breaking news
Sangareddy
-
స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక..
● ప్రిషా సింగ్, రాశీ సింగ్, విష్ణుప్రియ‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన ఫ్యాంటసీ కామెడీ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాశీ సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం ఈ సినిమాలోని ‘రంభ ఊర్వశి మేనక... స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మా ఊరు స్వర్గమండి... అది ఆకాశం అంచున ఉంటదండి..., అరె... దిగి వచ్చాం... పండగే చేసుకోండి...’ అంటూ సాగే ఈ పాటకు సురేష్ బనిసెట్టి సాహిత్యం అందించగా, విజయ్ పోలాకి కొరియోగ్రఫీ వహించారు. ఈ చిత్రసంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ స్వరకల్పనలో ధనుంజయ్ సీపాన, సాహితీ చాగంటి ఈ పాటను పాడారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో రాశీ సింగ్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో నేను చేసిన డిఫరెంట్ సినిమా ఇది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని చెప్పారు ప్రిషా సింగ్. ‘‘రంభ ఊర్వశి మేనకల చుట్టూ తిరిగే కథ ఇది’’ అని తెలిపారు విష్ణుప్రియ. -
రోడ్డుప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం
● ఆటోను ఢీకొట్టిన డీసీఎం ● ఓ కేసు విషయమై పీఎస్కు వెళ్తుండగా ఘటన జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కోహీర్ మండలంలోని బడంపేట గ్రామానికి చెందిన రాచయ్య(48) జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న రాచయ్య తన భార్య పద్మమ్మ(40)ను తీసుకొని ఆటో నడుపుకుంటూ వికారాబాద్ జిల్లా బంట్వారం పోలీసు స్టేషన్లో హాజరు వేసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డీసీఎం ఆటోపైకి ఎక్కడంతో అందులో ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పొలానికి వెళ్తుండగా.. కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. సదాశివపేటకు చెందిన నారాయణగౌడ్ (68) 40 ఏళ్లుగా పటాన్ చెరులో నివాసం ఉంటున్నారు. గురువారం సదాశివపేటలోని తన వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. కంది ఐఐటీ హైదరాబాద్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వెనుక వైపు నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నారాయణ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
డిసెంబరులో లెగసీ
● విశ్వక్ సేన్డిసెంబరులో విశ్వక్ సేన్ ‘లెగసీ’ థియేటర్స్కి రానుంది. విశ్వక్ సేన్ హీరోగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లెగసీ’. ఏక్తా రాథోడ్ హీరోయిన్గా నటిస్త్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గురువారం ప్రారంభమైంది. విశ్వక్ సేన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం అంశాలతో సాగే ఈ కథలో ఒక వారసుడు ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతను తన తండ్రి గతానికి సంబంధించి దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ సినిమా కథనం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత. -
బలమైన భావోద్వేగాల సహా...
శివ కుమార్ కాసారం హీరోగా నిషాంత్ దోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు). శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య హీరోయిన్లుగా నటించారు. తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను... చాలా బాగుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ–‘‘సహా–ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని పోస్టర్ పెట్టారు. ఇలా పెట్టాలంటే ధైర్యం కావాలి. సినిమా ఆ అంచనాలను అందుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘చిన్న సినిమా బ్లాక్బస్టర్ కొడితే ఎలా ఉంటుందో మా చిత్రంతో చూపిస్తాం’’ అన్నారు శివకుమార్. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు నిరుత్సాహపడితే అమీర్పేట్ సెంటర్లో నిలబడి గుండు గీయించుకుంటాను’’ అని శ్వేతా లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలున్నాయి’’ అన్నారు నిశాంత్. ‘‘సహ’ గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటారు’’ అన్నారు వ్రజన పాండ్య. -
వీధి వ్యాపారులు, రుణాలపై సమీక్ష
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ మెప్మా విభాగాన్ని జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.ఏ. అలీమ్, డీఎంసీ మల్లేశ్వరి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ అనిత, ఆర్పీలతో కలిసి వీధి వ్యాపారులు, బ్యాంకు లింకేజీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మెప్మా ద్వారా మహిళా సంఘాలు, పట్టణ పేదల ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు రుణాల మంజూరు, గ్రూపుల పనితీరు, వీధి వ్యాపారులకు అందుతున్న సహాయంపై వివరాలను పరిశీలించారు. అనంతరం ఆక్సిజన్ పార్క్లోని బృందావన్ క్యాంటీన్ను సందర్శించి నిర్వహణ, మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. తెగిన విద్యుత్ వైర్ స్పందించని అధికారులు శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ లైన్కు మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని గురువారం రైతులు వాపోయారు. మండల పరిధిలోని సామ్య తండా సమీపంలోని వ్యవసాయ బోరుబావులకు కరెంటు సరఫరా చేసే వైరు నుంచి నిప్పురవ్వలు వస్తున్న విషయాన్ని మూడు రోజుల నుంచి సదరు లైన్మెన్కి చెప్పినా స్పందన లేదని రైతులు గుండునాయక్, రాజు, చందర్, విశాంత్, రవినాయక్ ఆరోపించారు. గురువారం ఆ వైర్ తెగి వ్యవసాయ పొలాల్లో పడిందని, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వాపోయారు. -
పర్యావరణ హితంగా..
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రకృతితో మరింత బంధాన్ని పెంచుకోవడానికి ప్రతి ఏటా విద్యార్థులు పర్యావరణ హితంగా వృక్షా బంధన్ నిర్వహించారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతి ఏటా రక్షా బంధన్ జరుపుకోవడమే కాకుండా పాఠశాల ఆవరణలోని మొక్కలకు, చెట్లకు తమ తల్లిదండ్రులతో కలిసి రాఖీలు కడుతున్నారు. మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రతిన బూనారు. అలాగే భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైతం ప్రకృతి ఒడిలో లభించే పువ్వులు, ఆకులతో తయారు చేసిన రాఖీలతో వేడుకలు జరుపుకొన్నారు. రావి ఆకుపై అనురాగ బంధం నారాయణఖేడ్: అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, లీప్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకుపై సోదరుడికి సోదరి రాఖీ కడుతున్న చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. -
వీర జవాన్ విగ్రహానికి రాఖీ
ప్రతి ఏటా కడుతున్న సోదరీమణులుఅక్కన్నపేట(హుస్నాబాద్): అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అయితే తమ సోదరుడు చనిపోయినా అతని విగ్రహానికి రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో చాటుతున్నారు. మండలంలోని దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్ సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ 2014లో నక్సల్స్ మందుపాతరలో మృతి చెందాడు. అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లింగయ్యనాయక్, సత్తవ్వ తమ వ్యవసాయ పొలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అతడికి ముగ్గురు అక్కలు ఉన్నారు. ఒక్కగానొక్క సోదరుడు చనిపోవడంతో తాము రాఖీ ఎవరికి కట్టాలని అతని సోదరీమణులు విగ్రహంలోనే తమ్ముడిని చూసుకుంటున్నారు. ఏటా రాఖీ పండుగకు విగ్రహానికి రాఖీ కడుతారు. అలాగే ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నరసింహనాయక్ విగ్రహం ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుతున్నారు. -
నటుడు–నిర్మాత జీవీ నారాయణ రావు ఇక లేరు
● ‘అంతులేని కథ’ సినిమాలో..ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు(73) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. చిన్నతనం నుంచే నాటకాలు, నటనంటే ఆయనకు మక్కువ.. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. విద్యార్థి దశలోనే ‘మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాప రుద్రీయం, మంచుతెర’ వంటి పలు నాటకాలు వేసి, తనదైన నటనతో మెప్పించారాయన. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి పలువురితో కలిసి రంగస్థల వేదికను పంచుకున్నారాయన. వారి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ‘అంతులేని కథ’తో పరిచయం నటనపై ఆసక్తితో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు నారాయణరావు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రజనీకాంత్, జయప్రద, శ్రీప్రియ, ఫటాఫట్ జయలక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1976 ఫిబ్రవరి 27న విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ‘వికటకవి గోపాల్’ పాత్రలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారాయణ రావు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ప్రత్యేకించి ఈ సినిమాలో ‘తాళికట్టు శుభవేళ... మెడలో కళ్యాణ మాల...’ పాటలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘ముత్యాల పల్లకి, ఒక ఊరి కథ, చిలకమ్మ చెప్పింది, ఆలు మగలు, గుప్పెడు మనసు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బడాయి బసవయ్య, ఊరుకిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, మంచు పల్లకి, ప్రళయ రుద్రుడు, బహుదూరపు బాటసారి, దేవాంతకుడు, ప్రేమాయణం, యముడికి మొగుడు, ముత్యమంత ముద్దు, రాజా విక్రమార్క, సీతారామయ్యగారి మనవరాలు, గ్యాంగ్ లీడర్, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, హిట్లర్, సాహసం, మహా భక్త సిరియాళ, రాజుగారి గది 2, తోలు బొమ్మలాట’ వంటి సుమారు 100కు పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు నారాయణ రావు. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం ‘స్కైలాబ్’. 2021 డిసెంబరు 4న ఈ మూవీ విడుదలైంది. నిర్మాతగానూ... నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ నారాయణరావుకి మంచి అనుభవం ఉంది. నిర్మాతగా ‘యముడికి మొగుడు, దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, పెళ్ళి నీకు శుభం నాకు’ వంటి సినిమాలను నిర్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నప్పుడు ఆయనకు రజనీకాంత్తో మంచి స్నేహం కుదిరింది. రజనీకాంత్, చిరంజీవితో ఆయనకు సన్నిహిత స్నేహం ఉంది. చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘యముడికి మొగుడు’ సినిమాని తన మిత్రుడు రజనీకాంత్తో తమిళంలోనూ రీమేక్ చేశారు. బుల్లి తెరపైనా... ‘పసుపు కుంకుమ, సుందరకాండ, గిరిజా కళ్యాణం, గీతాంజలి’ వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించారు నారాయణ రావు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగించారాయన. నారాయణరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావుగారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 1976లో ‘అంతులేని కథ’తో పరిచయమైన ఆయన ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణరావుగారితో నాకెంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – చిరంజీవి -
కాపర్ దొంగల అరెస్టు
కోహెడరూరల్(హుస్నాబాద్): కాపర్, అల్యూమినియం చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని వెంకటేశ్వపల్లి, ఆరెపల్లి, బస్వాపూర్ గ్రామాల శివారులోని ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్, అల్యూమినియం వైర్లతో పాటు పొలాల వద్ద మోటార్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు దరాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా సోమారం గ్రామానికి చెందిన లోకిని మహేశ్, హన్మకొండ జిల్లా గోకుల్నగర్కు చెందిన దేవర రాజశేఖర్ అపహరించిన వైర్లను ఆటోలో తీసుకొస్తుండగా సముద్రాల గ్రామం ఎక్స్రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మోటార్ స్టార్టర్ వైర్, 10కిలోల ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్, 100కిలోల అల్యూమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన పోలీసులు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
● పూలు, ఆకులతో రాఖీల తయారీ ● అన్నా చెల్లెళ్ల అనుబంధ ం గొప్పది ● రాఖీలు కడుతున్న సోదరీమణులు
బిస్కెట్లతో రూపొందించిన రాఖీ.. అక్కకు అంకితమిచ్చిన తమ్ముడు గజ్వేల్రూరల్: గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు బిస్కెట్లతో రూపొందించిన రాఖీని తన సోదరికి అంకితమిచ్చాడు. మూడేళ్ల క్రితం ఆయన అక్క సంధ్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తన సోదరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా వివిధ రూపాల్లో రాఖీని తయారు చేసి అంకితమిస్తున్నాడు. వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీని రూపొందించినట్లు రామరాజు తెలిపారు. -
దసరాకి రణబాలి ఫిక్స్
విజయ దశమి సందర్భంగా థియేటర్స్లోకి రానున్నాడు రణబాలి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ చిత్రంలో రణ బాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మికా మందన్నా, సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సెప్టెంబరు 11న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తాజాగా ‘రణబాలి’ని విజయదశమి సందర్భంగా అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. -
మత సామరస్యానికి ప్రతీక
12 ఏళ్లుగా హిందూ సోదరుడికి రాఖీ కడుతున్న ముస్లిం మహిళజహీరాబాద్ టౌన్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి కులం, మతం, రక్త సంబంధం అనే పరిమితులు లేవని నిరూపిస్త్తోంది ఓ ముస్లిం సోదరి. మత సామరస్యానికి ఆమె ఆదర్శంగా నిలుస్తోంది. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లికి చెందిన నాగరాజు(గ్రామ పాలన అధికారి) శాంతినగర్కు చెందిన ఎండీ కుద్దుస్ ఇద్దరూ మంచి మిత్రులు. అయితే కొన్నేళ్ల క్రితం అనుకోకుండా కుద్దూస్ మరణించాడు. ఆయన సోదరి షహీన్బేగం నాగరాజును సొంత అన్నలా భావించి 12 ఏళ్లుగా ప్రతి రాఖీ పౌర్ణమికి వచ్చి రాఖీ కడుతుంది. ఏటా రాఖీ పండుగకు ప్రత్యేకంగా జహీరాబాద్కు వచ్చి నాగరాజుకు రాఖీ కట్టి కట్టడం ఆనవాయితీగా మార్చుకుంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు.. వారు కూడా నాగరాజుకు రాఖీ కడుతున్నారు. మతాల హద్దులు చెరిపేసి, అనుబంధమే మిన్న అని చాటుతున్న వీరిని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
స్టార్డమ్ కాదు... సరైన కథతోనే విజయం
● విజయ్ దేవరకొండటాలీవుడ్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్ ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘షోస్టాపర్స్ 2026’ స్పెషల్ మ్యాగజీన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ కనిపించడం హాట్ టాపిక్ అయింది. కవర్ పేజీపై కనిపించడం మాత్రమే కాదు... ‘షోస్టాపర్స్ 2026’ టాప్ 100 జాబితాలోనూ అల్లు అర్జున్కి స్థానం లభించింది. ఈ జాబితాలో మరో తెలుగు హీరో రామ్చరణ్కు కూడా స్థానం లభించింది. ఈ లిస్ట్లో పేరు సంపాదించుకున్న తెలుగు హీరోలు ఈ ఇద్దరే కావడం విశేషం. 2025 జనవరి నుంచి 2026 మార్చి 31 వరకు వివిధ రంగాల్లో (సినిమా, ఓటీటీ, పుస్తకాలు, కళలు, ఫ్యాషన్ వంటివి) ప్రభావం చూపిన అత్యంత ప్రభావంతమైన టాప్ 100 సెలబ్రిటీల జాబితాను ‘షోస్టాపర్స్ 2026: ఇండియాస్ హండ్రెడ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్’ పేరిట ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసింది. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, మాధవన్, రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కంగనా రనౌత్, కల్యాణీ ప్రియదర్శన్ వంటి సినీ ప్రముఖులకు ఈ జాబితాలో స్థానం లభించింది. ఈ జాబితాకు ఎటువంటి ర్యాంకింగ్ ఆర్డర్ లేదు. ప్రముఖుల పేర్లలోని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జాబితాను విడుదల చేశారు. ఇక ఫోర్బ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘సినిమాలో మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకులకు కొత్త కథ అందించడమే అన్నింటికంటే ముఖ్యం. అలాగే ఒక సినిమాలోని నటీనటీనటుల స్టార్డమ్ కంటే కూడా ఆ చిత్రంలోని సరైన కథే ఆ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘రాకా’ సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. -
సెల్ఫోన్ పవర్బ్యాంకు పేలి
విద్యార్థికి తీవ్ర గాయాలుజహీరాబాద్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రాకేష్ తన జేబులో పెట్టుకున్న సెల్ఫోన్ పవర్బ్యాంకు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలిలా ఉన్నాయి. కోహీర్ మండలంలోని కొత్తూర్(డి) గ్రామానికి చెందిన రాకేశ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం మూత్రం పోసేందుకు పాఠశాల ఆరుబయట నిర్జన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ చెత్తలో పడిఉన్న సెల్ఫోన్ చార్జింగ్ కోసం ఉపయోగించే పవర్ బ్యాంకు లభించింది. దీంతో దాన్ని జేబులో పెట్టుకుని పాఠశాల ఆవరణలో తిరిగాడు. ఇంతలోనే పవర్బ్యాంకు పేలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో తోటి విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన విద్యార్థి రాకేశ్ను వెంటనే ఉపాధ్యాయులు, గ్రామస్తులు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంఈఓ జాకీర్ హుసేన్ విద్యార్థిని పరామర్శించారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన
హవేళిఘణాపూర్(మెదక్): బడీడు పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చట్ట ప్రకారం ఉచిత నిర్బంధ హక్కును కల్పించిందని జిల్లా న్యాయసేవాధికార సభ్యుడు కరుణాకర్ అన్నారు. మంగళవారం కూచన్పల్లి జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం, మహిళలు, చిన్నారులపై వేధింపులు, బాల్య వివాహాలు, పోక్సోచట్టం గురించి వివరించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధుమోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థినికి పరామర్శ మిరుదొడ్డి(దుబ్బాక): హాస్టల్ భవనం పైనుంచి దూకి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల ఉన్నత పాఠశాలలోని మూడంతస్తుల హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాల పాలైన వర్ధిని నిమ్స్ ఆస్పతిల్రో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు అందిస్తున్న చికిత్స వివరాలను అక్కడి వైద్యులను అడిగి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకున్నారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. 23 గోవా మద్యం బాటిళ్ల స్వాధీనం పటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్ టీటీఎఫ్ సీఐ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో ముత్తంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గోవాకు చెందిన 23 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పటాన్చెరు ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.9 లక్షలు హత్నూర(సంగారెడ్డి): రేషన్ బియ్యాన్ని మహా రాష్ట్రకు లారీలో తరలిస్తుండగా పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో డీటీసీఎస్ డిప్యూటీ తహసీల్దార్ దేవానంద్, ఎస్సై శ్రీధర్ రెడ్డి దౌల్తాబాద్ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పటాన్చెరు మండలం పాశమైలారం నుంచి మహారాష్ట్రకు లారీలో తరలిస్తున్న సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు రూ.9 లక్షలు ఉంటుందని తెలిపా రు. కాగా లారీ యజమాని వెంకటరాజు, డ్రైవ ర్ రాజశేఖర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీని పటాన్ చెరులోని రేషన్ గోదాంకు తరలించారు. కాగా ఈ నెల 18న కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న 291 క్వింటాళ్ల రేషన్ బియ్యంను దౌల్తాబాద్ చౌరస్తాలో పట్టుపడింది. రాష్ట్రస్థాయి చెక్ పోస్టులతో పాటు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు వాపోతున్నారు. పాముకాటుతో యువకుడి మృతి పెద్దశంకరంపేట(మెదక్): పాముకాటుతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జమ్లానాయక్ తండా పంచాయతీ పరిధిలోని ఇస్రానాయక్ తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దివ్యాంగుడైన ముడావత్ నరేశ్ (29)ను పాము కాటువేసింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే నరేశ్ మృతి చెందాడు. కాగా మృతుడు ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నకిలీ నంబర్ ప్లేట్ కారు పట్టివేత వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మద్దూరు(హుస్నాబాద్): నకిలీ నంబర్ ప్లేట్తో ఉన్న కారును పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వాహనంపై ఉన్న నంబర్ ప్లేట్ వేరే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. నకిలీ నంబర్ టీఎస్–36 ఎం–5844తో ఉన్న కారును పట్టుకొని స్టేషన్కు తరలించారు. మండలంలోని బైరాన్పల్లి గ్రామానికి చెందిన వంగపల్లి సాధును అదుపులో తీసుకున్నారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పుస్తెలతాడు చోరీ.. నిందితుడి అరెస్ట్
మెదక్జోన్: ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పట్టణ సీఐ మహేశ్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన బాల్శెట్టి సులోచన ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ నెల 23న, అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపుకొట్టాడు. తలుపు తెరవగానే నిందితుడు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సులోచన బంగారు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో తెగిపోయింది. కొంత బంగారం ఆమె చేతిలో మిగలగా, మరికొంత భాగాన్ని నిందితుడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా సోమవారం దాయర కాలనీవద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హవేలీ ఘనపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన చాకలి మొగులయ్య అనుమానాస్పదంగా కనిపించటంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
నర్సాపూర్: పర్యావరణ పరిరక్షణలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అర్బన్పార్కు ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి దివ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెశ్యాదవ్, డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్, సెక్షన్ ఆఫీసర్లు సాయిరాం, కలీమోద్దీన్, రాజమణిలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పురాతన శిల్పకళా సంపద వెలుగులోకి..
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని ఎనగండ్ల గ్రామంలో పురాతన శిల్పకళా సంపద వెలుగు చూసిందని జిల్లా చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ మంగళవారం తెలిపారు. గ్రామంలోని వివిధ ప్రదేశాల్లో పురాతన శిల్పాలు, శిల్పకళా ఖండాలు విస్తరించి ఉండటం ఇవి మెతుకు సీమ చారిత్రక వైభవానికి ముఖ్య ఆధారాలని పేర్కొన్నారు. స్థానిక ఆంజనేయ ఆలయం పక్కన నల్లరాతిపై చెక్కిన గజలక్ష్మి శిల్పం అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సాధారణంగా ఆలయ ద్వారబంధాల వద్ద కనిపించే గజలక్ష్మి రూపానికి భిన్నంగా, ఈ శిల్పంలో క్షీరసాగర మధనం దృశ్యాన్ని అద్భుతంగా చెక్కారని తెలిపారు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు వాసుకి నాగును ఉపయోగించి సముద్రాన్ని మధిస్తున్న దృశ్యం ఇందులో కనిపిస్తుందన్నారు. గజలక్ష్మి శిల్పానికి మరో వైపున విష్ణుమూర్తి రూపం కూడా చెక్కబడి ఉందని చెప్పారు. ఆలయంలోని యోగశయన మూర్తి శిల్పం కూడా విశేషమైన శిల్పకళకు నిదర్శనమని పేర్కొన్నారు. యోగశయనమూర్తి చుట్టూ దశావతార రూపాలతో పాటు అష్టదిక్పాలకుల ప్రతిరూపాలు చెక్కబడి ఉండటం ఈ శిల్పం కళాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. గ్రామంలోని మరొక ప్రాంతంలో సోమసూత్ర సహిత శివలింగం, అష్టమాతృకల శిల్పాలు, కాలగర్భంలో ధ్వంసమైన అనేక శిల్పఖండాలు ఉన్నాయని తెలిపారు. గ్రామంలోని శిల్పాలను సమగ్రంగా పరిశీలించి, వాటి చారిత్రక నేపథ్యాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
పంటల సర్వేకు ‘వలంటీర్లు’
● రెవెన్యూ గ్రామానికి ఒకరి నియామకం ● ఫొటో అప్లోడ్కు రూ.7 పారితోషికం జహీరాబాద్ టౌన్: పంటల సాగు వివరాలు లెక్క తీయడానికి వ్యవసాయ శాఖలో వలంటీర్ల నియామకాలు జరుగుతున్నాయి. త్వరలో వీరంతా పంట సర్వే చేపట్టనున్నారు. మండల విస్తీర్ణ అధికారులకు(ఏఈఓ) పరిధి ఎక్కువగా ఉంటుందని, వారికి డిజిటల్ సర్వే చేయడం ఇబ్బందిగా మారండంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ను నియమించి సర్వే బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో నియామకాలను చేపడుతున్నారు. ఏఈఓలు నో చెప్పడంతో.. ఖరీఫ్ సీజన్ పంటల వివరాలను సేకరించాల్సి ఉంది. పనిభారం వల్ల ఏఈఓలు సర్వేకు ససేమీరా అనడంతో ఈ బాధ్యతలను వలంటీర్లకు అప్పగిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఆదేశాల మేరకు మండల అధికారులు వలంటీర్ల నియమకాలు చేపడుతున్నారు. ప్రతీ రెవెన్యూ విలేజీకి ఒకరి చొప్పున జిల్లాలో సుమారు 596 మంది వలంటీర్లను వ్యవసాయ శాఖ నియమిస్తోంది. వలంటీర్లు స్థానికులై.. రైతుల భూములు ఎక్కడ ఉందనే వివరాలు తెలియాల్సి ఉంటుంది. బీఎస్సీ చదివి ఉండాలి కానీ ఎవరూ లేకుంటే పదవ తరగతి పాస్ అయిన వారిని నియమించుకుంటున్నారు. వలంటీర్ల విధులు వ్యవసాయ వలంటీర్లు రెవెన్యూ గ్రామ పరిధిలోని పంటల వివరాలను సేకరించాలి. శాటిలైట్ ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేసిన యాప్లో పంటల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ప్రతి ఫొటోకు రూ.7 చొప్పున వలంటీర్లకు పారితోషికం చెల్లిస్తారు. వలంటీర్లగా ఎంపికై న వారికి ఆన్లైన్ శిక్షణ ఇస్తారు.వలంటీర్ల నియామకాలు పూర్తి కావొస్తుండగా సర్వే పనులు ప్రారంభించి సెప్టెంబర్ నెలాఖరు వరకు సాగు సర్వే పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. వలంటీర్ల నియామకం పూర్తయితే ఏఈఓలకు పనిభారం తగ్గనుంది.నియామకాలు జరుగుతున్నాయి పంటల సాగు సర్వే కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు వలంటీర్ల నియామకాలు చేపడుతున్నాం. దాదాపు నియామకాలు పూర్తి కావస్తున్నాయి. త్వరలో వీరికి ఆన్లైన్ శిక్షణ ఇచ్చి యాప్ ద్వారా పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తాం. సర్వే పూర్తి అయితే ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో తెలుస్తుంది. –శివప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, సంగారెడ్డి -
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని తార డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. వాటిని నిరంతరం సంరక్షించాలని సూచించారు. చెట్లు పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని, తద్వారా మొక్కల వివరాలను నమోదు చేసి వాటి సంరక్షణపై పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్రెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, డీఎంహెచ్ఓ లలితాదేవి, ప్రిన్సిపాల్ ప్రవీణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
అదృశ్యం.. ఆపై వాగులో పడి మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): అదృశ్యమైన వృద్ధురాలు వాగులోపడి మృతి చెందింది. ఈ సంఘటన అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎమ్మ సాలవ్వ(70) మతి స్థిమితం సరిగా లేక తిరుగుతుండేది. ఇది వరకు సాలవ్వ పలు మార్లు అదృశ్యమై దొరికిన దాఖలాలు ఉన్నాయి. కాగా ఈ నెల 24న భూంపల్లిలో జరిగిన బంధువుల వివాహ వేడకకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె తప్పిపోయింది. అదే రోజు కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదైంది. కాగా సాలవ్వ ప్రమాదవశాత్తు కూడవెల్లి వాగులో పడిమృతి చెందినట్లు స్థానికులు మంగళవారం గుర్తించారు. -
అర్హులకు ఓటు హక్కు కల్పించాలి
తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు వెన్నెలగజ్వేల్: ఎస్ఐఆర్లో భాగంగా ఓటరు ముసాయిదాలో ఓటు గల్లంతైనవారిని పునరుద్ధరించేందుకు గ్రామస్థాయిలో బీఎల్ఏలు కృషి చేయాలని తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు వెన్నెల అన్నారు. మంగళవారం గజ్వేల్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిన్న, చిన్న తప్పిదాల వల్ల అర్హులు నోటీసులు అందుకుంటున్నారని, వారందరికీ ఓటు హక్కు దక్కేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య కొండపాక(గజ్వేల్): మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ కథనం ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన కాసర్ల దినేశ్(22) ఇంటర్మీడియెట్ విద్యనభ్యసించి జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై మంగళవారం తెల్లవారే సరికి ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: ఎస్డబ్ల్యూఎఫ్సంగారెడ్డి టౌన్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట సీఐటీయూ, ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను ప్రారంభించి మాట్లాడారు. కార్మిక సంఘాలతో జరిపిన చర్చలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి సాయిలు, మెదక్ రీజియన్ కార్యదర్శి తుల్జయ్య, రీజియన్ అధ్యక్షుడు అంజాగౌడ్ పాల్గొన్నారు. -
రోడు్డ ప్రమాదంలో యువకుడు మృతి
నిజాంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బచ్చురాజ్పల్లి గ్రామానికి చెందిన సుంచు స్వామి (24) ఉపాధి కోసం హైదరాబాద్లో డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై వాహనం నడుపుతూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వామిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం.. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన బాపని బంజరపల్లికి చెందిన పర్సు ఐలయ్య(58) తొగుట మండలం బండారుపల్లిలో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రేషన్ కార్డు తీసుకొని తన ద్విచక్ర వాహనంపై బండారుపల్లికి వస్తుండగా మార్గమధ్యలో కొల్గూరు శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. -
తిరుగులేని సంస్థ ‘భారతి సిమెంట్’
సంగారెడ్డి: వికాట్ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్స్ ప్రపంచ సిమెంట్ వ్యాపార రంగంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతోందని ఆ సంస్థ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ వట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో వికాట్ గ్రూప్ కంపెనీలు విస్తరించాయన్నారు. మంగళవారం సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికులు (మేసీ్త్ర)లకు ప్రమాద బీమా పత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇతర సిమెంట్లతో పోల్చితే భారతి అల్టాఫ్రాస్ట్తో చేపట్టిన నిర్మాణం వేగంగా పూర్తవుతుందన్నారు. టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ అల్టాఫ్రాస్ట్ వినియోగదారులకు తమ సంస్థ ఉచితంగా సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. స్లాబ్ కాంక్రీట్ వేస్తున్న సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి పనులను పర్యవేక్షించి తగిన జాగ్రత్తలు తెలియజేస్తారని తెలిపారు. ఇంటి నిర్మాణంలో క్రాక్స్ రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి మేసీ్త్రలకు వివరించారు. సమావేశంలో మార్కెటింగ్ విభాగం డిప్యూటీ మేనేజర్ గంగాధర్ రెడ్డి, డీలర్లు మోహన్రెడ్డి, నర్సింగ్రావు, వికాస్, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
ఇక మార్పులు, చేర్పులు సర్
సంగారెడ్డి జోన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27 నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహించి ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు ఆయా బూత్ లెవల్ అధికారులు చదివి వినిపించనున్నారు. కొత్త ఓటరు నమోదుకు అవకాశం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాను బూత్స్థాయి అధికారులు చదివి వినిపించడంతో పాటు అందుబాటులో ఉంచుతారు. అర్హులైన వారు జాబితాలో లేకుంటే గుర్తిస్తారు. అదేవిధంగా చనిపోయిన వారి, డూప్లికేట్ ఓటు, గ్రామాలు పట్టణాలను విడిచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్న వారి ఓటర్లను గుర్తిస్తారు. 2026 అక్టోబర్ 1 వరకు 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో వివరాలు తప్పుగా ఉంటే సవరణకు, అనర్హుల ఓటర్లను తొలగించేందుకు ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలుపవచ్చు. జాబితాలో అనర్హుల ఓటరు తొలగింపు కోసం సంబంధిత నియోజకవర్గం ఓటరు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 వరకు ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉంది. వచ్చిన ఫిర్యాదులు అక్టోబర్ 15 వరకు పరిశీలించి, పరిష్కరించనున్నారు. అనంతరం తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. ముసాయిదా ఓటర్లు 11,59,158 ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకారం జిల్లాలో 11,59,158 మంది ఉన్నారు. వీరిలో 5,75,067 మంది పురుషులు, 5,84,027 మంది మహిళలు, 64 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియకు ముందు 14,57,436 మంది ఓటర్లు ఉన్నారు. డిజిటలైజేషన్ అనంతరం 11,59,158 మంది ఉన్నట్లు గుర్తించారు. 2,98,278 మంది ఓటర్లను వివిధ కారణాలతో జాబితా నుంచి తొలగించారు. 3,47,688 మంది ఓటర్లకు నోటీసులు అందించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారు సరైన ఆధారాలు చూపించి ఓటరుగా నిరూపించుకోవాలి. రేపటి నుంచి గ్రామ, వార్డు సభలు తొలగింపు, చేర్పులతో పాటు కొత్త వారికి ఛాన్స్ జాబితాలో అర్హుల పేర్లు తొలగిపోతే గుర్తింపు ముసాయిదా ఓటరు జాబితాపై నిర్వహించే సభలలో ప్రధాన పార్టీల నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జాబితాలో ఓటు కల్పించే విధంగా పరిశీలిస్తున్నారు. -
వంద శాతం రుణాలు అందించాలి
అదనపు కలెక్టర్ పాండుసంగారెడ్డి జోన్: పంట రుణాల పంపిణీ ప్రక్రియ 100 శాతం పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి బ్యాంకర్లతో పంట రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని బ్యాంకులు లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందిస్తున్నప్పటికీ, మరికొన్ని బ్యాంకులు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించడం లేదన్నారు. బ్యాంకుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, తదుపరి సమావేశం వరకు వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధికి చేయూత అందించాలని తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, నాబార్డ్ ఏజీఎం కృష్ణతేజ, పరిశ్రమల శాఖ జీఎం తుల్జానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులకు నిధులు
సర్కారు పాఠశాలలకు కేటాయింపు ● విద్యార్థుల సంఖ్య అనుగుణంగా విడుదల ● తీరనున్న కనీస సదుపాయాల సమస్య నారాయణఖేడ్: సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, తరగతి గదులు, ఫర్నిచర్, డిజిటల్ పరికరాలు, ప్రాక్టికల్ సామగ్రి తదితర సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణ కోసం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ కింద నిధులను విడుదల చేసింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మేలు చేకూరింది. 92 వేల మంది విద్యార్థులు.. సంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,265 ఉండగా ఇందులో సుమారు 92 వేల మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. 10 మోడల్ స్కూళ్లలో 6,495 మంది, 22 కేజీబీవీల్లో 4,975, 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,596, నాలుగు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 761 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, స్థానికం సంస్థల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులను కేటాయించారు. ఐదు అంచెలుగా.. జనరల్ ఫండ్తోపాటు ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ నిధులు కలిపి విద్యార్థుల సంఖ్య అనుగుణంగా పాఠశాలల వారీగా విడుదల చేశారు. ఈ నిధులు ఐదు అంచెలుగా విభజించారు. 30 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.10వేలు, 31 నుంచి 100 మంది ఉన్న చోట రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50వేలు, 251 నుంచి వేయి మంది విద్యార్థులు ఉన్న భారీ పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నిధులు నిర్ధారించారు. 10 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ప్రస్తుతానికి ఈ నిధులు వర్తించవు. సదుపాయాలు మెరుగు.. నిధులను పాఠశాలల్లో మంచినీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ చార్జీలు, చిన్నపాటి మరమ్మతులు, ల్యాబ్ సామగ్రి, ఇంటర్నెట్ బిల్లులు, పాఠశాలల్లో స్వచ్ఛత వంటి అత్యవసర పనుల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులు నేరుగా ఆయా పాఠశాలల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నిధుల వినియోగాన్ని పర్యవేక్షించనున్నారు. నిధుల విడుదలతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాల మెరుగు పడనున్నాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యల వల్ల బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది బాలికలు ఈ సమస్య వల్ల పాఠశాలలకు రావడం మానేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం లేక అనారోగ్యాల బారిన పడడం, సైన్స్ ప్రయోగాలు, అదనపు పుస్తకాలు చదివే అవకాశాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. కనీస సదుపాయాలు ఉంటే విద్యార్థులు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతవరణంలో చదువుకుని విద్యలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. -
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్వట్పల్లి/జోగిపేట(అందోల్): పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయడెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కె.రమేశ్ అన్నారు. మంగళవారం జోగిపేటలోని విజయ పాల శీతలీకరణ కేంద్రంలో పాల ఉత్పత్తిదారుల అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడారు. పాడి రైతులకు మద్దతు గా విజయ డెయిరీ, యూనియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని ప్రత్యేక రుణాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రభుత్వం గేదె పాలు లీటర్కు రూ. 6 చొప్పున, ఆవుపాలకు లీటర్కు రూ. 2 చొప్పున పెంచిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1800 మంది పాడి రైతుల నుంచి 15,400 లీటర్ల పాలసేకరణ చేస్తున్నారని చెప్పారు. గేదె పాలకు నాణ్యతను బట్టి లీటర్కు రూ.50 నుంచి రూ. 85 వరకు చెల్లిస్తున్నామన్నారు. తాజాగా పెరిగిన ధరలతో లీటర్కు రూ.56 నుంచి మొదలుకుని రూ.91 వరకు, ఆవు పాలకు లీటర్కు రూ.42 నుంచి రూ.44కు పెంచారని తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ మెనేజర్ డేవిడ్, పుష్పలత, యూనియన్ బ్యాంకు మేనేజర్ ఆదిత్య, సిబ్బంది ప్రభాకర్, శ్రీను పాల్గొన్నారు. -
27న ‘నిధి ఆప్కే నిఖత్ 2.0’
పటాన్చెరు టౌన్: భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ద్వారా సమస్యల పరిష్కారానికి ఈనెల 27న ‘నిధి ఆప్కే నిఖత్ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ రమేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5:45 గంటల వరకు శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. భవిష్య నిధికి సంబంధించిన ఫిర్యాదులు, క్లెయిమ్, పెన్షన్, ఖాతాలు తదితర సమస్యలు ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, యాజమాన్య ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరాలను పటాన్చెరులోని గౌతమ్నగర్ శాంతినికేతన్ హైస్కూల్, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలోని కెఎల్ హైటెక్ సెక్యూర్ ప్రింట్ లిమిటెడ్, కొండాపూర్ మండలం మల్కాపూర్లోని సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్, మాదాపూర్లోని నిసుమ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మనోహరాబాద్ మండలం కల్లకల్లోని గ్లోస్టర్ కేబుల్స్ లిమిటెడ్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. 22–ఏ బాధితులకు అండగా బీఆర్ఎస్ ● ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ● 29న అమీన్పూర్ వేదికగా పోరుబాట పటాన్చెరు: నియోజకవర్గంలో 22–ఏ నిషేధిత జాబితా భూ బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ దళం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఈనెల 29న నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 22ఏ భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుమారు 15 వేల మంది నిరసన సభకు హాజరు కానున్నట్లు చెప్పారు. నిరసన సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బాధితులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్హేర్(నారాయణఖేడ్): ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసకుంటామని అదనపు డీఆర్డీఓ బాలరాజు హెచ్చరించారు. మంగళవారం సిర్గాపూర్లో ఉపాధి హామీ పనులపై 5వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలో జరిగిన రూ.1.27 కోట్ల పనులకు సంబంధించి నాణ్యతాలోపం, నిధుల ఖర్చు వివరాలపై తనిఖీ నివేదికను డీఆర్పీలు చదివి వినిపించారు. మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపిక నిర్వహించారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 6వరకు నిజామాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనేలా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ శిక్షకులు వినయ్, ప్రకాశ్, సెలక్షన్ కమిటీ సభ్యులు రూపేందర్, నరేశ్ పాల్గొన్నారు. -
అదనపు భూ సేకరణ వద్దు
న్యాల్కల్(జహీరాబాద్): నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించనున్న అదనపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని మండల పరిధిలోని హద్నూర్ గ్రామ రైతులు టీజీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వీరారెడ్డిని కోరారు. మాజీ మంత్రి హరీశ్రావు సుచనల మేరకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అధ్వర్యంలో డీసీఎంఎస్ మాజీ చైర్మెన్ శివకుమార్తో కలిసి హైదరాబాద్ వెళ్లి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో నిమ్జ్ ఏర్పాటు కోసం ఇదివరకు 543 ఎకరాలను సేకరించారని, తాజాగా మరో 943 ఎకరాలను సేకరించేందుకు అధికారులు నిర్ణయించారని, దీనిని వెంటనే విరమించుకోవాలని కోరారు. మూడు పంటలు పండే భూములను పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటే తమ బతుకులు ఆగమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్జ్ బాధిత రైతుల సమస్యలను ఎమ్మెల్యే మాణిక్రావు డైరెక్టర్కు వివరించి న్యాయం చేయాలని కో రారు. 943 ఎకరాలకు సంబంధించి రైతులు విన్నవించిన సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కా రం అయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. సర్పంచ్ ప్రవీణ్కుమార్ తదితరులు టీజీఐఐసీ డైరెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. -
ఎదురెదురుగా ఢీకొని.. బైక్ దగ్ధం
ఇద్దరికీ గాయాలు కౌడిపల్లి(నర్సాపూర్): రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా ఒక బైక్ రోడ్డుపై రాపిడికి గురై మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన 765డి జాతీయ రహదారిపై మండలంలోని రాయిలాపూర్గేట్ గుడివద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ, స్థానికుల వివరాల ప్రకారం.. రాయిలాపూర్కు చెందిన భిక్షపతి తన బైక్పై వెళ్తున్నాడు. కాగా హైదరాబాద్ దూలపల్లికి చెందిన వ్యక్తి తన బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు కిందపడగా స్వల్పగాయాలయ్యాయి. కాగా దూలపల్లి వ్యక్తికి సంబంధించిన బైక్ రోడ్డుపై రాపిడికి గురవడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పే ప్రయ త్నం చేయగా అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయమై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
పీజీ, పీహెచ్డీ విద్యార్థుల నిరసన
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ సీట్ల కేటాయింపుపై ఆగ్రహం ములుగు(గజ్వేల్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్(ఉద్యాన) సీట్లను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసివేసి, ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రత్యేక హోదాను కాపాడాలంటూ, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నప్పటికీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ సీట్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. ఈ అంశంపై పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. దీంతో ఉద్యాన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూ పుతోందన్నారు. హార్టికల్చర్ సీట్ల భర్తీపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభు త్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ములుగు తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఎస్ఐ రఘుపతి విద్యార్థులకు నచ్చజెప్పారు. -
డబుల్.. ట్రబుల్
● అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్లు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం హత్నూర(సంగారెడ్డి): నిరుపేదలకు గూడు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏళ్ల తరబడి అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న ఆలోచన అధికారులకు సైతం రావడం లేదు. దీంతో రూ. లక్షలు వెచ్చించి అసంపూర్తిగా వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మండల కేంద్రంలోని హత్నూరలో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా హత్నూరలో ఇల్లు లేని నిరుపేదలు 32 మందిని గుర్తించి వారి కోసం కొన్యాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అయితే అవి ఏళ్లుగా పూర్తికాకుండా అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిర్మించిన వాటికే డబ్బులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశారు. ఈక్రమంలోనే ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లూ గడిచిపోయింది. కొత్తగా శ్రీకారం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పలువురికి ఇండ్లు సైతం మంజూరు చేయగా, నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూంల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటికై నా వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి అందజేయాలని పేదలు కోరుతున్నారు. ఇదే విషయమై ఏఈ రమ్యను వివరణ కోరగా.. హత్నూరలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. భవనాలను పూర్తి చేసి రెండో విడతలో స్థలం లేని నిరుపేదలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించండి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, సతీశ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంభించడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సీఎం రేవంత్రెడ్డి జీఓ 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ వాణి, జిల్లా కమిటీ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి, నాయకులు నిఖిల్, అభిషేక్, మణిస్వార్ రెడ్డి, హరి, కిరణ్, రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఊహించని జానర్
కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి ప్రధాన పాత్రధారులుగా అనూష్ గోరక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కేఏ ప్రొడక్షన్ ్స, పౌర్ణమి ఎంటర్టైన్ మెంట్స్పై కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై నిర్మాతలు. సోమవారం ఈ సినిమా అనౌన్ ్సమెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇలాంటి కథను మీరు ఇప్పటి దాకా తెరపై చూసి ఉండరు. ఇలాంటి జానర్ను మీరు (ప్రేక్షకులను ఉద్దేశించి కావొచ్చు) ఊహించలేరు’ అనే క్యాప్షన్ ్స ఈ సినిమా అనౌన్ ్సమెంట్ పోస్టర్పై ఉన్నాయి. జేసిన్ జార్జ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వినీల సాహిత్య, కుష్లు సహ–నిర్మాతలు. -
పప్పుధాన్యాల సాగు ఆశాజనకం
● అడపాదడపా కురిసిన వర్షాలు ● ఖరీఫ్ పంటలకు జీవం ● దిగుబడిపై రైతుల ఆశలు జహీరాబాద్ టౌన్: జిల్లాలో పప్పుధాన్యాల సాగు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పంట దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సకాలంలో వర్షాలు పడలేవు. అడపాదడపా కురిసిన వానలకు పంటలు సాగు చేశారు. జూన్లో వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. దీంతో వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. జిల్లాలో ఏటా పత్తి, వరి, చెరుకుతో పాటు కంది, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, సోయాబిన్ పంటలను రైతులు పండిస్తుంటారు. జిల్లాలో గతేడాది కన్న ఈ ఏడాది పప్పు ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. సుమారు 72 వేల ఎకరాల్లో సోయాబిన్, 75 వేల ఎకరాల్లో కంది, 7 వేల ఎకరాల్లో మినుము, 9 వేల ఎకరాల్లో పెసర, 12 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటలు వేశారు. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గగా, చెరకు సాగు పెరిగింది. గతేడాది 36 వేల ఎకరాల్లో రైతులు చెరకు సాగు చేశారు. ఈఏడాది సుమారు 45 వేల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. అదే పత్తి పంట సాగు జహీరాబాద్ డివిజన్లో తగ్గింది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పు ధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాం. దీంతో గతేడాది కన్న ఈ ఏడాది సాగు విస్తీర్ణం 15 శాతం పెరిగింది. అధిక దిగుబడుల కోసం పంటల సాగులో రైతులు అధికారుల సూచనలు పాటించాలి. అవసరం మేరకు ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. – భిక్షపతి, ఏడీఏ -
ఖబ్రస్థాన్ భూమి కబ్జా
హత్నూర(సంగారెడ్డి): ఖబ్రస్థాన్ భూమి కబ్జాకు గురైంది. ఓ బడా నాయకుడు ఏకంగా గేటు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హత్నూర మండలం షేర్ఖాన్పల్లి శివారులోని సర్వే నంబర్ 111లో 22 గుంటల భూమి ఖబ్రస్థాన్ పేరుపై రెవెన్యూ రికార్డులో నమోదైంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూమికి భారీ డిమాండ్ ఉంది. దీంతో ఆ నాయకుడి కన్ను ఈ భూమిపై పడింది. ఇంకేముంది దర్జాగా కబ్జా చేశాడు. ఈ విషయం కలెక్టర్తో పాటు రెవెన్యూ అ ధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే కబ్జాకు గురవుతున్నాయని వాపోతున్నారు. -
మనోవేదనకు బలై..
సంగారెడ్డి క్రైమ్: తల్లిదండ్రుల హత్య కేసులో సమాజం చిన్నచూపు చూడటంతో జీవితంపై విరక్తి చెంది నర్సు సురేఖ ఆత్మహత్య చేసుకుంది. జైలు నుంచి బెయిల్పై విడుదలైన తరువాత బంధువులు, సోదరులు, రక్త సంబంధీకులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై చివరిగా చనిపోవాలని నిర్ణయించుకుంది. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు.. అన్నా నీకు రాఖీ కట్టలేకపోతున్నా.. నన్ను క్షమించు.. అని తాను రాసిన సూసైడ్ నోట్లో పేర్కొంది. ఏడు నెలల క్రితం తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో జైలు జీవితం గడిపి.. బెయిల్పై జైలు నుంచి విడుదలై మనోవేదనకు గురైన నర్సు మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి లక్ష్మీ, దశరథ ముదిరాజు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురైన సురేఖ(25), వృత్తిరీత్యా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది. ఓ యువకుడిని ప్రేమించిన సురేఖ పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. కాగా కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో 2026 జనవరి 24వ తేదీన కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అడ్డువస్తున్నారని మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది. ఈ కేసులో సురేఖ చంచల్గూడ జైలుకు వెళ్లింది. అయితే ఇటీవల బెయిల్పై విడుదలైంది. అప్పటి నుంచి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఈనెల 23న సాయంత్రం 9 గంటలకు తల్లిదండ్రులను చంపినట్లుగానే ఆమె సైతం మత్తు ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొన్ని రోజులుగా సురేఖ డిప్రెషన్లో ఉన్నట్లు తోటి రూమ్మేట్స్ తెలిపారు. నన్ను క్షమించు అన్న అని సూసైట్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇది చూసినవారు కన్నీరు మున్నీరయ్యారు. కాగా ఔషధ దుకాణంలో సిరంజి కొనుగోలు చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంజక్షన్, సిరంజిని స్వాధీనం చేసుకున్నారు. సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు. పేరెంట్స్ను చంపి జైలుకు.. బెయిల్పై వచ్చి సూసైడ్ -
క్షవరం చేయడానికి వెళ్లి అనంతలోకాలకు..
చెరువులో మునిగి నాయీ బ్రాహ్మణుడు మృతి దుబ్బాకటౌన్: స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సోమవారం బేగంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిటుకుల కిష్టయ్య(75) నాయీ బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తునికి రాజు మృతి చెందగా, ఆయన దశదిన కర్మ సందర్భంగా ఇతర కుటుంబ సభ్యులకు గ్రామంలోని పెద్దచెరువు వద్ద క్షవరం చేశాడు. అనంతరం అదే చెరువులో స్నానం చేయడానికి వెళ్లిన కిష్టయ్య ప్రమాదవశాత్తు కాలు జారి నీట మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య చిటుకుల సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
యాక్షన్ థ్రిల్లర్
● అక్షయ్ కుమార్బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమాకు ‘సముక్’ అనే టైటిల్ని ఖరారు చేశారు మేకర్స్. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కనిష్క్ వర్మ దర్శకుడు. విపుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం లండన్లో ప్రారంభమైంది. ‘‘సముక్’ సినిమా చిత్రీకరణ మొదలైంది. కొత్త జానర్లో కొత్త సవాల్ను స్వీకరించాను. వివాన్ అహుజాగా డ్యూటీ మొదలుపెట్టాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. కాగా, ఈ సినిమా మేజర్ షూటింగ్ లండన్ లో జరుగుతుందని, కొద్దిపాటి షూటింగ్ ముంబైలో జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, సర్వైవల్ హారర్, గ్రహాంతరవాసులు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అలెక్ గిల్లిస్, స్టంట్ డైరెక్టర్ ల్యూక్ టంబర్ వంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. -
న్యాయం చేయరా దేవుడా...
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మించిన ఈ మూవీ ‘పివీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ’ ద్వారా సెప్టెంబరు 4న విడుదలకానుంది. మహావీర్ యేలేందర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘న్యాయం చేయరా దేవుడా...’ అంటూ సాగే పాటను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా, సునీత ఉపద్రస్త ఆలపించారు. ఈ పాటలో శ్రష్టి వర్మ నర్తించడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందించాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తనయుడు నంద వనమాలి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
మెట్రో విస్తరణకు చర్యలు తీసుకోండి
ఎంపీ రఘునందన్రావుపటాన్చెరు: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు కీలక సమస్యలపై ఎంపీ రఘునందన్రావు హెచ్ఎండీఏ కమిషనర్, మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ను సోమవారం కలిసి చర్చించారు. అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పటాన్్చెరు ఎగ్జిట్– 3 నుంచి ఎగ్జిట్–4, సుల్తాన్పూర్ మధ్య పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లూరు ఎగ్జిట్–2 వద్ద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. -
ఇక స్మార్ట్ మీటర్లు
విద్యుత్ శాఖలో అమలు!నారాయణఖేడ్: విద్యుత్ శాఖలో చాలా ఏళ్లుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారగా, తాజాగా వీటి ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది. ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అనంతరం మొబైల్ ప్రీపెయిడ్ తరహాలోనే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రీచార్జ్ చేయని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం షాపూర్నగర్లో పైలట్ ప్రాజెక్టుగా ఆరేళ్ల క్రితం అమలు చేశారు. విడతల వారీగా ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఈ అంశం ఏళ్లుగా పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుండగానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విద్తుత్ శాఖ సన్నద్ధమవుతుంది. ఇదే అమలైతే స్మార్ట్ మీటర్ల వల్ల గ్రామీణ, పట్టణ ప్రజానీకం కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంశం తెరపైకి రాగానే ప్రజానీకం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. జిల్లాలో గృహ వినియోగదారులు, వ్యాపారులు, ఇండస్ట్రీయల్ విభాగాలకు సంబంధించి 7,29,228 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్కు సంబంధించి గృహజ్యోతి పథకం లబ్ధిదారుల కనెక్షన్లు 2,26,693 ఉన్నాయి. భారంగా మీటర్! స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. విద్యుత్ శాఖ ఈ భారం భరిస్తుందా..? లేక వినియోగదారులపై మోపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సింగిల్ ఫేజ్ మీటర్ వ్యయం వినియోగదారుకు రూ.1,300 వరకు ఉండగా, స్మార్ట్ మీటర్ రూ.7వేల వరకు అయ్యే అవకాశం ఉంది. త్రీఫేజ్ మీటర్కు రూ.10 వేల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా వినియోగదారులపై భారం మోపిన పక్షంలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుంది. స్మార్ట్ మీటర్ల ఖర్చును వినియోగదారుడు భరించాల్సి ఉండగా, అందుకు అయ్యే ఖర్చు ఎంత అని నిర్ధారించే దానిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. మీటర్ ఖరీదు నిర్ణయించిన అనంతరం బిగించనున్నారు. మొదట ఎస్పీడీజీఎల్ పరిధిలో కొత్త కనెక్షన్ పొందే వినియోగదారులకు అమలు చేయనున్నారు. మొదట వారికే.. కొత్త వినియోగదారులకు మొదట ఏర్పాటు దశల వారీగా అందరికీ.. అమలైతే మొబైల్ ప్రీపెయిడ్ తరహాలో రీచార్జీ స్మార్ట్ మీటర్లను రెండేళ్ల క్రితం విద్యుత్శాఖ మొదట ప్రభుత్వ శాఖల్లో అమలు చేయాలని యోచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో దశల వారీగా ఏర్పాటు పూర్తి చేసిన అనంతరం వినియోగదారుల ఇళ్లకు బిగించాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం నూతనంగా విద్యుత్ కనెక్షన్ పొందనున్న వినియోగదారులకు మాత్రమే అమర్చాలని భావిస్తున్నారు. తర్వాత దశల వారీగా కార్యాచరణ రూపొందించి ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిల్ పరిధిలో స్మార్ట్ మీటర్లను అముల చేయాలని చూస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. -
కదిలిన అధికార యంత్రాంగం
● కబ్జాకు గురైన చెరువు అలుగు కాల్వలపై ఆరా ● ప్రభుత్వ భూమి కబ్జాపైనా చర్యలు హత్నూర(సంగారెడ్డి): ‘కాలువలు మింగేస్తుండ్రు’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితం అయిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశంతో సోమవారం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు కదిలి వచ్చారు. మండలంలోని షేర్ఖాన్పల్లి పెద్ద చెరువు రెండు అలుగులను కబ్జా చేసి పూడ్చివేయడంతో నీటిపారుదల శాఖ ఏఈ శ్రీకాంత్, రెవెన్యూశాఖ ఆర్ఐ రంగయ్య, లైసెన్స్డ్ సర్వేయర్ చేతన్, జీపీఓ రాములు కాల్వలను సందర్శించి సర్వే నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు. మట్టి పోసి కాల్వ పూడ్చిన వ్యక్తికి సంబంధించిన పట్టా భూమి ఎంతవరకు ఉందన్న విషయాన్ని కూడా విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ‘అసైన్ భూమికి ఎసరు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సంబంధించి కాసాల శివారులోని 336 ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు అందిస్తామని ఆర్ఐ రంగయ్య తెలిపారు. -
పనిచేసే కార్యకర్తలకే పదవులు
మెదక్జోన్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహలో ఉన్నారని, అర్హులకు పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం మెదక్లో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని తనతో పాటు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో ఢిల్లీ పెద్దలు చర్చించారని తెలిపారు. ప్రాదేశిక సహకార సంఘాల్లో (పీఏసీఎస్లు) నామినేటెడ్ కాబోతున్న పదవులు ముఖ్య కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు ఆరు గ్యారంటీల అమలు సంపూర్ణంగా జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ఓటరు సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో ఎంతో మంది ఓట్లను కేంద్రం తొలగిస్తుందని, అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కార్యకర్తలు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. వర్గ రాజకీయాలతో పార్టీకి నష్టం అనంతరం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కార్యకర్తలతోనే పార్టీ మనుగడ సాగుతుందని, కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే బలోపేతం అవుతుందన్నారు. వర్గ రాజకీయాలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. అలాంటి వారిని పార్టీ ఉపేక్షించదని హెచ్చరించారు. సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడి నామినేటెడ్ పదవుల గురించి చర్చించినట్లు తెలిసింది. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్రావు, సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కానుగ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం ‘సర్’లో అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోవద్దు ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ -
డ్రగ్స్ నిర్మూలనకు పటిష్ట చర్యలు
ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్సంగారెడ్డి జోన్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్ అధికారులకు సూచించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తులో పురోగతి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాల న్నారు. జిల్లాలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 1485 కిలోల గంజాయి, 5 కేజీల ఆల్ప్రాజోలం డిస్పోజల్ ప్రక్రియను పూర్తి చేసినందుకు పోలీసు అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్కుమార్, ఇన్స్పెక్టర్ రామ్ నాయక్, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, సైదానాయక్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో ధర్మన్
● రజనీకాంత్హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు ధర్మన్ . రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో సిమ్రాన్ , రాశీఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ , ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ మూవీలో ధర్మన్ అనే డాక్టర్ గారజనీకాంత్ నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైందని తెలిసింది. ఈ షెడ్యూల్లో రజనీకాంత్పై కొన్ని కీలక సన్నివేశాలను, ఓ యాక్షన్ సీక్వెన్ ్సను చిత్రీకరించేలా అశ్వత్ ప్లాన్ చేశారట. అలాగే ఈ చిత్రంలో హీరో రామ్ పోతినేని ఓ కీలక పాత్రలో నటించనున్నారని, ఆయన క్యారెక్టరైజేషన్ ్సలో నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో ప్రారంభమైన ‘ధర్మన్ ’ కొత్త షూటింగ్ షెడ్యూల్లో అతి త్వరలో రామ్ కూడా పాల్గొంటారని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతేకాదు.. కథ రీత్యా ఈ చిత్రంలో రజనీకాంత్–రామ్ మామ అల్లుళ్ళుగా కనిపిస్తారట. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ధర్మన్ ’ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. -
కేతకీలో విప్ బీర్ల ఐలయ్య పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం రెండో సోమవారం పురస్కరించుకొని ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమృత గుండంలో జల లింగానికి పూజలు చేసి గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసులను పరిష్కరించి కక్షిదారులకు తగిన న్యాయం చేయాలన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జోన్: జిల్లాలో పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేయనున్నట్లు పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న అసోసియేషన్ కమిటీ సభ్యులు సోమవారం ఎస్పీ పరితోశ్ పంకజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తామన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట శివారు పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న రసాయనాలతో కలుషితమైన కుంటను పీసీసీ అధికారులు సోమవారం పరిశీలించారు. సర్పంచ్ సంతోష ఫిర్యాదు మేరకు పీసీబీ ఎన్విరాల్మెట్ అసిస్టెంట్ ఏఈ రవీందర్ రాజారామ్ కుంటను పరిశీలించి శాంపిల్స్ తీసుకెళ్లారు. అనంతరం పరిశ్రమలోనూ తనిఖీలు నిర్వహించారు. రసాయన జలాలను సేకరించారు. ఈసందర్భంగా అధికారి మాట్లాడుతూ.. జలాలను ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. మాజీ ఎంపీటీసీ శివకుమార్, పరిశ్రమ సిబ్బంది ఉన్నారు. -
తథాస్తు అంటూ ఉండండి!
‘అసలు ఈ నీచ మానవులు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీర్ గాళ్స్గా చూస్తారే !’ అంటూ నటుడు ‘వెన్నెల’ కిశోర్ చెప్పే డైలాగ్తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ ఆరంభం అయింది. ‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్గా నటించారు. నరేష్ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ని హీరో అక్కినేని నాగార్జున లాంచ్ చేసి, చిత్రయూనిట్కి అభినందనలు తెలిపారు. ‘ముందు నేను ఈ లిస్ట్ చదువుతుంటాను మీరు తథాస్తు తథాస్తు అంటూ ఉండండి’, ‘అంటే మీకు ఇప్పుడు పవర్స్ లేవా?’, ‘నాకు నెలరోజులు కాదు.. జస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వు చాలు’ అంటూ ‘అల్లరి’ నరేష్ చెప్పే డైలాగులు ట్రైలర్లో నవ్వులు పంచుతున్నాయి. అదేవిధంగా ‘యమధర్మ రాజులవారికి ప్రణామములు’, ‘మానవా.. ఇది మా తప్పిదం కాదు’(రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్), ‘ఈ అమ్మాయిలు ఏంటి? అసలు ఏం చేస్తున్నావురా నీవు’(సురభి), ‘మీరు మా ఇంద్రలోకం ప్రాపర్టీ.. ఇంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న మిమ్మల్ని భూలోకంలో బాయ్స్ వదులుతారా? అసలే వారు కరువుప్రాంత జీవులే’(‘వెన్నెల’ కిశోర్) అంటూ పలికే పలు డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి. -
పకడ్బందీగా గ్రామ సభలు
అదనపు కలెక్టర్ పాండు సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. సోమ వారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నా రు. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఎస్ఐఆర్ ప్రక్రియపై వివరించినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 37 వినతులు రాగా అధికారులతో కలిసి స్వీకరించారు. -
వైద్యసేవల బలోపేతానికి కృషి
మంత్రి దామోదర రాజనర్సింహమెదక్ కలెక్టరేట్: జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్ను స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావుతో కలిసి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా క్రిటికల్ కేర్ బ్లాక్ను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత దేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నితిన్ కబ్రా, డీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్, డాక్టర్ శివ దయాళ్, వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్కు అవసరమైన హెచ్ఆర్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐహెచ్ఎఫ్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తేవడంపై ఈనెల 25న హైదరాబాద్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు. వైద్యశాఖ అధికారులంతా హాజరు కావాలని ఆదేశించారు. తూప్రాన్లో ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆ పరిశ్రమకు అనుమతి ఇవ్వొద్దు
కేంద్రానికి మల్గి గ్రామస్తుల ఫిర్యాదున్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని కర్నాటక సరిహద్దులో గల మల్గి గ్రామ శివారులో ఏర్పాటు కానున్న కాలుష్య కారక పరిశ్రమ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయనీయబోమని గ్రామస్తులు తెలిపారు. పరిశ్రమలతో గాలి, నీరు, నేల కలుషితమై రోగాల బారిన పడాల్సి వస్తుందని, అలాంటి పరిశ్రమలు మా గ్రామంలో వద్దే వద్దుంటూ గత జనవరిలో నిర్వహించిన ప్రాజాభిప్రాయ సేకరణలో తేల్చి చెప్పారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కోరుతూ గ్రామస్తులు అప్పట్లో అదనపు కలెక్టర్ మాధురికి వినతిపత్రం అందజేశారు. అప్పటి నుంచి పరిశ్రమ ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. తాజాగా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలకు ఫ్యాక్టరీ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మల్గి గ్రామస్తులు పరిశ్రమ ఏర్పాటును అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. గత రెండు, మూడు రోజులుగా గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఆ వినతిపత్రాలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖల అధికారులకు ఈ–మెయిల్ ద్వారా పంపించారు. కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. -
ప్రేక్షకుల స్పందనతో కళ్లు చెమర్చాయి
– రవితేజ‘‘ఇరుముడి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. 20 ఏళ్ల క్రితం థియేటర్కి వచ్చిన వాళ్లు ఇప్పుడు మళ్లీ ‘ఇరుముడి’కి థియేటర్కి రావడం భావోద్వేగంగా అనిపించింది’’ అని హీరో రవితేజ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం(ఆగస్టు 21) విడుదలయింది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘ఇరుముడి’ చూస్తున్నప్పుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్తో ఆటోమేటిక్గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిర్మాతలు రవి, నవీన్లతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాతో ఇంత మంచి సినిమా చేసినందుకు శివ నిర్వాణకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో కావేరిలాంటి పాత్ర ఇచ్చినందుకు శివ నిర్వాణగారికి ధన్యవాదాలు’’ అన్నారు ప్రియా భవాని శంకర్. ‘‘ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది’’ అని వై. రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని నవీన్ యెర్నేని తెలిపారు. నటుడు సాయికుమార్, నటి స్వసిక, బేబీ నక్షత్ర, కెమెరామేన్ విష్ణు శర్మ, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు మాట్లాడారు. -
ఇది ధర్మమా? అధర్మమా?
● అక్షయ్ ఖన్నా‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(పీవీపీయు)లో భాగంగా రూపొందుతున్న తాజా సినిమా ‘మహాకాళి’. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్పై రివాజ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. కాగా, ‘శుక్రాచార్య వార్– క్రై’ పేరుతో ‘మహాకాళి’నుంచి సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘అమృత మథన సమయమున దేవతలతో సమానంగా దానవులు శ్రమించినా ఆ విష్ణువు అమృతాన్ని దేవ గణానికే ప్రసాదించాడు. ఇది ధర్మమా? అధర్మమా?’, ‘యుద్ధ భీజ.. మానవజాతిని సర్వనాశనం చెయ్...’ వంటి డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ సినిమాకు స్మరణ్ సాయి స్వరకర్త. -
అసైన్డ్ భూమికి ఎసరు
హత్నూర(సంగారెడ్డి): రూ. కోట్లు విలువ చేసే అసైన్డ్ భూమికి కొందరు అక్రమార్కులు ఎసరుపెట్టారు. సుమారు 9 ఎకరాలను కబ్జా చేసి దర్జాగా పంటలు సాగు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హత్నూర మండలం కాసాల శివారులో పట్టా భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 226, 227లో 48 ఎకరాల పట్టా భూమి ఇతర ప్రాంతానికి చెందిన పెద్దలు కొనుగోలు చేశారు. ఈ భూమిలో మామిడి తోటతో పాటు వరి, కూరగాయల సాగు చేస్తున్నారు. అయితే దీనికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 336లోని సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి–దౌల్తాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఈ భూమికి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం ప్రభుత్వ భూమి ఆక్రమణపై పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే నంబర్ 336లోని ప్రభుత్వ భూమిపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణకు గురైనట్లు తేలితే వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ షేక్ పర్వీన్ వివరణ కోరగా.. సంగారెడ్డి– దౌల్తాబాద్ రహదారికి పక్కన ఉన్న మామిడి తోటలో అసైన్డ్ భూమి కబ్జాకు గురైన విషయం తమ దృష్టిలో ఉందని తెలిపారు. వారం క్రితం సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సర్వేయర్ను ఆదేశించినట్లు వెల్లడించారు. కాసాల శివారులో కబ్జా నాగులు రూ. 20 కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పరం చోద్యం చూస్తున్న అధికారులు అసైన్డ్ భూమి కబ్జా విషయపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు ఆదేశిస్తాం. ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, ఆర్డీఓ, సంగారెడ్డి -
ప్రభుత్వ బడులకు మహర్దశ
పటాన్చెరు: అమీన్పూర్ డివిజన్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు అతి త్వరలో అత్యధిక వసతులతో కూడిన క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో అమీన్పూర్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం, నవ్య రోడ్డులో నూతన పాఠశాలలకు, కిష్టారెడ్డి పేటలో ఉన్నత పాఠశాల పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వీటి నిర్మాణం ద్వారా ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఆటస్థలాలు, డిజిటల్ క్లాస్రూమ్లు, అత్యాధునిక ల్యాబ్లు, లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
హ్యామ్ రోడ్లు వస్తున్నాయ్!
జిల్లాలో 29 ఆర్అండ్బీ రహదారులకు మహర్దశ వర్షాకాలం పూర్తి కాగానే పనులు జిల్లాలో ఆర్అండ్బీ రహదారులు మెరుగుపడనున్నాయి. దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న రవాణ ఇబ్బందులు తీరనున్నాయి. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పథకం కింద రోడ్లను విస్తరించడం, పటిష్టం చేయడంతో పాటు నాణ్యతగా నిర్మించనున్నారు. జిల్లాలో 29 రోడ్లు 451.17 కిలోమీటర్లకు గాను రూ.1,014.10 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. – జహీరాబాద్ రోడ్లను పటిష్టం చేయడంతో పాటు నాణ్యవంతంగా నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్హెచ్ 65 కవేలి క్రాస్ రోడ్డు నుంచి తొరమామిడి వరకు కవేలి, కోహీర్ల మీదుగా 17.80 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గాను రూ.20.61 కోట్లు మంజూరయ్యాయి. జహీరాబాద్ మండలంలోని అల్లీపూర్ నుంచి కొత్తూర్(బి) రహదారిని భరత్నగర్, అల్లానా మీదుగా బీదర్ రోడ్డుకు కలుపుతూ 6.70 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 7.76 కోట్లు కేటాయించారు. జహీరాబాద్–బీదర్ రహదారిని వెడల్పు చేయడంతో పాటు కొత్తగా 19.20 కిలో మీటర్లు నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.59.91కోట్లు మంజూరయ్యాయి. అల్లాదుర్గం–మెటల్కుంట రహదారిని పోతలబోగుడ, మేడికుందె, వట్పల్లి, రాయిపల్లి, సిరూర్, మహబత్పూర్, నగ్వార్, రాయికోడ్ల మీదుగా 30 కిలోమీటర్లు నిర్మించడానికి రూ. 217.96 కోట్ల మేర నిధులు కేటాయించారు. ఇదే రహదారిని మిర్జాపూర్(ఎన్), ముంగి, రుక్మాపూర్, రాంతీర్థ్, హద్నూర్, గంగ్వార్ల మీదుగా నిర్మించతలపెట్టారు. గుమ్మడిదల నుంచి కానుకుంట మీదుగా నుతన్కల్ రహదారి 8.20 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు రూ. 7.20 కోట్లు మంజూరు చేశారు. శంకరంపేట నుంచి నారాయణఖేడ్ రోడ్డును బుజరంపేట్, జుక్కల్ తండా, హన్మంత్రావుపేట్, లింగాపూర్ల మీదుగా సంగారెడ్డి వరకు 14.20 కిలోమీటర్లకు రూ.39 కోట్లు కేటాయించారు. నారాయణఖేడ్–మాసాన్పల్లి నుంచి తుర్కపల్లి తండా, ర్యాకల్, చెల్లగిద్దతండా, సిర్గాపూర్, నల్లవాగు, బీబీపేట్, మర్ది, కల్హేర్, మాసాన్పల్లిల మీదుగా 22.40 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.60.57 కోట్లు కేటాయించారు. నారాయణఖేడ్–సంతాపూర్ రోడ్డును జుజల్పూర్, తిమ్మాపూర్, నాగల్గిద్ద, సెమి దామరగిద్ద, పుసలపహడ్, శ్యామనాయక్తండా, శత్రునాయక్ తండా, కసర్గుత్తిల మీదుగా సంగారెడ్డి వరకు 22.30 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందుకు రూ.25.82 కోట్లు, పటాన్చెరు–శంకర్పల్లి రహదారిని పటాన్చెరు, కర్దనూర్, నందిగామ, భానూర్ల మీదుగా 13.20 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.15.29 కోట్లు కేటాయించారు. నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి రహదారిని పోచారం, లింగంపల్లి, ఉసిరికపల్లి గ్రామాల మీదుగా 8.60 కిలోమీటర్లు నిర్మించేందుకు ప్రతిపాదించారు. రూ.9.96 కోట్ల కేటాయింపులు జరిగాయి. జోగిపేట్–వట్పల్లి రహదారిని డాకూర్, తాలెల్మ, మర్వెల్లి, పల్వట్ల, నాగులపల్లి, గొర్రెకల్ గ్రామాల మీదుగా 23 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. రూ.26.64 కోట్లు మంజూరు చేశారు. బుధేరా నుంచి వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి రహదారిని కొంశెట్పల్లి, పట్లూర్ల మీదుగా 2.40 కిలోమీటర్లు నిర్మించతలపెట్టారు. రూ.2.78 కోట్లు కేటాయించారు. 451.17 కిలోమీటర్ల మేర నిర్మాణం రూ.1,014.10 కోట్ల నిధులు మంజూరు తీరనున్న రవాణ ఇబ్బందులు నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి వరకు రెండో బిట్టు 10 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.11.58 కోట్లు, పటాన్చెరు– మల్కాపూర్ రహదారిని ఇంద్రేశం, ఐనోల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల గ్రామాల మీదుగా 14 కిలోమీటర్లకు రూ.16.21 కోట్లు మంజూరయ్యాయి. ఎన్హెచ్ 65 రహదారి నుంచి ఇస్మాయిల్ఖాన్పేట్ రహదారిని లక్డారం, బ్యాతోల్ మీదుగా 11.40 కిలోమీటర్లకు రూ.13.20 కోట్లు, ఎస్ఎన్టీ రహదారిని ఇస్మాయిల్ఖాన్ పేట్ మీదుగా 6.50 కిలోమీటర్లు రూ.7.53 కోట్లతో ప్రతిపాదించారు. పెద్దపూర్–అనంత్సాగర్ రహదారిని తొగర్పల్లి, అలియాబాద్, కొండాపూర్, మారెపల్లి, అనంత్సాగర్ గ్రామాల మీదుగా 16.10 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు రూ.18.64కోట్లు కేటాయించారు. కాగా, జిల్లాలోని రహదారులను మొదటి విడతలో నిర్మించేందుకు ప్రతిపాదించారు. కొన్నింటికి టెండర్లు సైతం పూర్తి చేశారు. కొన్ని రహదారులను రెండు బిట్లుగా విభజించారు. వర్షాకాలం పూర్తి కాగానే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. -
ప్రజారోగ్యానికి మరింత భరోసా
నారాయణఖేడ్: ప్రజారోగ్య వ్యవస్థను రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఆస్పత్రి నిర్వాహకులు అనురాగ్రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. కంది(సంగారెడ్డి): అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అన్నారు. ఆదివారం కంది మండల పరిధిలోని ఇంద్రకరన్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు మొగులయ్య, సర్పంచ్ శంకరి రాజు, ఉప సర్పంచ్ లావణ్య రాజేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ యువకుడికి అవార్డు జహీరాబాద్ టౌన్: వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు జహీరాబాద్కు చెందిన యువకుడు జగదీశ్ బుయేకర్. కార్పొరేట్ ఉద్యోగుల ప్రయాణ అవసరాల కోసం ఆయన రూపొందించిన వినూత్న స్టార్టప్కు ‘ఇండియా ఎంఎస్ఎఈ అండ్ స్టార్టప్ అవార్డు వరించింది. పుణెలోని మారియట్ హోటల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జహీరాబాద్కు చెందిన జగదీశ్, ఆయన స్నేహితుడు నిర్మల్ జిల్లాకు చెందిన సాయి కుమార్ బైండ్ల ఇద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం జగదీశ్ పుణెలోని ఓ ఐటీ సంస్థలో ఇండస్ట్రియల్ ఇంజినీర్గా, సాయి కుమార్ చైన్నెలో పైపింగ్ డిజైనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూనే, స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో కార్యాలయ సమయం తర్వాత, వారాంతాల్లో కోడింగ్ నేర్చుకుని ‘వరధి క్లబ్ పేరుతో కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక బైక్ రైడ్ షేరింగ్ యాప్ను సొంతంగా అభివృద్ధి చేశారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కేవల్ కిషన్ భవన్లో సీఐటీయూ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. కార్మికవర్గంపై బీజేపీ 10 ఏళ్లుగా యుద్ధం చేస్తుందన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్కోడ్లు తెచ్చిందన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఊప లాంటి చట్టాలను ప్రయోగిస్తున్నారని వాపోయారు. -
ట్రిపుల్ఆర్ పక్కనే కూ.. చుక్చుక్
హైదరాబాద్ ఔటర్ రింగు రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ త్వరలో ప్రారంభించనున్న ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు 3.5నుంచి 11కిలోమీటర్ల దూరంలో రింగు రైల్ మార్గం నిర్మాణం చేపట్టాలని ముందుగా అనుకున్నారు. కానీ తాజాగా డీపీఆర్లో మార్పులు చేసి ట్రిపుల్ఆర్కు కొద్ది దూరంలోనే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు కలిసి రానుంది. – గజ్వేల్ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైన వేళ.. మరో భారీ అభివృద్ధి ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రైలు వ్యవహారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి)తోపాటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా రింగు రైలు అలైన్మెంట్ ఖరారైంది. ముందుగా ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా చాలా చోట్ల 3.5కిలోమీటర్ల దూరంలో, ఒకటి రెండు చోట్ల మాత్రం 11కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ను సిద్ధం చేశారు. కానీ నేడు అలైన్మెంట్లో మార్పులు చేసి ట్రిపుల్ఆర్ పక్కనే అంటే.. కొద్ది దూరంలోనే ఔటర్ రింగు రైలు నిర్మాణం చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీపీఆర్ (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపొర్ట్)కు కేంద్రం ఆమోదం పలికినట్లు వార్తలొస్తున్నాయి. అలైన్మెంట్ మారటం వల్ల గతంలో మాదిరిగా కాకుండా ట్రిపుల్ఆర్కు దగ్గరగా, సమాంతరంగా ఔటర్ రింగు రైలు వెళ్లనుండటం అన్ని రకాలుగా కలిసి రానుంది. ఈ రెండు ప్రధాన భారీ అభివృద్ధి ప్రాజెక్ట్లు పక్కనే పక్కనే ఉండటం ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుంది. రవాణా ఆధారిత వాణిజ్యానికి ఊతం ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రధానంగా రవాణా ఆధారిత వాణిజ్యం అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా హైదరాబాద్కు అతి సమీపంలో ఉండటం వల్ల ట్రిపుల్ఆర్తోపాటు ఔటర్ రింగు రైలుతో ఈ ప్రాంతంలో వాణిజ్య, వ్యాపార రంగాలు భారీగా విస్తరించనున్నాయి. కాగా అవుటర్ రింగు రైలు ప్రాజెక్టులో భాగంగా ఆరు చోట్ల ఆర్ఓఆర్(రైల్ ఓవర్ రైల్) వంతెనలు రానున్నాయి. ఈ ఆర్ఓఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని గజ్వేల్లో రానుందని ప్రకటనలు వెలువడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా ఈ రింగు రైలు 120 కిలోమీటర్లపైనే విస్తరించే అవకాశాలున్నాయి. గతంలో చేసిన అలైన్మెంట్లో మార్పులు డీపీఆర్కు కేంద్రం ఆమోద ముద్ర! ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రయోజనం రవాణా ఆధారిత వాణిజ్యం విస్తరణకు అవకాశం ట్రిపుల్ఆర్ పనులు త్వరలోనే ప్రారంభమవుతుండటం, ఔటర్ రింగు రైలు ప్రాజెక్ట్కు ప్రతిపాదనలు సిద్ధం కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్వపువైభవాన్ని సంతరించుకోబోతుందనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో వేగంగా రియల్ఎస్టేట్ వ్యాపారం పుంజుకోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని బడా పెట్టుబడుదారులు ఈ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
జైలుకు వెళ్లొచ్చిన సురేఖ.. విషాదాంతం
సాక్షి, సంగారెడ్డి: ఆరు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితురాలు సురేఖ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా శాంతినగర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆదివారం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆమె హతమార్చింది. ఈ ఏడాది జనవరి చివర్లో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ.. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేయాలని పథకం వేసింది. ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని హతమార్చింది. అయితే ఈ కేసులో ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. ఏ ఉద్యోగమూ దొరక్కపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె సురేఖ(25) సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన ఓ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పిన సురేఖకు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించడమే కాకుండా.. మరో సంబంధం చూడటం ప్రారంభించారు. దీంతో ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను తొలగించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.వైద్య రంగంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న సురేఖ.. తాను పనిచేస్తున్న ఆస్పత్రి నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు మందును తీసుకొచ్చింది. అనంతరం ఓ మెడికల్ షాపులో మూడు సిరంజీలు కొనుగోలు చేసింది. జనవరి చివర్లో ఓ రోజు రాత్రి సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ.. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది. అనంతరం పెళ్లి విషయం మరోసారి ప్రస్తావనకు రావడంతో వారు ఆమెను మందలించారు. అప్పటికే వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. ముందుగా తల్లి లక్ష్మికి ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ మత్తు మందును అధిక మోతాదులో ఇచ్చింది.కొద్దిసేపటికే లక్ష్మి మృతి చెందగా.. ఆమెను నిద్రిస్తున్నట్లు పడుకోబెట్టింది. అనంతరం ఇంటి బయట ఉన్న తండ్రి దశరథం వద్దకు వెళ్లి ఆయనకూ ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.అన్నకు ఫోన్ చేసి.. కన్నీటి నాటకంతల్లిదండ్రుల మరణాలను సహజంగా చూపించేందుకు సురేఖ ప్రయత్నించింది. అన్న అశోక్కు ఫోన్ చేసి.. ‘‘అమ్మా నాన్న చనిపోయారు.. భయంగా ఉంది.. త్వరగా రండి’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అన్న వచ్చాక.. తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని, తల్లి షాక్కు గురై గుండెపోటుతో స్పృహ కోల్పోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయిందంటూ కన్నీరు పెట్టుకుంది.అలా బయటపడిన నిజంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో లభించిన సిరంజీలను పరిశీలించారు. సురేఖ చెప్పిన వివరాల్లో అనుమానాలు రావడంతో ఆమెను ప్రశ్నించారు. మొదట అవి మూడు నెలల కిందటివని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె సంచిలో దొరికిన ఉపయోగించని మూడో సిరంజీ, ఖాళీ ఇంజెక్షన్ సీసాలు, వాడిన సిరంజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు విచారణలో తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు సురేఖ అంగీకరించింది. ప్రేమ వివాహానికి అడ్డుపడటమే కారణమని వెల్లడించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికే సురేఖ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, కుటుంబ వ్యతిరేకత నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. -
గర్ల్స్ హాస్టల్లో యువతి ఆత్మహత్య
సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సిరి ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.వికారాబాద్కు చెందిన ఆ యువతి ప్రైవేట్ ఉద్యోగం కోసం ఈ నెలలోనే సంగారెడ్డికి వచ్చింది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ.. హాస్టల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు త్వరలో పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి. -
ధరిపల్లి.. రచ్చబండ
చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని ధరిపల్లి.. షూటింగ్ల స్పాట్గా నిలుస్తోంది. పల్లె వాతావరణం.. పెద్దపెద్ద ఇళ్లు.. గ్రామానికి మనికట్టుగా ఉన్న రచ్చబండ.. సినిమా చిత్రీకరణకు అనువుగా మారింది. ప్రముఖ నటుడు రాణా, సాయిపల్లవి నటించిన విరాట పర్వం చిత్రీకరణ ఇక్కడే జరిగింది. అలాగే తాజాగా బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసమ్మ’ షూటింగ్ కూడా ఇక్కడే జరగడం విశేషం. ‘మెన్షన్ హౌస్ మల్లేశం’, దండోర, భగవంతుడు, ఏడుతరాల యుద్ధం, జూనియర్స్ లాంటి చిత్రాల షూటింగ్కు వేదికై ంది ధరిపల్లి. -
ప్రీ వెడ్డింగ్కు వేదిక..
దుబ్బాకటౌన్: జిల్లాలో ప్రధాన దేవాలయమైన దుబ్బాకలోని బాలాజీ దేవాలయం ప్రీ వెడ్డింగ్ షూట్కు ప్రధాన వేదికై ంది. కోడి కూత కూయకముందే షూటింగ్ షురూ అవుతోంది. వధువు, వరుడు సంప్రదాయ దుస్తులు ధరించి ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. దీంతో ఆలయం ప్రీ వెడ్డింగ్ షూట్కు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆలయ పరిసరాల్లో పెద్ద పెద్ద చెట్లు, గోశాల ఉండటంతో వివిధ జిల్లాల నుంచి పెళ్లి కుదిరిన వధువు, వరుడు ప్రీ వెడ్డింగ్ షూట్కు బాలాజీ ఆలయాన్ని ఎంచుకుంటుండటం విశేషం. ఇవే కాకుండా పలు సీరియల్స్, వెబ్సిరీస్ల కోసం ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంటాయి. -
షూటింగ్ల కోట.. గొట్టంకోట
జహీరాబాద్ టౌన్: తెలంగాణ ఊటీగా పేరొందిన గొట్టం కోట ప్రాంతం పచ్చని అడవులు, చెరువు, కొండల మధ్య సహజ అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ప్రకృతి ప్రేమికులను ఎంతో అకర్షించే ఈ ప్రాంతం సినీ షూటింగ్కు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. తెలంగాణ–కర్నాటక రాష్ట్ర సరిహద్దులో మొగుడంపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఈ గొట్టం కోట ఉంది. పచ్చని చెట్లు, వంకరటిక్కర మార్గాలు స్వాగతం పలుకుండగా, చంద్రంపల్లి చెరువు(డ్యామ్) ఈ ప్రదేశాన్ని మరింత శోభను చేకూరుస్తోంది. సూర్యాస్తమయంలో ఫొటోలు, షూటింగ్కు అత్యంత అనుకూలమైన ప్రదేశం. జహీరాబాద్కు చెందిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్, సినీ నిర్మాత ఎం.శివకుమార్ తీసిన ‘ఆకాశంలో సగం’ సినిమా షూటింగ్తో ఈ ప్రాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమాను చాలా వరకు ఇక్కడే చిత్రీకరించారు. ఆదివారం, సెలవు రోజుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. -
చిత్ర సీమలు
పల్లెలు..ఇవి మన ఊటీలు ● వెండితెరకు తళుకులు ● మా ఊరు.. పల్లె‘టూరు’ వర్గల్(గజ్వేల్): ఆలయాలు, వాగులు, వంకలు, పల్లెలు, పచ్చని పంటపొలాలతో ప్రకృతి రమణీయతల నెలవైన వర్గల్ మండలం పలు సినిమా షూటింగులతో వెండి తెరపై తళుక్కుమన్నది. 2022లో విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా షూటింగ్ 80 శాతం వర్గల్ మండలం వేలూరులోనే జరిగింది. వేలూరు నరసింహస్వామి ఆలయం, గ్రామంలోనీ పాత ఇళ్లు, ఇరుకు సందులు, పొలాలు లొకేషన్లుగా దాదాపు 25 రోజులు ఇక్కడ షూటింగ్ జరగడం విశేషం. అదే గ్రామం వేలూరుకు చెందిన బాలనటుడు ములుగు జయతీర్థ, తాప్సీ, హర్ష్ రోషన్, భాను ప్రకాశ్ నటీనటులుగా.. ‘గ్రామీణ వాతావరణంలో పెరిగిన ముగ్గురు చిన్న పిల్లలు తెలియని వయసులో వారి ఆశయ సాధనకై సొంత ఊరు విడిచి బెంగళూరుకు పారిపోవడం, వారి ద్వారా చిన్నపిల్లలని కిడ్నాప్ చేసే ఒక అంతర్జాతీయ స్థాయి ముఠాను పట్టుకోవడం’ కథాంశంగా 2022లో తెరకెక్కిన ఈ సినిమా చక్కని ప్రేక్షకాదరణ చూరగొన్నది. వేణుగోపాలుని కోవెలలో ‘అద్భుతం’ నాటి చరిత్ర చాటే వర్గల్ వేణుగోపాలుని కోవెల లొకేషన్గా మూడేళ్ల క్రితం తేజ హీరోగా, శివాని కథానాయికగా ‘అద్భుతం’ సినిమా కోసం ‘వెన్నెల్లో గోదారి.. చూస్తూనే ఓసారి’ పాట షూటింగ్ జరిగింది. అదే విధంగా గుడితోపాటు, వర్గల్ ఊడల మర్రి, నగరం తండా తదితర లొకేషన్లలో ‘ఇట్లు’ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగులతో ప్రత్యేకత చాటుకుంటూ వెండితెరపై వర్గల్ తణుకులీనుతోంది. మొన్నటి ‘మిషన్ ఇంపాజిబుల్’ నుంచి నేటి ‘పళ్ల బురుసు’ దాకా సినిమా షూటింగ్ స్పాట్గా ఉమ్మడి మెదక్ జిల్లా బాల నటుడిగా సెవెన్త్ చదువుతున్నపుడు సినిమాలో అవకాశం అంటే ఎగిరి గంతేశా.. మా సొంత గ్రామంలోనే షూటింగ్ అని తెలిసి ఉబ్బి తబ్బిబ్బయ్యా. బంజరాహిల్స్ యడిషన్లో నన్ను లీడ్ రోల్కు ఎంపిక చేశారు. మా గ్రామంలోని నృసింహాలయం, ఇళ్ల సందుల్లో, పంట పొలాల్లో, ఊరి వాగు దగ్గర దాదాపు 25 రోజులు షూటింగ్ కొనసాగింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ పేరుతో నెట్ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా నాకు మైలురాయి. గ్రామంలోనే షూటింగ్ 80 శాతం జరగడం మరచిపోలేని అనుభూతి. నేను ప్రస్తుతం బీటెక్ చదువుతున్న. డబ్బింగ్ ఆర్టిస్ట్గా అనుభవం సాధించా. మా నాన్న జబర్దస్త్ ఫేమ్ లక్ష్మీకిరణ్ నన్ను ఆర్టీస్టుగా తీర్చిదిద్దారు. – ములుగు జయతీర్థ(వేలూరు)పల్లెలు.. చిత్ర సీమలవుతున్నాయి. ప్రకృతి అందాలు మేళవించిన గ్రామాలు సినీ లొకేషన్లు అవుతున్నాయి. పెంకుటిళ్లు, పచ్చని పంట పొలాలు, గుడులు, వాగులు, వంకలు షూటింగ్ స్పాట్లుగా విలసిల్లుతున్నాయి. గ్రామీణాన్ని వెండి తెరపైకెక్కిస్తూ సినీ నిర్మాతలు ‘ఇవి మన ఊటీ’లు అని చాటుతున్నారు. ఫిల్మ్షూటింగుల అడ్డాగా మార్చుకుంటున్నారు. ‘మా ఊరు.. పల్లె‘టూరు’.. అన్నట్లు గ్రామీణంపై ఫోకస్గా ‘మిషన్ ఇంపాజిబుల్, ఇట్లు, అద్భుతం, పళ్ల బురుసు, ఓ సుకుమారి’ తదితర సినిమా షూటింగ్లకు ఉమ్మడి మెదక్ జిల్లా వేదికగా నిలిచి సినీరంగంలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
చంద్లాపూర్.. షూటింగ్ల జోర్
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధి చంద్లాపూర్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామంలో చిన్న చిన్న వీధులు, పురాతనం నాటి పెంకుటిళ్లు, పచ్చని పొలాలు, అక్కడే రంగనాయక సాగర్ రిజర్వాయర్, రంగనాయక స్వామి గుట్ట ఉండటంతో నిత్యం ఈ ప్రాంతం షూటింగ్ల చిత్రీకరణతో సందడిగా మారుతోంది. ఇటీవల ఓ సుకుమారి సినిమా షూటింగ్ సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. గ్రామంతో పాటు రిజర్వాయర్, రంగనాయక స్వామి గుట్టపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే యూట్యూబ్ చిత్రాలు, ఫోక్ సాంగ్స్ వంటి చిత్రాల షూటింగ్ నిత్యం గ్రామంలో జరుగుతూనే ఉంటాయి. రంగనాయక సాగర్ కట్టపై ప్రీ వెడ్డింగ్ షూటింగ్లకు వేదికగా మారింది. రిజర్వాయర్ సందర్శనకు స్నేహితులు, బంధువులు కుటుంబ సమేతంగా వచ్చి స్వియ చిత్రాలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు.చేగుంట(తూప్రాన్): మండలంలోని రెడ్డిపల్లిలో రెండు నెలలుగా సర్కారుబాయి సినిమా షూటింగ్ కొనసాగుతోంది. పాతకాలపు అసమానతలను తొలగించి నేటితరాన్ని చైతన్య పరిచేందుకు చిత్రం రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాలో హీరో శ్రీరాం, హీరోయిన్గా వర్షికతో పాటు ప్రముఖ నటులు బాహుబలి ప్రభాకర్, అఖండ నాగమహేశ్లు నటిస్తున్నారు. ఏకకాలంలో నాలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా రెడ్డిపల్లిలో చిత్రీకరిస్తుండటం విశేషం. సినిమా షూటింగ్తో గ్రామంలో రెండు నెలలుగా సందడి నెలకొంది. మండలంలోని చందాయిపేటలోని గద్దలకొండలో.. గణేష్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.రెడ్డిపల్లిలో.. ‘సర్కారుబాయి’.. -
‘పట్టు’కోల్పోతుండ్రు
● విస్తృతంగా సబ్సిడీలు ఇస్తున్నా.. ● రైతులకు చేరని పంట పరిజ్ఞానం ● మెదక్ జిల్లాలో వంద ఎకరాలకు చేరని సాగు పట్టు పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వాలు.. అధికారులను మాత్రం నియమించడం లేదు. ఎంతో లాభదాయకంగా ఉండే పట్టు పరిశ్రమపై రైతులకు తెలియడం లేదు. ఫలితంగా రైతులంతా వరి పంట సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు ఆలస్యమవుతున్నాయి. – ఆంజనేయులు, రైతు, కౌడిపల్లి జిల్లాలో రైతులకు మల్బరి సాగుపై, సబ్సిడీలపై అవగాహన కల్పిస్తున్నాం. ఎకరాకు 5వేల మొక్కలు అవసరం. ఎకరాకు 150 నుంచి 200 గుడ్లు అవసరం. 45రోజుల్లో పంట క్రాప్కు వస్తుంది. పంటకు పంటకు మధ్య 10 రోజుల గ్యాప్ ఉంటే సరిపోతుంది. కిలో గుడ్లు(కాకూన్) రూ.900ల వరకు అమ్ముడవుతాయి. పంట సాగు చేస్తే ఖర్చులన్నీ పోనూ ఎకరాకు రూ.80వేల వరకు లాభాలు వస్తాయి. – లింగం, సెరి కల్చర్ జిల్లా సహాయ అధికారి మెదక్. మెదక్ కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా సబ్సిడీలు ఇస్తున్నా.. అధిక లాభాలు వచ్చే పట్టు పరిశ్రమపై మెదక్ జిల్లాలో రైతులకు అవగాహన కొరవడుతోంది. ఫలితంగా జిల్లాలో మల్బరి సాగు పట్టు పురుగుల పెంపకం పట్టుజారుతోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రం పట్టు పరిశ్రమతో విరాజిల్లింది. నేడు పట్టు పురుగుల పెంపకం నానాటికి అడుగంటి పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేనితనంతోనే పట్టు పరిశ్రమ జాడలేకుండా పోతుందన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉన్నా ఎక్కడ కూడా వరి పంట కాకుండా ప్రత్యామ్నయ పంటలు పెరగక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జిల్లాలో 90శాతం రైతులు కేవలం వరి పంటపైనే ఆధార పడుతున్నారు. కొరవడిన ప్రచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని పట్టు పురుగుల పెంపకం చేపడితే రైతులు అధిక లాభాలు గడించవచ్చు. జిల్లాలో వరి, జొన్న, ఆయిల్పామ్ పంటల గురించే తప్ప పట్టు పరిశ్రమపై ఉద్యాన శాఖ, వ్యవసాయశాఖలు ప్రచారం చేయడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో వరి పంట వేస్తుండగా కనీసం వంద ఎకరాల్లో కూడా మల్బరిసాగు లేక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. చేరని సబ్సిడీలు పట్టు పురుగుల పెంపకం, మల్బరి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తున్నాయి. వీటి గురించి చాలా వరకు రైతులకు చేరక పోవడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం డ్రిప్ ఇరిగేషన్, షెడ్డు నిర్మాణానికి లక్షలాది రూపాయల సబ్సిడీలు, మొక్కలకు, పట్టుగుడ్ల కొనుగోలుకు సబ్సిడీలు అందిస్తున్నాయి. అలాగే బీసీలకు, ఇతరులకు 50శాతం సబ్సిడీలు అందిస్తున్నారు. పట్టు పురుగుల పెంపకానికి ఏర్పాటు చేసే షెడ్డు నిర్మాణం కోసం బీసీలకు రూ.2.25 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు 2.92,500లు అందిస్తున్నారు. అలాగే పురుగుల పెంపకానికి అవసరమయ్యే స్టాండ్ నిర్మాణానికి రూ.10,890లు ఎస్సీ, ఎస్టీలకు రూ.22,140లు, మల్బరి మొక్కలు, గుడ్లకు ఎకరాకు రూ.60వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.78వేల సబ్సిడీ అందిస్తున్నారు. 76 ఎకరాల్లో సాగు జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా కేవలం ఆరు మండలాల్లో మొత్తం 76 ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకం, మల్బరి సాగు అవుతోంది. మిగతా 15 మండలాల్లో మల్బరి సాగు జాడలేదు. జిల్లాలోని కౌడిపల్లి–30, పాపన్నపేట–15, రామాయంపేట–4, నిజాంపేట–2, వెల్దుర్తి–15, చిలిపిచెడ్–10 మొత్తం 76 ఎకరాల్లో మల్బరితోట, పట్టు పురుగుల పెంపకం జరుగుతోంది. -
ఏపీఎంకు మెమో జారీ
హత్నూర ఐకేపీలో డీపీఎం విచారణహత్నూర(సంగారెడ్డి): ‘రుణం.. వీఓఏల చేతివాటం’ పేరిట శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఐకేపీ అధికారులు స్పందించారు. ఏపీఎం రాజశేఖర్కు మెమో జారీ చేశారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో డీపీఎం రమేశ్బాబు హత్నూర ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించి విచారణ చేపట్టారు. గ్రామాల్లో వీఓఏలు ఎక్కువ రోజులుగా పనిచేయడం వల్ల సీసీలకు సైతం వినకుండా మహిళా సంఘాల రుణాల్లో కొంత మేర డబ్బులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని డీపీఎం దృష్టికి వచ్చినట్లు తెలిసింది. వీఓఏలు సక్రమంగా పనిచేయకుంటే సీసీలతో పాటు ఏపీఎంపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విచారణ నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని డీపీఎం తెలిపారు. కాగా ఇటీవల సాక్షిలో వెలువడుతున్న వరుస కథనాలతో ఉన్నతాధికారుల్లో కదలిక మొదలైంది. -
రోడ్డు దాటుతుండగా..
ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రఘుపతి కథనం మేరకు.. ములుగుకు చెందిన చిల్లసాగర్ రవి(40) కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తన సొంత పని నిమిత్తం ములుగు స్టేజీవద్దకు వెళ్లిన అతను తిరిగి రోడ్డు దాటుతుండగా గజ్వేల్ వైపు వెళ్తున్న ఓ లారీ రవిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. రవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు మహేశ్, కూతురు అనూష ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు రవి మృతదేహంతో రాజీవ్రహదారిపై ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించారు. గజ్వేల్రూరల్ సీఐ రవిరాజు, ఎస్ఐ రఘుపతి వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఇంజినీర్లకు నివాళులు
పుల్కల్ (అందోల్): శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 21న జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఇంజినీర్లకు సింగూరు జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు నివాళులర్పించారు. ఈ విషాద ఘటన జరిగి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సింగూరు జలవిద్యుత్ కేంద్రంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మృతిచెందిన ఇంజినీర్ల చిత్రపటాలకు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగూరు జలవిద్యుత్ కేంద్రం ఏడీఈలు పాండయ్య, సౌజన్య, రాధిక, పలువురు విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భర్తకు తీవ్రగాయాలు జహీరాబాద్ టౌన్: చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంల భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ వినయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సత్వార్కి చెందిన దంపతులు కలకోడ మన్నన్, తస్లీమ్ బేగంలు టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్పై కర్ణాటకలోని మన్నెకిల్లి వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో చిరాగ్పల్లి గ్రామ శివారులో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తస్లీమ్ బేగ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మన్నన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. విద్యార్థిని ఆత్మహత్య పాపన్నపేట(మెదక్): షకడుపునొప్పి భరించలేక ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం... లక్ష్మీనగర్కు చెందిన వగ్గు రాములు, సాయవ్వ దంపతులకు వగ్గు రశిత (14), అభిలాష్లు ఇద్దరు సంతానం. కొడుకు అభిలాష్ మానసిక వికలాంగుడు. రశిత యూసుఫ్పేట ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఆమె గత కొంతకాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కడుపునొప్పి భరించలేక రశిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి, వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
డ్రంకెన్ డ్రైవ్లో లాఠీ దెబ్బలు
● పోలీసులకు టోకరా ఇచ్చిన మందు బాబు ● యువకుడికి వెంబడించి పట్టుకోవడంతో వివాదం ● పోలీస్ స్టేషన్ను ముట్టడించిన గిరిజనులు కల్హేర్ (నారాయణఖేడ్): మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు జరిపిన లాఠీచార్జ్లో ఓ యువకుడికి బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ప్రస్తుతం బాధితుడు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. కల్హేర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పండరి, ప్రవీణ్ పిట్లం రోడ్డు మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ మేరకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. మద్యం తాగి ఉన్న ఓ యువకుడు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇందిరానగర్ తండాకు చెందిన తులసీరాం అక్కడికి చేరుకుని వివాదాన్ని సర్దిచెప్పేందుకు జోక్యం చేసుకున్నాడు. అయితే, దీనిపై కోపోద్రిక్తులైన పోలీసులు తులసీరాంపై లాఠీలతో దాడి చేశారు. ఈ దాడిలో అతని బలమైన గాయాలయ్యాయి. తమ గ్రామస్తుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఇందిరానగర్ తండా వాసులు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్ఐ రవిగౌడ్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తప్పు ఎవరిదైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు
మెదక్జోన్: వయసుతో సంబంధం లేకుండా 30 నుంచి 40 ఏళ్ల యువతలో కూడా గుండె జబ్బులు పెరుగుతున్నాయని యశోద హాస్పిటల్ సీనియర్ గుండె వైద్య నిపుణులు డా. శశి శ్రీవత్సవ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నడక తప్పనిసరి అని సూచించారు. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించిన గుండెపోటు, ఇతర సమస్యలు ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా రావటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, వేళకు నిద్రపోకపోవడం, జంక్ఫుడ్ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి.. ● ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఒత్తిడి కలగడం. ● నొప్పి ఎడమ చెయ్యి, దవడ లేదా వీపునకు వ్యాపించడం. ● కొద్దిపాటి నడకకే అధిక ఆయాసం రావడం. ● విపరీతంగా చెమటలు పట్టడం, కళ్లు తిరగడం. ● గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది గుండెపోటు వచ్చే సూచన కావచ్చని హెచ్చరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోజూ నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడంతో పాటు, పండ్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఆహారంలో నూనె, ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఇతర వైద్యులు కూడా పాల్గొన్నారు. -
వయోవృద్ధులను గౌరవించాలి
సంగారెడ్డి టౌన్: వయో వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం పట్టణంలో సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వయో వృద్ధులు తమ సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. హక్కులు, సంక్షేమం, ఆస్తి పరిరక్షణకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అందుబాటులో ఉంటుందని, అవసరమైన న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ త్వరతగతిన కుట్టించాల్సిన బాధ్యత మండల ఏపీఎంలపై ఉందని ఐకేపీ డీపీఎం రమేశ్బాబు అన్నారు. శుక్రవారం హత్నూర ఐకేపీ కార్యాలయంలో యూనిఫారాలను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 23 గ్రామీణ మండలాల్లోని 945 పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతితో పాటు కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న మొత్తం 61,777 విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 12,461 యూనిఫామ్స్ కుట్టడం పూర్తయిందన్నారు. 7,563 యూనిఫారాలను ఇప్పటికే విద్యార్థులకు అందించామన్నారు. ప్రస్తుతం మరో రెండు వేలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. వస్త్రం కొంత ఆలస్యంగా జిల్లాకు రావడంతో లేటు జరుగుతుందన్నారు. అయినప్పటికీ త్వరితగతిన యూనిఫారాలను కుట్టించేందుకు మండల స్థాయిలో ఏపీఎం, సీసీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీఎం రాజశేఖ ర్, సీసీలు, మండల సమైక్య సంఘం సభ్యులు ఉన్నారు. జహీరాబాద్: పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని కోహీర్ మండలానికి తాత్కాలికంగా మార్చారు. అద్దె భవనంలో కొనసాగుతూ వస్తున్న కార్యాలయానికి సంబంధించిన అద్దె గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉంది. దీంతో భవన యజమాని అద్దె బకాయిల కోసం ఒత్తిడి చేయడంతో పాటు భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరినందునే మార్చినట్లు సమాచారం. కార్యాలయాన్ని కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో గల అంగన్వాడీ సొంత భవనంలోకి మార్చారు. అయితే కార్యాలయానికి వెళ్లే ఆయా మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు, అవసరాల కోసం వెళ్లే తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. -
బాధితులకు న్యాయం చేయాలి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంతో పాటు రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, అత్యాచారం, వరకట్నం, మరణాల కేసుల్లో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు జరపాలన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ కోసం ప్రతి నెలా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లు నిర్వహించి అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. నేరాల అణచివేతలో సీసీ కెమెరాల పాత్ర కీలమని, వీటి ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జహీరాబాద్ ప్రాంతం ఇతర రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందున నిత్యం నాకాబందీలు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. అలాగే, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి వెంటనే తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్, రూరల్ సీఐలు రవి, హన్మంత్, ఎస్ఐలు లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ -
ఊరికో వెబ్సైట్
● ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్ట్లో మూడు గ్రామాల్లో రూపకల్పన ● సిద్దిపేట జిల్లాలో కూరెళ్ల, సంగారెడ్డిలో చిన్నలోని, మెదక్లో నందగోకూల్ జీపీలు ● ప్రత్యేక అధికారుల నియామకం ఒక్క క్లిక్తో గ్రామ సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. పల్లెలోని ప్రతి అంశం.. వీధిదీపాల నుంచి వార్షిక బడ్జెట్ కేటాయింపుల దాకా క్షణాల్లో తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలోని ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వెబ్సైట్ను తయారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మూడు గ్రామాల వెబ్సైట్లు రూపొందించారు. – సాక్షి, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్లో ఉమ్మడి జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీల వెబ్ సైట్లను రూపొందించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల, మెదక్ జిల్లా నందగోకూల్ గ్రామ పంచాయతీ, సంగారెడ్డి జిల్లా చిన్నలోని గ్రామ పంచాయతీలను పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా వెబ్సైట్ల రూపకల్పన చేశారు. వెబ్సైట్లో పంచాయతీ కోడ్, వైశాల్యం, జనాభా, కుటుంబాలు, గృహాలు, రేషన్ కార్డులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పెన్షనర్లు, పంచాయతీ, మండల, శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు, రహదారులు, నల్లాలు, బోర్లు, వీధిదీపాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, మహిళా సంఘాలు ఇలా సమస్త సమాచారం ఉండనుంది. మూడేళ్ల ప్రణాళిక గ్రామ పంచాయతీలో 2026–27, 2027–28, 2028–29 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చేసే సమగ్ర అభివృద్ధి సమాచారం పొందుపరచనున్నారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, వీబీ రామ్జీ ఆధ్వర్యంలో చేసే పనులు, స్వచ్ఛభారత్ మిషన్, జీపీకి అభివృద్ధికి అవసరమైన అంచనా బడ్జెట్కు సంబంధించిన నివేదికను తయారు చేసి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. అధికారుల నియామకం ప్రత్యేకంగా వెబ్ సైట్లను రూపొందించేందుకు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించింది. సంగారెడ్డి, సిద్దిపేటలకు రూరల్ డెవలప్మెంట్ విజిలెన్స్ అధికారి ఉమారాణి, మెదక్ జిల్లాకు రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ విజయరావులను నియమించారు. వీరు పల్లెలకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నారు. కూరెళ్ల పంచాయతీ వివరాలు సిద్దిపేట జిల్లా కూరెళ్ల గ్రామ జనాభా 2,586. అందులో పురుషులు 1,236, మహిళలు 1,350 మంది ఉన్నారు. కుటుంబాలు 623, రైతులు 854, వాటర్ సోర్స్ ఐదు చెరువులు, అంతర్గత రోడ్లు 9.9కిలో మీటర్లు, బీటీ రోడ్లు 1.5కిలో మీటర్లు, సీసీ రోడ్లు 2.4కిలో మీటర్లు, గ్రావెల్ రోడ్లు4.5కిలో మీటర్లు, విద్యుత్ స్తంభాలు 252, ఎల్ఈడీ లైట్లు 238, ఓపెన్ సీసీ డ్రైనేజీ 1.5కిలోమీటర్లు, కచ్చా డ్రైన్ 45మీటర్లు, ఆర్సీసీ హౌస్లు 319, రేకుల ఇళ్లు 71, పెంకుటిళ్లు 228, స్వయం సహాయక సంఘాలు 65, ట్యాప్ కనెక్షన్లు 601 ఇలా పలు వివరాలతో సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రస్తుతం వెబ్సైట్ అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పబ్లిక్ డోమైన్గా అందుబాటులోకి రానుంది. -
నేడు ‘ఉద్యమ శిల్పి’ పుస్తకావిష్కరణ
నాంపల్లి: తెలంగాణకు చెందిన ప్రముఖ శిల్పి ఎం.వి.రమణారెడ్డి జీవిత ప్రస్థానం, కళా ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను ప్రతిబింబించే ‘ఉద్యమ శిల్పి’ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ శనివారం జరగనుంది. సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత పున్న కృష్ణమూర్తి రచించారు. హైదరాబాదులోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం, అమరజ్యోతి, తెలంగాణ తల్లి విగ్రహ రూప శిల్పిగా ఎం.వి.రమణారెడ్డి సేవలు విశేషమైనవి. ఈ పుస్తకావిష్కరణ సభకు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చింతలపల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సీఎంఓ ప్రజావాణి ఇన్ఛార్జి జి.చిన్నారెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. గజ్వేల్రూరల్: రోడ్లపై ప్రమాదకరమైన డ్రైవింగ్, రైడింగ్ స్టంట్లు చేస్తే చర్యలు తప్పవని గజ్వేల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణలు అన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ సైకిల్తో రోడ్లపై స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వ్యక్తిపై ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత సైకిల్ రైడర్తో పాటు అతని తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై తగిన శ్రద్ద వహించాలన్నారు. గ్రామస్తుల దాడిలో నక్క మృతి బెజ్జంకి(సిద్దిపేట): ఇద్దరి మహిళా రైతులపై నక్క దాడిచేసిన ఘటన మండలంలోని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మహిళా రైతు హన్మండ్ల రామవ్వ పొలంలో పని ముగించుకుని వస్తుండగా ఆమైపె ఓ నక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన పంటచేనులో పనిచేస్తున్న మాడ సరవ్వపై కూడా నక్క దాడిచేసింది. ఆమెను కాపాడేందుకు స్థానికులు చేసిన దాడిలో నక్క కూడా మృతి చెందింది. సరవ్వను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. జహీరాబాద్: జిల్లా స్థాయి చెస్ పోటీల్లో జహీరాబాద్కు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం పట్టణంలోని సంఘమిత్ర పాఠశాలలో మెదక్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–17 విభాగంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరై తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో భాగంగా పట్టణంలోని ఆదర్శ చెస్ అకాడమీకి చెందిన శ్రీనిధితో పాటు పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
సరికొత్త ఒరవడి
సర్కారు బడి..సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఏఐ వినియోగంపై శిక్షణ అందిస్తున్నారు. తొలుత ఏఐ నేర్చుకోవాలనుకునే ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను స్వీకరించింది. అందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 168 మంది ఉపాధ్యాయులున్నారు. వచ్చే నెల 5 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ బాధ్యతలను అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విద్యాశాఖ అప్పగించింది. వీరికి వచ్చే నెల 5వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రోజు రాత్రి 7 గంటల నుంచి 8:30గంటల వరకు జూమ్లో శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, జనరేషన్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికల్లో ప్రాథమిక అంశాలపై టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాల ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, వర్క్షీట్లు, ప్రజెంటేషన్లు రూపొందించడంలో ఏఐ వినియోగాన్ని వివరిస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస స్థాయికి అనుగుణంగా ఏఐ ఆధారిత బోధన పద్ధతులను నేర్పిస్తున్నారు. విద్యార్థుల డేటాగోప్యత, ఏఐ వినియోగంలో నైతిక విలువలు, బాధ్యతాయుత శిక్షణ తోపాటు త్వరలో ఏఐ వినియోగంపై ప్రాక్టికల్ వర్క్షాపులు నిర్వహించనున్నారు. కేవలం 168 మందే ఆసక్తి ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు ఐదు వేల మంది ఉపాధ్యాయులున్నారు. ఇందులో కేవలం 168 మందే ఏఐ శిక్షణకు ముందుకు రావడం చూస్తుంటే.. కొత్త పరిజ్ఞానం నేర్చుకోవాలని మక్కువ ఎంతమందికి ఉందో తెలుస్తోంది. త్వరలో నిర్వహించే మరో విడత శిక్షణకై నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు వినియోగించుకోవాల్సిన అసవరం ఉంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్న 168 మంది ఉపాధ్యాయులు -
షట్టర్లు లేపి.. దొంగతనాలకు పాల్పడి..
తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో ఇటీవల షట్టర్ లిఫ్ట్ చేసి రెండు షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడు హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన కందుల సత్యనారాయణగా గుర్తించారు. తూప్రాన్ ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం.. ఇటీవల తూప్రాన్ పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫర్టిలైజర్, చెప్పుల దుకాణాల షట్టర్లను పైకి ఎత్తి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఇతను ఇతర ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నల్గొండ టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో అతడిని అరెస్టు చేసి జైలులో ఉంచిన్నట్లు తూప్రాన్ పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా, తూప్రాన్ పట్టణంలోని రెండు దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడని ఎస్ఐ తెలిపారు. న్యాయస్థానం అనుమతితో నిందితుడిని శుక్రవారం నల్గొండ జైలు నుంచి మెదక్ కోర్టులో హాజరు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జైలుకు తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు. నిందితుడి అరెస్టు -
డ్రగ్ రహిత సమాజమే లక్ష్యం కావాలి
● సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ● వెల్కటూరులో ‘మన పోలీస్–మన ఊరు’ కార్యక్రమం డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్న మెడికల్ కళాశాల విద్యార్థులు సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటఅర్బన్: సిద్దిపేటను డ్రగ్, సైబర్ క్రైం రహిత జిల్లాగా మార్చడానికి ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ‘మన పోలీస్–మన ఊరు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీస్, విలేజ్ యూత్ మధ్య నిర్వహించిన వాలీబాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వర్షపు నీరు నిల్వ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను ప్రారంభించారు. పలు ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఎవరికి వారు తమ సొంత వ్యూహంతో పట్టుదలతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. స్మార్ట్ఫోన్ను కేవలం జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆన్లైన్లో చదువుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. చిన్న చిన్న గ్రామాల నుంచే పెద్ద పెద్ద విజయాలు సాధ్యమవుతాయని, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించాలని సూచించారు. ఆడపిల్లలపై ఎలాంటి వివక్ష చూపవద్దని, వారి కలలను, ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని కోరితే నమ్మవద్దని సూచించారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతకుముందు సురభి మెడికల్ కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై నృత్యప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి, త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు, సర్పంచ్ బొల్లు లక్ష్మి, నాయకుడు బొల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
బతుకుదెరువు కోసం వచ్చి అదృశ్యం
పటాన్చెరు టౌన్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన అన్న అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన సంజయ్ (41) ఉపాధి కోసం ఈ నెల 15న పటాన్చెరు పరిధిలోని ఇస్నాపూర్కు వచ్చాడు. ఇక్కడికి చేరుకున్న వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఇస్నాపూర్కు సురక్షితంగా చేరుకున్నట్లు తెలిపాడు. మరుసటి రోజు ఇస్నాపూర్లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నానని కుటుంబ సభ్యులకు మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. అయితే, ఈ నెల 17న సంజయ్కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం తెలిసిన వారి వద్ద, స్థానికంగా అంతటా వెతికినా ఎక్కడా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో తన అన్న అదృశ్యమయ్యాడని తమ్ముడు గౌతమ్ శుక్రవారం పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి
పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్తంగి డివిజన్ పరిధిలో గురువారం రాత్రి సుమారు 26 ఏళ్ల యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో పటాన్చెరు నుంచి వస్తున్న ఒక వాహనం వెనుక నుంచి అతడిని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడికి తలకు తీవ్ర రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆ పరిసర ప్రాంతాల్లో విచారించినప్పటికీ మృతుడి ఆచూకీ లభించలేదు. మృతుడికి సంబంధించిన ఆనవాళ్లు లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే పటాన్చెరు పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడల్లో రాణించాలి
● డీఎస్పీ ప్రసన్నకుమార్ మెదక్జోన్: నిరంతర శ్రమతో క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుక రావాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. 12వ, రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ అండర్ 14, 16, 18, 20 బాల, బాలికలకు స్థానిక స్టేడియంలో శుక్రవారం జ్రిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో 450 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. త్రోబాల్, రన్నింగ్, జంపింగ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీల్లో వరంగల్లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని అథ్లెటిక్స్ కార్యదర్శి మధు సూదన్ తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అధ్యక్షులు వెంకటరమణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మీరే తేల్చండి!
మా పరిధిలో లేదు..సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత జాబితా 22–ఏలో ఉన్న తమ ఆస్తులను ఆ జాబితాలోంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తుల్లో చాలా మట్టుకు జిల్లా అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. వివిధ కారణాలతో తాము జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నామని, ఈ దరఖాస్తులపై మీరే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ లెవల్ కమిటీకి పంపారు. జిల్లాలో పలు చోట్ల ప్లాట్లు, ఇండ్లు, అపార్టుమెంట్ ఫ్లాట్లు నిషేధిత భూముల జాబితా 22–ఏలో ఉన్నాయి. ఆర్థిక అవసరాల కోసం వీటిని అమ్ముకునేందుకు ప్రయత్నించగా, ఈ ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు కాదని ఆశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు లబోదిబోమంటున్నారు. తమ ఆస్తులను నిషేధిత జాబితాలోంచి తొలగించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాస్థాయి కమిటీ సమీక్ష సుమారు 70 వరకు దరఖాస్తులను కలెక్టర్ ప్రతీక్జైన్ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ గురువారం సమీక్ష నిర్వహించింది. ఈ దరఖాస్తుల్లో కొన్ని అసైన్డ్ భూముల్లో ఇండ్లు ఉన్నాయి. గతంలో తక్కువ ధరకు వస్తుందనే కారణంగా అసైన్డ్ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. అప్పట్లో రాజకీయ నాయకుల పలుకుబడితో ఈ అసైన్డ్ భూముల్లోనూ నిర్మాణానికి అనుమతులు పొందారు. చాలా ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ అసైన్డ్ భూములన్నీ నిషేధిత జాబితాలో చేర్చడంతో వాటికి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలోంచి తొలగించే అధికారం జిల్లాస్థాయిలో తమకు లేదని మీరే తేల్చాలని సుమారు 12 సర్వే నంబర్లలోని దరఖస్తులను స్టేట్ లేవల్ కమిటీకి పంపారు. 22–ఏ జాబితాలోంచి తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులు సమీక్షించిన కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ రాష్టస్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అసైన్డ్, ఫ్రీడం ఫైటర్, మాజీ సైనికుల భూముల విషయంలోనూ ఇదే నిర్ణయం పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా కొందరు బడా రాజకీయ నాయకులు, రియల్టర్లు కలిసి బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. తమ పలుకుబడిని ఉపయోగించి వాటిలో వెంచర్లకు అనుమతులు పొంది ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తీరా ఈ భూములు 22–ఏలోకి వెళ్లి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఇలాంటి భూముల విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకోవాలని స్టేట్ లేవల్ కమిటీకి ప్రతిపాదించారు. మాజీ సైనిక ఉద్యోగుల భూముల్లోనూ కొందరు నాయకులు ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ భూములు కూడా ఇప్పుడు నిషేధిత జాబితాలో చేరడంతో ఇందులోని పాట్లు కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. తమ పాట్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ చేసుకున్న దరఖాస్తులను కూడా తాము ఏమీ చేయలేమని, స్టేట్ లేవల్ కమిటీకి నివేదించారు. ఇలా 70కి పైగా సర్వే నంబర్లలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఇందులో సుమారు 12 సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులను నిషేధిత జాబితాలోంచి తొలగించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. -
నిమ్జ్ గ్రామాల్లో గందరగోళం!
ఆ భూములేలా తీసుకుంటారు జీపీల అధికారాలు టీజీఐఐసీ, ఎన్ఐసీడీఐటీలకు బదలాయింపు ఈ మేరకు తీర్మానాలు చేసి పంపాలని సర్కారు ఆదేశాలు వ్యతిరేకిస్తున్న సర్పంచ్లు, పాలకవర్గాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్(జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా గ్రామాల పాలకవర్గాలైన పంచాయతీల అధికారాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్సీడీఐటీ (నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్), టీసీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)లకు బదలాయించాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు కొన్ని చోట్ల గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ అధికారాల బదలాయింపును ఆయా గ్రామాల సర్పంచులుగా పాలకవర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాల్కల్ మండలం హద్నూర గ్రామ పాలకవర్గం గురువారం గ్రామసభను నిర్వహించింది. తమ అధికారాలను బదలాయించేది లేదని తీర్మానం కూడా చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ఇప్పుడు గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జహీరాబాద్ నిమ్జ్ స్మార్ సిటీలో భాగంగా తొలి విడతలో 3,245 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఈ భూములను కొందరు పెట్టుబడిదారులకు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పెట్టుబడిదారులు తమ పరిశ్రమలను నెలకొల్పడానికి అనుమతులు, భవన నిర్మాణ క్లియరెన్స్లు ఇచ్చే అధికారం సంబంధిత గ్రామ పంచాయతీకి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఆయా గ్రామ పంచాయతీలకు ఉన్న ఈ అధికారాలను టీజీఐఐసీ, ఎన్సీడీఐటీలకు చెందిన ఉమ్మడి సంస్థకు బదిలీ అవుతాయి. ఝరాసంగం మండలం బర్దిపూర్, చీలపల్లి, ఎల్గోయి. న్యాల్కల్ మండలం హద్నూర్, ముంగి, రుక్మాపూర్ గ్రామ పంచాయతీల అధికారాలు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థకు బదిలీ కానున్నాయి. దీంతో ఈ గ్రామాల పరిధిలో ఎలాంటి నిర్మానాలు చేపట్టాలన్నా ఆయా గ్రామ పంచాయతీల అనుమతుల అవసరం ఉండదు. జాబితాలో లేని సర్వే నంబర్ల ప్రస్తావన తీర్మానాల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో భూసేకరణలో లేని సర్వే నంబర్లు కూడా ప్రస్తావించారు. ఈ ఉత్తర్వులకు అనుబంధంగా జారీ చేసిన ఎనాగ్జర్–2 లో భూసేకరణ జాబితాలో లేని సర్వే నంబర్లు కూడా ఉండటం కూడా ఆయా పంచాయతీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకరించానికి ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఇకపై భూసేకరణ ఉండబోదని అధికారుల ప్రకటించాక కొత్త సర్వే నంబర్లు ఈ జాబితాలో ఉండటంతో సంబంధిత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ విషయమై బాధిత రైతులు, గ్రామస్తులు న్యాల్కల్ మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో సంప్రదించగా.. తమకేమీ తెలియదని, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మీకు పంపామని, మీరే చేసే తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని అధికారులు దాటవేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బాధిత రైతులు, గ్రామపంచాయతీల పాలకవర్గాల సందేహాలను నివృత్తి చేయాల్సిన అధికారులు తమకేదీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల ఆయా గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.న్యాల్కల్(జహీరాబాద్): నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూములను కాకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఇతర భూములు తీసుకోవడమేమిటనీ హద్నూర్ గ్రామ రైతులు అధికారులను ప్రశ్నించారు. గురువారం మండల పరిధిలోని హద్నూర్ పంచాయతీ ఆవరణలో పంచాయతీ పాలకవర్గం, రైతులతో అధికారులు సమావేశం నిర్వహించారు. నిమ్జ్ ఏర్పాటు కోసం ఇదివరకు సేకరించిన 543 ఎకరాలు కాకుండా మరో 943 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించడం ఏమిటనీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారాలను టీజీఐఐసీకి అప్పగించవద్దని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ధన్రాజ్, వార్డు సభ్యులు, రైతులు హాజరయ్యారు. -
రుణం.. వీఓఏల చేతివాటం
● మహిళా సంఘాల నుంచి ముక్కు పిండి వసూలు ● అధికారుల పర్యవేక్షణ లోపం ● విచారణకు పలువురి డిమాండ్ మహిళా సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న బ్యాంకు లింకేజీ లోన్లలో వీఓఏలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రుణం మంజూరు కావాలంటే ముందుగా ముడుపులు చెల్లించాలంటున్నారు. రూ.10 లక్షల రుణానికి ఒక లెక్క.. రూ. 20 లక్షలకు మరో లెక్క చొప్పున సభ్యుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. – హత్నూర(సంగారెడ్డి) అధికారుల పర్యవేక్షణ లోపం మహిళా సంఘాలకు శాపంగా మారింది. మండలంలో 1,050 మహిళా స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. ఇందులో సుమారు 800కు పైగా గ్రూపులు రూ.10 నుంచి రూ. 20 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ఇలా సుమారు రూ. 1,000 కోట్లకు పైగా మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని లావాదేవీలు కొనసాగిస్తున్నారు. సుమారు 25 మహిళా గ్రూపులు సక్రమంగా రుణాలు చెల్లించక రూ.30 లక్షల వరకు బ్యాంకులకు బాకీ ఏర్పడ్డారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను మహిళా సంఘాల నుంచి సక్రమంగా చెల్లించే బాధ్యత వీఓఏలదే. అయితే వీరు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించే సమయంలో రూ. లక్షకు రూ. 2 నుంచి 3 వేల వరకు, రూ. 20 లక్షల వరకు రుణం బ్యాంకు ద్వారా ఇప్పిస్తే రూ.5000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాత తీర్మానాలు, సంతకాలు పూర్తిగా లేకున్నా అక్రమాలకు పాల్పడుతూ బ్యాంకుల ద్వారా కొంతమంది మహిళలకు రుణాలు సైతం ఇప్పిస్తున్నట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లలో సైతం దోపిడీ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో క్వింటాల్ ధాన్యం తూకం కోసం లారీ లోడింగ్ చేయడానికి హమాలీకి రూ. 48 నుంచి 50 రూపాయల వరకు రైతుల నుంచి ముక్కుపిండి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చిన టేకేదారులకు మాత్రం 39 రూపాయలు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వీఓఏలు నిర్వాహకులకు ముట్టజెప్పి మిగితా డబ్బులను కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన లక్షలాది రూపాయలు సీసీలతో పాటు మండల స్థాయి ఏపీఎం వరకు ముడుపులు ముట్టినట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేయించాలని పలువురు కోరుతున్నారు. -
రాజీవ్ సేవలు చిరస్మరణీయం
డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి సంగారెడ్డి: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్గాంధీ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. దేశంలో టెలికాం, కంప్యూటర్ రంగాల విస్తరణకు రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యలు భవిష్యత్ భారత నిర్మాణానికి బాటలు వేశాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఓటు హక్కు కల్పించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాజీవ్గాంధీ కృషి చేశారని ఆమె గు ర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స న్ కూన వనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హపీజ్, నాయకులు తొపాజీ అనంత కిషన్, కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
శక్తి స్కీంను రద్దు చేయండి
పటాన్చెరు టౌన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలనే డిమాండ్తో గురువారం పటాన్చెరు డివిజన్లో విద్యాసంస్థల బంద్ చేపట్టినట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ.. బంద్ విజయవంతానికి సహకరించిన విద్యార్థులు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శాంసన్, విశాల్, సాయి, రమేష్ పాల్గొన్నారు. సంగారెడ్డి: లింగ నిర్ధారణను అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా వైద్యాధికారి లలితాదేవి అన్నారు. గురువారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లింగ నిర్ధారణను అరికట్టడం, పీసీ అండ్ పీఎన్డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ కేంద్రాల పనితీరు, రికార్డుల నిర్వహణ, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై సమగ్రంగా చర్చించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళా శిశు సంరక్షణ, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ నాగనిర్నాల, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సతీశ్ నర్సాపూర్ రూరల్: నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకోవడం అలవర్చుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ సూచించారు. గురువారం మండలంలోని లింగాపూర్ రైతు వేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంట సాగుకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పెసర, మినుము, శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ వంటి తక్కువ నీటి వీటి వినియోగంతో పండే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలతో పెట్టుబడితో పాటు నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ దీపిక, ఏఈఓలు దుర్గా ప్రసాద్, తేజస్విని, లావణ్య, రైతులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్ద గల డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యసంస్థ, వ్యవసాయ కళాశాలలో వ్యవసాయం, విత్తన సాంకేతికతలో ఆరునెలల వృత్తివిద్యతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్పై ఏడాది ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ దేవెందర్రెడ్డి, ఫీల్ మేనేజర్ జగదీశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యకు పదో తరగతి పాస్, మార్కెటింగ్ విద్యకు ఇంటర్మీడియెట్ పాస్ అయిన యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. శిక్షణ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పంటలసాగు, బోధన, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ 30 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. వివరాలకు 9381959372, 8466942278 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని చేగుంట బాలికల గిరిజన గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతిలో ఎస్టీలకు 35, ఎస్సీలకు 5, బీసీలకు 5, ఓసీలకు 5, మైనార్టీలకు 5, స్పోర్ట్స్ కోటాలో 1 ఆరో తరగతిలో ఎస్టీలకు 27, ఏడో తరగతిలో ఎస్టీలకు 3, ఎనిమిదో తరగతిలో ఎస్టీలకు 3 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈనెల 30, 31న చేగుంట గిరిజన గురుకుల పాఠశాలలో ఎంపిక ప్రకియ నిర్వహిస్తామన్నారు. -
పనిచేసే కార్యకర్తకే గుర్తింపు
ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోడ్ నారాయణఖేడ్: పార్టీ కోసం పనిచేసే కార్యకర్తకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం కాంగ్రెస్ సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కాంగ్రెస్కు కార్యకర్తలే వెన్నుముక అని అన్నారు. వారు నిరంతరం పార్టీ కోసం పనిచేస్తుండటం వల్లే పార్టీ బలంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం సేకరించిన అభిప్రాయాలను పార్టీ ఆధిష్టానానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మా భూములు లాక్కునే కుట్ర
తెలంగాణ భవన్కు అమీన్పూర్ బాధితులు పటాన్చెరు: సాధారణ పేద, మధ్యతరగతి కుటుంబాల భూములను రకరకాల నిబంధనల పేరుతో గద్దల్లా తన్నుకుపోయేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బాధితులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన వందలాది మంది బాధితులు మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్కు తరలివెళ్లారు. అమీన్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లు, ప్లాట్లు రాత్రికి రాత్రే 22ఏ నిషిద్ధ జాబితాలోకి చేరడంతో తీవ్రంగా నష్టపోయామని, పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన స్థలాలు, కట్టుకున్న ఇళ్లు ఇప్పుడు దేనికీ పనికిరాకుండా పోయాయని బాధితులు వాపోయారు. పరిపాలనాపరమైన తప్పులు ప్రభుత్వం చేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం భూములను నిషేధిత జాబితాలో చేర్చి, చివరికి ఆ నిందను అధికారులపై తోసేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి విమర్శించారు. బాధిత ప్రజలకు తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, 22ఏ పేరుతో పేదల పొట్టకొట్టే కాంగ్రెస్ నిర్ణయాలపై అసెంబ్లీలోనూ, క్షేత్రస్థాయిలోనూ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసిందని తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రిలో అరుదైన కంటి ఆపరేషన్
వివరాలు వెల్లడించిన ఆర్ఎంఓ డాక్టర్ సదానందంసిద్దిపేటకమాన్: కంటి శుక్లం సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి అరుదైన కంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఆసుపత్రి నేత్ర విభాగం వైద్యులు, ఆర్ఎంఓ డాక్టర్ సదానందం తెలిపారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో ఆయన వివరాలు వెల్లడించారు. ముండ్రాయి గ్రామానికి చెందిన భానుప్రకాశ్రెడ్డి (30) ఆరు నెలలుగా కంటి చూపు సమస్యతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగా.. కుడి కంటిలో కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్ (సంక్షిష్టమైన కంటి శుక్లం) ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే పుట్టుకతో ఐరిస్ కోలోబోమా, కంటిలో బలహీనమైన జోన్యూల్స్ ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ తర్వాత కంటి అద్దం కష్టతరమవుతుందని తెలిపారు. దీంతో భాను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిని సంప్రదించగా పరీక్షించిన ఆప్తమాలజీ వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత సూచనల మేరకు అతడికి నేత్ర విభాగం హెచ్ఓడీ డాక్టర్ కాంతశ్రీ, ఐ సర్జన్, ఆర్ఎంఓ సదానందం, డాక్టర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రైవేటులో ఈ చికిత్సకు సుమారు రూ.80 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
184 గంజాయి చాక్లెట్లు స్వాధీనం
తూప్రాన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయి చాక్లెట్ల ను పోలీసులు పట్టుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గాయత్రి వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం 44వ జాతీయ రహదారిపై తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్గఢ్లోని రాయపూర్ నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి చాక్లెట్లను రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఛత్తీస్గఢ్కు చెందిన భారత్ వద్ద కొనుగోలు చేసి తీసుకొస్తున్న 184 గంజాయి చాక్లెట్లను, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ప్రొహిబిషన్–ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వీణారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ అంజయ్య, కానిస్టేబుల్స్ రవికాంత్, విక్రమ్ పాల్గొన్నారు. -
పీపుల్స్ ఆస్పత్రికి రూ.25 వేల జరిమానా
రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపటాన్చెరు టౌన్: పటాన్చెరు పట్టణంలోని పీపుల్స్ ప్రైవేట్ ఆస్పత్రిని డిప్యూటీ డీఎంహెచ్వో నాగనిర్మల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని స్కానింగ్కు సంబంధించిన వివరాలను యాజమాన్యం సక్రమంగా నమోదు చేయలేదని గుర్తించారు. అలాగే వివిధ దస్త్రాలు, రిజిస్టర్ల నిర్వహణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని తెలిపారు. ఉపయోగించిన సూదులను నిబంధనల ప్రకారం విరిచి పారవేయడం లేదని తెలిపారు. స్టెరిలైజేషన్ రిజిస్టర్ను చూపించాలని అడగగా.. ఎవరో తీసుకెళ్లారని ఆస్పత్రి సిబ్బంది సమాధానం చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యానికి రూ.25 వేల జరిమానా విధించి, నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో రిజిస్టర్లను చూపించాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో హెల్త్ అసిస్టెంట్ రాజేందర్ పాల్గొన్నారు. -
పరామర్శకు వచ్చి.. గుండెపోటుకు గురై..
సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం శివ్వంపేట(నర్సాపూర్): పరామర్శకు వచ్చిన వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మాచన ఈశ్వరయ్య మంగళవారం రాత్రి చనిపోయాడు. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన గుండ నర్సింహులు(50) ఈశ్వరయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. వెంటనే స్థానికులు అతనికి సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. మరికొద్ది నిమిషాల్లోనే మరో మారు గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
ఉద్యోగం రాక.. పెళ్లి సంబంధాలు కుదరక..
మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యతొగుట(దుబ్బాక): ఒక వైపు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడం, మరో వైపు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. తొగుట పోలీసులు, గ్రామస్తులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంగళపల్లి కనకయ్య(33) ఎనిమిదేళ్ల క్రితం డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. దీనికి తోడు తనకున్న నత్తి కారణంగా సరిగ్గా మాటలు రాకపోవడంతో పెళ్లి సంబంధాలు సైతం కుదరడం లేదు. ఇటు ఉద్యోగం రాక, అటు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కనకయ్య ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుని తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మధ్యాహ్న భోజనం బంద్ చేశారు!
అల్లాదుర్గం(మెదక్): అధికారుల నిర్లక్ష్య ధోరణి పేద పిల్లలకు శాపంగా మారింది. వంట కార్మికులు విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నారు. దీంతో ఈ ఘటనపై అధ్వానంగా మధ్యాహ్న భోజనం అనే శీర్షికతో సాక్షి బుధవారం వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆగ్రహించిన మండలంలోని గోల్లకుంట తండా ప్రాథమిక పాఠశాల వంట కార్మికులు ఏకంగా మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేశారు. కొంత కాలంగా నీళ్ల చారుతో విద్యార్థులకు భోజనం పెడుతుంటే అధికారులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. హెచ్ఎం, వంటకార్మికులు కుమ్మకై ్క విద్యార్థుల పొట్ట కొడుతున్నారని తండావాసులు ఆరోపించారు. మొదటి నుంచి అధికారులు పర్యవేక్షించక పోవడం, తాము వండకుంటే మరొకరు లేరని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ లక్ష్మణ్ను వివరణ కోరగా.. విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనం బంద్ చేసిన వంట నిర్వాహకులపై విచారణ చేపడతామన్నారు. -
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
సిద్దిపేట బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్సిద్దిపేటఅర్బన్: ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఆర్ఎంఓ డాక్టర్ శ్రావణి అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇందూరు కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో 52 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స సమయంలో, గర్భిణులకు డెలివరీ సమయంలో, ఇతర అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని సూచించారు. యువత తమ పుట్టినరోజు ఇతర ముఖ్యమైన రోజులలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విపి రాజు, వైస్ ప్రిన్సిపాల్ బెనర్జీ,పీఆర్వో రఘు, సిబ్బంది పాల్గొన్నారు. -
కరాటేలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్
విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే హరీశ్రావుగజ్వేల్రూరల్: కరాటేలో విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో స్థానం సాధించడం గజ్వేల్ పట్టణానికే గర్వకారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ 26న హైదరాబాద్లోని గచ్చి బౌలి స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో గజ్వేల్ పట్టణానికి చెందిన 21 మంది విద్యార్థులు పాల్గొని అరుదైన గుర్తింపు పొందడంపై కరాటే మాస్టర్ కృష్ణతో పాటు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావడంపై వచ్చిన ప్రశంసా పత్రాలు, మెడల్స్ను బుధవారం సిద్దిపేటలో హరీశ్రావు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మున్ముందు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గజ్వేల్ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు కల్యాన్కర్ నర్సింగరావు పాల్గొన్నారు. -
బోనస్కు రిజిస్ట్రేషన్ చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్): సన్నరకం వరిధాన్యం బోనస్ కోసం రైతులు విత్తనాలు కొన్న దుకాణంలో ఆన్లైన్లో విత్తన రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఓ స్వప్న తెలిపారు. ప్రభుత్వం బీపీటీ 5204(సాంబమసూరి), ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44(సిద్ది), కేఎన్ఎం 7715 ఈ ఏడు రకాల సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వనుందని సూచించారు. ఈ ఏడు రకాల వరి సాగు చేస్తున్న రైతులు ఏ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేస్తారో అక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించి ఈనెల 24, 25వ తేదీల్లో పట్టాదారు పాస్బుక్, ఆధార్ జిరాక్స్ పత్రాలు వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. పీఏసీఎస్ సెక్రటరీ సస్పెన్షన్కల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలంలోని బోక్కస్గాం పీఏసీఎస్ సెక్రటరీ సతీశ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి కిరణ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఏసీఎస్లో నిధుల దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి విచారణ చేసి నివేదిక అందజేశారు. ఈ మేరకు సెక్రటరీ సతీశ్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డల కోసమే మాతృదేవోభవ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్: తల్లీబిడ్డల ఆరోగ్యానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మాతృదేవోభవ కార్యక్రమం చేపట్టి అమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని శివాలయం సమీపంలో గర్భిణులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తన సొంత నిధులతో మాతృదేవోభవ కార్యక్రమం చేపట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలన్న ఉద్దేశంతో గర్భిణులకు తన వంతుగా పోషకాహార కిట్లు అందజేస్తున్నానని చెప్పారు. కాగా 130మంది గర్భిణులకు పోషకాహార కిట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గుర్తుతెలియని బైక్ స్టేషన్కు తరలింపు శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో రోడ్డు పక్కన ‘గుర్తుతెలియని బైక్ పార్కింగ్’పై కథనం సాక్షి దినపత్రికలో బుధవా రం ప్రచురితం కావడంతో పోలీసులు స్పందించారు. సదరు బైక్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. బైక్ రామంతపూర్కు చెందిన వ్యక్తిగా ఆర్సీ నమోదై ఉందని, ఈ బైక్పై మూడు చలాన్లు ఉన్నట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం బైక్ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ పుల్కల్(అందోల్): నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ వద్ద జరిగిన చోరీ కేసులో పోలీసులు దొంగలను అరెస్టు చేశారు. బుధవారం జోగిపేట సీఐ అనిల్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్కు చెందిన మరాటి ప్రకాశ్ , శివంపేటకు చెందిన చాపల సురేశ్, కర్ణాటక రాష్ట్రం మైసూర్కు చెందిన నానంపేట అనిల్, గోసాని రాంచందర్, శివంపేటకు చెందిన చాపల గోపాల్ ముఠాగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో చోరీలు చేస్తున్నారు. వీరిపై పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఈనెల 9న సింగూరు డ్యాం వద్ద దావత్ చేసుకొని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో బస్వాపూర్ శివారులోని ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ స్థలంలో 45 అల్యూమినియం ప్యానల్లను దొంగిలించి, ట్రాలీ వాహనంలో తరలించారు. కాగా ఇందుకు తాడ్దాన్పల్లి టోల్ వద్ద ఫోన్పే ద్వారా ఫీజును సైతం చెల్లించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు సంగారెడ్డి క్రైమ్: చిన్నారి హత్యకేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. సంగారెడ్డి టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన మూడవ సురేశ్ సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్లో నివాసం ఉండేవాడు. మద్యం మత్తులో రెండున్నరేళ్ల చిన్నారిపై దాడి చేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమో దు చేసి, జిల్లా న్యాయస్థానంలో హాజరు పరచారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. -
పర్యావరణ సమతుల్యత కాపాడాలి
ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డిములుగు(గజ్వేల్): వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న ముప్పులను తగ్గించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వ్యవసాయ అటవీ విధానం శాసీ్త్రయ, ఆచరణాత్మక పరిష్కారమని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డా. రాజిరెడ్డి అన్నారు. ములుగులోని అటవీ కళాశాల పరిశోధన సంస్థలో రెండు రోజులుగా నిర్వహించిన ‘క్లైమేట్ రెడీ ఆగ్రోఫారెస్ట్రీ’ఇంటి గ్రేటింగ్ ఎకాలజీ, టెక్నాలజీ ఇనిస్టిట్యూషనల్ ఇన్నోవేషన్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు వ్యవసాయ అటవీ విధానాలను విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరముందన్నారు. వివిధ సాంకేతిక విభాగాల్లో అత్యుత్తమ ఓరల్, పోస్టర్ ప్రదర్శనలు చేసిన పరిశోధకులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐసీఎఫ్ఆర్ఈ–ఐఎఫ్బి డైరెక్టర్ స్వప్నేందు పట్నాయక్, రిజిస్టర్ భగవాన్, కళాశాల డీన్ ప్రవీణ, అధికారులు జ్యోతి ప్రకాశ్ మొహంతి, ప్రియరాజేంద్ర, శ్రీధర్ పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..
చెరువులో మునిగి యువకుడి మృతిచిన్నశంకరంపేట(మెదక్): అంత్యక్రియలు ముగిసిన అనంతరం చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శాలిపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ విఠల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముండ్రాతి రమేశ్ (33) మంగళవారం గ్రామంలోని వరుసకు పెద్దమ్మ అయినా పోచమ్మ మృతి చెందగా అంత్యక్రియలకు వెళ్లాడు. అనంతరం స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లగా అందరూ చూస్తుండగానే నీటి మునిగి చనిపోయాడు. ఈత రాకపోవడంతో చెరువులో జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బుధవారం చెరువులో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
విరాహత్ అలీకి మాతృవియోగం
గజ్వేల్రూరల్: టీయూడబ్ల్యూజే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాతృమూర్తి బషారత్ ఉన్నీసాబేగం అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు గజ్వేల్లోని విరాహత్అలీ ఇంటికి చేరుకున్నారు. ఉన్నిసాబేగం మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, తదితర నాయకులు పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చేగుంట(తూప్రాన్): విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల ప్రవీణ్ (36) వ్యవసాయ పొలం వద్ద గడ్డి తొలగింపు యంత్రంతో గడ్డిని తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో భూమిపై ఉన్న కేబుల్ తెగిపోగా ప్రవీణ్ విద్యుత్షాక్కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానిక రైతులు ప్రవీణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మక్కపల్లి గ్రామంలో.. ములుగు(గజ్వేల్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జూపల్లి పెంటయ్య(62)తన వ్యవసాయ పొలంలో పచ్చి గడ్డి కోస్తూ బోరుమోటారుకు సంబంధించిన సర్వీస్ వైర్ను తాకాడు. దీంతో విద్యుత్ షాక్కు గురై పెంటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పల్లెకు ప్రజాపాలన
సమస్యలు మీవి.. పరిష్కారం మాదిహుస్నాబాద్: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారు నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు విన్నవించిన సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, 173 గ్రామాలను మంత్రి స్వయంగా సందర్శించి ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. మొదటి విడతగా ఈనెల 31వ తేదీ వరకు గ్రామాల్లో సందర్శించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ‘పల్లె పల్లెలో ప్రజాపాలన..పల్లె పల్లెకు పొన్నం’ అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని సైదాపూర్లో పర్యటించారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి, మౌళిక వసతులు, సంక్షేమం తదితర అంశాలపై గ్రామాల వారీగా సమీక్షించారు. ప్రతి సమస్యనూ రికార్డు చేసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రజలకు భరోసానిచ్చారు. అర్హులైన వారికి పెన్షన్ ఇస్తామని, ఈ నెల 31లోపు నూతన పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నియోజవర్గానికి వెయ్యి కుట్టు మెషీన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఇల్లు లేని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతామన్నారు. రైతులకు లాభదాయకమైన పంటగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో జలసిరి కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే సౌర విద్యుత్ వినియోగాన్ని ఇంటికి చేరువ చేయడంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టుకునే వారికి రూ.75 వేల సబ్సిడీతో పాటు రూ.2.50 లక్షల రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. మిగులు కరెంట్ను విద్యుత్ శాఖ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లకు సంబంధించి వచ్చిన నోటీసులను పరిశీలించి అర్హులైన ఓటర్కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించారు. గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజా పాలన లక్ష్యాలను ప్రజలకు అందించేలా వారి వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.సమస్యల పరిష్కారమే ధ్యేయం గ్రామాల వారీగా ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నాను. లిఖిత పూర్వకంగా దరఖాస్తులు ఇవ్వండి. వాటిని రికార్డు చేసుకొని సమస్యను పరిష్కరిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశాం. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. – మంత్రి పొన్నం ప్రభాకర్ -
కొత్త పింఛన్లపై ఆశలు
సంగారెడ్డి జిల్లాలో 1,58,023 మంది అర్హులుహత్నూర(సంగారెడి)/సంగారెడ్డి క్రైమ్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు చేసుకున్న వారి ఆశలు చిగురిస్తున్నాయి. పెన్షన్ మంజూరైతే ఆసరాగా ఉంటుందని లబ్ధిదారులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకోగా కొన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో, మరికొన్ని ఎంపీడీవో లాగిన్లో, జిల్లా కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఇటీవల అధికారులు ప్రకటించడంతో మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యా రు. ఆన్లైన్లో దరఖాస్తు విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు కచ్చిత సమాచారం చెప్పకపోవడంతో అవస్థలు పడుతున్నారు.అర్జీలను గ్రామ కార్యదర్శికి, ఎంపీడీవో కార్యాలయంలో, మున్సిపాలిటీలో సమర్పించాలనే విషయంలో స్పష్టత కొరవడింది. గతంలో దరఖాస్తు చేసిన వారు సైతం మళ్లీ చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో చాలా మంది అర్హులు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,58,023 మంది అర్హులున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒంటరి మహిళలు(7411), వితంతు (7507), బీడీ కార్మికులు(102), ఏఆర్టీ(2034), డయాలసిస్ బాధితులు (1039) మంది ఉన్నారు. గతంలో రూ.2016 చొప్పున ప్రభుత్వం ప్రతి నెల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఐదేళ్లుగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. కాగా పింఛన్లు పొందుతున్న వారిలో కొంతమంది మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు అర్హులైతే కలెక్టర్ ప్రత్యేక చొరవతో కొన్నింటిని వారికి బదిలీ చేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం మంజూరు చేయలేదు. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసి మూడేళ్లు.. పింఛన్ కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా. నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. మళ్లీ అధికారులు కొత్త పింఛన్ దరఖాస్తు ఇవ్వమని చెబుతున్నారు. – యశోద, మల్కాపూర్ సద్వినియోగం చేసుకోవాలి పెన్షన్ దరఖాస్తులను మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. అర్హులందరికి ఆసరా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. – షహేరియా బేగం, జిల్లా పెన్షన్ అధికారి -
291 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
హత్నూర (సంగారెడ్డి): లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. మంగళవారం మండలంలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద డీటీసీఎస్ అధికారి అనుదీప్ దేవానంద్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బియ్యం లోడ్తో వెళుతున్న లారీని గుర్తించి ఆపారు. లారీలో దొడ్డు రకం రేషన్ బియ్యం రూ.5లక్షల 24వేల 700 విలువగల 291 క్వింటాళ్ల 50 కిలోల బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కె.వి.ఆర్ ట్రేడింగ్ కంపెనీ బియ్యం యజమాని వెంకి రాథోడ్, మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ రాజారాంపై అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సదాశివపేట గోదాంకు తరలించారు. సిద్దిపేటలో 113 క్వింటాళ్లు.. సిద్దిపేటకమాన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్టౌన్ సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. డీసీఎంలో 245 బస్తాల్లో మొత్తం 113.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనం, పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం డ్రైవర్ కాళ్లకుంట్ల కాలనీకి చెందిన దండ్ల యాదగిరి, మరో నలుగురు వ్యక్తులకు కూడా సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. -
కరాటే కోచింగ్ సెంటర్లో మంటలు
నర్సాపూర్: నర్సాపూర్లోని కరాటే కోచింగ్ సెంటరులో మంగళవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. భవనం యజమాని రమేశ్ కథనం ప్రకారం.. కరాటే కోచింగ్ సెంటరు కోసం తన భవనంలోని సెల్లార్ను అద్దెకు ఇచ్చానని, ఇటీవల వారు ఖాళీ చేసినా కొంత సామగ్రి అందులోనే ఉందని చెప్పారు. కాగా మంగళవారం సెల్లార్ నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా షార్ట్ సర్క్యూట్తోనే మంటలు చెలరేగినట్లు రమేశ్ చెప్పారు. మ్యాట్స్ ఇతర సామగ్రి కాలిపోయాయి. గుర్తుతెలియని బైక్ పార్కింగ్ శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో గుర్తు తెలి యని వ్యక్తికి సంబంధించి బైక్ పదిహేను రోజుల నుంచి ఒకేచోట పార్కింగ్ చేసి ఉంది. తూప్రాన్– నర్సాపూర్ హైవేకి ఆనుకొని గోదాం రైస్మిల్కు వెళ్లే దారిలో స్ప్లెండర్ ఏపీ 29 ఎన్ 6619 నంబర్ గల బైక్ పదిహేను రోజుల నుంచి ఇక్కడే నిలిపి ఉంది. ఎక్కడి నుంచైనా బైక్ను చోరీ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పరిశీలించి అనుమానిత బైక్కి సంబంధించి వివరాలు తేల్చాల్సిన అవసరం ఉంది. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధుకర్రెడ్డి అన్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఆమె కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కక్షిదారులకు సత్వర న్యాయపరమైన సేవలు అందేలా చూడాలని, పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్/నిజాంపేట(మెదక్): రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా జిల్లాలో పలు చోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంగళవారం రాత్రి నర్సాపూర్ మండలంలోని రైస్మిల్లులో తనిఖీలు చేపట్టారు. అలాగే నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో విద్య రైస్మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రైస్మిల్లులో ఉన్న నిల్వలను పరిశీలించారు. మెదక్ కలెక్టరేట్: పదేళ్లుగా పనిచేస్తున్నా.. సరైన వేతనం, ఉద్యోగ భద్రత లేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని మెదక్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉపాధ్యాయులు మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా 339 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. నెలకు కేవలం రూ.12వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు గోపాల్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల జిల్లా అధ్యక్షులు రాజేశ్వరి, ఉపాధ్యక్షులు సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెహానా బేగం, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ,కోశాధికారి రేణుక ,టీచర్లు పాల్గొన్నారు. చేపల పంపిణీ ఉత్తిదేనా? చిన్నకోడూరు(సిద్దిపేట): మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉన్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద సంఘం నేతలతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నీటి వనరులు పెంపొందించి మత్స్యకారులను ఆదుకోవడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం ఖాయం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేసీఆర్ మళ్లీ తెలంగాణకు సీఎం అవుతారని, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభిమానులు అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలం నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో తిరుపతి, శంకర్లు పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరారు. ఇందులో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు జోహర్లు అర్పించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సీఎం కావాలన్నారు. -
తీరు మారదా..!
● మంత్రి తనిఖీలు చేసినా అదే నిర్లక్ష్యం ● జోగిపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ అలసత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వైద్యులు విధులకు గైర్హాజరు అవుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు 10.30 గంటలకు వచ్చి 12.30 గంటలకు వెళ్లిపోతున్నారు. విధులకు హాజరు కాకున్నా.. అటెండెన్స్ మాత్రం వేయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈనెల 3, 4 తేదీల్లో సూపరింటెండెంట్ విధులకు రాకున్నా మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టడాన్ని ఆసుపత్రి సిబ్బందే బట్టబయలు చేయడం విశేషం. ప్రైవేట్ డాక్టర్ విధులు నిర్వహించిన విషయం ఈనెల 2వ తేదీనే సూపరింటెండెంట్ గుర్తించినా చూసీచూడనట్లు వెళ్లడంతో మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఇదే రీతిలో ప్రైవేట్ డాక్టర్తో డ్యూటీ చేయించారు. జోగిపేట(అందోల్): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ సొంత ఇలాఖాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పనితీరు ఇష్టారాజ్యంగా సాగుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. అందోలు నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేట ఏరియా ఆసుపత్రిలో 24 మంది వైద్యులు ఉండగా.. విధులకు మాత్రం 8 నుంచి 10 మంది వరకు మాత్రమే హాజరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, వెళ్లిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు 12.30 దాటితే వెళ్లిపోతున్నారని అవుట్ పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ సెలవులపై వెళ్లడం, అజమాయిషీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి, ఉన్నతాధికారులు తనిఖీలు చేసినా... మంత్రి, ఉన్నతాధికారులు పలుమార్లు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినా వైద్యుల పనితీరులో మార్పురావడంలేదు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనిఖీ చేసిన సమయంలో కేవలం ఒక్క డాక్టరే విధుల్లో ఉండడం 14 మంది గైర్హాజరు కావడంతో వారందరినీ సస్పెండ్ చేయాలని కమిషనర్కు ఫోన్ చేసి ఆదేశించినా ఆదేశాలు అమలు కాలేదు. కలెక్టర్ కూడా తనిఖీ చేసి పలువురు డాక్టర్లపై చర్యలు కూడా తీసుకున్నారు. విధులను మరొక ప్రైవేట్ డాక్టర్తో చేయించడంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు శివశంకర్రెడ్డి, రమేశ్, భవానీలను ఇటీవల రాష్ట్ర కమిషనర్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులు తనిఖీలు చేసినప్పుడల్లా డాక్టర్లు సస్పెండ్ అవుతూనే ఉన్నా.. వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు. జోగిపేట ఆసుపత్రిలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించాలి. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు సంబంధించిన నివేదికను మంత్రి రాజనర్సింహకు అందజేస్తాం. ఆసుపత్రిలోని సౌకర్యాలపై ఇన్పేషెంట్లను అడిగి తెలుసుకున్నాను. –శ్రీధర్, డీసీహెచ్ఎస్, సంగారెడ్డి●సూపరింటెండెంట్ తీరుపై విమర్శలు -
ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీనం
ఎస్డబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిహుస్నాబాద్: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఖాయమని ఎస్డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం డిపో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు నరకయాతన అనుభవించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఉందన్నారు. కార్మికులకు ఒకటో తేదీన జీతాలు, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బాండ్లు, రెండు పీఆర్సీలు చెల్లించిందన్నారు. కొన్ని యూనియన్లు ఆర్టీసీని ముంచడానికే సమ్మెకు వెళ్లాయని ఆరోపించారు. ఐఎన్టీయూసీలో చేరిన టీఎంయూ నాయకులను కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ పద్మ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శివయ్య, రవీందర్, డిపో యూనియన్ చైర్మన్ ఎం.ఆర్ రెడ్డి, అధ్యక్షుడు కిశోర్కుమార్, డిపో కార్యదర్శి పీఎస్ రెడ్డి, నాయకులు మహేందర్ ఉన్నారు. -
అడవిపందులకు పెట్టిన కరెంటుతీగ తగిలి..
మహిళా కూలీ మృతిహవేళిఘణాపూర్(మెదక్): మహిళా కూలీ కలుపు తీస్తుండగా అటవీ జంతువుల కోసం పెట్టిన కరెంటు వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని బి.తిమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కౌలు రైతు కిష్టయ్య తన పొలంలో అడవి పందులు వస్తున్నాయని సోమవారం రాత్రి కరెంటు షాక్ పెట్టాడు. ఉదయాన్నే తీసివేయకుండా మరిచిపోయాడు. దీంతో కూలీలతో కలుపు తీసేందుకు వచ్చిన కొండ లక్ష్మి(52) పందుల కోసం పెట్టిన వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. పొట్టకూటి కోసం కూలీ పనికి వెళ్లిన మహిళ కరెంటుకు బలికావడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరులా విలపించారు. రైతులు పొలాల వద్ద కరెంటు షాక్ పెట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే చట్టపరంగా చర్యలు తప్పవని ఏఈ నవీన్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి.. రామచంద్రాపురం(పటాన్చెరు): చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రామచంద్రాపురం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 11వ తేదీన రామచంద్రాపురం పట్టణ పరిధిలోని అశోక్నగర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని సుమారు 40ఏళ్ల వయస్సు గల వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అతడ్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి ముందడుగు
ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ ములుగు(గజ్వేల్): ఆగ్రోఫారెస్ట్రీ సాధనకు పర్యావరణం, సాంకేతికత, ఆవిష్కరణ మూల స్తంభాలుగా నిలుస్తాయని ఇక్రిసాట్(ఐసిఆర్ఐఎస్ఎటి) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు. ములుగు అటవీ కళాశాల పరిశోధన సంస్థలో సిల్వర్ కల్చర్, ఆగ్రోఫారెస్ట్రీ ఆధ్వర్యంలో‘ క్లైమేట్ రెడీ ఆగ్రోఫారెస్ట్రీ’ ఇంటిగ్రేటెడ్ ఎకాలజీ, టెక్నాలజీ ఇనిస్టిట్యూషనల్ ఇన్నోవేషన్ అంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి ఎఫ్సీఆర్ఐతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్, చార్మినార్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. అటవీ శాఖకు సమాజ అవసరాలకు మధ్య ఆగ్రోఫారెస్ట్రీ ఒక వారధిలా పనిచేస్తుందని తెలిపారు. జీవనోపాధి కోసం అటవీ సంపదపై పడుతున్న భారాన్ని, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆగ్రోఫారెస్ట్రీ సాధించిన విజయాలను కాంపా సీఈఓ, సీసీఎఫ్ ఎన్.క్షితిజ వివరించారు. అనంతరం వివిధ పరిశోధకులు సమర్పించిన 151 పరిశోధనాంశాలతో కూడిన సెక్టార్ అబ్స్ట్రాక్ట్స్ వాల్యూమ్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల డీన్, సదస్సు చైర్పర్సన్ బి.ప్రవీణ, రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్, నోడల్ అధికారి సి.శరవణన్, నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం జనరల్ మేనేజర్ ఆర్.గణపతి, ఆగ్రోఫారెస్ట్రీ విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఎం.చిరంజీవరెడ్డి, రీజా సుందరం తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపటాన్చెరు: అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పటాన్చెరు డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల వారీగా కొనసాగుతున్న సుమారు రూ.75 కోట్ల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేసే కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని బ్లాక్లిస్ట్ చేసి, అవసరమైతే కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్లలో రాంకీ సంస్థ చెత్త సేకరణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి వీధిలో వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో మంచినీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులు వేగంగా కల్పించాలని ఆదేశించారు. పోచారం, లక్డరం ప్రాంతాల్లో నిర్మించిన నూతన సబ్స్టేషన్లను సెప్టెంబర్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు జనార్దన్, కుమార్ గౌడ్, ప్రమీల, సుష్మ, సుమలత, డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమార్, జ్యోతి రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, డీఈ బాల గోపాల్, ఎంపీడీఓలు యాదగిరి, ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్లు వెంకట కిషన్, అజయ్ రెడ్డి, తాన్య, దశరథ్, నరేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ భాస్కరరావు, ఇంజనీరింగ్ ఈఈ సురేష్, డీఈలు కష్ణవేణి, సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
పాపన్నపేట(మెదక్): రాష్ట్రంలో ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన వనదుర్గా భవానీ ఆవరణలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్ని ఆలయాలను ధూప దీప నైవేద్య పధకంకింద ఎంపిక చేయాలన్నారు. అర్చకులకు పేస్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొగుట(దుబ్బాక): మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసి ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య రైతులకు సూచించారు. మండలంలోని బండారుపల్లిలో ప్రత్యామ్నాయంగా సాగుచేసిన కంది, అలసంద పంటలను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావం పరిగణలోకి తీసుకుని తక్కువ నీటితో సాగుచేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంపికచేసుకోవాలన్నారు. -
ఇందిరమ్మ లబ్ధిదారుల్లో హుషారు
నారాయణఖేడ్: ఏడాదికిపైగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ చివరి విడత బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడతల వారీగా జమ చేసినా కేంద్రం మాత్రం తన వాటా నిధులు విడుల చేయకపోవడంతో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు సైతం పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు విజ్ఞప్తులు చేసింది. ఆలస్యంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇంటి స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు మంజూరు చేసింది. ఇందుకు మొదటగా లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. సొంత స్థలాలు ఉన్న వారిని ఎల్–1 కింద, సొంత స్థలాలు లేని వారిని ఎల్–2 కింది, ఇతరులను ఎల్–3 కింద ఎంపిక చేసింది. ఇలా జిల్లాలో 3,18,435 మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తులు సమర్పించారు. ఇందులో 1,36,821 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో మొదటి కేటగిరీ కింద 16,559 మందిని గుర్తించారు. వీరిలో 15,833 మందికి కలెక్టర్ ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో వివిధ కారణాల వల్ల 3,010 మంది క్యాన్సిల్ అయ్యారు. 3,035 ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి. బేస్మెంట్ స్థాయిలో 1,125, రూఫ్ లెవల్లో 615, ఆర్సీసీ 2,897 ఇళ్లు ఉన్నాయి. ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసిన వాటిలో ఆయా స్థాయిలు బట్టి బేస్మెంట్కు రూ.లక్ష, రూఫ్లెవల్కు రూ.లక్ష, ఆర్సీసీకి రూ.1.40 లక్షలు చొప్పున చెల్లింపులు పూర్తి చేశారు. మున్సిపాలిటీలో చెల్లింపులు.. పూర్తయిన ఇళ్లకు మున్సిపాలిటీలో 526 గృహాల లబ్ధిదారులకు, గ్రామీణ ప్రాంతాల్లో 2,509 ఇళ్ళకు చివరి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మున్సిపాలిటీలోని లబ్ధిదారులకు చివరి విడత బిల్లులు ఇటీవల ఖాతాల్లో జమ చేస్తున్నారు. చివరి విడత కింద మున్సిపాలిటీలోని లబ్ధిదారుకు రూ.1.60లక్షల చొప్పున పూర్తయిన 526 ఇళ్లకు రూ.8.41 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశారు. గ్రామీణ ప్రాంతాల వారికి .. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 2,509 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. వారికి చివరి విడత బిల్లు రూ.1.40లక్షల చొప్పున రూ.35.12 కోట్లు జమ కావాల్సి ఉంది. ఈనెలాఖరులోగా జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు కేంద్రం రూ.72 వేలు అందిస్తోంది. ఇందులో వీబీ జీ రామ్జీ (ఉపాధి పథకం ) ద్వారా రూ.27,600, స్వచ్చ భారత్ ద్వారా మరుగు దొడ్ల నిర్మాణానికి రూ.12వేలు, పీఎం గ్రామీణ అవాస్ యోజన కింద రూ.21వేలు ఇతరత్రాలు కలిపి కేంద్రం రూ.72 వేల అందజేస్తుంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం చివరి విడత బిల్లుల్లో కలిపి రూ.1.40లక్షలు లబ్దిదారు ఖాతాలో జమ చేస్తుంది. మొత్తమ్మీద రూ.5 లక్షలను పూర్తయ్యే వరకు ఒక ఇంటికి లబ్ధిదారుకు చెల్లిస్తారు. పట్టణ ప్రాంతాల వారికి రూ.8.41 కోట్లు గ్రామీణ ప్రాంత లబ్ధిదారుకు రూ.35.12 కోట్లు -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ● బంగారం, వెండి, నగదు స్వాధీనం ● నిందితుడిపై 100కు పైగా కేసులుజనగామ: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం జనగామ పట్టణ పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై ఎం.భరత్తో కలిసి ఏసీపీ భీమ్ శర్మ కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్కు చెందిన సయ్యద్ హమీద్ ప్రస్తుతం హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో నివాసముంటూ ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28, 29వ తేదీల్లో బైక్పై హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చాడు. ఈ క్రమంలో పట్టణంలోని హౌసింగ్ బోర్డు, రైల్వే ట్రాక్ సమీపంలోని కాలనీలతో పాటు బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ సొత్తులో కొంత భాగం విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలతోపాటు జూదం, మద్యం తదితరాలకు ఖర్చు చేశాడు. పెంబర్తి వద్ద చిక్కిన దొంగ.. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జనగామ–పెంబర్తి బైపాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కాగా అనుమానాస్పదంగా కనిపించిన హమీద్ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడి నుంచి సుమారు 47 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, రూ.5.60 లక్షల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, హమీద్పై గతంలో తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. కాగా నాచారం, సంగారెడ్డి పోలీస్స్టేషన్ల పరిధిలో సదరు దొంగపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు సైతం పంపించారు. ఇటీవల కర్నాటకలోని గుల్బర్గా, అశోక్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను వరంగల్ సీపీ అభినందించారు. -
చెరువు నుంచి నీరు తరలింపు
అడ్డుకున్న గ్రామస్తులువట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామ పెద్ద చెరువు నుంచి అక్రమంగా నీటిని తరలించడాన్ని మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా.. వట్పల్లి మండలంలోని బుడ్డాయిపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చేపల చెరువులు నింపేందుకు అవసరమైన నీటి కోసం కన్సాన్పల్లి చెరువు నుంచి కాలువ తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత కాలువలో నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి చేపల చెరువులు నింపుతున్నారు. ఈ విషయం తెలిసిన కన్సాన్పల్లి గ్రామస్తులు చెరువు నీటిని అక్రమంగా తరలించడంపై నీటి తరలింపును అడ్డుకున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఇరిగేషన్ డీఈ రవి మోహన్ అక్కడికి చేరుకొని చెరువును పరిశీలించారు. ఇప్పటికే చెరువులో నీరు తక్కువగా ఉందని, నీటిని తరలిస్తే పశువులకు తాగునీటి కరువు ఏర్పడుతుందని కన్సాన్పల్లి గ్రామస్తులు మొర పెట్టుకున్నారు. వెంటనే నీటిని తరలించే కాలువను పూడ్చివేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని డీఈ హెచ్చరించారు. ఆయన వెంట ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు పాల్గొన్నారు. -
తండ్రికి అన్నం పెట్టని కుమారులకు కౌన్సిలింగ్
● మా తండ్రిని బాగా చూసుకుంటాం ● అధికారులకు హామీ పత్రం రాసిచ్చిన కుమారులు శివ్వంపేట(నర్సాపూర్): బిడ్డలు బువ్వ పెడ్తలేరని సోమవారం శివ్వంపేటలో నిర్వహించిన ప్రజావాణిలో వృద్ధుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. మండల పరిధిలోని నవాబుపేట గ్రామానికి చెందిన వృద్ధుడు మహబూబ్ బేగ్ కొడుకులు, కూతుళ్లు ఉన్నా.. పట్టించుకోవడం లేదని చెప్పడంతో ఇందుకు సంబంధించి మీడియాలో మంగళవారం కథనాలు వచ్చాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీనర్సమ్మ గ్రామానికి చేరుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొడుకులను పిలిపించి మాట్లాడారు. ఉపాధి కోసం వివిధ చోట్లలో నివాసం ఉన్నామని, తమ దగ్గర మా తండ్రి ఉండేందుకు ఇష్టపడరన్నారు. పుట్టిన గ్రామంలోనే ఉంటానని చెప్పడంతో ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని కొడుకులు చెప్పారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన సొంతింటికి మరమ్మతులు చేయించి, తండ్రి బాగోగులు చూసుకుంటామని కొడుకులు హామీపత్రం రాసి ఇచ్చారు. ఆమె వెంట అంగన్వాడీ టీచర్ రమాదేవి పాల్గొన్నారు. -
కేబుల్వైర్లు చోరీ.. ఆరుగురి అరెస్ట్
కొల్చారం(నర్సాపూర్): వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి ఆయిల్, కాపర్వైర్ను అపహరిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కొల్చారంతో పాటు పాపన్నపేట, కౌడిపల్లి మండలాల్లో ఇటీవల కేబుల్ వైర్ చోరీకి సంబంధించి రైతులు ఆయా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పాపన్నపేట మండలానికి చెందిన ఐదుగురిని, కొల్చారానికి చెందిన ఒక వ్యక్తిని పట్టుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల్లో పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామానికి చెందిన వడ్డెర దుర్గాప్రసాద్, వడ్డెర మల్లేశం, గ్యారంగుల శివకుమార్, దుర్గేశ్, మండల కేంద్రానికి చెందిన వడ్డే శేఖర్, వడ్డే మహేశ్ ఉన్నట్లు తెలిపారు. నిందితులను మెదక్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. -
మీనమేషాలు
మిల్లర్లపైసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వేలం పాటలో ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.కోట్లలో ఎగవేతకు పాల్పడిన మిల్లర్లపై అన్ని జిల్లాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కానీ సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మాత్రం ఈ దిశగా చర్యల్లేవు. సర్కారు ధాన్యాన్ని ప్రైవేటు విక్రయించుకుని ఆ సొమ్మును కొన్నేళ్లుగా తమ రియల్ ఎస్టేట్, ఇతర సొంత వ్యాపారాలకు వాడుకుంటున్న మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ డిఫాల్టర్ల పట్ల మెతక వైఖరిని అవలంబిస్తుండటంతో పలు ఆరోపణలకు దారితీస్తోంది. ఈ శాఖ అధికారులు, ఈ శాఖలోని డీటీలు ఇలాంటి మిల్లర్లతో ప్రతి సీజనులో పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుంటుంటడమే ఈ మెతక వైఖరికి కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.12 కోట్లకు మించే ఎగవేతలు.. ప్రభుత్వం 2022 రబీ సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేలం పాట నిర్వహించింది. సుమారు రూ.44 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని వేలం వేయగా.. మొత్తం 13 మంది మిల్లర్లు దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు నాలుగేళ్లుగా కేవలం సుమారు రూ.32 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన సుమారు రూ.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఈ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి లాభాలను ఆర్జించారు. కొందరు భూములు కొనుగోలు చేశారు. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరు ఇదే సర్కారు ధాన్యం డబ్బుతో కొత్త రైసుమిల్లులు ఏర్పాటు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా సర్కారు సొమ్ముతో సొంత వ్యాపారాలు చేసుకున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్ల కోసమే ఇలాంటి డిఫాల్టర్ల పట్ల మెతక వైఖరిని అవలంభిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తమ సొమ్మేమి కాదులే.. ప్రభుత్వ సొమ్మె కధా అనే దోరణితో వ్యవహరించడంతోనే మిల్లర్ల ఆటలు కొనసాగుతున్నాయనే ఆరోపణలకు దారితీస్తోంది. వేలం పాట ధాన్యం బకాయిలు రూ.12 కోట్లు నాలుగేళ్లుగా సర్కారుకు చెల్లించకుండా సొంత వ్యాపారాలకు మళ్లించిన మిల్లర్లు కేవలం ‘సంప్రదింపు’లతో సరిపెడుతున్న అధికారులు విమర్శలకు దారితీస్తున్న పౌరసరఫరాలశాఖ తీరు అధికారుల దృష్టిలో తక్కువేనటా.. మిల్లర్లు తీసుకున్న సర్కారు ధాన్యాన్ని బహిరంగ మార్కెట్కు తరలించకుండా ఎప్పటికప్పుడు మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ) చేయాలి. పౌరసరఫరాల శాఖ డిటీలు, ఆశాఖ ఉన్నతాధికారులు ఈ తనిఖీలు చేయాలి. ఒకవేళ ఆ ధాన్యం మిల్లుల్లో లేకపోతే సంబందిత మొత్తాన్ని ప్రభుత్వాకి జమ చేయాలి. ఇలా డబ్బులు జమ చేయకుండా.. మిల్లుల్లో ఉన్న ఫిజికల్ వెరిఫికేషన్లో ధాన్యం కనిపించకపోతే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో చేతివాటం ప్రదర్శించడంతో మిల్లర్లు ఈ సర్కారు సొమ్మును సొంత వ్యాపారాలకు మళ్లించుకున్నారనేది బహిరంగ రహస్యమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.అధికారుల దృష్టిలో రూ.12 కోట్లు అంటే తక్కువేనట.. ఇతర జిల్లాలో ఇంతకు మూడింతలు బకాయిలు ఉన్నారని చెబుతున్నారు. అందుకే వారితో సంప్రదింపులు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ వివరాల కోసం ‘సాక్షి’ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలసరోజను వివరణ కోరగా.. యాక్షన్ ప్యాడీ బకాయిల వివరాలు ఇచ్చేది లేదని, పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో తీసుకోవాలని దాటవేశారు. -
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమే
నర్సాపూర్ రూరల్: టీఎస్ ఈసెట్ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు నర్సాపూర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ శక్తి వైఐఎస్యూ స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును నీరుగార్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రశాంతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి, తన సిబ్బందితో కలిసి దురుసుగా ప్రవర్తిస్తూ వారిని రోడ్డు పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశారు. విద్యార్థుల చొక్కాలు పట్టుకొని లాగేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మద్దతు రాస్తారోకో చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. టీఎస్ ఈసెట్ కొనసాగించి, శక్తిని స్కీం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డిని ప్రశ్నించారు. టీఎస్ ఈసెట్ కొనసాగించాలంటూ ధర్నా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు -
‘జిజ్ఞాస’ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వం, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జిజ్ఞాస’ రాష్ట్ర స్థాయి పోటీల్లో జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థు లు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో విద్యార్థులు తమ ప్రాజెక్ట్ ను ప్రదర్శించారు. హిందీ విభాగాధిపతి డాక్టర్ ఆర్.మదన్ పర్యవేక్షణలో విద్యార్థులు ‘హిందీకి సంవైదానిక్ స్థితి ఔర్ రాజభాష కా సంఘర్ష‘ (హిందీ రాజ్యాంగబద్ధ స్థితి అధికార భాషగా ఎదుర్కొన్న సవాళ్లు) అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థులు మహమ్మద్ కేఫ్, ఆలియా బేగం, పి.తులసి, జోహ ఏరమ్, నష్రా అంజుం పాల్గొని ప్రశంసాపత్రాలను అందుకున్నారు. అధ్వానంగా మధ్యాహ్న భోజనం అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మధ్యాహ్న భోజనం నాణ్యతగా పెట్టడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. మంగళవారం గోల్లకుంట తండాలోని పాఠశాలలో మెనూ ప్రకారం కూరగాయలతో పాటు, సాంబారు పెట్టాల్సి ఉంది. కానీ పాఠశాలలో కూరగాయ కర్రీ దేవుడెరుగు, నీళ్ల చా రు, ఆలుగడ్డ, టమాటాలు వేసి విద్యార్థులకు వడ్డించారు. హెచ్ఎం సైతం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు పర్యవేక్షించి విద్యార్థులకు మెనూతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని కోరుతున్నారు. ఎండు గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్ చిన్నశంకరంపేట(మెదక్): ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ఎకై ్సజ్ పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసున్నారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామాయంపేట ఎకై ్సజ్ సీఐ నరేందర్ కథనం ప్రకారం.. మంగళవారం మండల కేంద్రంలోని సోమేశ్వరాలయం సమీపంలో అర్జున్ సాహు నుంచి రూ.60 వేల విలువైన 310 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నీట్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు హుస్నాబాద్రూరల్: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శ్యామలత మంగళవారం తెలిపారు. హైదరాబాద్లోని శిక్షణ కేంద్రాలు టీజీఎస్డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సీఈఓ చిలుకూరు (బాలురు), మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సీఈఓ (బాలికలకు) 100 సీట్ల చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ బైపీసీలో ఉత్తీర్ణులై ఉండాలని, నీట్ 2026లో అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగీరి విద్యార్థులు అర్హులని సూచించారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను పూర్తి చేసి ఈ నెల 22 వరకు హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పూర్తి ధ్రువపత్రాలతో అందించాలని పేర్కొన్నారు. -
సేంద్రియ వ్యవసాయంతో లాభాలు
రైతులకు ఒకరోజు శిక్షణనర్సాపూర్ రూరల్: సేంద్రియ ఎరువులతో భూసారంతో పాటు సూక్ష్మజీవుల పెరిగి పంటలు ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం సేంద్రియ వ్యవసాయంపై తునికి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా హర్టికల్చర్, డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో యుఎన్డీపీ–బయోపిన్ ప్రాజెక్టు లో భాగంగా మండలంలోని చిన్నచింతకుంటలో రైతులకు మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్ రైతులకు సేంద్రియ వ్యవసాయంతో కలిగే లాభాలను వివరించారు. ఉద్యాన పంటల్లో సమగ్ర పురుగుల యాజమాన్యం ఐపీఎం, సమగ్ర పోషక యాజమాన్యం ఐఎన్ఎం గురించి చెప్పారు. అనంతరం వరి, కూరగాయలు ఇతర పంటల్లో సేంద్రియ ఎరువుల వినియోగం, విధానాల గూర్చి తెలిపారు. రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఉప సర్పంచ్ పెంటయ్య, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
పదాధికారుల సన్మానంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి జహీరాబాద్ టౌన్: నూతనంగా నియమితులైన పార్టీ పదాధికారులను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి సన్మానించారు. జహీరాబాద్కు సోమవారం వచ్చిన సందర్భంగా ఆమె వారిని అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ...నూతన పదాధికారులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, ఓబీసీల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోశ్, రమేశ్రెడ్డి, నాయకులు అరుణ కౌలాస్, అక్షయ్ దేశ్పాండే, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రషింగ్ కోసం కసరత్తు
జహీరాబాద్: జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో వచ్చే సీజన్కు గాను క్రషింగ్ చేపట్టేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇది రైతులకు ఆశలను చిగురింపజేస్తోంది. ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తే సీజన్ ప్రారంభమయ్యే నవంబర్ నాటికి కర్మాగారం సిద్ధం అవుతుంది. క్రషింగ్ చేపట్టేందుకు వీలుగా ఉన్న అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తోంది. సీడీసీకి రావాల్సిన బకాయిలలో ఇప్పటికే కొంత మేర చెల్లింపులు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. క్రషింగ్ నిర్వహించేందుకు వీలుగా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం కేన్ కౌన్సిల్తో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. 2026– 27 సీజన్కు గాను క్రషింగ్ ఎలాగైనా ప్రారంభించాలని యాజమాన్యం గట్టిగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలు ప్రీ జోన్ కింద ఉన్నాయి. కర్మాగారం క్రషింగ్ చేపడితే రెండు మండలాలను కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆయా మండలాల్లో సుమారు 5లక్షల టన్నుల మేర చెరుకు పంట ఉత్పత్తి కానుందనే అంచనా. జహీరాబాద్ సమీపంలోని కొత్తూరు (బి) గ్రామంలో గల ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గత మూడు సీజన్ల పాటు మూత పడింది. 2023– 24, 2024– 25, 2025– 26 సీజన్కు గాను క్రషింగ్ కొనసాగలేదు. దీంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సమస్యలను పరిష్కరించింది. జోన్ పరిధిలో ఉన్న చెరుకును పలు కర్మాగారాలకు తరలించారు. కొందరు రైతులు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలను ఆశ్రయించారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం వేతన బకాయిల చెల్లింపులు చేయాల్సి ఉందని కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం. జి. రాములు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపుల విషయంలో ఒప్పందం కుదిరినా అమలుకు నోచుకోలేదన్నారు. అన్నీ కలుపుకుని సుమారు రూ.12 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపుల కోసం యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. -
‘వన్వార్డు ఎవరీ డే’లో సమస్యలు పరిష్కారం
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డా. సృజన రామచంద్రాపురం(పటాన్చెరు): వన్వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ డా.సృజన తెల్లాపూర్ డివిజన్లో పర్యటించారు. డివిజన్ పరిఽధిలోని ముప్పా ఇంద్రప్రస్థ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవర్థాలను ఎరువుగా మార్చే కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి, తేనా అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా వినోద్
కొండాపూర్(సంగారెడ్డి): సర్పంచ్ల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా కొండాపూర్ మండలం శివ్వన్న గూడెం సర్పంచ్ వినోద్ రాథోడ్ నియామకమాయ్యరు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో వినోధ్ రాథోడ్కు మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ...కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ల సమస్యలు పరిష్కరమయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య, సర్పంచ్లు శ్రీనివాస్ గౌడ్, మహేశ్, కృష్ణ, రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యూనిఫాం కోసం ప్రభుత్వం అందజేసిన వస్త్రాన్ని అధికారులు నిర్లక్ష్యంగా పడేశారు. ఈ ఘటన హత్నూర ఐకేపీ కార్యాలయంలో సోమవారం ‘సాక్షి’కెమెరాకు చిక్కింది. యూనిఫాం కుట్టించేందుకు మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వాల్సిన వస్త్రాన్ని కార్యాలయంలోనే మూలుగుతున్నాయి. కార్యాలయానికి యూనిఫాం వస్త్రం రాగానే వాటిని కుట్టేందుకు వెంటనే ఇవ్వాలి కానీ ఇక్కడ మాత్రం రోజుల తరబడి మూలన పడేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు యూనిఫాం త్వరగా కుట్టించేవిధంగా కార్యాలయం నుంచి వస్త్రాన్ని దుస్తులు కుట్టే మహిళలకు పంపిణీ చేయాల్సిందిగా పలువురు కోరారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి చిలప్చెడ్(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదిముబాకర్ పథకాన్ని నిలిపివేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి రేవంత్ సర్కారు తీరును విమర్శించారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె చిలప్చెడ్ తహసీల్ ఆవరణలో కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఆడ పిల్లలను కన్న పేద తల్లిదండ్రుల బాధను చూడలేక, ప్రతీ ఆడపిల్ల చదుకోవాలని, 18 ఏళ్ల వయసు నిండేవరకు పెళ్లి చేసుకోకూడదనే మంచి సంకల్పంతో, కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కల్యాణలక్ష్మిని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాస్పోర్టు సేవా కేంద్రంగా సంగారెడ్డి సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని హెడ్ పోస్టాఫీస్ను పాస్ పోర్టు సేవా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్రావు కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...సంగారెడ్డిలో పాస్పోర్టు కేంద్రం ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. కేంద్రమంత్రి చంద్రశేఖర్ తక్షణమే స్పందించి పాస్పోర్టు కేంద్రానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు ప్రతిపాదనలను పంపించడం జరిగినట్లు కేంద్ర మంత్రి కార్యాలయం ప్రకటించినట్లు ఎంపీ తెలిపారు. -
భూ సమస్యలే అధికం
సంగారెడ్డి జోన్/కంది (సంగారెడ్డి)/వట్పల్లి(అందోల్)/సంగారెడ్డి జోన్: సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి చేపట్టింది. మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిలో 85 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు అధికారులు హాజరై ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ సమస్యలే అధికంగా ఉన్నాయి. పలు శాఖల అధికారులు గైర్హాజరు ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ పలు మండలాల్లో మండలస్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. మరి కొంతమంది కిందిస్థాయి సిబ్బందిని పంపించి చేతులు దులుపుకున్నారు. మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం పట్ల ఇతర శాఖ అధికారులతో పాటు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు చేసి రశీదులను అందించారు. దీంతో ఫిర్యాదుల అప్డేట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎంపీడీఓ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించారు. మండలస్థాయి ప్రజావాణి ప్రారంభం 25 మండల కేంద్రాల్లో 85 దరఖాస్తులు పలు చోట్ల అధికారులు గైర్హాజరు ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి ఏడేళ్లుగా తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని చర్లగూడెంకు చెందిన వారసు లక్ష్మి కంది ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. 2019లో తన భర్త వారసు గంగయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినా పంచాయతీ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం లేదన్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో తాను పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నానని, అధికారులు తనకు సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది. ఫిర్యాదుల స్వీకరణలో తహసీల్దార్ హసీనా వేగం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ రవికుమార్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనాథ్రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
తూప్రాన్: విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నాగులపల్లి సమీపంలోని హల్దీవాగులో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మురుము చైతన్(30) హల్దీవాగులో విద్యుదాఘాతంతో మృతి చెంది ఉన్నాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. గుండెపోటుతో సాక్షి ఏజెంట్.. శివ్వంపేట(నర్సాపూర్): మండ ల పరిధిలోని గోమారం గ్రామ సాక్షి దినపత్రిక ఏజెంట్ బాషా గౌడ్(60) గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. -
32 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత
దుబ్బాకటౌన్: అక్రమంగా బొలెరోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన దుబ్బాక పట్టణ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు ఆధ్వర్యంలో ఈనెల 14న మల్లయ్యపల్లికి వెళ్లే రహదారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఎండి సాధిక్, మొహమ్మద్ మురద్ బొలెరోలో 32 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని స్టేషన్కు తరలించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యం విలువ 60 వేల వరకు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. బెల్ట్ షాపుల్లో తనిఖీలు 10.77 లీటర్ల మద్యం స్వాధీనం దుబ్బాకటౌన్: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై పోలీసులు దాడి చేసి, మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ రాజేశ్, ఎస్ఐ కీర్తిరాజు, ఎస్సై సాయిప్రసాద్ ఆధ్వర్యంలో దుంపలపల్లి 4వ వార్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై పోలీసులు దాడి చేశారు. కాగా కోల రాజు ఇంట్లో 7.15 లీటర్ల మద్యం, ఉప్పునూతల రవి ఇంట్లో 3.62 లీటర్ల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. -
పెన్షన్లు మంజూరు చేయాలని ధర్నా
మెదక్ కలెక్టరేట్: బీడీ కార్మికులు, వృద్ధుల దరఖాస్తులు స్వీకరించి వారికి పెన్షన్లు మంజూరు చేయా లని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం చేయూత పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వాటి జాబితాలో బీడీ కార్మికులు, వృద్ధులతోపాటు అన్ని రకాల దివ్యాంగుల పేర్లు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, బాలమణి, పార్టీ సభ్యులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు. -
ఇండియా పోస్ట్ ద్వారా విదేశాలకు..
సిద్దిపేటకమాన్: ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమికి అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడుతూ సోదరి ప్రేమను చాటుతుంటారు. అక్కాచెల్లెళ్లు ఎక్కడ ఉన్న రాఖీ పండుగకు సోదరుల ఇంటికి వెళ్లి రాఖీ కడుతుంటారు. కానీ దూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీ పంపాలనుకునే వారికి తపాలా శాఖ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న సోదరులకు రాఖీలు పంపడానికి భారతీయులు ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇండియన్ పోస్టల్ శాఖ ఐటీపీఎస్ (ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్) ఆన్లైన్ సేవలు అందిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా రూ.185 నుంచి రూ.400 వరకు ప్రపంచంలో ఏ దేశానికై నా రాఖీని సురక్షితంగా పంపించవచ్చు. ఈ సేవలను ఆన్లైన్లో మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే అవకాశం కల్పించింది. ‘‘రాఖీ కా రిస్తా, ఇండియా పోస్ట్ కా వాదా’’ (రాఖీ బంధాన్ని ఇండియా పోస్ట్ బాధ్యతగా తీసుకుంటుంది) అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. 220కి పైగా దేశాలకు.. ఇండియా పోస్టల్ శాఖ ఐటీపీఎస్ ద్వారా ఆన్లైన్లో వేగంగా రాఖీలు డెలివరీ చేస్తారు. మనం పంపాలనుకునే రాఖీని ప్యాక్ చేసి స్థానిక పోస్టాఫీస్లో ఐటీపీఎస్ ఫారంను నింపాలి. అందులో మనం ఏ ప్రాంతానికి పంపించాలనే వివరాలు, పూర్తి అడ్రస్ నమోదు చేయాలి. ఇండియన్ పోస్టల్ ద్వారా మనం పంపించే రాఖీలు వారం రోజుల నుంచి పది రోజుల్లో అడ్రస్కు చేరుతుంది. దుబాయ్కు రూ.185, జర్మనీ రూ.245, కెనడా రూ.360, ఆస్ట్రేలియా రూ.395, అమెరికా వంటి దేశాలకు రూ.400 చార్జీలతో రాఖీలు పంపించవచ్చు. 220కి పైగా దేశాలకు రాఖీలు పంపించే సేవలను ఇండియన్ పోస్టల్ అందిస్తుంది. రాఖీ పండుగ పాట చిత్రీకరణచిన్నకోడూరు(సిద్దిపేట): రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఓ ప్రైవేటు యూనిట్ పాటను సోమవారం మండల పరిధిలోని చంద్లాపూర్లో చిత్రీకరించారు. రక్షాబంధన్ ప్రోమో సాంగ్ను నటీనటులతో కలిసి గ్రామంలో షూటింగ్ చేశారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. -
ఆర్టీసీ బస్సులో మంటలు
తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం మునిపల్లి(అందోల్): షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు హైదరాబాద్కు వెళ్తుంది. మునిపల్లి మండలం కంకోల్ టోల్ప్లాజా సమీపంలోకి రాగానే బస్సులో బ్యాటరీ నుంచి సప్లయి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో బస్సు ఇంజిన్ దగ్గర పొగలు, మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపి 45 మంది ప్రయాణికులను కిందకు దించి మంటలు ఆర్పారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. బుదేరా ఎస్ఐ అరవింద్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోగొట్టుకున్న బంగారం అప్పగింత పెద్దశంకరంపేట(మెదక్): పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. సోమవారం ఏఎస్ఐ సంగమేశ్వర్ కథనం ప్రకారం.. అల్లాదుర్గం మండలం కాగితపల్లికి చెందిన పత్తి లావణ్య ఈ నెల 14న స్థానిక బస్టాండ్లో నాలుగు గ్రాముల బంగారు కమ్మలను పోగొట్టుకుంది. పలు చోట్ల వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మండల పరిధిలోని బుజ్రాన్పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కమ్మలు దొరికాయని గుర్తించి విచారణ చేపట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితురాలు లావణ్య కుటుంబసభ్యులకు సోమవారం అప్పగించారు. మందుబాబులకు జైలు గజ్వేల్రూరల్: మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఇటీవల గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం గజ్వేల్ కోర్టులో హాజరుపర్చగా విచారణ అనంతరం న్యాయమూర్తి.. 10 మందికి రూ. 40 వేల జరిమానాతో పాటు వీరిలో ఆరుగురికి 2 నుంచి 5రోజుల పాటు జైలు శిక్ష విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఆరుగురికి రూ. 5వేల చొప్పున జరిమానా వేశారు. మెదక్లో ముగ్గురికి జరిమానా.. మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలో నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వీరిని మేజిస్ట్రేట్ సాయి ప్రభాకర్ ఎదుట హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ముగ్గురికి రూ.30వేల జరిమానా విధించారు. కామారం తండా సర్పంచ్కు పీహెచ్డీ చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని కామారం తండా సర్పంచ్ మోహన్నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాపొందారు. యూనివర్సిటీ హిందీ విభాగం ప్రొఫెసర్ షీలా మిశ్రా పర్యవేక్షణలో సమకాలీన్ హిందీ నాటకోమె బౌద్ధ దర్శన్ అనే అంశంపై పరిశోధన చేసి వ్యాసం సమర్పించారు. ఓయూ హెచ్ఓడీ మాయాదేవి, బీఓఎస్ సంగీత అధ్వర్యంలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా పీహెచ్డీ డాక్టరేట్ పొందడంపై ఆయనను పలువురు అభినందించారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
పోటాపోటీ నినాదాలు రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్లో క్యూర్ అర్బన్ పాఠశాల నిర్మాణానికి కేటాయించిన స్థలం వద్ద సోమవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లాపూర్లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పటాన్చెరు సర్కిల్ కార్యాలయం సమీపంలో క్యూర్ అర్బన్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం స్థలాన్ని కేటాయించింది. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వస్తున్నట్లు ముందురోజు బీఆర్ఎస్ స్థానిక నేతలు వాట్సాప్ గ్రూప్లో ప్రచారం చేశారు. దాంతో కాంగ్రెస్ నాయకులు అదే స్థలంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేసమయంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అక్కడి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి జిందాబాద్ అనగా బీఆర్ఎస్నాయకులు కేసీఆర్ జిందాబాద్ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాదారులకు, ప్రజలకు ఏమీ అర్థంకాక అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి తిరిగి వెళ్లిపోగా..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొల్లూర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రజావాణికి స్పందన కరువు
వట్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. అధికారులు మూడు గంటల పాటు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల కోసం ఎదురుచూసినప్పటికీ ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. దీంతో పాటుగా ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హజరు కావడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్ పాండు ప్రజావాణిలో వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించరాదని అదనపు కలెక్టర్ పాండు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. కాగా, అందోల్లో ఒక్క ఫిర్యాదు వచ్చినట్లు పాండు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల భవితకు భరోసా
ఎంఈఎస్ఐసీ పోర్టల్ ప్రారంభించిన మంత్రి వివేక్తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత భవితకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పర్యటనలో భాగంగా శాంతాబయోటిక్స్ పరిశ్రమలో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రత్యేక చొరవతో, సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సమక్షంలో మెదక్ ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ – ఇండస్ట్రీ కనెక్ట్ (ఎంఈఎస్ఐసీ) పోర్టల్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మెదక్ జిల్లాలో (ఎంఈఎస్ఐసీ) పోర్టల్ను విద్యార్థులు, ఉద్యోగార్థులు, నైపుణ్య సంస్థలు, స్థానిక పరిశ్రమలను ధ్రువీకరించబడిన వ్యవస్థకు అనుసంధానించడానికి జిల్లా స్థాయిలో అభివృద్ధి చేయబడిన ఒక డిజిటల్ వేదిక అని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బావయ్య, ఐలా చైర్మన్ సుబ్బారావు, ఐటీసీ ఆనంద్, ఈడియం సందీప్, సర్పంచ్లు పాల్గొన్నారు. –అలాగే మనోహరాబాద్ మండలంలో రూ.3.25 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) భవనాన్ని ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. కస్తూర్బాలో మెరుగైన బోధన చేగుంట(తూప్రాన్): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. మండలంలోని రెడ్డిపల్లికాలనీలో రూ.2.23 కోట్లతో నిర్మించిన కస్తూర్బా బాలికల పాఠశాల అదనపు భవన సముదాయాన్ని మంత్రి , ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో విదేశీ భాషలు నేర్చుకుంటే విద్యార్థులకు స్వయంగా ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించనున్నట్లు హామీ ఇచ్చారు. ఉద్యోగాలతో పాటు మహిళలు 33 శాతం రిజర్వేషన్ను వినియోగించుకొని రాజకీయాల్లో రాణించాలని ఎంపీ రఘునందన్రావు కోరారు. కార్యక్రమంలో డీఈఓ, స్పెషల్ ఆఫీసర్ హేమభార్గవి, రాజు, ఎంఈఓ నీరజ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్రావు, ప్రిన్సిపాల్ శ్రీవాణి పాల్గొన్నారు. -
ఏకాభిప్రాయం కుదిరేనా!
డీసీసీ అధ్యక్ష పదవి నియామక ప్రక్రియను ఆ పార్టీ అధినాయకత్వం మరోసారి ప్రారంభించింది. గతేడాది అక్టోబర్లో చేపట్టిన ముఖ్యనేతల అభిప్రాయసేకరణలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అప్పట్లో నియామకాన్ని వాయిదా వేసింది. అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించినప్పటికీ..నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక సంగారెడ్డితోపాటు,రంగారెడ్డి, రామగుండం సిటీ డీసీసీ అధ్యక్ష పదవుల నియామకం పెండింగ్లో పడిన విషయం విదితమే. పదినెలల తర్వాత ఇప్పుడు రెండోసారి నియామక ప్రక్రియను షూరూ చేసింది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోడ్, టీపీసీసీ కోఆర్డినేటర్లు దుద్దిళ్ల శ్రీనివాస్బాబు, రియాజ్, నేరెళ్లశారద జిల్లా ముఖ్యనేతల అభిప్రాయాలను సోమవారం సేకరించారు. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు గిరిధర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కాటా శ్రీనివాస్గౌడ్, పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ బాధ్యులతో వన్ టూ వన్ మాట్లాడిన దీపక్రాథోడ్ డీసీసీ పదవిని ఎవరికి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది..? అనే అంశంపై ప్రాథమిక అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొదటి నుంచి ఎంపిక ప్రక్రియ పది నెలల క్రితం ఈ డీసీసీ పదవి కోసం దరఖాస్తులు స్వీకరించిన అధినాయకత్వం..మళ్లీ ఇప్పుడు ఆశావహులు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు దీపక్రాథోడ్ నుంచి ప్రత్యేకంగా దరఖాస్తు ఫారాలను అందజేశారు. అలాగే జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ పరిశీలకులు తెలిపారు. ఈ నియోజకవర్గ సమావేశాల్లో మండల ప్రెసిడెంట్లు ఆ పై స్థాయి నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. సుమారు పది నుంచి 12 ఆశావహుల పేర్లతో షార్ట్ లిస్టును ఏఐసీసీకి పంపుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 6 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఎవరికి వారే! గతేడాది అక్టోబర్లో మొదటిసారి నిర్వహించిన డీసీసీ నియామక ప్రక్రియ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు అద్దం పట్టింది. ఈ పదవి కోసం ఏ జిల్లాలో లేనివిధంగా ఏకంగా 30 మంది నాయకులు దరఖాస్తు చేసుకోవడం.. మాకే ఈ పదవులు ఇవ్వాలని అధినాయకత్వం వద్ద గట్టిగా తమ వాదనను వినిపించారు. మంత్రి దామోదర రాజనర్సింహ వంటి ముఖ్య నేతలు ఈ డీసీసీ పదవిని ఉజ్వల్రెడ్డికి ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఐదు నియోజకవర్గాల్లో ముఖ్యనేతల మద్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నియామకం వాయిదా పడింది. కాగా ఇప్పుడు ఈ డీసీసీ నియామక ప్రక్రియ చేపట్టడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా మంత్రి దామోదర తదితర ముఖ్యనాయకులతోపాటు, సీఎం రేవంత్రెడ్డి, టీసీపీపీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆశీస్సులు తమకే ఉన్నాయని, తమకే ఈ డీసీసీ పోస్టు వరిస్తుందని ధీమాతో ఓ నేత ఉండగా, విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్నానని తనకే ఈ పదవి దక్కుతుందని మరొకరు పేర్కొంటున్నారు. పార్టీ ఆదేశించిన ప్రతీ కార్యాక్రమాన్ని తూచ తప్పకుండా నిర్వహిస్తున్న తనే ఈ డీసీసీ పదవికి అర్హుడినని మరో నాయకుడు వాదిస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ పదవి తనకే ఇవ్వాలని మరో నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే ఈ పదవి కోసం పట్టు వీడకపోవడంతో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎట్టకేలకు మరోసారి డీసీసీ నియామక ప్రక్రియ నేతల అభిప్రాయం సేకరించిన ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ ఆశావహుల నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ త్వరలో ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాలు ఆసక్తికరంగా కాంగ్రెస్ సంస్థాగత రాజకీయాలు -
కులతత్వంతో బీజేపీ దేశాన్ని విభజిస్తోంది
సంగారెడ్డి: ద్వేషం, కులతత్వంతో బీజేపీ దేశాన్ని విభజిస్తోందని, ఆ ప్రయత్నాలను ఐక్యంగా తిప్పి కొడదామని ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో జరిగిన ఘటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించారు. ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పట్ల బీజేపీ, దాని అనుబంధ సంస్థలు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఐబీ నుంచి బాబు జగ్జివన్రామ్ విగ్రహం వరకు సోమవారం కాంగ్రెస్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా దీపక్ రాథోర్ మాట్లాడుతూ... ఖర్గే ప్రసంగించిన వేదికపై ‘శుద్ధీకరణ’పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు గంగాజలాన్ని చల్లడం అత్యంత జుగుప్సాకరమన్నారు. దేశ యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించాల్సిన సమయంలో మళ్లీ మనుస్మృతి, కులతత్వం వైపు దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇలా చేయడం భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వ స్ఫూర్తిని అవమానించడమేనని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విద్యార్థులు, యువత, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఫాసిస్టు శక్తులు భారతదేశాన్ని ఎంతగా విభజించేందుకు ప్రయత్నించినా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి సైనికుడు, ప్రతి సాధారణ కార్యకర్త దేశ ఐక్యత, సమగ్రత కోసం చివరి వరకు పోరాడతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా -
భూసార పరీక్షలు తప్పనిసరి
హత్నూర(సంగారెడ్డి): రైతులు ప్రతీ ఏటా భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని తగిన మోతాదులో ఎరువులు వాడటం వల్ల పంట దిగుబడి ఎక్కువ వస్తుందని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అరుణ పేర్కొన్నారు. హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో సోమవారం రైతులకు వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్త డాక్టర్ అరుణ మాట్లాడుతూ..భూసార పరీక్ష సిఫారసు మేరకు రసాయన ఎరువుల వాడకం మంచిదన్నారు. అనువైన వంగడాల ప్రోత్సాహం ఎంచుకోవచ్చని సూచించారు. ఎల్ నినో వాతావరణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. కార్యక్రమంలో జోగిపేట ఏడీఏ రమాదేవి, వ్యవసాయ విస్తరణ అధికారులు మనీషా, మహేందర్ ఆత్మ సిబ్బంది, సర్పంచ్ శ్రీహరి, ఉపసర్పంచ్ శంకర్ రైతులు పాల్గొన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అరుణ -
సైబర్ అవగాహనలో విద్యార్థుల ప్రతిభ
‘సురక్షా కా తిరంగా’ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతిపటాన్చెరు టౌన్: సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్ వీడియో, రీల్ పోటీల్లో గీతం హైదరాబాద్ క్యాంపస్కు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. ‘సురక్షా కా తిరంగా–అప్రమత్తంగా ఉండండి.. క్షుణ్ణంగా తెలుసుకోండి.. సైబర్తో సురక్షితంగా ఉండండి’ పేరుతో బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్తో పాటు పలువురు హాజరయ్యారు. విజేతగా నిలిచిన గీతం స్కార్ క్లబ్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పురస్కారం అందజేశారు. విద్యార్థుల సృజనాత్మకత, చురుకై న భాగస్వామ్యాన్ని గీతం యాజమాన్యం అభినందించింది. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
చేగుంట(తూప్రాన్): మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రామాయంపేట సీఐ సైదా కేసు వివరాలు వెల్లడించారు. మాసాయిపేట మండల చెట్లతిమ్మాయిపల్లి పులిగుట్ట తండాకు చెందిన మలోతు మున్నీ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుండేది. ఆరు నెలల క్రితం ఉత్తర్ప్రదేశ్కు చెందిన లారీడ్రైవర్ రాంవీర్సింగ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కాగా రాంవీర్సింగ్, మున్నీ కలిసినప్పుడల్లా డబ్బుల విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో మున్నీని చంపాలనే ఉద్దేశంతో ఈనెల 14న కూరగాయలు అమ్మడానికి మల్కాజిగిరికి వెళ్లిన ఆమెను మాసాయిపేట శివారులోని లేబై సమీపంలోకి రాంవీర్సింగ్ ఫోన్ చేసి పిలిపించాడు. ఈ క్రమంలో మున్నీకి మద్యం తాగించి కొట్టి పడేసి ఆమైపెకి లారీ ఎక్కించి చంపేసి పరారయ్యాడు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పథకాలు రద్దు చేసే కుట్ర
సంగారెడ్డి: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఒక మేనమామలా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచారని.. దాదాపు 3 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు సుమారు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారని అన్నారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత అమలు చేయలేదని విమర్శించారు. ● సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శ ● కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగించాలని ఆందోళన -
2,98,278 మంది ఓట్ల గల్లంతు!
సంగారెడ్డి జోన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) రూపకల్పనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,98,278 మంది ఓట్లు జాబితా నుంచి అధికారులు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల పరిధిలో సర్ ప్రక్రియ చేపట్టకముందు 14,57,436 మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం సర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ చేసి 11,59,158 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రక్రియలో 2,98,278 మంది ఓటర్లను వివిధ కారణాలతో జాబితా నుంచి తొలగించారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారు, ఇతర ప్రాంతాల వారందరినీ గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం గ్రామ పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ వివరాలను విడుదల చేశారు. సంబంధిత పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాబితాలను ప్రదర్శించారు. 3,47,688 మందికి నోటీసులు సర్ ప్రక్రియ అనంతరం జిల్లాలో 3,47,688 మంది ఓటర్లకు నోటీసులు అందించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారు సరైన ఆధారాలు చూపించి, ఓటరుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముసాయిదా ఓటరు జాబితాపై సెప్టెంబర్ 16 వరకు తమ అభ్యంతరాలను ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. వచ్చిన ఫిర్యాదులు అక్టోబర్ 15 వరకు పరిష్కరించనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటించేందుకు రూపకల్పన చేశారు. పెరిగిన పోలింగ్ స్టేషన్ల సంఖ్య సర్ ప్రక్రియ అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్ల సంఖ్య తగ్గిపోగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 2,98,278 మంది ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రక్రియకు ముందు 1,633 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుత ముసాయిదా జాబితా ప్రకారం1, 649 కేంద్రాలు ఉన్నాయి. తమ పేర్లను పరిశీలించుకోవాలి: కలెక్టర్ పంచాయతీల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ప్రతీ ఒక్కరు తమ పేర్లను పరిశీలించుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ముసాయిదా జాబితా ఓటరు విడుదల అనంతరం ప్రముఖ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఓటర్లు 11,59,158 పెరిగిన పోలింగ్ కేంద్రాలు ముసాయిదా ఓటరు జాబితా విడుదల సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ -
బంగారం దుకాణంలో చోరీ
జహీరాబాద్ టౌన్: నలుగురు మహిళలు షాపు యజమాని దృష్టి మళ్లించి నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పట్టణంలోని భవానీ మందిర్ రోడ్డులో ఉన్న ’న్యూ జై భవానీ జ్యువెలరీ’ షాపులో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లవకుమార్ కథనం ప్రకారం.. ఈ నెల 16న సాయంత్రం నలుగురు గుర్తుతెలియని మహిళలు బుర్ఖాలు ధరించి షాపులోకి వచ్చారు. నగలు చూపించాలని షాపు యజమాని చెన్నూరి శివకుమార్ను కోరారు. అతడు నగలు చూపిస్తుండగా, మాటల్లో పెట్టి దృష్టి మళ్లించారు. ఆ సమయంలో కౌంటర్లో ఉన్న ముక్కుపుడకల బాక్స్ను గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యారు. బాక్స్లో సుమారు 7 తులాల బరువుగల బంగారు ముక్కుపుడకలు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సీఎం సభ సైడ్లైట్స్
సంగారెడ్డి : లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంగారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో వచ్చి కంది ఐఐటీలో దిగారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా 3:20 నిమిషాలకు ఐబీ వద్దకు చేరుకుని నెహ్రూ, రాజీవ్గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రచార రథంలో సభాస్థలికి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి వెళ్లేందుకు జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ప్రచార రథం ఐబీలో నుంచి సీఎం వద్దకు తేవాలని తన అనుచరులకు చెప్తున్న క్రమంలోని రోడ్డు మొత్తం సీఎం కాన్వాయ్, పైలెట్ల వాహనాలతో జామ్ అయిపోయింది. ఈ క్రమంలో ప్రచార రథంలో సీఎం వెళ్లడం వద్దని పైలెట్లు కోరగా జగ్గారెడ్డి రథం వద్దని చెప్పారు. కాన్వాయ్లో వెళ్లాలా? ప్రచార రథంలో వెళ్ళాలా అని కొద్దిసేపు తటపటాయించిన సీఎం చివరికి ప్రచారరథంలోనే సభాస్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి వెంబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ 3:25 నిమిషాలకు అంబేడ్కర్ స్టేడియంకు చేరుకున్నారు. దాదాపు గంటసేపు మంత్రులు ప్రసంగించిన అనంతరం సరిగా 4:21 నిమిషాలకు సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగం ప్రారంభించి 40 నిమిషాలు మాట్లాడారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సీఎం రేవంత్ను శాలువాతో సత్కరించారు. సభావేదికపై నుంచి కిందికి వచ్చే క్రమంలో నాయకులు, ఉద్యోగ సంఘాలు, లబ్ధిదారులు వినతిపత్రాలు సీఎంకు సమర్పించారు. 5:30 తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. రోజంతా కండువాలతో సంగారెడ్డి జనసంద్రం సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా సంగారెడ్డిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, ప్రజలతో కిక్కిరిసింది. పంద్రాగస్టు వేడుకలు ముగిశాక 10 గంటలకు నుంచి గంటల 7 గంటల వరకు ఎటుచూసినా కాంగ్రెస్ శ్రేణులే కన్పించాయి. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జహీరాబాద్ టౌన్: జనాభాలో సగం ఉన్న మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోల్ ఇండియా కంపెనీ మాజీ చైర్మన్ పీఎం. ప్రసాద్ పేర్కొన్నారు. వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్( వికాస్), కోల్ ఇండియా కంపెనీ ఆర్థిక సహాయంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని 370 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శనివారం పస్తాపూర్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరై ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా కంపెనీ సహకారంతో వికాస్ సంస్థ మహిళలకు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. కుట్టు మెషీన్లను సద్వినియోగం చేసుకుని కుటుంబ పోషణకు అండగా ఉండాలని సూచించారు. హయత్నగర్ సివిల్ జడ్జి, మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఫర్హీన్ దండా మాట్లాడుతూ మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 1600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్లు పంపిణీ చేశామని వికాస్ సంస్థ చైర్మన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్ పర్సన్ శిరీషరెడ్డి , ప్రాజెక్టు కోఆర్డినేటర్ కొత్తకాపు సురేందర్రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్రెడ్డి, సంస్థ డైరక్టర్లు రావినర్సింహారెడ్డి, సుగుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. కోల్ ఇండియా కంపెనీ మాజీ చైర్మన్ ప్రసాద్ 370 మందికి కుట్టు మెషీన్ల పంపిణీ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నారాయణఖేడ్: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నాగల్గిద్ద మండలం గూడూరు శివారులో శనివారం చోటు చేసుకుంది. నాగలిగిద్ద ఏఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆంజనేయులు సాగర్ (21) ఓ ఉపాధ్యాయురాలిని బైక్పై నాగల్గిద్ద గ్రామంలో దింపి అనంతరం తన గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు నుంచి నాగల్గిద్ద వైపు వస్తున్న ఆటో– బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైక్పై ఉన్న ఆంజనేయులు సాగర్కు తీవ్ర గాయాలు కాగా కుటుంబీకులు, స్థానికులు ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి మాణిక్ సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి.. పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున పటాన్చెరు బస్టాండ్ సమీపంలో ఇస్నాపూర్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని అంబులెనన్స్లో పటాన్న్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
చదువు, క్రీడలకూ ప్రోత్సాహం
నారాయణఖేడ్: విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ తహసీల్ గ్రౌండ్లో పట్టణంలోని గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఫ్లాగ్మార్చ్, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర అంశాలపై శనివారం పోటీలను నిర్వహించారు. ఒక్కో అంశానికి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు అవార్డులతోపాటు పాల్గొన్న పాఠశాలలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఖేడ్లో ఇండోర్, ఔట్డోర్ స్టేడియంల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ నగేశ్షెట్కార్, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, దారం శంకర్, డీఎస్పీ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, సీఐలు, ఎస్ఐలు, అధికారులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు శ్రీకాంతచారి జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీకాంతచారి చౌక్లోని ఆయన విగ్రహానికి ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని రేజింతల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద శనివారం జాతీయ పతాకావిష్కరణ జరగలేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను తప్పకుండా ఎగురవేయాలని నిబంధనలున్నా అధికారులు వాటిని పట్టించుకోలేదని పలువురు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఆవిష్కరించే వారని ఈసారి విస్మరించారని తెలిపారు. ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మను వివరణ కోరగా అక్కడ పని చేసే ఏఈఓ సెలవుల్లో ఉండటం వల్ల జెండాను ఎగుర వేయలేదని సమాధానమిచ్చారు. -
ఎన్జీటీ కేసు రద్దులో ప్రభుత్వం విఫలం
హుస్నాబాద్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్పై ఉన్న ఎన్జీటీ కేసును తొలగించి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచినా మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం ఏన్జీటీ కేసును రద్దు చేయించలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేసి ట్రయల్ రన్ చేసి నీళ్లు నింపామన్నారు. కాంగ్రెస్ నాయకులే ప్రాజెక్టు పూర్తి కావడం తట్టుకోలేక కొందరిని ఉసిగొలిపి కేసులు వేయించి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక ముందు పర్యావరణం, ఏన్జీటీ అనుమతులపై కోర్టుకు రావద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించాలని సూచించారు. కేసులు మీరే వేశారు, వాటిని పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపి ఆ క్రెడిట్ను మీరే తీసుకోవాలని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును నింపే బాధ్యత మంత్రి పొన్నందే.. మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ -
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ పతాకాన్ని సంగీత ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేయడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో... సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ పరితోశ్ పంకజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్లో.. నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖేడ్ గాంధీచౌక్లో ఎంపీ సురేశ్ షెట్కార్, క్యాంపు కార్యాలయం, ఇందిరాచౌక్ వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ నగేశ్ షెట్కార్, శ్రీనివాస కళాశాల వద్ద మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, వివిధ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జెండాలను ఎగురవేశారు. జహీరాబాద్లో.. జహీరాబాద్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జహీరాబాద్లో ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై జాతీయ పతాకాలను ఎగురవేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.మాణిక్రావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. జాతీయ పతాకం తలకిందులుగా ఎగురుతున్న విషయాన్ని గమనించి సరైన దిశలో ఎగురవేశారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ దేవుజా, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ యూనూస్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ దశరథ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్రెడ్డి, మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ సాయిచరణ్, సీడీసీ కార్యాలయంలో చైర్మన్ ముబీన్లు జాతీయ పతాకాలను ఎగురవేశారు. జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్ సంగీత జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న ఎస్పీ పరితోశ్ పంకజ్, తదితరులు -
250 మంది యువకుల రక్తదానం
పటాన్చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు, కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతిని జీఎంఆర్, జీవీఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జీఎంఆర్ యువసేన, జీవీఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి పైగా యువకులు రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. బ్లాక్ ఆఫీస్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అభిమానులు, సన్నిహితులు, యువసేన సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, విజయ్కుమార్, భిక్షపతి, రామచంద్రారెడ్డి, పృథ్వీరాజ్, గూడెం సంతోష్ రెడ్డి, సందీప్ రెడ్డి, అశోక్, వెంకటేశ్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
ప్రజాకాంక్ష నెరవేర్చేలా పాలన
సంగారెడ్డి జోన్: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి పాల్గొన్నారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతం ఆలపించారు. అదేవిధంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుకు భరోసాకు రూ.418 కోట్లు రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం సీజన్లో 3,60,464 మంది రైతులకు రూ.418 కోట్లు జమ చేశామని మంత్రి దామోదర వివరించారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే...‘‘రబీ సీజన్లో 33,540 రైతుల నుండి 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ. 405.73 కోట్లు చెల్లించాం. సన్నఒడ్లకు బోనస్ రూపంలో రూ.2.76 కోట్లు ఇవ్వనున్నాం. 2025–26లో రైతు బీమా పథకం ద్వారా 1,180 మంది రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున రూ.59 కోట్లను నామిని ఖాతాలో జమ చేశాం. ప్రజా ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జిల్లాలో రూ.275 కోట్లతో కొత్త 500 పడకల ప్రభుత్వాస్పత్రి పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.168 కోట్ల నిధులతో మెడికల్ కళాశాలతోపాటు హాస్టల్ భవనాలను నిర్మించి ప్రారంభించాం. రూ.34 కోట్ల నిధులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రహదారుల మరమ్మతులకు నిధులు జిల్లాలో హ్యమ్ పద్ధతిలో 318 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం రూ.685 కోట్లు మంజూరు కాగా, రూ.405 కోట్ల నిధులతో 188 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి’’అని మంత్రి వివరించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మంత్రి దామోదర రాజనర్సింహ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు


