన్నారులను చేర్పించే కార్యక్రమం కొనసాగిస్తూనే, కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. అలాగే, అద్దె బకాయిలు, ఈవెంట్ బిల్లులపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించాం. చిన్నారులందరికీ యూనిఫామ్ ఇచ్చేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. – స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమశాఖ అధికారిఈసారీ కొందరికే యూనిఫామ్ కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ అందిస్తోంది. అయితే, జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయస్సు వారు 33,800 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలు 2,800 ఉన్నారు. అయితే, గత ఏడాది 612 కేంద్రాల్లోని 6,362 పిల్లలకే యూనిఫామ్ పంపిణీ చేశారు. అమ్మాయిలకు గౌన్, అబ్బాయిలకు నిక్కరు, చొక్కా కుట్టించి ఇవ్వగా.. మిగతా మిగతా కేంద్రాల్లో చిన్నారులకు నిరాశ ఎదురైంది. ఈసారి సైతం జిల్లాలో అదే సంఖ్యలో యూనిఫామ్ పంపిణీ చేయనున్నారని తెలుస్తుండగా.. అందరికీ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల చిన్నారులకు యూనిఫామ్ ఇచ్చి మిగతా వారిని విస్మరించడం సరికాదని చెబుతున్నారు. -
సీలింగ్ భూముల స్వాధీనం
ఖమ్మంఅర్బన్: సీలింగ్ భూములను లబ్ధిదారులు సాగు చేసుకోకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తేలడంతో స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈమేరకు ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు గ్రామంలో సర్వే నంబర్ 196లో ఉన్న 9.9 ఎకరాల భూమిని కోర్టు ఆదేశాలతో గురువారం ఖమ్మం అర్బన్ ఆర్ఐ వాహిద్, సర్వేయర్ నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటుచేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో.. సర్వేనంబర్ 196లోని భూములను గతంలో ఇద్దరు రైతులకు అసైన్మెంట్ రూపంలో కేటాయించారు. అయితే, స్వయంగా సాగు చేసుకోవాలే తప్ప విక్రయించొద్దనే నిబంధన విధించారు. కానీ వారిద్దరు ఇతరులకు అమ్మగా.. ఆపై ఇంకొన్ని చేతులు మారినట్లు తేలింది. ఈనేపథ్యాన కోర్టు సూచనల మేరకు 9.9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ సైదులు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించగా, ఎవరూ ఆక్రమించకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఇతరులకు అమ్మినట్లు తేలడంతో చర్యలు స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ.50కోట్లు!ప్లాట్ల యజమానుల్లో ఆందోళన సీలింగ్ భూములు తీసుకున్న వారు సాగు చేయకపోవడమే కాక ఇతరులకు విక్రయించారు. ఆపై చేతులు మారగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దక్కించుకుని ప్లాట్లుగా విడగొట్టి 80 మందికి విక్రయించినట్టు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకోవడంతో విషయం తెలియక ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియగానే పలువురు అక్కడకు చేరుకుని డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలించడం కనిపించింది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన సమర్పించి హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్, శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వార్షికాదాయం రూ.3లక్షలకు మించని అభ్యర్థులు శుక్రవారం లోగా http.// twd. telangana gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై ఆబ్జెక్టివ్ టైప్, ఆస్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి డీఎంహెచ్ఓ జయలక్ష్మి గుండాల : ప్రజల ఆరోగ్యంపై సిబ్బంది దృష్టి పెట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జయలక్ష్మి అన్నారు. ఆళ్లపల్లి పీహెచ్సీని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, రక్తహీనతపై ప్రతీ గ్రామాన్ని, పాఠశాలలను సందర్శించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. పాము, తేలు, కుక్క కాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని అన్నారు. నెలలు నిండిన గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. అనంతరం అనంతోగు బాలికల ఆశ్రమ పాఠశాల, మర్కోడు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి సికిల్సెల్ పరీక్షలను పరిశీలించారు. ఆమె వెంట వైద్యాధికారి సంఘమిత్ర, రేవంత్, సీహెచ్ఓ సోమ్లా నాయక్, ఎస్యూఓ హరికృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, హెచ్ఏ నరేష్, శ్రీధర్బాబు, రేవతి, సావిత్రి, రమణ తదితరులు పాల్గొన్నారు. -
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం కొత్తగూడెంఅర్బన్ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రకాల మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా.. వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. ఇన్సులిన్, మలేరియా మందుల సరఫరాకు కృషి చేస్తానని చెప్పారు. ‘భవిత’తో మనో వికాసం.. భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం కలుగుతుందని కలెక్టర్ అన్నారు. కొత్తగూడెం రైటర్ బస్తీలోని భవిత కేంద్రాన్ని గురువారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధనకు అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని, రెయిలింగ్, రాంప్ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు.ఫిజియోథెరపిస్టులు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. గోడౌన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోనికి వెళ్లనివ్వొద్దని సిబ్బందికి సూచించారు. మేకపాల విశిష్టతను తెలియజేయాలి.. జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజనులు, మహిళల వద్ద గల మేకల సంతతిని అభివృద్ధి చేయాలని, అధిక పాల దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన పశువైద్య అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేకపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. మేకపాల నుంచి పెరుగు, మజ్జిగ, జున్ను, పన్నీరు, చీజ్ వంటి ఉత్పత్తులు తయారు చేసి వినియోగించే పద్ధతులపై ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యకరమైన మేకపాలు అందించేందుకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటి మార్కెటింగ్ ద్వారా గిరిజనులు, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. బాతులు, కౌజు పిట్టల పెంపకంపై కూడా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నవీన్, పశువైద్యాధికారి ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్ల బదిలీ జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లు, ఏడుగురు నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. -
యూరియా కోసం పడిగాపులు
ఇల్లెందు: పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు యూరియా వేసేందుకు వస్తుండడంతో మార్కెట్లోని యూరియా విక్రయ కేంద్రం కిటకిటలాడుతోంది. గురువారం రెండు లారీల యూరి యాను రైతులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు ఇల్లెందు పీఏసీఎస్లో సుమారు 2వేల మంది రైతులు 300 టన్నులు యూరియా కొనుగోలు చేశారు. యూరియా బస్తాలను పీఏసీఎస్ వద్ద కొనుగోలు చేస్తుండగా.. డీఏపీ, 20:20 ఎరువులు మాత్రం ప్రైవేట్ వ్యాపారుల వద్ద తీసుకెళ్తున్నారు. వర్షాలకు ఏపుగా ఎదిగి వస్తున్న పంటలకు యూరియా అవసరం పెరిగింది. అయితే యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైనంత అందిస్తున్నానమని పీఏసీఎస్ సీఈఓ హీరాలాల్ తెలిపారు. -
ప్రజలకు నిత్యం అండగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: భారీ వర్షాలు కురుస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో, అండగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. డీడీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. రాబోయే వర్షాలదృష్యా ప్రమాదవశాత్తు వరదల్లో చిక్కుకునే వారిని రక్షించడానికి పోలీసులతో పాటు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డీడీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రెస్యూ సమయంలో అవసరమైన లైఫ్ జాకెట్లు, రోప్ల వంటి సామగ్రిని సమకూర్చుతామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేందర్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి మురహరి క్రాంతికుమార్, ఆరో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ రవి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
కునుకు లేదు
చినుకు పడితే..అసెంబ్లీలో చర్చిస్తానన్న పోలవరం ఎమ్మెల్యే.. పెదవాగు ఆయకట్టు మొత్తం 16 వేల ఎకరాల్లో 13 వేల ఎకరాలు ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోనే ఉంది. అందుకే ప్రాజెక్టు పునర్నిర్మాణానికి 80 శాతం నిధులు భరించేందుకు జీఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఫిబ్రవరి 11న అశ్వారావుపేటకు వచ్చినపుడు పెదవాగు అంశాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీలో ప్రాజెక్టు సమస్యపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే నాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగకున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నేరుగా సీఎంతో మాట్లాడొచ్చు కదా అని రైతులు అంటున్నారు. పోల‘వరం’ ఎమ్మెల్యే హామీ కూడా ఆచరణ సాధ్యం కాలేదని ఆవేదన చెందుతున్నారు. అశ్వారావుపేట : గోదావరి బేసిన్ పరిధిలోని పెదవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయకుండా ఏపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ ఆయకట్టు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేదాడి జూలై 18న క్లౌడ్బరస్ట్కు ప్రాజెక్టు కట్టతెగిన సంగతి తెలి సిందే. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సైతం సందర్శించారు. అనంతరం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశంలోనూ ఇరురాష్ట్రాల ఇరిగేషన్ అధి కారులు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సమష్టి అంగీకారం తెలిపారు. ఈ సీజన్కే సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని, ఆయకట్టు రైతులకు న్యా యం చేయాలని, దిగువ గ్రామాలకు వరద ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఇందుకు రూ.19 కోట్ల వ్యయంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో 80 శాతం నిధులు జీఆర్ఎంబీకి డిపాజిట్ చేసేందుకు ఏపీ అధికారులు అంగీకరించారు. ఇక ఆ తర్వాత నిధుల్లేవు, పనుల్లేవు. దీంతో రైతులు, లోతట్టు ప్రాంతాల వారి పరిస్థితి ‘చినుకు పడితే .. కునుకు లేదు’ అన్నట్టుగా మారింది. అటకెక్కిన తుమ్మల హామీ.. గతేడాది జూలై 18వ తేదీ రాత్రి పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోగా 21న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. పంటలు, ఇళ్లు దెబ్బతినడంపై విచారం వ్యక్తం చేయడమే కాక ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు కాదు.. రీడిజైన్ చేయడమే శాశ్వత పరిష్కారమని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. జీఆర్ఎంబీ, ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. 2025 వానాకాలం నాటికి రీ డిజైన్, నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. అయితే ఏడాది కావొస్తున్నా ఇవేమీ ఆచరణకు నోచుకోకపోవడంతో వారిలో నిరాశ అలుముకుంది. ‘రింగ్బండ్’కు ముప్పు.!అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్టులో రూ.కోట్ల వ్యయంతో తాత్కాలికంగా నిర్మించిన రింగ్బండ్కు వర్షాలు, వరదతో ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టికట్టకు బీటలు ఏర్పడుతుండగా, ఓ చోట భారీగా కోతకు గురై గుంత ఏర్పడింది. వర్షాలు ఇంకా కొనసాగితే మట్టికట్ట వద్ద గండి పడే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ. 3.50 కోట్లు వెచ్చించి నిర్మించిన రింగ్బండ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రింగ్బండ్పై ఆధారపడి పంటలు సాగు చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ●భయాందోళనలో పెదవాగు ఆయకట్టు రైతులు, లోతట్టు ప్రజలు ఏపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ అసహనం జిల్లా మంత్రి పరిచయాలు, ప్రయత్నాలు ఏమయ్యాయని నిలదీత -
అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ’
● ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకాలకు వసూళ్లు ● ఒక్కో ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి రూ.1.50 లక్షలు ! ● డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాక ఓ యువకుడి ఆత్మహత్య ● సదరు ఏజెన్సీపై చర్యలు చేపట్టని సింగరేణి అధికారులు నా చావుకు వారే కారణంమణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ప్రైవేట్, ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఇచ్చినా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో బాధితులు మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే పినపాక మండలానికి చెందిన యువకుడు పూనెం సంప్రీత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ సంఘటన సింగరేణిలో చర్చనీయాంశంగా మారగా, సూసైడ్ నోట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఒక్కో పోస్టుకు రూ. 1.50 లక్షలు! సదరు కంపెనీ 2024లో సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్ దక్కించుకోగా, 2025 డిసెంబర్తో గడువు ముగియనుంది. పోస్టులకు ప్రారంభం నుంచే డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు సదరు కంపెనీ సూపర్వైజర్ వసూళ్లు చేసినట్లు సమాచారం. సంప్రీత్ కూడా సూపర్వైజర్ అమరేందర్రెడ్డికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలలు గడుస్తున్నా ఉపాధి చూపకపోవడంతో పలుమార్లు అడుగగా అమరేందర్రెడ్డి ఖాళీ చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. చెక్కు ఇచ్చినా డబ్బులు అందక, ఉపాధి లభించక మరోవైపు అప్పు, వడ్డీలు కట్టలేక సంప్రీత్ మనోవేదన చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విప్పలసింగారానికి చెందిన ఓ యువకుడి నుంచి రూ. లక్ష తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కల్పించకపోవడంతో వడ్డీకి తెచ్చిన డబ్బులు కావడంతో కుటుంబ పెద్ద గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో పగిడేరుకు చెందిన కొందరు యువకులు రన్నింగ్లో ఎంపికై నా డబ్బులు డిమాండ్ చేయడంతో.. వారు సూపర్వైజర్కు డబ్బులు ఇచ్చి మోసపోయారు. స్థానిక పోలీస్స్టేషన్లో సంప్రదించి డబ్బులు తిరిగి పొందారు. చర్యలు తీసుకోని సింగరేణి యాజమాన్యం సింగరేణి నిర్వాసితులకు, ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు యాజమాన్యం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పిస్తుంది. కానీ సదరు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని స్థానికేతరులను నియమించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై డైరెక్టర్(పా), సెక్యూరిటీ జీఎంలకు ఫిర్యాదులు అందినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సింగరేణి యాజమాన్యం స్పందించి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు, కార్మిక నాయకులు కోరుతున్నారు. కాగా ఈ వ్యవహారంపై సింగరేణి మణుగూరు ఏరియా డీజీఎం (పర్సనల్) సలగల రమేష్ను వివరణ కోరగా.. సమస్యపై మురళి మ్యాన్ పవర్ కంపెనీ బాధ్యులతో చర్చించామని, సమస్యను పరిష్కరించాలని సూచించామని తెలిపారు. సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య పినపాక: సింగరేణి మణుగూరు ఏరియాలో కాంట్రాక్ట్ పద్ధతిన సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏడాది క్రితం డబ్బు వసూలు చేసిన సంస్థ.. ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరం చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పినపాక మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన పూనెం సంప్రీత్(25) సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం గతేడాది మురళీ మ్యాన్ పవర్ కంపెనీకి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఐదారు నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో సంస్థ సూపర్వైజర్ అమరేందర్రెడ్డిని నిలదీశాడు. దీంతో ఆయన సంప్రీత్కు ఖాళీ చెక్కు ఇవ్వగా.. ఆ చెక్కు కూడా బౌన్స్ అయింది. అయినా కంపెనీ వారు కోర్టు విచారణకు రాకపోవడం, మరోవైపు సంప్రీత్ చేసిన అప్పలకు వడ్డీలు పెరుగుతుండడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం పురుగుల మందు తాగగా.. కుటుంబుసభ్యులు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా, ‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి, నా చావుకు మురళీ మ్యాన్ పవర్ సెక్యూరిటీ ఏజెన్సీనే కారణం, ఏజెన్సీకి చెందిన మురళి, వెంకట్, మణికంఠ, అమరేందర్రెడ్డే బాధ్యులు’ అంటూ సంప్రీత్ రాసిన సూసైడ్ నోట్ గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. -
‘డ్రాగన్’ కాసులు!
ఏడెకరాల రాళ్ల భూమిలో రైతు వెంకటేశ్వరరావు ప్రయోగం ● నాటిన 20 నెలల్లో ప్రారంభమైన డ్రాగన్ పండ్ల దిగుబడి ● తొలి కాతలో ఎకరాకు ఐదు టన్నుల కాయలు ● టన్ను డ్రాగన్ పండ్లకు రూ. లక్ష ఆదాయం అశ్వారావుపేటరూరల్: రాళ్లభూమిలో ఓ రైతు ధైర్యంతో సాగు చేసిన డ్రాగన్ పంట కాపునకు వచ్చింది. అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామ శివారులో రైతు బిర్రం వెంకటేశ్వరరావు తన ఏడెకరాల చేలో దాదాపు ఇరవై నెలల క్రితం డ్రాగన్ తోట సాగు చేశాడు. ప్రయోగాత్మకంగా, లక్షలాది రూపాయాల పెట్టుబడితో సాగు చేపట్టాడు. దిగుబడి మొదలుకాగా రైతు మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ఎకరానికి ఐదు టన్నులు.. డ్రాగన్ తోటకు ఒక్కసారి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే దాదాపు ఇరవై ఏళ్లవరకు దిగుబడి వస్తుంది. పంట సాగుకు ఒక ఎకరానికి సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల దాకా ఖర్చు అవుతుండగా, ఎకరానికి దాదాపు నాలుగు వేల డ్రాగన్ మొక్కలు నాటుకోవచ్చు. ఎకరాకు 500 సిమెంట్ స్తంభాలు అవసరం కాగా, ఒక్కో స్తంభానికి 10 మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలకు డ్రిప్ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉండగా, ఈ పంట సాగుకు నీరు పెద్దగా అవసరం లేదు. పంట సాగు చేసిన 18 నెలల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైంది. ఏటా జూన్ మాసంలో పంట దిగుబడి మొదలై నవంబర్ వరకు ఉంటుంది. తొలిసారి పంట దిగుబడిగా ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు కాయలు దిగుబడి వచ్చాయి. తొలి ఏడాది దిగుబడి తక్కువ వచ్చినా రెండో ఏడాది నుంచి దిగుబడి రెండింతలు పెరిగే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ టన్ను ధర రూ.లక్ష వరకు ఉంది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో లాభదాయకంగా మారింది. డ్రాగన్ పండ్లను అశ్వారావుపేట, సత్తుపల్లి, ఏపీలోని విజయవాడ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నామని, తోట వద్ద కేజీ రూ.150కు విక్రయిస్తున్నామని రైతు తెలిపాడు. మార్కెటింగ్కు ఇబ్బందే.. పంట సాగుకు రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. అయినా ఆసక్తి ఉండటంతో ముందుకు సాగా. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ పండ్లకు డిమాండ్ ఉంది. కానీ విక్రయాలకు కొంతమేర ఇబ్బందులు ఉన్నాయి. కాయల కోత తర్వాత మూడు రోజుల్లోనే విక్రయించాలి. లేనిపక్షంలో కాయ దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దూర ప్రాంతాలకు రవాణా చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – బిర్రం వెంకటేశ్వరరావు, ఆసుపాక, అశ్వారావుపేట మండలం -
కిష్టారంలో ‘చావు’ కష్టాలు
టేకులపల్లి: మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో అంతిమ సంస్కారాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామానికి చెందిన కొర్స నర్సయ్య బుధవారం మృతి చెందాడు. శ్మశాన వాటిక ముర్రేడు వాగు అవతల వైపు ఉంది. దీంతో గురువారం దహనసంస్కారాలు చేసేందుకు వాగు దాటి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. సుమారు రెండు వేల ఎకరాల వ్యవసాయ భూములు కూడా అటువైపే ఉన్నాయి. చిన్న వర్షానికి కూడా వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని 40 ఏళ్లుగా అధికారులకు, ప్రజాప్రతినిదులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికై నా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని రైతులు, గ్రామ పెద్దలు చింత జోగయ్య, జబ్బ జోగయ్య, పాయం లక్ష్మినర్సు, బొల్లి కృష్ణ, చింత రాంబాబు, వేప లక్ష్మయ్య, చింత నాగేశ్వరరావు, కంగలభద్రయ్య, చింత సంపత్, ఏపె పగడయ్య కోరారు.అంతిమ సంస్కారాలకు వర్షాకాలంలో వాగు దాటేందుకు అవస్థలు -
ఉన్నతంగా రాణించాలి
బూర్గంపాడు: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. బూర్గంపాడులోని సరస్వతి శిశుమందిర్ను గురువారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. విద్యార్థులతో, పాఠశాల నిర్వహకులతో మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, ఉన్నత లక్ష్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్గోపాల్, చెంగలరావు, తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనుల పరిశీలనకొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని జరిగిన పారిశుద్ధ్య పనులను ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ పరిశీలన చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో రికార్డులను పరిశీలించారు. కాగా 2,5,4,20,23 డివిజన్లలో మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగించారు. అంతర్గత రహదారులు వెంట ఉన్న చెట్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమాల్లో మేనేజర్ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, శానిటరీ జవాన్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలిములకలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ తెలిపారు. మండల పరిధిలోని కమలాపురం ఆశ్రమ పాఠశాలలో మంగపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సికిల్ సెల్ వ్యాఽధి నిర్ధాఽరణ పరీక్షల శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. వైద్యాధికారి సాయికల్యాణ్, ప్రోగ్రాం ఆఫీసర్ మధు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ముష్టికుంట్ల విద్యార్థులు బోనకల్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో బోనకల్ మండలం ముష్టికుంట్ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా 90 మంది విద్యార్థులు పాల్గొనగా అండర్ పాఠశాల విద్యార్థులు బొడ్డుపల్లి నవ్యశ్రీ, షేక్ ఫరీదా ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడిపాల్వంచ: ఆర్టీసీ బస్సు డ్రైవర్పై గురువారం ఆటో డ్రైవర్ దాడికి పాల్పడటంతో కేసు నమోదైంది. మణుగూరు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు పాల్వంచ బస్టాండ్లోకి వస్తోంది. ఈ క్రమంలో ఇన్ గేట్ వద్ద ఆటో ఉండటంతో స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో బొల్లేరుగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ తరాల సంతోష్ ఆగ్రహంతో బస్సు డ్రైవర్ జక్కం రమేష్ను దూషించి, దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారేతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అవసరమైన చోట రహదారులు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. అంతకుముందుగా మంత్రి తుమ్మలను, సత్తుపల్లి నూతన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, విద్యుత్ , పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అలపాటి ప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కేవీ సత్యనారాయణ, ఎర్రా వసంతరావు, మన్నెం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
‘రివర్సైడ్’కు ఆదరణ కరువు
గోదావరి నదీ తీరంలోని విడిది కుటీరాల తొలగింపు భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం సందర్శించిన భక్తులతోపాటు పర్యాటకులు గోదావరి నదీ తీరంలో బస చేసే విధంగా ఏర్పాటు చేసిన విడిది కుటీరాలను తొలగిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గోదావరికి వరదలు వస్తే మునిగిపోతుందనే కారణంతోపాటు పర్యాటకుల నుంచి ఆదరణ లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. గత జనవరిలో భద్రాచలం నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఏరు ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విడిది (రివర్సైడ్ క్యాంప్) కుటీరాలు ఏర్పాటు చేయించారు. ప్రారంభం నుంచీ పర్యాటక ఆదరణ లభించలేదు. మొదటిసారి ఆన్లైన్లో బుక్ చేసుకుని 17 మంది విడిది చేశారు. ఆ తర్వాత ఒకరిద్దరు తప్ప ఎప్పుడూ పర్యాటకులతో కుటీరాలు నిండింది లేదు. చార్జీలు భారీగా ఉండటంతో పర్యాటకులు ఆసక్తి చూపడంలేదని భావించిన అధికారులు.. చార్జీలు తగ్గించారు. ఆఫ్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ముగ్గురు, నలుగురు సభ్యులు కలిగిన కుటుంబం బస చేసేలా సిద్ధం చేశారు. 12 గంటలు బస చేసే పర్యాటకులకు రూ.500 చార్జీతో పాటు వారి అభ్యర్థన మేరకు భోజన వసతి కల్పించాలని నిర్ణయించారు. అయినా ఆదరణ లేకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. దీంతో నిర్వహణ బాధ్యతను డీఆర్డీఏ అధికారుల నుంచి స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఎండాకాలం తాటాకు పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా మార్పులేకపోవడంతో వాళ్లు కూడా వదిలేశారు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయి, రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇక చండ్రుగొండ మండలం బెండాలపాడు, దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప, పాల్వంచ మండలం కిన్నెరసాని, ఐటీడీఏ గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన గిరిజన పల్లె వాతావరణ ఆవాసాలను పర్యాటకులు తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు సుమారు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. వాటికి కూడా ఆదరణ లేకపోవడంతో ప్రజాధనం వృథా అయిందని పలువురు పేర్కొంటున్నారు. -
బడి బస్సులు భద్రమేనా?
● ఫిట్నెస్ లేకున్నా కొన్ని బస్సులకు సర్టిఫికెట్ల జారీ ● 33 బస్సుల లైఫ్టైం ముగిసినట్లు నిర్ధారణ ● ఇంకా కొన్ని ఫిట్నెస్ పరీక్షలకు రాని బస్సులు కొత్తగూడెంటౌన్: విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించాల్సి ఉంటుంది. విద్యాసంస్థల బస్సులను ఆర్టీఏ కార్యాలయాలకు కొందరు తీసుకురాగా మరికొందరు తీసుకురాకుండానే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. 2025 ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు దాదాపు 1,392 వాహనాలను తనిఖీల్లో పట్టుకుని సీజ్ చేయ గా నిబంధనలు పాటించని వాహనాల ద్వారా ఫైన్ల రూపంలో దాదాపుగా రూ.2కోట్ల 26లక్షలను ఆర్టీఏ అధికారులు రాబట్టా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా దాదాపు 256 విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఉన్నాయి. మే నుంచి జూన్ 27 వరకు 219 బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించినట్లు, అవి ఫిట్గా ఉన్నట్లు తేలింది. మరో 33 బస్సులు లైఫ్టైం ముగియడం, అందులో కొన్ని ఇంకా ఫిట్నెస్ టెస్టుల కు రాలేదని జిల్లా రవాణాశాఖ ఇన్చార్జ అధికారి (ఆర్టీఏ) వెంకటరమణ తెలిపారు. అయితే మే నెలలో దాదాపు చాలావరకు బస్సులను ఫిట్నెస్ కోసం కార్యాలయానికి తీసుకురాలేదని, జూన్ నెలఖరు వచ్చే సరికి 219 బస్సులను రవాణాశాఖ కార్యాల యానికి ఫిట్నెస్ టెస్టు కోసం తీసుకువచ్చి పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ ఆర్టీఏ ఆధికారులు బడి బస్సుల ఫిట్నెస్పై తూతూమంత్రంగా టెస్టులు నిర్వహించారని, ఫిట్నెస్సాధించిన బస్సుల్లోనూ చాలా వరకు ఫిట్గా లేవని, అయినా ధికారులు ధ్రువీకరించారని విమర్శలు ఉన్నాయి. పరీక్షలు పూర్తి చేశాం.. జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన బస్సులు 256 ఉండగా 219 బస్సులకు ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేశాం. విద్యాసంస్థల బస్సులతోపాటు వివిధ వాహనాలను తనిఖీ చేసి రూ.2.26 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేశాం. ఫిట్నెస్లు లేకుండా బస్పులు తిరిగితే చర్యలు తప్పవు. మరో 33 బస్సుల లైఫ్టైం ముగిసింది. కొన్ని బస్సులు ఇంకా ఫిట్నెస్ టెస్టులకు రాలేదు. ప్రతి ఒక్కరూ రవాణాశాఖ నియమ, నిబంధనలు పాటించాలి. –వెంకటరమణ, ఇన్చార్జ్ రవాణాశాఖ అధికారి -
షిరిడీ, తిరుపతికి రైళ్లు...!
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పొరేషన్గా రూపాంతరం చెందడంతో భవిష్యత్ వ్యాపార, వాణిజ్య పరంగా ఇతర ప్రాంతాల నుంచి గతంలో కంటే రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుంది. దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా భక్తులసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది భక్తులు భద్రాచలం వచ్చి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ఇక్కడి నుంచే షిరిడీ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని అనుకుంటుండగా రైళ్ల సౌకర్యం లేక ఆగిపోతున్నారు. షిరిడీ, తిరుపతికి కొత్తగూడెం నుంచి రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఎన్నోసార్లు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినప్పటికీ ఫలితం కాన రాలేదు. ఇదిలా ఉండగా గత మంగళవారం హైద రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం భర్తేశ్కుమార్జైనీ ఆధ్వర్యంలో డీఆర్యూసీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం నుంచి డీఆర్యూసీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి పాల్గొని ఇక్కడి సమస్యలు వివరించారు. కరోనా సమయంలో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, షిరిడీ, తిరుపతికి రైళ్ల ఏర్పాట్లు, కాకతీయ రైలును మణుగూరు వరకు పొడిగించడం, బెల్గావి రైలు పునరుద్ధరణ లాంటి అంశాలను లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలు సాగించే రైళ్లు ఇలా.. కొత్తగూడెం రైల్వేస్టేషన్ నుంచి నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఏడు రైళ్లు రాకపోకలు సాగించేవి. సింగరేణి, కొల్హాపూర్ ఎక్స్ప్రెస్లు, డోర్నకల్, విజయవాడ కాజీపేట, కాకతీయ ప్యా సింజర్లతోపాటు మణుగూరు సూపర్ఫాస్ట్ సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం మణుగూరు సూపర్ఫాస్ట్, సింగరేణి ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, విజయవాడ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. బెల్గావి రైలు ను 2024 జనవరి నుంచి రద్దుచేశారు. ఇదిలా ఉండగా.. అమృత్ పథకంలో భాగంగా భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పనులపై కూడా డీఆర్ఎం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పను లు వేగవంతం చేయాల్సిన అవసరముంది. అత్యధిక ఆదాయం.. ఆదరణ కరువు.. పారిశ్రామిక జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూ డెం నుంచి నిత్యం ఉద్యోగులు, వ్యాపారులు, విద్యా ర్థులు, కాంట్రాక్టర్లు, అధికారులు పలు అవసరాల నిమిత్తం వచ్చి వెళ్లే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారు లు ఆదాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రయాణికుల సౌకర్యాలను గాలికి వదిలేశారనే ఆరోపణలున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యధిక ఆదాయం భద్రాచలంరోడ్డు రైల్వేస్టేషన్ నుంచే గడిస్తున్నారు. బొగ్గు రవాణా ద్వారా ఏడాదికి సుమారు రూ.650 కోట్లకుపైగా ఆదాయం పొందుతున్నారు. కరోనా సమయం నుంచి బీడీసీఆర్ స్టేషన్ నుంచి నడిచే రైళ్లు పూర్తి స్థాయిలో ప్రయాణికులకు సేవలందించడం లేదు. డీఆర్యూసీసీ సమావేశంలో చర్చ చిగురిస్తున్న భక్తులు, ప్రజల ఆశలు రద్దయిన రైళ్లకు మోక్షం కలిగేనా? అత్యధిక ఆదాయం వచ్చే కొత్తగూడెం స్టేషన్పై డీఆర్ఎం దృష్టి..రైల్వే డీఆర్ఎం హామీ ఇచ్చారు.. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి షిరిడీ, తిరుపతికి రైళ్లు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటా మని డీఆర్ఎం హామీఇచ్చారు. ఆయన హామీ ప్రకా రం రైళ్లు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వాహనాలు, బస్సు ల్లో వెళ్లే బాధలు తప్పుతాయి. రైలు ఏర్పాటుతో కుదిరిన సమయంలో మొక్కులు తీర్చుకునే అవ కాశం భక్తులకు దొరుకుతుంది. –శ్రీనివాసరెడ్డి, రైల్వే డీఆర్యూసీసీ సభ్యుడు -
ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు
జూలూరుపాడు: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను పని చేసే పాఠశాలలోనే తన ఇద్దరు పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలిచాడు. జూలూరుపాడు జెడ్పీహెచ్ఎస్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నండ్రు గురుమూర్తి పెద్ద కుమారుడు నిశాంత్ను ఇదే పాఠశాలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివించాడు. గతేడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిశాంత్ 563 మార్కులు సాధించాడు. ఈ విద్యాసంవత్సరంలో ఆయన తన చిన్నకుమారుడు విశ్వసన్నిధ్ను 7వ తరగతిలో చేర్పించాడు. బుధవారం గురుమూర్తిని హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. విత్తన లైసెన్స్ సస్పెన్షన్సుజాతనగర్: అనుమతులు లేని ప్రదేశంలో విత్తనాలు విక్రయించిన సుజాతనగర్ మండల కేంద్రంలోని ఓ విత్తన దుకాణంపై వ్యవసాయాధికారులు చర్యలు తీసుకున్నారు. సుజాతనగర్లోని హేమంత్ కృష్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణానికి చెందిన డీలర్ నిబంధనలకు విరుద్ధంగా చండ్రుగొండ మండలంలో ఇటీవల విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. విచారణ అనంతరం దుకాణానికి సంబంధించిన విత్తన లైసెన్స్ను జిల్లా వ్యవసాయాధికారి సస్పెండ్ చేసినట్లు ఏఓ జి.నర్మద బుధవారం తెలిపారు. బాలిక గర్భానికి కారణమైన బాలుడిపై పోక్సో కేసు కామేపల్లి: పధ్నాలుగేళ్ల బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెబుతూ లోబర్చుకున్న పదిహేడేళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కామేపల్లి పోలీసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతుండగా, మరో గ్రామానికి చెందిన బాలుడు ప్రేమ, పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు ఇటీవల కడుపునొప్పి రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరీక్షించగా గర్భం దాల్చినట్లు తేలింది. కుటుంబీకుల ఫిర్యాదుతో బాలుడిపైనే కాక ఆయన స్నేహితుడిపై పోక్సో కేసు నమోదు చేసి బాలికను భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై... బోనకల్: మండలంలోని ఓ గ్రామంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. మూడో తరగతి చదివే బాలికపై లక్ష్మీకాంత్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పగా ఆమె ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేశారు. కాగా, ఏసీపీ రెహమాన్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న వ్యక్తిపై.. బోనకల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి. వెంకన్న తెలిపారు. వైరాకు చెందిన ఆదూరి బాలు నాలుగేళ్లుగా కలకోటకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాననంటూ వెంట పడడమే కాక ఆమెకు వస్తున్న పెళ్లి చెడగొడుతున్నాడు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య సింగరేణి(కొత్తగూడెం): పురుగులమందు తాగి యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం రామవరంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం ఏరియా పీవీకే–5 ఇంక్లైన్ గనిలో ఎల్లగొండ రఘు పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన ఎల్లగొండ హేమసాగర్ (25) హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం యువకుడు పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లితండ్రులు హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమసాగర్ బుధవారం మృతి చెందాడు. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హైవేపై వర్షపు నీరు తల్లాడ: తల్లాడ రింగ్ సెంటర్లోని జాతీయ రహదారిపై వర్షం నీరు నిల్వ ఉండడంతో నేషనల్ హైవే అదికారులు బుధవారం పరిశీలించారు. వర్షం వచ్చినప్పుడుల్లా ఇదే పరిస్థితి ఎదురవుతుండగా.. నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ జి.కిరణ్ తదితరులు పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అయితే, రహదారిపై చెత్తాచెదారం పేరుకుపోవడమే సమస్యకు కారణమని, చెత్త తొలగిస్తే నీరు నిల్వ ఉండదని ఎంపీడీఓ సురేష్బాబు తెలిపారు. ఈమేరకు అవసరమైన మరమ్మతులు చేయిస్తామని అధికారులు వెల్లడించారు. -
కళలపై మక్కువ పెంపొందించాలి
దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు చదువుతోపాటు వారికి నచ్చిన కళలపై ఇష్టాన్ని పెంపొందించాలని, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, గ్రంథాలయం, బోధిస్తు న్న పాఠ్యాంశాలను పరిశీలించారు. ముందుగా మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించి వాటి అర్థాలను తెలుగులో చెప్పించారు. అనంతరం ఆరు నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న క్లాసులను, బోధనా తీరును పరిశీలించారు. చిన్నారుల చేత ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించి వాటి అర్థాలను తెలుగులో పూర్తిగా చెప్పేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అదనంగా విద్యార్థులకు ఇష్టమైన వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయానికి సంబంధించిన కళలపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాలు మొదలైనందున రాత్రిపూట విద్యార్థులు బయటకు రాకుండా చూడాలని, ప్రతీ రోజు వంటగది శుభ్రం చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు వేడిగా ఆహారాన్ని వడ్డించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
తెగిపోయిన డైవర్షన్ రోడ్డు
ములకలపల్లి: ములకలపల్లి శివారులో ఊరవాగుపై వేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. తాజా వర్షాలతో కోత ఏర్పడగా తాళ్లపాయ జీపీపాటు, రింగిరెడ్డిపల్లి, బూర్గుకొయ్యగుంపు, మధ్యగుంపు, మంగలిగుట్ట, సుందర్నగర్ తదితర గ్రామాలకు వెళ్లే వాహనాలకు దారి మూసుకుపోయింది. ఈ వాగుపై రెండేళ్ల కిందట హైలెవెల్ వంతెన నిర్మాణం మొదలుపెట్టినా నేటికీ పూర్తి కాలేదు. గతేడాది పలుమార్లు డైవర్షన్ రోడ్డు తెగిపోవడంతో ఇనుప వంతెన వేశారు. కానీ, దీనిపైకి చేరే మార్గం బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాగా, వాగు వద్ద తెగిన డైవర్షన్ రోడ్డును ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బురదలో ప్రజల పాట్లు -
రైతు భరోసా ఎన్నికల జిమ్మిక్కే..
● బీసీ రిజర్వేషన్లు అమలయ్యేవరకు ఎన్నికలు వద్దు ● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఖమ్మంఅర్బన్/నేలకొండపల్లి: రైతులను మభ్యపెట్టి ఓట్లు సాధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని ఇచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది నిజమైన సంక్షేమం కాదని, కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఖమ్మంలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుటుంబంతో పాటు నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురంలో తెలంగాణ జాగృతి నాయకురాలు అనిత తండ్రి నల్లబోతు నరసింహారావు మృతి చెందగా వారి కుటుంబాలను కవిత బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా వడ్ల కొనుగోలులో ఇబ్బంది ఎదుర్కొన్న రైతులను పలకరించలేదని తెలిపారు. సన్న రకం పేరుతో బోనస్ అంటూ రైతులను మభ్యపెట్టారని చెప్పారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదానికి ఈనెల 17న రైల్రోకో నిర్వహిస్తుండగా, మద్దతు ఇవ్వాలని బీసీ సంఘాలను కోరడమే కాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాశామని ఆమె వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలేమయ్యాయి? ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎమ్మెల్సీ ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని విస్మరించడమే కాక ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాగా, గోదావరి జలాల తరలింపుపై జిల్లా మంత్రులు మాట్లాడకపోవడం ఏమిటని ప్రశ్నించిన కవిత, భద్రాద్రి రాముడి అభివృద్ధికి ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుతో పాటు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, సేవాలాల్నాయక్, కిషన్నాయక్, వాంకుడోత్ సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
నాటుకోళ్ల చోరీకి విఫలయత్నం
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లిలో పలువురు దుండగులు నాటుకోళ్ల చోరీకి యత్నించారు. గ్రామంలోని అబ్దుల్కలాంబజార్కు మంగళవారం అర్ధరాత్రి చేరుకున్న సుమారు పదిమంది పలువురి ఇళ్లలో నుంచి 50 నాటుకోళ్లను అపహరించి సమీపంలోని మసీద్లోని మూత్రశాలల్లో దాచారు. ఆపై ఇంకొన్ని కోళ్లను చోరీ చేసేందుకు కొందరు యత్నిస్తుండగా, మిగతా వారు దాచిన కోళ్లను తరలించే యత్నంలో నిమగ్నమయ్యారు. బుధవారం తెల్లవారుజామున నమాజ్ సమయం కావడంతో మసీద్ కమిటీ ఉపాధ్యక్షుడు బషార్ వచ్చేసరికి కోళ్ల అరుపు లు వినిపిస్తుండడంతో చూసేసరికి దొంగలు పారి పోయారు. ఆపై గ్రామస్తులు చేరుకుని ఎవరి కోళ్లను వారు తీసుకెళ్లారు. జూదరుల అరెస్ట్ ములకలపల్లి: హౌజీ (జూదం) ఆటాడతున్న 9 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని మొగరాలగుప్ప గ్రామంలో హౌసీ ఆట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ సిబ్బందితో దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.1,680 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిపై కేసుపాల్వంచ: సకాలంలో వైద్యం అందించక పోవడంతో శిశువు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాలకు చెందిన రాంప్రసాద్ తన భార్య కరుణకు నొప్పులు రావడంతో గత మంగళవారం పాల్వంచ సీహెచ్సీకి తీసుకొచ్చాడు. ఆమెను ఉదయం 10.30 గంటలకు పరిశీలించిన వైద్యురాలు అనూషలక్ష్మీ నార్మల్ డెలీవరీ అవుతుందని తెలిపారు. ఆపరేషన్ చేయమని కోరుతున్నా వినకుండా బ్లీడింగ్ అవుతున్నా ఎక్సర్ సైజ్ చేయించారని, అనంతరం 12.50 గంటలకు ఆపరేషన్ చేసి మగ శిశువును అందించి చనిపోయాడని చెప్పారని, వైద్యురాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సకాలంలో ఆపరేషన్ చేస్తే శిశువు మృతి చెందే పరిస్థితి ఉండేది కాదని రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరకట్న వేధింపులపై ఫిర్యాదు ఇల్లెందు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పట్టణంలోని జేకేకాలనీకి చెందిన బండారు మౌనిక బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జేకేకాలనీకి చెందిన బండారు వీరన్న, మౌనిక ప్రేమించి పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత భర్త వీరన్న, అతని తల్లితండ్రులు, ఆడపడుచు వరకట్నం తేవాలంటూ మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, భర్త మద్యం సేవించి తమ కుటుంబం పట్ల అసభ్యకరంగా దూషిస్తున్నాడని మౌనిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘బ్లీచింగ్కూ నిధులు ఇవ్వని ప్రభుత్వం’నేలకొండపల్లి: రాష్టంలో కొందరు మీడియా ముసుగులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు రాకపోవడం, ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి లేక కార్యదర్శులు సెలవులో వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ను సీఎంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ ప్రభావం కనపడుతుందని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అప్రమత్తంగా ఉండాలి● వర్షాల నేపథ్యంలో హెల్ప్లైన్ల ఏర్పాటు ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు సూపర్బజార్(కొత్తగూడెం)/కొత్తగూడెంటౌన్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. వర్షాలతో నదులు, వాగులు, చెరువులు పొంగి రోడ్లపైకి వరదనీరు చేరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, బయటకు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు, నదుల వద్దకు సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లోని హెల్ప్లైన్ల నంబర్లకు, డయల్ 100కు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు సమాచారం అందించి సహాయం పొందవచ్చని వివరించారు. రెవెన్యూ, పోలీస్, రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల్లో, ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు డీడీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. హెల్ప్లైన్ నంబర్లు08744–241950 – కలెక్టర్ కార్యాలయం 08743–232444 – భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వాట్సాప్ నంబర్లు 9347910737 – భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం 9392919747– కలెక్టర్ కార్యాలయం -
కాలినడకా కష్టమే
అశ్వారావుపేట: మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీ, పాత పేరాయిగూడెం, దొంతికుంట, అటెండర్స్ కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ, బీఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. సీసీ రహదారులు నిర్మించకపోవడంతో వర్షాకాలంలో కాలినడక కూడా కష్టంగానే ఉంటోంది. పేద, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడంలేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నడక కష్టమే మోడల్ కాలనీలో అన్ని వీధుల్లో సీసీ రహదారులు నిర్మించలేదు. గుంతలు, పిచ్చిమొక్కలతో ఇబ్బందిగా ఉంటోంది. పాములు సంచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించాలంటే భయంగా ఉంటోంది. –ఆదినారాయణ, మోడల్ కాలనీ● -
కార్పొరేషన్లో అధ్వానం..
కొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ కార్పొరేషన్లోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. సీసీ, బీటీ రోడ్లలో గుంతలు పడ్డాయి. ప్రధాన పోస్టాఫీసు సెంటర్ నుంచి మొదలుకొని కోర్టు వరకు, అక్కడి నుంచి శేషగిరినగర్ వరకు కూడా అడుగడుగుకో గుంత ఉంది. ఆ రూట్లో భారీ వాహనాలు నడవడంతో గుంతలు ఏర్పడ్డాయి. పాతకొత్తగూడెం, రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్ ఏరియాలో మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్వకాలు జరిపి పూడ్చకుండానే వదిలేశారు. వర్షాలకు గుంతల్లో నీరు నిల్వడంతో చిన్న పిల్లలు పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. సెవెన్హిల్స్ ఏరియా రోడ్డు నుంచి బూడిదగడ్డ వరకు కూడా రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వైపులా తవ్వకాలు జరిపారు. ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. సూపర్బజార్ నుంచి రైతుబజార్ వెళ్లే రోడ్డులో కూడా గుంతలు అధికంగా ఉన్నాయి. రోడ్లపై ప్రయాణించలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రోడ్ల నిర్మాణం చేపట్టాలి పాతకొత్తగూడెంలోని పాతూరులో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారాయి. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం తవ్వకాలు జరిపి పూడ్చకుండా వదిలివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. గుంతలను పూడ్చాలి. –ఇందిరమ్మ, పాతకొత్తగూడెం● -
వర్షం.. రైతుల హర్షం
● రెండు రోజుల్లో లోటు నుంచి అధిక వర్షపాతం నమోదు ● పత్తి 1,90,831 ఎకరాల్లో సాగు, మొక్కజొన్న 54,223 ఎకరాల్లో.. ● జిల్లాలో సాధారణం కంటే 14 శాతం అధిక వర్షపాతం వర్షపాతం ఇలా.. (మి.మీ లలో) మండలం బుధ జూన్ 1 నుండి వారం జూలై 2 వరకు కరకగూడెం 25.2 112.4 పినపాక 26.4 114.8 చర్ల 31.2 211.8 దుమ్ముగూడెం 36.6 145.6 అశ్వాపురం 55.6 211.8 మణుగూరు 34.6 151.6 ఆళ్లపల్లి 36.8 163.8 గుండాల 28.0 122.8 ఇల్లెందు 52.6 157.2 టేకులపల్లి 56.2 214.8 జూలూరుపాడు 49.2 367.2 చండ్రుగొండ 38.0 284.2 అన్నపురెడ్డిపల్లి 36.4 236.8 చుంచుపల్లి 59.2 171.0 సుజాతనగర్ 65.4 214.2 కొత్తగూడెం 49.0 176.8 లక్ష్మీదేవిపల్లి 35.4 142.4 పాల్వంచ 86.2 286.8 బూర్గంపాడు 81.6 293.2 భద్రాచలం 64.6 206.2 ములకలపల్లి 52.2 179.2 దమ్మపేట 23.0 227.0 అశ్వారావుపేట 13.6 337.2 జిల్లా సరాసరి 45.1 205.6సూపర్బజార్(కొత్తగూడెం): రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. జూన్ మాసంలో లోటు వర్షపాతం నమోదైంది. రెండు రోజుల నుంచి వానలు దంచి కొడుతుండటంతో వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. ఈ సీజన్ ప్రారంభంలో రుతుపవనాలు ముందుగానే ఊరించాయి. ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయారు. ఆ తర్వాత వర్షాలు కొంతమేర కురిసినా గత నెలలో లోటు వర్షపాతమే నమోదైంది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు లోటు పూడిపోయింది. గత నెల 1 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 180 మి.మీ కాగా 205.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 14 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. తొమ్మిది మండలాలు అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, టేకులపల్లి, జూలూరుపాడు సుజాతనగర్, బూర్గంపాడు, పాల్వంచలలో అధిక వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాలు ములకలపల్లి, చర్ల, అశ్వాపురం, ఆళ్లపల్లి, ఇల్లెందు, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం మండలాల్లో సాధారణ వర్షపాతం, మిగిలిన ఐదు మండలాలు పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, మణుగూరు, గుండాలలో లోటు వర్షపాతం నమోదైంది. పంటల సాగు ఇలా.. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పత్తిని వర్షాధారంగా సాగు చేస్తారు. రుతుపవనాలు ఊరించడంతో విత్తనాలు నాటిన సుమారు 30 శాతం మంది రైతులు మొక్కలు మొలవక నష్టపోయారు. ఆ తర్వాత అడపాదడపా వర్షాలతో పత్తి సాగు ఊపందుకుంది. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు వరినార్లు పోశారు. జీలుగు, జనుము సాగు చేసిన రైతులు పచ్చిరొట్టను కలియదున్నేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కొందరు రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు ప్రారంభించారు. అక్కడక్కడా నాట్లు కూడా వేస్తున్నారు. ఇప్పటివరకు వెదజల్లే పద్ధతిలో 2,124 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పత్తి 1,90,831 ఎకరాల్లో మొక్కజొన్న 54,223 ఎకరాల్లో సాగు చేశారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సలహాలను పాటించి సాగు చేయాలి. –వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారిపనులు వేగవంతం చేశాం ఇప్పటివరకు వర్షాలు భయపెట్టినా ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. సాగుకు అనుకూలం. అందుకే వ్యవసాయ పనులు వేగవంతం చేశాం. –మల్లయ్య, రైతు, గరీబ్పేట, సుజాతనగర్ మండలం -
గోదావరి, జలాశయాలకు వరద..
భద్రాచలంటౌన్/పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్/టేకులపల్లి: రెండు, మూడు రోజులుగా ఎగువన, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో మంగళవారం రాత్రికి 13 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం బుధవారం రాత్రి 12 అడుగులకు తగ్గి నిలకడగా ప్రవహిస్తోంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 4,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. జలాశయం నీటిమట్టం మంగళవారం 396.80 అడుగులు ఉండగా, బుధవారం 397.50 అడుగులకు పెరిగింది. అశ్వారావుపేటలోని పెదవాగు ప్రాజెక్ట్కు వరద పోటెత్తగా రింగ్బండ్ జలకళ సంతరించుకుంది. రింగ్బండ్ లెవల్ దాటితే నీళ్లు క్రస్ట్ గేట్ల నుంచి బయటకు వెళ్తున్నాయి. వర్షంతో టేకులపల్లిలోని సింగరేణి కేఓసీలో 8,269 టన్నుల బొగ్గు ఉత్పత్తితోపాటు ఓబీ వెలికితీత నిలిచిపోయింది. ఓసీలోని నీటిని ఎత్తిపోస్తున్నారు. -
విలీన వార్డుల్లో బురద..
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలోని నాలుగు విలీన వార్డులు ఉన్నాయి. వీటిల్లో అన్నీ కచ్చా రోడ్లే ఉండటంతో వర్షాకాలంలో బురదలో నడవాల్సిందే. చినుకు పడితే నేలంతా చిత్తడిగా మారుతోంది. పట్టణంలోని 1వ వార్డు సత్యనారాయణపురం పూర్తిగా సుదిమళ్ల గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 2వ వార్డు, 22వ వార్డులో, 23వ వార్డుల్లో కూడా విలీన గ్రామాలే ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికీ కచ్చా రోడ్లు ఉన్నాయి. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రోడ్లే తప్ప మున్సిపాలిటీలో విలీనం చేశాక కొత్తగా రోడ్లు నిర్మించలేదు. దీంతో పాటు పట్టణంలోని 24 వార్డుల్లో మిషన్ భగీరథ పైపులైన్ పనుల కోసం రోడ్లు తవ్విన ప్రదేశాలు గుంతలమయంగా మారాయి. కాలుబయట పెట్టలేం సత్యనారాయణపురంలో వానాకాలంలో అడుగు బయట పెట్టాలంటే బురదలో దిగాల్సిందే. చినుకు పడితే నేలంతా చిత్తడిగా మారుతుంది. విలీన వార్డుల్లో అన్ని మట్టి రోడ్లే ఉన్నాయి. బీటీ రోడ్లు నిర్మించాలి. – బి.గోపి, 1వ వార్డు, ఇల్లెందు● -
ఎందుకిలా..?
కృష్ణా ఆయకట్టు స్థిరీకణ పనులకు నిధుల మంజూరు ● మంత్రుల ఇలాఖాలో వేగంగా జరుగుతున్న పనులు ● జిల్లాలో మాత్రం ముందుకు సాగని ఎత్తిపోతల పథకాలు ● ఏజెన్సీ ప్రాంతమైనా నిధులు విదల్చని ప్రభుత్వంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకర్గంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జోన్–3 కింద ఉన్న ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు జవహర్ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రూ.600 కోట్లతో ప్రాజెక్టు నిర్మించనుండగా, సాగర్ జలాలతో సంబంధం లేకుండా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అంతకుముందు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని రఘునాథపల్లి మండలంలో నాలుగు వేల ఎకరాలకు నాగార్జునసాగర్ జలాలు అందించేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకం చేపట్టారు. వెనువెంటనే పాలనాపరమైన అనుమతులతోపాటు రూ.66 కోట్లు మంజూరు చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసమే గతేడాది సీతారామ ప్రాజెక్టులో అదనంగా రాజీవ్ కెనాల్ను చేర్చి రికార్డు వేగంతో పనులు పూర్తి చేశారు. లిఫ్టులకు నిధుల గ్రహణం మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ పనులకు నిధులు గలగల ప్రవహిస్తున్నాయి. కానీ గోదావరి జలాలను ఏజెన్సీ రైతుల పొలాల్లో పారించేందుకు ఉద్దేశించిన చిన్న, మధ్య తరహా ఎత్తిపోతలకు నిధుల గ్రహణం పడుతోంది. నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణపై మంత్రులు చూపుతున్న శ్రద్ధనే, కనీస ఆయకట్టు లేని గిరిజన, ఏజెన్సీ రైతుల మీద కూడా చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాలో గోదావరి, కిన్నెరసాని, ముర్రేడు, పెద్దవాగు లాంటి జలవనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడే నిర్మిస్తున్నారు. దీని వల్ల అడవులు, భూమిని ఈ జిల్లానే నష్టపోయింది. కానీ, ఇప్పటివరకు జిల్లాలో ఒక్క ఎకరాకు గోదావరి నీరు ఇవ్వలేకపోయారు. కనీసం సీతారామకు ఇరువైపులా ఉన్న పినపాక, భద్రాచలం నియోజకర్గాలకు కూడా న్యాయం జరగడం లేదు. కదలని ‘మారెళ్లపాడు’ మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి 2023 జనవరిలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం కేవలం రూ. 25 కోట్లు. సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్హౌస్ (బీజీ కొత్తూరు) సమీపంలో ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకుని తుమ్మల చెరువు, చింతల చెరువు, ఎర్రబొక్కల చెరువు, తీగల చెరువులను నింపుతారు. తద్వారా అశ్వాపురం, మణుగూరు మండలాల్లోని 17 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. శంకుస్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మినీ పంప్హౌస్ ఎర్త్ వర్క్ కొంత పూర్తి చేయడం మినహా మరేం చేయలేదు. ఇక్కడ లిఫ్టుతోపాటే మారెళ్లపాడు డిస్ట్రిబ్యూటరీ కాల్వల కోసం రూ.90 కోట్లతో గతంలో సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఎప్పుడో అటకెక్కాయి. కనీసం ఈ ప్రాజెక్టు పూర్తి చేసినా భద్రాద్రి జిల్లాకు సీతారామ తొలి ఫలాలు అందేవి. పులుసుబొంత రీడిజైన్కే పరిమితం తెలంగాణ ఏర్పాటుకు ముందే కరకగూడెం మండలంలో 4,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు పెద్దవాగుపై పులుసుబొంత ప్రాజెక్ట్కు ఉమ్మడి ఏపీలో శ్రీకారం చుట్టారు. అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి రూ.20.10 కోట్లు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగాక దాదాపు తొమ్మిదేళ్లపాటు అడుగుముందుకు పడలేదు. రెండేళ్ల కిందట ఆయకట్టును 35 వేల ఎకరాలకు పెంచుతూ సుమారు రూ.400 కోట్లతో పులుసుబొంత ప్రాజెక్ట్కు రీడిజైన్ చేయించారు. నష్టపోయే అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఇవ్వాలనే అంశంపై స్పష్టత వచ్చిన దశలో ప్రభుత్వం మారిపోయింది. దీంతో మళ్లీ మరుగునపడింది. ఇదే తరహాలో పినపాక మండలంలోని చింతల బయ్యారం, టి.కొత్తగూడెం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రతిపాదనల్లోనే ప్రగళ్లపాడు తాలిపేరు ప్రాజెక్టు కింద చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 24,700 ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్ని మూడు జోన్లుగా విభజించారు. ఖరీఫ్లో పూర్తి స్థాయిలో 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రబీకి వచ్చే సరికి రొటేషన్ పద్ధతిలో ఒక్కో జోన్లో ఉన్న ఎనిమిది వేల ఎకరాలకే నీరు అందుతోంది. తలాపునే గోదావరి ఉన్న ఈ రెండు మండలాల్లో రెండు పంటలు సాగు చేయడం సాధ్యం కావడం లేదు. దుమ్ముగూడెం మండలం కోసం గతంలో రూ.634 కోట్లతో ప్రగళ్లపాడు ఎత్తిపోతల పథకానికి అంచనాలు రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. -
అధ్వానంగా అంతర్గత రోడ్లు
● కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి ● వీధుల్లో గుంతలమయంగా మారిన రహదారులు ● అన్నిచోట్లా వాహనదారులకు తప్పని అవస్థలు నిర్మించిన ఎనిమిది నెలలకే బీటలు వారిన గుడిపాడు సీసీ రోడ్డుపురపాలికల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలమయంగా తయారయ్యాయి. వర్షాలకు నీరు నిలిచి రోడ్లు ఇంకా పాడవుతున్నాయి. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వీధుల్లో వాహనాలు నడపాలంటే అవస్థ పడుతున్నారు. శివారు, విలీన ప్రాంతాల్లో కచ్చా రోడ్లు బురదమయంగా మారాయి. మిషన్ భగీరథ పైపులైన్ పనుల కోసం తవ్విన చోట సరిగ్గా పూడ్చకపోవడంతో గుంతలు ఏర్పడి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట పట్టణాల్లో రోడ్లు మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. అన్నీ గుంతలే..మణుగూరు టౌన్: మున్సిపాలిటీలో విసిరేసినట్లుగా ఉండే కమలాపురంలో రోడ్డు గుంతలమయంగా మారింది. రాయిగూడెం వైపు నుంచి ఇసుక లారీలు భారీ లోడ్లతో వెళ్తుండటంతో రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. రోడ్లు బాగు చేసి డ్రెయిన్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడంలేదు. మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు మొత్తం సుమారు 40 కిలోమీటర్లు ఉండగా, కమలాపురంలోని సుమారు ఒక కిలోమీటరు బీటీ రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. బాగు చేయాలి మణుగూరులో వానాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ గుంతలమయంగా మారతాయి. పాలకులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టాలి. మురుగు కాల్వలు నిర్మించాలి. – మునిగెల వీరమ్మ, కమలాపురం గ్రామస్తురాలుసీసీ రోడ్లకు బీటలుపాల్వంచ: పాల్వంచ పట్టణంలో సీసీ రోడ్లు నాణ్యత లేకుండా నిర్మించడంతో బీటలువారి నిధులు దుర్వినియోగమయ్యాయి. వర్షాలకు ఆ రోడ్లు మరింత దెబ్బతింటున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం ఇటీవల అనేక చోట్ల సీసీ రోడ్లను ధ్వంసం చేశారు. వాటిని సరిచేసేందుకు నెలల తరబడి పనులు చేపడుతున్నారు. ఒడ్డుగూడెం రోడ్లో పైపులైన్ల లీకేజీలతోపాటు, కొత్త కనెక్షన్ల కోసం మట్టి తీసి, సీసీ రోడ్లు తవ్వారు. గుడిపాడు వెళ్లే దారిలో 8 నెలల క్రితం సీసీ రోడ్డు నిర్మించారు. మార్కెట్ ఏరియాలో నూతనంగా రోడ్డు వేశారు. ఇవి బీటలు వారుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో బీటలు వారి గతుకులమయంగా తయారవుతున్నాయి. ఎనిమిది నెలలకే బీటలు పట్టణంలోని శివారు ప్రాంతం గుడిపాడుకు ఎనిమిది నెలల క్రితం సీసీ రోడ్డు నిర్మించారు. నాణ్యత లేకుండా పనులు చేపట్టడంతో రహదారి బీటలు వారింది. ఎన్నో సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు దుస్థితి ఇప్పటికే దెబ్బతింది. అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. –ఆరెం ప్రశాంత్, గుడిపాడు -
ప్రారంభమైన ఎప్సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మంగళవారం మొదలైంది. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటుచేయగా, ఉదయం 9నుంచి సాయంత్రం 6–30గంటల వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే, చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉదయం 8–30గంటలకల్లా కేంద్రానికి చేరుకున్నారు. రెండు రోజుల నుంచి స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించగా, తొలిరోజు 570మంది విద్యార్థులకు గాను 510మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. ఇతర జిల్లాల నుంచి సైతం... ఖమ్మంలోని ఎప్సెట్ కౌన్సెలింగ్ కేంద్రానికి ఉమ్మడి జిల్లా నుంచే కాక సమీప జిల్లాల విద్యార్థులు సైతం హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడైనా కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల విద్యార్థులు కూడా వచ్చారు. కాగా, సెంటర్ వద్ద పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బంది తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బ్రోచర్లు ఇస్తూ ప్రచారం చేయడం కనిపించింది. సర్వర్ మొరాయింపు కౌన్సెలింగ్కు మొదటిరోజైన మంగళవారం ఎక్కువ మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో సర్వర్ మొరాయించింది. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన నత్తనడకన కొనసాగగా విద్యార్థులు, తల్లిదండ్రులు గంటల తరబడి వేచిచూడాల్సి రావడంతో అసహనానికి గురయ్యారు. తొలిరోజు మొరాయించిన సర్వర్ గంటల తరబడి వేచి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు -
అవే.. తిప్పలు తప్పవా..?
● లో–లెవెల్ వంతెనలతో ప్రజల కష్టాలు ● అనేక గ్రామాలకు నిలిచిపోనున్న రాకపోకలు ● వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం చుంచుపల్లి: వర్షాకాలం వచ్చింటే లోతట్టు ప్రాంతా ల ప్రజలు వణికిపోతారు. ప్రతి సీజన్లోనూ ఏజె న్సీ ప్రాంత వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు, వరదలతో అనేక గ్రామాలకు లో–లెవెల్ చప్టాలతో రోజుల కొద్దీ రాకపోకలు స్తంభిస్తాయి. అవి దాటే ప్రయత్నంలో ఎదరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. జిల్లాలో అనేకగ్రామాలకు ఇప్పటికీ రహ దారులు, సరైన వంతెన సౌకర్యం లేదు. అత్యవసరమైన చోట హై–లెవెల్ వంతెనలు నిర్మించక పోవడంతో వర్షాకాలం సీజన్ మొత్తం ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటారు. వాగులు, వంకలపై ఎప్పుడో నిర్మించిన లో–లెవెల్ చప్టాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలకు పరిమితమయ్యారు. గ్రామాలకు రాకపోకలు బంద్ జిల్లాలో 35కు పైగా చిన్న, పెద్ద తరహా వాగులు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో పొంగి పొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ప్రధానంగా జూలై, ఆగస్టు మాసాల్లో కురిసే అతి భారీవర్షాలు, వరదలకు ఎక్కువ ప్రాంతాలు పూర్తి గా జలమయమవుతుంటాయి. లో–లెవెల్ వంతెనలు, కల్వర్టులు వరద పోటుకు గురవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, జూ లురుపాడు, అశ్వాపురం, చర్ల, పినపాక, బూర్గంపాడు, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, అశ్వారావుపేట మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు చెందిన ప్రజ లకు వరద కష్టాలు తప్పడం లేదు. కిన్నెరసాని గేట్లు ఎత్తితే 24 గ్రామాలపై ప్రభావం పడుతుంది. వరదలతో నష్టాలు 2022 జూలై 16న వచ్చిన వరదతో గోదావరి 70.3 అడుగుల స్థాయిలో ప్రవహించింది. పరిసర గ్రామా లు నీట మునిగాయి. భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని 120 గ్రామాలకు చెందిన 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, సుమారు రూ. 120కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు అంచ నా వేశారు. దాదాపు 10 వేల ఎకరాలకుపైగా పంటల నష్టం జరిగింది. సుమారు 5,400 ఎకరాల్లో పంటలు పూర్తిగా ధ్వంసం కావటంతో రూ.6.50 కోట్ల మేర నష్టం జరగగా.. ఉద్యాన పంటల నష్టం రూ.40.58 లక్షల వరకు ఉంది. పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ పరిదిలోని రోడ్లు వరద తాకిడి కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్ శాఖకు రూ.9.08కోట్లు, ఆర్అండ్బీ శాఖకు రూ.94 లక్షలు, ఎన్హెచ్లకు రూ.2.52 కోట్ల మేర నష్టం జరిగింది. సబ్స్టేషన్ల ధ్వంసం, స్తంభాలు కొట్టుకపోవడంతో విద్యుత్ శాఖకు రూ.5.80 కోట్ల నష్టం వాటిల్లింది. మిషన్ భగీరథకు సంబంధించి 212 హాబిటేషన్లలో పంపుసెట్లు, ప్యానల్బోర్డులు, మంచినీటి పైప్లైన్లు, ఇంటేక్వాల్స్ వరద పోటుకు గురవ్వడంతో రూ.1.17 కోట్ల మేర నష్టం జరిగింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంచాయతీరాజ్ పరిధిలోని లో–లెవెల్ చట్టాల మరమ్మతులతో పాటు కొత్త వాటి కోసం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇక వచ్చే వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకొని లో–లెవెల్ వంతెనల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నాం. వీఆర్వోలు, సెక్రటరీలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలు ప్రవాహం దాటకుండా అడ్డుగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పెట్టడమే కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. –శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, ఈఈజిల్లాలో.. లో–లెవెల్ వంతెనలు, కల్వర్టులు.. పీఆర్ లో–లెవెల్ చప్టాలు: 102 ఆర్అండ్బీ లో–లెవెల్ చప్టాలు: 91 ఎక్కువ వరద పోటుకు గురయ్యేవి: 67 ఎక్కువ ప్రవాహం వచ్చేవి: 43 మధ్యతరహా వరదపోటుకు గురయ్యేవి: 35 మధ్యతరహా వరద కాజ్వేలు: 48 -
నాణ్యమైన విద్యే భవిష్యత్కు పునాది
కరకగూడెం: నాణ్యమైన విద్యే భవిష్యత్కు పునాది అని జీసీడీఓ అన్నమణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె పినపాక, కరకగూడెం మండలాల్లోని ఎల్చిరెడ్డిపల్లి, భట్టుపల్లి కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థినుల హాజరు పట్టిక, బోధనా ప్రణాళికలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఆరోగ్య రికార్డులు తనిఖీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలని, పాఠ్యపుస్తకాల లభ్యత, అభ్యసన, వాతావరణం వంటి అంశాలపై విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జి.పద్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పెదవాగులో చేరిన వరదనీరు
అశ్వారావుపేటరూరల్: మండలంలో రెండు రోజులుగా వర్షం కురుస్తుండగా, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేటతోపాటు మండలంలోని కావడిగుండ్ల, కంట్లం, అనంతారం, గాండ్లగూడెం, గుమ్మడవల్లి, నారాయణపురం, వినాయకపురం, తిరుమలకుంట, నందిపాడు, అచ్యుతాపురం, నారంవారిగూడెంతోపాటు అన్నీ గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. భారీ వర్షాలతో పెదవాగుతోపాటు పంట పొలాల్లోకి వరదనీరు పొటెత్తింది. పెదవాగు నిండుగా ప్రవహించగా, ప్రాజెక్టులో తాత్కాలికంగా గతేడాది నిర్మించిన రిండ్బండ్కు వరదనీరు పోటెత్తింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి..
కొత్తగూడెంఅర్బన్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటుదామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలక, మైలారం, గట్టుమల్ల, రేగళ్ల, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ, సీతారాంపురం, తెలగరామవరం, హేమచంద్రాపురం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాలకు హాజరై మా ట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీమెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్య త అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లకు వివరించాలని, రూ.22 వేల కోట్లతో రైతుభరో సా అమలు చేసిందని, రూ.12 వేల కోట్లతో పేదల కు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోందని, 55 లక్షల ఇళ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉచిత బస్సు పథకానికి రూ.4 వేలకోట్లు ఖర్చుపెడుతున్నట్టు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, పెద్దబాబు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
పాల్వంచ: తొమ్మిది నెలలు నిండిన గర్భిణి ప్రసవం కోసం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి రాగా సకాలంలో వైద్యులు స్పందించక పోవడంతో శిశువు కడుపులోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల కథనం మేరకు.. లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోరెం రాంప్రసాద్ భార్య కరుణ గర్భిణి కాగా నెలలు నిండటంతో ప్రసవం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి మంగళవారం ఉద యం తీసుకొచ్చారు. అయితే వైద్యులు సాధారణ కాన్పు కోసం మధ్యాహ్నం 12గంటల వరకు ప్రయత్నించారు. అనంతరం ఆపరేషన్ చేయగా.. బాబు గర్భంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. రాంప్రసాద్, ఆయన బంధువు రాము మాట్లాడుతూ.. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని, ఉదయం 7 గంటలకు ఆస్పత్రిలో చేరితే ఆలస్యం చేశారని, కరుణ ఎంత ప్రాధేయపడినా చేయలేదని, చివరికి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి కడుపులోనే చనిపోయాడని బిడ్డను చేతిలో పెట్టార ని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి, పూర్తి విచారణచేసి ఆపరేషన్ చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విష యమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్ను వివరణ కోరగా ఉమ్మనీరు, మలమూత్రం మింగడం, మెడలో పేగు వేసుకుని ఉండటంతో ఊపిరాడక మృతి చెందాడని, వైద్యుల తప్పిదం ఏమీలేదని, వారు తమవంతు కృషి చేశారని, శిశువు మృతి చెందడం తమకు కూడా బాధాకరమని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ -
నర్సరీ యజమానులకు అవగాహన సదస్సు
సూపర్బజార్(కొత్తగూడెం): మిరప, కూరగాయల నారు పెంచే నర్సరీ యజమానులకు మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి జంగా కిశోర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నర్సరీల్లో పలు పంటలకు చెందిన నారు 29.4 కోట్ల మేర ఉత్పత్తి జరుగుతోందని, జిల్లాలో మిరప 17,589 ఎకరాల్లో సాగు చేస్తున్నారని, సుమారు రెండు వేల కేజీల మిరప విత్తనం నుంచి 20 కోట్ల మిరపనారు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. నర్సరీలన్నీ కొత్త నర్సరీ నియంత్రణ నియమావళి–2017 ప్రకారం నాణ్యమైన, ప్రాచుర్యంలో ఉండి పేరెన్నిక గల అధిక దిగుబడినిచ్చే రకాలను పెంచి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సదస్సులో ఉద్యాన అధికారులు జి.దేవప్రసాద్, కె.మీనాక్షి, ఎం.స్రవంతి, బి.స్రవంతి, సీహెచ్ సాయికృష్ణ, జిల్లాలోని వివిధ నర్సరీల యజమానులు పాల్గొన్నారు. -
కాంగోలో జిల్లా వాసి మృతి
కొత్తగూడెంఅర్బన్: దక్షిణాఫ్రికా ఖండం కాంగోలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీకి చెందిన సయ్యద్ అనీశ్ (45) మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. పదేళ్ల కిందట దుబాయ్ వెళ్లిన అనీశ్.. అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా కాంగో వెళ్లిన అనీశ్ కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాద ఘటనను అక్కడి దేశస్తులు స్థానిక పోలీసులకు తెలపగా వారు అనీశ్ తండ్రి అక్రమ్కు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఢిల్లీలో ఉండి ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అనీశ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పి ఓదార్చారు. చికిత్స పొందుతున్న వివాహిత మృతిదుమ్ముగూడెం: మండలంలోని నందులచలక గ్రామానికి చెందిన గుండి నాగమణి (30) పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్ఐ గణేశ్ కథనం ప్రకారం.. నాగమణి గత నెల 22వ తేదీన కుటుంబ గొడవల కారణంగా పురుగులమందు తాగింది. అప్పటి నుంచి వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి భర్త గుండి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆటోను ఢీకొన్న ట్రాక్టర్పాల్వంచరూరల్: ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టగా ముగ్గురు గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు నుంచి పాల్వంచ వైపు వస్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్రాక్టర్ యూటర్న్ తీసుకుంటూ ఢీకొట్టింది. ఆటోడ్రైవర్ కొక్కు యాదగిరి, బుల్లి, గండికోట రమేశ్ గాయపడ్డారు. ఆటోడ్రైవర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ట్రాక్టర్ డ్రైవర్ కాలం ప్రవీణ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదుఅశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన వ్యక్తిపై మంగళవారం అశ్వాపురం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లెలమడుగు గ్రామ పంచాయతీలోని చింతకుంట గ్రామానికి చెందిన గిరిజన యువతి పొలంలో ఉండగా మొండికుంట గ్రామానికి చెందిన తోవిటి యాదగిరి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుప్రసాద్ తెలిపారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఘనంగా వనమహోత్సవంశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో మంగళవారం వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈఓ ఎల్.రమాదేవి మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఏఈఓలు భవానీ రామకృష్ణ, శ్రావణ్కుమార్, ఈఈ రవీంద్రనాథ్, సీసీ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘సాహిత్య సూచి’లో జిల్లా వాసికి అవకాశంఅశ్వారావుపేటరూరల్: తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన సాహిత్య గ్రంథ సూచిలో అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ రచయిత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రాసిన గ్రంథాలకు స్థానం దక్కింది. ఆయన రచించిన కాళికాంబసప్తశతి, రాతిపూలవనం తదితర గ్రంథాల సమగ్ర వివరాలను సూచిలో పొందుపర్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ప్రభాకరాచార్యులు అందుకున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంగళవారం ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులను, జరుగుతున్న పనులకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతం ఏ పను లు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అని డీఈ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
ఉద్దీపనం పుస్తకాల్లో నాణ్యత ఉండాలి
భద్రాచలం : విద్యార్థులకు అందించే ఉద్దీపనం పుస్తకాల్లో నాణ్యత పాటించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకాల ముద్రణ టెండర్లను తన చాంబర్లో మంగళవారం ఆయన ఖరారు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పుస్తకాలు ముద్రించాలని సూచించారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 30,89,784 వర్క్బుక్లు ముద్రించి ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమేష్, జీసీసీ డీఎం జయరాజ్, ఏటీడీఓ అశోక్ కుమార్తో పాటు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ మండలాలకఉ చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. 7న అశ్వారావుపేటలో గిరిజన దర్బార్ మారుమూల గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజన కుటుంబాల సౌకర్యార్థం ఈనెల 7న అశ్వారావుపేటలో గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, యూనిట్ అధికారులు పూర్తి నివేదికలతో సోమవారం ఉదయం 10 గంటలకు అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన దర్బార్పై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
చెత్త వేసే చోటే లేదు..
అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీలో నిత్యం వెలువడే చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు ఉన్నా.. అది నిండిపోయి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో యార్డుకు వెళ్లే దారిలోని వ్యవసాయ భూముల్లోనే వేస్తున్నారు. పేరుకు రెండెకరాల డంపింగ్ యార్డు ఉన్నా.. రోడ్డు పక్కనే చెత్త వేస్తుండడంతో మెరుపు కాలనీ, అటెండర్స్ కాలనీ, కోతమిషన్ బజారు వాసులు దుర్వాసన భరించలేకపోతున్నారు. చెత్త కాలిస్తే పొగ, ఈగల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. పట్టణంలో చెత్త సేకరణకు 3 ట్రాక్టర్లు, 7 ట్రాలీలు వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణకు నెలకు రూ.లక్ష డీజిల్కు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.6.64 లక్షలు వ్యయం అవుతోంది. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు చెత్తను మా కాలనీ పక్కనే వేస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు వెళ్లేటపుడు వీధుల్లో పడుతోంది. రోజూ తగలబెడుతుండగా తట్టుకోలేని పొగ, కంపు కొడుతోంది. ఇంటి నిండా ఈగలు ముసురుతుంటాయి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – కోరుకొండ రాజేశ్వరి, మెరుపు కాలనీ ● -
డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణ
● 26–29 శాతం మేర పెరిగే అవకాశం ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉద్యోగుల వేతన సవరణపై ఒప్పందం కుదిరింది. ఈ అంశంపై ఉద్యోగులు మూడేళ్లుగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు ఆధ్వర్యాన హైదరాబాద్లోని టీజీకాబ్ కార్యాలయంలో డీసీసీబీ ఉద్యోగ యూనియన్ల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఉద్యోగుల ప్రస్తుత వేతనాలపై 26నుంచి 29 శాతం మేర సవరణకు నిర్ణయించి, 2022 నవంబర్ 1 నుంచి అమయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎం.శ్రీనివాస్, నున్నా సందర్రావు, జె.అనిల్కుమార్, ఎండీ.అఫ్జల్, పి.మంగయ్య, యూ.రవీందర్కుమార్, డి.రవి, ఎస్.కే.జానీమియా, ఎం.స్రవంతి, బి.రవికుమార్, పి.వెంకట్రామయ్య, జి.క్రాంతి, ప్రకాష్ పాండే పాల్గొన్నారు. కాగా, వేతన సవరణకు సహకరించిన మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేతన ఒప్పందాన్ని జిల్లాల వారీగా బ్యాంకు పాలకవర్గాలు తీర్మానించి అమలు చేయాల్సి ఉంటుంది. బాల కార్మికులు కనిపించొద్దు.. కొత్తగూడెంటౌన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్ ముస్కాన్–11 వాల్పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జూలై 1 నుంచి 31 వరకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో బాల కార్మికులను గుర్తిస్తారని, ఈ బృందంలో ఒక ఎస్ఐతోపాటు నలుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. పోలీస్ శాఖతో పాటు ఇతర అధికారులతో కలిసి జిల్లావ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలతో నెల రోజుల పాటు బాల కార్మికులను గుర్తించేందుకు దాడులు నిర్వహిస్తామని వెల్లడించారు. బాల కార్మికులను గుర్తిస్తే తక్షణమే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీపీఓ హరికుమారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఫక్రుద్దీన్, సందీప్, రమాదేవి, విజయకుమారి, ఏసోబు, సూర్యం పాల్గొన్నారు. -
రోడ్డుపైనే చెత్త..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 29 డివిజన్లు ఉండగా.. వెలువడుతున్న చెత్తను పాతకొత్తగూడెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గతంలో రామవరంలో ఉన్న డంపింగ్ యార్డ్ సామర్థ్యానికి మించి చెత్త వెలువడుతుండగా.. దుర్వాసన, చెత్త కాల్చడంతో వెలువడే పొగతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారి ఆందోళనతో చెత్తను పాతకొత్తగూడెం డంపింగ్ యార్డుకు మార్చారు. గత నాలుగేళ్లుగా అక్కడే డంప్ చేస్తున్నా.. ప్రస్తుతం ఆ స్థలం కూడా సరిపోక రోడ్డుపైనే పడేస్తున్నారు. కొత్త డంప్ యార్డ్ల ఏర్పాటుకు డీఎంఏకు ప్రతిపాదనలు పంపించిన అధికారులు.. స్థలాల ఎంపిక పనిలో పడ్డారు. పట్టణంలో నిత్యం 31 టన్నుల చెత్త వెలువడుతుండగా తరలింపునకు 36 ట్రాలీలు, ఐదు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, డీజిల్, నిర్వహణ ఖర్చులు నెలకు రూ.35 లక్షలు అవుతోందని అధికారులు వెల్లడించారు. పగలు, రాత్రి తేడా లేదు పాతకొత్తగూడెంలో ఇళ్ల సమీపంలోనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. చెత్త తీసుకొచ్చే వాహనాలు రాత్రీ పగలు తేడా లేకుండా తిరుగుతూనే ఉంటాయి. వాహనాలు చప్పుడు, చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. – మరియమ్మ, పాతకొత్తగూడెం ● -
యార్డు ఉన్నా.. ఉపయోగం సున్నా
పాల్వంచ: పాల్వంచలో డంపింగ్ యార్డ్కు గతంలో 11 ఎకరాలు కేటాయించారు. అయినా పలుచోట్ల రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. శివనగర్ పక్కన ఇప్పటికే భారీ డంపింగ్ యార్డు ఉంది. మసీదు గుట్టకు వెళ్లే దారిలోనూ చెత్త డంప్ చేస్తున్నారు. జెన్కో స్థలంలో మరో చోట చెత్త పడేస్తున్నారు. నవభారత్ వెనుక పునాది రాయి అక్రమ తరలింపుతో అక్కడ లోతైన గుంతలు ఏర్పడగా ప్రస్తుతం వాటిలోనూ చెత్త పడేస్తున్నారు. ఇలా అనేక చోట్ల డంపింగ్ యార్డులు ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని పట్టణ వాసులు అంటున్నారు. డివిజన్లో 24 వార్డుల ద్వారా రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. తరలింపునకు 8 ట్రాక్టర్లు, 26 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయి. ఒకేచోట డంప్ చేయాలి పాల్వంచలో మూడు, నాలుగు చోట్ల చెత్త డంప్ చేస్తున్నారు. శివనగర్, మసీద్ గుట్ట, జెన్కో స్థలం, జగ్గుతండాల్లో చెత్త వేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలవారు ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ సూచించిన జగ్గుతండా వద్దే డంపింగ్ చేయాలి. –సాంబశివరావు, పాల్వంచ● -
ఊరు శివారే ఆవాసం !
మణుగూరు టౌన్: వానాకాలం వస్తే మణుగూరులోని చెత్త డంపింగ్ యార్డుకు వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో చెత్త డంప్ చేసేందుకు పట్టణ శివారే దిక్కవుతోంది. పట్టణం నుంచి రోజుకు సుమారు 17 టన్నుల చెత్తను వాహనాల ద్వారా తరలిస్తారు. వర్షం పడితే డంప్యార్డ్ దారంతా బురదమయం అవుతుంది. రోడ్డు పక్కనే చెత్త పడేస్తుండడంతో పందులు స్వైర విహారం చేస్తుండగా దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతూ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, ఈగలు, దోమలతో వ్యాధులు ప్రబలుతున్నాయని యార్డ్కు సమీపంలోని బెస్తగూడెం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. డంప్యార్డ్ను మరో చోటకు మార్చాలంటున్నారు. ఇంట్లో ఉండలేకపోతున్నాం దోమలు, ఈగలతో నిత్యం చస్తున్నాం. వానాకాలం వచ్చిందంటే రోడ్డు బాగా లేదంటూ చెత్త బండ్లను ఇటే తీసుకొస్తున్నారు. చెత్త నుంచి వచ్చే దుర్గంధంతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దోమలతో సతమతం అవుతున్నాం. – మర్రి వెంకటనర్సమ్మ, బెస్తగూడెం● -
ఎక్కడ పడితే అక్కడే..
ఇల్లెందు: ఇల్లెందులో డంపింగ్ యార్డు ఉన్నా సేకరించిన చెత్త అక్కడికి చేరడం లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వెంట పడేస్తుండగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పట్టణం నుంచి నిత్యం 8 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా కొంత డంప్ యార్డుకు చేరుతున్నా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు డ్రైవర్లు రోడ్డుపైనే పడేస్తున్నారు. ఇక యార్డుకు చేరిన చెత్తను సైతం రీసైక్లింగ్ చేయడం లేదు. తడి చెత్తతో ఎరువు తయారు చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియ కూడా అడుగంటింది. వార్డులకు రెండు, మూడురోజు లకోసారి చెత్త వాహనం వస్తోంది. దీంతో ఇళ్లల్లో చెత్త నిల్వలు పెరిగి దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయని పట్టణ వాసులు అంటున్నారు. రోడ్డు పక్కన వేస్తున్నారు డంప్ యార్డుకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే చెత్త పడేస్తుండగా పక్క చేల్లోకి వస్తోంది. చెత్త నుంచి దుర్వాసన వస్తోంది. అన్ని రకాల మలినాలు, కోళ్లు, జంతువుల కళేబరాలు వదిలి వేస్తుండడంతో రోడ్డు వెంట ప్రయాణం చేయటం, సమీప రైతులు చేలలో పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. – హరిప్రసాద్ యాదవ్, ఇల్లెందు ● -
మురికి కంపు
● పట్టణాల్లో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అస్తవ్యస్తం ● పలుచోట్ల రోడ్డుపైనే పడేస్తున్న సిబ్బంది ● వాసన, పొగ భరించలేక సమీప ప్రజలు అవస్థలు చెత్త డంపు..పట్టణాల్లో చెత్త సేకరణ, డంప్ చేయడం ప్రహసనంలా మారింది. చాలా చోట్ల డంపింగ్ యార్డులు ఉన్నా అవి సరిపోక చెత్తను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు. అటుగా వెళ్లే వారు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చెత్త రీసైక్లింగ్ చేస్తే ఈ సమస్య కొంత పరిష్కార మయ్యే అవకాశ ం ఉన్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లెందులో డంపింగ్ యార్డుల సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్.. -
బోన్లెస్ చేపలతో రుచి, లాభాలు!
సూపర్బజార్(కొత్తగూడెం): మునగ సాగు తదితర అంశాలపై ప్రజలకు వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఈసారి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించారు. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం చేపల వ్యాపారులు, మత్స్యకారులతో సమావేశమై చేపల్లో ముళ్లు తీయడంపై ప్రత్యేకంగా వివరిస్తూ.. వీటితో తయారుచేసే వంటలు, ఆదాయ మార్గాలపై అవగాహన కల్పించారు. బోన్లెస్ చేపలతో టిక్కా తదితర వంటలు చేస్తే ప్రజలకు కొత్త రుచులు అందించొచ్చని.. తద్వారా వారికి పోషకాహారం అందడమేకాక మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అలాగే చేపల తలలు, మిగిలిన భాగాలతో సూప్ తయారుచేస్తే అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఇవన్నీ పోగా మిగిలిన వ్యర్థాలతో ఎరువు తయారీకి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో కలెక్టర్ స్వయంగా చేపల నుంచి ముల్లులు తీస్తూ అవగాహన కల్పించగా, మత్స్యకారులు, ఆదివాసీలు, చేపల పెంపకం, అమ్మకంపై ఆధారపడి జీవించే కుటుంబాలు, ఎస్హెచ్జీల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పాటిల్ సూచించారు. 9, 10వ తేదీల్లో మెగా ఆధార్ క్యాంపుఆధార్ కార్డుల్లో అవసరమైన సవరణల కోసం ఈనెల 9, 10 తేదీల్లో మెగా ఆధార్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డుల్లో తప్పులున్నవారు, కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేరు మార్పు, పుట్టిన తేదీ, చిరునామా సవరణ, మొబైల్ నంబర్ అప్డేట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో కొన్ని వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చని, మరికొన్ని మాత్రం ఆధార్ సేవా కేంద్రం నుంచే చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరమ్మతులకు అంచనాలు రూపొందించండికొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతు పనులకు అంచనాలు రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన జూనియర్ కళాశాలను సందర్శించారు. ప్రాక్టికల్ ల్యాబ్లు, రెనవేషన్ కంప్యూటర్ ల్యాబ్ సామగ్రి, ఎలక్ట్రికల్ ల్యాబ్ సామగ్రి, బాలుర, బాలికల టాయిలెట్ల మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనుల వంటి వాటికి అంచనాలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కళాశాల ఆవరణలోని జీహెచ్ఎస్ తరగతి గదులను కూడా రిపేర్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్, ఇన్చార్జ్ డీఐఈఓ సులోచనారాణి, పాఠశాల హెచ్ఎం సబితా సంధ్యారాణి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డీఈ నాగేందర్ పాల్గొన్నారు. తయారీ విధానాన్ని వివరించిన కలెక్టర్ -
కార్మిక శ్రేయస్సుకు నిరంతరం కృషి
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా సింగరేణి ఉద్యోగి, ఐఎన్టీయూసీ నాయకుడు కళ్లం కోటిరెడ్డి నిరంతరం సింగరే ణి అఽభివృద్ధి, కార్మిక శ్రేయ స్సు కోసం పాటుపడ్డారని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం ఇల్లెందు జేకే ఓసీలో ఉద్యోగ విరమణ పొందిన ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కోటిరెడ్డి హక్కుల సాధనకు కృషి చేశాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జాకీర్ హుస్సేన్, చిన్నయ్య, నాయకులు లచ్చిరామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేకే సీఈఆర్ క్లబ్లో గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మడత రమా వెంకట్గౌడ్ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటివరకు ఇల్లెందు ప్రజలకు, కార్మికులకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. అనంతరం కళ్లం కోటిరెడ్డి మాట్లాడుతూ 42 ఏళ్ల పాటు ఇల్లెందు ఏరియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తాను ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మడత వెంకట్గౌడ్ల సారథ్యంలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ జనరల్ త్యాగరాజ్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య, మాజీ వైస్ చైర్మన్లు మడత వెంకట్గౌడ్, బాస శ్రీనివాసరావు, సయ్యద్ జానీపాషా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అబ్దుల్ నబీ, నాయి ని రాజు, ఎస్కె జానీ, డానియేల్, పులి సైదులు, కార్మిక నాయకులు జే. వెంకటేశ్వర్లు, కె సారయ్య, నజీర్ అహ్మద్, ఎస్ రంగనాధ్, దిండిగాల రాజేందర్, పులిగళ్ల మాధవరావు, పత్తి స్వప్న, ఇమామ్, కుటుంబ సభ్యులు కళ్లం అమరనాఽథ్, శాలినీ రెడ్డి, మురళీరెడ్డి, లావణ్య పాల్గొన్నారు. రెండు లారీలు ఢీ : డ్రైవర్లకు గాయాలుబూర్గంపాడు: సారపాక పుష్కరవనం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయాలపాలయ్యారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లారీ కేబిన్లలో ఇరుక్కుపోయి గాయాలైన డ్రైవర్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. లారీలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.జీఎం వీసం కృష్ణయ్య -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
● ఎస్సై సహా కుటుంబీకుల వేధింపులే కారణమని ఆరోపణ ● ఆస్పత్రి మార్చురీ వద్ద భర్త తండ్రికి దేహశుద్ధి జూలూరుపాడు/ఖమ్మం క్రైం: భర్త పోలీసు శాఖలో ఎస్సై, బావ కూడా అదే ఉద్యోగం.. మామ సైతం రిటైర్డ్ పోలీసు అధికారి. సమాజంలో ప్రజల కష్టాలు తీర్చే ఉద్యోగుల ఇంటికి కుమార్తెను ఇస్తే బిడ్డ జీవితం బాగుంటుందని భావిస్తే వివాహేతర సంబంధాల పేరిటే కాక రకరకాల కారణాలతో వేధిస్తుండడంతో ఆమె తనువు చాలించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోతు రాణాప్రతాప్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన రాజేశ్వరి(34)కి 2018లో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.40 లక్షలతో పాటు, 35 తులాల బంగారం, మరో రూ.4లక్షల విలువైన కానుకలను ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉండగా.. కొన్నాళ్ల నుంచి భర్తతో పాటు అత్తామామలు పుష్పరాణి – చంద్రం, బావ మహేష్ (ఎస్సై, మహబూబాబాద్ వీఆర్) రాజేశ్వరికి వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నట్లు సమాచారం. కాగా, రాణాప్రతాప్కు ఖమ్మం జీఆర్పీ ఎస్సైగా పోస్టింగ్ రావడంతో భార్యాపిల్లలను జూలూరుపాడులోనే ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే, కుటుంబీకుల వేధింపులు తాళలేక రాజేశ్వరి జూలూరుపాడులోని అద్దె ఇంట్లో జూన్ 25న పురుగుల మందు తాగగా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది. మామపై దాడి.. హైదరాబాద్ నుంచి రాజేశ్వరి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈక్రమాన రాణాప్రతాప్ తండ్రి చంద్రం మార్చురీ వద్దకు రావడంతో తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో జూలూరుపాడు, ఖమ్మం టూటౌన్ పోలీసులు అడ్డుకుని ఆయనను టూటౌన్కు తరలించారు. ఘటనపై మృతురాలు తండ్రి సోమ్లా ఫిర్యాదుతో రాణాప్రతాప్, పుష్పరాణి, చంద్రం, మహేష్పై కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్ఐ రవి తెలిపారు. కాగా, రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేష్ మొదటి నుంచీ వివాదాస్పదులుగానే ఉన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపాన ఓ చెప్పు ల షాపు యజమానిపై కొన్నాళ్ల క్రితం అకారణంగా దాడి చేసిన రాణాప్రతాప్ తుపాకీతో బెదిరించాడు. ప్రస్తుతం ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
అనుమతి లేకుండా వెళ్లిపోయిన టీచర్
పాఠశాలలో బిక్కు బిక్కుమంటూ గడిపిన విద్యార్థులు టేకులపల్లి: మండలంలోని బద్దూతండా పంచాయతీ మద్దిరాలతండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సోమవారం మధ్యాహ్నం తర్వాత అనుమతి లేకుండానే విధుల నుంచి వెళ్లిపోయాడు. సెలవు చీటి పిల్లలకు ఇచ్చి ఎవరైనా వస్తే చూపించండని చెప్పాడు. కాగా, పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ సాయంత్రం వరకు గడిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు కాంప్లెక్స్ హెచ్ఎం నుంచి అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉంది. కానీ అనుమతి తీసుకోకుండానే, కనీస బాధ్యతను మరిచి పిల్లలను వదిలేసి వెళ్లిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కాంప్లెక్స్ హెచ్ఎం జోగ రవిని వివరణ కోరగా... అనుమతి కోసం తనను సంప్రదించలేదని తెలిపారు. బకాయిలు విడుదల చేయాలిఖమ్మం మామిళ్లగూడెం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేష్, బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యుడు గురుస్వామి రాష్ట్రవ్యాప్తంగా రూ.200కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఫలితంగా పాఠశాలల యజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. -
వెదురు, మునగతో అధిక లాభాలు
కలెక్టర్ జితేష్ వి పాటిల్ఇల్లెందురూరల్ : వెదురు, మునగ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని కొమరారంలో సోమవారం ఆయన పోడు రైతులతో మాట్లాడారు. పోడు భూముల్లో రైతులు పత్తి, మొక్కజొన్న మాత్రమే సాగు చేస్తూ సరైన ఆదాయం పొందడం లేదని, దీనికి ప్రత్యామ్నాయంగా లాభసాటి పంటలు సాగు చేయాలని చెప్పారు. పోడు భూములు మునగ, వెదురు సాగుకు అనుకూలంగా ఉంటాయని, సాగు చేసే రైతులకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. తమకు పోడు పట్టాలు రాలేదని కొందరు మహిళలు కలెక్టర్ దృష్టికి తేగా దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొమరారంలో ఏఎంసీ సబ్యార్డ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మొండితోగులో ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని తనిఖీ చేశారు. మొక్కజొన్న, పత్తి పంటలకు రైతులు వినియోగించే విత్తనాలు, ఎరువులు, పురుగు ముందుల వివరాలు, వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైటీసీని సందర్శించిన కలెక్టర్.. ఈ కేంద్రానికి అవసరమైన మరమ్మతులు చేసి త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఏడీఏ లాల్చంద్, ఎఫ్డీఓ కరుణాకరా చారి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, ఎంఈఓ ఉమాశంకర్, ఏఓ సతీష్, ఏపీఎం దుర్గారావు పాల్గొన్నారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి ఇల్లెందు : అత్యంత ఖరీదైన రూట్ కెనాల్ చికిత్సను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో అందించాలని, అందుకు అవసరమైన దంత వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సోమవారం ఆయన ఇల్లెందు ఆస్పత్రిని పరిశీలించి దంత సమస్యలతో రోజుకు ఎంతమంది వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. బర్త్ వెయిటింగ్ గదులను స్పెషల్ రూంలుగా రీ మోడల్కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో లోతట్టుగా ఉన్న చోట గ్రావెల్తో లెవెల్ చేయాలని సూపరింటెండెంట్ హర్షవర్ధన్కు సూచించారు. శానిటేషన్ సిబ్బంది పని తీరు ను అభినందించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆర్ఎంఓ రాంనివాస్ పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
భద్రాచలం : గిరిజన దర్బార్లో వినతులు ఇచ్చే వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, ఈ విషయంలో ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏఓ సున్నం రాంబాబు, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఎస్డీసీ రవీంద్రనాథ్, అధికారులు భాస్కర్, వేణు, లక్ష్మీనారాయణ, రమేష్, ఆదినారాయణ, హరికృష్ణ పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్ దుమ్ముగూడెం : గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్షబ్ వారి సేవలు అభినందనీయమని పీఓ రాహుల్ అన్నారు. ములకపాడు ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి శిబిరాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని చెప్పారు. శిబిరం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ.. 219 మందికి కంటిచూపు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, అందులో 142 మందిని కేటరాక్ట్ ఆపరేషన్లకు ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీడీఎంహెచ్ఓ చైతన్య, వైద్యులు, ఆయా సంస్థల బాధులు సూర్యనారాయణ, ఎ.జగదీష్, కమలా రాజశేఖర్, నక్కా వెంకన్న యాదవ్, వి.కామేశ్వరరావు, సిద్ధారెడ్డి, యుగంధర్, బానోత్ రాము, ప్రసాద్, మధు, పి.ప్రజ్ఞ, మధుమోహన్ రెడ్డి, జి.సంజీవరావు, బాలకృష్ణ, ఆర్. కృష్ణవేణి, ఆదినారాయణ పాల్గొన్నారు. కాగా. పెద్ద నల్లబల్లి గ్రామానికి చెందిన 70 మంది పోడు పట్టాలు రాలేదని ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి పీఓ రాహుల్ను కలిశారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
‘సీతారామ’తో న్యాయం చేయాలి
● జిల్లా నీరు, భూములతో ప్రాజెక్టు నిర్మాణం ● గోదావరి జలాలు మాత్రం ఖమ్మం జిల్లాకా.. ● ‘చలో పూసుగూడెం’లో బీఆర్ఎస్ నేతలు ● పిండప్రదానం చేయకుండా అడ్డుకున్న పోలీసులుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పరాయి ప్రాంతం వాడు ద్రోహం చేస్తే తరిమి కొడతామని, ఈ ప్రాంతం వాడు ద్రోహానికి పాల్పడితే వంద అడుగుల గొయ్యి తీసి పాతిపెడతా’మని కాళోజీ చెప్పిన సూక్తికి తగ్గట్టుగా జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడి కాంగ్రెస్ నేతలను ప్రజలు బొంద పెడతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ రేగా కాంతారావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం – ఛలో పూసుగూడెం’ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీతారామ నీళ్లు ఖమ్మం జిల్లాకు ఇస్తే తమకు సంతోషమేనని, అయితే అంతకంటే ముందు భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించాలని డిమాండ్ చేశారు. జిల్లాకు న్యాయం జరిగే వరకూ దశల వారీగా పోరాటం కొనసాగుతుందన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. చండ్రుగొండ మండలంలో చేపట్టే ప్యాకేజీలో రైతులకు పరిహారం ఇవ్వకుండా భూ సేకరణ ప్రయత్నం సరికాదన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..సీతారామ ప్రాజెక్టులో జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం తరలించుకుపోతున్నారని అన్నారు. జిల్లాకు న్యాయం చేసేవరకూ తమ పోరాటం ఆగదన్నారు. ‘ఇల్లెందు’కు అనుమతి ఇవ్వాలి సీతారామ ప్రాజెక్టుకు గతంలో ఇల్లెందు నియోజకర్గంలోని రోళ్లపాడులో శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి ప్రాజెక్టును ఇతర ప్రాంతానికి తీసుకెళ్లినా అప్పటి ఎమ్మెల్యే నోరు మెదపలేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లెందు కోసం రూ.3,200 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయించానని, ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పరిశీలనలో ఉండగా ప్రభుత్వం మారిందని, దానికి మంజూరు తేవడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు.. నిరసన కార్యక్రమాలను అణచివేయడంపై కాకుండా ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి సూచించారు. దమ్మపేట రోడ్డులో ట్రాఫిక్ జామ్ బీఆర్ఎస్ చేపట్టిన నిరసన, పోలీసుల అడ్డగింత, అరెస్టులతో ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాల్వంచ – దమ్మపేట రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. రెండు వైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నేతల అరెస్ట్తో వారు వచ్చిన వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండటం, పోలీస్ బారికేడ్లతో ట్రాఫిక్ క్లియరెన్స్కు కొంత సమయం పట్టింది. మరోవైపు పూసుగూడెం పంప్హౌస్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని లోపలికి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను మధ్యాహ్నం 12 గంటలకు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించగా కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ములకలపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు మోరంపూడి అప్పారావు, తాండ్ర రాంబాబు, శనగపాటి సీతారాములు, పుష్పాల చందర్రావు, కోండ్రు సుందర్రావు, సున్నం లలిత తదితరులు పాల్గొన్నారు.తండ్రి పోలీస్ డ్యూటీ.. కూతురు అరెస్ట్ ములకలపల్లి : తండ్రి ములకలపల్లి పోలీస్స్టేషనల్లో తండ్రి ఒగ్గెల లక్ష్మణ్ హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో పూసుగూడెం’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూతురు పూజను అరెస్ట్ చేసి అదే స్టేషన్కు తరలించారు. అయితే విధి నిర్వహణలో భాగంగా అరెస్టయిన కూతురి వివరాలు సేకరిస్తూ రికార్డు చేశారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: భూ వివాదం కారణంగా ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామంలో సాగుచేసిన జామాయిల్ కర్రను సోమవారం నరుకుతుండగా.. నరకవద్దని గ్రామానికి చెందిన ఇట్టి అలివేలు కోరింది. అయినా నరుకుతుండటంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయింది. దీంతో స్థానికులు, బంధువులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొత్తగూడెం, ఆ తర్వాత వరంగల్కు తరలించారు.ఎస్ఐ బెదిరింపుల వల్లే : సీపీఎంరూరల్ ఎస్ఐ బెదిరింపుల వల్లే అలివేలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సీపీఎం నాయకుడు కె.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండ్రుగొండ గ్రామంలోని సర్వేనంబర్ 135లో ఆరెకరాల భూమికి సంబంధించిన వివాదంపై ఇటీవల ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయని తెలిపారు. సీపీఐ నాయకుల ఒత్తిడి కారణంగా ఎస్ఐ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ దొంగపత్రాలు సృష్టించిన వారికి అండగా ఉండి బాధితులకు అన్యాయం చేస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిదని పేర్కొన్నారు.అసత్యపు ఆరోపణలు : ఎస్ఐ సురేష్నేను ఎవరికీ కొమ్ము కాయడంలేదని, నాపై చేసిన ఆరోపణల్లో నిజంలేదని, ఆధారాలు చూపకుండా అసత్యపు అరోపణలు చేయడం సరికాదని రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. -
ఉద్యోగులను బలి తీసుకున్న ప్రమాదం
ఏన్కూరు: రోజు మాదిరిగానే విధులకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఉద్యోగాలకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి బయలుదేరగా.. కాసేపటికే ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో విషాదం అలుముకుంది. ఏన్కూరు మండలం హిమామ్నగర్లో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కొణిజర్ల మండల పల్లిపాడుకు చెందిన ఇమ్మడి రఘుపతి(51) కొత్తగూడెంలో హోంగార్డుగా, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అంకపాలెంకు చెందిన బత్తుల రాజేష్(30) ఖమ్మంలో ఉంటూ కొత్తగూడెం ఎంఈఓ కార్యాలయంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ద్విచక్ర వాహనంపై రాజేష్ కొత్తగూడెం వెళ్తుండగా పల్లిపాడు వద్ద రఘుపతి లిఫ్ట్ అడిగి ఆయనతోపాటు బయలుదేరాడు. మార్గమధ్యలో ఏన్కూరు మండలం హిమామ్నగర్ సమీపాన వీరి బైక్ను జూలూరుపాడు నుండి ఏన్కూరు వైపు వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేష్, రఘుపతికి తీవ్ర గాయాలు కాగా, 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో వెళ్లినా బతికేవాడేమో... కొత్తగూడెంలో హోంగార్డుగా పనిచేసే రఘుపతికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే, రాజేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. రఘుపతి ప్రతీరోజు పల్లిపాడు నుంచి బస్సులో కొత్తగూడెం వెళ్లివచ్చేవాడు. అయితే, సోమవారం విధులకు ఆలస్యమవుతుండడంతో పల్లిపాడు వద్ద రాజేష్ను లిఫ్ట్ అడిగి ఆయన బైక్పై బయలుదేరాడు. దీంతో గమ్యం చేరకుండానే మార్గమధ్యలో ప్రమాదం బారినపడ్డాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రఫీ తెలిపారు. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలిపాల్వంచరూరల్: పత్తి పంటను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రేంజర్కు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండ్రుగొండ గ్రామ శివారు భూమిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గార్డు, వాచర్లు కలిసి ఎనిమిది ఎకరాల్లో నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న పత్తి పంటను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, అడుసుమల్లి సాయిబాబా, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, చెన్నయ్య, ఆదినారాయణ, బొమ్మన నారాయణ, బొమ్మన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి -
● చెత్త వాహనాలు ఐదే..
మణుగూరు టౌన్: మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ తూతూ మంత్రంగానే సాగుతోంది. పట్టణంలో 20 వార్డులు ఉండగా, ప్రధాన వార్డుల్లో ఒకటైన సుందరయ్యనగర్లో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ముఖ్య వీధులకు మాత్రమే వారంలో రెండు సార్లు చెత్త సేకరణ ఆటోలు వస్తున్నాయి. మొత్తం మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలు ఐదే ఉండగా అవి ఎటూ సరిపోవడం లేదు. గాంధీనగర్లోనూ అదే పరిస్థితి. చెత్త సేకరణ వాహనాలు రాక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక డ్రెయినేజీలను పట్టించుకునే నాథుడే లేడు. దోమల బారిన పడుతున్నాం సుందరయ్యనగర్లో కొన్ని వార్డుల్లో మాత్రమే రెండు రోజులకోసారి చెత్త బండ్లు వస్తున్నాయి. లోపలి వీధులకు మాత్రం 20 రోజులకోసారి వస్తున్నారు. కాల్వల్లో మురుగునీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. వాటి బారిన పడితే వ్యాధులు వస్తాయని భయంగా ఉంది. –లక్ష్మి, సుందరయ్యనగర్ ● -
పోలీసుల సేవలు వినియోగించుకోండి
కొత్తగూడెంటౌన్: ప్రతీ పౌరుడు పోలీసుల సేవలను ఉపయోగించుకోవాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పలువురు తమ సమస్యలు ఎస్పీకి వివరించారు. ఆయా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ ఆయా స్టేషన్ల అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సమస్యలు ఉన్నవారు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా సమీప పోలీస్స్టేషన్కు వచ్చి తెలియజేయాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి సన్మానం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురిని ఎస్పీ రోహిత్రాజు సన్మానించారు. ఏడూళ్ల బయ్యారం పీఎస్ ఎస్సై మహమ్మద్ షఫీ, భద్రాచలం ట్రాఫిక్ పీఎస్ ఎస్సై సత్యనారాయణ, ఆశ్వాపురం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ చిన్న వెంకటేశ్వర్లును ఘనంగా సత్కరించారు. గ్రీవెన్స్లో ఎస్పీ రోహిత్రాజు -
కొరవడిన చెత్తశుద్ధి !
ముందస్తుగా ఇంటిపన్ను చెల్లిస్తే రాయితీ ఇస్తామంటూ ఎర్లీబర్డ్ పథకాలు.. కొత్తగా ఇల్లు కట్టాలంటే అనుమతి పేరుతో ఫీజు వసూళ్లు.. ఇంటిపన్ను, నల్లా పన్ను, లైబ్రరీ సెస్.. ఇలా అనేక పేర్లతో పన్నులు విధిస్తున్న ప్రభుత్వం.. మున్సిపాలిటీల్లో సమస్యలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం, డ్రెయినేజీల్లో పూడిక తీయక భరించరాని దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నుంచి తడిచెత్త, పొడిచెత్త సేకరించే వాహనాలు నెలకు ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తున్నాయి. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు లేకపోగా, అధికారులు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇక వర్షాలు ఉధృతమైతే ఈ సమస్య మరింతగా పెరుగుతుందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై చెత్త, డ్రెయినేజీల్లో సిల్ట్ పేరుకుపోతే దోమలు వృద్ధి చెందుతాయని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు తప్పవని భయపడుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పేరకుపోయిన సమస్యలపై సాక్షి ఫోకస్.. ● చెత్త సేకరణ ఊసేలేదు పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. నిత్యం చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు వారికి ఒకటి, రెండు సార్లు కూడా రావడం లేదు. దీంతో ఇళ్లలో రోజుల తరబడి చెత్త నిల్వ చేయలేక స్థానికులు వీధుల్లో పడేస్తుండగా కుప్పలుగా పేరుకుపోతోంది. ప్రధాన వీధుల్లో మాత్రమే చెత్త తొలగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఇతర కాలనీలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. సీతారాం పట్నం, బొల్లేరుగూడెం ఏరియాల్లో డ్రెయినేజీల పక్కన పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాటి ఆనవాళ్లే కనిపించడం లేదు. డ్రెయినేజీ ఆనవాళ్లే కనిపించడం లేదు డ్రెయినేజీలకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు. వాటిలో మురుగు తొలగించక చాలా నెలలైంది. వర్షాలు పెరిగితే మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సీతారాంపట్నంలోని అన్ని వీధుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. – పోటు శ్రీనివాసరావు, సీతారాంపట్నం -
కాంగ్రెస్తోనే అభివృద్ధి
ములకలపల్లి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి సోమవారం మండలకేంద్రంతోపాటు మాధారం, జగన్నాథపురం, పాతగంగారం, సీతాయిగూడెం, కమలాపురం, చాపరాలపల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. రూ 2.68 కోట్లతో నిర్మించిన కార్యాలయ భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్రావు, మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి, కారం సుధీర్, శనగపాటి అంజి, నాగళ్ల వెంకటేశ్వరరావు, గాడి తిరుపతి రెడ్డి, గుంపుల రవితేజ, సురభి రాజేశ్, పాలకుర్తి సుమిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి -
● అధ్వానంగా పారిశుద్ధ్యం
ఇల్లెందు : పట్టణంలోని సత్యనారాయణపురం 1, 2 వార్డుల్లో శానిటేషన్ అధ్వానంగా మారింది. కాల్వల్లో చెత్త తొలిగించడం లేదు. నెలల తరబడి పూడిక తీయకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోనే నిల్వ ఉంటోంది. తద్వారా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇంటింటా చెత్త సేకరించా ల్సిన వాహనాలు 15 రోజులకోసారి కూడా రావడం లేదు. సుదిమళ్ల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలవగా రోడ్లపై పశువులు, గేదెల మలమూత్రాలతో దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త తొలగించక చాలా రోజులైంది.. సత్యనారాయణపురంలో చెత్త తొలగించక, కాల్వలు శుభ్రం చేయక చాలా రోజులైంది. రోడ్లపై పశువుల మల మూత్రాలు తొలిగించక అపరిశుభ్రంగా ఉంటున్నాయి. పేరుకే మున్సిపాలిటీ కానీ, పంచాయతీ తరహాలోనే రోడ్లు, కాల్వల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. –కందుల వీరారెడ్డి, సత్యనారాయణపురం, ఇల్లెందు● -
పట్టణాల్లో లోపించిన పారిశుద్ధ్యం
● వీధుల్లోకి వస్తే భరించరాని దుర్గంధం ● అస్తవ్యస్త డ్రెయినేజీలతో ప్రజల ఇక్కట్లు ● ఇంటింటి చెత్త సేకరణా అంతంతే ● పన్ను వసూళ్లలో మాత్రం ముందుంటున్న అధికారులు● పేరులోనే మధురం కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మధురబస్తీలో పారిశుద్ధ్య సమస్య ప్రజలను పట్టిపీడిస్తోంది. బస్తీమధ్యలో నుంచి ప్రధా న డ్రెయినేజీ ఉండగా స్థానికుల ఇళ్లలో నుంచి కంటే ఎగువ ప్రాంతాల నుంచి మురికి నీరు, చెత్తాచెదారం చేరుతోంది. బస్తీ చివరన ఉన్న కిన్నెరసాని పైపులైన్ ఈ డ్రెయినేజీలో ఉండేది. మున్సిపల్ అధికారులు ఈ పైపులైన్ డమ్మీ చేసి పక్కనే మరో పైపులైన్ ఏర్పాటు చేశారు. అయితే డమ్మి చేసిన పైపులైన్ను డ్రెయినేజీనుంచి తొలగించకపోవడంతో మురికి నీరు, సిల్ట్ ముందుకెళ్లడం లేదు. దీంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయని బస్తీ వాసులు అంటున్నారు. బయటకు వెళితే డ్రెయినేజీ నుంచి భరించరాని దుర్గంధం వస్తోందని, కనీసం రెండు రోజులకోసారైనా సిల్ట్ తొలగించాలని కోరుతున్నారు. పైపులైన్ను తొలగించాలి మధురబస్తీ ప్రధాన డ్రెయినేజీలో అడ్డుగా ఉన్న కిన్నెరసాని పైపులైన్ తొలగించాలి. డ్రెయినేజీలో మురికినీరు పోకుండా అడ్డుగా ఉండడంతో వర్షం వస్తే మురుగంతా ఇళ్లలోకే వస్తోంది. దీనిపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – అరుణ్, మధురబస్తీ -
● అంతర్గత వీధులపై పట్టింపేది ?
అశ్వారావుపేట: నూతనంగా మున్సిపాలిటీ హోదా పొందిన అశ్వారావుపేటలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. 100 రోజుల కార్యాచరణ సక్రమంగా అమలుకాక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. బస్టాండ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వాణిజ్య చెత్త అధికంగా ఉత్పన్నం అవుతోంది. హోటళ్లు, మాంసం, చేపల దుకాణాలు, ఇతర దుర్వాసన వెదజల్లే వ్యర్థాలు రోడ్లపైనే వేస్తున్నారు. అయితే ప్రధాన రహదారిపై రోజూ చెత్త సేకరిస్తున్న సిబ్బంది అంతర్గత రోడ్లను మాత్రమ పట్టించుకోవడం లేదు. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు సైతం సక్రమంగా లేక సిల్ట్ పేరుకుపోతోంది. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించాలిఅదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంఽధిత అధికారులకు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 9వ వార్డులో మసీదుకు వెళ్లే దారిలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చర్ల మండలం దోసినపల్లిలో తమకు ఆరెకరాల పొలం ఉందని, తమ పెద్ద సోదరుడు ఒక్కరే పట్టా చేయించుకున్నాడని, తనకు, తన తమ్ముడికి అన్యాయం చేశాడని అంబేద్కర్ నగర్కు చెందిన చింతల భాస్కర్రావు ఫిర్యాదు చేశాడు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా జయలక్ష్మికొత్తగూడెఅర్బన్ : జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎల్.భాస్కర్నాయక్ సోమవారం ఉద్యోగ విరమణ చేయగా డిప్యూటీ డీఎంహెచ్ఓగా డాక్టర్ జయలక్ష్మి ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె ఈ పోస్టులో కొనసాగుతారు. కాగా, ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్ను సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజకుమార్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాధామోహన్, డీసీహెచ్ఎస్ రవిబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్ మధువరణ్, ఏఓ సుకృత తదితరులు పాల్గొన్నారు. సెర్ప్లో బదిలీలు షురూచుంచుపల్లి : ఉమ్మడి జిల్లా సెర్ప్ ఉద్యోగుల్లో బదిలీల సందడి నెలకొంది. మొదట ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది మంది డీపీఎంలకు సోమవారం స్థాన చలనం కలిగించారు. వీరిలో జిల్లా నుంచి ఐదుగురు, ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి బదిలీ అయిన వారికి ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, హైదరాబాద్ సెర్ప్ కార్యాలయాల్లో పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో జిల్లా నుంచి జి.రమాకాంత, సునందన్, నాగజ్యోతి, యాదయ్య, శేఖర్ ఉండగా, ఖమ్మం నుంచి శ్రీనివాస్, అంజనేయులు, లక్ష్మీనారాయణ ఉన్నారు. కాగా, ఏపీడీ, ఏపీఎంలు, ఎంఎస్ సీసీలు, సీసీలు, అడ్మిన్ అసిస్టెంట్లకు కూడా త్వరలో బదిలీలు కానున్నాయి. స్వయం ఉపాధితో ఆదర్శంభద్రాచలం: స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికాభివృద్ధి సాధిస్తూ దేశంలో గిరిజన మహిళలు ఆదర్శనీయంగా నిలుస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజన దర్బార్కు వచ్చిన ఆయన సమస్యలపై పీఓతో చర్చించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ యూనిట్ ద్వారా తయారు చేసిన న్యూట్రిషన్ పదార్థాలు అమ్మకాలు జరిపే స్టాల్ను సందర్శించారు. మిల్లెట్ బిస్కెట్లు, సబ్బులు, షాంపుల తయారీ, అమ్మకాల వివరాలు తెలుసుకున్నారు. పీఎం మోదీ మన్కీ బాత్లో భద్రాచలం ఐటీడీఏ గిరిజన మహిళల ప్రస్తావన తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారిని అభినందించారు. సరసమైన ధరలలో విక్రయించాలని, తగిన మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. గ్రూప్ మహిళలు విజయలక్ష్మి, సమ్మక్క, సున్నం ఈశ్వరి, సున్నం స్వాతి, బేబీ రాణి, జగ్గా కుమారి పాల్గొన్నారు. -
థమ్సప్ అనుకుని గడ్డిమందు తాగిన బాలుడు
కరకగూడెం: థమ్సప్ అనుకుని ఓ బాలుడు గడ్డిమందు తాగిన ఘటన మండలంలోని చొప్పల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జాడి నవీన్ – వరలక్ష్మి దంపతుల కుమారుడు ఐదేళ్ల వరుణ్తేజ ఆదివా రం ఉదయం ఇంట్లో ఆడుకుంటుండగా.. థమ్సప్ బాటిల్లో పోసిన గడ్డిమందు కనిపించింది. అయితే దాన్ని థమ్సప్గా భావించిన బాలుడు కొంత తాగాడు. కాసేపటికి కడుపునొప్పితో బాధపడడంతో నోరు వెంట నురగలు వస్తూ వాంతి చేసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు ఆటోలో కరకగూడెం పీహెచ్సీకి, అక్కడి నుంచి 108 ద్వారా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గంజాయి పట్టివేత పాల్వంచ: కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 28వ తేదీ సాయంత్రం స్థానిక రెజీనా కాన్వెంట్ సమీపంలో ఎస్ఐ సుమన్ వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపేందుకు యత్నించగా.. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మరో ముగ్గురితోపాటు 11.100 కేజీల గంజాయి పట్టుబడింది. వారు చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమళ్ల శ్రీహరి, జొన్నలగడ్డ రాకేశ్రెడ్డి, బోనకల్ మండలం ముష్టికుంట్లవాసి ఎస్కే జావిద్గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. యూరియా తిని 11 మేకల మృతిములకలపల్లి: యూరియా తినడంతో 11 మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని మంగపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మంగపేట గ్రామానికి చెందిన వాడె దారయ్యకు చెందిన మేకలు గ్రామశివారు లో మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ రైతు ట్రాక్టర్లో యూరియా బస్తాలు తరలిస్తుండ గా ఒకటి రోడ్డుపై పడటంతో యూరియా కిందపడింది. సమీపంలో ఉన్న 11 మేక లు యూరియా తిని మృతిచెందాయి. సుమారు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. -
జూలై 5న కౌన్సెలింగ్
సింగరేణి(కొత్తగూడెం): నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 150 సీట్ల భర్తీ కోసం సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఈ నెల 28 నుంచి 3వ తేదీ వరకు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్–30, కంప్యూటర్–30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్– 30, మెకానికల్–30, మైనింగ్–30 సీట్లు ఉన్నా యని, https:# scp. scpolytechnic. com/ online& admission వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసి, కాపీని డౌన్లోడ్ చేసి, సంభందిత గని, డిపార్ట్మెంట్ హెచ్ఓడీతో అటెస్టేషన్ చేయించి జూలై 5వ తేదీన జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొంది. వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. నేడు 10 మంది అధికారుల ఉద్యోగ విరమణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 10 మంది అధికారులు సోమవారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. వారిలో ఐదుగురు జీఎంలు ఉన్నారు. జీఎం ఈఅండ్ఎం (సోలార్) జీఎస్ జానకీరామ్, జీఎం ఈఅండ్ఎం (ట్రాన్స్పోర్ట్) జె.నాగరాజు, కార్పొరేట్ ఏరియా ఆడిట్ జీఎం (ఎఫ్ అండ్ ఏ) గొర్రెపాటి వెంకటరమణ, జీఎం ఆర్అండ్డీ నారాయణరావు, హైదరాబాద్ సింగరేణి భవన్లో ఎంఎం విభాగంలో జీఎం ఈఅండ్ఎం ఎన్వీ రాజశేఖర్, డైరెక్టర్ ఈఅండ్ఎం అడిషినల్ జీఎం కామిశెట్టి వెంకటేశ్వరరావు, కార్పొరేట్ సివిల్ డీవైజీఎం (సివిల్) రాజశేఖర్, కార్పొరేట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ ఏజీఎం (ఐఈ) గోనే శ్రీకాంత్, మెయిన్ ఆస్పత్రి డీవైసీఎంఓ డాక్టర్ టి.రవీంద్ర, కార్పొరేట్ పర్సనల్ విభాగం సీనియర్ పీఓ తీటి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. మృతుడి వివరాలు లభ్యందమ్మపేట: పామాయిల్ క్షేత్రంలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. శనివారం మండలంలోని మందలపల్లి శివారులోని పామాయిల్ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం విదితమే. కాగా మృతుడి వివరాల కోసం పోలీసులు, మృతదేహం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు ఏపీ, ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కుసిన వెంకటేశ్వరరావు, పాంచాలి దంపతులు మృతదేహం ఫొటో చూసి అశ్వారావుపేట మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, తమ కుమారుడు సాయి (21)గా గుర్తించారు. కాగా మృతుడు అవివాహితుడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి తల్లితండ్రులకు అప్పగించారు. విచారణ చేస్తున్నామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. పేకాట స్థావరంపై దాడిరఘునాథపాలెం: మండలంలోని పాపటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై ప్రత్యేక బృందంతో దాడులు చేపట్టారు. రూ.2,500 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
‘సతత్ వికాస్’పై అవగాహన
● జాతీయ అవార్డుల దరఖాస్తు ప్రక్రియకు కసరత్తు ● క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణఇల్లెందురూరల్: పంచాయతీలను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ పేరుతో 2021–22 నుంచి అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా జాతీయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా, మండలస్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశారు. ప్రస్తుతం ఎంపీడీఓలు గ్రామపంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో అంశంలో ఉత్తమ గ్రామపంచాయతీ, మండలం, జిల్లా పరిషత్ను ఎంపిక చేయనున్నారు. కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులో పొందుపర్చిన అంశాలను పరిశీలించనున్నాయి. కాగా, త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొమ్మిది అంశాలు.. 147 ప్రశ్నలు ప్రధానంగా తొమ్మిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వార్డులు ప్రదానం చేయనుంది. ఆయా అంశాల పరిధిలో 147 ప్రశ్నలకు పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మెరుగైన జీవనోపాధి, వైద్యసేవలు, ఇంటింటికి తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రత, మహిళా సంఘాలకు రుణాలు, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల సమస్యల సాధన, హక్కుల పరిరక్షణ అంశాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ అవార్డులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఏఏ అంశాలపై స్పష్టత ఉండాలి, నిబంధనలు, పరిశీలన ప్రక్రియ ఎలా ఉంటాయనే అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేలోగా కార్యదర్శులను సన్నద్ధం చేసేందుకు కృషి చేస్తున్నాం. – ధన్సింగ్, ఇల్లెందు ఎంపీడీఓ -
అధికారం కోసమే బీజేపీ దైవజపం
● మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని నేలకొండపల్లి : అధికారం కోసమే బీజెపీ రామ జపం, దైవ జపం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలంలోని మోటాపురంలో ఆదివారం జరిగిన సీపీఐ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో ప్రజలను వంచిస్తోందని, మతం మాటున ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికార ధ్యాసే తప్ప దేశభక్తి లేదన్నారు. దేశం కోసం బీజెపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల అభ్యున్నతి, హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, త్యాగాల చరిత్ర తమ సొంతమని అన్నారు. కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సంపద సృష్టి కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. మావోయిస్టులను హతమార్చడానికి అమిత్షా వంటి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని కోరారు. సీపీఐ శత వసంతాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో చారిత్రిక సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు హేమంతరావు, మహ్మద్ మౌలానా, దండి సురేష్, జితేందర్రెడ్డి, కర్ణకుమార్, కర్నాటి భానుప్రసాద్, రామ్మూర్తి, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పాల్తీయ శ్రీనివాసరావు, రాంకోటి, కాశిబోయిన అయోధ్య, మేకల పుల్లయ్య, మల్లెబోయిన ఉపేందర్, సీతారాములు, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అతివలకు అండగా ‘సఖి’
● రెండేళ్లలో 565 కేసులు.. 216 పరిష్కారం ● అత్యధికంగా గృహహింస కేసులే.. ● ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 181 కొత్తగూడెంటౌన్: సమస్యల్లో ఉన్నామని మహిళలు ఫోన్ చేస్తే చాలు.. అండగా సఖి సెంటర్ నిర్వాహకులు ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా 2023 మే నుంచి 2025 మే వరకు 565 కేసుల్లో బాధితులు సఖీ సెంటర్కు ఫిర్యాదు చేశారు. వాటిలో 216 కేసులు రాజీ కాగా, మిగిలినవి విచారణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. కొత్తగూడెంలో సఖి వన్స్టాప్ సెంటర్ను మొదటగా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో 2019లో ఏర్పాటు చేశారు. 2025లో ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాల వద్ద సఖి సెంటర్ను నిర్వహిస్తున్నారు. గృహ హింస, వరకట్న వేధింపులు, ఆస్తి తగాదాలు, వయోవృద్ధులు, ప్రేమించి మోసానికి గురైన బాధితులకు ఆశ్రయం కల్పిస్తూ, పొలీసుశాఖతో పాటు న్యాయ సేవలు, కౌన్సెలింగ్తో వారి సమస్యలు పరిష్కారిస్తున్నారు. తాత్కాలిక వసతితో పాటు అత్యవసర సరిస్థితుల్లో బాధిత మహిళలకు వాహన సదుపాయం కల్పిస్తున్నామని సఖి సెంటర్ అడ్మిన్ జులుమూరి సుభశ్రీ తెలిపారు. రెండేళ్లలో నమోదైన కేసులు జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో 565 కేసులు నమోదు కాగా అత్యధికంగా గృహ హింస కేసులు 402 ఉన్నాయి. వరకట్న వేధింపులు–18, లైంగిక వేధింపులు–6, బాల్య వివాహాలు–2, బాలికలపై లైంగిక వేధింపులు (పోక్సో)–3, ఆస్తి తగాదాలు, వయోవృద్ధులు, ఇతర సమస్యలు–94, మోసం, ప్రేమ పేరుతో మోసగించడం కేసులు–40 ఉన్నాయి. వాటిలో రాజీ అయిన కేసులు–216, విచారణ దశలో–311, శక్తి సదన్, ఇతర గృహాలకు పంపిన కేసులు–38 ఉన్నాయి. అవగాహన సదస్సులు–311 వరకు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సక్సెస్ స్టోరీ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాకు చెందిన బుస్కి కల్ము, సాతిమండల్తో కలిసి భద్రాచలంలోని సారపాకకు గత నవంబర్లో వచ్చారు.కూలీ పనులు చేస్తూ సహజీవనం చేశారు. మహిళ గర్భం దాల్చింది. ఇంట్లో అమ్మను పెళ్లికి ఒప్పించి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిన సాతిమండల్ తిరిగి రాలేదు. గర్భిణికి స్థానిక కారం చిట్టెమ్మ ఆశ్రయం కల్పించింది. అంగన్వాడీ టీచర్ గర్భిణిగా ఉన్న విషయాన్ని మే 4న.. ప్రసవించిన విషయాన్ని మే 19న ఐసీడీఎస్ అధికారులకు తెలిపింది. సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, సఖి సెంటర్ అడ్మిన్ సుభశ్రీ, హరికుమారి బృందం చేరుకుని విచారించారు. సదరు మహిళ, బిడ్డను సఖి సెంటర్కు తరలించారు. సాతిమండల్ వివరాలు సేకరించి గ్రామస్తుల సాయంతో సఖి సెంటర్కు తీసుకువచ్చి పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. యువతిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లేందుకు సాతిమండల్ అంగీకరించాడని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. కాగా, గత మే 29న బుస్కి కల్మును ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ అనితారామచంద్రన్ పరామర్శించారు. కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే సహాయం చేసి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాం. రెండేళ్లుగా 565 కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా భార్యభర్తలు విడిపోతామంటూ ఆశ్రయిస్తున్నారు. అందులో ఎక్కువగా వరకట్న వేధింపుల కేసులు ఉన్నాయి. వేధింపులకు గురైన వారు టోల్ ఫ్రీ నంబర్ 181, లాండ్లైన్ 08744 – 248222, సెల్ నంబర్ 86880 05934కు సమాచారం అందించాలి. –జులుమూరి సుభశ్రీ, అడ్మిన్, సఖి వన్స్టాప్ సెంటర్ -
‘వాగు’.. బాగు చేయరూ..?
● పెదవాగు ప్రాజెక్టుకు గండి పడి ఏడాది ● సమావేశాలు.. సందర్శనలు.. ప్రతిపాదనలతో సరి.. ● ఇప్పటివరకు నిధుల కేటాయింపు శూన్యం ● ఇక వర్షాధారంతోనే పంటలు వేసుకోవాలా? అశ్వారావుపేట: అశ్వారావుపేట, ఏపీలోని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల మారుమూల ఏజె న్సీ గిరిజన గ్రామాల కల్పతరువు పెదవాగు ప్రాజె క్టు. 1981 నుంచి ప్రాజెక్టుకు దిగువనున్న ఆయకట్టు గ్రామాలు పంటలతో కళకళలాడేవి. గతేడాది జులై 18న వచ్చిన క్లౌడ్బరస్ట్కు పెదవాగు ప్రాజెక్టు కట్ట 250 మీటర్ల మేర కోతకు గురైంది. పలు చోట్ల కట్టలు దెబ్బతిన్నాయి. దీంతో గుమ్మడవల్లి, కొత్తూ రు, అనంతారం గ్రామాల్లో 71 నివాస గృహాలు దెబ్బతినగా, 391 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అనంతరం ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. కానీ, ప్రయో జనం శూన్యమే. కంటితుడుపుగా రింగ్బండ్ నిర్మించినా.. నాణ్యతాలోపాల కారణంగా దానికి కూడా గండ్లు పడుతున్నాయని సమాచారం. నీటినిల్వలు పెరిగితే రింగ్ బండ్ కొట్టుకుపోతుందని ఆయకట్టు రైతులు, గుమ్మడవల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేవు.. సందర్శనలు, సమావేశాలు,అంచనాలు తప్ప నిధు ల కేటాయింపు మాత్రంలేదు. 80శాతం ఆయకట్టు ఏపీ లో ఉండటంతో 80శాతం నిధులు సమకూర్చుతామని జీఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించి నా.. కదలిక లేదు. ప్రాజెక్టు సామర్థ్యం 20 వేల క్యూ సెక్కులు కాగా ప్రస్తుతం రింగ్బండ్ సామర్థ్యం కేవలం 1.8వేల క్యూసెక్కుల లోపే. వరదఉధృతి ఎక్కువగా ఉన్నా.. రింగ్ బండ్ నిలిచి ఉంటుందనే నమ్మకం లేదు. ఏపీ ప్రభుత్వం 82శాతం నిధులు జీఆర్ ఎంబీకీ చెల్లిస్తే పనులు మొదలవుతాయని రైతులంటున్నారు.సందర్శనలు.. గతేడాది జులై 21వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెదవాగు ప్రాజెక్టును సందర్శించారు. అదే నెల 22వ తేదీన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టును పరిశీలించి.. పున:నిర్మిస్తామని ప్రకటించారు. అదే నెల 26వ తేదీన రూ.3.5 కోట్ల వ్యయంతో తాత్కాలిక రింగ్ బండ్ నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆగస్టు 31వ తేదీ నాటికి రింగ్బండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి నీరు నిల్వ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన కురిసిన భారీ వర్షంతో రింగ్బండ్కు భారీ గండి పడి 30 మీటర్ల దాకా కొట్టుకుపోయింది. ఈ ఏడాది మార్చి 17వ తేదీన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్, మాజీ మంత్రి జలగం ప్రసాద్రావు పెదవాగు ప్రాజెక్టును సందర్శించారు. అదే రోజు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కూడా వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం నిర్వహించారు. తెలంగాణతోపాటు ఏపీకి చెందిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు (ఇంజినీర్ ఇన్చీఫ్ అనిల్కుమార్, వెంకటేశ్వరరావు) హాజరయ్యారు. గండ్లు పూడ్చేందుకు రూ.19 కోట్లు అవసరమని గుర్తించారు. -
అమ్మవారికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం, తలనీలాలు, చీరలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, భక్తులు బోనాలు, సారె సమర్పించారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయకమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కిన్నెరసానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. రోజంతా సరదాగా గడిపారు. 537 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.29,100 ఆదాయం లభించగా, 250 మంది బోటుషికారు చేయగా టూరి జం కార్పొరేషన్ సంస్థకు రూ.14,060 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
డిగ్రీ.. డీలా
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు తగ్గుతున్న ఆదరణ ● దోస్త్ గడువు ముగిసినా సగం సీట్లు ఖాళీ ● జిల్లాలోని ఆరు కాలేజీల్లో మూడింటికే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ● గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల్లాలోనూ భర్తీకాని సీట్లు ● పాల్వంచలో అధికంగా భర్తీ.. 2025–2026లో మే 30వ తేదీ నుంచి దోస్త్ ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ఈ నెల 9 వరకు, రెండో విడత 13 నుంచి 19 వరకు, మూడో విడత 23 నుంచి 28 వరకు నిర్వహించారు. రేపటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభంకానున్నాయి. మూడు విడతలుగా అడ్మిషన్లు చేపట్టినా విద్యార్థులు నామమాత్రంగానే చేరారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నా ఆదరణ లేదు. పాల్వంచలోని కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధతో ప్రచారం చేపట్టగా జిల్లాలోని మిగతా కాలేజీలకంటే అధికంగా విద్యార్థులు చేరారు. జిల్లాలోని 10 డిగ్రీ కళాశాలల్లో 3,980 సీట్లు ఉండగా, ఇప్పటివరకు 1,813 మంది చేరారు. ఇంకా 2,167 ఖాళీలు ఉన్నాయి. పాల్వంచరూరల్: అడ్మిషన్లు లేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు డీలా పడుతున్నాయి. డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. సంప్రదాయ డిగ్రీ కోర్సులపై విముఖత చూపుతున్నారు. అడ్మిషన్ ప్రక్రియ దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) గడువు ముగిసినా కాలేజీల్లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక పాల్వంచ, అంకంపాలెంలలో గిరిజన సంక్షేమ శాఖ బాలికల డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, మణుగూరులో గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కాగా దమ్మపేట మండలంలోని అంకంపాలెం గిరిజన బాలికల గురుకులాన్ని రెండు, మూడేళ్ల క్రితం అశ్వారావుపేటలోని పెదవాగుకు తరలించారు. జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందులలోనే రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలినచోట్ల ఇన్చార్జి ప్రిన్సిపాల్స్తో నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుండగా, ఈ ఏడాది అధికంగా తగ్గుముఖం పట్టాయి డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల భర్తీ ఇలా.. మొత్తం భర్తీ ఖాళీలు గతేడాది సీట్లు అయినవి భర్తీ ప్రభుత్వ కళాశాలలుపాల్వంచ 660 313 347 420 కొత్తగూడెం 420 177 243 134 భద్రాచలం 840 311 529 470 మణుగూరు 360 120 240 180 ఇల్లెందు 300 80 220 134 అశ్వారావుపేట 280 289 191 303 గురుకుల కళాశాలలు కొత్తగూడెం 280 103 177 142 పాల్వంచ 280 172 108 200 మణుగూరు 280 160 120 200 పెదవాగు 280 88 192 62● విద్యార్థుల చూపంతా ఇంజనీరింగ్ వైపే.. విద్యార్థులు అధికంగా ఇంజనీరింగ్ విద్యవైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడంలేదు. గతంలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు లభించేవి. సీట్ల కోసం పైరవీలు కూడా చేసేవారు. కానీ క్రమంగా అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. కాగా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయితే, అక్కడ సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశం ఉంది. దీనికితోడు అడ్మిషన్లకు స్పెషల్ డ్రైవ్ కూడా చేపడ తామని, ఇంకా చేరనివారు ఎవరైనా ఉంటే వినియోగించుకోవచ్చని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. -
ప్రణాళికే కీలకం
గోదావరి పుష్కరాలకు గతంలో 2015లో.. పన్నెండేళ్లకు ఒకమారు జరిగే పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. మళ్లీ 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి అత్యధిక భక్తులు తరలివస్తుంటారు. గత పుష్కరాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 70 లక్షల మంది భక్తులు హాజరయ్యారని పేర్కొంటుండగా, 2027లో కోటి మందికి పైగానే భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం, పర్ణశాల, మోతె తదితర ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.భద్రాచలం: భక్తులు మహా పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు రెండేళ్ల సమయమే ఉంది. 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ప్రకటించారు. కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద నున్న త్రయంబకంలో పుట్టిన గోదావరి నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. గోదావరి రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 180 కిలోమీటర్లు ప్రవహించగా, విభజనం అనంతరం ఏపీలో ఏడు మండలాలు విలీనం చేయటంతో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ప్రణాళిక ప్రకటించని ప్రభుత్వం 2027లో పుష్కరాలను విజయవంతం చేయాలంటే కనీసం రెండేళ్ల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా స్నానఘాట్ల పెంపు, రోడ్లు వెడల్పు, ఆలయ పరిసర ప్రాంతాల విస్తరణ, భక్తులకు శాశ్వత, తాత్కాలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందస్తు పనులకు రూ.50 కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రోడ్లు విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఘాట్ల పెంపు, ఇతర మౌలిక వసతుల కల్పనకు, శాశ్వత పనులకు ఇంకా నిధులు అవసరమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ పుష్కరాల పనులపై సమీక్ష, బడ్జెట్తో ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఏ ప్రకటనా వెలువడలేదు. పుష్కరాలను ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని ప్రణాళిక, నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకటించాలి 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలంటే ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం. నేను 2003, 2015 పుష్కర స్నానాలను భద్రాచలంలోనే చేశాను. భక్తుల రద్దీ, గత అనుభవాల దృష్ట్యా అన్ని శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేసి ఏర్పాట్లు చేయాలి. – పరిమి సోమశేఖర్, భక్తుడు2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఇంకా ప్రణాళిక, నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించాలని వేడుకోలు -
● మోడు కాదు తోడు!
ఈ చిత్రాన్ని చూడగానే వ్యవసాయ క్షేత్రంలో అలంకరణ కోసం పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి కదా! అశ్వారావుపేటలోని నందమూరినగర్ నుంచి పేటమాలపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఓ రైతుకు వ్యవసాయ క్షేత్రం ఉంది. కొన్నేళ్లు సాగులో ఉన్న కొబ్బరి తోట ముదిరిపోగా దీన్ని తొలగించే క్రమాన వృక్షాల మోడులను అలాగే వదిలేశారు. వీటి మధ్య ప్రస్తుతం అరటి పంట సాగు చేస్తున్నారు. భవిష్యత్లో పందిరి, తీగ జాతుల తోటలు సాగు చేస్తే ఈ మోడులు ఆలంబనగా నిలుస్తాయని అలాగే వదిలేసినట్లు తెలుస్తోంది. – అశ్వారావుపేట రూరల్ -
మెలకువలతోనే వ్యాపారాభివృద్ధి
భద్రాచలంటౌన్: గిరిజన యువత మెలుకువలు తెలుసుకుని వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువతులతో మాట్లాడారు. అనంతరం పీఎంఆర్సీ కార్యాలయాన్ని, శ్రీరామ జాయింట్ లయబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూనిట్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభిరుచికి తగినట్లు దుస్తులు డిజైనింగ్ చేయాలని, ముక్కోటి, శ్రీరామనవమి పండుగల సమయాల్లో దుస్తుల విక్రయాలకు వెసులుబాటు కల్పిస్తానని తెలిపారు. హైదరాబాద్లో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పిస్తామని, కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు ఎంబ్రాయిడరీ మిషన్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రకాల సంక్షేమ పథకాల పెయింటింగ్ డిజైనింగ్ వేయించాలని పీఎంఆర్సీ సిబ్బందికి సూచించారు. మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయస్థాయి వరకు తీసుకెళ్లి ఐటీడీఏ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మిల్లెట్ బిస్కెట్లకు అవసరమయ్యే రాగులు, సజ్జలు ఇక్కడి పొలాల్లోనే పండించుకోవాలని సూచించారు. అనంతరం మిల్లెట్ బిస్కెట్ తయారీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతగా పీఓ బి.రాహుల్, ఏఎస్పీ, విక్రాంత్ కుమార్ సింగ్, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మలకు మహిళలు మిల్లెట్ బిస్కెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబు, ఈఈ హరీష్, ఏసీఎంఓ రమేష్, శ్రీనివాస్, ఆదినారాయణ, నరసింహారావు, జేడీఎం హరికృష్ణ, మిల్లెట్ బిస్కెట్ తయారీదారులు వెంకటలక్ష్మి, లలిత, మంగ వేణి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరంభద్రాచలంఅర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కళాశాల, లయన్స్ క్లబ్, వికాస తరంగిణిల అధ్వర్యంలో ఆదివారం నర్సింగ్ కళాశాలలో ఉచిత కేన్సర్ నిర్ధారణ, చికిత్స, నేత్ర శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి, సికిందరాబాద్కు చెందిన పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించగా, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణకు శిబిరాలు దోహదం చేస్తాయని అన్నారు. 650 మందికి కంటి చూపు పరీక్షలు నిర్వహించి, 326 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. పలువురికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీఓ కె.దామోదర్రావు, ఎంవీఐ వెంకట పుల్లయ్య, రెడ్క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కాంతారావు, ఎ.జగదీష్, డాక్టర్ బి. సుబ్బరాజు, డాక్టర్ జయభారతి, కేన్సర్ వైద్య నిపుణులు, ప్రజ్ఞా, కమలా రాజశేఖర్, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి భద్రాచలం: పునర్విభజనలో భాగంగా ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్లో పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీలో కలిపిన భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలైన ఎటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నంలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. వీటివల్ల పరిపాలన, అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం, ఇతర మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతోందని, భద్రాచలంలో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. -
ఏజెన్సీ నుంచి లండన్ దాకా..
భద్రాచలం : కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్న గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఏజెన్సీ నుంచి ప్రారంభమైన వీరి వ్యాపారం లండన్ వరకూ విస్తరించింది. ప్రధాని మోదీ ‘మన్కీబాత్’లో భద్రాచలం గిరిజన మహిళల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభం.. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వయం శిక్షణ కింద ఏడేళ్ల క్రితం ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ను ప్రారంభించారు. గిరిజన మహిళ ఊకే వెంకటలక్ష్మి మరో ఏడుగురితో కలిసి శిక్షణ తీసుకుంది. అనంతరం రూ.5 లక్షల పెట్టుబడితో శానిటరీ నాప్కిన్ తయారీని ‘భద్రాద్రి శ్రీరామ్ జేఎల్ గ్రూప్’అనే సెల్ఫ్హెల్ప్ గ్రూప్తో ప్రారంభించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని ఓ భవనాన్ని అధికారులు వీరికి కేటాయించారు. మిషనరీతో తయారీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ కోవిడ్ కాలం పూర్తయ్యాక మొక్కవోని ధైర్యంతో శానిటరీ ప్యాడ్ల తయారీ ప్రారంభించారు. ఐటీడీఏ సహకారం తోడవడంతో ప్యాడ్లను గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు సరఫరా చేశారు. నాడు నెలకు 100 ప్యాడ్లతో ప్రారంభం కాగా, ప్రస్తుతం 40 వేలకు చేరింది. ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీతో...వెంకటలక్ష్మి మదిలో మరో ఆలోచన ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ దినుసులతో ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీని ప్రారంభించాలనుకుంది. మరో ముగ్గురు సభ్యులతో కలిసి అప్పటి ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తగిన శిక్షణతో పాటు బ్యాంకు లోన్ కూడా ఇప్పించారు. ఇలా ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’పేరిట బిస్కెట్ల తయారీని ప్రారంభించారు. కొర్రలు, రాగులు, జొన్న, సామలతో రకరకాల బిస్కెట్లను తయారు చేసి అమ్మకం ప్రారంభించారు. మైదా, పంచదార లేకుండా పూర్తిగా ఆర్గానిక్తో తయారు చేయడం వీరి ప్రత్యేకత. బెల్లం, నెయ్యి, బటర్లతో తయారు చేసిన బిస్కెట్లు అనతికాలంలో అందరికీ నచ్చాయి. ఐటీడీఏ పీఓల సహకారంతో..గౌతమ్ పొట్రు తర్వాత పీఓగా వచ్చిన రాహుల్ మార్కెటింగ్పై తగిన శ్రద్ధ చూపి పలుచోట్ల కౌంటర్లు ఇప్పించారు. దీంతో వ్యాపారం విస్తరించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద, పట్టణంలోని పలుచోట్ల, ఐటీడీఏ, గిరిజన మ్యూజియంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శిల్పారామం, ఢిల్లీ రాష్ట్రపతి భవన్తోపాటు ఇతర ముఖ్య కేంద్రాల్లోనూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. సుదూర ప్రాంతాలకు కార్గో ద్వారా సైతం ఆర్డర్లతో సరఫరా చేస్తున్నారు. ఎన్ఐఆర్ల ద్వారా లండన్కు సైతం వీరి బిస్కెట్లు పలుమార్లు చేరాయి. అందరి సహకారం మరువలేనిదిమొదట ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఐటీడీఏ పీఓలు, కుటుంబసభ్యుల సహాయ సహకారా లతో ముందుకొచ్చాం. గ్రూప్లో ప్రతీ మహిళ ఐదంకెల జీతంతో సమానంగా సంపాదిస్తున్నాం. ప్రధాని మోదీ మమ్మల్ని మెచ్చుకోవడం మరింత స్ఫూర్తినిచ్చింది. కొత్తగా ఆలోచించి ఇంకా ముందుకెళ్లాలని ఉంది. – ఊకే వెంకటలక్ష్మి, గ్రూప్ లీడర్ -
శాస్త్ర విజ్ఞానానికి ప్రయోగశాలలు దోహదం
సుజాతనగర్/చండ్రుగొండ: పాఠశాలల్లో ప్రయోగశాలల నిర్వహణ సక్రమంగా లేకపోతే విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి కోల్పోతారని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ అన్నారు. శనివారం సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్తో పాటు సాధారణ ప్రయోగశాలలను సందర్శించిన ఆయన వీటి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రయోగశాలలు ఎంతగానో దోహదపడతాయని, వారిలోని సామర్థ్యాలను వెలికితీసేందుకు ఇవి చాలా అవసరమన్నారు. ప్రయోగశాలలకు ఏమైనా పరికరాలు అవసరమైతే తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎస్సెస్సీ విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే చండ్రుగొండలోని జెడ్పీ హైస్కూల్ను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ సందర్శించి అందులోని అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రెరీతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. సైన్స్తోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, సీఎంఓ సైదులు, హెచ్ఎం ఎంఏ వాజీద్, సేవ్యా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
దమ్మపేట: మండలంలోని రంగువారిగూడెం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి ఆళ్ల లోకేష్ రాష్ట్రస్థాయి క్రీడా ప్రతిభ పోటీలకు ఎంపికయ్యాడు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 26న కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా ప్రతిభ పోటీల్లో ప్రతిభ చూపగా.. జూలై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా లోకేష్ను ఎంఈఓ కీసర లక్ష్మి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత
పాల్వంచ: కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని కేటీపీఎస్ 7వ దశ సీఈ పి.శ్రీనివాసబాబు అన్నారు. శనివారం స్థానిక కేటీపీఎస్ సీతారామ కల్యాణ మండపంలో పాకాలపాటి కృష్ణయ్య సాంస్కృతిక కళాపీఠం సమక్షాన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలమైందని అన్నారు. చిన్నప్పటి నుండే కళలపై మక్కువ పెంచుకునేలా కృషి చేయాలని, కళాకారుల ఆదరించి ప్రోత్సహించాలన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు తోట దేవీప్రసన్న, మధిర రంగ స్థల కళాకారుల సమైఖ్య అధ్యక్షులు పుతుంబాక కృష్ణ ప్రసాద్, బాబులాల్, ఎస్వీఆర్కే.ఆచార్యులు, వెంకటాచారి, జోన్నాడ కృష్ణ, ముత్యాల హనుమంతరావు, కృష్ణ, వెంకన్న, రోశయ్య చౌదరి, బాషా, పాకాలపాటి రోశయ్య చౌదరి, దామోదర్రావు, బాలస్వామి, పున్నయ్య పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్లో ప్రతిభఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): హైదరాబాద్లో జరిగిన 11వ, ఉమ్మడి రాష్ట్ర రైఫిల్ షూటింగ్లో మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన బాలుడు రియాన్ పఠాన్ రాణించాడు. హైదరాబాద్లో గచ్చిబౌలి షూటింగ్ రేంజ్లో శనివారం జరిగిన పోటీల్లో రియాన్ పాల్గొని, ప్రతిభ చూపి, కేరళలో జరగబోయే ప్రీనేషనల్ (సౌత్జోన్), ఆలిండియా మౌలాన్క్లర్కోలో అతడు స్థానం సాధించాడు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జె.కిరణ్, ఏపీ రైఫిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజ్కుమార్ రియాన్ పఠాన్ను సత్కరించారు. ఆయన తండ్రి రహీం పఠాన్ జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పతకాలు సాధించాడు. గుర్తు తెలియని మృతదేహం లభ్యందమ్మపేట: మండలంలోని మందలపల్లి గ్రామ శివారులోని పామాయిల్ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పామాయిల్ క్షేత్రంలో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని శనివారం స్థానికులకు కనపడగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మూడు రోజుల క్రితమే ఆ వ్యక్తి మరణించినట్లుగా భావించారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, అతడి ముఖంపై పలు గాయాలు కాగా రక్తస్రావం జరిగిందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేట మార్చురికీ తరలించారు. మందలపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి మహాదేవ గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మృతుడి వివరాలు తెలిసినవారు 87126 82065 నంబర్కు తెలపాలని ఎస్సై సాయికిషోర్రెడ్డి సూచించారు. -
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై ఆరా
ఇల్లెందు/టేకులపల్లి: సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు శనివారం సింగరేణి ఇల్లెందు ఏరియాలో పర్యటించి పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేకే ఓసీ, సీహెచ్పీని సందర్శించి అక్కడి వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్తత్తి, ఉత్పాదకతతో పాటు జేకే ఓసీ కాల పరిమితి, సీహెచ్పీలోని లోడింగ్, బొగ్గు గ్రేడింగ్ పని తీరును ఏరియా జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే పూసపల్లి ఓసీ ఏర్పాటు తీరును తెలుసుకున్నాక రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం జాకీర్ హుస్సేన్, డీజీఎం పర్సనల్ తుకారం, అధికారులు పాల్గొన్నారు. అలాగే కోయగూడెం ఓపెన్కాస్టును సందర్శించి కేఓసీ వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులపై ఆరా తీసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. అనంతరం కేఓసీలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం జాకీర్ హుస్సేన్, కోయగూడెం పీఓ గోవిందరావు, డీజీఎం పర్సనల్ అజ్మీర తుకారం, ఇల్లెందు ఏరియా ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
భద్రాచలంఅర్బన్: నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు రక్షించుకునేందుకు వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు తెలిపారు. బండారు చందర్రావు భవన్లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల సంక్షేమ చట్టం రద్దయిందని దీన్ని కాపాడుకోవాల్సిన ప్రతీ ఒక్క కార్మికుడిపై ఉందన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నేతలు ఏజే రమేష్, ఎంబీ నర్సారెడ్డి, నరసింహారావు, శరత్బాబు, ఎర్రంశెట్టి వెంకటరామారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సన్నబియ్యం తూకంపై విచారణ ములకలపల్లి: ములకలపల్లి రేషన్షాపులో బియ్యం తూకం తేడా అంశంపై ‘రేషన్ షాపులో మాయాజాలం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురిమైంది. దీనికి స్పందించిన అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. తహసీల్దార్ బి.గనియా ఆదేశాల మేరకు గిర్దావర్–2 భద్రు ఆ రేషన్ షాపులోని బియ్యం నిల్వలు, స్టాకు రిజిస్టర్లను పరిశీలించి సేల్స్మెన్ అగ్గిరామ్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించనున్నట్లు గిర్దావర్–2 తెలిపారు. -
ఇల్లెందులో కోల్డ్ స్టోరేజీ..
పంటల భద్రతకు వీలుగా.. ఇటీవల ఇల్లెందు మార్కెట్లో జరిగిన పాలక మండలి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందులో కోల్డ్ స్టోరేజీ నిర్మాణం విషయాన్ని ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రైతులకు ఉపయోగపడేలా ఇక్కడ కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపడతామన్నారు. పంటలకు సరైన ధరలు లేనప్పుడు కొంతకాలం దాచేందుకు వీలుగా ఇల్లెందులో ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ప్రభుత్వం నుంచి కోల్డ్ స్టోరేజీకి సరిపడా నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. ఈ తరుణాన ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలనుకున్నారు. దీనికి కనీసం 5 ఎకరాల స్థలం కావాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలకే స్థలం కొరత తీవ్రంగా ఉండగా.. మండలం వెలుపల నిర్మిద్దామంటే 1/70 చట్టం అడ్డుగా మారబోతుంది. దీన్ని అధిగమించేందుకు ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో 6 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ హమాలీలు రెండు ముఠాలుగా విడిపోయి ఘర్షణలు జరగడంతో ఎన్నో ఏళ్లుగా మార్కెట్ సాగడం లేదు. దీనిలోని గోదాంలు సైతం సరుకు నిల్వకు ఆశించినంత ఉపయోగపడకపోవడంతో సివిల్ సప్లై శాఖ పీడీఎస్ బియ్యం నిల్వకు వినియోగించుకుంటున్నారు. దీనికి తోడు కొంతమంది వ్యాపారులు తమ సరుకు నిల్వలకు వాడుకుంటున్నారు. పడావుపడిన మార్కెట్ యార్డులో పశువులు, కోతులు, కుక్కలకు ఆవాసాలుగా మారిన తరుణంలో కోల్డ్ స్టోరేజీగా మారిస్తే రైతులకు, వ్యాపారుల సరుకు నిల్వలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ దిశగా స్థానిక మార్కెట్ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఎన్ఓసీ అవసరం.. కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి ఐదెకరాల భూమి, విద్యుత్, ఫైర్, బీమా, లీగల్ మెట్రాలజీ, పొల్యూషన్ శాఖ నుంచి ఎన్ఓసీ కావాల్సి ఉంటుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అయితే బ్యాంకుల నుంచి రుణం కూడా పొందే అవకాశం ఉంది. నిర్మాణం జరిగితే మార్కెట్కు నిరంతరం ఆదాయంతో పాటు సరుకుకు భద్రత కలగనుంది. పడావుపడిన మార్కెట్ యార్డును ఉపయోగంలోకి తెచ్చి సబ్ యార్డుల్లో క్రయవిక్రయాలు సాగించే అవకాశం ఉంటుందని మార్కెట్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి మార్కెట్ .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1975 మే నెల 4న ఆనాటి సీఎం జలగం వెంగళరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నెమరుగొమ్ముల రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షుడు పర్సా లక్ష్మీనర్సింహారావులు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో జోరుగా క్రయవిక్రయాలు జరిగిన ఈ మార్కెట్ యార్డులో క్రమంగా చెక్ పోస్టుల ద్వారా ఆదాయం సమకూర్చుకునే దిశకు చేరాయి. ఆరు ఎకరాల స్థలం కలిగిన ఈ మార్కెట్ పరిధిలో ప్రస్తుతం మూడు జిల్లాలో ఎనిమిది మండలాల పరిధిలో మార్కెట్ విస్తరించి ఉంది. మార్కెట్ యార్డులో ఐదు ఎకరాల్లో నిర్మాణం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు లక్ష బస్తాలు నిల్వ దిశగా ప్రణాళిక మిర్చి, బెల్లం, ఎల్లిపాయలు, అల్లం, పసుపు నిల్వలకు చాన్స్ రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు లేవు. ఏ పంట నిల్వ చేసుకోవాలన్నా ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈనేపథ్యాన ప్రస్తుత మార్కెట్ పాలక వర్గం ఇల్లెందు పట్టణ నడిబొడ్డున గల వ్యవసాయ మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించి ఓ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రణాళికలు చేస్తోంది. ఇందుకు తగిన ప్రతిపాదనలను రూపొందించేలా చర్యలు ప్రారంభించింది. – ఇల్లెందుకోల్డ్స్టోరేజీ లేని జిల్లా.. జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు లేవు. ఎవరైనా నిర్మాణం చేయాలంటే భూమి సమస్య తీవ్రంగా ఉంది. లేదంటే 1/70 చట్టం అడ్డుగా ఉంది. ఇల్లెందులో మార్కెట్ స్థలంలో మాత్రమే ఈ అవకాశం ఉండడంతో పాలక వర్గం ఆవైపుగా దృష్టి సారించింది. ఇక్కడ నిర్మాణం చేపడితే ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాలతో పాటు భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం వంటి ప్రాంతాల వారు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కనీసం లక్ష క్వింటాళ్ల సరుకు నిల్వ చేసేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నారుప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ఇల్లెందులో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. పాలకులు మారుతున్నారే కానీ దీని నిర్మాణానికి ఎలాంటి ఆలోచన చేయలేదు. ప్రస్తుత పాలక వర్గం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. – బానోతు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్రైతుల మేలు కోసం.. ఇల్లెందులో గిరిజన రైతుల మేలు కోసం నిర్మించే కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. దీని ద్వారా మిర్చి, ఇతర పంటలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకుని గిట్టుబాటు ధరలు పొందొచ్చు. – నాళ్ల సోమసుందర్, వ్యాపారి -
చిన్నారికి కలెక్టర్ అభినందన
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ ‘వాక్ ఫర్ ట్రీస్’అనే అంశంతో ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న చిన్నారి మూడు విశ్వామిత్ర చౌహాన్ను శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. ఈమేరకు ఇటీవల అడవుల నుంచి సేకరించిన వివిధ రకాల చెట్ల గింజల ను అటవీఅధికారులకు అందజేసిన సందర్భంగా శనివారం ప్రశంసపత్రాన్ని అందించారు. అనంతరం విశ్వామిత్రతో కలిసి కలెక్టర్తో పాటు డీఎఫ్ఓ కిష్టాగౌడ్ మామిడి మొక్కలు నా టారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాహు ల్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్కు విద్యార్థిని ఎంపికఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): మండలంలోని అబ్బుగూడెం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓరుగంటి తరుణ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికై ంది. ఈ నెల 26న ఖమ్మంలో జరిగిన ఎంపికల్లో విద్యార్థిని ప్రతిభ చూపింది. ఈ మేరకు శనివారం పాఠశాలలో బాలికను ఎంఈఓ ఉండేటి ఆనంద్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.లక్ష్మణ్, డి.రమేష్, ఎం. బాలు, జి.రామ్మోహన్, ఎ.సుభద్ర పాల్గొన్నారు. గిరిజన విద్యార్థినికి ఆర్థిక సాయంభద్రాచలంటౌన్: నీట్ శిక్షణ తీసుకుంటున్న గిరిజన విద్యార్థిని వజ్జ రోజాకు ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని పీఓ బి.రాహుల్ శనివారం తన చాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన రోజా ‘పది’ఫలితాల్లో పాఠశాలల్లో 2వ ర్యాంకు, ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను 424 సాధించిందని తెలిపారు. విద్యార్థిని చదువుకు చేయూతనందించేందుకు ఈ సాయం అందించామన్నారు. ఏపీఓ డేవిడ్ రాజ్, ఎస్ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయానికే మొగ్గు..
ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపని రైతులు ● జిల్లాలో మరీ తక్కువగా నూనె పంటల సాగు ● ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న కర్షకులుసూపర్బజార్(కొత్తగూడెం): రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, వాణిజ్య పంటలు పత్తి, మిర్చి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయిల్పామ్, మునగసాగు విషయంలో మాత్రం అధికా రుల కృషి ఫలిస్తోంది. నూనె పంటలైన వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, మద్దతు ధర లభిస్తుందని అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా సుముఖత వ్యక్తం చేయడంలేదు. దీంతో జిల్లాలో సంప్రదాయ పంటలే అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్లో వరి 1,60,956 ఎకరాల్లో, మొక్కజొన్న 85,544 ఎకరాల్లో, పత్తి అత్యధికంగా 2,04,632 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆయిల్పామ్లో ప్రథమస్థానం.. వ్యవసాయ, ఉద్యానశాఖల కృషితో ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంటోంది. అంతర పంటలకు సాగుకు అవకాశం, రాయితీలు అధికంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాలకు తోటలు దెబ్బతినకపోవడంతో పలువురు రైతులు ఆయిల్పామ్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ వానాకాలంలో 75 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు సిద్ధమయ్యారు. ఇక నూనె పంటల్లో వేరుశెనగ 2,791 ఎకరాల్లో సాగు చేయనుండగా మిగతా పంటలు నామమాత్రంగా సాగు చేయనున్నారు. ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మునగ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ విస్తృత ప్రచారం చేయడంతో కొందరు రైతులు మునగ వైపు మొగ్గు చూపుతున్నారు. గత వానాకాలంలో 550 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 2,500 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. కూరగాయల సాగుతో ఎక్కువ ఆదాయం లభించే అవకాశం ఉన్నా రైతులు ఆ దిశగా దృష్టి సారించడంలేదు. దీంతో జిల్లా ప్రజల కోసం కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తే సంప్రదాయ పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
అలనాటి ప్రాభవమేది..?
వేణుగోపాలా.. వెండిపూలతో పూజలు జిల్లా చరిత్రపై ఇప్పటికీ సరైన పరిశోధనలు జరగడం లేదు. పాల్వంచ సంస్థానం కేంద్రంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, అంతకు ముందు నైజాం జమానాలో చర్ల కేంద్రంగా కొనసాగిన పాలన, బొగ్గు గనుల పేరుతో ఇల్లెందులో బ్రిటీషర్లు వదిలి వెళ్లిన గుర్తులు ఇప్పటికీ ఈజిల్లా వాసులకు పెద్దగా తెలియ దు. అంతకుముందు చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు చరిత్రలో కలిసిపోయినప్పటికీ.. ఇంకా మౌనసాక్షులుగా మోతె వీరభద్రస్వామి ఆలయం, ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి ఆలయాలు నిలిచి ఉన్నా యి. గోదావరి తీరం వెంబడి మోతె పరిపాలన కేంద్రంగా ఉంటే ఇరవెండి గ్రామం అగ్రహారంగా ఉండేదని తెలుస్తోంది. ఇక్కడున్న సంతాన వేణుగోపాల స్వామికి వెండి పూలతో ప్రతీ రోజు అర్చన చేయడంతో ఈ గ్రామానికి ఇరవెండి అనే పేరు స్థిరపడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. 1400 ఏళ్లకు పూర్వం సంతాన వేణుగోపాల స్వామి ఆలయం 1400 ఏళ్లకు పూర్వం నాటిదని ఇక్కడ పూజలు నిర్వహించే అర్చకులు చెబుతున్నారు. వైష్ణవఆలయాల్లో నిర్మించే లక్ష్మీ మండప ద్వారం.. ఆలయ నిర్మాణం జరిగిన వెయ్యేళ్లకు కచ్చితంగా పగులుతుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొన్నారంటూ ఇక్కడున్న ఆలయ ద్వారానికి కూ డా పగులు ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. దీనికి తోడు పాల్వంచ తహసీల్దార్గా ఈ ప్రాంతానికి వచ్చిన కంచర్ల గోపన్న నేలకొండపల్లిలో ఉన్నప్పుడు వేణుగోపాలుడి భక్తుడని, భద్రాచలంలో సీతా సమే త శ్రీరాముడికి ఆలయం నిర్మించే ముందు తరుచుగా ఇరవెండి వేణుగోపాలుడిని దర్శించుకునేవాడని భద్రాచలం వాసులు చెబుతున్నారు. ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయ నమూనాలోనే భద్రాచలం ఆలయం కూడా ఉంటుందని వారు అంటున్నారు. లక్ష్మీ మంటప ద్వారం పగుళ్లు, భక్త రామదాసు (కంచర్ల గోపన్న)ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, చోళుల కాలంలో నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. వరదలతో.. గోదావరి తీరంలో ఎత్తైన కొండపై ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్సవాలు జరిగి ప్పుడు వంద కేజీల నువ్వులు, బెల్లం ప్రసాదం తయారు చేసిన సరిపోదనే కథ ప్రచారంలో ఉంది. గోదావరికి వరదలొచ్చినప్పుడు ఆల యం ముంపున కు గురి కాలేదని, కానీ చుట్టూ ఉన్న ఊళ్లు ముని గిపోయాయని, అలా నెమ్మదిగా ఇక్కడున్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని స్థానికులు చెబు తున్నారు. ముఖ్యంగా 1953, 1986లలో వచ్చిన వరదలతో ఈ చారిత్రక ఆలయం క్రమంగా తన ప్రాభవం కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలకే ఈ ఆలయం పరిమితమవుతోంది. హోలీ పండుగ సమయంలో ఇక్కడ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి ఘనంగా పెళ్లి వేడుక జరిపిస్తారు. అప్పుడు భక్తులతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది. ప్రచారం కల్పిస్తే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యతీర్థానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో మోతె వీరభద్రుడు, 13 కిలోమీటర్ల దూరంలో ఇరవెండి వేణుగోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన చరిత్రపై శాసీ్త్రయ ఆధారాలు సంపాదించి, సరైన రీతిలో ప్రచారం చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యాటకం పరంగా భద్రాచలం ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. ఇరవెండిలో శతాబ్దాలనాటి సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఒకప్పుడు వెండిపూలతో నిత్యం అర్చనలు ప్రస్తుతం ధూపదీప నైవేద్యాలకే పరిమితం చారిత్రక ప్రాంతాలపై దృష్టి పెట్టని జిల్లా అధికారులుఅనాదిగా నదీ తీరాలు నాగరికతకు కేంద్రాలుగా వర్థిలాయి. ఇదే ఒరవడిలో గోదావరి నది వెంబడి ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రదేశాలు ఆనాటి ప్రాభవం కోల్పోయాయి. ఇందుకు బూర్గంపాడు మండలంలోని మోతె వీరభద్రస్వామి, ఇరవెండి సంతాన వేణుగోపాల స్వామి ఆలయాలే నిదర్శనంగా చెప్పవచ్చు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంకానరాని పరిశోధనలు ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి, మోతె వీరభద్రుడి ఆలయాల నిర్మాణ శైలిని పరిశీలిస్తే కాకతీయు కాలం లేదా అంతకంటే ముందువని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయాలను ఎవరు నిర్మించారు? ఏ కాలంలో నిర్మించారనే ఆధారాలు శిలాశాసన రూపంలోకానీ, గ్రంథ రూపంలో కానీ లభ్యం కాలేదు. భక్తరామదాసు రచనలు, రామదాసు గురించి ఇతరుల రచనల్లో కూడా ఈ ఆలయాల ప్రస్తావన లేదు. ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయాలు వారసత్వ సంపదగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడి చరిత్రపై పరిశోధనలు చేసే బృందాలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలు కేంద్రంగా రీసెర్చులు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లా విషయంలోనూ ఈ తరహా పరిశోధనలకు ప్రోత్సాహం అందివ్వాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. -
‘సర్వే’శ్వరా..!
● గౌరవ వేతనం కోసం ఎన్యుమరేటర్ల ఎదురుచూపులు ● గతేడాది నవంబర్లో సమగ్ర కుటుంబ సర్వే ● ఏడు నెలలు గడిచినా చెల్లింపులు చేపట్టని ప్రభుత్వం కష్టపడి పనిచేశాం సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను రాత్రింబవళ్లు కష్టపడి ఆన్లైన్ చేశాం. రోజుకు 30 నుంచి 40 వరకు దరఖాస్తుల వివరాలు నమోదు చేశాం. వీటి డబ్బుల కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తున్నాం. – భూక్యా కిషోర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విడుదల చేయాలి ఒక్కో ఆపరేటర్ 400 నుంచి 550 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఆ ప్రకారం పారితోషికం చెల్లించాల్సి ఉంది. త్వరగా విడుదల చేసేలా జిల్లా అధికారులు చొరవ తీసుకోవాలి. –పి.సతీష్, డేటా ఎంట్రీ ఆపరేటర్చుంచుపల్లి: గతేడాది నవంబర్లో ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఏడు నెలలు గడిచినా ఆ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటివరకు గౌరవ వేతనం చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తామనే విషయం కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఎన్యుమరరేటర్లు, ఆపరేటర్లు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతోపాటు సంక్షేమ పథకాల అమలుకు గతేడాది నవంబర్ 6 నుంచి 21 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే చేపట్టింది. జిల్లాలో సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ వార్డు అధికారులు, సెర్ప్ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లుగా పని చేశారు. ఒక్కొక్కరు 150 కుటుంబాల వరకు సర్వే చేశారు. అనంతరం నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు వివరాలను 1,753 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేశారు. 4,372 మంది సిబ్బంది సేవలు సమగ్ర కుటుంబ సర్వేలో 2,383 మంది ఎన్యుమరేటర్లు, 236 మంది సూపర్వైజర్లు పనిచేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 103 వార్డులు, 481 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,36,407 కుటుంబాల నుంచి సుమారు 20 రోజులపాటు వివరాలు సేకరించారు. ఎన్యుమరేటర్లకు రూ.10 వేల చొప్పున, సూపర్ వైజర్లకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పున ఇస్తామని చెప్పింది. మొత్తం ఆపరేటర్లందరికీ కలిపి సుమారు రూ.3.40 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు చెల్లించకపోవడంతో ఎన్యుమరేటర్లు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వే జరిపిన కుటుంబాలు: 3,36,407సేవలందించిన సిబ్బంది: 4,372 చెల్లించాల్సి పారితోషికం (సుమారు) : రూ.3.40 కోట్లు -
కరెంట్తో అప్రమత్తంగా ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యుత్ వినియోగదారులు, ప్రధానంగా రైతులువిద్యుత్ ప్రమాదా ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సి జాగ్రత్తలను ఆయన వివరించారు. ఎవరూ సొంతంగా విద్యుత్ సంబంధిత మరమ్మతులు చేపట్టొద్దని సూచించారు. ఇవి పాటించాలి ●తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కు వ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దు. ప్రమాదకరంగా ఉన్నట్లు గమనించిన వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి లేదా టోల్ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలి. ●ఇళ్లలో బట్టలు ఆరవేసేందుకు ప్లాస్టిక్ దండేలను మాత్రమే వినియోగించాలి ●ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంటుంది. విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండేలకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలి ●యజమానులు పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. విద్యుత్ వైర్లు కిందపడి ఉంటే గమనించి పశువులను దూరంగా తోలుకెళ్లాలి. ●ఇంటి వైరింగ్కు ఎర్తింగ్ చేయాలి. నాణ్యమైన ప్లగ్గులను సెల్ చార్జర్లకు వినియోగించాలి ●ఎవరికై నా పొరపాటున విద్యుత్ షాక్ సంభవిస్తే సమీపంలోని వ్యక్తులు అతని తాకొద్దు. అతన్ని కాపాడేందుకు కర్ర, ప్లాస్టిక్ వస్తువులు వాడాలి. ●వినియోగదారులు గృహాల్లో నాణ్యమైన వైరింగ్ చేయించుకోవాలి. రైతులు స్విచ్ బోర్డులు/మోటారు స్టార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి ●వ్యవసాయ మోటార్ల వద్ద వైర్లకు ఇన్సులేషన్ తొలగిపోయే అవకాశం ఉంది. ఫుట్ వాల్వులు, ఇతర ఇనుప పరికరాలకు విద్యుత్ ప్రసారమయ్యే అవకాశం ఉంటుంది. రైతులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. విధిగా ఎర్తింగ్ చేయాలి. ●అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతో మాత్రమే వినియోగదారులు, రైతులు పనులు చేయించుకోవాలి ●విద్యుత్ కంచె ఏర్పాటు చేయొద్దు. ఇది చట్టరీత్యా నేరం. ●విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం వంటివి చేయొద్దు. ఆ పనులను విద్యుత్ సిబ్బందితోనే చేయించాలి. ●వ్యవసాయ మోటార్లకు, గృహాల్లో నాణ్యత కలిగిన, అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే వినియోగించాలి. ●గ్రామీణ వినియోగదారులు విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, సెక్ష న్ ఆఫీసర్లను సంప్రదించి సేవలు పొందాలి. ●ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1912 సమాచారం ఇవ్వాలి. కెపాసిటర్ అమర్చుకోవాలిజూలూరుపాడు: రైతులు వ్యవసాయ మోటా ర్లకు కెపాసిటర్ అమర్చుకోవాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ జి మహేందర్ సూచించారు. శనివా రం వినోభానగర్లో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ అమర్చకపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్పై అధిక భారం పడటంతో కాలిపోతాయన్నారు. ఇంట్లో బట్టలు ఆరవేసేందుకు దండెంగా జీఐ వైరు వినియోగించొద్దని అన్నారు. డీఈలు కృష్ణ, జి.రంగస్వామి, ఏఈ నరసింహారావు, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. విద్యుత్ ఎస్ఈ మహేందర్ -
‘ఉపాధి’లో నిబంధనలు పాటించాలి
చుంచుపల్లి: నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులు చేపట్టాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంపీడీఓలు, పీఆర్ ఏఈలు, ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి కూలీకి కనీస వేతనం రోజుకు రూ.300 వచ్చేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ, అంగన్ వాడీ కేంద్రాల భవనాల పనులు ప్రారంభించాలని చెప్పారు. వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పాలసీలను నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేస్–11లో జిల్లాలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు 16 మంజూరుకాగా, నాలుగింటి పనులే ప్రారంభించారని, మిగిలిన 12 పనులను మొదలు పెట్టాలని సూచించారు. డీఆర్డీఓ ఎం. విద్యాచందన, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, అదనపు డీఆర్డీఓ ఎన్. రవి పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కాకినాడకు చెందిన భక్తురాలు సత్య అనురాధ రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలిఅశ్వాపురం: పెండింగ్లో కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రోహిత్రాజు పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అశ్వాపు రం పోలీస్స్టేషన్ను శనివారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, గదులను పరిశీ లించి రికార్డులు తనిఖీ చేశారు. కేసుల వివరా లు తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఆయిల్ రికవరీని కాపాడాలిఅశ్వారావుపేట/దమ్మపేట: ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని కాపాడాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సూచించారు. శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను నారంవారిగూడెంలోని ఆయిల్పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, గెలల క్రషింగ్ సామర్థ్యంపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం తగ్గకుండా ఉండేందుకు గెలల దిగుమతి నుంచి క్రూడాయిల్ సేకరణ వరకు అన్ని అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్వానికి రాని గెలలను తీసుకురావొద్దని రైతులను సూచించాలన్నారు. ప్లాంట్ల మేనేజర్లు ఎం.నాగబాబు, సత్యనారాయణ, అధికారులు పవన్, కళ్యాణ్, వెంకటేష్, కార్తీక్, రాజేష్, శివ,రాధాకృష్ణ ఉన్నారు. -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
అశ్వాపురం: మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒడిశాలో జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో 26 సంవత్సరాలుగా గౌతమినగర్లో వేడుకలు నిర్వహిస్తుండటం విశేషం. ఉత్కల్ పతాగర్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి దేవతా మూర్తులకు తొలిరోజు ఆధ్యాపూజ, మధ్యాహ్నపూజ, పహాండి, ఛెరపహారా తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, కోలాటాలు, నృత్యాల నడుమ దేవతా మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మండపంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావు వేడుకలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఛెరపహారా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులు కొలువైన రథాన్ని భక్తులు ఇరువైపులా బారులుదీరి లాగారు. ఆ తర్వాత గుండిచాఘర్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ఒడిశావాసులు, భారజల కర్మాగార ఉద్యోగులు, అశ్వాపురం పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఈ వేడుకలు 9 రోజులపాటు సాగనున్నాయి. గౌతమీనగర్ కాలనీలో సందడి -
ఏటీఎం కార్డు చోరీ..
టేకులపల్లి: సహాయం చేస్తున్నట్లు నమ్మించిన ఓ వ్యక్తి.. ఏటీఎం కార్డు చోరీచేసి, అందులోని రూ.31 వేలు డ్రాచేసిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎలక్ట్రానిక్స్, నెట్ సెంటర్ నిర్వాహకుడు యదళ్లపల్లి బాలకృష్ణ శుక్రవారం తన దుకాణంలో పనిచేసే పూనెం తేజకు తన ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని రావాలని పంపించాడు. సూర్యతేజ ఏటీఎంలో డబ్బులు తీస్తున్న క్రమంలో అదే సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తేజను తికమకపెట్టి అలా కాదు ఇలా అంటూ చెప్పి.. కార్డు మార్చేసి వేరే కార్డుని తేజకు ఇచ్చారు. తిరిగి సూర్యతేజ ఏటీఎం కార్డును యజమానికి ఇవ్వగా ఆ కార్డు తనది కాదని గుర్తించి వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. కొద్ది సేపటికే ఇల్లెందు సుదిమళ్ల ఏటీఎం వద్ద రూ.31 వేలు డ్రా చేసినట్లు గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతుల కోసం పొలం బాట ● జిల్లా విద్యుత్ సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్.కృష్ణ సూపర్బజార్(కొత్తగూడెం): రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా విద్యుత్ సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్, డివిజనల్ ఇంజనీర్(టెక్నికల్) ఎన్.కృష్ణ శుక్రవారం తెలిపారు. వంగిన పోల్లు, లూజ్ లైన్లను సరిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పొలం బాటలో వంగిన పోల్లు 1,215, లూజ్లైన్లు 1,255, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు 149 మార్చినట్లు వెల్లడించారు. విద్యుత్ మోటార్లు వినియోగించేపుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ పంపుసెట్లకు విధిగా ఎర్తింగ్ చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే వెంటనే రైతులు 1912 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, 48 గంటలు దాటి ఆలస్యమైందని గుర్తిస్తే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకుంటారని స్పష్టం చేశారు. దామరచర్లలో డెంగీ కేసు నమోదు చండ్రుగొండ: మండలంలోని దామరచర్ల గ్రామంలో డెంగీ కేసు నమోదైంది. కంచు బీరయ్య కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా శుక్రవారం పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్గా తేలిందని డాక్టర్ కె.తనూజ వెల్లడించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్యదర్శితోపాటు సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సత్వర చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతోపాటు కాల్వలు శుభ్రం చేయించారు.