breaking news
Bhadradri
-
దరఖాస్తులు మస్తు !
● అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ ● 192 టీచర్ పోస్టులకు 4,648.. 1,011 ఆయా పోస్టులకు 1,725 ● సర్టిఫికెట్ల పరిశీలన, త్వరలోనే ఇంటర్వ్యూలు భద్రాచలంఅర్బన్/పాల్వంచరూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. కొన్నేళ్లుగా టీచర్, ఆయా పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 23 మండలాలకు సంబంధించి ఇటీవల ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అందిన దరఖాస్తులను పరిశీలిస్తుండగా, త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది పూర్తయ్యాక మైదాన ప్రాంతంలోని కేంద్రాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు అంగన్వాడీల్లో టీచర్ పోస్టులకు ఈ నెల 2న, ఆయా పోస్టులకు 20న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2,061 కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాలు 1,203 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, 1,203 పోస్టులకు గాను 6,373 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు టీచర్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగా ఆయా పోస్టులకు వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత దరఖాస్తులను పరిశీలించి జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరోమారు సర్టిఫికెట్లు పరిశీలించాక, జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కమిటీలో కలెక్టర్, ఐటీడీఏ పీఓ, అడిషనల్ కలెక్టర్, సబ్కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా సంక్షేమ అధికారి ఉంటారు. పోస్టులు దక్కించుకునేలా.. అంగన్వాడీ పోస్టులు దక్కించుకునేందుకు కొందరు తమ పలుకుబడి ఉపయోగించి పైరవీలకు తెర లేపినట్లు సమాచారం. అలాగే తమ వారికే పోస్టు కేటాయించాలని కొందరు రాజకీయ నాయకులు సైతం ఐసీడీఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో ఇంటర్మీడియట్లో 70 శాతం మార్కులు వచ్చినవారిని పరిగణనలోకి తీసుకోనున్నారు. అంతేకాక వితంతువులకు ఐదు, దివ్యాంగులకు ఐదు, అనాథలకు 10 మార్కులు ఇస్తూ, ఇంటర్వ్యూలకు 10 మార్కులు కేటాయిస్తారు. కుల ధ్రువీకరణతో సమస్య ఏజెన్సీ ప్రాంతంలో అంగన్వాడీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొందరు తమ భర్త కులాన్ని పేర్కొంటూ అదే సర్టిఫికెట్ సమర్పించారు. అయితే, అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రమే సమర్పించాలని, అధికారులు సూచిస్తున్నా స్పందన రావడం లేదని సమాచారం. అంతేకాక భర్త కులం తమకు ఎందుకు వర్తించదని వాదిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా పోస్టుల భర్తీ మాత్రం పారదర్శకంగా చేపట్టాలని, మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి అందిన దరఖాస్తుల పరిశీలన చివరి దశకు చేరింది. ఈ క్రమాన అనర్హులు, సర్టిఫికెట్లు సరిగ్గా లేనివారి దరఖాస్తులను తిరస్కరించాం. ఇక ఆయా పోస్టులకు మాత్రం వచ్చేనెల 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. – స్వర్ణలత లెనీనా, జిల్లా, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారి -
ఆరుతడి పంటలే మేలు
● రైతులకు విస్తృతంగా అవగాహన ● మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ అంకిత్జూలూరుపాడు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జూలూరుపాడు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో లోటు వర్షపాతం ఉన్నందున రైతులు వరికి బదులు మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయాలతోపాటు, ఇతర ఆరుతడి సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులను అధికారులు ప్రోత్సహించాలని చెప్పారు. అంతేకాక ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతీ పొలంలో పంట కుంట, ప్రతీ ఊరిలో ఊట కుంట, కమ్యూనిటీ కుంటలు నిర్మించేలా పర్యవేక్షించాలని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 99 ఫారం పాండ్లు నిర్మించడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 29 ప్రాంతాలను గుర్తించామని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. మండల ప్రత్యేక అధికారి శ్రీలత, ఎంపీడీఓ తాళ్లూరి రవి, తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఏఓ దీపక్ ఆనంద్, పీహెచ్సీ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఎంఈఓ బి.జుంకీలాల్ తదితరులు పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూసమస్యలను కేటగిరీల వారీగా వర్గీకరించి, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలను ముందుగా పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగుపల్లి, లచ్చగూడెం, పాల్వంచ, ఉప్పుసాక, కరకగూడెం ప్రాంతాల్లో పెండింగ్ ఉన్న భూ సమస్యలను జాయింట్ సర్వే ద్వారా త్వరగా పరిష్కరించాలని సూచించారు. అలాగే, తాగునీటి సమస్య దృష్ట్యా బోర్లు, మిషన్ భగీరథ, తాగునీటి పథకాల అనుమతులను అత్యవసర ప్రాతిపదికన మంజూరు చేయాలని తెలిపారు. ఇప్పటికే గృహాలు ఉండి అదే స్థలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపట్టేవారికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని, కొత్తగా మాత్రం ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. అనంతరం మారుమూల ప్రాంతాల్లో రహదారి, ఇతర వసతుల కల్పన, సింగరేణి ఓసీల విస్తరణ అనుమతులపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆర్ఓఎఫ్ఆర్కు దరఖాస్తులు, ఇతర అంశాలపై మాట్లాడగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, అధికారులు పాల్గొన్నారు.ములకలపల్లి: అన్నదాతల సందేహాలు నివృత్తి చేయడం, సాగులో మెళకువలు వివరించేందుకు ‘రైతు నేస్తం’ చక్కటి అవకాశమని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ములకలపల్లి మండలం పూసుగూడెం రైతువేదికలో మంగళవారం ‘రైతు నేస్తం’ వందో ఎపిసోడ్ను వీక్షించిన ఆయన మాట్లాడారు. రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవాలని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. అనంతరం రైతునేస్తం కార్యక్రమాలకు క్రమం తప్పక హాజరైన రైతులు, ఏఈఓలను కలెక్టర్ సన్మానించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, ఉద్యానవన అధికారి కిషోర్, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ భరత్, ఎంఏఓ అరుణ్బాబు, సర్పంచ్లు ధర్మ, రవి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
రామయ్య బంగారు, వెండి ఆభరణాల తరలింపు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి, వాహనాలను మంగళవారం అధికారులు స్ట్రాంగ్ రూంకు తరలించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు ఆదేశాలతో ఆలయ పునరుద్ధరణ పనుల్లో వేగం పెరిగింది. ఇందులో భాగంగా భక్తులు సమర్పించిన, శ్రీరామదాసు చేయించిన నగలతో పాటుగా వెండి వాహనాలు, సామగ్రిని మ్యూజియం నుంచి పటిష్ట భద్రత నడుమ ఈఓ దామోదర్రావు ఆధ్వర్యాన రంగనాయకుల గుట్టపై స్ట్రాంగ్ రూంకు తరలించారు. మరోపక్క చిత్రకూట మండపం ఎదుట ఉన్న గోశాల తొలగింపు పూర్తయింది. చిత్రకూట మండపంలోని స్తంభాల తరలింపు పనులు పూర్తికాగానే పడమర మెట్లను తొలగిస్తారు. ఇంకోపక్క మిథిలా స్టేడియంలో నిత్యకల్యాణ వేదిక నిర్మాణం కొనసాగుతోంది. నేడు దమ్మక్క శోభాయాత్ర, కల్యాణోత్సవం భద్రగిరిలో బుధవారం దమ్మక్క సేవా యాత్ర నిర్వహించనున్నారు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గత 12ఏళ్లుగా జరుగుతున్న ఈ యాత్ర వేదికను పనుల నేపథ్యాన మార్చారు. ఉదయం 6–30గంటలకు దమ్మక్క చిత్రపటంతో శోభాయాత్ర, దమ్మక్క విగ్రహం వద్ద పూజలు, అనంతరం తానీషా కల్యాణ మండపం వెనకాల మారుతి సదనంలో ఉత్సవ మూర్తుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇప్పటికే వివిధ గ్రామాల గిరిజనులు చేరుకోగా, ఆలయంలో దర్శనం చేయించి పూజలు ముగిశాక అన్నప్రసాదం అందజేసి తిరిగి గ్రామాలకు బస్సుల ద్వారా పంపిస్తారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవం పూర్తిచేశారు. మంగళవారం సందర్భంగా అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకార్చన జరిపారు. దమ్మక్క యాత్రకు ప్రత్యేక బస్సులు భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన బుధవారం దమ్మక్క సేవాయాత్ర జరగనుంది. ఇందులో పాల్గొనేలా వివిధ ప్రాంతాల గిరిజన భక్తులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. ఈమేరకు తొమ్మిది ప్రత్యేక బస్సులను మంగళవారం భద్రాచలం బస్టాండ్లో డిపో మేనేజర్ జంగయ్య ప్రారంభించారు. ఈ బస్సులు గిరిజన గ్రామాలకు వెళ్లి భక్తులను ఉచితంగా భద్రాచలం తీసుకురానున్నాయి. యాత్రకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం, ఆర్టీసీ సమన్వయంతో ఏర్పాట్లుచేసినట్లు డీఎం తెలిపారు. గిరిజన భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సమ్మె నోటీసుపై వచ్చేనెల 6న ఆర్ఎల్సీతో చర్చలు రుద్రంపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహణ, ఇతర సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం హైదరాబాద్లోని కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డాక్టర్ సరస్వతి సమక్షాన యాజమాన్యంతో రెండో విడత చర్చలు జరిగాయి. ఇంకో విడత చర్చలు ఆగస్టు 6వ తేదీన జరగనుండగా, అప్పుడు కూడా ఫలితం రాకపోతే 16వ తేదీ నుంచి అన్ని సంఘాలను కలుపుకుని సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. ఇప్పటికే ఓసారి మెడికల్ బోర్డ్ నిర్వహించినట్లు యాజమాన్యం చెప్పగా.. పారదర్శకంగా జరగలేదన్న తమ వాదనకు స్పందించిన ఆర్ఎల్సీ మరోమారు నిర్వహణకు పరిశీలించాలని ఆదేశించిందని వెల్లడించారు. మిగతా అంశాలపై యాజమాన్యం, ఏఐటీయూసీ చర్చించి వచ్చేనెల 6న జరిగితే సమావేశంలో నివేదిక ఇవ్వాలని ఆర్ఎల్సీ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్(పర్సనల్) బి.రాజగోపాల్, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారని సీతారామయ్య తెలిపారు. నాణ్యమైన బోధనతో విద్యార్థులకు భవిష్యత్ ఇల్లెందు: నాణ్యమైన బోధన అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్కు పటిష్టమైన పునాది వేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంగళవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశాలు పెంచేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాక యూడైస్ వివరాలు సకాలంలో నమోదు చేసి బోధన, ప్రాక్టికల్స్పై దృష్టి సారించాలని తెలిపారు. అంతిమంగా అత్యుత్తమ ఫలితాల సాధనే అందరి లక్ష్యం కావాలని పేర్కొన్నారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భానుప్రసాద్, అధ్యాపకులు ప్రసాదరావు, జాన్ తదితరులు పాల్గొన్నారు. -
పేరాయిగూడెం వాసికి సీఐడీ విభాగంలో ఉద్యోగం
అశ్వారావుపేటరూరల్: పోలీస్ శాఖలో కీలకమైన సీఐడీ విభాగంలోఅశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి పేరాయిగూడేనికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కుమారుడు డాక్టర్ జుజ్జురపు క్రాంతికుమార్ ఉద్యోగం సాధించాడు. సీఐడీ విభాగంలో ఫోరెన్సిక్ సైంటిస్టుగా ఎంపికై న ఆయన మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు. డాక్టర్ క్రాంతికుమార్ పదో తరగతి వరకు ఇల్లెందులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, డిగ్రీ ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశాడు. కాకతీయ విశ్వ విద్యాలయంలో ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) నుంచి పీహెచ్డీ అందుకోగా, సీఐడీ విభాగంలో ఉద్యోగానికి ఎంపికై న క్రాంతిని స్థానికులు అభినందించారు. ఫోరెన్సిక్ సైంటిస్ట్గా ఎంపికై న క్రాంతి -
● అనారోగ్యంతో విద్యార్థిని మృతి ● పుట్టిన సమయంలోనే కవల సోదరి కన్నుమూత
పీఎంఈజీపీ రుణాల్లో భారీగా అక్రమాలు ఖమ్మంవైరారోడ్: జిల్లాలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) రుణాల్లో భారీగా అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఈ రుణాలతో పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంఈజీపీ పథకాన్ని జిల్లాలోని కొంద రు దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంక్ అధికారులు కలిసి పక్కదారి పట్టించారని ఆరోపించారు. పలు ప్రాంతాల్లో 90 శాతానికి పైగా యూనిట్లు లేకుండానే రూ.10 కోట్లకు పైగా రుణ సబ్సిడీ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై కలెక్టర్ విజిలెన్స్ విచారణచేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాలుగా అనర్హులను నియమించినందున విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమల్రావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. ఆ ఇల్లు బోసిపోయింది..ఖమ్మంరూరల్: ఓ విద్యార్థిని మర ణం ఆమె కుటుంబాన్నే కాదు... ఆ వీధి, పాఠశాల, స్థానికులను శోకసంద్రంలో ముంచెత్తింది. 14 ఏళ్ల క్రితం ఒక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ఇంకొకరికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ విధి చిన్నచూపు చూడడంతో ఇంకో కుమార్తె కూడా మృత్యువాత పడింది. ఇందుకు సంబంధించి వివరాలు.. ఏదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన రంగిశెట్టి ఉదయ్ – స్రవంతి దంపతులకు 14 ఏళ్ల క్రితం కవల కుమార్తెలు జన్మించారు. ఇందులో ఓ కుమార్తె పసిప్రాయంలోనే పేగు సంబంధిత సమస్యతో మృతి చెందింది. అదే సమస్యతో బాధపడుతున్న ఇంకో కుమార్తె వైదికకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తూ ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడారు. కానీ విధి మరోసారి అదే కుటుంబాన్ని పరీక్షించింది. హైదరాబాద్లో చికిత్స చేయిస్తుండగా వైదిక పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు స్థానికులందరినీ కంట తడి పెట్టించింది. చివరిచూపు కోసం... ఏదులాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైదిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె పాఠశాల స్నేహితులతోనే కాక స్థానికులతో కలివిడిగా ఉండేది. ఆమె మృతి చెందిన సమాచారం తెలియగానే స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాక వైదిక అంతిమయాత్ర పాఠశాల సమీపం నుంచి వెళ్తుండగా స్నేహితురాలికి వీడ్కోలు పలికారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మాజీ ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య -
గుండెపోటుతో ఫిజికల్ డైరెక్టర్ మృతి
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ చింతలపూడి యుగంధర్ (55) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. కాకర్ల హైస్కూల్లో విధులు ముగించుకొని బైక్పై స్వగ్రామమైన సుజాతనగర్ వెళ్తుండగా డేగలమడుగు సమీప బంక్ వద్ద గుండెపోటు రావడంతో కిందపడ్డారు. ఈ విషయాన్ని వెనకాల ఆటోలో వస్తున్న ఉపాధ్యాయురాలు కల్యాణి, బంధువు కృష్ణ, స్థానికులు గుర్తించి యుగంధర్కు సీపీఆర్ చేసి 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పీడీ సోదరుడు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో సుజాతనగర్ ఎస్ఐ ఎం.రమాదేవి కేసు నమోదు చేశారు. కాగా, యుగంధర్ మృతిపై జూలూరుపాడు ఎంఈఓ బానోత్ జుంకీలాల్, కాకర్ల హైస్కూల్ హెచ్ఎం పి.సంజీవరావు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు.. పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి వచ్చి మృత్యువాత పినపాక: బతుకుదెరువు కోసం వచ్చిన ఆ యువకుడిని విద్యుత్షాక్ బలితీసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న క్రమంలో ఊహించని ప్రమాదం దెబ్బతీసింది. మండలంలోని ఈ–బయ్యారం క్రాస్రోడ్డు వారపు సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రాజస్థాన్కు చెందిన ముగ్గురు యువకులు పొట్టకూటి కోసం స్వ గ్రామాన్ని వదిలి మణుగూరులో నివాసముంటూ బాదంపాలు, ఐస్క్రీమ్స్ అమ్ము కుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవా రం కూడా బయ్యారం క్రాస్రోడ్డులోని వారపు సంతకు టాటా ఏస్ వాహనంలో ఐస్క్రీమ్స్, బాదంపాలు తీసుకొచ్చా రు. జనరేటర్కు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా.. ఒక్కసారిగా షాక్ కొట్టి శ్యామ్లాల్ (23) అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు సీపీఆర్ చేసి, 108లో మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గోదావరిలో పడి వ్యక్తి .. అశ్వాపురం: మండలంలోని బట్టీలగుంపు గ్రామపంచాయతీ పరిధి బట్టమల్లయ్య గుంపు గ్రామానికి చెందిన కలేటి వెంకటేశ్వర్లు (54) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం పొలం పనులకు వెళ్లిన వెంకటేశ్వర్లు సాయంత్రం సయయాన బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో పడ్డాడు. ఒడ్డున చెప్పులు ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మంగళవారం గాలించడంతో ఆయన మృతదేహం లభ్యమైంది. ఘటనపై వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె రమణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూర్యారావు తెలిపారు. రుణం ఆశ చూపి.. ఫొటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి..మహిళ నుంచి రూ.6.90 లక్షలు స్వాహా చేసిన నేరగాళ్లు బూర్గంపాడు: తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణం ఇప్పిస్తామని నమ్మించి బూర్గంపాడులోని గౌతమీపురానికి చెందిన ఓ మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు స్వాహా చేశారు. ఆమె ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్కార్డు వివరాలు తీసుకున్న నేరగాళ్లు ఆ తర్వాత ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ చేశారు. అడిగినంత నగదు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించడంతో బాధితురాలు సైబర్ నేరగాళ్ల అకౌంట్కు పలు ధపాలుగా రూ 6.90 లక్షలు పంపించింది. అయినా ఇంకా డబ్బు పంపించాలని ఒత్తిడి చేస్తుండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదుతో ఎస్ఐ మేడ ప్రసాద్ మంగళవారం కేసు నమోదు చేయడమే కాక, సైబర్ నేరగాళ్ల అకౌంట్లో ఉన్న రూ.3.30లక్షలను హోల్డ్ చేయించారు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వొద్దని ఎస్ఐ సూచించారు. కోడిగుడ్ల రిక్షాను ఢీకొట్టిన లారీభద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో మంగళవారం ఉదయం ఓ ఇసుక లారీ ప్రమాదవశాత్తు కోడిగుడ్లు తరలిస్తున్న రిక్షాను ఢీకొట్టింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రిక్షాలో కోడిగుడ్లు తరలిస్తుండగా అంబేడ్కర్ సెంటర్లో ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో అతడికి స్వల్పగాయాలు కాగా, రిక్షా ధ్వంసమైంది. కోడిగుడ్లు మొత్తం పగిలిపోయాయి. లారీ ఇంకాస్త వేగంగా ఉండి ఉంటే రిక్షాను తొక్కుకుంటూ వెళ్లి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఇసుక లారీల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అడవిని మింగేస్తున్న మాఫియా
● సరిహద్దుల్లో అక్రమ కలప దందా.. ● భద్రాచలం కేంద్రంగా కోతలు, రవాణా ● చెక్పోస్టులకు చిక్కకుండా గోదావరి మార్గంలో తరలింపుభద్రాచలంటౌన్: ఒకప్పుడు అడవి అంటే భయం.. అన్నల(మావోలు) భయంతో అటవీ సంపద జోలికి వెళ్లాలంటేనే వణుకు పుట్టేది. కానీ ఇప్పుడు అన్నలు లేకపోగా అధికారులు సైతం సహకరిస్తుండడంతో అక్రమార్కులు పండుగ చేసుకుంటున్నారు. ఫలితంగా ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో విలువైన టేకు సంపద కనుమరుగవుతోంది. అడవుల్లో భారీ టేకు వృక్షాలను విచక్షణారహితంగా నరికి, అత్యాధునిక మిషన్లతో అక్కడికక్కడే దిమ్మెలుగా కోసి భద్రాచలం డివిజన్ కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. తనిఖీలతో అక్రమార్కులను అడ్డుకోవాల్సిన భద్రాచలం సరిహద్దు చెక్ పోస్టు సిబ్బంది మామూళ్ల మత్తులో తూలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి మీదుగా.. భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం రేంజ్లకు ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని అడవుల్లో నరికిన భారీ టేకు వక్షాలను ఆధునిక రంపపు మిషన్ల సాయంతో అక్కడికక్కడే దిమ్మెలుగా మార్చి.. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా గోదావరి తీరానికి తరలిస్తున్నట్లు తెలిసింది. అనంతరం పడవలు, మోటార్ బోట్లలో నదిని దాటించి లారీలు, ఇతర వాహనాల ద్వారా కావాల్సిన చోట్లకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. సరిహద్దు చెక్పోస్టుల్లో తనిఖీలను తప్పించుకోవడానికి గోదావరి నదిని మార్గంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ మార్గంలో పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో రవాణా నిరాటంకంగా సాగుతోందని సమాచారం. తక్కువకు కొనుగోలు.. లాభాలతో విక్రయం ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద మొత్తంలో టేకు కలప లభిస్తుండడంతో అక్రమ వ్యాపారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం మార్కెట్లో అధిక ధరకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక పటిష్టమైన నెట్వర్క్ ఉందని తెలుస్తోంది. ఇటీవల అటవీ శాఖ అధికారులు పలు చోట్ల టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అయితే పట్టుబడుతున్నది స్వల్పమేనని... రోజూ పెద్ద మొత్తంలో కలప సరిహద్దులు దాటుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలప అక్రమ రవాణాను అరికట్టేలా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ బలోపేతం చేశాం. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సిబ్బంది ప్రమేయంపై ఆధారాలతో ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఎవరికై కా వృక్షాల నరికివేత, అక్రమ కలప రవాణా వివరాలు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. – జస్వత్ ప్రసాద్, ఎఫ్ఆర్ఓ, భద్రాచలందశాబ్దాలుగా పెరిగిన విలువైన టేకు వృక్షాలను నరికేస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లోని టేకు ప్లాంటేషన్లు వేగంగా కనుమరుగవుతున్నాయి. అటవీ సంపద క్షీణిస్తుండడంతో జీవవైవిధ్యం, వర్షపాతం, భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల అండదండలతోనే దందా కొనసాగుతోందన్న ప్రచారం ఉంది. అక్రమ రవాణా మార్గాలు, నిల్వ కేంద్రాలపై సమాచారం ఉన్నా కఠిన చర్యలు తీసుకోకుండా అప్పుడప్పుడు లెక్కల కోసమే కేసులు పెడుతున్నారనే సమాచారం. ఛత్తీస్గఢ్–తెలంగాణ అటవీ శాఖలు, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తే తప్ప అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం కానరావడం లేదు. అంతేకాక గోదావరి తీరాన రాత్రివేళ గస్తీ పెంచడం, పడవల తనిఖీలతో ఫలితం ఉంటుందని చెబుతున్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే సాగు చేసుకోవాలి
పాల్వంచరూరల్: ఎల్నినో కారణంగా వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరికి బదులు ప్రత్నామ్నాయ పంటలు సాగు చేయా లని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూ రావు సూచించారు. పాల్వంచ మండలం జగన్నాథపురం రైతువేదికలో మంగళవారం జరిగిన విత్తనమేళాలో ఆయన రైతులకు ఆరుతడి పంటల విత్తనాలను అందజేసి మాట్లాడారు. కందులు, మినుములు, పెసర, జొన్న, సజ్జ, ఆముదం విత్తనాలు అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఏఓ పి.శంకర్, హెచ్ఈఓ శంకర్ రావు, ఏఈఓలు విశాల, పవన్, నరేశ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎస్ఏఎస్ఎస్ఏ కార్యవర్గం ఎన్నికఅశ్వాపురం: మండలంలోని మణుగూరు భారజల కర్మాగారం సైంటిఫిక్ అసిస్టెంట్ల సూపర్వైజర్ స్టాఫ్ అసోసియేషన్ (ఎస్ఏఎస్ఎస్ఏ) కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 25 తో నామినేషన్ల స్వీకరణ, 27న ఉపసంహరణ గడువు ముగిసింది. ఆఫీస్ బేరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవులకు ఒక్కో నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోహన్బాబు, రన్ను హుస్సేన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎ.శ్రీనివాసులు, ఎం.నాగేంద్రకుమార్, సంయుక్త కార్యదర్శిగా డి.నవీన్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంకట ప్రసాద్, వెల్ఫేర్ సెక్రటరీగా ఎం.పాండు, ఆఫీస్ సెక్రటరీగా బీ.ఎం.వీ.నాగవేంద్రరావు, కోశాధికారిగా జయశంకర్ ఎన్నికయ్యారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్.డీ.జైసన్, సీహెచ్వీ.రమణ, జి.దిలీప్కుమార్, సముద్రాల శ్రీనివాస్ ఎన్నికయ్యా రని ఎన్నికల అధికారి అనిల్కుమార్ వెల్లడించారు. ఏకగ్రీవానికి సహకరించిన అన్ని యూని యన్ల నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన కార్యవర్గ బాధ్యులు.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధిక ధరలకు గ్యాస్ సిలిండర్ల విక్రయం 87 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు కామేపల్లి: నిబంధనలు ఉల్లంఘించి గ్యాస్ సిలిండర్లను అధికధరలకు విక్రయిస్తున్నట్లు సివి ల్ సప్లయీస్ అధికారులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లోగుర్తించారు. మండలంలోని పాత లింగాలలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మల్లి కార్జున్రావు నేతృత్వాన తనిఖీ చేయగా ఒక్కో సిలిండర్పై రూ.100 అదనంగా వసూ లు చేస్తున్నట్లు తేలింది. ఈ మేరకు భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించి 52, తేజస్విని గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి 35 సిలిండర్లను సీజ్ చేసి కామేపల్లి సాయి తిరుమల గ్యాస్ ఏజెన్సీ గోదాంలో నిల్వ చేసినట్లు వెల్లడించారు. అంతేకాక ఏజెన్సీలపై చర్యల నిమిత్తం భద్రాద్రి అదనపు కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు డీఎస్ఓ తెలిపారు. ప్రధానితో ముఖాముఖిలో ఎస్బీఐటీ విద్యార్థులుఖమ్మంసహకారనగర్: వికసిత్ భారత్–2047లో భాగంగా ప్రధానమంత్రి మోదీ మై భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ఖమ్మంలోని ఎస్బీఐటీ విద్యార్థులు 10 మందికి ప్రధా ని మోదీతో మాట్లాడే అవకాశం దక్కిందని కళా శాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ప్రధాని మోదీతో సంభాషించే అరుదైన అవకాశం తమ విద్యార్థులకు దక్కగా, దేశ నిర్మాణంలో యువ త పాత్ర, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలు, దేశాభివృద్ధి దిశగా ఆలోచనలను పంచుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులను కలెక్టర్ దివాకర టీ.ఎస్., కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ జి. ధాత్రి, వైస్ చైర్మన్ కె.శ్రీచైతన్య, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, ప్రిన్సిపాల్ రాజ్కుమార్ అభినందించారు. -
పులిరాజా..నీ జాడేది?!
జిల్లా అడవిలో పెద్దపులి జాడ కనిపించడం లేదు. అప్పుడప్పుడూ అతిథిలా వచ్చివెళ్తున్న పులి స్థిరనివాసం మాత్రం ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లాలో కిన్నెరసాని అభయారణ్యంతో పాటు దట్టమైన అడవులు ఉండగా, వేలాదిగా వన్యప్రాణులు నివసిస్తున్నాయి. అయినా పులి మాత్రం ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. గతేడాది కాలంగా ఏపీ నుంచి అశ్వారావుపేట రేంజ్లోకి, ఛత్తీస్గఢ్ నుంచి ఏటూరునాగారం మీదుగా మణుగూరు అటవీ ప్రాంతంలోకి పెద్దపులి వచ్చివెళ్లిన దాఖలాలు ఉన్నాయి. పెద్దపులి స్థిరని వాసానికి అనువైన పరిస్థితులు ఉన్నా ఇక్కడే ఎందుకు ఉండడం లేదనేది తేలడంలేదు. – పాల్వంచ రూరల్నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం కిన్నెరసాని అభయారణ్యంలోని మర్కోడు, రంగాపురం, అనంతోగు, మల్లేపల్లితోగు ప్రాంతాల్లోని దట్టమైన అడవిలో పెద్దపులుల సంచారం కొన్నేళ్ల క్రితం ఉండేది. ఎప్పుడైతే జిల్లా అటవీ ప్రాంతంలోకి ఛత్తీస్గఢ్ నుంచి గొత్తికోయలు వలస వచ్చారో ఆనాటి పరిస్థితిలో మార్పు వచ్చింది. అడవిలో 2 లక్షల ఎకరాలకు పైగా పోడు సాగు చేయడం, దట్టమైన అడవిలో చెట్లను నరికివేయడం, ఇంకొంత ఆక్రమణలకు గురవడంతో దట్టమైన అడవి కాస్తా పలుచబడింది. ఫలితంగా పులులు ఇక్కడ నివాసం ఉండలేక వలసబాట పట్టాయి. 2018లో జరిగిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో పులి సంచారం నమోదు కాలేదు. మళ్లీ 2020 డిసెంబర్, 2021 జనవరిలో పెద్దపులి సంచారం కనిపించినా ఆవాసం ఏర్పాటు చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయింది. ఇక 2025 ఫిబ్రవరిలో జిల్లా అటవీ ప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఆరు నెలలుగా ఇక్కడే సంచరించిందని అటవీ శాఖ అధికారులు గుర్తించి జిల్లా పేరు కలిసొచ్చేలా ‘భద్ర’అని నామకరణం చేశారు. అయితే, ప్రస్తుతం దాని జాడ కూడా లేదు. -
కేఎంసీలో ‘డీజిల్’ దందా..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ)లో పారిశుద్ధ్య వాహనాలకు సంబంధించి డీజిల్ వినియోగం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇంధన చోరీని అరికట్టడం, పారదర్శకత కోసం అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. డీజిల్ కూపన్ల జారీలో సిబ్బంది తీరుకు తోడు అధికారుల అలసత్వంతో అక్రమాలు నిత్యకృత్యమయ్యాయి. ఈక్రమాన డీజిల్ కుంభకోణం వెనుక కేఎంసీలోని ఓ ఉన్నతాధికారి హస్తం ఉందనే ప్రచారం చర్చనీయాంశం కాగా.. కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. ఫోన్ కాల్తో పక్కదారి.. కొంతకాలంగా డీజిల్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూపన్లు ఇవ్వకుండానే పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఫోన్ చేసి వాహనం నంబర్ చెప్పి ఇంధనం కొట్టాలని సూచించేవాడు. రెండు రోజుల తర్వాత వాహనాల నంబర్లతో కూపన్లు రాసి పంపించేవారని తెలుస్తోంది. ఫలితంగా ఒక వాహనానికి డీజిల్ కొట్టించి, మరో వాహనం పేరిట కూపన్లు సృష్టించి కేఎంసీ సొమ్మును పక్కదారి పట్టించినట్లు సమాచారం. అయితే, గతంలో కేఎంసీ పారిశుద్ధ్య వాహనాలకు రామన్నపేట సబ్జైలు వద్ద ఉన్న జైలు బంక్లో ఇంధనం కొట్టించగా.. అక్కడ నిబంధనలు కచ్చితంగా అమలయ్యాయి. ఆతర్వాత బైపాస్ రోడ్డు రాపర్తినగర్లోని ఒక ప్రైవేట్ బంక్కు మార్చాక అక్రమాలు జోరందుకున్నాయి. డబ్బాల్లో డీజిల్ వాహనాల ట్యాంకుల్లో నింపాల్సిన డీజిల్ను డబ్బాల్లో పోస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 22న స్వీపింగ్ మిషన్కు డీజిల్ కొట్టించేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ ట్యాంక్లో కొంత ఇంధనం పోయించి, మరికొంత డీజిల్ క్యాన్లలో పట్టించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో శానిటరీ ఇన్స్పెక్టర్ పి.శంకర్ ఫిర్యాదు చేయగా ఖమ్మం టూటౌన్ పోలీసులు మంగళవారం ఔట్ సోర్సింగ్ డ్రైవర్ కె.ప్రకాశ్పై కేసు నమోదు చేశారు. దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేయించిన కమిషనర్.. కూపన్లు పంపకుండా ఫోన్ కాల్లో డీజిల్ కొట్టించిన ఉద్యోగి హేమంత్ సాయిని సస్పెండ్ చేశారు. ఇదే సమయాన లోపాలకు బాధ్యుడిగా అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన సస్పెన్షన్కు సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ఇక డీజిల్ విభాగంలో కూపన్లు రాసే బాధ్యతను సీనియర్ అసిస్టెంట్ సునీల్కు అప్పగించినట్లు సమాచారం. కాగా, అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నా పట్టించుకోకుండా తమను బలిపశువులను చేస్తున్నారని డ్రైవర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. -
సత్వర విచారణతోనే కేసుల్లో పురోగతి
సూపర్బజార్(కొత్తగూడెం): సైబర్ నేరాలు, సెల్ఫోన్ల చోరీ కేసుల్లో సత్వర విచారణతోనే ఫలితం ఉంటుందని ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను మంగళవారం ఆయన పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, పెండింగ్ కేసులు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదుపై ఆరా తీశాక ఎస్పీ మాట్లాడారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్నవారు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేశాక బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని తెలిపారు. అంతేకాక సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఫిర్యాదులపై తక్షణ స్పందన ద్వారా బాధితుల డబ్బు రికవరీ చేయొచ్చని చెప్పారు. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే, డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు విస్తృ త అవగాహన కల్పించాలని తెలిపారు. ఇదేసమయాన అన్ని విభాగాల ఉద్యోగులు డేటా భద్రత, అధికారిక సమాచారం గోప్యత, సైబర్ భద్రతా నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేయాని ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఐటీ కోర్ ఎస్సై గణేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంబులెన్స్లోనే గిరిజన మహిళ ప్రసవం
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూ ర్గంపాడు మండలం చింతకుంట గ్రామస్తుల రహదారి చింతలు తీరడం లేదు. గ్రామానికి 108 వాహనం వచ్చేందుకు కూడా వీల్లేని రహ దారితో గ్రామస్తులు నానా అవస్థలు పడుతు న్నారు. ఈ క్రమంలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అష్టకష్టాలపై అంబులెన్స్ వచ్చి నా ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మధ్యలోనే ప్రస వించింది. చింతకుంట గ్రామానికి చెందిన నిండు గర్భిణి సోడె మార్తకు సోమవారం ఉద యం పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబీకులు 108కు సమాచారమి చ్చారు.ఆ గ్రామానికి వెళ్లేందుకు సరైన రహ దారి లేకపోవడంతో 108 పైలట్ విజయ భాస్కర్ గోతులు, రాళ్లతో కూడిన మార్గంలోనే అష్టకష్టాలు పడుతూ గ్రామానికి వెళ్లాడు. అప్ప టికే తీవ్రమైన పురిటినొప్పులతో బాధపడు తున్న మార్తను వాహనంలో ఎక్కించి భద్రా చలం తీసుకెళ్తుండగా అడవిమార్గంలోనే పురి టినొప్పులు పెరిగాయి. దీంతో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాధ పరిస్థితిని గమనించి మార్తకు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపై తల్లీబిడ్డలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దమ్మక్క సేవా యాత్రకు రారండి
● గిరిజనులు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు దేవస్థానం నుంచి ఆహ్వానం ● రేపు భద్రాచలంలో శోభాయాత్ర, మారుతి సదనంలో పుష్పాంజలిభద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో సీతారాముల విగ్రహాలకు నీడ కల్పించి, పూజించిన అపర భక్తురాలు దమ్మక్క సేవా యాత్రకు దేవస్థానం అధికారులు ఆహ్వానం పలుకుతున్నారు. 2014 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా, గిరిజనులు, భక్తులను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆషాఢ పూర్ణిమ రోజు పోకల దమ్మక్కను స్మరిస్తూ యాత్ర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో వేడుకలు జరుపుతారు. ఈ నెల 29న దమ్మక్క యాత్రకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. దేవస్థాన పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సేవా యాత్రలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రచార రథంలో స్వా మివారి ఉత్సవ మూర్తులను ఉంచి శోభాయాత్ర జరపనున్నారు. ఏటా బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణోత్సవం, పుష్పాంజలి వేడుకలను తానీషా కల్యాణ మండపం ప్రాంగణంలోని మారుతి సదనానికి మార్చారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో తరలింపు దమ్మక్క సేవా యాత్రకు 9 ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో సుమారు 700 మంది గిరిజనులను భద్రాచలం తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇల్లెందు, అశ్వారావుపేట రూట్లలో రెండు చొప్పున, జూలూరుపాడు రూట్లో 3, వాజేడు, కూనవరం రూట్లో ఒక్కో బస్సును కేటాయించారు. ఆర్టీసీ బస్సులు వెళ్లలేని రూట్లలో ప్రైవేట్ వాహనా ల ద్వారా వచ్చినవారి రవాణా చార్జీలనూ దేవస్థానం భరించనుంది. మంగళవారం సాయంత్రానికి వీరిని తరలించనుండగా, ఇందుకోసం తొమ్మి ది మంది సిబ్బందికి విధులు కేటాయించారు. రెండు రోజులపాటు ఉచిత బస, భోజన వసతి కల్పించనున్నారు. కాగా, ఈఓగా రమాదేవి ఉన్న కాలంలో గిరిజన గ్రామంలో రామయ్య ప్రచార రథంతో శోభాయాత్ర, నిత్యకల్యాణం జరిపి, స్వామివారిని గిరిజనుల చెంతకే చేర్చేవారు. ఈఏడాది దేవస్థానం అధికారులు దీనికి ‘మంగళం’పాడారు. కాగా ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీర య్య, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులకు సోమవా రం వేడుకల ఆహ్వాన పత్రాలను అందించినట్లు ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ తెలిపారు. -
నీట్ రద్దు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేస్తున్న నీట్ను తక్షణమే రద్దు చేయాల ని, వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి అప్పగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ల లీకేజీతో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఓల్డ్ డిపో వరకు ప్లకార్డులతో ర్యాలీ జరిపారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువజనులు అసమాన పోరాట పటిమ ప్రదర్శించారని అన్నారు. మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, ఎస్కే ఫహీమ్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, ఎండి యూసుఫ్ పాల్గొన్నారు. విద్యార్థులకు నివాళి కొత్తగూడెంఅర్బన్: మృతి చెందిన విద్యార్థులకు పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల శివకుమార్ , అల్లి శంకర్ , గుండా రమేష్, పి సురేందర్, భూపతి అశోక్, మచ్చ పృథ్వీరాజ్, రాజేశ్వరరావు , సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
టేకులపల్లి : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా వ్యవసాయాధికారి బాబూ రావు సూచించారు. సోమవారం మండలంలోని కోయగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించారు. రైతులకు కంది, పెసర, వివిధ రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేసి మాట్లాడారు. వర్షాధార ప్రాంతాలతోపాటు బోరుబావుల కింద సాగు చేసే రైతులు కూడా తక్కువ నీటితో మెరుగైన దిగుబడినిచ్చే కంది, పెసర, మినుము, శనగ, నువ్వులు వంటి ఆరుతడి పంటలను వేయాలన్నారు. అధిక నీటి వినియోగం వల్ల భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్కు కావలసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అధికారులు కిషోర్, భరత్, లాల్ చాంద్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
మెరిసిన మిర్చి ధర
● తేజా రకం క్వింటాకు రూ.22,700 ● క్వింటాకు రూ.700 అ‘ధనం’ఖమ్మంవ్యవసాయ: మిర్చి ధరకు రెక్కలొచ్చాయి. విదేశీ రకంగా పేరు గడించిన ‘తేజా’ రకం మిర్చికి డిమాండ్ పెరిగింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం తీసుకొచ్చిన మిర్చి క్వింటాకు జెండాపాటలో గరిష్టంగా రూ.22,700లు పలికింది. కొద్దిరోజులుగా రూ. 22 వేలు ఉన్న ధర రూ. 700 పెరగగా.. మోడల్ మిర్చి ధర రూ.21,800గా నమోదైంది. నాన్ ఏసీ మిర్చి ధర రూ.16వేల నుంచి 17 వేల వరకు పలుకుతుండగా, రూ.17,400కు చేరింది. ఇక రూ.9 వేలుగా ఉన్న తాలు మిర్చి ధర గరిష్టంగా రూ.10 వేలు, మోడల్ ధర రూ. 9.500లుగా పలికింది. ఖమ్మం మార్కెట్కు నిత్యం ఏసీ, నాన్ఏసీ మిర్చి కలిపి 10 వేల నుంచి 15 వేల బస్తాల వరకు విక్రయానికి వస్తోంది. జిల్లాలోని 48 కోల్డ్స్టోరేజీల్లో దాదాపు 30 లక్షల వరకు మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ఈ సరుకంతా వ్యాపారులదేనని తెలుస్తోంది. సీజన్లో రైతుల నుంచి రూ.17 వేల నుంచి రూ.18 వేల చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు నిల్వ చేయగా, ఇప్పుడు ధర పెరుగుతుండడంతో లబ్ధి పొందనున్నారు. ఎగుమతుల ప్రభావం ఖమ్మం మార్కెట్లో డిమాండ ఉన్న ‘తేజా’ రకం మిర్చిని చైనాకు ఎగుమతి చేస్తారు. కానీ గత రెండు సీజన్లుగా చైనా నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక డిమాండ్ లభించడం లేదు. చైనాలో ఈ రకం పంట సాగు పెరగడం, నిల్వలు ఉండడం తదితర కారణాలతో ఎగుమతులు పడిపోయాయి. ఇదే సమయాన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కొన్నాళ్లుగా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో మిర్చిధర పుంజుకుంటున్న వేళ విక్రయాలు పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు కూడా.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొలకొనగా, మిర్చి సాగు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024–25లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండగా గరిష్టంగా రూ. 15 వేలకు మించి ధర పలకలేదు. దీంతో 2025–26లో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. జిల్లాలో కేవలం 33వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. సీజన్లో మిర్చి ధర రూ.18 వేల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.22,700గా పలుకుతోంది. అయినా వర్షాభావ పరిస్థితుల్లో మిర్చి సాగు పడిపోతుందనే అంచనాతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకొస్తుండగా డిమాండ్ పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. -
చెరువు నిండక!
చినుకు రాలక..పాల్వంచరూరల్: వానాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో వర్షాలు మొహం చాటేశాయి. చెరువులు అడుగంటి వెలవెలబోతున్నాయి. జలాశయాలు వట్టిపోతున్నాయి. ఎల్నినో ప్రభా వంతో పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా వరి సాగుకు అనుకూలంగా లేవు. మెట్ట పంటలు కూడా వడలిపోతున్నాయి. మరోవైపు వరినా రు ముదిరిపోయే పరిస్థితి నెలకొనగా, రైతులు కిన్నెరసాని, మొర్రేడువాగు, బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. వచ్చే నెలలోనైనా వర్షాలు కురుస్తాయేమోనని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు కంటే ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ● గతేడాది ఇదే నెలలో చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో కళకళలాడాయి. కొన్ని అలుగు కూడా పోశాయి. కానీ ఈ ఏడాది మాత్రం చెరువుల్లో నీరు చేరలేదు. తాలిపేరు మినహా ఏ ప్రాజెక్ట్ నుంచీ దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో రైతులతోపాటు మత్స్యకారులు కూడా కలవరం చెందుతున్నారు. ● పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 397.06 అడుగులకు చేరింది. ఆయకట్టు పదివేల ఎకరాలు ఉంది.● అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం అడుగంటింది. ఆయకట్టు 16వేల ఎకరాలు. ఇందులో 2,360 ఎకరాలు తెలంగాణలో ఉండగా, మిగతాది ఆంధ్రాలో ఉంది. 2024లో ప్రాజెక్ట్కు గండి పడటంతో రెండేళ్లుగా నీరు నిల్వ ఉండటంలేదు. ● చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 73.65 మీటర్ల గరిష్ట స్థాయికి చేరడంతో, 15 గేట్లను ఎత్తివేసి నీటిని 22న దిగువకు విడుదల చేశారు. దీనికింద ఆయకట్టు 24,700 ఎకరాలు ఉంది. ● ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 120 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం అడుగంటింది. ఆయకట్టు 3,250 ఎకరాలుగా ఉంది. సమయం సాధారణ నమోదు లోటు/ వర్షపాతం అధిక శాతం ఈ సీజన్లో.. 401 278.3 –31 గతేడాది జూన్ 169 134 –26 ఈ ఏడాది జూన్ 161 151 –6 గతేడాది జూలై 313 379 +17 ఈ నెలలో 23నాటికి 232 135 –71జిల్లాలో చెరువులు కుంటలు 2,384 ఉన్నాయి. వీటిల్లో 1,796, చెరువులు 25 శాతం మేర నిండాయి. 25 నుంచి 50శాతం నీరు చేరిన చెరువులు 557, 50 నుంచి 75 శాతం నీరు చేరినవి 5 ఉన్నాయి. రెండు చెరువులు మాత్రమే అలుగు పోశాయి. దీంతో చెరువుల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఈ సమాయానికి జిల్లాలోని జలాశయాలు నిండాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు కురవడంలేదు. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరలేదు. ఆగస్టులో అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు కురిస్తే అన్ని నిండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి కంటే ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే మేలు. –శ్రీనివాసరెడ్డి, జలవనరులశాఖ సీఈ వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. ఈ నెల 15వ తేదీ నాటికి భూగర్భ జలాలు 10.32 మీటర్ల లోతు కు పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 6.79 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాది కంటే 3.5 మీటర్ల లోతుకు అధికంగా పడిపోయాయి. వచ్చే నెలలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే భూగర్భ జలాలు 11.20 అడుగుల లోతుకు పడిపోయే ప్రమాదం ఉంది. –ఎం.రమేష్, ఏడీ, భూగర్భ జలాల శాఖ -
ప్రజావాణికి తగ్గిన జనం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరి ష్కారం కోసం సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి ఈసారి జనం తగ్గారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందనతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. భూ వివాదాలు, రెవె న్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రతతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అందజేశారు. దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలిలా.. ● 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఇల్లు, స్థలానికి పట్టా మంజూరు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన లక్ష్మి అర్జీ అందించగా, కొత్తగూడెం తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. ● తన భర్త మృతి చెందాడని, ఆయన పేరు మీద ఉన్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టా తన పేరు మీద మార్చాలని ఇల్లెందు మండలం వేపలగడ్డ గ్రామ పంచాయతీ బొచ్చాయిగూడేనికి చెందిన బుగ్గ పద్మ ఫిర్యాదు చేశారు. ● ఇందిరమ్మ పథకంలో ఎల్–3లో ఉన్న పేరును ఎల్–1లోకి మార్చాలని అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి రత్నకుమారి వినతిపత్రం ఇవ్వగా, దరఖాస్తును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు. ● ఆసుపాక రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 191/6లో ఉన్న 4 ఎకరాల 20 గుంటల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామానికి చెందిన బేతి వెంకాయమ్మ అర్జీ పెట్టుకోగా, అశ్వారావుపేట తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. సకాలంలో వైద్య సేవలు అందించాలిచుంచుపల్లి: ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులకు సకా లంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని సూచించారు. ఓపీ, పది రోజులుగా నమోదైన జ్వర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా, డెంగీ, హెచ్ఐవీ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్ల లభ్యత, నిర్వహిస్తున్న రక్త పరీక్షల వివరాలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. మందుల నిల్వ గదిని సందర్శించారు. యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్ల లభ్యత వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుష్ క్లినిక్ను సందర్శించి సేవలు, ఔషధాల వివరాలను తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తతంగా ఉండాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో జ్వరాల నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తహసీల్దార్ శిరీష, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
భద్రాచలం: గిరిజనుల ప్రభుత్వ పథకాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. పరి శీలించి సంబంధిత అధికారులకు అప్పగించా రు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభు త్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికా రులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏకు వచ్చే గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్, ఇతర అధికారులు ఆనంద్ కుమార్, చందన, అరుణకుమారి, మధుకర్, సైదులు, సున్నం రాంబాబు, గన్యా నాయక్, నారా యణరావు, సమ్మయ్య, మణిధర్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలిభద్రాచలంటౌన్: గిరిజన మహిళలు స్వశక్తితో చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో భద్రాచలం లంబాడీ కాలనీకి చెందిన ’ఓం శక్తి జాయింట్ లయబిలిటీ గ్రూప్’ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్ను సోమవారం సందర్శించారు. మహిళలు ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూ, బర్ఫీ, నూనెతో పాటు రాగి, జొన్న జావలు, పచ్చళ్లు వంటి పోషకాహార ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. ప్రతీ వారం జరిగే గిరిజన దర్బార్లో ఈ ఉత్పత్తులను అధికారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ మధుకర్ పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ -
‘అటవీ’ ఆటంకం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి (ఎన్హెచ్ 30) నుంచి కేవలం 3 కి.మీల దూరంలో చింతకుంట గ్రామం ఉంది. అత్యవసర పరిస్థితి ఎదురైతే గ్రామస్తులు సమీపంలోని సారపాకకు చేరుకునేందుకు సరైన రోడ్డు లేదు. సోమవారం ఈ గ్రా మానికి చెందిన ఓ గర్భిణి 108లోనే ప్రసవం పొందడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 15 ఏళ్లుగా ఈ తరహా సమస్యలను జిల్లాలో అనేక గ్రామాలు ఎదుర్కొంటున్నాయి. అడవుల సంరక్షణ పేరుతో అటవీశాఖ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సమస్యల పరిష్కారానికి కనీసస్థాయిలో చొరవ కూడా లేదు. ఫలితంగా ఏటా వానాకాలంలో అనా రోగ్యంబారిన పడినవారు సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. యాక్షన్ ప్లాన్ ఏదీ? దండకారణ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల ప్రభావంతో భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఛత్తీస్ గఢ్ నుంచి వలసలు పెరిగాయి. అప్పటికే ఉన్న ఏజెన్సీ గ్రామాలకు, వలస ఆదివాసీ గూడేలు జత కలవడంతో అడవులపై ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి తగ్గించేందుకు వలస ఆదివాసీ గూడేలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో తెలంగాణ అటవీశాఖ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నా యి. ఇటీవల వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లకు కేంద్రం దండిగా నిధులు సమకూర్చింది. ఆ సమయంలో అడవులపై పడిన ఒత్తిడిని నివారించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కేవలం అనుమతుల పేరుతో అడ్డుకోవడంతోనే ఫారె స్టుశాఖ సంతృప్తి చెందుతోంది. సమస్య మూ లాల్లోకి వెళ్లి పరిష్కారాలు వెతకడంలేదు. మావోయిస్టు ప్రభావిత నిధులు వచ్చేనా..? గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల కోటాలో ఆళ్లపల్లి –మామకన్ను మధ్య కిన్నెరసాని వాగుపై రూ.9 కోట్లతో 2019లో వంతెన పనులు చేపట్టారు. వంతెన పిల్లర్ ఒకటి అభయారణ్యం పరిధిలో ఉందంటూ అటవీశాఖ పనులను ఆపేసింది. ఇదే మండలంలో వీరాపురం క్రాస్రోడ్ నుంచి రేగళ్ల మీదుగా ఆళ్లపల్లి మండలం మర్కోడు వరకు రోడ్డుకు రూ. 4 కోట్లు కేటాయించారు. పాల్వంచ మండలంలో మొండికట్ట–కారెగట్టు రోడ్డుకు రూ.6కోట్లు మూడేళ్ల క్రితం మంజూరయ్యాయి. ఫారెస్టు శాఖ అభ్యంతరాలతో ఆ పనులన్నీ మధ్యలో ఆగిపోగా, నిధులు వెనక్కి మళ్లాయి. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో ఆ కోటాలో మళ్లీ నిధులు వచ్చేది అనుమానమే. కొండరెడ్ల తరహాలో.. ఇటీవల దమ్మపేట మండలం పుసుకుపల్లి విషయంలో జిల్లా యంత్రాంగం ఒక్కతాటిపై నడిచి ఫారెస్టు అభ్యంతరాలను పరిష్కరించాయి. దీంతో అక్కడి కొండరెడ్లకు రోడ్లు, వంతెనలతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేరువయ్యాయి. ఏజెన్సీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరోసారి అదే స్ఫూర్తి చాటాలని జిల్లా వాసులు కోరుతున్నారు.అటవీ శాఖ అభ్యంతరాలతో జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్ల నిర్మాణాలు జరగలేదు. అశ్వారావుపేట మండలంలో గాండ్లగూడెం–చెన్నాపురం రోడ్డు, ములకలపల్లి మండలం తిమ్మంపేట–గుండాలపాడు రోడ్డు, చండ్రుగొండ మండలంలో బెండాలపాడు–బ్రాహ్మలకుంట, ఇల్లెందు మండలం మొండితోగు–ధర్మాపురం తదితర రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీశాఖ అభ్యంతరాలతో పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. నిలిచిపోయిన వంతెనలు, కల్వర్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. -
ముక్కోటిలోగా ఉత్తర ద్వారం పనులు పూర్తి చేయాలి
భద్రాచలం: భద్రాచలంలో డిసెంబర్లో జరిగే ముక్కోటిలోగా ఉత్తర ద్వారం పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ, అభివృద్ది పనులపై సోమవారం హైదరాబాద్లో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర ద్వారం వైపు పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తయ్యే విధంగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఉత్తర, పడమర మెట్లు తొలగించాం ఇప్పటికే ఉత్తరం ద్వారం, ఫుట్ బ్రిడ్జిలను తొలగించామని, మంగళవారం నుంచి ఉత్తరం, పడమర వైపు మెట్లను తొలగించే ప్రక్రియ చేపడతామని ఆలయ ఈఓ దామోదర్రావు సెక్రటరీకి వివరించారు. మూజియంలో ఉన్న, రోజువారి పూజా కార్యక్రమాల్లో వినియోగించే స్వామివారి బంగారు ఆభరణాలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, ఆ తరువాత ప్రాకారాల తొలగింపు పనులు చేపడతామని వివరించారు. యాగశాల తొలగింపు దేవస్థానంలో జరుగుతున్న ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలను పూర్తిగా తొలగించారు. భద్రుని గుడి వెనుక ఉన్న యాగశాల, స్వామి వారికి ప్రసాదాలను తయారు చేసే వంటశాలలు ఉన్నాయి. యాగశాలను పూర్తిగా తరలించగా, వంటశాలను సైతం తొలగించేందుకు అందులో ఉన్న సామగ్రిని తరలించారు. భద్రుని శిల మినహా ఆలయ నిర్మాణం పూర్తిగా కూల్చనున్నారు. భద్రుని శిలకు భక్తులు పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాంగణంలో ఉన్న గ్రిల్స్, క్యూలైన్లను ఇప్పటికే తొలగించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
30న అథ్లెటిక్స్ ఎంపికలు
సూపర్బజార్(కొత్తగూడెం): ఈ నెల 30న భద్రాచలంలోని శిశుమందిర్ స్కూల్ ఎదురుగా ఉన్న క్రికెట్ గ్రౌండ్లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె మహీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను ఆగస్టు 7, 8 తేదీలలో హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 30న భద్రాచలం తరలిరావాలని కోరారు. వీఓఏలను ఉద్యోగులుగా గుర్తించాలిసూపర్బజార్(కొత్తగూడెం): ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు జి.పద్మ డిమాండ్ చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న వీఓఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్లు, నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు కె.సత్య, భూక్య రమేష్, అరుణ, రేష్మ, కృష్ణవేణి, నాగరాజు, అనురాధ, మీనా, ధనలక్ష్మి, నాగేంద్రమ్మ, శ్యామ్, కొమరయ్య పాల్గొన్నారు. యోగా పోటీల్లో ప్రతిభజూలూరుపాడు: కొత్తగూడెం హనుమాన్ బస్తీలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడుకు చెందిన ఆరోగ్య జీవన యాత్ర సభ్యులు ప్రతిభ చాటా రు. తాళ్లూరి నవీన్, వేముల నాగేశ్వరరావు, వేల్పుల బోసు, పెండ్యాల నరేష్ బహుమతులను గెలుచుకున్నారు. తాళ్లూరి నవీన్ జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించగా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. కౌన్సెలింగ్ ద్వారా గురుకులాల్లో సీట్ల భర్తీభద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధి గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నామని రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) అరుణ కుమారి తెలిపారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలిక పాఠశాలలో సోమవారం 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం చేపట్టిన కౌన్సెలింగ్ను ఆమె పరిశీలించి మాట్లాడా రు. ఉమ్మడి జిల్లాలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న 336 సీట్లను ప్రవేశపరీక్షలోని మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఎక్కడ సీటు లభించినా విద్యార్థులు చేరాలని సూచించారు. వివిధ గురుకులాల పాఠశాలల ప్రిన్సిపాళ్లు మాధవీలత, చైతన్య, హరికృష్ణ, భద్రయ్య, ఉపాధ్యాయులు, ఐటీడీఏ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపికభద్రాచలంటౌన్: పట్టణంలోని సీటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు మోడెమ్ వంశీ హైదరాబాద్లో ఇటీవల యాదవ్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి స్ట్రాంగ్మెన్ టైటిల్ను కై వసం చేసుకున్నారు. ప్రథమ స్థానంలో నిలవడంతో రూ.1.25లక్షల నగదు బహుమతిని అందించా రు. వచ్చే నెల దక్షిణాఫ్రికాలో జరిగే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు వి. మల్లేష్, బోగాల శ్రీనివాస్రెడ్డి, జీవీ రామి రెడ్డి, శివరామకృష్ణ ప్రసాద్, భవానీ శంకర్, వెంకటకృష్ణాజీ తదితరులు విజేతను అభినందించారు. చేపల వేటకు వెళ్లి గల్లంతు?అశ్వాపురం: మండల పరిధిలోని బట్టీలగుంపు గ్రామపంచాయతీ పరిధి బట్ట మల్లయ్య గుంపు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి గోదావరిలో గల్లంతైనట్లు తెలిసింది. చేపల వేటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
20 రోజుల్లో 2.6 టీఎంసీలు..
పాల్వంచరూరల్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గత 20 రోజులుగా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు 2.6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు ఫేస్–1 పంప్హౌస్ నుంచి గోదావరి జలాలను 110 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవహిస్తున్నాయి. ఈ నెల 8న సోమవారం వరకు 20 రోజుల్లో బీజీ కొత్తూరు పంప్హౌస్ నుంచి 2.6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇందుకోసం మొదటి పంపుహౌస్ వద్ద 25 మెగావాట్లు, రెండో పంప్హౌస్ వద్ద 40 మెగావాట్లు, మూడో పంప్హౌస్ వద్ద 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లను వినియోగిస్తున్నారు. రోజుకు రూ.1.02 కోట్ల విద్యుత్ బిల్లు గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాకు విడుదల చేస్తున్న నీటి సరఫరాకు భారీగా విద్యుత్ బిల్లు వస్తున్నట్లు సమాచారం. రోజుకు రూ.1.02 కోట్ల చొప్పున అవుతుందని, 20 రోజులకు సుమారు రూ. 22 కోట్ల బిల్లు వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా 15 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే జలవనరుల శాఖపై మరింత విద్యుత్ భారం పడుతుందనే చర్చ సాగుతోంది. -
తోగ్గూడెంలో అక్రమ మైనింగ్పై విచారణ జరపాలి
సూపర్బజార్(కొత్తగూడెం): పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ గత జూన్ 29న ఇదే అంశంపై కలెక్టర్కు వినతిపత్రం అందజేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తోగ్గూడెం అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం జరుగుతోందన్నారు. సహజ వనరులు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. మైనింగ్ శాఖ అధికారులు తోగ్గూడెం ప్రాంతంలోని క్వారీలను మూడుసార్లు సీజ్ చేశారని, ప్రతీ సారి కొద్దిరోజులపాటు మాత్రమే సీజ్ చేసి తిరిగి తవ్వకాలు కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. తవ్వకాల పరిమాణాన్ని నమోదు చేయకుండా తక్కువగా చూపించి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని తగ్గిస్తున్నారని అన్నారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలకు వాస్తవాలను దాచిపెట్టి అన్ని క్వారీలకు అనుమతులు ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లావుడ్యా వెంకటేష్, బోడ రమేష్, బానోత్ నాగరాజు, బాదావత్ సురేష్ నాయక్, జర్పుల లాలు, బట్టు హుస్సేన్, బోడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట సేవాలాల్సేన ధర్నా -
రామయ్య కల్యాణం.. రమణీయం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి నిత్యకల్యా ణం రమణీయంగా జరిగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నేడు కేంద్ర బృందం పర్యటనభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియాఆస్పత్రి లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించనుంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యం, నిర్వహణలో క్వాలిటీ, వైద్యులు, సిబ్బంది పనితీరు, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. మొక్కలు నాటి పరిరక్షించాలికొత్తగూడెంఅర్బన్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణంలో వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు పెంచి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని, వేడిని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. అనంత రం మొక్కల రాజశేఖర్ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు సూరేపల్లి లలిత కుమారి, మణిమృదుల, సిబ్బంది పాల్గొన్నారు. మాదకద్రవ్యాలను నిరోధించాలి ఎస్పీ రోహిత్ రాజుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో మాదకద్రవ్యాలను నిరోధించాలని ఎస్పీ రోహిత్రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, చార్జిషీట్లను దాఖలు చేయాలని ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై సమగ్ర ఆర్థిక దర్యాప్తు చేపట్టాలని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, బాధితులను డీ అడిక్షన్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు బాధ్యతతో పనిచేయాలని, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు, మల్లయ్య స్వామి, అరుణ్ కుమార్, సీఐలు పాల్గొన్నారు. సమాజ సేవ చేయాలి సూపర్బజార్(కొత్తగూడెం): సమాజ సేవకు యువత ముందుకు రావాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ అవగాహన పోస్టర్ను సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు, సభ్యులు రాజేష్, జుబ్బు, రాజయ్య పాల్గొన్నారు. -
హరిహర క్షేత్రంలో అక్రమాలు!
ఇల్లెందు: పట్టణంలోని శ్రీ హరిహర క్షేత్రంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉండగా, బినామీగా పూజా, కొబ్బరి కాయల దుకాణం నడుపుకునే ఉద్యోగి పెత్తనం పెరిగిపోయిందని, పూజారులపై పెత్తనం చేస్తూ, వారి నివాస గదులను ఆక్రమించాడని ఆరోపణలు వస్తున్నాయి. విషయం ఇటీవల ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి వెళ్లగా.. ఆయన ఆలయ ఈఓ సూర్యప్రకాష్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆ గదిని మాత్రం ఖాళీ చేయలేదు. కాగా కొబ్బరి కాయలు, పూజా సామగ్రి వేలం పాట ఆగస్టు 1న ఆలయంలో నిర్వహించనున్నట్లు ఈఓ బి.సూర్యప్రకాశరావు ఒక ప్రకటనలో తెలిపారు. బినామీ పేరుతో టెండర్ పొందిన ఉద్యోగి విషయంలో చర్యలపై ప్రశ్నించగా.. స్కేల్ పోస్టు కాదని, అందుకే వదిలేశామని తెలిపారు. ఏఆర్ కానిస్టేబుళ్ల ఆర్థికసాయంసూపర్బజార్(కొత్తగూడెం): టేకులపల్లి మండలం కుంటల గ్రామనివాసి తోలం నాగేశ్వరావు జిల్లా డిస్ట్రిక్ట్ ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. స్పందించిన 2007 బ్యాచ్ తోటి సిబ్బంది మృతుడి కుటుంబానికి రూ.1,49,000 ఆర్థికసాయం సోమవారం అందించారు. ఎం.చంద్ర శేఖర్, శ్యామ్, లక్ష్మణ్ స్వామి, వెంకటేశ్వర్లు, రామారావు, రమేష్, గోపాల్, శేఖర్, సూర్యాపేట జిల్లా నుండి కె నాగరాజు, టి మధు మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రగిరిలో భారీ వినాయకుడు..
భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేవిధంగా కొన్నేళ్లుగా మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తున్నారు. భద్రాచలంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన పవర్ బోయ్స్ కమిటీ ఆధ్వర్యంలో మట్టితో 20 అడుగుల విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. ఖైరతాబాద్ తరహాలో వేదిక వద్దనే భారీ వినాయకుడిని రూపొందిస్తున్నారు. 9 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ కోల్కతా కళాకారులతో విగ్రహం తయారీకి ఒప్పందం చేసుకున్నారు. టన్ను బరువు గల విగ్రహాన్ని రూ.2.5 లక్షలతో సిద్ధం చేయిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా, పూర్తిగా పర్యావరణ హితంగా తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండే వెదురు బొంగులు, కర్రలు, బంక మట్టి, వరి పొట్టు వినియోగిస్తున్నారు. ఐదుగురు కళాకారులు ప్రస్తుతం మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత రంగులను అద్దనున్నారు. సెప్టెంబర్ 27న వినాయక చవితి రోజున భారీ విగ్రహాన్ని కొలువుదీర్చనున్నారు. ప్రజల సహకారంతో 60 మందితో సభ్యుల కమిటీ వేడుకలకు ఏర్పాట్లు చేస్తోందని అధ్యక్ష, కార్యదర్శులు, వల్లూపు ప్రేమ్చంద్, ఎప్పు సత్యకాంత్, కోశాధికారి రేగా సందీప్ తెలిపారు. 20 అడుగుల మట్టి విగ్రహం తయారీ.. -
రిజిస్ట్రేషన్ శాఖకు
కార్పొరేట్ లుక్!ఖమ్మంమయూరిసెంటర్: ఏళ్లుగా అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నవి కొన్ని, అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లో కొపాగుతున్నవి ఇంకొన్ని.. ఇలా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో సమస్యల నడుమ అటు అధికారులు, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతుండగా వీటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన వసతులు, కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 48 సబ్ రిజిస్ట్రార్, మూడు జిల్లా రిజిస్ట్రార్, రెండు డీఐజీ కార్యాలయాల నిర్మాణాలకు రూ.97 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ఖమ్మం ఆర్ఓ కార్యాలయంతో పాటు మరో ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. దశాబ్దాలుగా అద్దె భవనాల్లో.. ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం తీసుకొస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు చాలీచాలని ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో సర్దుకుంటూనే రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్ఓ కార్యాలయంతో పాటు 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో సగానికి పైగా అద్దె భవనాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం నూతన భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించడంతో ఆర్ఓ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త కళ రానుంది. ఎక్కడెక్కడ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ఆరు కీలక కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. ఇందులో ఖమ్మం ఆర్ఓ కార్యాలయానికి నూతన భవనం మంజూరైంది. ఇందులోనే రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మార్కెట్ వ్యాల్యూ అండ్ ఆడిట్ రిజిస్ట్రార్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటాయి. ఇక ఖమ్మంరూరల్, కూసుమంచి, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం ఆర్ఓ కార్యాలయానికి రూ.2 కోట్లు కేటాయించే అవకాశముండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థలాల వేటలో యంత్రాంగం నూతన భవనాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొన్ని ప్రాంతాల్లో స్థలాలను కేటాయించినా, వాటిని పక్కన పెట్టి కొత్త స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు నూతన భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. ప్రజల రాకపోకలకు వీలుగా, ప్రధాన రహదారికి సమీపాన ఉండే స్థలాల కోసం అన్వేషిస్తుండగా, వారంలో ఇది ఓ కొలిక్కి రానుందని సమాచారం. హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో.. భవనాల నిర్మాణ బాధ్యతలతో పాటు పర్యవేక్షణను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించారు. ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బందికి ఇబ్బంది కలగకుండా సువిశాలమైన వెయిటింగ్ హాళ్లు, కార్పొరేట్ మోడల్ కౌంటర్లు, తాగునీటి వసతే కాక విస్తారమైన పార్కింగ్ వసతులతో ఈ భవనాలను నిర్మించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరు కార్యాలయాల నిర్మాణం స్థలాలను పరిశీలన చేస్తున్నాం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆర్ఓ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఖమ్మం ఆర్ఓతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉంది. రెవెన్యూ శాఖ అధికారులు చేపట్టిన స్థలాల పరిశీలన వారంలోగా ఓ కొలిక్కిరానుంది. –ఎ.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం -
రుగ్మతలు లేని సమాజ స్థాపనకు కృషి
ఖమ్మంగాంధీచౌక్: రుగ్మతలు లేని సమాజ స్థాపన కోసం విద్యావంతులు కృషి చేయాలని కవి, రచయిత, విశ్రాంత ఐఏఎస్ అధికారి అంగలకుర్తి విద్యాసాగర్ సూచించారు. నిబద్ధతతో ఎవరి పని వారు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పాటుపడాలని తెలిపారు. ఈ అంశాలే ప్రాతిపదికన కోమాకుల సీతారాములు ‘హాస్టల్ కతలు‘పుస్తకం రాశారని తెలిపారు. కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ సీతారాం అధ్యక్షతన ఆదివారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో బహుజన సాహిత్య వేదిక ఆధ్వర్యాన సీతారాములు రచించిన పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. ‘హాస్టల్ కతలు‘పుస్తకంలో సీతారాములు జీవితంలోని అను భవాలు యదార్థ ఘటనలే కాక సమాజ స్థితిగతులను పొందుపర్చారని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూక్యా భంగ్యా మాట్లాడుతూ.. హాస్టళ్లలో చదివిన అందరి జీవితాల్లోని ఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తున్నాయని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రసేన్, టీజీవోస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, రాచమల్ల ఉపేందర్ మాట్లాడారు. అనంతరం సినీ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను సత్కరించగా.. ఆయన మాట్లాడారు. తన కు తెలుగు భాష నేర్పిన గురువు సీతారాములు ఎందరో గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆ తర్వాత సీతారాములు– సావిత్రి దంపతుల 70వసంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సహకార శాఖ జిల్లా రిటైర్డ్ అధికారి సయ్యద్ ఖుర్షీద్తో పాటు లెనిన్ శ్రీనివాస్, మద్దెర్ల రమేశ్, పంజాల ఐలయ్య, కె.రమేశ్, కె.రామారావు, అరుణకుమారి, వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, మొగిలి గుణక ర్, లింగాల రవికుమార్, కొమిరె వెంకన్న, జి.వీరన్న, కార్డియాలజిస్ట్ సీతారాం, సుబ్బారావు, పిచ్చిరెడ్డి, నాగేశ్వరరావు, మల్లేశం గోపాల్రావు పాల్గొన్నారు.‘హాస్టల్ కతలు’పుస్తకావిష్కరణలో విశ్రాంత ఐఏఎస్ అధికారి విద్యాసాగర్ -
ట్రాక్టర్ బోల్తా
డ్రైవర్ మృతి దమ్మపేట: ట్రాక్టర్ ఇంజన్ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన శ్రీరాంపురం శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకా రం.. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన బెజవాడ ప్రేమ్కుమార్ (38) ట్రాక్టర్ ఇంజన్ను నడుపుతూ, మండలంలోని గండుగులపల్లి నుంచి బుగ్గపాడు వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ శ్రీరాంపురం సమీపంలోని నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తాపడింది. తలకు తీవ్రగాయలు కావడంతో ప్రేమ్కుమార్అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మందలించాడని తనయుడి ఆత్మహత్య దమ్మపేట: తండ్రి మందలించాడని మనస్తాపంతో తనయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచూరుపల్లి గ్రామ పరిధిలోని దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాచూరుపల్లి గ్రామ పరిధిలోని దిబ్బగూడెం గ్రామానికి చెందిన చిలకా వెంకన్నబాబు (19) ఏ పనిచేయకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. అతడిని తండ్రినాగ రాజు శనివారం మందలించాడు. దీంతో అదేరోజు రాత్రి యువకుడు సీలింగ్ ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల దాడులుభద్రాచలంఅర్బన్: పట్టణంలోని చర్ల రోడ్డులో గల పాత మార్కెట్లోని మాంసాహార విక్రయ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అధికారి సుభాష్ ఆదివారం దాడు లు నిర్వహించారు. ఆయా వ్యాపారు లు వినియోగిస్తున్న కాటాలను తనిఖీ చేశారు. కాగా, తూకంలో వినియోగదారులను మోసం చేస్తున్న పది మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పలు రకాల కాటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
బస్సును ఢీకొట్టిన లారీ
పలువురికి గాయాలు దమ్మపేట: స్టాప్ పాయింట్ వద్ద ఆగిన ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులకథనం ప్రకా రం.. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపునకు వెళ్తున్న క్రమంలో మండలంలోని ముష్టిబండ గ్రామంలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. సత్తుపల్లి నుంచి అతివేగంతో వస్తున్న లారీ, ఆగి ఉన్న బస్సు ను కుడి పక్కన వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది. ఇస్లావత్ లక్ష్మి, అసిమ్ సిద్ధిక్ తీవ్రంగా గాయపడగా.. దుర్గ, సందీప్, సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఇస్లావత్ లక్ష్మి, అసిమ్ సిద్ధిక్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగుల మారేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, దర్యా ప్తు చేపట్టామని ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలు అదృశ్యంటేకులపల్లి: భార్య, ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. ఈ ఘటన మండలంలోని తొమ్మిదోమైలు తండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. తండాకు చెందిన భూక్యా మంగీలాల్ భార్య విజయ (30), వారి పిల్లలు భూక్య అనుశ్రీ (9)), భూక్య మోక్షిత్ (6) ఈ నెల 16వ తేదీన ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో భర్త మంగీలాల్ ఈ నెల 20న టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్నపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడే తన భార్యాపిల్లలను తీసుకెళ్లి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో బాధితుడు ఆదివారం విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ తిరుపతిని వివరణ కోరగా భూక్య మంగీలాల్ తన భార్య, ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.వ్యక్తి అదృశ్యంపై కేసుదమ్మపేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. దమ్మపేట అర్బన్కాలనీకి చెందిన జొన్నకూటి వెంకటేశ్వరరావు(40) తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. ఇసుక లారీలకు అడ్డుకట్టఅశ్వాపురం: మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో ఇసుక లారీలను ఆదివారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. రాంనగర్ ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లారీలు గ్రామంలోని వంతెనపై రావడం వల్ల బ్రిడ్జి ధ్వంసం అవుతోందని గ్రామస్తులు వంతెనపై లారీలను అడ్డుకున్నారు. ఇసుక లారీల రాకపోకల వల్ల సీతారామ కెనాల్ కట్ట అస్తవ్యస్తంగా మారిందని, పొలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరకట్ట పూర్తిగా ధ్వంసమవుతోందని కాల్వపై ఉన్న సిల్ట్ను కాల్వలోకి నెడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు ఆపిన లారీల్లో ఓ లారీకి డీడీ లేనట్టు సమాచారం. ఎస్ఐ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోవడంతో తీవ్రగాయాలు నేలకొండపల్లి: మతిస్థిమితం లేని ఓ యువకుడు విద్యుత్ ట్రాన్సఫార్మర్ను పట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. మంగాపురంతండాకు చెందిన నాగేశ్వరరావుకు మతిస్థిమితం తప్పింది. ఆయన ఆదివారం గ్రామంలో పరుగులు తీస్తూ ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. ఈ క్రమాన షాక్కు గురై కేకలు వేస్తుండడంతో స్థానికులు ఆయనను కర్రల సాయంతో విడదీశారు. అప్పటికే చేతులు కాలి రక్తస్రావం అవుతుండడంతో 108 వాహనంలో ఖమ్మం తరలించారు. -
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని..
పాల్వంచ: వైఎస్సార్ సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని పాల్వంచకు చెందిన అభిమానులు ఖలీల్ పాషా, దాసరి కిరణ్ కుమార్ ఆదివారం పాదయాత్ర చేపట్టారు. సుజాతనగర్ నుంచి భద్రాచలం వరకు ఆదివారం సుమారు 60 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్లారు. మార్గమధ్యలో పాల్వంచలో వారి స్నేహితులు, వైఎస్ జగన్ అభిమానులు కలిసి అభినందించారు. జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఖలీల్, కిరణ్ మాట్లాడుతూ 2029లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో పి.వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు. సుజాతనగర్ నుంచి భద్రాచలం వరకు అభిమానుల పాదయాత్ర -
జానకి సదనం సత్రానికి రూ.12 లక్షల విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో నిర్మించే జానకి సద నం సత్రంలో గది నిర్మాణానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. ఏపీలోని విజయవాడకు చెందిన నరసింహారావు రూ.12లక్షల చెక్కులను ఆది వారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. వేధిస్తున్న వ్యక్తిపై కేసు పాల్వంచ: మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై పాల్వంచ పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బస్టాండ్ సెంటర్లో బేకరి షాపు నడుపుకుంటున్న ఓ మహిళకు కొత్తగూడెంనకు చెందిన బొమ్మిడి రమాకాంత్తో పరిచయం ఏర్పడింది. 2024 ఫిబ్రవరిలో సదరు మహిళకు తన స్నేహితుడు సాయి వద్ద నుంచి రూ.60 వేలు రమాకాంత్ ఇప్పించాడు. షూరిటీగా ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకుని తీసుకున్నాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మార్చి 2024లో రూ.8.50 లక్షలకు చెక్ బౌన్స్ కేసు పెట్టి లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాను తీసుకున్నది కేవలం రూ.60 వేలు మాత్రమేనని వేడుకుంది. ఇప్పుడు రూ.16 లక్షలు చెల్లించాలని బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా 2025 డిసెంబర్ నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్ చేయడం, అసభ్యకరమైన వీడియో కాల్స్, న్యూడ్ ఫోటోలు పంపిస్తున్నాడని, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మల్టీపర్పస్’ విధానం రద్దు చేయాల్సిందే..
రఘునాథపాలెం: గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ దోపిడీకి కారణమైన జీఓ 51ను రద్దుచేసి మల్టీపర్పస్ వర్కర్స్ వ్యవస్థను తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రఘునాథపాలెంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం (ఏఐటీయూసీ) మూడో రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత యూనియన్ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం కేవలం రూ.8,500 చెల్లించడం సరికాదన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం నెలకు రూ.16 వేల వేతనం ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. త్వరలో అసంఘటిత రంగ కార్మికులను సమన్వయం చేసి కనీస వేతనాల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటం చేపడతామని తెలి పారు. కొన్ని పెద్ద పంచాయతీల్లో కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నా వాటిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షు డు ఎండీ యూసఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులకు ప్రతీనెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 54 వేల మంది కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, కొత్తగూడెం మేయర్ మూడు గణేశ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, నాయకులు బీజీ క్లెమెంట్, వెంకటరాజం, రావి శివరామకృష్ణ, తోట రామాంజనేయు లు, సీహెచ్ సీతామహాలక్ష్మి, నిమ్మటూరి రామకృష్ణ, మల్లికార్జున్, వాసిరెడ్డి మురళి, పిట్టల మల్లయ్య పాల్గొన్నారు. -
●సోయాబీన్ పరిచయం
ఇల్లెందు మండలంలో అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న.. ఆ తర్వాత పత్తి, వరి సాగు చేస్తారు. కూరగాయలు, మిర్చి కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంటుంది. ఎల్నినో కారణంగా ఈసారి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. సుదీర్ఘకాలంగా వరి,మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసిన రైతులు ఈ దఫా కంది, పెసర, నువ్వుల సాగుతోపాటు తొలిసారి సోయాబీన్ సాగునుమండలానికి పరిచయం చేశారు. ఏకంగా ఈ పంట వంద ఎకరాలకు విస్తరించడం రైతుల చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.నాగేశ్వరరావు సాగు చేస్తున్న బంతి తోట -
టీబీజీకేఎస్లో చేరికలు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్లో పనిచేస్తున్న ఓవర్ మెన్లు, ఐదుగురు కార్మికులు ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరారు. వీరికి రవిచంద్ర కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించి, మాట్లాడా రు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఓవర్మెన్లుగా ఉద్యోగాలు ఇచ్చారని, కారుణ్య నియమకాలు చేపట్టటంతో పాటు సింగరేణి కార్మికులకు అనేక సదుపాయాలు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో కాపు కృష్ణ, గడప రాజ య్య, వసికర్ల కిరణ్, బోరింగ్ శంకర్, ఈశ్వర్, వెంకటేశ్, సూరజ్, అశోక్, రాము లు, అన్వర్, వల్లాల రాయలింగు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఖమ్మంస్పోర్ట్స్: హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా భీమనాథుల అశోక్రెడ్డి, వరికేటి మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన ఎన్నికలకు పలు మండలాల బాధ్యు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోగా వివరాలను ఎన్నికల అధికారి అరుణ్కుమార్ ప్రకటించా రు. అధ్యక్ష, కార్యదర్శులుగా అశోక్రెడ్డి, మోహన్తో పాటు ఉపాధ్యక్షులుగా ఇందుర్తి బ్రహ్మానందరెడ్డి, కోడిశెల అనిల్, బందెల్ల భాస్కర్రావు, సంయుక్త కార్యదర్శులుగా ఇనుపనూరి రాంమాంజనేయులు, జెట్టి రామకృష్ణ, లింగాల బాలరాజు, సండ్ర నితిన్ ఎన్నికయ్యా రు. ఎన్నికలను రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేష న్ ప్రతినిధి కనపర్తి రమేశ్, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్య దర్శి కె.క్రిస్టోఫర్బాబు పర్యవేక్షించారు. ‘వైబ్రంట్ విలేజ్’కు హాజరుసూపర్బజార్(కొత్తగూడెం): యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ నిర్వహించిన వికసిత్ వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం–2026లో పాల్గొన్న యువతతో ఆదివారం ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో సంభాషించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 245 జిల్లాలకు చెందిన 5,000 మంది మై భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి పలువురు యువకులు, జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామ రెడ్డి, మేరా యువ భారత్ నోడల్ అధికా రి కమరతపు భానుచందర్ పాల్గొన్నారు. కలప తరలిస్తున్న వాహనం పట్టివేత తరలించినవారి వివరాలు చెప్పని అధికారులు పాల్వంచరూరల్: అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్డీఓ బాబు కథనం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి ఉల్వనూరు నుంచి పాల్వంచ వైపు టీఎస్ 28 టీఏ 3524 ట్రాలీ వాహనాన్ని బేస్ క్యాంప్ సిబ్బంది తనిఖీ చేయగా అందులో రూ.18,945 విలువ గల బిల్లుడు జాతికి చెందిన కలపను పట్టుకున్నారు. రేంజర్ కవిత మాదురి అర్ధరాత్రి చెక్పోస్టు వద్దకు వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్డీఓ తెలిపారు. కానీ, కలపను తరలిస్తున్నవారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇంతకు వారు వాహనంతోపాటు దొరికారా? దొరికిన తర్వాత పారిపోయారా? లేదా వదిలేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రేంజర్ను పలుమార్లు ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు యత్నించినప్పటికీ స్పందించలేదు. ఎఫ్డీఓ బాబును వివరణ కోరగా కలపను తరలించే వ్యక్తుల వివరాలు తనకు కూడా రేంజర్ చెప్పలేదని పేర్కొన్నారు. -
‘రిజిస్ట్రేషన్’కు కార్పొరేట్ లుక్ !
కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించేలా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం చేపడుతోంది. వాతావరణ ం జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒకటి, రెండు జల్లులు కురిసే అవకాశం ఉంది. సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026చెప్పకముందే.. చేసేశారు!ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన పోటు ప్రసాద్ ఏటా ఖరీఫ్లో ఆరెకరాల్లో వరి సాగు చేస్తాడు. ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులను గుర్తించి వరి స్థానంలో పెసర సాగు చేశాడు. ప్రస్తుతం పెసర పైరు పూత దశకు చేరింది. ‘అధికారులు వర్షాభావ పరిస్థితులపై ముందు నుంచే చెబుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా వరి వేసినా నీటి ఎద్దడికి గురై నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకే వరికి బదులు ప్రత్యామ్నాయం పెసర మంచిదని భావించి సాగు చేస్తున్నా’ అని ప్రసాద్ వివరించాడు. -
చిన్నపాపకు పెద్ద కష్టం
తిరుమలాయపాలెం: అభంశుభం తెలియని ఆ చిన్నారికి అంతపెద్ద జబ్బు ఉందని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేదు. ఆటపాటలతో ఆడుకునే వయస్సులో పసిపాప అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు జన్యు సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తేల్చారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప పాపప్రాణాలు కాపాడే పరిస్థితి లేదని, ఇందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఈ మేరకు దాతలు చేయూతనిచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కన్నీటి పర్యంతం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన కాంపాటి రవీందర్ – సృజన దంపతుల ఐదేళ్ల కుమార్తె కశ్విక అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఊపిరితిత్తులు క్రమంగా దెబ్బతింటుండగా శ్వాస తీసుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది. ఆమెను పరీక్షించిన వైద్యులు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మాత్రమే మార్గమని తెలిపారు. ప్రస్తుతం ఖమ్మంలోని అంకుర ఆస్పత్రిలో కశ్విక చికిత్స పొందుతుండగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించాల్సిన చికిత్సకు సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని సమాచారం. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్ – సృజన దంపతులు తమ బిడ్డను కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 70950 21080, 62815 31963 నంబర్లను సంప్రదించి ఫోన్పే ద్వారా నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
● ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు ● ప్రత్యామ్నాయంపై రైతుల ప్రత్యేక దృష్టి ● ముందుగానే సాగు మొదలుపెట్టిన పలువురు..
ఖమ్మంవ్యవసాయం/ఇల్లెందు రూరల్: ఎల్నినో పరిస్థితుల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జలాశయాల్లోకి నీరు చేరకపోగా.. భూగర్భ జలాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో వరికి బదులు ఇతర పంటలు ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే, వినూత్న పంటల సాగులో ముందు నిలిచే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు పలువురు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవడంలోనూ ఓ అడుగు ముందే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, పత్తి ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి వనరు సాగర్ ప్రాజెక్టు నుంచి ఈసారి నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. బావులు, బోర్ల ఆధారంగా వరి సాగు చేసినా కీలకమైన సమయాన ఇబ్బంది అవుతుందనే ఆలోచన రైతుల్లో నెలకొంది. దీంతో పలువురు ‘ప్రత్యామ్నాయ’ బాట పట్టారు. చెరకుకు చెక్ చెరకు సాగుకు నీటి వినియోగం ఎక్కువ. ప్రస్తుతం ఆ పంటను సాగు చేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన ఏన్కూరు మండలం హిమామ్నగర్కు చెందిన కల్యాణ్ క్యాబేజీ ఎంచుకున్నారు. ఆరెకరాలకు గాను ఇప్పటికే మూడెకరాల్లో ఆయిల్పామ్ నాటాడు. మిగిలిన భూమిలో వరికి బదులు క్యాబేజీ సాగు చేస్తున్నాడు. దీని పంట కాలం రెండు నెలలె కాగా నీటి తడులు తక్కువగా అవసరమవుతాయి. ఆ నీరు కూడా డ్రిప్తో అందిస్తున్నాడు. ఆరుతడితోనే అధిక లాభాలు ఆరుతడి పంటలకు నీటి అవసరం అంతగా ఉండకపోగా పెట్టుబడీ తక్కువే. కేవలం 90 రోజుల్లోనే పంటలు చేతికందుతాయి. ఎకరా విస్తీర్ణంలో కంది సాగుకు రూ.5వేలకు మించి ఖర్చు ఉండదు. ఎకరానికి 8 – 10 క్వింటాళ్లు దిగుబడి వస్తే క్వింటాకు రూ.6,500 వరకు ధర పలుకుతుంది. సోయాబీన్ యూరియా అవసరం లేని పంట. సాగు కాలం మొత్తంలో డీఏపీ, 20–20 ఒక్కో కట్టను ఎకరం విస్తీర్ణంలో మొక్కలకు అందించాలి. మొత్తంగా ఎకరానికి రూ.10వేల నుంచి 12వేల వరకు ఖర్చు చేస్తే.. 8 – 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ.8వేల ధర పలుకుతుంది. నువ్వు సాగు ఎకరాకు మొత్తంగా రూ.5వేల నుంచి 6వేలకు మించి ఖర్చు ఉండదు. దిగుబడి ఎకరానికి 2 – 3 క్వింటాళ్లు కాగా ధర క్వింటా రూ.25వేల ఉంటుంది.ఇప్పటివరకు వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలే సాగు చేశాను. వర్షపాతం తక్కువగా ఉంటుందన్న అధికారుల హెచ్చరికలు ఆలోచింపజేశాయి. తొలిసారి సోయాబీన్ నాలుగెకరాల్లో సాగు చేస్తున్నా. మొక్కలు మంచిగా ఎదుగుతున్నాయి. – సలీం, మొండితోగు, ఇల్లెందు మండలంమార్కెట్లో మంచి ధర ఉండడం, తక్కువ పెట్టుబడి, నీటి తడులే అవసరం కావడంతో కంది వైపు మొగ్గుచూపా. ఇప్పటివరకు వరి, మొక్కజొన్న వేయగా, ఈ సారి నాలుగెకరాల్లో కంది సాగు ప్రారంభించాను. పంట ఆశాజనకంగా ఉంది. – లకన్లాల్పాసి, పూసపల్లి, ఇల్లెందు మండలంఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏటా వ్యవసాయం చేస్తుంటాను. ఇప్పటివరకు వరి, మొక్కజొన్న పంటలకే ప్రాధాన్యమిచ్చాను. ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేయాలనే భావనతో ఈసారి ఐదెకరాల్లో పెసర సాగు ప్రారంభించాను. – అజ్మీరా మోహన్, మస్సివాగు, ఇల్లెందు మండలం -
జానకమ్మకు స్వర నీరాజనం..
భద్రాచలంటౌన్: దక్షిణ భారత గానకోకిల, దివంగత గాయని ఎస్.జానకికి నివాళిగా భద్రాచలంలో ‘జానకమ్మకు స్వర నీరాజనం’పేరిట నిర్వహించిన సంగీత విభావరి వైభవంగా సాగింది. పట్టణంలోని కాకతీయ గ్రాండ్ (కమ్మ సత్రం) వేదికగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, మాట్లాడారు. సినిమా సంగీత ప్రపంచంలో ఎస్.జానకి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె పాటలు తరాలు మారినా శ్రోతల గుండెల్లో నిలిచిపోతాయని కొనియాడారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాన్ స్టాప్గా సాగిన ఈ కార్యక్రమంలో 25 మంది గాయనీగాయకులు పాల్గొన్నారు. జానకమ్మ ఆలపించిన ఎన్నో సూపర్ హిట్, భక్తిరస, మెలోడీ గీతాలను వారు తమ పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. అలరించిన సంగీత విభావరి -
● కేబుల్ తవ్వకాలతో గుంతలమయంగా మారిన భద్రగిరి రోడ్లు ● ఇసుక లారీలతో దెబ్బతింటున్న ప్రధాన రహదారులు ● ప్రమాదాలకు గురై గాయపడుతున్న వాహనదారులు ● నిర్లక్ష్యం వీడని కాంట్రాక్టర్, సంబంధిత శాఖ అధికారులు
రోడ్లు ఛిద్రం!భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి పుణ్యక్షేత్రంలోని రహదారులు గుంతలమయంగా మారాయి. భక్తులు, పట్టణవాసులు రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కేబుల్ తవ్వకాలతో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. పట్టణంలో కొద్ది నెలలుగా అండర్గ్రౌండ్ కేబుల్ లైన్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయి. రహదారులను అడ్డదిడ్డంగా తవ్వి కేబుల్ పనులను పూర్తి చేసుకున్నారు. అనంతరం గుంతలను పూడ్చకుండా వదిలేశారు. కొన్ని చోట్ల నడుం లోతు గోతులు, మరికొన్ని చోట్ల మట్టి , రాళ్ల కుప్పలు దర్శనమిస్తున్నాయి. మూడు రోజుల క్రితం యూబీ రోడ్డులో ఓ వాహనం రాళ్ల కుప్ప వల్ల పక్కకు దూసుకురావడంతో ఓ దుకాణం అద్దాలు ధ్వంసమయ్యా యి. వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాగా, నిబంధనల ప్రకారం రోడ్ల డ్యామేజీ ఖర్చులను గ్రామపంచాయతీకి జమ చేయాలి. పంచాయతీ అనుమతితో రోడ్లను తవ్వి కేబుల్ పనులు పూర్తయ్యాక సదరు కాంట్రాక్టర్ గోతులను పూడ్చి వేయాలి. కానీ కాంట్రాక్టర్ ఇవేమీ పాటించడంలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కేబుల్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ పనులు పూర్తయ్యాక రహదారుల పునరుద్ధరణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోతులను పూడ్చాలని ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా, పూడ్చనని చెబుతున్నాడని స్థానికులు, దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. మచ్చ తెస్తున్న అధికారుల తీరు దేశ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భద్రాచలం తరలివస్తుండగా, వారికి గుంతలు స్వాగతం పలుకుతుండటంతో భద్రగిరి క్షేత్రానికి అప్రతిష్ట వస్తోంది. సదరు శాఖల అధికారుల తీరు కూడా మచ్చ తెస్తోంది. ప్రాణ నష్టం, ఇతర ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి కేబుల్ తవ్వకాల గుంతలను పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, ఇసుక లారీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి నుంచి ఇసుక రవాణా చేసే భారీ లారీల రాకపోకలు ప్రధాన రహదారులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. చర్ల, దుమ్ముగూడెం మండలా ల్లోని ర్యాంపుల నుంచి రాత్రింబవళ్లు ఇసుక లారీలు భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. అధిక లోడ్తో ప్రయాణిస్తుండటంతో రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పట్టణ ప్రధాన రహదారులు, అంబేద్కర్ సెంటర్లో భారీ గోతులు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు కిందపడుతూ గాయాల పాలవుతున్నారు. వర్షం కురిసిన సమయంలో గుంతలు నీటితో నిండిపోవడంతో లోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. -
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలివ్వాలి
బూర్గంపాడు: వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం రూ.19 వేలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ మార్కె ట్ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటాల సోమ న్న డిమాండ్ చేశారు. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 1,200 మంది సెక్యూరిటీ గార్డులు 30 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నామని అన్నారు. రూ 5లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ ల సాంబయ్య, నాయకులు సదానందం, వెంకట నారాయణ, సారిక రాము, ఎండీ మస్తాన్, రామాంజనేయులు, ఎస్ రమేష్, వెంకటేశ్, మహేందర్రెడ్డి, శోభారాణి, దుర్గా, మహమూద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన్న -
57 లీటర్ల నాటుసారా స్వాధీనం
చర్ల: మండలంలోని కలివేరు, భద్రాచలం పట్టణంలో ఆదివారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టి.. 57 లీటర్ల నాటుసారా, ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని కలివేరు సీఆర్పీఎఫ్ క్యాంపు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 40 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో 17 లీటర్ల నాటుసారాతో పాటు ముగ్గురు వ్యక్తుల (ఇద్దరు మహిళలు)ను అదుపులోకి తీసుకుని, వీరిపై కేసు నమోదు చేశామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుళ్లు వీరబాబు, ప్రసన్నకుమార్, తిరుపతి, ఉపేందర్ పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆల య అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నదీహారతి భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదా వరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ లు చేశారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన, శాంతి మంత్రా ల పఠనం నిర్వహించారు. పురోహితులు రామ వజ్జల రవికుమార్, సత్య ప్రసాద్ శర్మ, పవన్ కుమార్ శర్మ, రామాచార్యులు, వీరభద్ర శర్మ, సుబ్రహ్మణ్యం చార్యులు, తిరుపతిరావు, ఎన్ఎస్ఎన్ రెడ్డి, రామకష్ణ, తేజ శర్మ, అశోక్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ సిబ్బందికి రక్షణ కల్పించాలి
అశ్వాపురం: అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్రాజుకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెంలో ఎస్పీ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది వినతిపత్రం అందజేశారు. ఈ నెల 17న అశ్వాపురం మండలం మనుబోతులగూడెంగ్రామ పంచాయతీ వేములూరు గ్రామంలో విధి నిర్వహణలో ఆటంకపరిచి ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరగకుండా చట్టపరమైన రక్షణ చర్యలు చేపట్టాలని విన్నవించారు. బీట్ ఆఫీసర్పై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, జిల్లాలోని అన్ని డివిజన్ల అసోసియేషన్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు గోవిందు, బాగ్య, నరేష్, వెంకన్న, ఎర్రయ్య, అనూష, బాబూరావు, భీమ్చంద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజుకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వినతి -
సర్పంచ్ మృతిపై నిరసన
భద్రాచలంఅర్బన్: మహిళా సర్పంచ్ మృతికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేసిన వైద్యం వికటించడమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ సర్పంచ్ సోడే వెంకటరమణ (36) శుక్రవారం మృతి చెందగా మృతదేహాన్ని అంబులెన్స్లో భద్రాచలం తీసుకుని వచ్చి సదరు ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగిన విషయం విదితమే. కాగా, శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. కాగా, ఆస్పత్రి వైద్యులు మృతురాలి బంధువులకు సమాధానం చెప్పకపోగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని.. మృతురాలి బంధువులతో పాటు సీపీఐ నాయకులు మండిపడ్డారు. వెంటనే వైద్యుడు బయటకు రావాలని, బాధితురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి, మృతురాలి పిల్లలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. డాక్టర్ ఎంతకీ బయటకు రాకపోవడంతో మృతురాలి భర్త ప్రేమ్కుమార్ ఆస్పత్రి వెనుక వైపు నుంచి లోపలికి చొచ్చుకుని వెళ్లి రెసెప్షన్ కౌంటర్పై పెట్రోల్ ప్యా కెట్లు విసిరి లైటర్తో నిప్పు అంటించాడు. అక్కడే ఉన్న ఆస్పత్రి నిర్వాహకులు, సిబ్బంది ప్రేమ్కుమార్ను బయటకు పంపించారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో సీపీఐ నాయకులు, తదితరులు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. అనంతరం మార్చురీలో ఉన్న సోడే వెంకటరమణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు పాల్వంచకు తరలించారు. పెట్రోల్ ప్యాకెట్లు విసిరి, నిప్పంటించిన మృతురాలి భర్త -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు పరిస్థితులు పోవాలని దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం శ్రీరామాత్మక వరుణ యాగం జరి పారు. ఈ సందర్భంగా బేడా మండపంలో కొలువై ఉన్న నిత్య కల్యాణ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం గావించారు. వారాంతపు సెలవు రోజులు కావడంతో ఆలయంలో, గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది. ‘పోలీస్ అక్క’ విధులపై అవగాహనకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో అమలు చేయనున్న ‘పోలీస్ అక్క’విధులపై మహిళా పోలీసు సిబ్బందికి ఎస్పీ రోహిత్రాజు అవగాహన కల్పించారు. శనివా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు పోలీస్ అక్కగా విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, ఈవ్ టీజింగ్, బాల్య వివా హాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేసేలా విశ్వాసాన్ని కల్పించాలని సూ చించారు. పోలీస్ అక్క కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, షీటీం ఎస్హెచ్ఓ రమాదేవి పాల్గొన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు ప్రోత్సాహంఏపీఓ డేవిడ్ రాజ్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని భద్రగిరి మార్ట్ ద్వారా సేంద్రియ (ఆర్గానిక్), అటవీ ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేసి ప్రోత్సహిస్తామని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజ్ తెలిపారు. ఏపీలోని ఎటపాక మండలం కొత్తూరు నారాయణపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు సాగు చేస్తున్న బ్లాక్ రైస్ (నల్ల బియ్యం) పంటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రగిరి మార్ట్లో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబా టులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించే రైతులు, మహిళా సంఘాల నుంచి నేరుగా బ్లాక్ రైస్తో పాటు ఇతర ఆర్గానిక్ ధా న్యాలు, స్వచ్ఛమైన పాలు, నెయ్యి, తేనె, నిల్వ పచ్చళ్లు, మిల్లెట్ ఉత్పత్తులను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎటపాక ఏపీఓ భాస్కరరావు, జీసీసీ మేనేజర్ జయరాజ్, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
చుంచుపల్లి: ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశా రు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యానగర్ కమ్మ సత్రంలో శనివారం వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం మాత్రమే కాకుండా నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం కూడా చేతకావడం లేదని విమర్శించారు. నిర్మించడం, నిలబెట్టడం కాకుండా కూల్చివేయడం, పడగొట్ట డం తప్ప ప్రభుత్వం చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించా రు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, దిండిగాల రాజేందర్, సలిగంటి శ్రీనివాస్, కాపు సీతామహాలక్ష్మి, అబ్రహం, మండవ సుబ్బారావు, శంకర్రెడ్డి, భూపతి శ్రీనివాసరావు, గోపాల్రావు, మసూద్, అవుటుపల్లి రాంబాబు, బండి విజయభాస్కర్, పూల రవీందర్, అనుదీప్, అజిత్, వీరభద్రం, బొమ్మిడి రమాకాంత్, సర్పంచులు బాదావత్ శ్రీకాంత్, బలరామ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర -
ఎల్నినో ఎఫెక్ట్..
● వరి తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు ● తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగుకు ప్రాధాన్యం ● రైతులకు వ్యవసాయశాఖ సూచనలు ● ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై సందిగ్ధం చర్ల: ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటికే జిల్లాలో వర్షాలు ఆలస్యమవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఆర్జించే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ప్రత్యేకించి అధికనీరు అవసరమయ్యే వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చేయాలని సూచిస్తున్నారు. దీంతో సాగు వ్యయం తగ్గి, మంచి ఆదాయం వస్తుందని చెబుతుండగా వరిసాగు చేసే రైతాంగం సందిగ్ధంలో పడింది. తగ్గిన వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జిల్లాలో సాధారణ వర్షపాతం సుమారు 1,100 మి.మీ నుంచి 1,200 మి.మీ. వరకు నమోదవుతుంది. ఎన్నినో ప్రభావంతో ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం కురవలేదు. మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్లో కూడా ఆశించిన మేర వర్షాలు కురిసే పరిస్థితులు లేవని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, సాధారణంగా వరికి 1,200 – 1,500 మి.మీ. వరకు నీటి అవసరం ఉంటుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటలను సాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రత్యామ్నాయ పంటల సాగును ఎంచుకోవా లని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాల వైపు మొగ్గు జొన్న, సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితో సాగవుతాయి. మార్కెట్లో డిమాండ్ పెరు గుతుండటంతో రైతులకు మంచి ధర లభించే అవకాశం ఉంది. పెసర, మినుము, కంది వంటి పప్పు ధాన్యాలకు కూడా నీటి అవసరం, సాగు ఖర్చు తక్కువ. నేలలో నత్రజని నిల్వలను పెంచి భూసారాన్ని పెంపొందిస్తాయి. నువ్వులు, వేరుశనగ వంటి పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. వర్షాలు తక్కువగా ఉన్నా, దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. రైతులకు కలిగే ప్రయోజనాలు.. ● తక్కువ సాగునీటితో పంటల సాగు. ● విద్యుత్ వినియోగం, సాగు వ్యయం తగ్గుతుంది. ● వర్షాభావ పరిస్థితులను తట్టుకునే అవకాశం. ● పంటల వైవిధ్యంతో ఆదాయం పెరుగుతుంది. ● నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయ శాఖ సూచనలు ... ● స్థానిక వర్షపాతాన్ని బట్టి పంటలను ఎంచుకోవాలి. ● ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించాలి. ● నేల పరీక్షలు చేయించి ఎరువులు వాడాలి. ● వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేసే చర్యలు చేపట్టాలి. ● డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించాలి. పంట పంట కాలం నీటి అవసరం ప్రధాన ప్రయోజనం మొక్కజొన్న 100–110 రోజులు తక్కువ మంచి మార్కెట్ ధర జొన్న 95–110 రోజులు చాలా తక్కువ ఎండను తట్టుకుంటుంది సజ్జ 70–85 రోజులు చాలా తక్కువ త్వరగా దిగుబడి రాగులు 95–110 రోజులు తక్కువ పోషక విలువలు అధికం పెసర 65–75 రోజులు చాలా తక్కువ త్వరగా ఆదాయం మినుములు 70–80 రోజులు తక్కువ మంచి ధర కందులు 150–180 రోజులు తక్కువ దీర్ఘకాలిక లాభం నువ్వులు 80–90 రోజులు తక్కువ నూనెగింజలకు మంచి డిమాండ్ వేరుశనగ 100–120 రోజులు మోస్తరు మంచి ఆదాయం పత్తి 160–180 రోజులు మోస్తరు మార్కెట్లో మంచి డిమాండ్ రైతులు ఇప్పటికే వరిసాగు కోసం రూ.వేలు ఖర్చు చేశారు. విత్తనాలు కొని నార్లు పోశారు. రైతులకు పూర్తిగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించి నష్టపోకుండా చూడాలి. తక్కువ నీటితో పండే పంటలకు మద్దతు ధర ప్రకటించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. – వై.పుల్లారెడ్డి, రైతు, గొమ్ముగూడెం వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలంటూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పెసర, మినుము, కందులు, మొక్కజొన్న, సోయాబీన్ వంటివి సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని వివరిస్తున్నాం. అవసరమైన విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నాం. – బాబూరావు, డీఏఓ -
మిథిలా స్టేడియంలో..
నిత్యకల్యాణ వేదిక భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించిన నేపథ్యంలో భక్తుల ఆర్జిత సేవలకు, దర్శనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇతర చోట్ల జరుగుతున్న దేవస్థానం అభివృద్ధిలో బాలాలయంలో మూలమూర్తులను తరలించి నిర్మాణ పనులు చేస్తుండటంతో భక్తులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకావడంలేదు. భద్రగిరి క్షేత్రంలో భక్త రామదాసు నిర్మించిన అంతరాలయాన్ని, మూలమూర్తులను అదే రీతిన ఉంచి నిర్మాణం జరపాలని భావించటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని ఆళ్వార్లు, ఉపాలయాల మూలమూర్తులను అంతరాలయంలో ఉంచటంతో, అంతరాలయంలో జరిగే పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. వెండి వాకిలి వద్దనే ఇతర పూజలు జరుగుతున్నాయి. పనులు ముమ్మరమైతే వీటిని సైతం త్వరలో నిలిపివేసే పరిస్థితి నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే నిత్యకల్యాణ వేదికను సైతం మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా.. సదరు కాంట్రాక్టర్ ప్రారంభించటంలో అలసత్వం వహించారు. రెండు రోజుల క్రితం భద్రాచలంలో పర్యటించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కాంట్రాక్టర్, ఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యకల్యాణాలను మిథిలా స్టేడియంలో ప్రారంభించాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఆ పనులను ఎట్టకేలకు కాంట్రాక్టర్ ప్రారంభించారు. స్టేడియంలో కల్యాణ వేదిక ఎదురుగా మట్టి తీసే పనులు నడుస్తున్నాయి. ఇక్కడే తాత్కాలిక నిత్యకల్యాణ వేదిక ఏర్పాటు కానుంది. ఇందుకు సుమారు రూ. 15 లక్షల వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణ ద్వారం నుంచి వచ్చి.. ఉత్తర ద్వారం నుంచి వెళ్లేలా.. ఉత్తరం, దక్షణ దిక్కులలో కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక ఆలయ ప్రాంగణంలో ఇతర పనులను ప్రారంభించనున్నారు. దీంతో భక్తుల రాకపోకలకు, దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లడ్డూ కౌంటర్లు ఉన్న తూర్పు మెట్లను దర్శనం అనంతరం బయటికి వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. మూడు వైపులా పనులను ప్రారంభించిన నేపథ్యంలో తూర్పు మెట్లనే దర్శనానికి ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అంతరాలయానికి దక్షిణ ద్వారం గుండా వచ్చి స్వామి వారి దర్శనం అనంతరం ఉత్తర ద్వారం గుండా బయటికి వచ్చి తూర్పు మెట్ల మీదుగా బయటికి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులను సైతం త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో ప్రారంభించి, వేగంగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా లడ్డూ కౌంటర్లు ప్రస్తుతానికి యథా స్థానంలోనే ఉండనున్నాయి. చిత్రకూట మండపంలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. -
●వీరయ్యా... అదిరిందయ్యా!
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం నాగారం వాసి తిర్లకుండ వీరయ్య కుటుంబ వారసత్వంగా కుండలు చేసినా ఆదరణ లేక అమ్మకాలు జరగక పూట గడవడం కష్టమైంది. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి సారించిన ఆయన అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు! వీరయ్యకు ద్విచక్రవాహనం ఉండగా.. రెండు చక్రాలతో తోపుడుబండి మాదిరిగా చేయించి ట్రాక్టర్ ట్రక్ తరహాలో దానికి అమర్చాడు. దీనిపై కట్టెల పొయ్యి పెట్టి పాత్రలో స్వీట్ కార్న్, కంకులు ఉడకబెడుతూ ఊరు రా తిరిగి విక్రయిన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి కంకులు విక్రయిస్తే ఖర్చులు పోగా రోజుకు రూ.500 నుంచి రూ.600 మిగులుతున్నాయని వీరయ్య తెలిపారు. -
భారీగా గంజాయి పట్టివేత
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలో శనివారం భారీగా గంజాయి పట్టుబడింది. కూనవరం రోడ్డు లోని వీరభద్ర ఫంక్షన్ హాల్ సమీపంలో ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలను ఖమ్మం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి వెల్లడించారు. జిల్లా డిప్యూటీ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికా రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా, వేగంగా వెళ్తున్న కారు (జేఏ03 ఏఆర్5892)ను ఆపి తనిఖీ చేశారు. ఆరు బ్యాగుల్లో 101 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన సత్తిపాపా, హర్బజ్ హుస్సేన్, గుల్జార్లతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజేంద్రప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.50.50 లక్షల విలువైన గంజాయి, కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని కమిషనర్ వివరించారు. తనిఖీల్లో సీఐ రహీమున్నీసా, ఎస్ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీం, సీతారాం, సిబ్బంది భద్రం, రాకేశ్, రవికుమార్ పాల్గొన్నారు. పాల్వంచలో.. పాల్వంచ: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని వనమాకాలనీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై అనుమానాదాస్పదంగా వె వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్లో 3.100 కేజీల గంజాయి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీరు తెలంగాణానగర్కు చెందిన ముగితి హేమంత్, సానబోయిన శ్రావణ్కుమార్గా గుర్తించారు. మోటార్ సైకిల్తో పాటు సెల్ఫోన్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేశారు. నలుగురి అరెస్ట్ -
ఎరువుల దడ!
బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఓ వైపు ఎకరాకు ఇచ్చే రెండు బస్తాల యూరియా సరిపోవటంలేదు. మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధర అమాంతం పెంచేశారు. గతేడాది వానాకాలం సీజన్ ధరతో పోల్చితే బస్తాకు రూ. 800 వరకు పెంచారు. దీంతో పెట్టుబడి భారం పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులపై ఆర్థిక భారం ఇరాన్, అమెరికా దేశాల మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఎరువుల కంపెనీలు అమాంతంగా ధరలను పెంచేశాయి. ఏడాది కాలవ్యవధిలోనే మూడుసార్లు కాంప్లెక్స్ ఎరువులు ధరలు పెరిగాయి. గతంలో బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకు మాత్రమే ధరలు పెరిగేవి. ఏడాది కాలంగా ఎరువుల బస్తా ధరలు ఒకేసారి బస్తాకు రూ.300 నుంచి రూ.500 వరకు పెరుగుతున్నాయి. గతేడాది వానాకాలం సీజన్లో రూ.1350 ఉన్న 20:20:00:13 కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర ప్రస్తుతం రూ.2150 చేరింది. ఏడాది కాలంలోనే బస్తా రూ.800 పెరిగింది. 14:35:14 ఎరువు, 10:26:26 ఎరువు, 16:16:16 వంటి ఇతర కాంప్లెక్స్ ఎరువులు, ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పోటాష్) ధరలు కూడా అధికంగా పెరిగాయి. ఎకరాకు సగటున 4 బస్తాల కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతుండటంతో పెరిగిన ధరలతో రైతులపై అధికభారం పడుతోంది. ప్రస్తుతం రైతులకు డీఏపీ(డై అమ్మోనియా ఫాస్పేట్) మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీ ఇస్తుండటంతో డీఏపీ ఎరువు ధర అధికారికంగా పెరగలేదు. కానీ ప్రస్తుతం డీఏపీ సరఫరా సక్రమంగా లేదు. డీలర్ల వద్ద అందుబాటులో లేదు. ఒకవేళ డీలర్ వద్ద ఉన్నా డీఏపీ కొనాలంటే ఇతర కాంప్లెక్స్ ఎరువులు, న్యూట్రియంట్స్, నానో డీఏపీ వంటి వాటిని అంటగడుతున్నా రు. డీఏపీ కొరతను అవకాశంగా తీసుకుని కొందరు డీలర్లు అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరినాట్లు వేసే ముందు దుక్కిలో డీఏపీ చల్లుతారు. లేకుంటే మొదటి విడతగా రైతులు పంటలకు డీఏపీని వేసుకుంటారు. ప్రస్తుతం డీఏపీ దొరకక పోవటంతో అధిక ధరకు కాంప్లెక్స్ ఎరువులు కొనా ల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యూ రియా మాదిరిగానే డీఏపీని కూడా ఫర్టిలైజర్ యాప్లో విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.డీఏపీ దొరకటం లేదు. మిగతా ఎరువులు ధర భారీగా పెంచారు. గతేడాది రూ.1350కు కొన్నటువంటి 20:20 బస్తా ధర ఇప్పుడు రూ. 2150కు పెంచారు. గతేడాదితో పోల్చుకుంటే ఎకరాకు రూ.3వేలకు పైగా ఖర్చు పెరుగుతుంది. – గాదె ప్రభాకర్రెడ్డి, రైతుఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెంచారు. బస్తాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. డీఏపీకి ధర పెంచలేదని చెబుతున్నా, అది దొరకట్లే. యూరియా లాగే డీఏపీని కూడా ఆన్లైన్ బుకింగ్తో అందిస్తే కొంత భారం తగ్గుతుంది. – దౌపాటి శ్రీనివాసరావు, రైతు -
సౌర వనరులను సద్వినియోగం చేసుకుందాం
బోనకల్: అపరిమితంగా ఉన్న సౌర వనరు లను సద్వినియోగం చేసుకోవడం అందరి బాధ్యత అని రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ ముషార్రఫ్ ఫరూఖీ అన్నారు. మోడల్ సోలార్ ప్రాజెక్టు పనులను బోనకల్లో శనివారం ఆయన టీజీ ఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్రెడ్డి, కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి పరిశీలించారు. మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాల్లోని ఇళ్లు, పొలాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లను పరిశీలించాక బోనకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముషార్రఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 81 గ్రామాల్లో రూ.వేయి కోట్ల వ్యయంతో మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరరగడం, విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తున్న బొగ్గు వనరులు పరిమితమైనందున పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇళ్లు, పొలాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని కోరారు. దీంతో కుటుంబాలు విద్యుత్ అవసరాలు తీరడమే కాక అదనపు విద్యుత్ను గ్రిడ్కు అందించి ఆర్థిక ప్రయోజనం పొందొచ్చని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశంతో ఇప్పటికే కొండారెడ్డిపల్లి గ్రామాన్ని పూర్తిస్థాయిలో సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయగా.. మోడల్గా ఎంపిక చేసిన అన్ని గ్రామాల్లో ఆగస్టు 15 నాటికి పనులు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధికారులు రాజుచౌహాన్, మల్లికార్జున్, ఈ.శ్రీనివాసాచారి, బండి శ్రీనివాసరావు, వై.వీ ఆనంద్కుమార్, మనోహర్ పాల్గొన్నారు. ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం సీఎండీ, రెడ్ కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ దివాకర స్వాగతం పలకగా.. జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థ, మౌలిక సదుపాయాల బలోపేతం, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. పాల్వంచ: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టి.. డ్రెయినేజీలోకి దూసుకెళ్లిన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. ఒకరు గాయపడ్డారు. స్థానిక బీసీఎంరోడ్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఎదురుగా వస్తున్న టీవీఎస్ మోపెడ్ను కంకరలోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టి, డ్రెయినేజీలోకి దూసుకెళ్లి ఆగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి గాయపడగా.. మోటార్ సైకిల్ లారీ టైర్ల కిందపడి నుజ్జునుజ్జయింది. క్షతగాత్రుడిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఆటో బోల్తా.. ఒకరికి గాయాలుటేకులపల్లి: ఆటో బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. సింగరేణి మండలం నుంచి టేకులపల్లి వారసంతకు కూరగాయలు విక్రయించేందుకు కొందరు వ్యాపారులు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో మండలంలో ని తొమ్మిదోమైలుతండా పంచాయతీ సాయన్నపేట మూలమలుపు వద్దకు రాగానే టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. నలుగురు ప్రయాణికు ల్లో అజ్మీర పద్మ తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108 ద్వారా ఇల్లెందు ఏరి యా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక చికిత్స అందించిన 108 సిబ్బంది సునీత, నాగేశ్వరరావును స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు అభినందించారు. -
బొగ్గు రవాణా పెంచేలా ప్రణాళిక
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సీహెచ్పీ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తుండగా, దీన్ని మరింత పెంచేలా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ ట్రాఫిక్) అబ్దుల్ రెహమాన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐఆర్టీఎస్ ఈడీ బి.వెంకన్న, ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్తో కలిసి సీహెచ్పీలోని సైలోబంకర్, రైల్వే లోడింగ్ పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించి సామర్థ్యం పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు డి.నరేంద్రవర్మ, ఎన్వీఆర్.ప్రహ్లాద్, కె.సోమశేఖరరావు, బొల్లం శ్రీనివాస్, సాయినాధ, ఎ.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నవోదయం
● ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్య ● జవహర్ నవోదయ విద్యాలయాల్లో మెరుగైన వసతులు ● 2027–28లో ప్రవేశాల దరఖాస్తు గడువు ఈ నెల 31 ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై విద్యార్థులకు పూర్తిస్థాయి పట్టు సాధించేలా బోధన ఉంటుంది. పుస్తక విజ్ఞానంతోపాటు క్రీడలు, యోగా, ధ్యానం, చిత్రలేఖనం, సంగీతంలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు, చక్కటి మెనూతో భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ విద్య అందిస్తారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాకు కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్తగా నవోదయ పాఠశాలను మంజూరు చేసింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో 30 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవన నిర్మాణం చేపడుతున్నారు. భవనం పూర్తయ్యేవరకు కరకగూడెం జెడ్పీ పాఠశాలలో తాత్కాలికంగా విద్యాలయ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. తాజాగా ఆరో తరగతిలో 40 సీట్ల భర్తీకి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31లోగా https:// navodaya. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయ స్వాగతం పలుకుతోంది. 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే నవోదయ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. విలువలు, దేశభక్తి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలను సమ్మిళితం చేస్తూ బోధన సాగిస్తున్నారు. – కరకగూడెంనవోదయ విద్యాలయలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రవేశ పరీ క్షలో 100 మార్కులకు గాను 80ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉం టాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని ఉన్నత విద్యకు బలమైన పునాది వేసుకోవ చ్చు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులు ఎంపికవుతారు. –రత్నయ్య, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ -
ఇంటింటా తొలి ఏకాదశి
పాల్వంచరూరల్: ఇంటింటా తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుని ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జాము నుంచే ఆలయాలకు తరలివెళ్లారు. తులసీ దళాలు, కొబ్బరికాయలు, పూలతో దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గ్రామాల్లో రైతులు ప్రత్యేకంగా జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఆలయాలను దర్శించుకుని వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కజొన్న పేలాలతో పిండిని తయారు చేసి ప్రసాదంగా స్వీకరించారు. అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి కలశాభిషేకం, స్వామివారికి వరుణయాగ పూజలు నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి భక్తులు కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అర్చకులు అష్టోత్తర కలశ పూజలు చేశారు. శివాలయంలో శ్రీ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామికి ఘటాభిషేకం (వరుణయాగం) పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ విజయ్కుమార్, అర్చకుడు పద్మనాభశర్మ పాల్గొన్నారు. -
విద్యార్థికి విజ్ఞానం
● ‘వీవీఎం’ పేరుతో ప్రతిభా అన్వేషణ పరీక్ష ● 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం ● విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు ● జాతీయస్థాయిలో సత్తా చాటితే ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్ కూడా.. ఖమ్మంసహకారనగర్: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం), విజ్ఞాన భారతి సంయుక్త ఆధ్వర్యాన ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థుల్లో శాసీ్త్రయ పరిజ్ఞానం పెంపొందించడం, పరిశోధనలపై ఆసక్తి పెంచడమే ఈ పరీక్ష ప్రధాన లక్ష్యం. విజేతలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో బహుమతులు అందించడమే కాక మెరుగైన ప్రతిభ చాటిన వారికి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంటర్న్షిప్నకు అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం ‘వీవీఎం’ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యాన ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తే మేలు జరగనుంది. ఎవరెవరు అర్హులు దేశవ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ ఓపెన్ బుక్ విధానంలో నిర్వహిస్తారు. తద్వారా ఇంటి నుంచే మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా పరీక్ష రాయొచ్చు. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 14 భారతీయ భాషల్లో ఉంటుంది. సైన్స్పై ఆసక్తి పెంపే లక్ష్యం విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడం, భారతీయ శాస్త్రవేత్తల కృషిని పరిచయం చేయడమే ఈ పరీక్ష లక్ష్యం. అంతేకాక ఉన్నత విద్యకు మార్గనిర్దేశం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేలా పరీక్ష నిర్వహిస్తున్నారు. పరిశోధనా సంస్థలతో పరిచయం కల్పించే లక్ష్యంతో సాగుతున్నారు. పరీక్ష విధానం లెవల్ – 1 (స్కూల్ స్థాయి) పరీక్ష 100 ప్రశ్నలతో 90 నిమిషాల సమయం ఉంటుంది. మొదటి విభాగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి, త్రిశక్తి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలపై 40 ప్రశ్నల పరీక్ష 30 నిమిషాలు ఉంటుంది. రెండో విభాగంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, రీజనింగ్ అంశాలపై 60 ప్రశ్నలతో 60 నిమిషాలు ఉంటుంది. ఇప్పటికే మొదటి విభాగానికి సంబంధించి సిద్ధమయ్యేందుకు కావాల్సిన స్టడీ మెటీరియల్ వీవీఎం వెబ్సైట్లో పొందుపరిచారు. లెవల్ – 1 తర్వాత రాష్ట్రస్థాయిలో లెవల్ – 2 పరీక్ష 45 నిమిషాల వ్యవధితో 50 మార్కులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత జాతీయస్థాయి పరీక్ష ఉంటుంది. ఆకర్షణీయమైన పురస్కారాలు పాఠశాల, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, మెమెంటోలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతి లభిస్తుంది. జాతీయస్థాయిలో మొదటి ముగ్గురికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల నగదు బహుమతే కాక సర్టిఫికెట్లు అందించనున్నారు. విద్యార్థులు వీవీఎం పరీక్ష రాయడం భవిష్యత్కు ఉపయోగపడుతుంది. ఈ మేరకు సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలి. స్కూల్, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిస్తే నగదు ప్రోత్సాహకాలతో పాటు మెరిట్ సర్టిఫికెట్లు అందుతాయి. జిల్లా విద్యార్థులు అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. –ఎనుముల వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి, ఖమ్మం విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. చివరి తేదీ: సెప్టెంబర్ 30 పరీక్ష ఫీజు: రూ.200 పరీక్ష తేదీలు: 6, 7వ తరగతులు: నవంబర్ 16 లేదా 19 8, 9వ తరగతులు: నవంబర్ 17 లేదా 20 10, 11వ తరగతులు: నవంబర్ 20 లేదా 21 పరీక్ష సమయం: 90 నిమిషాల పరీక్షను ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యార్థులకు అనుకూలమైన సమయాన రాయొచ్చు. రాష్ట్రస్థాయి పరీక్ష: 2027 జనవరి 3,10, 17 జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు DRDO, CSIR, ISRO, IICT, IISER, IIT, NIN, NGRI, BARC తదితర ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఇంటర్న్షిప్నకు అవకాశం దక్కుతుంది. ఇది సంస్థల ఆధారంగా ఒకటి నుంచి మూడు వారాల పాటు ఉంటుంది. అంతేకాక జాతీయస్థాయి విజేతలకు ‘భాస్కర స్కాలర్షిప్’ పథకం ద్వారా ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది. -
చికిత్స పొందుతున్న సర్పంచ్ మృతి
పాల్వంచరూరల్/భద్రాచలం అర్బన్: కుడి కాలికి వాపు రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన మహిళా సర్పంచ్ పరిస్థితి విషమించి మృతిచెందింది. సర్పంచ్ భర్త ప్రేమ్కుమార్ కథనం మేరకు.. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ సోడే వెంకటరమణ(36) మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడగా భద్రాచలంలో మోహన్రావు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. ఇటీవల అదే కాలుకు వాపు రావడం గమనించి బుధవారం మోహన్రావు ఆస్పత్రిలో చేరి్పంచారు. ఇన్ఫెక్షన్ మరింత పెరగడంతో ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు అంబులెన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి శుక్రవారం తరలించగా చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, చికిత్స లోపమే తన భార్య మృతికి కారణమని ఆరోపించిన ప్రేమ్కుమార్.. మృతదేహంతో శుక్రవారం రాత్రి నేరుగా భద్రాచలంలోని మోహన్రావు ఆస్పత్రి వద్దకు వెళ్లి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకుని చర్చిస్తున్నారు. కాగా, సర్పంచ్ మృతిపై ఎంపీడీఓ పి.రాజారావు, ఎంపీఓ షబ్నా సంతాపం తెలిపారు. -
ఆ ఒక్కటీ అడక్కు..
కొండలా బకాయిలు టీజీ జెన్కో ఆధ్వర్యాన కేటీపీఎస్ (కొత్తగూడెం), బీటీపీఎస్ (మణుగూరు), కేటీపీపీ (భూపాలపల్లి), వైటీపీసీ (నల్లగొండ, దామరచర్ల) వంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఏటా ఈ కేంద్రాలకు లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తోంది. కానీ, ఇందుకు సంబంధించిన బిల్లులను సకాలంలో జెన్కో చెల్లించడం లేదు. ఫలితంగా గతేడాది డిసెంబర్ నాటికే బకాయిలు రూ.18,828 కోట్లకు చేరాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా జైపూర్లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్ను టీజీపీసీసీకు అమ్ముతోంది. ఇక్కడి నుంచి కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో మొత్తం బకాయిలు రూ.27,328 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.46,206 కోట్లకు చేరుకున్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఏడు నెలలుగా.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఈ ఏడాది జనవరి చివరి వారంలో కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీజీపీసీసీ, టీజీజెన్కో నుంచి రావాల్సిన బకాయిలు తొందరగా వసూలు చేసుకోవాలని, ఇందుకోసం కొంత సడలింపు ఇచ్చయినా ఏకమొత్తంగా సెటిల్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత బకాయిల అంశంపై సింగరేణిలో యాక్టివ్గా ఉన్న కార్మిక సంఘాలు ఏప్రిల్ 28న హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ఎదుట ధర్నా నిర్వహించాయి. జూన్లో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్రావు సింగరేణిలోని ప్రతీ ఏరియాలో పర్యటించిన సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన జెన్కో – సింగరేణి ఉన్నతాధికారుల సంయుక్త సమీక్షలో బకాయిల అంశానికి ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం కార్మిక లోకంలో ఏర్పడింది. రెండు శాఖలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వర్తిస్తుండడంతో ఫలితం ఆశాజనకంగా ఉంటుందని భావించారు. అదొక్కటి మినహాయించి పనితీరు మెరుగు పర్చుకోకపోతే బీఎస్ఎన్ఎల్ తరహాలో సింగరేణి చిక్కుల్లో పడుతుందని అధికారుల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రాబోయే కాలానికి తగ్గట్టుగా బొగ్గుతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ వంటి అంశాలపై ఫోకస్ చేయాలని.. హైడల్, బ్యాటరీ స్టోరేజీ పవర్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపనపై దృష్టి సారించాలని తెలిపారు. ఇలా అనేక విషయాలపై కార్యాచరణ సిద్ధం చేసినా కీలకమైన బకాయిల అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్టు సమాచారం. సింగరేణికి జెన్కో చెల్లించాల్సిన బకాయిల విషయంపై అటు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీ జెన్కో సీఎండీ హరీశ్ కానీ ఇటు సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు, ఇతర డైరెక్టర్లు చర్చకు తీసుకురానట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రెస్నోట్లోనూ ఈ అంశంపై కనీస ప్రస్తావన లేదా వివరణ కానీ లేకపోవడం గమనార్హం. పంప్డ్ స్టోరేజీ హైడల్, రాజస్థాన్లో సోలార్ పవర్, జైపూర్లో పవర్ ప్లాంట్ విస్తరణ, బ్యాటరీ స్టోరేజీ ఎనర్జీ, సోలార్ పవర్ ప్లాంట్ల విషయంలో ఇప్పటికే సింగరేణి తరఫున డీపీఆర్లు సిద్ధమయ్యాయి. బొగ్గు సరఫరాలో నాణ్యత పెంచాలంటే ముఖ్యమైన గనుల వద్ద కోల్ వాషరీ ప్లాంట్లు స్థాపించాల్సి ఉంటుంది. వీటికి కనీసం రూ.12కోట్ల వరకు వ్యయం అవుతుంది. కానీ, సరిపడా నిధులు లేకపోవడం, బకాయిలు వసూలు కాకపోవడంతో గతంలో ఆమోదించిన పనులు ముందుకు సాగడం లేదనేది సంస్థలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఫలితంగా ఇప్పుడు సూచించిన కొత్త పనులు ఎలా తలకెత్తుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.తెలంగాణకు సింగరేణి ఆత్మ వంటిందని చెబుతూనే.. ఆ ఆత్మకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి గనులను పరిశీలించడమేకాక సింగరేణి, టీజీ జెన్కో ఉన్నతాధికారులతో సంయుక్త సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బొగ్గు ఉత్పత్తి పెంపు, నాణ్యత, పోటీ నేపథ్యాన మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై సూచనలు చేసినా.. బకాయిల అంశానికి కనీస స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడం ఈ సందేహాలకు బలాన్ని ఇస్తోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
●బాబా.. ‘వేల’ వందనాలు!
గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా ఖమ్మం గాంధీచౌక్లోని వరప్రదాత షిర్డీ సాయి మందిర్లో సాయిబాబాను శుక్రవారం కరెన్సీ నోట్ల మాలలతో అలంకరించారు. తొలుత బాబాకు అన్నాభిషేకం చేశాక అలంకరించగా.. మందిరం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన చంఢీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అలాగే, రంగనాయకుల గుట్టపై ఉన్న శ్రీకృష్ణసాయి ఆశ్రమంలో గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా చైర్మన్ లగడపాటి రామారావు ఆధ్వర్యంలో చంఢీహోమం నిర్వహించారు. సాయినాథుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం, పుష్పాభిషేకం చేశాక భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. – ఖమ్మంగాంధీచౌక్ -
విద్యుత్పైనా ఎల్నినో ప్రభావం
● అప్రమత్తతతో డిమాండ్ను అధిగమించడం భేష్ ● రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మణుగూరుటౌన్/రుద్రంపూర్: ‘రాష్ట్రంలో వానాకాలం 11 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం సర్వసాధారణం. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక వేసవి మాదిరిగా అది 16 వేల మెగావాట్ల డిమాండ్ నమోదవుతోంది. ఆశించిన స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి లేకున్నా సింగరేణి, జెన్కో సంస్థలు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి ఇబ్బంది రాకుండా డిమాండ్ను అధిగమించడం అభినందనీయం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్, కలెక్టర్ అంకిత్, పినపాక, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, రాందాస్నాయక్తో కలిసి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్ల పనితీరును ఆయన పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు వినియోగం, యంత్రాల నిర్వహణ, భద్రతా ప్రమాణా లు, నిర్వహణ వ్యవస్థలపై ఆరా తీశారు. అంతకుముందు కొత్తగూడెంలో సింగరేణి, జెన్కో అధికారులతో భట్టి సమావేశమై మాట్లాడారు. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా పదేళ్ల క్రితమే బొగ్గు గనుల ఏర్పాటుకు సిద్ధం కావాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ఫలితంగా ఇప్పు డు బొగ్గు అందుబాటులో లేక ఒత్తిడి వస్తోందని తెలిపారు. అయితే, విద్యుత్ శాఖ, సింగరేణి సమన్వయంతో ముందుకు సాగుతుండడంతో సమస్య రాలేదన్నారు. ఈ మేరకు రానున్న 20 ఏళ్లలో బొగ్గు లోటు లేకుండా సింగరేణి అదనంగా కోల్ బ్లాక్లు తెచ్చుకోవడంతో పాటు దేశంలో ఎక్కడ వేలం పెట్టినా పాల్గొనాలని ఆదేశించామని భట్టి తెలిపారు. సింగరేణి ప్రయోజనాలకే ప్రాధాన్యత రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నుముకలా నిలుస్తున్న సింగరేణి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ బొగ్గు ఉత్పత్తి విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మణుగూరులోని పీకేఓసీ–2ను సింగరేణి, జెన్కో సీఎండీలు బుద్ధప్రకాశ్ జ్యోతి, హరీశ్, కలెక్టర్ అంకిత్, సింగరేణి డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 1976లో ప్రారంభమైన గని చరిత్ర, బొగ్గు వివరాలను జీఎం దుర్గం రాంచందర్ వివరించారు. మణుగూరు మనుగడ దృష్ట్యా పీకేఓసీ డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించేలా చొరవచూపాలని అధికారులు కోరా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లోని అన్ని బ్లాకులు సింగరేణికి రావాలనేదే ప్రభు త్వ ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు రాజశేఖర్రెడ్డి, అజయ్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, కార్పొరేట్ జీఎం వెంకటరమణ, అధికారులు వెంకట రామారావు, రమేశ్, రాంబాబు, మదన్నాయక్, శ్రీనివాసచారి, దయాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నిరసన ●మణుగూరుటౌన్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పీకేఓసీ వ్యూ పాయింట్ వద్ద డీప్సైడ్ బ్లాక్ ఆవశ్యకతను వివరించేందుకు రెండు రోజులుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు వేచి ఉండగా, మధ్యాహ్నం 3.30 గంటల సమయాన తొలుత వ్యూ పాయింట్ వద్దకు వెళ్తున్న కాన్వాయ్ను వెనక్కి మళ్లించిన అధికారులు కోల్ బెంచ్ వద్దకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూడా కార్మిక సంఘాలను కలవకుండానే వెనుదిరిగారు. దీంతో ఇరు యూనియన్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీతో పాటు ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణికే మణుగూరు ఓసీ డిప్ సైడ్ బ్లాక్ కేటాయించాలని నినాదాలు చేయడం విశేషం. పినపాక: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క బీటీపీఎస్ టౌన్షిప్లోని డీఏవీ హైస్కూ ల్ను శుక్రవారం ఉదయం ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నాయకులు, విద్యార్థులు ఉదయం 9 గంటలకే చేరుకోగా.. ఐదు గంటల ఆలస్యంతో మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుని ప్రారంభించి వెళ్లిపోయా రు. ఐదు గంటలు నిరీక్షిస్తే పది నిమిషాల్లో పర్యటన ముగించుకుని వెళ్లడం గమనార్హం. కాగా, స్కూల్ను ప్రారంభించాక చిన్నారులతో భట్టి మాట్లాడారు. -
ముగిసిన జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు
అశ్వాపురం: మండల కేంద్రంలోని భారజల కర్మాగారం అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయమైన గౌతమీనగర్ కాలనీలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. భారజల కర్మాగారంలోని ఒడిశాకు చెందిన అధికారులు, ఉద్యోగులతో ఏర్పడిన ఉత్కల్ పతాగర్ కమిటీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి దేవతా మూర్తులకు పూజలు చేశాక గుండి చాగర్ నుంచి ఉత్కల్ పతాగర్ మండపానికి రథంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తుల జగన్నాథ నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో భారజల కర్మాగారం ఉద్యోగులు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రంగు రంగుల సర్పం జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు సమీపాన అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ వింత సర్పా న్ని గుర్తించారు. భేతాళపాడు గ్రామపంచాయతీ పరిధి పంతులు తండాకు చెందిన రైతు ఆంగోత్ సూంకల్యా పొలానికి వెళ్లగా, మధ్యాహ్నం వేళ నీటి కోసం గుట్టపై ఉన్న శ్రీసోమన్న స్వామి ఆలయం వద్ద సెల యేరుకు బయలుదేరారు. ఈ క్రమాన మార్గమధ్యలో రంగుల్లో ఉన్న పాము కనిపించగా ఫోన్ లో ఫొటో తీశారు. సుమారు రెండు అడుగుల పొడవైన ఈ పామును గతంలో ఎన్నడూ చూడలేదని సదరు రైతు వెల్లడించాడు. ఆర్సీఓపై చర్యలు తీసుకోవాలి ఖమ్మంసహకారనగర్: జ్యోతిబాపూలే గురుకులాల ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆర్సీఓ తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ, ఉపాధ్యాయులను వేధిస్తుండడమే కాక ప్రిన్సిపాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినందున విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు బానోతు రాందాస్, ధర్మసోత్ నాగేశ్వరరావు, ఉద్దండ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఖమ్మం విద్యార్థిని ఆత్మహత్య ఖమ్మంఅర్బన్: నగరంలోని బల్లేపల్లికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. బల్లేపల్లికి చెందిన యామ మానస (20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ఆమె శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి స్వరూపారాణి బల్లేపల్లిలో గ్రామదీపికగా పనిచేస్తుండగా, తండ్రి ఖాసీం ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మానస మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే..
కామేపల్లి: సైద్ధాంతిక పునాదులపై పనిచేసే కమ్యూనిస్టులే ప్రజల సంక్షేమం, హక్కుల కోసం పోరాడుతున్నారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. కామేపల్లి, కారేపల్లి మండలాల సీపీఐ సభ్యుల శిక్షణా తరగతులు శుక్రవారం ఊట్కూరులో నిర్వహించగా ఆయన మాట్లాడారు. పార్టీ సభ్యులు నిరంతరం రాజకీయ, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపట్టాలని సూచించారు. ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్న పాలకుల తీరును ఎండగట్టాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినందున వారి సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమైందని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. సీపీఐ జిల్లా, మండల కార్యదర్శులు దండి సురేశ్, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పాపినేని సత్యనారాయణ, నాయకులు ఏపూరి లతాదేవి, ఏపూరి వెంకటేశ్వరరావు, హన్మంతరావు, సుధాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రామయ్య భూములకు రక్షణ!
● ఇళ్ల నిర్మాణాలు, విక్రయాల కట్టడిపై దృష్టి ● తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ పర్యటనలో చర్చభద్రాచలం: ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం భూముల రక్షణ కోసం త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెలంగాణ దేవాదాయ శాఖ భావిస్తుంది. ఈ అంశాన్ని గురువారం భద్రాచలం వచ్చిన శాఖ కమిషనర్ హన్మంతరావు సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో కమిటీలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోగా... దేవస్థానం భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. అంతటితో ఆగకుండా అక్రమ నిర్మాణదారులు వాటిని విక్రయానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యాన మరో కమిటీ వేసి ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించారు. పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఇటీవల పురుషోత్తపట్నంలోని రామయ్య భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలు జోరందుకుంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు సైతం కొద్ది రోజుల క్రితం సర్వే నిర్వహించారు. కొత్తగా 80కు పైగా నిర్మాణాలను జరిగాయని గుర్తించారు. వీరితో పాటుగా గతంలో ఉన్న వారికి సైతం దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ఆ భూముల్లో నిర్మించిన ఓ ఇంటినివిక్రయానికి పెట్టడం, అందుకు సంబంధించి ప్రకటన దినపత్రికలో ఇవ్వడం చర్చకు దారి తీసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాక అమ్ముతుండడం దేవస్థానం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని కమిషనర్ హన్మంతరావు దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఈఓను ఆదేశించారు. పేపర్ ప్రకటన ఆధారంగా క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సూచించారు. ఇదిలాగే కొనసాగితే పురుషోత్తపట్నంలో రామయ్య భూములు వదులుకోవాల్సిన పరిస్థితి రానున్నందున దేవాదాయ శాఖ అలసత్వం విడనాడాలని భక్తులు కోరుతున్నారు. కమిటీల ఏర్పాటుతో కాలక్షేపమే దేవస్థానం తెలంగాణలో ఉండడం, రామయ్య భూములు ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో అంతరాష్ట్ర సమస్యగా మారింది. దీనికి తోడు భూముల తమవంటే తమవని ఇటు దేవస్థానం, ఆటు రైతులు వాదిస్తుండడంతో ఎటూ తెగడం లేదు. ఈక్రమాన తెలంగాణ, ఏపీకు చెందిన పలు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటుచేసి రెండేళ్లు దాటినా ముందడుగు పడలేదు. ఇటీవల అక్రమ నిర్మాణాలను గుర్తించిన దేవస్థానం అధికారులు వాటిని తొలగించేందుకు ఏపీకి చెందిన రెవెన్యూ, పోలీసు శాఖల సహాయ సహకారాలను కోరారు. దీంతో వారు దేవస్థానం అధికారులను బుజ్జగించి ఏపీ తరఫున కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ కమిటీతో కూడా ఫలితం లేదు. ఇలా కమిటీల ఏర్పాటు చేస్తుండగానే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీ అధికారుల సహకారం లేకుండా తెలంగాణ దేవాదాయ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోందని అధికారులు చెబుతున్నారు. స్నేహపూర్వకంగానే.. రెండు తెలుగు రాష్ట్రాల పెద్దలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపితేనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికై నా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయ శాఖ, రెవిన్యూ, పోలీసు శాఖల సహాయ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు. తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు బృందంగా ఏపీలో పర్యటిస్తామని వెల్లడించినందున మరోమారు ఆశలు చిగురిస్తున్నాయి.పురుషోత్తపట్నంలో రామాలయ భూముల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. ఏపీకు చెందిన వివిధ శాఖల అధికారుల సహకారం కోరాం. అయితే, వారి నుంచి స్పందన రాలేదు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మాణాలు చేపట్టిన, విక్రయాలకు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలకు ఫిర్యాదు చేయనున్నాం. – దామోదర్రావు, ఈఓ, రామాలయం -
భారజల కర్మాగారం ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా బాల
అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగార ఉద్యో గ సంఘం అధ్యక్షుడిగా టీఎన్టీయూసీ కూటమికి చెందిన సీహెచ్.బాల ఎన్నికయ్యారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘం ఎన్నికల పోలింగ్ గురువారం జరగగా, శుక్రవారం ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఎన్టీ యూసీ – బీఎంఎస్ కూటమి, టీఆర్టీయూ – సీఐ టీయూ కూటమి, ఐఎన్టీయూసీ ఒంటరిగా పోటీ చేశాయి. టీఎన్టీయూసీ కూటమి నుంచి గౌరవ అధ్యక్షుడిగా మధమంచి వెంకటేశ్, అధ్యక్షుడిగా సీహెచ్.బాల విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్, సంయుక్త కార్యదర్శిగా రామ్చంద్ర జైస్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పన్నాలాల్ కుమావత్, కార్యాలయ కార్యదర్శిగా షేక్ హుస్సేన్అలీ, కోశాధికారిగా రాజ య్య ఎన్నికయ్యారు. ఇక సీఐటీయూ – టీఆర్టీయూ కూటమి నుంచి ఉపాధ్యక్షుడిగా యన్నా సుధీర్, సంక్షేమ కార్యదర్శిగా గాదె ఊహశ్రీ విజ యం సాధించారు. ఇక 11 ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు గాను ఎనిమిది టీఎన్టీయూసీ కూటమి, రెండు సీఐటీయూ కూటమి, ఒకటి ఐఎన్టీయూసీ దక్కించుకున్నాయి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని విజేతలు తెలిపారు. -
పంటల్లో యాజమాన్య పద్ధతులే కీలకం
బోనకల్: ఎల్నినో దృష్ట్యా ఏర్పడిన వాతావరణ పరిస్థితుల నేపథ్యాన రైతులు పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని మధిర వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త నాగస్వాతి సూచించారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పలువురు రైతుల పంటలను పరిశీలించి సూచనలు చేశారు. రైతులు స్వల్పకాలిక వరి రకాల నారును ఈ నెలాఖరు వరకు పోసుకోవచ్చని, నాట్లు వేసే వారం ముందు ఎకరాకు సరిపోయే వరి మడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలని తెలిపారు. అలాగే, పత్తికి రసం పీల్చే పురుగు, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పిండినల్లి ఆశిస్తున్నందున ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిట్రోనిల్ 1.5 మి.లీ.ను లీటర్ నీటికి కలపడంతో పాటు 19 –19–19.. 5 గ్రా. లేదా యూరియా 2 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. అంతేకాక ప్రత్యామ్నాయ పంటలుగా పెసర, మినుము, రాగి, నూనె గింజలు సాగు చేస్తే వాతావరణ పరిస్థితులను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వినయ్కుమార్, ఏఈఓ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఎల్నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి వీసీకి అదనపు కలెక్టర్ విద్యాచందన హాజరుకాగా.. ఆ ఆతర్వాత ఆమె అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ)పై స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్ భగీరథ ఈఈ నళిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు -
‘రెమిడియేషన్’ భరోసా..
కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో కనీస నైపుణ్యాలను తప్పనిసరిగా సాధించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ కీలక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కింద ‘రెమిడియేషన్’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మరింత పటిష్ఠంగా అమలు చేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. వెనుకబడిన విద్యార్థులకు చేయూత.. తరగతి గదిలో అందరు పిల్లల గ్రహణ శక్తి ఒకేలా ఉండదు. కొందరు ఇంటి వద్ద సరైన ప్రోత్సాహం లేక, హాజరుశాతం తక్కువగా ఉండడం లేదా గతంలో చెప్పిన పాఠాలు అర్థం కాకో చదువులో వెనుకబడుతుంటారు. ఇలాంటి వారిని గుర్తించి ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడమే ఈ ‘రెమిడియేషన్’ ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల లోపాలను ప్రారంభ దశలోనే సరిదిద్దేందుకు ఉపా ధ్యాయులు ప్రతి రోజూ ఒక గంట సమయం కేటాయించి, వ్యక్తిగత శ్రద్ధతో లక్ష్యాధారిత బోధన సాగించనున్నారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ‘బేస్లైన్’ పరీక్ష ఆధారంగా కూడా వెనుకబడిన విద్యార్థులను గుర్తించనున్నారు. రోజుకొక సబ్జెక్టు విద్యార్థులపై నేర్చుకునే వేగం విషయంలో ఎలాంటి ఒత్తిడి పడకుండా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఓ ప్రత్యేక విద్యా క్యాలెండర్ రూపొందించింది. దీని ప్రకారం సాధారణ బోధనతో పాటు, ప్రత్యేకంగా కేటాయించిన సమయంలో వారంవారీగా ప్రణాళిక అమలు చేస్తారు. సోమ, మంగళవారాల్లో తెలుగు భాషపై, బుధ, గురువారాల్లో గణితంపై, శుక్ర, శనివారాల్లో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ప్రతి చిన్నారీ తమ నైపుణ్యం అనుగుణంగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తారు. చివరి దశకు చేరిన శిక్షణ ఈ బృహత్తర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీగా ఉపాధ్యాయులకు, సీఆర్పీలకు దశలవారీగా శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో హైదరాబాద్లోని టీజీఐఈఆర్డీలో ఈ నెల 6, 7, 8వ తేదీల్లో, జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో మొత్తం 90 మంది రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. ఆపై 21 నుంచి 23వ తేదీ వరకు మొదటి విడతలో కొన్ని మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తికాగా.. 24 నుంచి 26వ తేదీ వరకు రెండో విడతలో మిగతా మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగతోంది.బడి పిల్లల భవితకు కార్యక్రమం జిల్లాలోని ఏ ఒక్క విద్యార్థి చదువులో వెనుకబడకూడదనేదే విద్యాశాఖ ప్రధాన లక్ష్యం. గ్రామీణ నేపథ్యాల వల్ల కొందరు విద్యార్థుల్లో వెనుకబాటుతనం కనిపిస్తోంది. దాన్ని అధిగమించేందుకే ఈ రెమిడియేషన్ విధానం. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రతి రోజూ కేటాయించిన ఒక గంట సమయంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి పంపించడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. –టి.మాధవరావు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి -
మా రామయ్య.. బంగారం!
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. మూలమూర్తులను దాతలు సమర్పించిన స్వర్ణకవచాలతో ప్రతీ శుక్రవారం అలంకరిస్తారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి కి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రాధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతంతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్కు అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ రాఘవచార్యుల దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే, జగన్నాథపురం గ్రామానికి చెందిన బానోతు కోట్యి – సాలి దంపతులు అమ్మవారి అలంకరణ కోసం రూ.98వేల విలువైన బంగారు ముక్కెరను ఈఓకు అందజేశారు. కాలేజీలో ప్రవేశాలు, హాజరుపై దృష్టిదుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రవేశాలు పెంచడమే కాక విద్యార్థులంతా హాజరయ్యేలా అధ్యాపకులు దృష్టి సారించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హెచ్.వెంకటేశ్వరరావు సూచించారు. దుమ్ముగూడెం కాలేజీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన పలు అంశాలపై సూచనలు చేశారు. కాలేజీల్లో నాణ్యమైన బోధనతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలుపై ప్రచారం చేస్తూ ప్రవేశాలు పెంచాలని తెలిపారు. అంతేకాక చేరిన ప్రతీ విద్యార్థి వివరాలు యూ డైస్లో నమోదు చేసి క్రమం తప్ప క హాజరయ్యేలా చూడాలని చెప్పారు. ఆతర్వా త విద్యార్థులతో మాట్లాడిన డీఐఈఓ క్రమం తప్పకుండా కళాశాలకు వస్తూ పాఠ్యాంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపాల్ సీహెచ్.కృష్ణవేణి, అధ్యాపకులు వరరాజు,పవన్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టెన్సింగ్ నార్కే పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానంసూపర్బజార్(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ఇచ్చే టెన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారానికి సాహస క్రీడారంగంలో ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో సాహస క్రీడల రంగంలో విశేష ప్రతిభ చూపిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలతో https: awards. gov. in వెబ్సైట్ ద్వారా ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పర్వతారోహణ, రాక్ క్లైంంబింగ్, ట్రెక్కింగ్, నదీ, సముద్ర సాహస క్రీడలు, పారా గ్లైౖడింగ్, స్కైడైవింగ్ తదితర సాహస క్రీడల్లో విశేష విజయాలు సాధించిన వారు అర్హులని డీవైఎస్ఓ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు
● నీటి ఎద్దడిని తట్టుకునే రకాల ఎంపిక మేలు ● ఖమ్మం ఇన్చార్జ్ ఉద్యాన అధికారి అనితశ్రీ ఖమ్మంవ్యవసాయం: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందుకోసం అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, తక్కువ నీటి వినియోగం, సాగు ఖర్చు తక్కువ కలిగి నీటి ఎద్దడి తట్టుకునే కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు మంచిదని జిల్లా ఇన్చార్జ్ ఉద్యాన అధికారి అనితశ్రీ వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆమె వెల్లడించిన వివరాలు.. రైతులు తీసుకోవాల్సిన చర్యలు వర్షాలు స్థిరంగా వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలి. తక్కువ కాలంలో పండే, కరువును తట్టుకునే పంటలు ఎంచుకోవాలి. పత్తి, మొక్కజొన్నతో పాటు కంది, పెసర, మినుము, కొర్ర, సజ్జ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి. అలాగే, అంతర పంటలు సాగు చేస్తూ, కలుపు నివారణ, మల్చింగ్ ద్వారా నేల తేమను సంరక్షించాలి. వర్షపు నీటి నిల్వలకు ఫామ్ పాండ్లు తవ్వించాలి. యాజమాన్య చర్యలు నల్ల రేగడి నేలల్లో తేమ సంరక్షణ కోసం 120 సెం.మీ. వెడల్పుతో బోదెలు, 60 సెం.మీ. వెడల్పు, 30 సెం.మీ. లోతు కాల్వలు ఏర్పాటు చేయాలి. మధ్యస్థ లేదా తేలికపాటి నేలల్లో బోదెలు, కాల్వల పద్ధతులు అనుసరించాలి. కలుపు నియంత్రణ, నేల తేమ సంరక్షణ కోసం తరచూ అంతర దుక్కులు చేయాలి. వర్షాల సమయాన సిఫారసు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేయాలి. దీర్ఘకాలిక బెట్ట పరిస్థితుల్లో 2 లేదా ఒక శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 2–3 సార్లు పిచికారీ చేయాలి. వర్షాభావంలో కూరగాయల సాగు వర్షాభావ పరిస్థితులలో కూరగాయ పంటలు సాగుచేయడం మేలు. టమాటా, వంగ, బెండ, చిక్కుళ్లు, పాలకూర, తోటకూర, మునగ, బీర, సొర, కాకర, దోస, పచ్చి మిర్చి వంటి రకాలు ఈ పరిస్థితిని తట్టుకుంటాయి. ఉద్యానశాఖ రాయితీలు ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నీటిని పొదుపు చేసుకోవచ్చు. ఉద్యాన శాఖ ఎకరాకు రూ.8 వేల సబ్సిడీతో కూడిన మల్చింగ్ అందిస్తోంది. కూరగాయ పందిర్ల సాగుకు 50 శాతం రాయితీపై ఎకరానికి రూ.10 వేల వరకు అందిస్తోంది. డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది. అధిక దిగుబడినిచ్చే పండ్ల తోటల రకాల విస్తీర్ణం పెంపకంలో భాగంగా మామిడి, జామ, అరటి, బొప్పాయి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ లాంటి తోటలకు 40 శాతం రాయితీ కల్పిస్తోంది. -
భూసార పరీక్షలతో మెరుగైన ఫలితం
జూలూరుపాడు/చండ్రుగొండ: ప్రతీ రైతు భూసార పరీక్ష చేయించి వచ్చే నివేదిక ఆధారంగా పంటల ఎంపిక, ఎరువుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని హైదరాబాద్లోని భారతీయ వరి పరి శోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కవిరాజు, హైదరా బాద్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్(ఎఫ్పీఓ) నిపుణురాలు అరుంధతి సూచించారు. జూలూరుపాడు, చండ్రుగొండ మండలం గానుగపాడులో శుక్రవా రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా వారు పలువురు రైతుల భూమిలో పరీక్షలు చేసి లోపాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంతేకాక రైతులకు ఉచితంగా మట్టి నమూనాల పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. కాగా, వరి సాగుచేసే రైతులు కరివేద విధానం పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందొచ్చని చెప్పా రు. ఈకార్యక్రమాల్లో సొసైటీల చైర్మన్లు కొమ్మినేని పాండురంగారావు, చెవుల చందర్రావు, సీఈఓలు శివ, లంకా నర్సింహారావు, డైరెక్టర్లు రెడ్డిబోయిన రాము, లకావత్ హేమ్లా, భూక్యా జవహర్లాల్, శీరంశెట్టి రామారావు, పాపిన్ని వెంకయ్య, మనుబోలు తిరువెంగళరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రామాలయ ఉద్యోగి మృతి
సీఆర్పీఎఫ్ వాహనం ఢీకొట్టడంతో ఘటన భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం రికార్డ్ అసిస్టెంట్ కటకాల రామిరెడ్డి (47) శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఏపీలోని ఎటపాక మండలం నెల్లి పాక జంక్షన్ వద్ద రామిరెడ్డి ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటుతుండగా సీఆర్పీఎఫ్ వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కింద పడి స్పృహ కోల్పోయిన ఆయనను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఏపీలోని పోలవరం జిల్లా వరరామచంద్రాపురం మండలం కొట్టారుగొమ్ము గ్రామానికి చెందిన రామిరెడ్డి 2013లో భద్రాచలం దేవస్థానంలో ఉద్యోగిగా చేరాడు. అప్పటి నుంచి భద్రాచలంలో నివాసం ఉంటున్నా ఏడాది క్రితం పోలవరం ప్యాకేజీ వస్తుందనే సమాచారంతో ఎటపాక మండలం రామగోపాలపురంలో ఉంటూభద్రాచలానికి రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమా న శుక్రవారం కూడా వచ్చి తిరిగివెళ్తూ మృత్యువాత పడ్డాడు. ఆయన మృతిపై ఆలయ ఈఓ కె.దామోదర్రావు, ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు సంతాపం తెలిసి కుటుంబీకులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ..ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐటీఐ కళాశాల వద్ద శుక్రవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగు నరేశ్ (45) మృతి చెందాడు. ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నరేశ్ను వెనుకగా వేగంగా వచ్చిన లారీ నేరుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలాన్ని సీఐ సురేశ్ సందర్శించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య గీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతున్న సర్పంచ్ మృతిమృతదేహంతో భద్రాచలంలో ఆందోళన పాల్వంచరూరల్/భద్రాచలం అర్బన్: కుడి కాలికి వాపు రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన మహిళా సర్పంచ్ పరిస్థితి విషమించి మృతిచెందింది. సర్పంచ్ భర్త ప్రేమ్కుమార్ కథనం మేరకు.. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ సోడే వెంకటరమణ(36) మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడగా భద్రాచలంలో మోహన్రావు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. ఇటీవల అదే కాలుకు వాపు రావడం గమనించి బుధవారం మోహన్రావు ఆస్పత్రిలో చేర్పించారు. ఇన్ఫెక్షన్ మరింత పెరగడంతో ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు అంబులెన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి శుక్రవారం తరలించగా చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, చికిత్స లోపమే తన భార్య మృతికి కారణమని ఆరోపించిన ప్రేమ్కుమార్.. మృతదేహంతో శుక్రవారం రాత్రి నేరుగా భద్రాచలంలోని మోహన్రావు ఆస్పత్రి వద్దకు వెళ్లి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకుని చర్చిస్తున్నారు. కాగా, సర్పంచ్ మృతిపై ఎంపీడీఓ పి.రాజారావు, ఎంపీఓ షబ్నా సంతాపం తెలిపారు. -
ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
చుంచుపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు, బాలింతల విషయమై నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేసి పలు విభాగాలను పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, ఉద్యోగులతో సమావేశమైన కలెక్టర్.. రోజువారీ ఓపీ, ప్రసవాలు, మందుల లభ్యతపై చర్చించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసమే రీసర్వే పాల్వంచ: రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం భూముల రీసర్వే చేయిస్తోందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. పాల్వంచ పరిధి కరకవాగులోని సర్వే నంబర్ 727లో చేపట్టిన సర్వేను గురువారం ఆయన పరిశీలించి సర్వే విధానం, భూముల హద్దుల నిర్ధారణపై అధికారులతో చర్చించారు. ప్రతిరోజూ 40 నుంచి 50 ఎకరాల మేర భూములకు సర్వే చేస్తుండగా, ఇప్పటి వరకు 580 ఎకరాల్లో పూర్తయిందని ఉద్యోగులు తెలిపారు. అయితే, కచ్చితత్వం, పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించిన కలెక్టర్.. రైతులు సహకరించాలని తెలిపారు. తహసీల్దార్ దారా ప్రసాద్, సర్వేయర్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్సీసీతో నాయకత్వ లక్షణాలు సూపర్బజార్(కొత్తగూడెం): యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేందుకు నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ అంకిత్ అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా ఎసైంటియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జిల్లాలోని 25 ఎన్సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రిని సమకూర్చింది. ఇందులో డమ్మీ తుపాకులు తదితర సామగ్రి ఉండగా కలెక్టరేట్లో కలెక్టర్ అందజేసి మాట్లాడారు. ఎన్సీసీ తీర్చిదిద్దిన యువత భవిష్యత్లో పలు రంగాల్లో రాణించడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, 11వ తెలంగాణ బెటాలియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
సూపర్బజార్(కొత్తగూడెం): ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా గేట్లు తోసుకుని లోపలకు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. నాయకులు ప్రధాన ద్వారం గేట్లు ఎక్కి అధికారులు బయటకు రావాలని నినాదాలు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏఓ రామకృష్ణ వినతిపత్రాన్ని స్వీకరించారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ.. విద్యారంగం, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు మంజూరు కాక విద్యార్థులు ఇబ్బంది పడుతూ చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యాశాఖకు మంత్రిని నియమించి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఇనపల్లి పవన్సాయి, గుండాల సుజన్, గుగులోత్ వంశీ, మాణిక్యాల వినయ్, అక్కినపల్లి నాగేంద్రబాబు, కొరిమి సంజయ్ పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలకు డిమాండ్ -
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
మణుగూరుటౌన్/పినపాక/అశ్వాపురం/కరకగూడెం: ఎఫ్ఎల్ఎన్ (పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం) కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలని డీఈఓ డి.వాసంతి సూచించారు. మణుగూరు, పినపాక, అశ్వాపురం మండలం మిట్టగూడెం, కరకగూడెంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. వృత్యంతర శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో అమలుచేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రతీ విద్యార్థిలో కనీస సామర్థ్యాలు పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి టి.మాధవరావు, ఎంఈఓలు స్వర్ణజ్యోతి, కొమరం నాగయ్య, వి.వీరస్వామి, మంజులతో పాటు ఆర్పీలు రాజేశ్వరరావు, కృష్ణయ్య, బాబూరావు, షాలిని, సూర్యనారాయణ, భావ్సింగ్, తిరుమల్రావు, గోపాలకృష్ణ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి -
వేగంగా, కచ్చితంగా పరీక్షలు
రుద్రంపూర్: సింగరేణి గనుల్లో తవ్వకాల సందర్భంగా వెలువడే ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జియోసైన్స్ ల్యాబోరేటరీని కొత్తగూడెం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్లో అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణకు చేసే పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఈ ల్యాబ్ ద్వారా ఖనిజ నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ వేగంగా పూర్తికావడమే కాక కచ్చితమైన ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. సింగరేణిలో శాసీ్త్రయ పరిశోధనలకు ప్రోత్సాహం, గనుల్లో ఆధునికత కోసం అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, సింగరేణి డైరెక్టర్లు గౌతం పొట్రు, సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్రావు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, నాయకులు నాగా సీతారాములు తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై వినతులు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఇనపనూరి నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిలో 25 ఏళ్లుగా దాదాపు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నందున కోలిండియా మాదిరి హైపవర్ వేతనాలు చెల్లించాలని లేదా జీఓ 22 అమలు చేయాలని కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. అలాగే, కొత్తగూడెం వెళ్లే క్రమాన భట్టి రామవరంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోత్కూరి ధర్మారావు ఇంటికి వచ్చారు. ఆయనకు ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా మొక్క అందజేయగా భట్టి అభినందించారు. కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, మార్కెట్ చైర్మన్ లాల్సింగ్, నాయకులు మోత్కూరి లక్ష్మి ఝాన్సీరాణి, కుసుమ శ్రీనివాసరావు, దశరథ్ రజువా తదితరులు పాల్గొన్నారు. -
36 పోస్టులు.. 750 దరఖాస్తులు!
పాల్వంచరూరల్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 36 ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక విధానంలో భర్తీ చేసేందుకు అధికారులు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. అనూహ్యంగా 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరికి గురువారం పాల్వంచలోని గురుకుల బాలుర కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయగా 450 మంది హాజరయ్యారు. ఈ మేరకు టెంట్, కుర్చీలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారి పేర్లతో జాబితాను ఇంటర్ నోడల్ అధికారి, డీఈఓలకు పంపించామని గురుకులాల జోనల్, సమన్వయ అధికారులు అపర్ణ, కె.వెంకటేశ్వర్లు తెలిపారు. -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం శుక్రవారం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం పూర్తిచేశారు. రేపు శ్రీరామాత్మక వరుణయాగం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం శ్రీరామాత్మక వరుణయాగం నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్రావు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటతో సుబిక్షంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వం, వైదిక పెద్దల సూచనల మేరకు ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం 8–30నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు యాగం ఉంటుందని తెలిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన చేశాక హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. పూజల్లో ఆలయ ఈఓ విజయ్కుమార్, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా మూడు జీపీలు మల్లారంలో పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ డీసీ పినపాక: రాష్ట్రంలో అన్ని పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దశల వారీగా నిధులు కేటాయిస్తోందని పంచాయతీ శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ తెలిపారు. ఈ మేరకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పినపాక మండలం మల్లారం, అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం, దుమ్ముగూడెం మండలంలోని బి.కొత్తగూడెంను ఎంపిక చేశామని వెల్లడించారు. ఇందులో భాగంగా మల్లారంలో శుక్రవారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనులు, ప్రణాళికలపై డీపీఓ అనూష, ఎంపీడీఓ సంకీర్తతో చర్చించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసే ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుంటే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఈ–బయ్యారంలో నిర్మాణం పూర్తయిన జీపీ భవనాన్ని పరిశీలించగా, కొత్తగా ఏర్పడిన అన్ని జీపీలకు భవనాలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. రామాలయంలో అన్నదానానికి రూ.6లక్షల విరాళం భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన కొనసాగుతున్న నిత్య అన్నదానానికి ఇద్దరు భక్తులు గురువారం రూ.6 లక్షల విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన మహేందర్ చౌదరి తన మనవడు సుంకర వేదాంత్ కార్తీక్ పేరుపై రూ.5,00,005, అమెరికాకు చెందిన నల్లమోతు గాయత్రి రూ.లక్ష విరాళం చెక్కులను అధికారులకు అందజేశారు. అనంతరం దాతలు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వీరికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు. -
సాగర్ ప్రధాన కాల్వకు మరమ్మతులు
● రూ.కోటి వ్యయంతో అంచనాలు సిద్ధం ● డిజైన్కు విరుద్ధంగా నీటి ప్రవాహమే కారణం? ఖమ్మంఅర్బన్: భద్రాద్రి జిల్ల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకం పంప్హౌస్ల నుంచి మోటార్ల ద్వారా ఏన్కూరు రాజీవ్ లింక్ కెనాల్ నుంచి నాగార్జునసాగర్ ప్రధాన కాల్వలోకి గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఈ క్రమాన పలు సమస్యలను జలవనరుల శాఖ అధికారులు గుర్తించారు. సాగర్ ప్రధాన కాల్వలో పలుచోట్ల నీరు.. కట్టను ఆనుకుని ప్రవహిస్తుండడంతో ముందస్తు మరమ్మతులకు సిద్ధమవుతున్నారు. ఏన్కూరు నుంచి ఖమ్మం వరకు సాగర్ ప్రధాన కాల్వ ద్వారా సుమారు 1,500 క్యూసెక్కుల మేర నీటిని పంపింగ్ చేస్తుండగా ఖమ్మం చేరే వరకు 200 క్యూసెక్కుల మేర చేరుతోందని చెబుతు న్నారు. అయితే, నీటి ప్రవాహం ఒత్తిడితో కొన్ని ప్రాంతాల్లో కాల్వ కట్టలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. సాగర్ కాల్వల డిజైన్కు భిన్నంగా షట్టర్ల వద్ద నీటిని నిల్వ చేసి ఎగువకు ప్రవహింపజేస్తుండడమే ఈ పరిస్థితికి కారణమని గుర్తించినట్లు సమాచారం. ఏన్కూరు నుంచి తిమ్మరావుపేట వరకు, వి.వెంకటాయపాలెం సమీపాన ప్రధానంగా సమస్య ఏర్పడిందని.. బ్యాంకింగ్ ఉన్న ప్రాంతాల్లో కట్టలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిసింది. ఏదిఏమైనా ప్రమాదాలు జరగకముందే సమస్యాత్మక ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఏన్కూరు నుంచి ఖమ్మం వరకు 12 కి.మీ. మేర కాల్వ కట్టలకు మరమ్మతులు అవసరమని గుర్తించగా.. రూ.కోటితో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి రాగానే ఒకటి, రెండు రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశముందని సమాచారం. -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
చర్ల: గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. చర్ల మండలం దేవరపల్లి, ఆర్.కొత్తగూడెం, సత్యనారాయణపురం గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా దేవరపల్లి, సత్యనారాయణపురం, దానవాయిపేటలోని పాఠశాలల్లో మొక్కలు నాటిన ఆమె ఆర్.కొత్తగూడెంలో ఇంకుడుగుంతల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో సీఈఓ గ్రామాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. అంతేకాక ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతల ఏర్పాటు, మొక్కలు నాటేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సర్పంచ్లు తెల్లం సుజాత, తుర్రం రవికుమార్, చిక్కాల గౌతమి ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ మూర్తి, ఉద్యోగులు లక్ష్మీదుర్గ, సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి -
లారీని ఢీకొట్టిన టిప్పర్
సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం లంకపల్లి సమీపాన జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొగ్గు టిప్పర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు టిప్పర్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్, చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన ఎస్.కె.ఖలీల్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో వీఎం బంజర పోలీసులు చేరుకుని స్థానికుల సహకారంతో అరగంట పాటు శ్రమించి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బొగ్గు లోడింగ్ కోసం వెళ్తున్న సమయాన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ముగ్గురు మహిళలకు జైలు శిక్ష.. భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని ఓ జ్యూయలరీ దుకాణంలో 2025 జూలై 7న ముగ్గురు మహిళలు రూ.30 వేలు విలువ గల వెండి వస్తువులు చోరీ చేసిన ఘటనలో వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ గురువారం తీర్పు చెప్పారు. ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధించారు. వివరాలిలా ఉన్నాయి. భూక్యా కేల, గుగులోతు మీరా, భూక్యా వసంత జ్యూయలరీ దుకాణంలో చోరీ చేయగా.. బర్ల నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. -
23.100 కేజీల గంజాయి స్వాధీనం
కల్లూరురూరల్: కల్లూరు శివారులో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఐదుగురితో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.55 లక్షల విలువైన 23.100 కేజీల గంజాయితో పాటు ఒక ఆటో, రెండు బైక్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆమె వెల్లడించిన వివరాలు.. కల్లూరు ఎస్ఐ డి.హరిత, సిబ్బందితో గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శివార్లలో కొందరు వ్యక్తులు కనిపించారు. పోలీసులను చూసి వీరు పారిపోయే ప్రయత్నం చేయగా వెంటబడి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు. పట్టుబడిన వారి వద్ద 23 కేజీలకు పైగా గంజాయి లభించిందని ఏసీపీ తెలిపారు. పాల్వంచలో నివాసముండే ఆటో, కారుడ్రైవర్లు మహమ్మద్ అన్వర్, వజీర్ఖాన్, కల్లూరు వాసి ముజాహిద్ బాషా, హైదరాబాద్లోప్రైవేట్ ఉద్యోగం చేసే దేవర రాకేశ్, సికింద్రాబాద్కు చెందిన బట్టల వ్యాపారి మహమ్మద్ ఆదిల్ పట్టుబడగా, ఒడిశా మల్కాన్గిరికి చెందిన రాజు, కార్తీక్ పారిపోయారని వెల్లడించారు. కాగా, అన్వర్ ఒడిశాలో రాజు, కార్తీక్ వద్ద గంజాయి తీసుకొచ్చి పాల్వంచ, కొత్తగూడెంలో ఎక్కువ ధరకు అమ్మేవాడని, ఓసారి జైలుకు వెళ్లివచ్చాక రాకేశ్కు కేజీ రూ.12 వేలు చొప్పున అమ్మడం మొదలుపెట్టాడని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన సత్తుపల్లిరూరల్ సీఐ ముత్తు లింగయ్య, కల్లూరు ఎస్ఐ హరిత, సిబ్బంది నర్సింహారావు, రంగారావు, రఫీ, విజయకాంత్, ఎ.ప్రసాద్ను ఏసీపీ వసుంధర అభినందించారు. కల్లూరులో ఐదుగురి అరెస్ట్ -
రూ.1.24కోట్ల విలువైన బియ్యం మాయం
● విజిలెన్స్ తనిఖీల్లో బయటపడిన అక్రమాలు ● అరుణాచలం మిల్లు యజమాని అరెస్ట్, రిమాండ్ నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచలం శివ రైస్మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల తనిఖీ సందర్భంగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ మేరకు మిల్లు యజమాని కిరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మండలంలోని రాజేశ్వరపురం వద్ద ఉన్న అరుణాచలం శివ రైస్మిల్లులో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం డీఎస్పీ ఆధ్వర్యాన సోదాలు చేపట్టింది. సీఎంఆర్ విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యాన రికార్డుల ఆధారంగా ధాన్యం స్టాక్ ఉందా, లేదా పరిశీలిస్తూ లాట్లను లెక్కించారు. ఈక్రమాన 442 మె.టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు తేల్చారు. దీని విలువ దాదాపు రూ.1,23,96,160 కావడం, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు గుర్తించి బుధవారం రాత్రే మిల్లు యజమాని ఓరుగంటి కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి ఫిర్యాదుతో గురువారం నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా, వైద్యపరీక్షల అనంతరం ఆయనను రిమాండ్కు తరలించారు. అయితే, రూ.కోట్ల విలువైన అక్రమాలు జరుగుతున్నా జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు ఇన్నాళ్లు గుర్తించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
భూవివాదం.. నిరసన పర్వం
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధి హనుమంతులపాడులో రెండు కుటుంబాల మధ్య భూవివాదం సుదీర్ఘకాలంగా సాగుతోంది. తహసీల్, పోలీస్స్టేషన్లను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. గ్రామానికి చెందిన గడబోయిన సత్యం తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో 34 గుంటలు తనఖా పెట్టి రావుల సత్యమ్మ నుంచి రూ.45 వేలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. అయితే, తనఖా పెట్టలేదని తనకు విక్రయించారని సత్తెమ్మ వాదిస్తోంది. ఈ క్రమాన సత్తెమ్మ చేను దున్నుతుండగా, అడ్డుకున్న సత్యం కుటుంబ సభ్యులు పొలంలోనే గుడారం వేసుకుని ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమాన సత్తెమ్మ కూడా అదే భూమిలో బైఠాయించింది. ఐదు రోజులుగా సాగుతున్న ఈ వివాదంపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు అందినా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పొలంలోనే ఐదు రోజులుగా బైఠాయింపు -
ముగిసిన ఉద్యోగ సంఘం ఎన్నికలు
అశ్వాపురం: మండల పరిధిలోని మణుగూరు భారజల కర్మాగారం ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం ముగిశాయి. కర్మాగారంలోని క్యాంటీన్–1లో పోలింగ్ నిర్వహించగా, 412 మంది ఉద్యోగులకు గాను 364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, 14 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. పోలైన ఓట్లను శుక్రవారం లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల అధికారిగా భారజల కర్మాగారం సైంటిఫిక్ అధికారి మయాంక్చౌదరి వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులను అభినందించిన ఎస్ఈ సూపర్బజార్(కొత్తగూడెం): ట్రాన్స్కో – డిస్కం ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నీ ఇటీవల హనుమకొండలో జరగగా ఉమ్మడి జిల్లా జట్టు వరుసగా ఆరోసారి విజేతగా నిలిచింది. కెప్టెన్గా వ్యవహరించిన ఉద్యోగి ఆర్.శ్రీనివాసరాజు తదితరులను విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ గురువారం కొత్తగూడెంలో అభినందించారు. జట్టు సభ్యులు జి.వెంకటేశ్వరరావు, ఎన్.సతీశ్, పి.శివ, కె.రామ్కుమార్, ఎస్.భాస్కర్, జి.శివాజీతో పాటు డీఈలు పీఎస్వీఎస్ నందయ్య, కె.జీవన్కుమార్, జి.రంగస్వామి, బి.వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ శ్రీధర్ పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో 125 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీ, అనాథ అభ్యర్థులకు గ్రూప్–1, 2, 3, 4తో పాటు బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీస్ నియామక పరీక్షలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. హాజరుశాతం ఆధారంగా స్టైఫండ్ కూడా మంజూరవుతుందని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని.. డిగ్రీ మార్కులు, రిజర్వేషన్లు, సీట్ల లభ్యత ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. అయితే, రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, గతంలో స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అనర్హులని తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు www. tgbcstudycircle. cgg. gov. in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 18 జాబితా ప్రకటించి, 20న సర్టిఫికెట్లు పరిశీలించాక 25వ తేదీ శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో లేదా 08742–227427, 94419 31359, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ భద్రాచలంటౌన్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరుగుతున్న జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. టోర్నీలో తెలంగాణ రాష్ట్రం క్లాసిక్ విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా, బృందంలో జిల్లా క్రీడాకారులే అత్యధిక పతకాలు సాధించారని పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మల్లేశ్ నాలుగు స్వర్ణ పతకాలు, డీవీ శంకరరావు, ఎండీ అబ్బాస్ ఎనిమిది చొప్పున రజత పతకాలు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు. అలాగే శేషు కాంస్య పతకం సాధించగా, కరుణాకుమార్ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారని తెలిపారు. క్రీడాకారులను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్రెడ్డితో పాటు డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, మహంతి వెంకటకృష్ణాజీ, శోభన్నాయక్ తదితరులు అభినందించారు. ఉత్సాహంగా... ఉల్లాసంగా కొనసాగుతున్న యోగా పోటీలు కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రీజినల్ స్థాయి యోగా పోటీలు గురువారం రెండో రోజుకు చేరాయి. ఈ పోటీలకు రీజియన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన 288 మంది విద్యార్థులు హాజరు కాగా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు యోగా విన్యాసాలతో ప్రతిభ చాటుతున్నారు. పోటీలను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, యోగాసన భారత్ జాతీయ సహాయ కార్యదర్శి నందనం కృపాకర్, ప్రసన్నకుమార్, రామిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ
జిల్లాలో 3,714 వాహనాల తనిఖీసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో గురువారం ఉదయం రెండు గంటల పాటు పోలీసులు ప్రత్యేక నాకా బందీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. మొత్తంగా 3,714 వాహనాలను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ లేని 510 మంది, కార్లలో సీటు బెల్ట్ ధరించని 106 మందితో పాటు మైనర్లు నడిపిన 14 వాహనాలను గుర్తించారు. అంతేకాక నంబర్ ప్లేట్ మార్చిన 308 వాహనాలు, సైలెన్సర్ మార్చిన నాలుగు వాహనాలు గుర్తించడమే కాక ఏడుగురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన పోలీసులు... 22 వాహనాలను సీజ్ చేశారు. అలాగే, నిబంధనలు ఉల్లంఘించిన 764 మందికి చలాన్లు విధించడమే కాక 1,567 వాహనదారుల నుంచి జరిమానా వసూలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిస్తే ప్రజలు పోలీసులకు తెలియచేయాలని సూచించారు. -
దారిపొడవునా లారీలు, టిప్పర్లు
మణుగూరుటౌన్: మండలంలోని రాజుపేట మీదుగా రాకపోకలు సాగించే ఇసుక లారీలు, బొగ్గు టిప్పర్లను డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. గురువారం అలాగే నిలిపివేయడంతో కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. లారీ కాంటా నుంచి రాజుపేట వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మిగతా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పాఠశాలలకు వెళ్లాల్సిన బస్సులు సైతం అరగంటకు పైగా నిలిచిపోయాయి. ఇసుక రీచ్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా లారీలకు అనుమతిస్తుండడంతో తరచూ ఈ పరిస్థితి ఎదురవుతున్నందున పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎంతో ఊహించా.. ఇంతేనా?!
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, పునర్ధురణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఊహించుకుని వస్తే ఇక్కడ ఆ పరిస్థితి లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు పేర్కొన్నారు. భద్రాచలానికి గురువారం వచ్చిన ఆయన చిత్రకూట మండపంతో పాటు కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులను పరిశీలించారు. మొదలుపెట్టి నెల దాటినా కనీసం పనులు జరగకపోవడంపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నందున, ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నాటికి ఉత్తర దిక్కున పనులు చేపట్టి వేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాక పుష్కరాల నాటికి మొత్తం పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇక నిత్యకల్యాణ వేదిక మార్చాలని సూచించినా తాత్కాలిక వేదిక పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నందున యంత్రాల సంఖ్య పెంచి రాత్రింబవళ్లు పూర్తి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ భద్రాచలంలో అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్లు కమిషనర్ హన్మంతరావు ఈ సందర్భంగా విలేకరులకు వెల్లడించారు. వారం రోజులకోసారి ఈఓ ఆధ్వర్యాన పునరుద్ధరణ కమిటీ సమావేశం, 15 రోజులకోసారి కమిషనర్ స్థాయిలో, నెలకోమారు మంత్రుల స్థాయిలో సమీక్ష ఉంటుందని తెలిపారు. అంతేకాక పనులు జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చనుండగా, హైదరాబాద్ నుంచి పర్యవేక్షణ సులభతరమవుతుందని చెప్పారు. పనుల్లో అప్పటికప్పుడు కొన్ని మార్పులు సహజమేనని, అన్నీ సరైన సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. రూ.270 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చేపడుతామని వెల్లడించారు. అలాగే, పురుషోత్తపట్నంలోని రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణదారులు, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యేలా ఫిర్యాదు చేయాలని ఈఓకు సూచించారు. అంతేకాక త్వరలో ఆ భూములను ఏపీ సర్కారు సహకారంతో పరిశీలిస్తామని వెల్లడించారు. రామాలయ పునరుద్ధరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్పై అధికారుల్లో ఉన్న అయోమయం గురువారం మరోమారు బయటపడింది. ఉత్తర ద్వారం వేదికతో పాటుగా ప్రాకారాలు, చిత్రకూట మండపం తరలింపుపై ఇప్పటికీ పూర్తి స్థాయి ప్లాన్ తనకు అందించలేదని కాంట్రాక్టర్ చెప్పగా.. వెంటనే మార్పులను పూర్తి చేసి వెంటనే అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. కాగా, మాస్టర్ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించాలని మీడియా ప్రతినిధులు పేర్కొనగా, అందరికీ వివరించాలని అధికారులకు సూచించారు. కాగా మాస్టర్ ప్లాన్లో అస్పష్టతపై ఇప్పటికే ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. తొలుత భద్రాచలం వచ్చిన కమిషనర్ రామాలయంలో ప్రత్యేక పూజలు చేయగా పండితులు వేదాశీర్వచనం, ఈఓ దామోదర్రావు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్కిటెక్, ఆర్అండ్బీ, దేవస్థానం ఇంజనీర్లు పాల్గొన్నారు. -
కూల్చివేశారు.. మళ్లీ కడుతున్నారు..
ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) గైడ్వాల్ నిర్మాణంలో డొల్లతనం నిజమేనని అధికారులు అంగీకరించినట్లయింది. నిర్మాణ దశలోనే పలుచోట్ల గోడలు బీటలు వారడం, పగుళ్లు వచ్చాయని ‘సీతారామ గైడ్వాల్కు బీటలు’శీర్షికన గత ఏడాది ఏప్రిల్ 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఇన్నాళ్లు పెద్దగా స్పందించని అధికారులు.. ఇప్పుడు గోదావరి జలాల ఎత్తిపోతలు మొదలుకావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. కొన్నాళ్లకే.. ములకలపల్లి మండలంలోని పంప్హౌస్–2 (వీ.కే.రామవరం) నుంచి పంప్హౌస్–3 (కమలాపురం)కు వెళ్లే మెయిన్ కెనాల్పై రామాంజనేయపురం శివారులో బీటీ రోడ్డుపై వంతెన నిర్మించారు. ఈ వంతెన దాటి కమలాపురం వెళ్లే ప్రధాన కాల్వపై ఎగువ ప్రాంతంలో వరద కాల్వ దాటేందుకు మరో సూపర్ పాసేజ్ నిర్మించారు. పాసేజ్ నుంచి ప్రధాన కాల్వపై కొంతమేర సిమెంట్ లైనింగ్ (రివిట్మెంట్) వేసి, దానిని ఆనుకుంటూ గైడ్వాల్ నిర్మించారు. స హజంగా లైనింగ్ కంటే గైడ్వాల్ బలంగా ఉండాల్సి ఉండగా.. కమలాపురం వెళ్లే ప్రధాన కాల్వకు ఎడవువైపున పగుళ్లు ఏర్పడ్డాయి. అంతేకాక సిమెంట్ లైనింగ్ పగిలి ముక్కలుగా విరిగిపోయింది. ఈ మేరకు స్పందించిన అధికారులు దెబ్బతిన్న గైడ్వాల్ను పూ ర్తిగా తొలగించి నూతన నిర్మాణాలు మొదలు పెట్టా రు. తొలుత పనులు చేసిన ఏజెన్సీతో ఈ నిర్మాణాలు చేయిస్తున్నారు. ఈ అంశంపై డీఈ రవీందర్ తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానన్నారు. బీటలు వారిన, పగుళ్లు వచ్చిన ప్రదేశంలోని గైడ్వాల్ తొలగించి కొత్త నిర్మాణాలు మొదలుపెట్టామన్నారు. ప్రధాన కాల్వ ద్వారా కమలాపురం పంప్హౌస్–3కు గోదావరి జలాల తరలుతున్నాయని, మోటార్లు నిలిపివేశాక మిగిలిన పనులు చేపడుతామని తెలిపారు. ‘సీతారామ’ గైడ్వాల్స్ తీరిది... -
బోధనా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
పాల్వంచ/ఇల్లెందురూరల్: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపర్చుకొని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా పాఠాలు చెప్పాలని డీఈఓ వాసంతి సూచించారు. ఇల్లెందు మండలం సుభాష్నగర్ హైస్కూల్, పాల్వచంలోని బొల్లేరుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్జీ టీలకు ఇస్తున్న శిక్షణను బుధవారం ఆమె పరిఈ లించి మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలను నూరు శాతం సాధించేలా కృషి చేయడమే కాక వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలని తెలిపారు. ప్రథీ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో మూడు చొప్పున జిల్లాలో 256 స్కూళ్లను ఎఫ్ఎల్ఎన్ కాంపిటేటివ్ పరిధిలోకి తెస్తున్నామని వివరించారు. ఆయా పాఠశాలలు నూరుశాతం పురోగతి సాధించేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రగతి ఆధారంగా ఏటా ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. కాగా, పాఠశాలల్లో అసౌకర్యాలను గుర్తించి విద్యాంజలి పోర్టల్లో నమోదు చేస్తే కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా అందిస్తాయన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మాధవరావు, ఎంఈఓలు ఏ.శ్రీరామ్మూర్తి, ఎంఈఓ ఉమాశంకర్, రిసోర్స్ పర్సన్లు రాందాస్, శ్రీను, వీరన్న, సత్తులాల్, సూర్నపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల గెంటివేతపై విచారణ
పాల్వంచరూరల్: పాల్వంచ కేటీపీఎస్లో డీఈగా విధులు నిర్వర్తించే ఉద్యోగి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేసిన ఘటనపై అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పాల్వంచ మండలం ఇల్లెందులపాడు తండాకు చెందిన భూక్యా మంగ్యా, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి 17వ తేదీన వీరి పెద్దకుమారుడు, డీఈ పుల్యా బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేసుకున్నాడు. దీంతో దంపతులు ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారి నరేశ్ బుధవారం ఇల్లెందులపాడు తండాకు వెళ్లి వివరాలు ఆరా తీసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు మహబూబాబాద్రూరల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం తెల్లవారు జామున 2.44 గంటలకు ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని డీజీ కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలికి సమాచారం అందింది. దీంతో ఆమె నైట్ పెట్రోలింగ్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయగా ఎస్ఐ సుదర్శన్, సిబ్బంది రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఓసీ క్లబ్ సమీపాన ట్రాక్పై పడుకున్న యువకుడిని గుర్తించి బయటకు తీసుకువచ్చారు. సదరు యువకుడు భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన షేక్ వసీమ్గా గుర్తించగా.. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అంగీకరించాడని సీఐ తెలిపారు. దీంతో ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, వేగంగా స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన సీఐ అంజలి, ఉద్యోగులను ఎస్పీ శబరీశ్ అభినందించారు. దాడి చేసినవారిపై కేసుభద్రాచలంఅర్బన్: కూరగాయల వ్యాపారిని అకారణంగా దూషించి, ఆయనపై దాడి చేసిన ఇద్దరిపై పోలీసులు బుధవారం కేసు నమో దు చేశారు. పట్టణంలోని పాతమార్కెట్ ఏరియాలో కూరగాయల వ్యాపారం చేసే పసుపులేటి శ్రీనివాస్పై అక్క డే వ్యాపారం చేసుకునే వినో ద్ వచ్చి దుర్భాషలాడి దాడి చేశాడు. అనంతరం నాగేందర్ అనే వ్యక్తి వచ్చి దుర్భాషలాడి దాడికి పాల్ప డ్డాడు. ఇద్దరూ కలిసి దాడి చేయడంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. దాడి చేసిన వినోద్, నాగేందర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ సతీశ్ తెలిపారు. కాగా, దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు వైరల్గా మారాయి. బాలుడితో పనిచేయించుకుంటున్న వ్యక్తిపై..పాల్వంచ: భవన నిర్మాణంలో బాలుడితో పనిచేయించుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బీసీఎంరోడ్లో ఓ భవన నిర్మాణానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో పనిచేయించుకుంటుండగా ఆపరేషన్ ముస్కాన్ టీం సభ్యులు పట్టుకున్నారు. పనిచేయించుకుంటున్న వెంకటేశ్వర్పై కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్లో ఎస్ఐ రామ్మూర్తి, ఏఎస్ఐ శాంతి, చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ లలితలు పాల్గొన్నారు. -
సమన్వయ సాధన
నెట్టుకొస్తున్నారు.. సింగరేణి సంస్థ అధికారిక వెబ్సైట్లో రోజువారీ బొగ్గు ఉత్పత్తి వివరాలను పొందుపరుస్తుంది. ఆ వివరాల ప్రకారం ఈ నెల 1 నుంచి 21వ తేదీ వరకు సత్తుపల్లి, మణుగూరు, బెల్లంపల్లి, రామగుండం–2 ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించగా కొత్తగూడెం, ఇల్లెందు, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి, అడ్రియాల, రామగుండం–1 ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో అడ్రియాల ఏరియా నిర్దేశిత లక్ష్యంలో కేవలం 15 శాతమే ఉత్పత్తి చేసింది. మొత్తంగా సింగరేణిలో 109 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైందని చెబుతున్నా.. కొన్ని ఽథర్మల్ పవర్ స్టేషన్లలో కనీస స్థాయిలోనే బొగ్గు నిల్వలు కనిపిస్తున్నాయి. వానలు పడితే.. ఈ నెల 21 నాటి ఉత్పత్తి వివరాలను పరిశీలిస్తే రోజువారి మొత్తం లక్ష్యంలో కేవలం 75 శాతమే జరిగింది. కాగా, 21వ తేదీన గోదావరి తీర ప్రాంతంలో వర్షం కురవడంతో ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడింది. రాబోయే రెండు నెలలు వానల కారణంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. దీన్ని అధిగమిస్తూ థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గును ఉత్పత్తి చేయడం సింగరేణికి సవాల్గా మారింది. నిల్వలు ఉండాల్సింది ఇలా.. తెలంగాణలో కేటీపీఎస్ – పాల్వంచ, బీటీపీఎస్ – మణుగూరు, కేటీపీపీ – భూపాలపల్లి, వైటీపీఎస్ – దామరచర్ల, ఎన్టీపీసీ – రామగుండం, ఎస్టీపీపీ – జైపూర్ మంచిర్యాలలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు ఉన్నాయి. ఇందులో వైటీపీఎస్ మినహయిస్తే మిగిలినవి బొగ్గు గనులు ఉన్న ప్రదేశంలో నెలకొల్పినవే. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పిట్ హెడ్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు 17 రోజులకు సరిపడా ఉండాలి. కనీసం 12 రోజులకు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా బొగ్గు గనులకు దూరంగా ఉన్న పవర్ ప్లాంట్ల విషయంలో కనీసం 20 రోజులకు సరిపడా ఉండాలి. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలకు సంబంధించి కోలిండియా వెబ్సైట్లో వివరాలు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రకారం కేటీపీఎస్–8 స్టేజీ, ఎన్టీపీసీలలోనే కనీస స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆఖరికి సింగ రేణి సొంత ప్లాంట్ మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీలో కేవలం ఐదు రోజులకు సరిపడా నిల్వలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పూర్తిగా సింగరేణి బొగ్గుపైనే ఆధారపడి ఉన్నాయి. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని ఉపయోగించడం లేదు. దీంతో సింగరేణి నుంచి బొగ్గు రవాణా తగ్గితే ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తి, ఆపై పారిశ్రామిక, గృహ, వ్యవసాయ రంగాలపై పడుతుంది. పవర్స్టేషన్ సామర్థ్యం బొగ్గు నిల్వలు ఎన్ని రోజులకు.. (మెగావాట్లు) (టన్నులు) భద్రాద్రి 1,080 1,19,000 10 కేటీపీఎస్ (5, 6) 1,000 50,000 04 కేటీపీఎస్–7 800 1,07,000 13 కాకతీయ 1,100 7,79,000 06 ఎన్టీపీసీ, రామగుండం 4,000 4,50,000 14 యాదాద్రి 4,000 2,23,000 11 ఎస్టీపీపీ, జైపూర్ 1,200 92,000 05 ఎల్నినోతో తగ్గిన జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎల్నినో పరిస్థితుల కారణంగా ఆశించిన స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత థర్మల్ విద్యుత్ కేంద్రాలపై పడింది. కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆధారమైన బొగ్గు ఉత్పత్తి విషయంలో సింగరేణి పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. ఆయన గురు, శుక్రవారం సింగరేణి గనులను పరిశీలించడమే కాక సింగరేణి, జెన్కో అధికారులతో సమీక్షించనున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
పోషించలేక.. బిడ్డను వదిలేసి
● భోజనం చేసి వస్తానని ఆడశిశువును వదిలివెళ్లిన వ్యక్తి ● శిశు గృహలో అప్పగింత.. ఆ తర్వాత గుర్తించిన పోలీసులుభద్రాచలంఅర్బన్: భోజనం చేసి వస్తానని చెప్పి 45 రోజుల వయస్సు కలిగిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తి భద్రాచలంలో అన్నదాన సత్రం వద్ద వృద్ధుడికి అప్పగించి వెళ్లిపోయిన వైనమిది. నల్లగొండ జిల్లా అడివిదేవులపల్లి గ్రామానికి చెందిన ఆకుల నారాయణ బుధవారం రామాలయానికి వచ్చి దర్శనం అనంతరం అన్నదాన సత్రం వద్ద కూర్చున్నాడు. ఈ సమయాన ఎరుపు రంగు దుస్తులు ధరించిన 30 ఏళ్ల వయసు వ్యక్తి వచ్చి భోజనం చేసే వరకు పాపను పట్టుకోండని అప్పగించి వెళ్లాడు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోవడం, శిశువు ఆకలితో ఏడుస్తుండడంతో స్థానిక ఆటోడ్రైవర్ల సాయంతో శిశుగృహలో అప్పగించారు. ఈ మేరకు ఆడ శిశువును అప్పగించిన వ్యక్తి ఆచూకీ గుర్తించేందుకు ఐసీడీఎస్ అధికారులు సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పరిశీలిస్తుండగా బిడ్డను వదిలివెళ్లిన వ్యక్తి భద్రాచలం చెక్పోస్టు వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీకి చెందిన తాను వరంగల్లో ఉంటున్నట్లు చెప్పాడని తెలిసింది. ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో బిడ్డను వదిలివెళ్లినట్లు అంగీకరించాడని సమాచారం. ఈ నేపథ్యాన పోలీసులు పూర్తి వివరాల సేకరణలో నిమగ్నమైనట్లు తెలిసింది. -
వైటీసీతో గిరిజన యువతకు ఉపాధి శిక్షణ
ఐటీడీఏ పీఓ రాహుల్ అశ్వారావుపేట: గిరిజన యువతీ, యువకులకు యువజన శిక్షణ కేంద్రం(వైటీసీ) ద్వారా ఉపాధి రంగాల్లో శిక్షణ అందుతుందని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. అశ్వారావుపేటలో ఐటీడీఏ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన వైటీసీని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఖమ్మం, భద్రాచలం, ఇల్లెందులో వైటీసీలు ఉండగా, అశ్వారావుపేటలోనూ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ అన్ని వసతులతో ఉపాధి రంగాల్లో ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్లో స్థిరపడాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే రాణించవచ్చని తెలిపారు. అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, వైస్ ఛైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజు, ఎంపీడీవో కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణానికి అనుగుణంగా పంటలు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు వరికి బదులు ప్రత్యా మ్నాయ పంటలను సాగు చేయడం మంచి దని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రో గ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ సూచించారు. 50–75 మి.మీ. వర్షపాతం ఒక వారం రోజుల్లో నమోదైతే జూలై నెలాఖరు వరకు తక్కువ కాలవ్యవధి (90 రోజుల్లోపు) ఉన్న మొక్కజొన్న హైబ్రిడ్లు, వేరుశనగ, సజ్జ, తేలిక నేలల్లో పొద్దుతిరుగుడు పంటలను విత్తుకోవచ్చని తెలిపారు. రాగి పంటను ఆగస్టు నెలాఖరు వరకు, బరు వు నేలల్లో పొద్దుతిరుగుడు పంటను ఆగస్టు 30వ తేదీ వరకు విత్తుకోవచ్చని వివరించారు. రాబోయే ఐదారు రోజుల పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పంటల తీగలకు బలమైన వెదురు కర్రలతో ఊతం ఇవ్వాలని ఆయన సూచించారు. ● వరి: రైతులు స్వల్పకాలిక వరి రకాల నారును జూలై చివరి వరకు పోసుకోవచ్చు. వరిలో తడి లేదా పొడి పద్ధతిలో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా) వరి రకానికి నారు మడిని జూలై నెలాఖరు వరకు వేయొచ్చు. వరి నాటు వేసుకునే వారం ముందు ఎకరానికి సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్భోప్యూరాన్, 3 సీజీ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి ● మొక్కజొన్న: 50–75 మి.మీ. వర్షపాతం వారం రోజుల్లో నమోదైతే రైతులు 90 రోజుల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన స్వల్పకాలిక మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను బోదె – సాళ్ల పద్ధతిలో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. వర్షాలు తగ్గాక ఆకాశం నిర్మలంగా ఉన్నపుడు ఎరువుల యాజమాన్యం / పురుగులమందులు లేదా కలుపుమందులు పిచికా రీ చేపట్టాలి. కత్తెర పురుగు ఆశిస్తే వర్షాలు తగ్గాక 0.4 గ్రా. ఇమామెక్టివ్ బెంజోయేట్ లేదా 0.4 మి.లీ క్వోరాంట్రనిలిప్రోల్ లీటర్ నీటికి కలిపి మొక్క సుడుల్లో పోయాలి. ● పత్తి: రైతులు ప్రస్తుతం పత్తి విత్తనాలు నాటడం మంచిది కాదు. ఆలస్యంగా విత్తితే పంట సరిగాస్థిరపడక పోవడం, చీడపీడల ఉధృతి పెరగడమే కాక దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. వర్షాల కారణంగా పత్తిలో కాండం కుళ్లు తెగుళ్లు సోకడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ తెగుళ్లను గమనిస్తే వర్షాలు తగ్గాక 2 గ్రా. కార్భండజిమ్ + మాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడిచేలా పోయాలి. కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భరత్ -
భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టాలని ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావు సూచించారు. ‘దారీతెన్నూ లేదు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. పని చేస్తున్న కార్మికులకు రక్షణ సామగ్రి లేకపోగా, ఆంక్షలతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ కథనంలో ప్రస్తావించగా స్పందించిన ఎమ్మెల్యే ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను బుధవారం పరి శీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్, ఈఓ దామోదర్రావుకు పలు సూచనలు చేశారు. ప్రతీ పని నాణ్యతగా, నిబంధనల ప్రకారం జరగాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత చెక్కు చెదరకుండా చూసుకోవాలని సూచించారు. ఇదేసమయాన కార్మికులకు రక్షణ సామగ్రి అందజేసి, పుణ్యక్షేత్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సర్పంచ్ పూనెం కృష్ణ, నాయకులు రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, మామిడి పుల్లారావు, నాగేశ్వరరావు, రాయల శ్రీను, గాడి విజయ్, మాచినేని భాను, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు -
‘మై భారత్’ పోర్టల్లో నమోదు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలు ప్రతీ విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల్లో అవకాశాలు దక్కుతుండగా, ప్రస్తుతం జిల్లాలో సుమారు 9 వేల మంది యువత నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. అలాగే, జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ నిర్వహణ, వికసిత్ భారత్, నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పోటీల నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు వెంకట్రామ్బాబు, విజయలక్ష్మి, శ్రీలత, వెంకటేశ్వరరావు, వసంత, పరంధామరెడ్డి, మధుసూదన్రెడ్డి, డాక్టర్ కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వేణు గోపాల్ -
మార్క్ఫెడ్ సరఫరా చేసే ఎరువులకు రవాణా చార్జీలు
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటిస్తూ రైతులకు ఇబ్బంది రాకుండా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్క్ఫెడ్ ద్వారా అమల్లో ఉన్న ఫ్రైట్ ఆన్ లారీ(ఎఫ్ఓఎల్) సౌకర్యాన్ని ఈనెల 15నుంచి నిలిపివేసినట్లు వెల్లడించారు. ఫలితంగా మార్క్ఫెడ్ గిడ్డంగులు, రేక్ హెడ్ల నుంచి సరఫరా అయ్యే ఎరువులకు సంబంధించి రవాణా చార్జీలను నిబంధనల ప్రకారం వసూలు చేయాలని సూచించారు. పీఏసీఎస్లకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కాగా, ఎరువుల విక్రయం, రవాణా చార్జీలకు వేర్వేరు రశీదు పుస్తకాలు నిర్వహిస్తూ రైతుల సంతకాలుతీసుకోవాలని ఆదేశించారు. కంపెనీల నుంచి నేరుగా ఎఫ్ఓఎల్ విధానంలో సరఫరా అయ్యే ఎరువులకు ఎలాంటి రవాణా చార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ఎక్కడైనా అధికంగా వసూలు చేస్తే రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. -
యోగా పోటీలు ప్రారంభం
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో బుధవారం రీజినల్ స్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాలకు చెందిన 288 మంది బాలబాలికలు పాల్గొంటారు. తొలిరోజు పోటీలను ఎంఈఓ రాయల వీరస్వామి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాక వారిలో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడంలో నవోదయ ముందు నిలుస్తోందని తెలిపారు. ఇన్చార్జి ప్రిన్సి పాల్ వెంకటరమణ మాట్లాడుతూ రీజినల్ పోటీలకు పాలేరు విద్యాలయ వేదికగా నిలవడం గర్వకారణమని చెప్పారు. ఈ పోటీల్లో విజేతలను ఆగస్టు 30నుంచి పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లా నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో యోగాసన భారత్ జాతీయ సహాయ కార్యదర్శి నందనం కృపాకర్, పరిశీలకులు ప్రసన్న కుమార్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.హాజరైన ఐదు రాష్ట్రాల విద్యార్థులు -
ముంచేస్తున్నది..
భద్రాచలంఅర్బన్: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని గోదావరి నదిలో వరుస విషాద ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దైవ దర్శనానికి వస్తున్న భక్తులు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు నది లోతు అంచనా వేయలేక వృత్యువాత పడుతున్నా.. అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. అటు ఆలయ అధికారులు, ఇటు ఇరిగేషన్, పోలీస్, రాష్ట్ర విపత్తు శాఖ అధికారుల సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడా వుడి చేయడం.. ఆ తర్వాత నివారణపై ప్రణాళికలు లేకపోవడం రామభక్తులు, భద్రాచలం పట్టణ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ఐదుగురు భద్రాచలానికి 15 కి.మీ. దూరాన ఉన్న గొల్లగూడెంలో ఈ నెల 18న చేపల వేటకు వెళ్లిన గొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. అలాగే, ఈ ఏడాది మార్చి 20వ తేదీన భద్రాచలానికి చెందిన ఇద్దరు, విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న మరో ఐదుగురు కూనవరం రోడ్డు లోని ఏపీ సరిహద్దున ఉన్న గోదావరికి సరదాగా వచ్చారు. లోతు అంచనా వేయలేక ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో ఐదుగురు మృతి చెందా రు. అలాగే, భద్రాచలం వద్ద గోదావరిలో దూకి పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఏడాది పొడువునా రామయ్య భక్తులు భద్రాచలం వస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులంతా గోదావరి పుణ్యస్నానం ఆచరించాక రామయ్య ను దర్శించుకోవడం ఆనవాయితీ. వీరిలో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలిలా.. భద్రాచలం వద్ద గోదావరిలో 2014లో ఆరుగురు మృతి చెందారు. 2015లో ఏడుగురు, 2016లో ఐదుగురు, 2017లో ఐదుగురు, 2018లో నలుగురు, 2019లో నలుగురు, 2020లో ఐదుగురు, 2021లో ఎనిమిది, 2022లో 12 మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. ఇక 2024లో 10 మంది, 2025, 2026 ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా, మరికొందరు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భక్తులను రక్షిస్తున్న ఫొటోగ్రాఫర్లు భద్రాచలం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ గల్లంతవుతున్న భక్తులను ఫొటోగ్రాఫర్లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా కాపాడుతున్నారు. ఇక్కడ ఫొటోలు తీస్తూ జీవనం సాగించే గజ ఈతగాడైన కరకు ప్రసాద్ 2024 నుంచి ఇప్పటి వరకు 19 మందిని కాపాడాడు. అంతేకాక గోదావరిలో నీటమునిగి చనిపోయిన వారి మృతదేహల వెలికితీతలోనూ ఉద్యోగులకు సహకరిస్తుంటాడు. గోదావరి తీరాన మృత్యుఘోషగోదావరి స్నానఘట్టాల వద్ద రామాలయం, ఇరిగేషన్, పోలీస్, రాష్ట్ర విపత్తు శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు విధులు నిర్వర్తించే గజ ఈతగాళ్లకు చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుండడంతో వారు స్నాన ఘట్టాల వద్ద అందుబాటులో ఉండడం లేదు. దీంతో భక్తులు స్నానఘట్టాల వద్ద కాకుండా మరింత లోతు కు వెళ్లి అంచనా వేయలేక గల్లంతవుతున్నారు. గజ ఈతగాళ్లను కీలక ప్రాంతాల్లో నియమిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముంది. గోదావరి తీరాన ఎల్లవేళలా ఉండేలా 2025 మార్చి 4న ఇద్దరు గజ ఈతగాళ్లను దేవస్థానం, మరో ఇద్దరిని గ్రామపంచాయతీ ఆధ్వర్యాన నియమించి, జీతం చెల్లిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెంచడంతో పాటు వరదల సమయంలోనే కాక ఇరిగేషన్, పోలీస్ అధికారులు గోదా వరి ఒడ్డు, కరకట్ట ప్రాంతంలో గస్తీ పెంచి, మైక్ ద్వారా హెచ్చరికలను జారీ చేస్తేప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు. -
ల్యాబ్ల్లో అర్హులైన సిబ్బంది తప్పనిసరి
అశ్వారావుపేటరూరల్: ప్రైవేట్ రక్త పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అర్హులైన సిబ్బందితోనే పరీక్షలు చేయించాలని డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్ ఆదేశించారు. మండలంలోని వినాయకపురం పీహెచ్సీని బుధవారం తనిఖీ చేసిన ఆయన అశ్వారావుపేట, దమ్మపేట మండ లాల్లోని ప్రైవేట్ ల్యాబ్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ప్రతీ రక్త పరీక్షా కేంద్రానికి రిజిస్ట్రేషన్ చేయించడమే కాక ఇతర అనుమతులు తీసుకోవాలని తెలిపారు. మలేరియా, డెంగీ పాజిటివ్ కేసుల వివరాలను వైద్యశాఖ అధికారులకు అందించాలని సూచించారు. అలాగే, ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో వైద్యాధికారులు రాందాస్, నౌషిన్, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధమైన జియోసైన్స్ ల్యాబ్
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో లభించే అరుదైన ఖనిజాలను పరీక్షించి ఫలితాలు వెల్లడించేందుకు రూ.12 కోట్ల వ్యయంతో జియోసైన్స్ ల్యాబోరేటరీ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో లభ్యమయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ను పరీక్షించి నిర్ధారించేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుంది. ఇటీవల సింగరేణి యాజమాన్యం కర్ణాటక రాష్ట్రంలోని గోల్డ్, కాపర్ మైన్స్ దక్కించుకోగా, అక్కడి ఖనిజాలను కూడా పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, డిప్యూటీ సీఎం గురు, శుక్రవారం కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్ సుదీర్థ భట్టాచార్య, డైరెక్టర్ (పా) గౌతం పోట్రు పాల్గొంటారు. సీఎండీగా ఫిబ్రవరి 12న బాధ్యతలు చేపట్టిన భట్టాచార్య మార్చి 7వ తేదీన కొత్తగూడెం వచ్చారు. మళ్లీ రెండోసారి గురువారం రానున్నారు. నేడు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి -
కెనాళ్లకు వేగంగా భూసేకరణ
జూలూరుపాడు: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు కావాల్సిన భూసేకరణ వేగంగా చేపట్టాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జూలూరుపాడు మండలంలో కెనాళ్ల భూసేకరణ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. కొత్తూరు, జూలూరుపాడు గ్రామాల్లో పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూసర్వే గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే, జూలూరుపాడు పరిధిలో 17.20 ఎకరాల భూమికి గాను 8 ఎకరాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములు, కొత్తూరు పరిధిలో 337 ఎకరాల భూమికి సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. కాగా, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల వెడల్పును 50 నుంచి 40 మీటర్లకు తగ్గించాలని, విలువైన భూములు కోల్పోకుండా కాపాడాలని రైతులు కలెక్టర్కు విన్నవించారు. తొలుత పడమటనర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేసి వసతి, తరగతి గదులు, పారిశుద్ధ్య నిర్వహణ, పదో తరగతి విద్యార్థినుల సామర్థ్యాలు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఏజీహెచ్ఎస్ హెచ్ఎం సుభద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో వసతుల కల్పన సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన డీఎల్సీ సమావేశంలో ఆయన టేకులపల్లి, ములకలపల్లి, దుమ్ముగూడెం, గండుగులపల్లి, గుండాల, చర్ల, పాల్వంచ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వసతులపై ఆరా తీశాక మాట్లాడారు. విద్యార్థులకు సికిల్ సెల్ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించడమే కాక ప్రతీ పాఠశాలలలో పార్ట్ టైం డాక్టర్ను నియమించాలని తెలిపారు. అనంతరం పాఠశాలల్లో అభివృద్ధి పనులు, తాగునీటి వసతి, బోధన, డిజిటల్ విద్య, మెనూ అమలుపై సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. సీ్త్ర నిధి రుణాల రికవరీకి కార్యాచరణ జిల్లాలో సీ్త్ర నిధి రుణాల రికవరీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, వచ్చే రెండు నెలల్లో 60 శాతం రికవరీ సాధించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సీ్త్ర నిధి సమీక్ష కమిటీ సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, డీఆర్డీఏ విద్యాచందన పాల్గొనగా కలెక్టర్ మాట్లాడారు. రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాల ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులతో ఆరా తీశారు. జిల్లాలో సీ్త్ర నిధి రుణాల రికవరీ కేవలం 13.5 శాతంతో జిల్లా రాష్ట్రంలో 31వ స్థానాన నిలిచిందని చెప్పారు. భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట ప్రాంతాల్లో రికవరీ తక్కువగా ఉన్నందున ప్రత్యేక బృందాల ద్వారా రుణ గ్రహీతలకు అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే రెండు నెలల్లో కనీసం 60 శాతం రికవరీ సాధించేందుకు కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, డీపీఓ అనూష, అడిషనల్ డీఆర్డీఏ నీలేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
కల్యాణం... కమనీయం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యా ణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరి పించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో ఐటీఐ (ఫిట్టర్ ట్రేడ్ మినహా) పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలి పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www. apprenticeshipindia. org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఎస్సెస్సీ, ఐటీఐ మెమో, కుల ధ్రువీకరణపత్రం, బ్యాంక్ పాస్బుక్ తది తర పత్రాలు అప్లోడ్ చేయాలని సూచించా రు. దరఖాస్తు కోసం ఈనెల 31వరకు గడువు ఉందని ఆయన తెలిపారు. ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టిచుంచుపల్లి: అటవీ శాఖ ద్వారా చేపడుతున్న ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి మొక్కలను సంరక్షించాలని భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ డి.భీమా నాయక్ సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో కలిసి బుధవారం ఆయన కొత్తగూడెం రేంజ్ పరిధి హేమచంద్రపురం బీట్లో కొత్తగా చేపట్టిన 10 హెక్టార్ల ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున త్వరగా మొక్కలు నాఆటాలని సూచించారు. ఆతర్వాత జిల్లాలో మొక్కల పెంపకం, అటవీ సంరక్షణపై సూచనలు చేశారు.పంటల మార్పిడితో రైతులకు ఆదాయంజిల్లా వ్యవసాయ అధికారి బాబురావు చుంచుపల్లి: ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి ఎదురవుతోందని, రైతులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి ఆదాయం పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్లలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డీఏఓ మాట్లాడారు. బోరు నీటిపై ఆధారపడి వరిసాగు చేస్తే నీటి కొరత ఏర్పడి దిగుబడి పడిపోతుందన్నారు. ఈమేరకు ఆయిల్ పామ్, అపరాలు, కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి పంట లను సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా దీర్ఘకాలం స్థిరమైన ఆదాయం లభిస్తుందని, అపరాలు, మొక్కజొన్న, జొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ దీపక్, ఏఈఓలు పాల్గొన్నారు. మత్స్యకారులకు శిక్షణ ప్రారంభం కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘జలాశయాల్లో చేపల పెంపకం – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు ఇచ్చే మూడు రోజుల శిక్షణ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మంచినీటి చేపలకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఉత్పత్తిపై దృష్టి సారించాలని తెలిపారు. ఇందుకోసం నూతన పద్ధతులను అవలంబించాలని చెప్పారు. అనంతరం శాస్త్రవేత్తలు రవీందర్, గణేష్, దివ్య మాట్లాడారు. -
ప్రజల బాగు కోరేది పోలీసులే...
చర్ల: మండలంలోని మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారులు వంటి సదుపాయాల కల్పన కు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. చర్ల సీఐ రాజువర్మ నేతృత్వాన ఎస్ఐ నర్సిరెడ్డి మిత్రులు పీవీ నర్సింహారెడ్డి, పి.రామారావు, పి.కార్తీక్, టి.హర్ష, ఈ.రాజేశ్, టి.శశిధర్రెడ్డి, పి.రమణారెడ్డి, ఎం.సంతోష్ గౌడ్ సమకూర్చిన రూ.2.50లక్షలతో ఆదివాసీ గ్రామమైన బక్కచింతపాడులో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఎస్పీ బుధవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణే కాదు ప్రజల బాగు కోసం కూడా పోలీసులు కృషి చేస్తారని నిరూపించారన్నారు. గత ఏడాది ఆదివాసీ గ్రామమైన బూరుగుపాడులో పాఠశాల భవనం నిర్మించగా, ఇప్పుడు మరొకటి నిర్మించారని తెలిపారు. కాగా, ఆదివాసీలు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని, అనారోగ్యం ఎదురైతే మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. తొలుత విద్యార్థులకు స్కూల్ బ్యా గులు, స్టేషనరీని ఎస్పీ పంపిణీ చేశారు. సర్పంచ్ మిడియం లక్ష్మి, డీఎస్పీ అరుణ్కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు కేశవ్, ఎంఈఓ పీవీ.రమణ, హెచ్ఎం పాయం విజయబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి దుమ్ముగూడెం: అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని, మట్కా, జూదం, కోడి పందేలు, పేకాట, బెట్టింగ్, గంజాయి రవాణా జరగకుండా పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. దుమ్ముగూడెం పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేసిన ఆయన పెండింగ్ కేసులు, దర్యాప్తుపై ఆరా తీశాక ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని తెలి పారు. స్టేషన్కు వచ్చే వారికి న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం కావాలని చెప్పారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్కుమార్, సీఐలు వెంకటప్పయ్య, శ్రీనివాస్, ఎస్ఐలు శ్యాంప్రసాద్, జగన్మోహన్చారి, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ -
రెడ్కో ఇంజనీర్ బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు
పాల్వంచ: టీజీ ఆర్డీసీఓ డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణకు చెందిన బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదా చేశారు. పాల్వంచ రాహుల్గాంధీ నగర్లో ఉండే ఇంజనీర్ బంధువు ఇంట్లో ఏసీబీ ఖమ్మం డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. రెడ్కో డిప్యూటీ ఇంజనీర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మాధాపూర్లోని ఆయన నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బంధువుల ఇళ్లలో సోదా చేశారు. ఈ క్రమాన పాల్వంచలో కూడా తనిఖీ చేయగా, అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. భూసార పరీక్షలతో రైతులకు మేలు బూర్గంపాడు: రైతులు భూసార పరీక్షల ప్రా ముఖ్యతను గుర్తించాలని, ఈ పరీక్షలతో వచ్చే నివేదికల ఆధారంగా పంటల సాగు చేస్తే నష్టా లు రావని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్ఆర్) అసోసియేట్ డాక్టర్ రవి రాజు సూచించారు. బూర్గంపాడులోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఫ్మారర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీఓ) ఆధ్వర్యాన భూసార పరీక్షలు, వరి నేరుగా విత్తే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించి నేలలోని పోషక పదార్థాల ఆధారంగా ఎరువులను వాడాలని తెలిపారు. కాగా, వరి నేరుగా విత్తుకునే విధానంలో పెట్టుబడులు తగ్గుతాయని వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, సీఈఓ బీ.వీ.ప్రసాద్, రైతులు పాల్గొన్నారు. రేపు కలెక్టరేట్లో ఫుడ్ లైసెన్స్ మేళా సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో ఈ నెల 24న ఫుడ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆహార భద్రతాధికారి శరత్ తెలిపారు. జిల్లా పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, బేకరీలు, కిరాణా దుకాణాలు, పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారులు, ఇతర ఆహార వ్యాపార సంస్థల యజమానులు కొత్త లైసెన్స్, రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, సవరణ సేవలను పొందొచ్చని వెల్లడించారు. కాగా, తత్కాల్ ఫుడ్ లైసెన్స్ పేరిట ఎవరైనా సంప్రదిస్తే రుసుము చెల్లించొద్దని ఆయన తెలిపారు. నేడు భారజల కర్మాగారం ఉద్యోగ సంఘం ఎన్నికలు అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. కర్మాగారంలోని క్యాంటీన్–1లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్, సంయుక్త కార్యదర్శిగా రామచంద్ర జైస్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 11 ఎగ్జిక్యూటివ్ సభ్యుల స్థానాల్లో ఎనిమిది ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు స్థానాలకు ఆరుగురు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో టీఎన్టీయూసీ – బీఎంఎస్ కూటమి, సీఐటీయూ – టీఆర్టీయూ కూటమి, ఐఎన్టీయూసీ బరిలో ఉన్నాయి. కాగా, పోలైన ఓట్లను ఈ నెల 24న లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మోసపోయిన పండ్ల వ్యాపారిమామిడి పండ్లు పంపిస్తామని నగదు స్వాహా పాల్వంచ: పండ్ల వ్యాపారికి ఫోన్ చేసి మామిడి కాయల లోడ్ పంపిస్తామని ఆశచూపి, డబ్బు లు స్వాహా చేసిన ఘటన ఇది. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన గుత్తుల సత్యనారాయణకు గత జూన్ 21వ తేదీన ఖదిర్పాషా అనే వ్యక్తి ఫోన్ చేసి తాను కేజీఎన్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నానని, గతంలో మామిడి పండ్లు కొన్నారని, ఇప్పుడు మంచి కాయలు వచ్చా యని చెప్పి మామిడి పండ్ల ఫొటోలను వాట్స ప్ ద్వారా పంపాడు. అడ్వాన్స్గా రూ.10 వేలు ఇస్తే డోర్ డెలివరీ చేస్తామని నమ్మబలికాడు. అనంతరం మరో రూ.11 వేలు వేయాలని, తర్వాత బండి రిపేర్ అయిందని చెప్పి మొత్తం రూ.45 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. దీంతో సత్యనారాయణ కేజీఎన్ మార్కెట్లో ఆరా తీయగా అలాంటి వ్యక్తి ఎవరూ లేరని తేలడంతో మోసపోయినట్లు గుర్తించాడు. బుధవారం బాధితుడి కుమారుడు జశ్వంత్ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలప పట్టివేత
దుమ్ముగూడెం: అక్రమంగా టాటా మ్యాజిక్ వాహనంలో తరలిస్తున్న 3 టేకు మొద్దులను స్వాధీనం చేసుకున్నట్టు రేంజర్ కమల బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా వాహనంలో ఆర్.కొత్తగూడెం సెక్షన్, బీట్ నుంచి తరలిస్తున్న 3 టేకు మొద్దులు దొరికాయి. వాటిని భద్రాచలం అటవీశాఖ కార్యాలయానికి తరలించామని, కలప విలువ సుమారు రూ.32 వేలు ఉంటుందని, వాహనాన్ని సీజ్ చేశామని రేంజర్ వివరించారు. అధిక వడ్డీ ఆశ చూపి పరారైన వ్యక్తి అరెస్ట్? భద్రాచలంఅర్బన్: భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా పలు వ్యాపారాలు చేస్తూనే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు తెలిసింది. ఏపీలోని పోలవరం జిల్లా చింతూరు మండలానికి చెందిన వారి నుంచి డబ్బు సేకరించి నాలుగు, ఐదు నెలలు వడ్డీ సక్రమంగా చెల్లించినట్లు సమాచారం. దీంతో నమ్మిన ఇంకొందరు అప్పులు ఇవ్వగా.. గత నెల 27న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కానరాకుండా పోయాడు. ఈ క్రమంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని లక్ష్మీదేవిపల్లి పోలీస్స్టేషన్లో విచారణ అనంతరం మంగళవారం కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చినట్లు సమాచారం. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా భద్రాచలం సబ్ జైల్కు తరలించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయమై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. -
వేడుకగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామ య్య కల్యాణం వేడుకగా సాగింది. తెల్ల వారుజామునేన గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకార్చన పూజలు జరిగాయి. 23, 24వ తేదీల్లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన రుద్రంపూర్/ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 23, 24 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 23న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సత్తుపల్లిలోని జేవీ ఆర్ ఓపెన్ కాస్ట్ గనులకు చేరుకోనున్న ఆయన బొగ్గు ఉత్పత్తి, నాణ్యతను పరిశీలించాక అధికా రులతో సమావేశమవుతారు. ఆతర్వాత కొత్తగూడెం చేరుకుని టీజీ జెన్కో, సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి బస చేస్తారు. ఇక 24వ తేదీ శుక్రవారం ఉదయం మణుగూరు వెళ్లి బీటీపీఎస్ వద్ద టీజీ జెన్కో ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన డీఏఓ పబ్లిక్ స్కూల్ను ప్రారంభిస్తారు. ఆతర్వాత మణుగూరు ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ గనులను పరిశీలించి బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై అధికారులతో చర్చిస్తారు. ఇంకా ఏమేం పనులు ఉన్నాయి?ఇల్లెందు: ఇల్లెందులో మినీ స్టేడియాన్ని డీవైఎస్ఓ ఎం.పరంధామిరెడ్డి, పీఆర్ ఈఈ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండోర్, ఔట్ డోర్ జిమ్లు, వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్ను పరిశీలించి ఇంకా చేయాల్సిన పనులపై చర్చించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమైన వారు మాట్లాడుతూ మిగులు పనులు త్వరగా పూర్తి చేస్తే క్రీడాకారులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి, కోచ్లు కె.మహిధర్, పి.నాగేంద్ర, సుమిత్కోరీ మాట్లాడుతూ 200 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికా రులను కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ రాంకిషన్, ఏఈ రాజు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, గుండా శ్రీకాంత్ పాల్గొన్నారు. డిజిటలైజేషన్ వేగంగా చేపట్టాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూపర్బజార్(కొత్తగూడెం): ‘ఎస్ఐఆర్’లో భాగంగా ఓటర్ల నుంచి అందుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయ న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగంగా జరిగేలా ప్రతీ బీఎల్ఓకు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించామని తెలిపారు. యాభై శాతం కంటే తక్కువ పురోగతి ఉంటే అదనపు సిబ్బందిని కేటాయిస్తున్నామని చెప్పారు. అంతేకాక ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికల విభాగం ఉద్యోగులు రంగప్రసాద్, సాయికృష్ణ, నవీన్ పాల్గొన్నారు. కేటీపీఎస్ 7వ దశ సీఈగా శివరాంరెడ్డి పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్గా బి.శివరాంరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ సీఈగా పనిచేస్తున్న జె.సూర్యనారాయణ దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్–2కి బదిలీ అయ్యారు. కాగా, ఇప్పటివరకు కేటీపీఎస్ 5, 6వ దశల కర్మాగారంలో ఎస్ఈ(ఏడీఎం)గా విధులు నిర్వర్తిస్తున్న శివరాంరెడ్డికి సీఈగా పదోన్నతి కల్పించి 7వ దశకు కేటాయించారు. వచ్చే శుక్రవారం శివరాంరెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. -
మెట్ట పైర్లకు ఊపిరి
బూర్గంపాడు: జిల్లావ్యాప్తంగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు మెట్ట పైర్లకు ఊపిరి పోశాయి. మొన్నటి వరకు వడలిపోయిన పత్తి మొక్కలు, మొక్కజొన్న, వరినార్లు ప్రస్తుత వానతో ప్రాణం పోసుకున్నాయి. రెండు రోజులుగా ఓ మోస్తరు వర్షం కురుస్తున్నా వరి సాగుకు మాత్రం అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నార్లు సిద్ధంగా ఉన్న దమ్ము చేసుకునేందుకు సరిపడా సాగునీరు లేదు. కేవలం ఒకటి, రెండు సెం.మీ. వర్షపాతమే జిల్లాలో నమోదవుతోంది. ఎక్కడ కూడా చెరువులు, కుంటలకు నీరు చేరకపోవడం.. భూగర్భజలాలు అడుగంటి బోర్ల నీరు సరిగా అందడం లేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. రెండు, మూడు విడతలుగా పత్తి జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదైంది. జూన్లో కురిసిన ఒకట్రెండు వర్షాలకు రైతులు మెట్ట పంటలు సాగు చేయడమే కాక వరి నార్లు పోశారు. తొలిసారి వేసిన పత్తి గింజలకు భూమిలో పదును సరిపడక మొలకెత్తలేదు. దీంతో కొందరు రెండు, మూడు సార్లు నాటడంతో మొలకెత్తాయి. కానీ ఈనెలారంభం నుంచి వర్షాలు లేక పత్తి మొక్కలు వడలిపోయి, వరినార్లు ఎండుముఖం వేశాయి. గత మూడురోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తుండడం మెట్ట పైర్లకు జీవం పోసినట్లయింది. జిల్లాలో ఈ సీజన్లో 2.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు సుమారు 1.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరిసాగు 1.90 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు కేవలం ఐదు వేల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. చెరువులు, కుంటలు నిండకపోవటం, సాగునీరు విడుదల చేయకపోవడంతో వరి సాగు గణనీయంగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. వరి కాకపోతే పత్తి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యాన ఈ ఏడాది వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ విస్తృత అవగాహన కల్పిస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అపరాలు, నూనెగింజల పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం వరికి బదులు మొక్కజొన్న, పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రైతులు మాగాణి భూముల్లోనూ పత్తి గింజలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఇంకొందరు వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వరి తగ్గుతుందా.. వాణిజ్య పంటల సాగు ఏటా నష్టాలను మిగులుస్తుండడంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. వరి పండించినా యాసంగిలో సరిగా కొనక రైతులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఈసారి వరికి స్వస్తి చెప్పి పలువురు మళ్లీ జామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నా చాలామంది జామాయిల్ వైపు దృష్టి పెట్టడం గమనార్హం. ఈ నేపథ్యాన ఆయిల్పామ్ సాగుకు ముందుకొచ్చేలా అధికారులు మరింత అవగాహన కల్పిస్తే ఫలితం ఉంటుంది. -
సింగరేణిలో మెగా ప్లాంటేషన్
రుద్రంపూర్: సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో మంగళవారం మహా వృక్షారోపణ(మెగా ప్లాంటేషన్) నిర్వహించారు. సంస్థ పరిధిలో ఒకేరోజు 50 వేల మొక్కలను నాటారు. ఈమేరకు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో అటవీ విభాగం ఆధ్వర్యాన 500 మొక్కలు నాటగా డైరెక్టర్లు ఎల్.వీ.సూర్యనారాయణ, తిరుమలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఏక్ పేడ్.. మాకే నామ్’ నినాదంతో దేశ వ్యాప్తంగా మొక్కలు నాటుతుండగా సింగరేణిలోనూ ఖాళీ ప్రదేశాల్లో మెగా ప్లాంటేషన్ నిర్వహించామని తెలిపారు. ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీఎంలు, వివిధ విభాగాల అధికారులు మనోహరరావు, వెంకటరమణ, లక్ష్మీపతిగౌడ్, ఎన్.రాఘవేంద్రరావు, సీహెచ్.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.మొక్కలు నాటిన డైరెక్టర్లు సూర్యనారాయణ, తిరుమలరావు -
సైకిల్పై భారత యాత్ర
● తొమ్మిది రాష్ట్రాల్లో పూర్తయిన నేపాల్ వాసి ప్రయాణం ● తెలంగాణ మీదుగా ఒడిశాకు పయనం భద్రాచలంఅర్బన్: రూపాయి ఖర్చు పెట్టకుండా భారతదేశమంతా తిరగాలని.. ప్రజల ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలను తెలుసుకునేలా నేపాల్ దేశానికి చెందిన దుర్గా పాండే సైకిల్పై చేపట్టిన యాత్ర భద్రాచలం చేరుకుంది. గత ఏడాది నవంబర్ చివరలో నేపాల్ నుంచి సైకిల్పై భారత్దేశంలో అడుగుపెట్టిన ఆయన యాత్ర తొమ్మిది రాష్ట్రాల్లో పూర్తికాగా.. ఒడిశా వెళ్తూ మంగళవారం భద్రాచలంలో కాసేపు ఆగాడు. ఈ సందర్భంగా ఆయన తన యాత్ర అనుభవాలను పంచుకున్నాడు. ఆసక్తితో.. నేపాల్లోని రూపన్దేహి జిల్లా దేవ్దహా మున్సిపాలిటీ పరిధి బుద్ధనగర్ ప్రాంతానికి చెందిన రిషిరాం పాండే – లక్ష్మి కుమారుడు దుర్గా పాండే. ఇంటర్మీడియట్ వరకు నేపాల్లో చదివాక.. స్వస్థలంతో పాటు మహారాష్ట్రలోని హోటళ్లలో కొన్నాళ్లు పనిచేశాడు. అనంతరం భారత్దేశం అంతా సైకిల్పై యాత్ర చేయాలనే ఉద్దేశంతో 2025 నవంబర్లో ప్రారంభించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పూర్తిచేశాడు. ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశించిన పాండే అచ్చంపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాడు. యాత్ర అంతా సాఫీగా జరిగినా.. హైదరాబాద్లో గోల్కొండ కోట సందర్శనకు వెళ్లినప్పుడు ఫోన్, కెమెరాల చోరీ జరగడం బాధ కలిగించిందని వివరించాడు. అనంతరం హైదరాబాద్ నుంచి ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్తూ భద్రాచలంలో ఆగానని వెల్లడించాడు. ఇప్పటివరకు 235 రోజుల్లో సుమారు 5 వేల కి.మీ. మేర యాత్ర పూర్తయిందని వెల్లడించిన పాండే.. మార్గమధ్యలో ప్రజలే భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించాడు. -
తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద
చర్ల: మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లలో 15 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 10,738 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74మీటర్లకు గాను మంగళవారం ఉదయం 73.43 మీటర్లు ఉండగా, అంతకంతకు పెరుగుతూ మధ్యాహ్నం గరిష్టస్థాయికి చేరింది. దీంతో ఒక్కొక్కటిగా 15 గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, స్థానికంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నా తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.15 గేట్లు ఎత్తి దిగువకు విడుదల -
అడ్డదారుల్లో ఇసుక రవాణా..!
అశ్వారావుపేట: ఇసుక బంగారమాయెనా అన్న ట్లుగా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇసుకకు డిమాండ్ పెరిగింది. దీంతో పలువురు అక్రమ మార్గాల ద్వారా తరలించి విక్రయించడాన్ని మార్గంగా చేసుకున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ నిర్మాణాలు జరుగుతుండటంతోపాటు ప్రైవేట్ భవన నిర్మాణాలకు ఇసుక అవసరాలు పెరిగాయి. గత ప్రభుత్వం ‘మన ఇసుక’వాహనాల ద్వారా వినియోగదారుల ఇంటికే నేరుగా ఇసుక సరఫరా చేసేది. ట్రాక్టర్ ఆపరేటర్లకు కూడా ఉపాధి చూపేది. కానీ, ఇప్పుడా విధానం లేక ఖరీదైన గోదావరి ఇసుక కొనలేక.. వాగు ఇసుకను తెప్పించుకోలేక వినియోగదారులు అగచాట్లు పడుతున్నారు. ఈ కొరతనే వనరుగా మార్చుకుని కొందరు ధనార్జనకు పాల్పడుతున్నారు. వాగుల్లో ఇసుక తరలింపునకు అనుమతి లేకపోవడం, గోదావరికి ఆనుకుని ఉన్న భూభాగంలోని అధికారిక రీచ్ల ద్వారా ఏపీ నుంచి ఇసుకను అక్రమంగా తరలించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నింటికి ఓకే.. అశ్వారావుపేటకు ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల రీచ్ల నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఖరీదైన భవనాలు నిర్మించేవారు గోదావరి ఇసుకే వాడతారు. ప్రభుత్వ భవనాలకు కూడా గోదావరి ఇసుక వాడాలనే నిబంధన ఉన్నా.. ఏ కాంట్రాక్టర్ కూడా గోదావరి ఇసుక వాడినట్లు సీనరేజీ క్లయిమ్ చేసుకోకపోవడం గమనార్హం. మణుగూరు, బూర్గంపాడు మండలాల నుంచి ఇసుక రాజమార్గంలో కొనుగోలు చేసినా భారం పడుతుండడంతో, ఏపీ నుంచి అక్రమంగా కొనుగోలు చేసి తెప్పిస్తున్నారని సమాచారం. అయితే, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి అక్రమంగా తరలించే లారీలను అడ్డుకుంటూ, కొవ్వూ రు ప్రాంతం నుంచి వచ్చే లారీలను వదిలేస్తుననట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దందా ఏళ్లుగా జరుగుతున్నా.. రెండేళ్లుగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా అంతర్గత పోటీతో కొన్నాళ్లు ఫిర్యాదు చేసుకున్నారని, ఇప్పుడంతా సిండికేట్ కావడంతో అక్రమాలు మరింత పెరిగాయని తెలుస్తోంది. అడిగే వారు లేక.. అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్మించే పలు భవన నిర్మాణాలు, రహదారి కాంట్రాక్టు పనులు, 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ స్థలాల్లో భారీగా ఇసుక నిల్వ ఉంటోంది. కొన్నాళ్ల క్రితం ఇసుకను అక్రమంగా తరలించారని ‘సాక్షి’లో కథనం రావడంతో సీజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇసుక గుట్టలు కనిపిస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం. రాజకీయ అండదండలు ఉన్నవారే ఇసుక మాఫియా కావడంతో అధికారులను సైతం మచ్చిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. అశ్వారావుపేటకు జీలుగుమిల్లి మీదుగా జాతీయ రహదారి, కామయ్యపాలెం నుంచి పాపిడిగూడెం రోడ్, రామన్నగూడెం మీదుగా వాగొడ్డుగూడెం రోడ్, ఊట్లపల్లి, వినాయకపురం, గాడ్రాల నుంచి దమ్మపేట మండలానికి ఇసుక అక్రమ మార్గాల్లో రవాణా అవుతోంది. గ్రామగ్రామాన సీసీ కెమెరాలు ఉన్నందున పోలీసులు అక్రమ రవాణాను అడ్డుకునే అవకాశం ఉన్నా అలా జరగకపోవడం గమనార్హం. వ్యవస్థల సహకారంతో.. ఇసుక అక్రమ రవాణాను పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలు నియంత్రించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అడపాదడపా లారీలు, ట్రాక్టర్లు పట్టుబడడానికి మాఫియాలో విభేదాలే కారణమని తెలుస్తోంది. అంతేకాక ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు కొన్ని వాహనాలను పట్టుకోవడం, తర్వాత షరా‘మామూలే’అని ప్రచారం సాగుతోంది. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఇసుక మాఫియా పేట్రేగిపోవడానికి రాజకీయ అండ ఉన్న వారే వ్యాపారులుగా మారడం కారణమని చెబుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఓ ముఠాకు ఉన్నా.. స్థానిక ముఠానే అధికారం చెలాయిస్తోందని సమాచారం. మండలంలోని నందిపాడు ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద ఒక హోంగార్డును కేటాయించినా మాఫియాను ఒక ఉద్యోగి నిలువరించగలరా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎస్ఐ యయాతిరాజును వివరణ కోరగా.. నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని, అనుమతి లేకుండా రవాణా చేసినట్లు తేలితే వాహనాలు సీజ్ చేయడమే కాక బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కొవ్వూరు ఇసుకకే మినహాయింపు? -
వైకల్యాన్ని జయించిన సంజన
చండ్రుగొండ: పుట్టుకతోనే వైకల్యంతో జన్మించిన బాలిక జీవితాంతం అలాగే జీవనం గడుపుతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే, వారి పూజలకు తోడు ‘భవిత’కేంద్రంలో ఇచ్చిన శిక్షణ ఆమెకు నడక నేర్పింది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన పసుపులేటి నాగరాజు – కృష్ణవేణి దంపతులకు 2016లో రెండో సంతానంగా సంజన జన్మించింది. నాగరాజు తాపీ కార్మికుడిగా, కృష్ణవేణి వ్యవసాయ కూలీగా పనిచేసేవాళ్లు. కానీ సంజన జన్మతహా దివ్యాంగురాలు కావడంతో తల నిలబడకపోగా, సరిగ్గా కూర్చోలేకపోయేది. దీనికి తోడు వినబడక, మాట్లాడలేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమాన తల్లి పనులు మానేసి బిడ్డ పోషణకు అంకితమైంది. ఈ క్రమాన తిప్పనపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రం ఏర్పాటుకావడంతో అక్కడ ప్రవేశం కల్పించారు. సంజన పరిస్థితిని చూసి కేంద్రంలోని ఫిజియోథెరపీ చేసే సిబ్బంది ఇంటి వద్దే చికిత్స చేస్తూ పాఠాలు బోధించారు. క్రమంగా ఆమె కోలుకుంటూ ఇప్పుడు వాకర్ లేకుండా సొంతంగా నడిచే స్థాయికి చేరింది. ఈ సంవత్సరం మూడో తరగతి చదువుతున్న సంజన పుట్టుకతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితిని చూసి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. డాక్టర్ కావడమే లక్ష్యం ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేయడంతో పాటు ఇతర చికిత్సలతో సంజన కొద్దికొద్దిగా కోలుకోవడం మొదలైంది. తొలినాళ్లలో వాకర్ సాయంతో నడవగా.. ఇప్పుడు సొంతంగా నడిచే స్థితికి చేరింది. ఈ సందర్భంగా సంజన భవిష్యత్పై ఆరా తీయగా.. తనలాంటి వారికి చికిత్స చేసేలా కష్టపడి చదివి డాక్టర్ కావడమే లక్ష్యమని వెల్లడించడం విశేషం. తల్లిదండ్రుల సహకారం, ‘భవిత’ చికిత్సతో ఫలితం -
గిరిజన చిన్నారులకు పౌష్టికాహారం
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం సమకూరుస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలి పారు. ఇక్రిశాట్ బృందం వైద్యులు మంగళవారం భద్రాచలంలో పీఓను కలిశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసిన గిరిజన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు భద్రగిరి మార్ట్ నెలకొల్పామని తెలిపారు. అంతేకాక దుమ్ముగూడెం, చర్ల, అశ్వారావుపేట మండలాల్లోని గిరిజన పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం సమకూరుస్తున్నామని చెప్పా రు. అనంతరం ఇక్రిషాట్ బృందం వైద్యులు మాట్లాడుతూ గిరిజన గ్రామాల చిన్నారులు, పాఠశాలల్లోని విద్యార్థులకు ఇక్రిశాట్ ఆధ్వర్యాన పైలట్ ప్రాజెక్టు కింద పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపా రు. అలాగే, రక్తహీనతతో బాధపడే చిన్నారులకు సౌష్టికాహారం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఎంఈఓ రమ, వైద్యులు మాసన్ స్వామి కన్నా, రూపా బెనర్జీ, జూడి థామస్, అభినవ్ పాల్గొన్నారు. ● గిరిజన సంక్షేమ శాఖ ఖమ్మం జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా మండలాపురం ఫిరంగి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీడీగా ఉన్న విజయలక్ష్మి జేడీగా పదోన్నతిపై హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన ఫిరంగని భద్రాచలంలో ఐటీడీఏ పీఓ రాహుల్ను కలవగా, పాఠశాలల పర్యవేక్షణపై సూచనలు చేశారు. ఐటీడీఏ డీడీ చందన తదితరులు పాల్గొన్నారు. ● బూర్గంపాడు: ప్రకృతిని ఆరాధించటమే శీత్లా భవానీ పండుగ విశిష్టత అని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. బూర్గంపాడు మండలం అంజనాపురంలో మంగళవారం బంజారాలు నిర్వహించిన శీత్లా భవానీ పండుగలో పీఓ పాల్గొనగా పూజలు చేసి మాట్లాడారు. బంజారాలు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రకృతిని ఆరాధించే పండులు కొనసాగించాలని సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
దారీతెన్నూ లేదు..
విస్తరణ కోసం.. ఆలయం చుట్టూ మాఢవీధులు విస్తరించనున్నారు. ఇందుకోసం ఆలయం చుట్టూ ఉన్న ఉత్తర ద్వారం, చిత్రకూట మండపం, వంటశాల తదితర నిర్మా ణాల కూల్చివేత మొదలుపెట్టారు. అంతకు ముందే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భవనాలను కూల్చేశారు. దీంతో ఆలయం చుట్టూ శిథిలమైన భవనా లు, ఇటుకలు, సిమెంటు దిమ్మెలు, రాళ్లు నిండిపోయాయి. శిథిలాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ఆలయం చుట్టుపక్కల భక్తులు నడిచేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. నడవడమూ కష్టమే.. భద్రగిరి ఆలయం చుట్టూ కూల్చివేతలకు సంబంధించి శిథిలాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో భక్తులు నడిచేందుకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణ ద్వారాల వైపు భక్తులు వచ్చిపోయేందుకు వీలు లేకుండా బారికేడ్లు అడ్డం పెట్టారు. కనీసం నడిచేందుకు నాలుగు అడుగుల జాగా కూడా వదల్లేదు. ఫలితంగా సీతారాములను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చిన భక్తులు గోదావరి తీరం చేరడానికి దారి లేకుండా పోయింది. ఇటు ఉత్తరం వైపు, అటు దక్షిణం వైపు బారికేడ్లు పెట్టి దారులు మూసేయడంతో చిన్న ఖాళీ నుంచి మిథిలా స్టేడియంలోకి దూరి అక్కడి నుంచి తూర్పు వైపునకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు వానల కారణంగా మిథిలా స్టేడియం చిత్తడిగా మారడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎప్పుడు కాలు జారుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ నడుస్తున్నారు. రక్షణ చర్యలేవి? శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం భద్రుడి కొండపై కొలువై ఉంది. గతంలో ఆలయం పక్కన కుసుమహరనాథ్ గుడి కింది భాగంలో ల్యాండ్స్లైడ్ జరిగింది. ఈ నేపథ్యాన కూల్చివేత పనుల్లో పాల్గొనే కార్మికుల రక్షణ, భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రూ.వందల కోట్ల నిధులతో చేపడుతున్న పనుల్లో ఇలాంటి ఏర్పాట్లు కానరావడం లేదు. ఒకరిద్దరు ఉన్నతస్థాయి ఉద్యోగులు తప్పితే కూలీలు, మేసీ్త్రలు ఎవరికీ కనీసం హెల్మెట్లు, గ్లౌజ్లు, రేడియం జాకెట్లు ఇవ్వలేదు. కొండ దిగువన భారీ యంత్రాలతో పనులు చేస్తున్న కార్మికులకు కనీసం హెల్మెట్లు కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీతారాముల దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కొందరు తొలుత గోదావరి స్నానం చేసి దర్శనానికి వెళ్తే, ఇంకొందరు దర్శనం తర్వాత గోదావరి హారతికి వెళ్తారు. అలాగే స్థానికంగా ఉన్న ఉప ఆలయాలను సందర్శిస్తారు. అయితే, ఆలయం చుట్టుపక్కల రాకపోకలపై ఆంక్షలు ఉన్న విషయమై ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు. ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు, ఫలితంగా చోటుచేసుకునే మార్పులపై దేవస్థానం తరఫున కనీసం ప్రచారం కూడా జరగడం లేదు. దేవస్థానం అధికారుల ఉదాసీన వైఖరిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా శిథిలాల తొల గింపు పనుల్లో వేగం పెంచడమే కాక పని ప్రదే శంలో భద్రతపై దేవస్థానం, జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమాన కూల్చివేతలు జోరందుకోగా ఎక్కడా కనీస రక్షణ చర్యలు కానరావడం లేదు. ఇదేకాక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. ఆలయంలోకి ఎటువైపు నుంచి, ఎలా వెళ్లాలనే అంశంపై కనీస అవగాహన కల్పించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంరామయ్య స్వామిని చూసుకోవాలని దూరం నుంచి కుటుంబ సభ్యులతో వచ్చాం. ఎటు చూసినా కూల్చివేతల శిథిలాలే ఉన్నాయి. దీంతో ఏ దారిన పోవాలో, ఎక్కడి నుంచి రావాలో తెలియలేదు. స్టేడియంలోని బురద రోడ్డులో భయం భయంగా నడిచాం. అధికారులు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. – సీతారామ స్వామి, యానాం -
వైదిక బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆస్థాన పురోహితుడి నియామకంలో వైదిక బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ప్రతినిధులు మంగళవారం ఆయనను కలిసి పురోహితుడి నియామక ప్రక్రియపై అభ్యంతరాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భక్త రామదాసు కాలం నుంచి ఆస్థాన పురోహితుడి పదవిలో వైదిక బ్రాహ్మణులనే నియమించే ఆనవాయితీ కొనసాగుతుండగా, ఇటీవల అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖ కమిషనర్తో చర్చిస్తానని పేర్కొన్నారు. పురోహిత సంఘం అధ్యక్షుడు రామావజల రవికుమార్తో పాటు కోవూరు సుందర రామశాస్త్రి, రాయప్రోలు సత్యప్రసాద్శర్మ, ఆర్.వీరభద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. పాత పోడు భూముల జోలికి వెళ్లొద్దు దుమ్ముగూడెం: మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధి గద్దమడుగు గ్రామస్తులు సాగు చేసుకుంటున్న పాత పోడు భూముల జోలికి అటవీశాఖ అధికారులు వెళ్లొదని ఎమ్మెల్యే వెంకట్రావు సూచించారు. కొన్ని రోజులుగా గద్దమడుగులో జరుగుతు న్న వివాదం నేపథ్యాన మంగళవారం ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి స్థానికులు, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. గ్రామస్తులు గత 35 ఏళ్ల క్రితమే పోడు నరికినందున వారిని సాగుకు అనుమతించి, కొత్త పోడు కొట్టకుండా చూడాలని తెలిపారు. సర్పంచ్లు కోర్స దుర్గ, కల్లూరి ఆదినారా యణ, పొడియం సుబ్బారావు, కుర్సం రవి, నాయకులు ముర్రం వీరభద్రం, అన్నెం సత్యాలు, పూసం ధర్మరాజు, ఇర్ప వీర్రాజు, కొమరం బాలకృష్ణ, మడకం నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యానగర్కు చెందిన వెంకట్రావు చాన్నాళ్ల క్రితమే కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన హైదరాబాద్తో పాటు స్వస్థలంలోనూ ఓటు హక్కు కలిగి ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికల వేళ అక్కడ, పంచాయతీ ఎన్నికల సమయంలో ఇక్కడ ఓటు వేశాడు.
● స్వగ్రామాలపైనే ఓటర్ల మక్కువ ● మమకారానికి తోడు ఆస్తులు ఉండడమే కారణం ● అక్కడే ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తున్న పలువురు ● జిల్లాలో వేగం పుంజుకున్న డిజిటలైజేషన్ సొంతూరికే ఓటు!చుంచుపల్లి: జీవనోపాధి, వ్యాపారం, ఉద్యోగం రీత్యా జిల్లా నుంచి హైదరాబాద్, ఇతర పట్టణాలకు ఏళ్ల క్రితమే వేలాది కుటుంబాలు వెళ్లాయి. వీరిలో చాలా మంది స్వస్థలాలతో పాటు ప్రస్తుతం ఉంటున్న పట్టణాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. అయితే, ‘సర్’లో భాగంగా రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించడంతో సొంతూరికే జై కొడుతున్నారు. స్వస్థలాలపై మమకారానికి తోడు ఇక్కడ భూములు, సొంత ఇళ్లు, ఆస్తులు ఉండడంతో ఎప్పటికై నా స్థిరపడొచ్చని ఓటు హక్కు కొనసాగించేందుకు ముందుకొస్తున్నారు. తొలగింపు భయం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చాలామంది జీవనోపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, సూరత్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రాంతాలకు వెళ్లారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల్లో వీరు రెండుచోట్ల ఓటేసిన దాఖలాలు ఉన్నాయి. మొత్తంగా 18 వేల నుంచి 20 వేల మందికి రెండేసి చోట్ల ఓటుహక్కు ఉన్నట్లు అంచనా. అయితే, ‘సర్’లో భాగంగా డబుల్ ఓట్లు తొలగించడమే కాక రెండుచోట్ల ఓటుహక్కు ఉన్నట్లు తేలితే జైలుశిక్ష విధిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. దీంతో పట్టణాల్లోని ఓటు హక్కు వదులుకుని, గ్రామాల్లోనే ఎన్యుమరేషన్ ఫారాలు నింపి వెళ్తున్నారు. వారాంతాలు, ఇతర సెలవుల్లో కుటుంబాలతో వస్తున్న పలువురు ఎన్యుమరేషన్ పత్రాలు తీసుకుని తిరస్కరణకు గురికాకుండా తప్పులు లేకుండా నింపి ఇస్తున్నారు. చకచకా డిజిటలైజేషన్ జిల్లాలో ‘సర్’ తొలినాళ్లతో పోలిస్తే ప్రస్తుతం వేగాన్ని పుంజుకుంది. గాడిలో పడిన ప్రక్రియను గడువులోగా విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటర్లు కూడా తొలుత పట్టించుకోకున్నా, ఇప్పుడు ఓటుహక్కు కోల్పోతామనే భయంతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు ఇస్తున్నారు. దీనికి రెవెన్యూ సిబ్బంది, పలు పార్టీల నాయకులు కూడా సహకరిస్తుండడంతో ఫారాల సేకరణ చకచకా జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లతో పత్రాలను నింపడమే కాక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారికి సమాచారం ఇస్తున్నారు. దీంతో వారం రోజులుగా ఎన్యుమరేషన్ పత్రాల సేకరణ, డిజిటలైజేషన్ ఊపందుకుంది. జిల్లాలోని 9,96,198 మంది ఓటర్లకు గాను సోమవారం నాటికి 7,06,766 మంది (70.95 శాతం) డిజిటలైజేషన్ పూర్తయింది. అత్యధికంగా భద్రాచలంలో 73 శాతం, అత్యల్పంగా కొత్తగూడెంలో 68.82 శాతం పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఇంకా పూర్తిస్థాయిలో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు కొంత సహకారం లోపించిందని సమాచారం. నియోజకవర్గం ఓటర్లు ఆన్లైన్ పూర్తి శాతం పినపాక 2,04,518 1,40,831 68.86 ఇల్లెందు 2,28,211 1,66,330 72.88 కొత్తగూడెం 2,50,085 1,72,112 68.82 అశ్వారావుపేట 1,60,221 1,15,684 72.20 భద్రాచలం 1,53,163 1,11,809 73.00 మొత్తం 9,96,198 7,06,766 70.95 -
రైతుల సంక్షేమమే లక్ష్యం
ములకలపల్లి: ప్రజలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా శక్తి మేర కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ములకలపల్లి మండలం రాజుపేట శివారులో మంగళవారం ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైతులు సంప్రదాయ పంటలకు బదులు పోలిస్తే సుస్థిర ఆదాయం కోసం పామాయిల్ సాగు చేయాలని సూచించారు. ఒకసారి నాటితే సుమారు 30 ఏళ్లపాటు రాబడి ఉంటుందని వివరించారు. కాగా, ఎల్నినో నేపథ్యాన రైతులు అపరాల సాగు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగులో భద్రాద్రి జిల్లా ప్రథమ స్థానాన ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 90 వేల ఎకరాల్లో సాగవుతుండగా, ఈ ఏడాది కొత్తగా 15 వేల ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. ఆతర్వాత 50శాతం రాయితీపై రైతులకు కంది. మినుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఏఓ బాబూరావు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ బిందుస్వామి, సర్పంచ్ కొర్సా చంద్రలేఖ, ఏఓ అరుణ్బాబు, ఆయిల్పామ్ రైతులు ఆలపాటి రామచంద్రప్రసాద్, చిలకపాటి జైచందర్రావు, పర్వతనేని అమర్నాథ్, పువ్వాల మంగపతి, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, అడపా నాగేశ్వరరావు, బాల అప్పారావు, నరాటి ప్రసాద్, తాండ్ర ప్రభాకర్రావు, కరుటూరి కృష్ణ, కొయ్యల అచ్యుతరావు, ఊకే రవి, కారం సుధీర్ పాల్గొన్నారు. ఫ్లెక్సీ రగడ మంత్రి తుమ్మలను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన స్వా గత ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయ డం వివాదాస్పదంగా మారింది. వేదికకు వెళ్లే మార్గం, చుట్టుపక్కల నాయకుడు పాలకుర్తి సుమిత్, సర్పంచ్ చంద్రలేఖ కొర్సా తదితరులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా మంగళవారం ఉదయంలోగా చిరిగిపోయా యి. అధికార పార్టీలో విబేధాల నడుమ చింపేశారా, గాలికి చినిగిపోయాయా అనేది తెలియరాలేదు. ఈక్రమంలోనే సమావేశానికి కాంగ్రెస్ మండల అద్యక్షుడు జహీరుద్దీన్, తదితరులు గైర్హాజరైనట్లు తెలిసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (సీఎఫ్ఎల్) కొత్తగూడెం రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఇటీవల లిటరసీ సెంటర్ను ఏర్పాటు చేయగా మంగళవారం ఆయన సీఎఫ్ఎల్ ప్రతినిధులు, సీఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ శర్మ మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థి క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని తెలిపారు. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థి క అక్షరాస్యతను పెంచి, బ్యాంకింగ్ సేవల వినియోగాన్ని విస్తరించాలని సూచించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతో పాటు జన్ధన్ యోజన ఖాతాల కేవైసీపై సూచనలు చేశారు. సమావేశంలో కొత్తగూడెం లీడ్ బ్యాంక్ మేనేజర్ రామి రెడ్డి, అధికారులు భానుపద్మశ్రీ, బాదావత్ కిశోర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. 24న కోటమైసమ్మతల్లి జాతర దుకాణాలకు వేలం కారేపల్లి: మండలంలోని ఉసిరికాయలపల్లిలో జరిగే శ్రీకోటమైసమ్మతల్లి జాతరకు సంబంధించి దుకాణాలకు వేలం పాటలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త పర్సా పట్టాభిరామారావు, ఈఓ కటుకూరి వెంకట య్య తెలిపారు. ఆలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. దసరా సందర్భంగా అక్టోబర్ 15 నుంచి 11 రోజుల పాటు జాతర జరగనుందని చెప్పారు. జాతరలో పలు రకాల దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చేలా వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత ధరావత్తు చెల్లించి పాల్గొనాలని, వేలంలో షాపు దక్కించుకుంటే మొత్తం సొమ్ములో 50 శాతం చెల్లించడమే కాక మిగతా సొమ్ముకు చెక్కు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. గురుకుల అభ్యర్థులకు రేపు ఇంటర్వ్యూలు పాల్వంచరూరల్: జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలు, జూనియ ర్ కాలేజీల్లో అధ్యాపకులు, ఇతర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 23న డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పాల్వంచలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల(సీఓఈ) కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని జిల్లా సమన్వయ అధికారి కె.వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థులు గురువారం ఉద యం 9.30 గంటల కల్లా ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. నవోదయలో నేటి నుంచి రీజినల్ స్థాయి యోగా పోటీలు కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోద య విద్యాలయలో బుధవారం నుంచి మూ డు రోజుల పాటు రీజినల్ స్థాయి యోగా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో రీజి యన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన 288 మంది బాలబాలికలు హాజరవుతారని ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచే వారిని ఆగస్టు 30నుంచి పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లా నవోదయ విద్యాలయలో జరిగే జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నవో దయ విద్యాలయాల్లో రీజినల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా పాలేరు విద్యాలయ యోగా పోటీలకు వేదికగా ఎంపికై ంది. పలు ఆంతాల విద్యార్థులు మంగళవారం సాయంత్రానికి చేరుకున్నారు. అకాడమీలో ప్రవేశానికి పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యాన ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాలకు సోమవారం పోటీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అథ్లెట్లు హాజరయ్యారు. వీరికి స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, 600 మీటర్ల పరుగు, 30 మీటర్ల షటిల్ రన్ పోటీలు నిర్వహించారు. తొలిదశ పోటీలు పూర్తికాగా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాక ఎంపికై న వారి జాబితా విడుదల అవుతుందని నిర్వాహకులు తెలిపారు. పోటీలను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి పర్యవేక్షించగా, కోచ్లు, అసోసియేషన్ ప్రతినిధులు ఎం.శ్రీనివాసరావు, ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు నీరు లేదు..
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యాన వాస్తవాలను క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు చేరవేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులపై శాసీ్త్రయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలపై అంచనాకు వచ్చిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం ఎల్నినో సంసిద్ధతమై ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర టీ.ఎస్., అంకిత్, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఏడాది ప్రణాళిక ఉండాలి రానున్న మూడు నెలలకే పరిమితం కాకుండా కనీసం ఏడాది కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి సూచించారు. మండలాల వారీగా పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వర్షపాతం, తాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఎల్నినో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈనెల 15నాటికి ఉమ్మడి జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం ఉన్నా, రైతులు ప్రస్తుతం పత్తి అధికంగా సాగు చేశారని తెలిపారు. వర్షాలు వస్తే వరి సాగుకు సిద్ధమవుతున్నారని, భూగర్భ జలాలు ఉన్న వారు నార్లు పోశారని అధికారులు అధికారులు వివరించారు. అనంతరం తెలంగాణ జలసిరి, ఎల్నినో సూపర్ స్థితిలో తీసుకునే చర్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు. ఇంకా ఈ సమావేశంలో పోలీస్కమిషనర్ సునీల్దత్, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.వర్షాభావం దృష్ట్యా రానున్న రెండు నెలల్లో భూగర్భ జలాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రైతులెవరూ వరి సాగు చేయొద్దద్దని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. . గత ఏడాది, ఈ ఏడాది నీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపై సమగ్ర నివేదికను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ గ్రామంలో వర్షపాతం పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నీటి లభ్యత ఆధారంగానే పంటలు ఎంపిక చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. నీరు అధికంగా అవసరముండే వరి తదితర పంటలను ప్రోత్సహించకుండా, పెసర, మినుములు, కందులు, చిరుధాన్యాలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తే ఆగస్టు, సెప్టెంబర్ల్లో నీటి సమస్య మరింత తీవ్రమైతే ఇబ్బంది పడతారని తెలిపారు. ఇదే సమయాన ఉమ్మడి జిల్లాల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వైరా, లంకా సాగర్ జలాశయాలను తాగునీటి అవసరాల కోసమే నింపుతున్నామని వెల్లడించారు. -
వేములూరును సందర్శించిన డీఎఫ్ఓ, పీఓ, సబ్కలెక్టర్
అశ్వాపురం: వేములూరు గ్రామాన్ని ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ఠ, డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్సింగ్ సోమవారం సందర్శించారు. తొలుత మణుగూరులో ఎఫ్డీఓ కార్యాలయంలో వేములూరు పోడు భూముల వద్ద ఘర్షణలో గాయపడ్డ అటవీశాఖ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామానికి సందర్శించి సర్పంచ్ పవన్, గ్రామస్తులతో మాట్లాడారు. పోడు వివాదం గురించి తెలుసుకున్నారు. గిరిజనులు, ఆదివాసీలు పోడు భూములకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలతో ఐటీడీఓ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, ఎఫ్డీఓ బాబు, మణుగూరు, అశ్వాపురం ఎఫ్ఆర్ఓలు ఉపేందర్, సత్తార్అలీ, డీఆర్ఓలు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, తహసీల్దార్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు. -
వాణిజ్య పంటలతోనే అభివృద్ధి
కొణిజర్ల: వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం పరిగణనోకి తీసుకుని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తోందని చెప్పారు. ఇదే సమయాన రైతుల ఆర్థిక స్థిఽతిగతులు మెరుగుపడాలంటే సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కొణిజర్ల మండలం అంజనాపురంలో రూ.300 కోట్ల వ్యయంతో గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ నిర్మించిన సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మర్ నాదిర్ బి.గోద్రెజ్లతో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఫ్యాక్టరీలో గెలల ప్రాసెసింగ్ యూనిట్లు, నియంత్రణ వ్యవస్థను పరిశీలించాక భట్టి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతులు వినూత్న పంటల సాగుకు చిరునామాగా నిలుస్తున్నారని తెలిపారు. జిల్లాలు విడిపోయాక ఫ్యాక్టరీలు, సింగరేణి సంస్థ భద్రాద్రి జిల్లాలోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని తెలిపారు. 2023లో టన్ను పామాయిల్ గెలల ధర రూ.12 వేలు ఉంటే ప్రస్తుతం రూ.23 వేలకు చేరడంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కొణిజర్ల మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం రైతులకు వరమని తెలిపారు. ఈ కాంప్లెక్స్లో సీడ్ గార్డెన్, మిల్లింగ్ మిషన్, రిఫైనరీ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ఇక్కడి సీడ్ గార్డెన్ దేశానికే నాణ్యమైన పామాయిల్ విత్తనాలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పామాయిల్ హబ్గా తెలంగాణ ఆయిల్పామ్ సాగులో గణనీయంగా పురోగతి సాధిస్తున్న తెలంగాణ రానున్న ఐదేళ్లలో దేశానికి హబ్గా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాకే పరిమితం అయిన ఈ పంట నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగవుతోందని చెప్పారు. ప్రత్యేగా సీడ్ గార్డెన్తో పాటు పరిశోధనా కేంద్రం, రైతులకు అవగాహన కలిపించడానికి సమాఽధాన్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గంటకు 30 టన్నుల ఆయిల్ క్రషింగ్ సామర్ధ్యం కలిగిన ఈ ఫ్యాక్టరీని దశల వారీగా 120 టన్నులకు చేర్చనుండగా, 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. మహిళల పాత్ర పెరగాలి గోద్రెజ్ సంస్థఽల చైర్పర్సన్ నాదిర్ బి.గోద్రెజ్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో మహిళలు భాగస్వాములు కావాలని సూచించారు. మహిళల పాత్ర పెరిగితేతే దేశం వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంజానాపురంలోనే త్వరలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.సురేంద్రమోహన్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడగా గోద్రెజ్ ఆగ్రోవెట్ వైస్ చైర్మన్ బుర్జీన్ ఎన్.గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఎండీ, సీఈఓ సునీల్ కటారియా, ఆయిల్పామ్ సీఈఓ సౌగత నియోగి, దీపాంశుగుప్తా, ఉద్యాన శాఖ డైరక్టర్ యాస్మిన్ బాషా, టీజీ పెడ్ చైర్మన్ పవన్కుమార్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్దత్ పాల్గొన్నారు. -
రామయ్య కల్యాణం... కమనీయం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం రామయ్య స్వామి నిత్యకల్యాణం పరమానందంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సింగరేణిలో ఇంటర్నల్ నోటిఫికేషన్రుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్నల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు పర్సనల్ (రిక్రూట్మెంట్ సెల్) విభాగం జీఎం ఏజే మురళీధర్రావు సోమవారం వివరాలు వెల్లడించారు. ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ–1లో 96 పోస్టులు, ఎలక్ట్రీషియన్ కేటగిరీ–1లో 63 పోస్టులను అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, హార్డ్కాపీతో పాటు అవసరమైన అన్ని రకాల జిరాక్స్ కాపీలను ఆగస్టు 8న జీఎం కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. హార్డ్ కాపీలను ఏరియా కార్యాలయం నుంచి ఆగస్టు 11లోగా సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. ‘ఎడవల్లి’కి గౌరవ డాక్టరేట్ కొత్తగూడెంఅర్బన్: న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటా సెంటర్లో జరిగిన ఇండో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ కాన్క్లేవ్ వేడుకల్లో మదర్ థెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ – టెక్నాలజీ (పెద్దపల్లి) వ్యవస్థాపక చైర్మన్ ఎడవల్లి కృష్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన మేరీల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ చేతుల మీదుగా డాక్టరేట్ స్వీకరించినట్లు తెలిపారు. విద్యారంగంలో, లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్క్లబ్ సభ్యులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. వరి నారుకు నూకలుచండ్రుగొండ: రైతులు వరినారు సస్యరక్షణకు నూకలు(బియ్యం) చల్లుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ రైతు వరి నారులో నూకలు చల్లిన ఘటన సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో జిల్లాలోనూ పలువురు నారుమళ్లలో నూకలు చల్లుతున్నారు. దీనివల్ల నారుమడి సారవంతం కావడంతో పాటు కలుపు నివారణ, మడిలో వానపాములు (ఎర్రలు) పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. కాగా, వాస్తవమేనని ఏఓ వినయ్ను తెలిపారు. -
ప్రభుత్వ పథకాలతో ఆర్థికాభివృద్ధి
భద్రాచలం: ప్రభుత్వ పథకాల సద్వినియోగంతో గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవా రం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిశీ లించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశా రు. అనంతరం పీఓ మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాలు, స్కిల్స్ డెవలప్మెంట్పై మహిళలు, యువత అవగాహన పెంచుకోవాలన్నారు. ఐటీడీఏకు వచ్చే గిరిజనుల పట్ల సానకూలంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్డీసీ ఆనంద్ కుమార్, డీడీ చందన, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, ఏడీడిఎంహెచ్ఓ సైదులు, ఏఓ సున్నం రాంబాబు, గన్యా నాయక్, నారాయణరావు, సమ్మయ్య, మణిధర్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ -
పోడు రగడ
అశ్వాపురం: మండల పరిధిలోని మనుబోతులగూడెం గ్రామపంచాయతీలోని వేములూరు గ్రామంలో పోడు రగడ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 17న వేములూరులో ఫారెస్ట్ భూమిలో కందకాలు తవ్వేందుకు వెళ్లిన అటవీ సిబ్బంది, స్థానిక గిరిజనులకు ఘర్షణ జరిగింది. దీంతో అటవీ సిబ్బంది, గిరిజన మహిళలు గాయపడ్డారు. ఘర్షణ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ఆదివాసీ, గిరిజన సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పలు వురు ఆదివాసీలను పరామర్శించి అటవీశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కోవడమేమిటని ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆదివాసీలే తమ విధులను ఆటంకం పరిచి, తమపై దాడులు చేశారని అటవీ అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు. విచారణ జరిపి దాడి చేసిన వారిని శిక్షించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. కాగా, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. జూన్ 26న అటవీ శాఖకు, గిరిజనులకు ఒప్పందం జూన్ 26న వేములూరులో పోడు భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారులు, స్థానిక ఆది వాసీలకు ఒప్పందం జరిగింది. సర్పంచ్ పవన్, రాజకీయ నాయకులు, గ్రామపెద్దల సమక్షంలో పోడు భూముల విషయంపై చర్చించారు. గిరిజన ఆదివాసీలు సాగు చేసుకునే భూమి, అటవీ శాఖకు కేటాయించే భూమిపై ఇరువర్గాలు సామరస్యంగా మాట్లాడుకున్నారు. గిరిజనుల భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లకూడదని, అటవీ శాఖ భూమి జోలికి గిరిజనులు వెళ్లకూడదని హద్దులు నిర్ణయించుకుని ఒప్పందం చేసుకుని, పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. అయినా దాడులెందుకు... ఒప్పందం నేపథ్యంలో అటవీ అధికారులు, సిబ్బంది జేసీబీతో కందకాలు తవ్వేందుకు వెళ్లగా, గిరి జనులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు వాగ్వా దం జరిగి, ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య ఒప్పందం జరిగాక దాడుల వరకు ఎందుకు వెళ్లింది? అమాయక మహిళలను రెచ్చగొట్టి దాడులకు ఊసిగొల్పారా? పథకం ప్రకారమే దాడి జరిగిందా? తదితర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియోలను అటవీ శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కిన్నెరసాని ఫారెస్ట్ డివిజన్ అధికారి అధ్యక్షుడిగా, చంద్రుగొండ, యానంబైలు ఫారెస్ట్ రేంజ్ అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. మను బోతులగూడెం ఫారెస్ట్ బీట్ అధికారిని విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా సస్పెన్షన్లో ఉంచారు. అటవీశాఖ అధికారిని సస్పెండ్ చేయడమంటే దోషిగా నిర్ధారించినట్లు కాదని ఉన్నతాధికారులు చెబుతున్నా రు. మహిళల గౌరవానికి, భద్రతకు అటవీ శాఖ కట్టుబడి ఉందని, ఘటనకు ముందు పరిణామాలు, అధికారుల విధులకు కలిగిన ఆటంకాలు, తొలుత వారిపై దాడి తదితరాలను పరిశీలించాలని పేర్కొంటున్నారు. అన్ని ఆధారాలను అధికారులు విచారణ కమిటీకి అందజేయాలని, దోషులని తేలితే చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. -
ఇక చిత్రకూట మండపం తొలగింపు..
● శిల్పకళా స్తంభాల తరలింపునకు ప్రయత్నాలు ● 45 ఏళ్లుగా అనేక ఉత్సవాలకు సాక్షిభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతున్నా యి. ఇప్పటికే ఉత్తర ద్వారం, కుసుమ హరనాథబాబా ఆలయం, వంటశాలను పూర్తిగా తరలించారు. చిత్రకూట మండపాన్ని తొలగించే చర్యలు కూడా ముమ్మరమయ్యాయి. మండపంలోని శిల్పాకళా స్తంభాలు, ఇతర కళాత్మక దృశ్యాలను కొత్తగా నిర్మించే చిత్రకూట మండపంలో తిరిగి ప్రతిష్టించాలని అధికారులు భావించారు. దీంతో ఆ స్తంభాలు దెబ్బతినకుండా భద్రపర్చాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్లాబును కార్మికులతో డ్రిల్లింగ్ చేయిస్తూ, ఒక్కో భాగాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. మండపానికి ముందు, వెనుక భాగంలో ఉన్న ద్వారాలను తొలగించారు. పిల్ల ర్లుకు సైతం నంబర్లను రాసి, ధ్వంసం కాకుండా పూర్తిగా కవర్చేశారు. చిత్రకూట మండపం పూర్తిగా తొలగించేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు దశాబ్దాల చరిత్ర.. శ్రీ భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో నాటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా జూలై 15, 1967లో చిత్రకూట మండపానికి శంకుస్థాపన చేశారు. 1982 ఏప్రిల్ 4న నాటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పీవీ చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక ఉత్సవాలకు సాక్షిగా నిలిచింది. పూర్వకాలంలో శ్రీరామనవమికి, భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు, రద్దీగా ఉన్న సమయంలో నిత్యకల్యాణాలకు, సత్యనారాయణస్వామి సామూహిక వ్రతా లకు, పెళ్లి కొడుకు వేడుకగా భావించే హోలి రోజున జరిగే తలంబ్రాలు కలిపే వేడుక, లడ్డూల తయారీలో, ప్రతీ నెల జరిగే ఆలయ హుండీ లెక్కింపు అన్నింటికి చిత్రకూట మండపమే వేదిక. అలాంటి విశిష్టత కలిగిన వేదిక కొద్దిరోజుల్లో నేలమట్టం కానుంది. -
ఎల్నినో!
వరి, మక్కలకు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త యాక్షన్ ప్లాన్ రూపొందించింది. జూలైలో జిల్లాలో గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, జూ లురుపాడు, చండ్రుగొండ మండలాల్లో సాధారణ వర్షపాత నమోదయ్యే అవకాశం ఉందని, మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. ఆ తర్వాత వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతమే నమోదు కాబోతుందని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోతాయి. మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులైన కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగులకు ఆశించిన వరద లేదు. సగం మారాలి ఎల్నినో దృష్ట్యా నీటిని అధికంగా ఉపయోగించే వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాల పంటలను భారీ స్థాయిలో సాగు చేయించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పోల్చి చూస్తే అపరాల సాగు పెంచడం వ్యవసాయ అధికారులకు సవాల్గా మారింది. గత ఖరీఫ్లో జిల్లాలో 6,09,250 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో ఉద్యాన, అగ్రోఫారెస్ట్రీని మినహాయిస్తే ఇతర పంటలు 4,85,553 ఎకరాల్లో వేశారు. అత్యధికంగా 2,19,445 ఎకరాల్లో పత్తి సాగైంది. ఆ తర్వాత వరి పంట 1,69,253 ఎకరాల్లో, మొక్కజొన్న 90,886 ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలే 99 శాతం వ్యవసాయ భూముల్లో పండించారు. జిల్లా వ్యాప్తంగా సగం మంది రైతులకు అలవాటైన వరి నుంచి ఒక్కసారిగా ఇతర పంటలవైపు మళ్లించాల్సి ఉంటుంది. వేచి చూస్తున్నారు ఎల్నినో కారణంగా వరి పండించే రైతులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. గత సీజన్లో 1.69 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, జూలై 15 వరకు కేవలం 30 వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. కొనుగోళ్లలో ఎదురైన ఇబ్బందులతో గత సీజన్లో 90 వేల ఎకరాల్లో సాగైన మొక్కజొన్న ఈసారి 57 వేల ఎకరాలకు పడిపోయింది. యథావిధిగా పత్తి రికార్డు స్థాయిలో రెండు లక్షలకు పైగా ఎకరాల్లో సాగువుతోంది. మొత్తంగా జూలై 15 నాటికి 1,48,889 ఎకరాల్లో ఇంకా వ్యవసాయ పనులు మొదలు కాలేదు. దీంతో తగ్గుముఖం పట్టిన వరి, మొక్కజొన్నల సాగుకు సంబంఽధించిన 1,38,198 ఎకరాల్లో ఆపరాల పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్లో పేర్కొంది. కందులు, పెసర, మినుములు వంటి అపరాల పంటలు, కూరగాయల విషయంలో వ్యవసాయశాఖ నిర్దేశించుకున్న లక్ష్యానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య ప్రస్తుతం పొంతన కుదరడం లేదు. నిర్దేశిత స్థాయిలో కందిసాగుకు 1,955 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా, జిల్లాలో ప్రస్తుతం 105 క్వింటాళ్ల విత్తనాలే అందుబాటులో ఉన్నాయి. 32 క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు అవసరం కాగా, ప్రస్తుతం 2 క్వింటాళ్లే వ్యవసాయశాఖ, బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర అపరాల పంటల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సవాళ్లను దాటుకుని పప్పు ధాన్యాల సాగును పెంచాల్సి ఉంది.పంట ఈ ఏడాది గతేడాది లక్ష్యం సాగైన విస్తీర్ణం కందులు 48,878 596 పెసర 6,516 160 మినుములు 7,995 1940 మొక్కజొన్న 51,948 90,886 జొన్నలు 2,982 –– చెరకు 1,291 53 కూరగాయలు 6,530 575 ఇతర 13,349 230 -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో అందించే వినతులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్వేణుగోపాల్ ప్రజలనుంచి విన తులు, ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సవైరామ్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతీ వినతిని సకా లంలో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని ఇలా.. ● దరఖాస్తు చేసి రెండు నెలలు గడిచినా తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలేదని కొత్తగూడేనికి చెందిన గుగులోతు కృష్ణకుమారి ఫిర్యాదు చేయగా, కొత్తగూడెం ఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ● ధరణి సర్వే సమయంలో తన ఇంటి పన్ను అంచనా విలువ పొరపాటున సున్నాగా నమోదైందని, దీంతో ఇంటి పన్ను విధించడం లేదని సారపాక గాంధీనగర్ గ్రామపంచాయతీకి చెందిన తన్నీరు నాగదేవి తెలిపారు. ఇంటి పన్ను రశీదు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు తదితర సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటి పన్ను అంచనాను సరిచేసి పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును జిల్లా పంచా యతీ అధికారికి ఎండార్స్ చేశారు. ● తాను ఎంఏ, బీఎడ్ పూర్తి చేశానని, ఉపాధి అవకాశం కల్పించాలని ఇల్లెందు మండలం రొంపేడు గ్రామపంచాయతీకి చెందిన భాగ్యలక్ష్మి అర్జీ అందించగా, జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎండార్స్ చేశారు. ● సర్వే నంబర్ 228/2లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడంలేదని జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రా మానికి చెందిన రవీందర్ ఫిర్యాదు చేయగా, దరఖాస్తును జూలూరుపాడు తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
●బధిరురాలి ఆవేదన..
డబుల్ బెడ్ రూం ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు పాల్పడుతున్నవారి పై చర్యలు తీసుకోవా లని మణుగూరు మండలం రామానుజవరం గ్రామపంచాయతీకి చెందిన, బధిర వృద్ధురాలు ఇర్రి జానకమ్మ ఫిర్యాదు చేసింది. బంధువుల సహాయంతో సోమవారం ప్రజావాణికి హాజరైంది. జానకమ్మకు భర్త కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఇచ్చే పెన్షన్ ఆధారంగానే జీవనం సాగిస్తోంది. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయగా, అందులోనే నివసిస్తోంది. ఇటీవల కాలంలో ఇళ్లకు మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని, తనను అక్కడి నుంచి ఖాళీ చేయాలని, తన పేరు లిస్టులో లేదంటూ వేధిస్తున్నారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. -
కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల నిరసన
సూపర్బజార్(కొత్తగూడెం): వేములూరు ఘటనపై ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట బాధితులు, వివిధ సంఘాల మద్దతుతో నిరసన తెలిపారు. ప్రజావాణిలో అదనపకు కలెక్టర్ వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో విత్తనాలు వేస్తుంటే అటవీశాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఫెన్సింగ్ వేసేందుకు జేసీబీలో వచ్చారని తెలిపారు. అడ్డుకున్న ఆదివాసీలపై విచక్షణ రహితంగా దాడి చేసి, తిరిగి వారే కేసులు పెట్టారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీజేఎస్, ఇతర కుల సంఘాల నాయకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీజేఎస్, ఎస్సీహెచ్ హక్కుల పోరాట సమితి, బీసీ సంఘం, పీడీఎస్యూ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ నాయకులు పాల్గొన్నారు. టీజీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాంచందర్టేకులపల్లి: టేకులపల్లికి చెందిన గుగులోత్ రాంచందర్ తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మూడోసారి ఎన్నికయ్యారు. పాల్వంచలో ఈ నెల 17,18 తేదీల్లో జరిగిన సమాఖ్య రాష్ట్రమహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది. పవర్ లిఫ్టర్కు పతకాలుభద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన రిటైర్డ్ ఎస్బీఐ అధికారి డీవీ శంకరరావు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) లో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ అండ్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాపియన్ షిప్లో సత్తా చా టాడు. సోమవారం జరిగిన పోటీల్లో మూడు వ్యక్తిగత విభాగాలతోపాటు ఓవరాల్ చాంపియన్షిప్ గెలిచి నాలుగు పతకాలు సాధించాడు. 73 ఏళ్ల వయసులో పతకాలు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాష్ట్ర పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.మల్లేష్, జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు. టీఐసీసీఐ ప్రధాన కార్యదర్శిగా సీతారాంపాల్వంచ: ట్రైబల్ ఇండియన్ చాబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జిల్లా జనరల్ సెక్రటరీగా పాల్వంచకు చెందిన ధర్మసోతు సీతా రాం నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ధరావత్ శ్రీనివాస్ నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సీతారాం తెలిపారు. సింగరేణి అధికారులకు శిక్షణరుద్రంపూర్: డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 అమలుపై సింగరేణి కార్పోరేట్ అధికారులకు కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్హౌస్లో సోమవారం శిక్షణ ఇచ్చారు. హెచ్ఆర్డీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన హిందుస్తాన్ అకా డమి ఆఫ్ లా ప్రొఫెజర్ వి.పార్వతీశం శిక్షణ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 108 అంబులెన్స్ తనిఖీ బోనకల్: బోనకల్, చింతకాని మండలాలకు సేవలందిస్తున్న 108 అంబులెన్స్ను ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్(ఈఎంఈ) ఆలేటి ప్రవీణ్కుమార్ సోమవారం తనిఖీ చేశారు. అంబులెన్స్లో మందుల లభ్యత, పరికరాల పనితీరును ఆయన పరిశీలించారు. బాధితుల నుంచి వచ్చే ఫోన్లకు సత్వరమే స్పందించి ఘటనాస్థలికి వెళ్లడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చని తెలిపారు. సిబ్బందితో తో మాట్లాడి పలు సూచనలు చేశారు. -
యువకుడి ఆత్మహత్య
టేకులపల్లి: మండలంలోని కోయగూడెం పంచాయతీ హనుమాతండాకు చెందిన యువకుడు గుగులోత్ శ్రీకాంత్ (23) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుగులోత్ రవి జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఫొటోగ్రఫీ, డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం సుజాతనగర్ మండలంలోని అమ్మమ్మ ఇంట్లో శుభకార్యం ఉండగా కుటుంబ సభ్యులు నలుగురూ వెళ్లారు. సోమవారం సాయంత్రం శ్రీకాంత్ తనకు అర్జెంట్ పని ఉందంటూ శ్రీకాంత్ స్వగ్రామానికి వచ్చి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు హడావిడిగా వెళ్లడంతో అనుమానం వచ్చి తండ్రి రవి కూడా స్వగ్రామానికి వచ్చాడు. అప్పటికే శ్రీకాంత్ ఉరి వేసుకుని మృతి చెందాడు. తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై టేకులపల్లి ఎస్ఐ తిరుపతిని వివరణ కోరగా.. విచారణ చేపట్టామని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని తెలిపారు. గంజాయి సీజ్కారు, రెండు బైక్లు స్వాధీనం పాల్వంచ: ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రూ. 20లక్షల విలువైన గంజాయిని సీజ్ చేశారు. సోమవారం ఎకై ్సజ్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి వెల్లడించిన వివరాలు.. పాల్వంచ మండలం రంగాపురం వద్ద వాహన తనిఖీలు చేపట్టిన క్రమంలో ఓ కారులో తనిఖీ చేయగా 27.5కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడు మల్కన్గిరికి చెందిన బినయ సర్కార్గా గుర్తించారు. గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. మరో ఘటనలో మరో రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 6.2 కేజీల గంజాయి లభించింది. నిందితులు ములకలపల్లికి చెందిన నూపా రవికిరణ్, తాళ్ల ధనరాజ్లుగా తేలింది. మరో వాహనంలో 6.3 కేజీల గంజాయి లభించగా, నిందితులు భద్రాచలానికి చెందిన వేల్పుల భరత్, గద్దల శశాంక్లుగా గుర్తించారు. మూడు బైక్లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పాల్వంచ ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారులు ఎ.శ్రీనివాస రెడ్డి, సీహెచ్.శ్రీనివాస్, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పామ్ గెలల ట్రాక్టర్బోల్తాఅశ్వారావుపేట: అశ్వారావుపేట పోలీస్స్టేషన్ సెంటర్లో ఆయిల్పామ్ గెలలను తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ట్రైలర్ సోమవారం బోల్తా పడింది. బస్టాండ్ రోడ్ నుంచి ఫ్యాక్టరీకి గెలలను తరలించే క్రమంలో మాంసం దుకాణాల వద్ద మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఇల్లెందురూరల్/టేకులపల్లి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని రొంపేడు గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్లతో కలిసి శంకుస్థాపన చేశారు. తొలుత సబ్స్టేషన్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్రోడ్డులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం కోయగూడెంలో ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం, లోవోల్జేజీ సమస్యలు ఉత్పన్నం కాకుండా సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఎల్నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. తాగునీటి వనరుల పరిరక్షణ, వన్యప్రాణులకు నీటి లభ్యత, వ్యవసాయ రంగానికి అవసరమైన చర్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రొంపేడు, ముత్యాలంపాడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ఉపకేంద్రాలతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు, కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్రెడ్డి, రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, సీఈ రాజు చౌహాన్, ఎస్ఈ మహేందర్, సర్పంచ్ భూక్య అనూష తదితరులు పాల్గొన్నారు. -
సీతారామా.. కనుమా !
అవసరమైన ప్రభుత్వ, ప్రైవేట్ భూమి 10,069.29 ఎకరాలు పాత ఆయకట్టు స్థిరీకరణ 3.45ఎకరాలు ఇప్పటివరకు పూర్తి 4 కి.మీ.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ అడ్డంకిగా మారింది. ఈ ప్రాజెక్టు పరిధిలో అటవీ, ప్రైవేట్, ప్రభుత్వ భూములు ఉండడం, కొన్ని భూములు వన్యప్రాణులు జీవించే సున్నిత పర్యావరణ ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్) కావడంతో సమస్య నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణానికి 10,069.29 ఎకరాలతోపాటు అటవీ భూములు 808.18 ఎకరాలు అవసరం కాగా.. ఇందుకోసం భూయజమానులకు రూ.1,027.02 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందులో కొందరు రైతులు నిరాకరించడం, కోర్టులకు వెళ్లడం, అటవీ అనుమతులు జారీ కాకపోవడం, పరిహారం పెండింగ్ వంటి కారణాలతో ఆలస్యమవుతోంది. అయితే గతంలో సేకరించిన కొంత భూమికి రూ.135 కోట్ల పరిహారం విడుదలకు ఇటీవల పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అలాగే, మొత్తం భూసేకరణ రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించిన నేపథ్యాన అంతా అనుకున్నట్టు జరిగితే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగనుంది. 6.74 లక్షల ఎకరాల సాగు.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం 2016లో రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత పలుమార్లు అంచనాలను సవరించగా, 2025లో రూ.19,324.92 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కింద 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు నూతన ఆయకట్టు 3.29 లక్షల ఎకరాలు ఉంటుందని ప్రకటించారు. ఎనిమిది డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు, నాలుగు పంప్హౌస్లు ప్రతిపాదించారు. ప్రాజెక్టులో సాగునీటికి 63.13 టీఎంసీలు, తాగునీటికి 2.12 టీఎంసీలను కేటాయించనున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలోని బీజీ కొత్తూరు, వీకే రామవరం, కమలాపురం పంపుహౌస్ల నిర్మాణం పూర్తవగా వైరా రిజర్వాయర్కు నీరు విడుదల చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద నాలుగో పంపుహౌస్ పనులు కొనసాగుతున్నాయి. అనువైన చోట చకచకా.. ప్రాజెక్టు పరిధిలో 1 నుంచి 8 ప్యాకేజీల వరకు ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తయ్యాయి. జూలూరుపాడు టన్నెల్ పనులు మొదలుకావాల్సి ఉంది. అలాగే 9 నుంచి 12 ప్యాకేజీల్లో సత్తుపల్లి మెయిన్ కెనాల్ (యాతాలకుంట టన్నెల్తోసహా), బేతుపల్లి, దమ్మపేట బ్రాంచ్ కెనాళ్లు, పాలవాగు మెయిన్ కెనాల్, వినాయకపురం, గొల్లగూడెం కెనాళ్లు ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లో 115.86 కి.మీ.కు గాను 75.56 కి.మీ. మేర కాల్వల నిర్మాణం పూర్తయింది. యాతాలకుంట టన్నెల్ తవ్వకం పూర్తయి లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇక 13 నుంచి 16 ప్యాకేజీల్లో ఉన్న పాలేరు లింక్ కెనాల్లో 66.974 కి.మీ.కు గాను 27.474 కి.మీ. తవ్వకం పూర్తయింది. పాలేరు టన్నెల్లో 8.50 కి.మీ.కు గాను నాలుగు కి.మీ. పైగా పూర్తయ్యాయి. ప్రధాన దృష్టి.. ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణకే ప్రాధాన్యత ఇవ్వాలని తాజాగా పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బకాయిల చెల్లింపునకు రూ.135 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మంత్రుల సూచనలతో సర్వే వేగంగా పూర్తయి భూసేకరణ ఓ కొలిక్కి వస్తే సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి. ప్రాజెక్టుకు భూసేకరణ పెండింగ్ సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలకు భారీగా భూమి అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్ భూమి 10,069.29 ఎకరాలకు తోడు అటవీ భూ ములు 808 ఎకరాల వరకు కావాలి. ఇందులో కిన్నెరసాని వంటి ఎకో సెన్సిటివ్ జోన్లు ఉండడం, పోడు, అటవీ భూముల ద్వారా కాల్వలు తవ్వాల్సి ఉంది. వీటికి అటవీ శాఖ అనుమతులు సాధించడం, గిరిజనులకు పరిహారం చెల్లింపు సవాల్గా మారింది. పంపుహౌస్లతో పాటు 1–8 ప్యాకేజీల్లో ప్రధాన కాల్వల నిర్మాణానికి 80 శాతం వరకు భూసేకరణ పూర్తయినా, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు పెండింగ్ ఉంది. ఫలితంగా గత ఏడాదే టెండర్లు పిలిచినా ఫలితం లేదు. కాగా, ఖమ్మం జిల్లాలో 1,877.66 ఎకరాలు, భద్రాద్రిలో 6,399.53 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సిఉండగా, రెండు జిల్లాల్లో కలిపి 2,107.21 ఎకరాల్లో సర్వే పూర్తయింది. -
ఉత్తర ద్వారం కనుమరుగు
పూర్తిగా కూల్చివేసిన భద్రగిరి అధికారులుభద్రాచలంటౌన్: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర ద్వారం కాలగర్భంలోకి కలిసిపోయింది. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఉత్తర ద్వారాన్ని ఆదివారం పూర్తిగా కూల్చివేశారు. ఉత్తర ద్వారాన్ని 1972లో నిర్మించారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతుండటంతో 2010లో భారీగా విస్తరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ముక్కోటి ఉత్సవాల్లో ఉత్తర ద్వారం నుంచే స్వామివారు దర్శనమిస్తారు. ఏటా ఆ రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మూడేళ్లుగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో వినియోగించే ముత్యాల తలంబ్రాలను కలిపే కార్యక్రమాన్ని కూడా ఉత్తర ద్వారం మండపంలోనే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేవారు. దీంతో మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తర ద్వారం కూల్చివేతతో పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, కూల్చివేసిన స్థానంలో ఉత్తర ద్వారంను మరింత విస్తరించి నిర్మించనున్నారు. -
భూ రీసర్వేకు శ్రీకారం
పాల్వంచరూరల్: భూ భారతి చట్టం ప్రకారం భూముల హద్దులు, వివాదాల పరిష్కారానికి సాంకేతిక యంత్రాల ద్వారా భూ రీ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో 70 గ్రామాల్లో 64 వేల ఎకరాలను సర్వే చేయనుంది. మొదటి విడతగా 14 గ్రామాల్లో 7,034 ఎకరాల 9 కుంటలను సర్వే చేయాలని నిర్ణయించింది. తొలుత పాల్వంచ మండలం కారెగట్టు గ్రామ పంచాయతీ సారెకల్లు గ్రామంలో నాలుగు రోజుల క్రితం అధికారులు భూ రీ సర్వే చేపట్టారు. సర్వేకు 14 మంది ప్రభుత్వ సర్వేయర్లు, లైసెన్స్ పొందిన సర్వేయర్లు 206మందితో కలిపి ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. డిజిటల్ సాంకేతిక సర్వే విధానంపై వీరికి శిక్షణ కూడా ఇచ్చారు. సర్వే ప్రక్రియను తహసీల్దార్ దారా ప్రసాద్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కలెక్టర్ అంకిత్ పర్యవేక్షిస్తున్నారు. మ్యాప్, భూధార్ నంబర్ల కేటాయింపు డిజిటల్ భూ రీ సర్వేలో ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది? ఎన్ని పట్టాలు ఉన్నాయి.? ఎవరు సాగు చేస్తున్నారు? తదితర వివరాలు సేకరిస్తారు. ప్రతీ హక్కుదారుడైన రైతుకు భూమికి హద్దులు నిర్దేశించి డిజిటల్ మ్యాప్ను రూపొందిస్తారు. ఆ తర్వాత భూమి విస్తీర్ణ మ్యాప్తోపాటు భూధార్ నంబర్ కేటాయిస్తారు. మొదటి దశలో ప్రభుత్వ భూములు.. జిల్లా భూమి కొలతలు, రికార్డుల శాఖ ఏడీ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానంతో (రోవర్ యంత్రం ద్వారా) డిఫెరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం (డీజీపీఎస్)తో ప్రక్రియ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసిన గ్రామంలో హద్దులను నిర్దేశించి, ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులను సర్వే చేస్తారు. సర్వే బృందంలో మండల సర్వేయర్తోపాటు ఆర్ఐ, జీపీఓలు ఉంటారు. గ్రామంలో హద్దుల ఏర్పాటుకు స్థానికులతో కలిసి బండరాళ్లు నాటుతారు. తర్వాత ప్రభుత్వ భూమి ఎంత ఉంది? కబ్జాలో ఎంత ఉంది? సాగు భూమి ఎంత? సాగుచేయని భూమి ఎంత? పంట కాలువలు, కుంటలు, చెరువులు, బావులు, రహదార్లు తదితర వివరాలతో సర్వే చేసి మ్యాప్ తయారుచేస్తారు. గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు ఉన్న భూమి విస్తీర్ణాన్ని సర్వే చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పట్టా భూముల విస్తీర్ణాన్ని సర్వే చేస్తారు. డిజిటల్ భూ రీసర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూ హద్దుల సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో డిసెంబర్ వరకు భూ రీ సర్వే జరుగుతుంది. దీంతోపాటు నాలుగు నెలల నుంచి నక్ష ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నాం. ఇది మణుగూరులో బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్ సర్వే కింద కొనసాగుతోంది. – శ్రీనివాస్, భూమి కొలతల రికార్డుల శాఖ జిల్లా అధికారి, ఏడీపాల్వంచ: సారెకల్లు, రేపల్లెవాడ, కోయగట్టు, గుండాల : కోనావారిగూడెం, పినపాక: బొమ్మరాజుపల్లి, సీతారాంపురం, సున్నంవారిగూడెం, బూర్గంపాడు: పినపాక, ఇరవెండి, దుమ్ముగూడెం : గుర్రాలబయలు, ములకనపల్లి, లింగాపురం, సంగం, వీరాపురం -
నామినేటెడ్ పద్ధతిలో కేటాయించాలి
రుద్రంపూర్: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోయగూడెం–3, సత్తుపల్లి–3, మణుగూరు డిప్సైడ్, శ్రావణపల్లి బ్లాక్లను, ఆక్షన్లో పెట్టుకున్న 17 బ్లాక్లను కేటాయించి నిజాయితీని నిరూపించుకోవాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెంలో కార్పొరేట్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ, ఎన్టీయూసీ యూనియన్లు తామంటే తాము మెడికల్ బోర్డులు పెట్టించామని చెప్పుకుంటున్నాయని, అందులో కేవలం 20 శాతం అన్ఫిట్ చేయడం కార్మికులను మోసం చేసినట్లేనని విమర్శించారు. సుమారు 17 మాసాలు ఎదురుచూసిన వారిలో కనీసం 60, 70 శాతం అన్ఫిట్ చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో వైస్ ప్రసిడెంట్ పూసల వీరభద్రం, తుమ్మ శ్రీనివాస్, గడప రాజయ్య, వసీకర్ల కిరణ్, కాగతపు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రస్తుత మెడికల్ బోర్డ్ను వెంటనే రద్దు చేసి, తిరిగి మెడికల్ బోర్డ్ నిర్వహించాలని ఏఐటీయూసీ అదనపు కార్యదర్శి మిరియాల రంగయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డ్ బూటకపు ప్రక్రియ అని, దీనిని వెంటనే రద్దు చేసి, గతంలో అమలు చేసిన విధానంలోనే మెడికల్ బోర్డ్ నిర్వహించాలని కోరారు. ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీస్ కారణంగానే యాజమాన్యం మెడికల్ బోర్డ్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని, కానీ, బోర్డ్ పారదర్శకంగా జరగలేదని, కార్మికులకు భవిష్యత్ లేకుండా చేశారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్నవారిని అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. అంచనాల కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే కనకయ్యఇల్లెందు: శాసన సభ, శాసన మండలి అంచనాల కమిటీ చైర్మన్గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. కమిటీ సభ్యులుగా సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాలోతు రాందాస్, ఎం యశశ్వినిరెడ్డి, పి.రాకేష్రెడ్డి, ఎమ్మెల్సీలు సుంకరి రాజు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, వంటేరు యాదవ రెడ్డి తదితరులను నియమించారు. కనకయ్య నియామకంపై ఇల్లెందు కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు బోళ్ల సూర్యం, మండల రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ డి.కిరణ్ మిత్ర హర్షం వ్యక్తం చేశారు. బాస్కెట్ బాల్ ఎంపికలుపాల్వంచ: పట్టణంలోని కేటీపీఎస్ కాలనీలో ఉన్న బాస్కెట్ బాల్ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా జట్లను ఎంపిక చేశారు. పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల నుంచి సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ పోటీల్లో ప్రతిభ చాటాలని అన్నారు. నిర్వాహకులు రాకేష్, సురేష్, మునీర్, జగదీష్, సాయిచరణ్, స్నేహిత్, కీర్తన్, సాయికిరణ్, సుమంత్, హర్ష, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏలో గిరిజన దర్బార్..భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో... సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. -
‘విక్రమ్–1’లో మన వినయ్!
ఖమ్మంరూరల్: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన భారతీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1(ఆగమన్) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్ను రూపొందించగా.. ఈ బృందంలో జిల్లా యువకుడు వినయ్కుమార్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. వ్యవసాయం కుటుంబం.. జిల్లాలోని రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో వినయ్కుమార్ జన్మించాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ మూడేళ్లు, ఆతర్వాత లేటరల్ ఎంట్రీగా ఇంజనీరింగ్ మూడేళ్లు పూర్తిచేశాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఆతర్వాత ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈక్రమాన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీలో చేరాడు. ఇందులో భాగంగానే విక్రమ్–1 ప్రయోగంలో పాలుపంచుకోగా విజయవంతం కావడంపై పలువురు అభినందిస్తున్నారు. కాగా, శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ తమ కాలేజీ పూర్వ విద్యార్థి వినయ్కుమార్ తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ, ప్రయోగంలో పాలుపంచుకోవడం గర్వకారణమని తెలిపారు. ఆయనను శ్రీధర్తో పాటు డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మినారాయణ, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ వి.సుదర్శన్, వివి విభాగాల అధిపతులు వైశాలి, డాక్టర్ చార్యులు, కుమార్ తదితరులు అభినందించారు.తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో ఖమ్మం జిల్లా యువకుడు -
ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలి
పాల్వంచ: గిరిజన హక్కుల సాధనకు, ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలని అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్చార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నీరాజా సూచించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం రెండో రోజు జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య(టీజీఎస్) రాష్ట్ర మహాసభల్లో మాట్లాడారు. పాలకులు గిరిజన ప్రాంతాల్లో హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. తరతరాలుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజన బిడ్డలను భూములకు దూరం చేసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పోడు సాగుదారులపై దాడులు, నిర్బాంధాలను అడ్డుకుంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అడవిపై సర్వహక్కులు గిరిజనులవేనని అన్నారు. టీజీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మూర్తి నాయక్, అంజయ్య నాయక్ మాట్లాడుతూ గిరిజన సమాఖ్య బలోపేతం ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పోడు భూముల పట్టాల పంపిణీని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వి.పూర్ణచందర్ రావు, అడుసుమిల్లి సాయిబాబా, దశ్రు, రాహుల్, శ్రీనివాస్, కుటుంబరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నీరాజా -
‘హాజరు’లో ఆటంకాలు!
కొత్తగూడెంఅర్బన్: జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో సిగ్నల్ సమస్య వెంటాడుతోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరునమోదుకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని పాఠశాలల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మరికొన్ని పాఠశాలల్లో సిగ్నల్ ఉన్నా ఉపాధ్యాయులు సకాలంలో హాజరు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా, పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు పద్ధతి) ద్వారా యాప్లో అప్లోడ్ చేసినా సిగ్నల్ లేక నమోదు కావడంలేదు. ఉపాధ్యాయులు సాయంత్రం ఇళ్లకు వెళ్లాక హాజరు శాతం డీఈఓ కార్యాలయానికి చేరుతోంది. ఇటీవల డీఈఓ ఏజెన్సీ మండలాలల్లోని కొన్ని పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులు రాని పాఠశాలలు, హాజరు నమోదు చేయని పాఠశాలల ఉపాధ్యాయులను గుర్తించి హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. అయితే ఇంటర్నెట్ సమస్య వల్ల హాజరు నమోదులో సమస్యలు వస్తున్నాయని, ఇందుకు ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. నెట్ సిగ్నల్ రాని ప్రాంతాలు ఇలా... జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 1,070 ఉన్నాయి. ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రైమరీ పాఠశాలలకు ట్యాబ్లు, ఇంటర్నెట్ సౌకర్యం కోసం సిమ్లను అందజేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ట్యాబ్లు, కంప్యూటర్లు, సెల్ఫోన్లలో కూడా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు ట్యాబ్లు, సెల్ఫోన్ల యాప్లో హాజరు నమోదు చేసుకుని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు అప్లోడ్ చేయాలి. వారు ఎంఈఓలకు పంపిస్తే, అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి హాజరు వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఇదంతా ఉదయం 10.30 గంటలలోగా పూర్తికావాలి. అప్పుడే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ రోజు ఎంత మంది హాజరయ్యారనేది వెల్లడవుతుంది. గుండాల, దుమ్ముగూడెం, కరకగూడెం, అశ్వారావుపేట, చర్ల తదితర మండలాల్లో సిగ్నల్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో సకాలంలో హాజరు నమోదు, అప్లోడ్ కావడంలేదు. దీంతో కొందరు ఉపాధ్యాయులు సాయంత్రం ఇళ్లకు వెళ్లాక హాజరు వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఫలితంగా రోజూ 80 శాతం, అంతకంటే తక్కువగా హాజరు నమోదు కనిపిస్తోందని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వీడని కొందరు ఉపాధ్యాయులు జిల్లాకు గతేడాది నుంచి రెగ్యులర్ డీఈఓ లేరు. ఇటీవలే రెగ్యులర్ డీఈఓ నియమితులయ్యారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొత్త డీఈఓ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాక కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. విద్యాశాఖ అధికారులు మరింత దృష్టి సారించి హాజరు నమోదు చేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కొన్ని పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ నమోదుకు ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య ఎదురవుతోంది. అయి తే సిగ్నల్ సమస్య లేని పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. అలాంటి వారికి నోటీసులు జారీ చేశాం. ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్లో నిర్లక్ష్యం వహించొద్దు. –డి.వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారి -
కోయ–గోండి భాషకు అధికారిక గుర్తింపు ఇవ్వాలి
భద్రాచలంటౌన్: కోయ–గోండి భాషకు అధికారిక గుర్తింపు కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో మాతృ భాషలోనే ప్రాథమిక విద్యను అందించాలని జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమ కమిటీ చైర్మన్ ఫగ్గన్సింగ్ కులస్తేకు ఆదివాసీ సంఘాలు వినతిపత్రం సమర్పించాయి. ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్లో జరుగుతున్న 11వ జాతీయ కోయ–గోండి భాషా ప్రామాణికరణ వర్క్షాప్ రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, భద్రాచలం పట్టణానికి చెందిన జాతీయ సమన్వయకర్త మడివి నెహ్రూ నేతృత్వంలో ఆదివాసీ భాషల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రతి ఐటీడీఏలో స్థానిక భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. దీనిపై ఫగ్గన్ సింగ్ కులస్తే మాట్లాడుతూ.. కోయ–గోండి భాషా గుర్తింపు అంశాన్ని ఇప్పటికే లోక్సభలో ప్రస్తావించానని, ఈ విషయాన్ని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ఉపాధ్యాయులు పీసొడి కన్నయ్య, పాయం వెంకటరత్నం, ఇర్ప రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా చావలచుంచుపల్లి: రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా చావల పురుషోత్తం ఎన్నికయ్యారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామపంచాయతీ ఎస్ఆర్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన ఫోరం సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. లోతువాగు గ్రామ ఉపసర్పంచ్ యాకుబ్పాషాను లక్ష్మీదేవిపల్లి మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నియమించారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఈ మేరకు నియామక పత్రాలు అందజేశారు. ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామారావు, రాష్ట్ర కార్యదర్శి కిషోర్నాయక్, ఉపసర్పంచులు వెంకట నరసయ్య, రాజు పాల్గొన్నారు. -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యాన్నదానానికి విరాళంభద్రాచలం: ఆలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆదివారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఊట్ల గ్రీష్మణ్ శ్రీరామ్ రూ. 50 వేల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఆలయ సిబ్బంది రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నదీహారతిభద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదావరికి నదీ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య గణపతి పూజ, 108 ప్రమిదల దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం సీతారాములకు 12 సార్లు, గోదావరి మాతకు 21 సార్లు హారతులు సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురోహితులు రామవజ్జల రవికుమార్, పవన్ కుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, ఫణికుమార్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన పొనక బాబూరావు (41) గత నెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మస్సివాగు గ్రామంలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు యదళ్లపల్లి నరేశ్, బాబూరావు ఇద్దరు కలిసి బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన గేదెను తప్పించబోయి చెట్టును ఢీకొన్న ఘటనలో బాబూరావు గాయపడ్డాడు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. మోరీలో జారిపడి రిటైర్డ్ కార్మికుడి మృతి సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం టూటౌన్ పరిధిలోని రుద్రంపూర్కు చెందిన రిటైర్డ్ కార్మికుడు పులిగోరి ఐలయ్య (68) శనివారం రాత్రి నాలేరియా ప్రాంతంలోని మోరీ సైడ్ వాల్పై కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడి దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్ఐ జీవన్రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూటీ చోరీపై కేసు భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయం షెడ్డులో ఈ నెల 6వ తేదీన పార్కింగ్లో ఉంచిన ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ) గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అప్పటి నుంచి తెలిసిన వారిని, పట్టణ పరిసరాల్లో గాలించిన కారణంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు ఆలస్యం అయిందని విజయలక్ష్మి.. శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. టౌన్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. -
అథ్లెటిక్స్లో జిల్లాకు ఏడు పతకాలు
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇటీవల రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్ షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఏడు పతకాలు సాధించారు. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ ఆదివారం వివరా లు వెల్లడించారు. రెండు బంగారు, రెండు రజత, మూడు కాంస్య పతకాలు గెలుచుకున్నారని తెలిపారు. పతకాలు సాధించినవారిలో పి.హర్షిత, విజయదుర్గ, సమీరా, వి.వెన్నెల, వి.విశ్వప్రశాంతి, తాటి వర్షిత, సున్నం శైలు ఉన్నారని పేర్కొన్నారు. విజేతలను జిల్లా క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి, అథ్లెటిక్స్ కోచ్లు పి.నాగరాజు, పి నాగేందర్, పవన్ అభినందించారు. గురుకులాలకు డిజిటల్ బోర్డులుపాల్వంచరూరల్: గురుకులాల్లో ప్రభుత్వం బ్లాక్ బోర్డులకు స్వస్తి చెబుతూ డిజిటల్ బోర్డులు అందిస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యామ్సైడ్ గిరిజన గురుకుల పాఠశాలకు 2, మోడల్ స్పోర్ట్స్ స్కూల్కు 3, పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు 2, భద్రాచలం గురుకులానికి 2 చొప్పున అందించింది. డిజిటల్ బోర్డులపై 8,9,10 తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులకు బోధన కొంత సలువుకానుంది. ‘ఆర్యవైశ్య’ రాజకీయ కమిటీ వైస్చైర్మన్గా ఖాదర్ టేకులపల్లి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్చైర్మన్గా మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి ఖాదర్బాబును నియమించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ జారీచేసిన నియామక పత్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షుడు దారా రమేశ్ ఆదివారం ఖాదర్బాబుకు అందజేశారు. కాగా, ఖాదర్బాబును పలువురు అభినందించారు. 108 ఈఎంఈగా ప్రవీణ్కుమార్ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా అత్యవసర సేవల విభాగం 108 సర్వీస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్(ఈఎంఈ) గా ఆలేటి ప్రవీణ్కుమా ర్ నియమితులయ్యా రు. ఇన్నాళ్లు ఈఎంఈ గా ఉన్న అవులూరి దుర్గాప్రసాద్ వనపర్తి జిల్లాకు బదిలీ కాగా, ఆయనను ఖమ్మం కార్యాలయంలో ఆదివారం 108, 1962, 102 వాహనాల ఉద్యోగులు సన్మానించి వీడ్కోలు పలికా రు. అనంతరం ప్రవీణ్కుమార్ బాధ్యతలు స్వీకరించగా శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర సర్వీసుల విభాగం అధికారులు, ఉద్యోగులు షేక్ నజీరుద్దీన్, షేక్ ఇమామ్ పాషా, తుమ్మా జగదీష్, శ్రీనివాస్, కొమ్ము వెంకటేష్, గొల్లమందల కృష్ణ, భాస్కర్, వినోదరావు, మేడా పుల్లారావు, భూషయ్య, కృష్ణయ్య, రేణుక, విజయలక్ష్మి, సంగిశెట్టి మోహన్, సయ్యద్ ఖాద్రీ, సీతా రాంబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల నిధుల ఖర్చుపై ఆడిట్పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలలో ఖర్చు చేసిన నిధుల వినియోగంపై హైదరాబాద్కు చెందిన ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. ఆదివారం స్థానిక కేటీపీఎస్ కాలనీలోని అభ్యుదయ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్బీ, సీవీసీఏ ఆడిట్ అధికారులు సత్యనారాయణ, శ్రీమన్నా రాయణ, తనూజ్, కరుణాకర్ ఉపాధ్యాయుల నుంచి రికార్డులు, క్యాష్బుక్స్, బిల్లులు, ఓచర్లు పరిశీలించారు. స్వచ్ఛభారత్, బడిబాట ఇతర కార్యాక్రమాల నిర్వహణకు చేసిన ఖర్చులను ఆడిట్ చేశారు. జిల్లాలోని కేజీబీవీలు, కళాశాలల నిర్వహణ ఖర్చులను సైతం తనిఖీ చేశారు. అయితే, ఆడిట్ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసినందుకు ఆయా ప్రధానోపాధ్యాయుల నుంచి చేతివాటం ప్రదర్శించినట్లు పలువురు వాపోయారు. భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. -
సర్వే వేగవంతం చేయాలి
బూర్గంపాడు: భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్లో ఆదివారం జిల్లా రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. మోరంపల్లిబంజరలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను నిర్వహించారు. అనంతరం పినపాక పట్టీనగర్ నుంచి ఉప్పుసాక గ్రామానికి రూ 2.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అదనంగా సర్వేయర్లను, రోవర్ పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అటవీ, రెవెన్యూ భూముల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని చెప్పారు. అటవీ భూముల్లో కొత్తగా పోడుసాగు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాల్వంచలోని శ్రీనివాసగుట్ట అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో మొదటి విడతలో 4,500 ఇళ్లు, రెండో విడతలో 2 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజు, జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
నేటి సీఎం పర్యటన రద్దు
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ఇటీవల ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్, అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయితే, సీఎం పర్యటన రద్దయిందని తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయకున్నా భారీ వర్ష సూచనతో సీఎం రేవంత్రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. అయితే, అంజనాపురంలోని గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారమే ప్రారంభించేలా సన్నాహాలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. వీరితో పాటు గోద్రెజ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సునీల్ కటారియా, ఆయిల్పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగీ హాజరవుతారని వెల్లడించారు. ఈమేరకు ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ సుమారు వేయి మంది ఆయిల్పామ్ రైతులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం.పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ప్రత్యేక లోక్అదాలత్లో 63 కేసుల పరిష్కారంసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో 63 కేసులు పరిష్కారయ్యాయి. కొత్తగూడెంలో చెక్బౌన్స్ కేసులు 17, బ్యాంకు పీఎల్సీ కేసులు 27, మొత్తం 44 కేసులు పరిష్కారమయ్యాయి. భద్రాచలంలో చెక్ బౌన్స్ కేసులు 7 బ్యాంకు పీఎల్సీ కేసులు 5, మొత్తం 12 కేసులు, మణుగూరులో చెక్బౌన్స్ కేసులు 4, దమ్మపేటలో మూడు బ్యాంక్ పీఎల్సీ కేసులు పరి ష్కారమైనట్లు జ్యుడీషియల్ వర్గాలు తెలిపాయి. స్వయం ఉపాధి దరఖాస్తుల గడువు పొడిగింపుసూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకం దరఖాస్తు గడువు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ ఇన్చార్జ్ జిల్లా అధికా రి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. స్వయం ఉపాధి పథకం కింద కుట్టుమిషన్, చిన్న బిజినెస్, ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్బైక్లకు అర్హత ఉన్నవారు tso bmms. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 95534 91432 నంబరులో సంప్రదించాలని కోరారు. లచ్చగూడెం వాసి అవయవదానంఇల్లెందురూరల్: మండలంలోని లచ్చగూడెం గ్రా మానికి చెందిన రంగినేని లక్ష్మారెడ్డికి బ్రెయిన్ డెడ్ కావడంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతి చెందాడు. అవయవదానం చేయాలని బతికుండగా తనతో తండ్రి చెప్పిన మాటలను గుర్తుంచుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వర్థన్రెడ్డి ఆస్పత్రి వైద్యాధికారులను సంప్రదించాడు. లక్ష్మారెడ్డి కాలేయం, రెండు మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను ఆస్పత్రికి దానంగా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కుటుంబీకులను గ్రామస్తులు అభినందించారు. సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంసూపర్బజార్(కొత్తగూడెం): బీసీ సంక్షేమశాఖ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత దీర్ఘకాలిక కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, అనంతరం పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. వివరాలకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో, 08742–227427, 94419 31359, నంబర్లలో సంప్రదించాలని కోరారు. మెడికల్ బోర్డులో 24 మంది అన్ఫిట్రుద్రంపూర్: సింగరేణి ప్రధానాస్పత్రిలో ఈ నెల 17,18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డ్లో 24 మందిని అన్ఫిట్ చేశారు. మొత్తం 120 మందిని బోర్డుకు పిలవగా 28 మంది గైర్హాజరయ్యారు. హాజరైనవారిలో ఫిట్ఫర్ సేమ్ జాబ్కు 38 మంది, అండర్ గ్రౌండ్కు అన్ఫిట్గా 29 మందిని గుర్తించారు. మరొకరిని హయ్యర్ రిఫరల్కు ఎంపిక చేశారు. కాగా, దరఖాస్తుదారుల్లో 20 శాతం మందినే అన్ఫిట్ చేయడంతో కార్మిక కుటుంబాలు నిరాశ చెందాయి.


