breaking news
Sangareddy
-
14 గ్రామాల్లో..
పాత పంటల జాతర 14 గ్రామాల గుండా సాగుతుందని డీడీఎస్ డైరెక్టర్ దివ్య పేర్కొన్నారు. 16న జాడిమల్కాపూర్, 19న జాంగార్బౌలితండా, 21న అర్జున్నాయక్తండా, 23న అల్గోల్, 27న రేజింతల్, 29న గుంజోటిలో జరుగుతుందన్నారు. 31 శంశల్లాపూర్, ఫిబ్రవరి 2న మల్గి, 4న హుమ్నాపూర్, 6న నాగ్వార్, 9న ఝరాసంగం, 11న బిడకన్నె గ్రామాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. 13న మాచ్నూర్ గ్రామంలోని పచ్చసాలెలో ముగింపు జాతర ఉత్సవం జరుగుతుందని వివరించారు. సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి స్థానికంగా అనుకూలంగా ఉండే పాత పంటల రకాలను గుర్తించి వాటి సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. జాతరలో 45 గ్రామాలకు చెందిన రైతులు చర్చావేదికలో పాల్గొంటారు. 400 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. –దివ్య, డీడీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
కోడ్ కూయక ముందే
● సంక్షేమ పథకాలపైనా ప్రత్యేక దృష్టి ● మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే యోచన ● రెండేళ్లుగా పట్టణాల అభివృద్ధి కుంటుపడిందంటున్న ప్రతిపక్షాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే అవకాశాలుండటంతో అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేసేస్తోంది. ఈ పనులను ప్రారంభించడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలను ప్రకటించగా...కౌన్సిలర్లు, చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో అఽధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులపై నజర్ వేసింది. అందుకే జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో శనివారం ఒక్కరోజే రూ.1.75 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేసింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డైనేజీల పనులకు శ్రీకారం చుట్టగా..ఈ ప్రారంభభ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పాల్గొన్నారు. ఇక సదాశివపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సీసీరోడ్లు, డ్రైనేజీలతోపాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్షి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మరోవైపు ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం సీసీరోడ్లు నిర్మాణం పనులను ప్రారంభించారు. కాగా, కౌన్సిలర్ రేసులో నిలవాలని భావిస్తున్న నాయకులు ఏకంగా తమ సొంత ఖర్చులతో బోర్లు వేయింస్తుండటం గమనార్హం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. గత రెండేళ్లు మున్సిపాలిటీల అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు రాగానే అభివృద్ధి పనుల పేరుతో హడావిడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండేళ్లుగా పట్టణాల్లో అభివృద్ధి పనులు పడకేశాయని, కనీసం పారిశుద్ధ్య పనుల నిర్వహణలో కూడా విఫలమవుతున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మొత్తం మీద బల్దియా ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. -
పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో పంచాయతీరాజ్ శాఖ అధికారుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొ న్నారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యో గుల సంఘం ఖేడ్ నియోజకవర్గ యూనిట్కు సంబంధించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్లను ఆయన మంగళవారం ఖేడ్లోని తన నివాసగృహం ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అట్టడుగు గ్రామీణ ప్రజలకు సేవలందించడంలో పంచాయతీరాజ్ అధికారులు కీలకపాత్రను పోషిస్తున్నారన్నారు. అంకితభావంతో పనిచేస్తూ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు, నిజాంపేట ఎంపీడీఓ సంగ్రాం, జిల్లా నాయకులు ఇ.సుదర్శన్, ఇతర బాధ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్ధిక సహాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే తన నివాస గృహంలో అందజేశారు. ధర్నాలో ఉల్లి రైతులు డిమాండ్ నారాయణఖేడ్: వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖేడ్ నియోజకవర్గంలోని ఉల్లి రైతులు ఖేడ్ రాజీవ్ చౌక్, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉల్లి విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగినా గిట్టుబాటు ధర అందక తీవ్ర నష్టాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాయితీపై విత్తనాలు, నిల్వకోసం గిడ్డంగులను నిర్మించి మద్దతు ధర క్వింటాలుకు రూ.720 ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు నేతృత్వం వహించిన బీఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చందర్ డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఉమాహారతికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: కార్మికుల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం డివిజన్ పరిధిలోని రాణే డై కాస్టింగ్ పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కృష్ణసింగ్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరణించిన కార్మికుడికి మెరుగైన నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే సూచించడంతో పరిశ్రమ యాజమాన్యం రూ.20 లక్షల నష్టపరిహారం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారానికి సంబంధించిన రూ.15 లక్షల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. మరో రూ.ఐదు లక్షలు త్వరలో అందజేయనున్నట్లు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరు టౌన్: రహదారి భద్రత మనందరి బాధ్యతని పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘‘అరైవ్ అలైవ్ – సురక్షిత రహదారుల ప్రచార కార్యక్రమం మంగళవారం పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గ్రామస్తులకు రోడ్డు భద్రతా నియమాలు, జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు గురైన కొంతమంది గ్రామస్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. బీడీఎస్ సీఐ విజయకృష్ణ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీడీఎల్ పోలీసులు సిబ్బంది బాలచందర్, అలన్, సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న నిమ్జ్, ట్రిపుల్ ఆర్, టీజీఐఐసీ ప్రాజెక్టుల కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. భూసేకరణ పురోగతిపై కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, డీఎం అండ్ హెచ్ఓ వసంత్ రావు, ఆర్డీవో రాజేందర్, జిల్లా రవాణ అధికారి అరుణ, తదితరులు పాల్గొన్న ఈ సమీక్షలో భూ సేకరణకు సంబంధించి సమగ్రంగా చర్చించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. సమన్వయంతోనే ప్రమాదాల నివారణ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే సాధ్యమవుతుందని ప్రావీణ్య తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి సమగ్ర ప్రణాళికతో నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నేషనల్ హైవే–65లో గుర్తించిన జంక్షన్ల వద్ద సరిపడా లైటింగ్, సూచిక బోర్డులు, స్టడ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద చెట్ల వల్ల లైటింగ్ స్పష్టంగా కనిపించని చోట్ల మున్సిపల్ కమిషనర్, డీపీఓ సహకారంతో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని చెప్పారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రావీణ్య వ్యవసాయ శాఖ డైరీ, గెజిటెడ్ అధికారుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు శివ ప్రసాద్, లలిత కుమారి, వైద్యనాథ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సచ్చినా.. బతికారట..!
జోగిపేట(అందోల్): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తయారుచేసిన జోగిపేట–అందోలు మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకగా తయారైంది. 20 వార్డుల్లో అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు అందర్నీ విస్మయానికి గురిచేయడమే కాకుండా ఓటరు జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఓటర్ల జాబితాలో మృతులు, పట్టణాలకు వలస వెళ్లిన వారు, గ్రామాల్లో ఉండి పట్టణ జాబితాలో కూడా ఓటరుగా నమోదు కావడం, ఒక వార్డుకు సంబంధించి స్థానికుల పేర్లు మరో వార్డులో నమోదుకావడం, ఒకరికి బదులు మరొకరి ఫొటోలు, మరికొన్ని చోట్ల ఫొటోనే లేకపోవడం, సీ్త్ర ఓటరు పేరుతోపాటు వారి తండ్రి పేరు కూడా అదే పేరుతో అచ్చువేయించడం వంటి చిత్ర విచిత్రాలెన్నో జాబితాలో దర్శనమిస్తున్నాయి. జాబితాలో తప్పులు ఇవే... ఓటర్ల జాబితాలో ఈ తప్పులు దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ఒక వార్డుకు చెందిన ఓటర్ల పేర్లు మరొక వార్డులో నమోదయ్యాయి. అలాగే ఓటరు జాబితాలో ఓటరు తల్లి, తండ్రి, భర్త పేరు వద్ద ఇంటి పేర్లు నమోదయ్యాయి. ఒక వార్డులో కుమారులు, సోదరుల ఓట్లు మరో వార్డులో చేర్చారు. ప్రతీ వార్డులో కనీసం 8 నుంచి 10 మంది మృతుల పేర్లు సమోదయ్యాయి. పలువురి ఇంటిపేరు, వార్డు పేరు సైతం ఓటరు జాబితాలో తప్పుగా నమోదయ్యాయి. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పుడేనా? బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో తప్పిదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన 4 రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరుగుతోంది. తప్పుల జాబితాపై ఏ ఒక్క అధికారి సైతం సమాధానం ఇవ్వడం లేదు. ఎన్నికల కమిషన్ వారు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను పరిశీలిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నా ఏకంగా ఐదు, పదేళ్ల కిందట చనిపోయిన వారి పేర్లు ఇంకా ప్రత్యక్షమవుతుండటం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఇటీవల ఓటర్ల జాబితాలో పట్టణంలోని 20 వార్డుల్లో మృతి చెందిన వారి వివరాలు ఓటర్ల జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఓటరు జాబితాలో దాదాపు వందమందికిపైగా చనిపోయిన వారి పేర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబితా విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ జాబితాలో కొందరు మృతుల పేర్లు నమోదైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మృతులకు సంబంధించి వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియజేసి జాబితాలో చనిపోయినట్లు స్టాంప్ వేయిస్తాం. జోగిపేట– అందోలు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16,450 ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 8,564 కాగా పురుష ఓటర్లు 7,886గా వున్నారు. –రవీందర్, కమిషనర్, జోగిపేట మున్సిపాలిటీ ప్రతీ వార్డులో కనీసం 8 నుంచి 10 మంది పేర్లు ఒకరి ఫొటోకు బదులు మరొకరిది ప్రత్యక్షం కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న అధికారుల అలసత్వం తప్పుల తడకగా మున్సిపల్ జాబితా -
చిరుధాన్యాల జాతర
నేటి నుంచి నెలరోజులపాటు కార్యక్రమం ఎడ్ల బండ్లలో విత్తనాల ప్రదర్శన జహీరాబాద్: చిరుధాన్యాల ప్రాధాన్యతను నెలరోజులపాటు చాటిచెప్పే 26వ పాత పంటల జాతర బుధవారం నుంచి జహీరాబాద్ మండలంలోని జమలైతండాలో ప్రారంభం కానుంది. మండలంలోని పస్తాపూర్ గ్రామంలో గల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల గుండా ఎడ్ల బండ్ల ద్వారా చిరు ధాన్యాలను ప్రదర్శిస్తూ జాతర కొనసాగుతుంది. వచ్చేనెల 13న ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో ముగింపు జాతర నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతర నిర్వాహకులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. సాగుపై అవగాహన ఈ సందర్భంగా చిరు ధాన్యాల సాగు ప్రాధాన్యత, వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు చిరు ధాన్యాల ఆవశ్యకత, సేంద్రీయ సాగు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు నిర్వాహకులు సలహాలు, సూచనలు అందిస్తారు. ఇందుకోసం ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం రోజున పాత పంటల జాతర ప్రారంభిస్తున్నారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, మొగుడంపల్లి మండలాల్లోని 70 గ్రామాల్లో డీడీఎస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సంఘంలోని మహిళలతోపాటు ఇతర రైతులకు చిరుధాన్యాల సంరక్షణ, పంటలను సాగు చేసే విధానం, విత్తనాల ఎంపిక, తదితర వాటిపై అవగాహన కల్పించేందుకుగాను డీడీఎస్ ఆధ్వర్యంలో జాతరను నిర్వహించనున్నారు. మాచ్నూర్లో విత్తన బ్యాంకు ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో డీడీఎస్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. రైతు తమ పొలంలో పండించిన పంటలో నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకుని విత్తనంగా సేకరించి నిల్వ చేస్తారు. వాటిని వానాకాలం, యాసంగిలో సాగుకు ఉపయోగించుకుంటారు. విత్తన బ్యాంకులో రైతులు తీసుకున్న విత్తనాలను పంట వచ్చాక తిరిగి రెట్టింపు విత్తనంగా అందజేస్తారు. విత్తన బ్యాంకులో 50 నుంచి 60 రకాల వరకు విత్తనాలు నిల్వచేసి అందుబాటులో ఉంచుతారు. ప్రధానంగా సజ్జ, కొర్ర, సామ, పలు రకాల జొన్నలు, కందులు, మినుములు, అనుములు, పెసర, శనగ, ఉలవలు, తైదలతోపాటు పలు చిరు ధాన్యాల విత్తనాలను సేకరించి ఉంచుతారు. ప్రభుత్వం అందించే విత్తనాల కోసం ఎదురు చూడకుండా తమ వద్ద పండించిన చిరుధాన్యాల పంటలను నుంచే రైతులు విత్తనాన్ని ఎంపిక చేసుకుంటారు. అవి పురుగు పట్టకుండా ఉండేందుకుగాను బూడిద, వేపాకు కలిపి ఈత బుట్టల్లో పోలిమట్టితో మూసి వేస్తారు. విత్తనాలు పెట్టే సమయంలో వాటిని బయటకు తీసి విత్తుతారు. రైతులు తమ వద్ద 40 నుంచి 60 రకాల వరకు చిరుధాన్యాల విత్తనాలు నిల్వచేసి పెట్టుకుంటారు. -
ధ్వంసమైన కుంట కట్ట పరిశీలన
వట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని ఆశిరెడ్డికుంట కట్టను ధ్వంసం చేసి సాగు చేయడంపై ఈ నెల 12న సాక్షి దినపత్రికలో ‘ఆశిరెడ్డి కుంట కట్ట ధ్వంసం..’అనే శీర్షికతలో కథనం ప్రచురితమైంది. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు మంగళవారం ధ్వంసం చేసిన కుంట కట్టను పరిశీలించారు. సదురు భూ యజమాని అక్కడ లేకపోవడంతో అతని వివరాలను అక్కడ పనిచేయిస్తున్న మోహిన్ను అడిగి తెలుసుకున్నారు. కుంట శిఖం భూమిలో పట్టాలు కలిగి ఉన్నప్పటికీ కట్టను ధ్వంసం చేయడం చట్టరీత్య నేరమన్నారు. వెంటనే భూ యజమానిని పిలిపించి ధ్వంసమైన కట్టను యథాస్థితికి చేర్చేలా పనులు చేపట్టాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇదే భూమిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి కుంటలోని నీటిని బయటకు పంపించే ప్రయత్నంలో తూమును ధ్వంసం చేయడంతో కేసులు నమోదు చేసినట్లు వారికి గుర్తు చేశారు.సరిచేయకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక -
వారంలో మూడు రోజులు ప్రజాబాట
చిన్నశంకరంపేట(మెదక్): విద్యుత్ వినియోగారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే క్షేత్రస్థాయిలో ప్రజాబాట కార్యక్రమం చేపట్టినట్లు విద్యుత్శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వారంలో మంగళ, గురు, శనివారం ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు గృహజ్యోతి బాండ్లను అందించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ఈ నారాయణనాయక్, ఏడీఏ మోహన్బాబు, ఏఈ దినకర్, జంగరాయి గ్రామ సర్పంచ్ గోపాల్రెడ్డి పాల్గొన్నారు.మెరుగైన విద్యుత్ కోసమే.. ఎస్ఈ నారాయణనాయక్ మెదక్ కలెక్టరేట్: మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు జిల్లాలో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గృహజ్యోతి లబ్ధిదారులకు, రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. హవేళిఘణాపూర్, మెదక్, చిలిపిచెడ్, చిన్నశంకరంపేట మండలాల్లో పర్యటించినట్లు తెలిపారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 1లక్ష 28వేల కనెక్షన్లు, వ్యవసాయానికి సంబంధించి ఒక లక్ష 11వేల కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 60శాతం లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్, తూప్రాన్ డీఈలు రామేశ్వర ప్రసాద్,, ఏడిఈ మోహన్ బాబు, మెదక్ టౌన్, చిన్నశంకరంపేట ఏఈలు నవీన్, దినకర్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.విద్యుత్శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి -
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి
ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని పస్తాపూర్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం... ఝరాసంగం మండలంలోని వనంపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప(37) బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం తన ట్రాక్టర్కు సంబంధించి ఫైనాన్స్ డబ్బులు కట్టేందుకు గ్రామం నుంచి మోటారు సైకిల్పై జహీరాబాద్కు వెళుతున్నాడు. ఈ క్రమంలో పస్తాపూర్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కుప్పానగర్కు చెందిన ట్రాక్టర్ అతడ్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. కాగా మృతుడికి భార్య, ఐదుగురు కుమార్తెలు. స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీఆర్ చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది..
తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే బీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ టిక్కెట్ విషయంలో అఽధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తే వారే బరిలో ఉండాలని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను గడప గడపకు తీసుకెళ్లాలన్నారు.గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి -
వచ్చే నెల నుంచి నూతన పెన్షన్లు
సిద్దిపేటఅర్బన్: వచ్చే నెల నుంచి నూతన పెన్షన్లు ఇస్తామని సిద్దిపేట నియోజకవర్గానికి ఇచ్చే 3,500 ఇళ్లకు అదనంగా మరో 500 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్టు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి, వెల్కటూరు, నాంచారుపల్లి గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ఎంపీ రఘునందన్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వెల్కటూరులో నిర్మాణం పూర్తైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. మండలంలోని 10 గ్రామాలలో నిర్మించే సీసీ రోడ్లలో భాగంగా నాంచారుపల్లిలో శంకుస్థాపన చేశారు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. నాంచారుపల్లి గ్రామంలో వార్డు సభ్యులతో పాటు పలువురు మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఆర్డీవో సదానందం, డీఐఈవో రవీందర్రెడ్డి, డీఈవో శ్రీనివాస్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, తహసీల్దార్ హరికిరణ్, ఎంపీడీవో మార్టిన్ లూథర్, ఏఈ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ రగడ.. మంత్రి వివేక్ పర్యటనలో భాగంగా నాంచారుపల్లిలో సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఫొటో లేకపోవడంతో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. ఫ్లెక్సీలో ఫొటో లేకపోవడంతో ఆంక్షారెడ్డి స్టేజీపైకి వెళ్లకుండా దూరంగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఫొటో తొలగించారని ఆంక్షారెడ్డి అనుచరులు ఆగ్రహానికి లోనయ్యారు. దీనికి కారణం సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణనే కారణమని ఆంక్షారెడ్డి అనుచరుడు అతనిపై చేయిచేసుకున్నారు. దీంతో పక్కనే ఉన్న ఇతర నాయకులు సర్దిచెప్పి అక్కడి నుండి పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. -
పుట్టగొడుగు.. పోషకాలు మెండు
‘విజ్ఞానజ్యోతి’లో జోరుగా పెంపకం ● వ్యవసాయంతోపాటు ప్రత్యేక శిక్షణ ● ప్రారంభం నుంచి మార్కెటింగ్ వరకు మెలకువలుకౌడిపల్లి(నర్సాపూర్): వ్యవసాయ విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. ఇప్పటికే వ్యవసాయంతోపాటు కూరగాల పెంపకం, పాడిపరిశ్రమపై శిక్షణ ఇస్తున్నారు. మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ, వ్యవసాయ పాల్టెక్నిక్ కళాశాలలో వరితోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోటలు, ఆహారపంటల సాగుపై సస్యరక్షణ చర్యలపై క్షేత్రస్థాయిలో విద్యార్థులకు శిక్షణ కొనసాగుతోంది. దీనికి తోడుగా పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు విజ్ఞానజ్యోతి డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఉపాధ్యాయుడు మహేశ్ తెలిపారు. విజ్ఞానజ్యోతిలో పుట్టగొడుగుల పెంపకం కోసం కళాశాల సమీపంలో ప్రత్యేకంగా ఒక చీకటి గదిని ఏర్పాటు చేశారు. అందులో పుట్టగొడుగులలో ప్రత్యేకమైన ముత్యపుచిప్ప, పాలపుట్టగొడుగులను పెంచుతున్నారు. వాటి పెంపకం కోసం వరిగడ్డిని ముక్కలుగా కట్చేసి 7–8 గంటలపాటు నీటిలో నానబెడతారు. అనంతరం వేడినీటితో శుద్ధిచేసి నీడలో తేమ ఉండేలా ఆరబెట్టి గోనె సంచులు పాలిథిన్ కవర్లలోవేసి మట్టితో నింపుతారు. అనంతరం వాటి మధ్యలో విత్తనాలు వేసి చీకటిగదిలో పెడతారు. 15–20 రోజుల్లో పుట్టగొడుగులు వస్తాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడంవల్ల నాన్యమైన పుట్టగొడుగులను పండించవచ్చని అధ్యాపకులు చెపుతున్నారు. పండించిన పుట్టగొడుగులును శుభ్రంచేసి రంధ్రాలు చేసిన పాలిథిన్ కవర్లలో ప్యాకింగ్చేయాల్సి ఉంటుంది. చల్లటి ప్రదేశం(ఫ్రిజ్)లో నిల్వ చేయడంవల్ల 7–8 రోజులు ఉంచవచ్చు. తక్కువ శ్రమ.. అధిక ఆదాయం పుట్టగొడుగుల్లో అనేక పోషకాలు ఉండటంతో వంటలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంచి మెలకులతో జాగ్రత్తలు పాటించి పెంచడంవల్ల మంచి ఆదాయం వస్తుందని, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారు. -
చిదిమేస్తున్న చైనా మాంజా
● నిషేధించినా కొనసాగుతున్న విక్రయాలు ● దానివైపే మొగ్గుచూపుతున్న యువత ● ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు ● తనిఖీలు చేస్తున్న పోలీసులుసంక్రాంతి అంటే ఆనందాలు తెచ్చే పండుగ. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఇంటికి చేరగా.. గ్రామాల్లో అందరూ సంతోషంగా జరుపుకొనే సంబురాలకు ప్రతీక. కానీ ఈ మధ్య కాలంలో ఆ ఆనందానికి చైనా మాంజా చితిపెడుతోంది. పండుగ సందర్భంగా పతంగాలను ఎగురవేయడానికి వాడుతున్న ఆ మాంజా వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. జహీరాబాద్టౌన్/మెదక్జోన్: పతంగలు ఎగరేయడం తెలంగాణ సంప్రదాయం. కానీ చైనా మాంజా కారణంగా ప్రజలు, పక్షుల ప్రాణాలు పోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆ అమ్మకాలను నిషేధించింది. అయినా చైనా మాంజా అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తగంగా పతంగులు, మాంజా వ్యాపారం సుమారు రూ. కోటికిపైగా జరుగుతోందని అంచనా. ఈ మేరకు జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్ ఆదేశాల మేరకు జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్కుమార్ పట్టణంలోని పతంగుల దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇద్దరి వద్ద చైనా మాంజా లభించగా వారిపై కేసు నమోదు చేశారు. సాధారణ మాంజా విక్రయించాలని, చైనా మాంజా వద్దని వారు సూచిస్తున్నారు. చైనామాంజా వల్లా కలిగే ప్రాణనష్టంతో పాటు పర్యావరణానికి ఏవిధంగా కీడు జరుగుతుందనే విషయాన్ని పోలీసులు ప్రజలకు వివరిస్తున్నారు. చైనా మాంజాను వాడొద్దని ప్రచారం చేస్తున్నారు. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు మెదక్లో ఓ వ్యాపారితోపాటు నర్సాపూర్లో మరో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారం రోజులుగా మెదక్తో పాటు ప్రతి పల్లెను జల్లెడ పడుతున్నారు.తల్లిదండ్రులు జాగ్రత్త పిల్లలు చైనా మాంజాతో పతంగులు ఎగురవేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. యువకులు కూడా దేశీరకాలనే కొనాలి. చైనా మాంజా వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యాపారులు కూడా చైనా మాంజాను విక్రహించవద్దు. – వినయ్కుమార్, ఎస్ఐ జహీరాబాద్ టౌన్ -
మహిళ మృతదేహం లభ్యం
కొల్చారం(నర్సాపూర్): పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో.. ఎముకల గూడుతో కూడిన మహిళా మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన కొల్చారం మండల కేంద్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ కాల్వ పక్కన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక భాగంలో చింతల కిష్టయ్య భూమి పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కాల్వ వద్ద కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించారు. మృతురాలి వయస్సు 45 నుంచి 50 వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. 15 రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే ఫోన్నంబర్: 8712657919, 8712657916లకు సంప్రదించాలని కోరారు. పెద్దశంకరంపేట(మెదక్): ఈజీ మనీకి, జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతం చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వట్పల్లి మండలం పల్వట్లకు చెందిన బేగరి సాయిలు కొంతకాలంగా బైక్లను దొంగతనం చేస్తున్నాడు. గత ఏడాది ఏప్రిల్లో పెద్దశంకరంపేటలో టీఎస్35–బి242తో పాటు నవీపేట మండలంలో ఒక బైక్, పంజాగుట్టలో మరో బైక్ను దొంగిలించాడు. శంకరంపేటలో బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రెండు బైక్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ.సంగమేశ్వర్, సిబ్బంది రామ్సింగ్, రమేష్ తదితరులు ఉన్నారు. చేపల వల చుట్టుకొని వ్యక్తి మృతినర్సాపూర్ రూరల్: చేపల కోసం తాను వేసిన వల చుట్టుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ మండలం తుజాల్పూర్లో మంగళవారం చోటచేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ కథనం ప్రకారం.. తుజాల్పూర్ గ్రామానికి చెందిన బర్ల శ్రీశైలం(40) వేకువ జామున గ్రామ సమీపంలోని దామర చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల కోసం వల వేయగా.. తాను వేసిన వల తనకే చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు చెరువు కట్టపై శ్రీశైలం బట్టలు, చెప్పులు, సెల్ఫోన్ కనిపించగా.. గాలించారు. శ్రీశైలం మృతదేహాన్ని బయటకు తీశారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతిచేగుంట(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీ బైపాస్ రోడ్డుపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం ప్రకారం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వ్యక్తికి సంబంధించిన బంధువులు చేగుంట పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. పతంగి ఎగరేద్దాం.. జాగ్రత్తలు పాటిద్దాం.. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
ఆర్అండ్బీ డీఈఈ రవీందర్ మునిపల్లి(అందోల్): రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆర్అండ్బీ డీఈఈ రవీందర్ సూచించారు. మండలంలోని పెద్దచల్మెడ శివారులో నిర్మిస్తున్న బీటీ రోడ్డును సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. అలాగే మక్తక్యాసారం డబుల్రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అలాగే తాటిపల్లి నుంచి మక్తక్యాసారం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు, తక్కడపల్లి గార్లపల్లి మధ్య సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో బ్రిడ్జి ఏర్పాటుకు రూ.17 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వాటి పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఏఈ భరత్, మక్సూద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. టీజీడీడీసీఎఫ్ జీఎం మధుసూదన్రావు జహీరాబాద్ టౌన్: పాడి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య రాష్ట్ర జీఎం మధుసూదన్రావు అన్నారు. పట్టణంలో పాలశీతలీకరణ కేంద్రంలో సోమవారం మహిళా పాడి రైతులకు ముగ్గుల పోటీలు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపీ స్కీమ్ను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు రుణ సహాయం అందుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గరిష్టంగా 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ పాడి రంగంపై ఆధారపడిన రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని చెప్పారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే బ్యాంకుల మనుగడ ఉందన్నారు. అనంతరం మహిళలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో విజయడైరీ డీడీ ఏజీఎం సంగమేశ్వర్, బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్, మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ డేవిడ్రాజ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మాణిక్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనలతో జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషకరమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 కబడ్డీ పోటీలలో నాలుగో స్థానం సాధించిన తెలంగాణ జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో సోమవారం సాయ ంత్రం నిర్వహించిన సమావేశంలో వారిని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరును కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్రెడ్డి, జట్టు మేనేజర్ గోపాల్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన 164వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వివేకానంద తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
● ఏఐ ఆధారిత డిజిటల్ విద్యా బోధన కోసం ప్రత్యేక ప్రణాలిక ● ఓయూ వైస్ చాన్స్లర్ కుమార్ ములుగరం జహీరాబాద్ టౌన్: విద్యతోనే వికాసమని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్ ములుగరం అన్నారు. అంబేడ్కర్ గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆచార్య డిగ్రీ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, ఓయూ సంయుక్తంగా సోమవారం జహీరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్య అనేది కేవలం వ్యక్తిగత మార్పునకే కాకుండా.. దేశాభివృద్ధికి అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న సమయంలో సాంకేతికత మానవాళికి ఉపయోగపడాలంటే విలువలతో కూడిన విద్యపై ఆధారపడాలని సూచించారు. ఏఐ ఆధారిత డిజిటల్ విద్యా బోధన కోసం ప్రత్యేక ప్రణాలిక రూపొందిస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు మంజూరు చేశారన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం ఓయూను గుర్తించడం అమోఘమని చెప్పారు. హెచ్సీయూ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నాగరాజు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచనలు నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. అనంతరం వైస్ చాన్సలర్ మీర్జాపూర్లో గల పీజీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రాంతీయ విద్యా కేంద్రాలను బలోపేతం చేయడానికి త్వరలో ఓ కమిటీ వేస్తామన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ లింగప్ప, ఓఎస్డీ వైస్ చాన్సలర్ జితేందర్నాయక్, బీసీ డైరెక్టర్ మాధవి, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికుమార్, ఉమెన్ సెల్ డైరెక్టర్ అబిదా, కళాశాల డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, నందుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లను అందజేశారు. -
టికెట్ల కోసం పోటాపోటీ
ఆశావహుల ముమ్మర ప్రయత్నాలుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు టిక్కెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్లు కలిసి వస్తే తమకు పార్టీ టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారు. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. పార్టీ టికెట్ వస్తే గెలుపు సులభమవుతుందని భావిస్తున్న ఆశావహులు ఎలాగైనా టికెట్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తు న్నారు. అన్ని ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆశావహుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను వినతులను తీసుకుంటున్న నాయకులు.. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయింపు ఉంటుందని, సర్వేల ఆధారంగా అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తామని చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు, 256 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. అలాగే మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 72 కౌన్సిలర్ స్థానాలు, సిద్దిపేట జిల్లాలో నాల్గు మున్సిపాలిటీల పరిధిలో 75 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ ముఖ్యనేతలతో టచ్లోకి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ టిక్కెట్ల రేసులో ఉన్న ఆశావహులు కొందరు బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. ఒకవేళ అక్కడ టిక్కెట్ దక్కకపోతే బీజేపీ టిక్కెట్ కోసం ముందుజాగ్రత్తగా బీజేపీ ముఖ్యనేతలతో టచ్లో ఉన్నారు. చాలా ఏళ్లుగా ఈ పార్టీలో ఉంటూ సేవలందిస్తూ భంగపాటుకు గురైన నాయకుల నుంచి కూడా పోటీ నెలకొనడంతో బీజేపీ టిక్కెట్ల కోసం ఆశావహుల సంఖ్య రెట్టింపవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో తమకు టికెట్ ఇస్తే భారీగా ఎన్నికల ఖర్చు పెట్టుకుంటామని కొందరు ఆశావహులు ముందస్తుగా బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తుండటం కమలం పార్టీ వర్గాల్లో అంతర్గతంగా కలకలం రేపుతోంది. మొత్తం మీద మూడు ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటా పోటీ నెలకొనడంతో బల్దియా రాజకీయం వేడెక్కుతోంది. పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో తీవ్ర పోటీ ఒక్కో కౌన్సిలర్ స్థానానికి ఇద్దరు లేదా ముగ్గురు.. భంగపడితే బీజేపీ టికెట్ కోసం ముందస్తు ప్రయత్నాలు దీంతో కమలం పార్టీలోనూ పెరిగిన పోటీ రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం అధికార పార్టీతో పాటు, ప్రధాన ప్రతిపక్ష పక్షం బీఆర్ఎస్లో టిక్కెట్ల గోల ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కో వార్డు సభ్యుడి పదవికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారం ఆయా పార్టీల్లో కొంత గందరగోళానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా తాము బరిలో ఉంటామని, అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే యోచనలో ఆశావహులు ఉన్నారు. దీంతో ఈ పార్టీలకు రెబల్స్ బెడద పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ క్యాడర్ రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన విషయం విదితమే. ఇప్పుడు ఇలాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఖరారు గందరగోళానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. తమ వర్గానికి టిక్కెట్లు దక్కించుకునేందుకు ఆయా నేతలు పట్టుబట్టే అవకాశాలు ఉండటంతో అధికార పార్టీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే టిక్కెట్ల ఖరారు కోసం ఒక్కో కౌన్సిలర్ స్థానం నుంచి రిజర్వేషన్లకు తగ్గట్టుగా ఆరు పేర్లు సేకరించాలని పీసీసీ ఇప్పటికే ప్రకటించింది. రిజర్వేషన్లు ప్రకటించాక టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు రెబల్స్ బెడద లేకుండా బీఆర్ఎస్ ముందు నుంచే జాగ్రత్త పడుతోంది. -
రైతులకు ఏదీ భరోసా?
● సంక్రాంతికి అందని పెట్టుబడి సాయం ● పూర్తికాని శాటిలైట్ సర్వే ● జిల్లాలో 7.43 లక్షల ఎకరాల్లో సాగు భూములు యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం కానుంది. సంక్రాంతి నాటికి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం భావించింది. అయితే శాటిలైట్ సర్వే రిపోర్టు ఇంకా ఫైనల్ కాకపోవడం, సాగు భూములను గుర్తించే ప్రక్రియ పూర్తి కాకపోవడం అడ్డంకిగా మారింది. – నారాయణఖేడ్ ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూముల గుర్తించే పనుల్లో నిమగ్నమైంది. దీని ద్వారా అనర్హులకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ సర్వేకు సంబంధించిన రిపోర్టు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలతో జాప్యం ఏర్పడింది. గతానికి భిన్నంగా ఈసారి వాస్తవంగా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో అనేక లోపాటు ఉన్నట్లు గుర్తించింది. సాగుకు పనికిరాని భూములకు సైతం పంట పెట్టుబడి సాయం అందిందని తేల్చింది. ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకట్ట వేసేందుకు సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను వాడుతోంది. దీని ఆధారంగా అనర్హులను తొలగించేందుకు క్షేత్రస్థాయిలో ఏఈఓలు రంగంలోకి దిగారు. జిల్లాకు రూ. 422 కోట్లు సర్వే ఆధారంగా అర్హులుగా తేలిన రైతులకు ఎకరాకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం పంపిణీ చేయనుంది. వానాకాలం సీజన్లో జిల్లాలో 3,58,863 మంది రైతులు 7,43,337 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వీరికి ప్రభుత్వం రైతు భరోసాగా రూ. 422 కోట్లను రైతులకు పంపిణీ చేసింది. ఈ యాసంగి సీజన్లో దాదాపు ఇదే సంఖ్య ఉండనుంది. స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 26న రైతుల ఖాతాల్లోకి! సంక్రాంతికి రైతు భరోసా పంపిణీ కాకపోవడంతో జనవరి 26 (గణతంత్ర దినోత్సవం)న ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పటికీ కాని పక్షంలో ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ చేయవచ్చని తెలుస్తోంది. సర్వే చివరి దశలో ఉన్నట్లు సమాచారం. -
గులాబీ జెండానే
బల్దియాలపై ఎగిరేది● కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ● ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో మాజీ మంత్రి హరీశ్రావు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్యరావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీల ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, పల్లెల నుంచి పట్టణాల వరకు పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మున్సిపాలిటీలు, నేడు నిర్వహణ లేక కళ తప్పాయని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రతినెలా క్రమం తప్పకుండా నిధు లు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలి కొదిలేసిందని విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించామని.. నేడు కనీసం ఆ తాగునీటి సరఫరాను నిర్వహించడం కూడా చేతకావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. -
సమయపాలన పాటించాలి
కలెక్టర్ ప్రావీణ్య ఆదేశంసంగారెడ్డి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మెడికల్ కాలేజీ, సంగారెడ్డి, జోగిపేట నర్సింగ్ కళాశాలలు, టీ–హబ్, , జోగిపేటలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు, అవసరమైన వైద్య పరికరాలు తదితర అంశాలపై సమీక్షించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అలాగే అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ భవన ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని టీజీఎంఐడీసీ ఈఈ రవీందర్ రెడ్డికి ఆదేశించారు. జోగిపేటలో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంత్ రావు, అధికారులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు సంగారెడ్డి జోన్: వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పట్టణంలోని మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా మహిళా సంక్షేమ అధికారి లలిత కుమారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ వనజా రెడ్డి పాల్గొన్నారు. -
నవజాత శిశువు మరణాలు తగ్గించాలి
సంగారెడ్డి: నవజాత శిశువుల మరణాల సంఖ్యను తగ్గించాలని జిల్లా వైద్యాధికారి వసంతరావు అధికారులకు సూచించారు. సోమవారం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా డీసీహెచ్ఎస్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రోగ్రాం ఆఫీసర్తో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో నవజాత శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి 1,000 జననాల్లో 18 మంది నవజాత శిశువులు మరణిస్తున్న సంఖ్యను 10 వరకు తగ్గించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ డాక్టర్ షరీఫ్, ఏరియా హాస్పిటల్ సూపరి ంటెండెంట్, పీడియాట్రీషియన్స్, గైనకాలజిస్ట్, డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ శశాంక్ పాల్గొన్నారు. -
పండ్లసాగుపై అధ్యయన పర్యటన
సంగారెడ్డి: మాల్దీవులకు చెందిన 30 మంది పాలన అధికారులు ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ (ఎఫ్ఆర్ఎస్)ను సోమవారం సందర్శించారు. వారు భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, మాల్దీవుల ప్రభుత్వం ఆధ్వర్యంలో , జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ( ఎన్ఐఆర్డి ) సహకారంతో నిర్వహించిన అధ్యయన పర్యటనలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు.. మామిడి, జామ, సీతాఫలం ఇతర పండ్ల సాగు విధానాలు, వాటికి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే నర్సరీలో మొక్కల పెంపకం, అంటుకట్టు పద్ధతులపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త కె.వెంకటలక్ష్మి, శాస్త్రవేత్తలు పి.హరికాంత్, కె.మౌనిక, బి.నవీన్ కుమార్, శిరీష, అరుల్ రాజ్ పాల్గొన్నారు.ఎఫ్ఆర్ఎస్ను సందర్శించిన మాల్దీవుల బృందం -
చిట్కుల్లో వక్ఫ్ భూముల సర్వే
చిలప్చెడ్(నర్సాపూర్): వక్ఫ్ భూమిలో ఓ ముస్లిం కుటుంబం ఇంటిని నిర్మించుకోవడం దుమారం లేపింది. దాంతో గ్రామంలోని పలువురు ముస్లింలు వక్ఫ్ బోర్డులో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మండలంలోని చిట్కుల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... వక్ఫ్ భూమిలో ముస్లిం కుటుంబం నిర్మించుకుంటున్న ఇంటి బేస్మెంట్ను రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేశారు. దాంతో సదరు కుటుంబ సభ్యుడు, గ్రామంలోని 49, 50, 163 సర్వేలో గల వక్ఫ్ భూమిలో నిర్మాణాలు జరిగాయని అధికారులకు ఫిర్యాదు చేయడంతో వక్ఫ్ సర్వే అధికారులు సోమవారం సర్వేకు వచ్చారు. విషయం తెలిసిన గ్రామస్తులు సర్వే చేయనివ్వమని, చాలా ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామని.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వక్ఫ్ అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వేకు మాత్రమే వచ్చామని, హద్దులు మాత్రమే గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. గ్రామస్తులు ఇబ్బందులు ఉండవని వక్ఫ్ ఇన్స్పెక్టర్ సాబేర్ హుస్సేన్ తెలపడంతో సర్వేకు అంగీకరించారు. అనంతరం రెవెన్యూ అధికారుల సహాయంతో వక్ఫ్ అధికారులు సర్వే చేశారు. కాగా పంచనామా పత్రంపై సంతకాలు చేసేందుకు గ్రామస్తులు నిరాకరించడంతో అధికారులు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ సర్వేయర్ షుజాత్ అలీఖాన్, తహసీల్దార్ సహాదేవ్, ఆర్ఐ సునీల్సింగ్, ఇన్చార్జి సర్వేయర్ అభిలాష్, కార్యదర్శి తిరుపతి, జీపీఓ రాధాకృష్ణ, సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ అఖిల్, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్వే చేయొద్దని గ్రామస్తుల వాగ్వాదం హద్దులు మాత్రమే గుర్తిస్తాం: వక్ఫ్ ఇన్స్పెక్టర్ -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): గ్రూప్ –1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు స్థానిక టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, డిగ్రీ పూర్తి చేసి రూ.3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ పరీక్ష ఉంటుందని, మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి రెసిడెన్షియల్తో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ 91822 20112లో సంప్రదించాలన్నారు. వినయ్ పవార్కు అవార్డుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్కు చెందిన ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవార్కు జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ప్రైడ్ ఆఫ్ భారతరత్న అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వినయ్ పవార్కు మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్, ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలుడితో పనులు..దుకాణదారుడిపై కేసు సంగారెడ్డి క్రైమ్: బాల కార్మికుడితో పని చేయిస్తున్న దుకాణదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామానాయుడు వివరాల ప్రకారం... శాంతినగర్ కాలనీలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బాల కార్మికుడిని పనిలో పెట్టుకొని అతడితో పని చేయిస్తున్నట్లు గుర్తించారు. ఆ యజమానిపై కేసు నమోదు చేసి, బాలుడిని బాలల సంరక్షణ గృహానికి తరలించారు. కంటైనర్ను ఢీకొట్టిన కారు● కారు డ్రైవర్కు స్వల్పగాయాలు ● బెలూన్ తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదంమునిపల్లి(అందోల్): కంటైనర్ను కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు డ్రైవర్ మద్యం మత్తులో ముందు వెళ్తున్న కంటైనర్ను ప్రక్క నుంచి ఢీకొట్టాడు. కారు బెలూన్ తెరుచుకోవడంతో కూకట్పల్లికి చెందిన కారు డ్రైవర్ కిశోర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదే సమయంలో కారును తప్పించబోయి మరో భారీ కంటైనర్ రోడ్డు డివైడర్ను దాటి అవతల రోడ్డుపై నిలిచిపోయింది. కాగా రెండు వాహనాల డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కంటైనర్, కారును జేసీబీతో రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
రైస్మిల్లుపై విజిలెన్స్ దాడులు
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని రైస్మిల్లులపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర విజిలెన్స్ టీం అధికారులు సోమవారం ఉదయం సూరారం నుంచి అశోక్ లేలాండ్ ఆటోలో తీసుకొచ్చిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం కొంతన్పల్లిలోని శ్రీ ఆంజనేయ రైస్మిల్లులో అన్లోడింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. అనంతరం రైస్మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పండరి, జిల్లా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నర్సింలు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా మొత్తం కలిపి 204 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తెచ్చిన లింగం గుప్తా, ఆటో డ్రెవర్ రామస్వామి, రైస్మిల్ యజమాని సత్యంపై కేసు నమోదు చేశారు.204 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
పటాన్చెరు టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసి, 92 కిలోలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పటాన్చెరు పోలీస్స్టేషన్లో రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఓఆర్ఆర్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో పటాన్చెరు, ఎస్ఓటీ పోలీసులు ఆదివారం సాయంత్రం ముత్తంగి డివిజన్ పరిధిలోని టోల్ ప్లాజా సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు వాహనాలను తనిఖీ చేశారు.92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, మహారాష్ట్ర, సోలాపూర్కు చెందిన సచిన్ గంగారాం మారుతి చవాన్, మహేశ్ రవీంద్ర, విజయ్ చవాన్లను అరెస్టు చేశారు. గంజాయి విలువ సుమారు రూ. 46 లక్షలు ఉంటుందని తెలిపారు. విచారణలో గంజాయిని ఒడిశాలోని పరలా ఖేముడి ప్రాంతానికి చెందిన జాఫర్ సరఫరా చేస్తుండగా, మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన అజిత్ తరలిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. పట్టుబడిన ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులను సైబరాబాద్ సీపీ అభినందించారు. సమావేశంలో సీఐ వినాయక్ రెడ్డి , క్రైమ్ సీఐ రాజు, ఎస్ఐలు ఆసిఫ్ అలీ, మహేశ్వర్ రెడ్డి, రాజు, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు. 92 కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు నిందితుల రిమాండ్ -
బాలలను బడికి పంపించాలి
మెదక్ మున్సిపాలిటీ: బాలలను బడికి పంపేలా ప్రోత్సహించాలని, కార్మికులుగా మార్చొద్దని అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్ స్మయిల్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి జిల్లాలో చేపట్టిన కార్యక్రమానికి అన్ని శాఖల సమన్వయం బాగుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ స్మయిల్ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్ -
ప్రజల సహకారంతోనే..
తడి, పొడి చెత్త సేకరణలో గ్రామ ప్రజల సహకారం బాగుంది. సేంద్రియ ఎరువు ప్రస్తుతం క్వింటాళ్ల కొద్దీ అందుబాటులో ఉంది. వనమహోత్సవంలో నాటిన మొక్కలకు ఈ ఎరువును వేస్తున్నాం. కిలోకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాం. రైతులు తీసుకెళ్లేందుకు వస్తున్నారు. – స్వరూప, పంచాయతీ కార్యదర్శి, కట్కూర్ చెత్త నుంచి సంపద సృష్టిస్తూ కట్కూరు గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసి రైతులకు విక్రయిస్తూ ఆదాయాన్ని గడిస్తుంది. – అక్కన్నపేట(హుస్నాబాద్):ఇంట్లో చెత్త పోగైందంటే ఏం చేస్తాం..డబ్బాలో తీసుకెళ్లి బయటపడేస్తాం. చెత్తే కదా అని తీసిపారేయాల్సిన అవసరం లేదు. దాన్ని తడి,పొడిగా వేరు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అక్కన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామ అధికారులు, సిబ్బంది నిరూపిస్తున్నారు. ఉదయం ఇంటింటికీ తిరుగుతూ అధికారులు, పాలకవర్గ సభ్యులు చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందు కోసం గ్రీన్ డబ్బాలో తడి, బ్లూ డబ్బాలో పొడి చెత్తను సేకరిస్తున్నారు. దీనిపై ప్రతి వారం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. తడి చెత్త(కూరగాయలు, కడిగిపారేసిన ఆకుకూరలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరలు) నుంచి ఎరువును తయారు చేస్తున్నారు. దీంతో కట్కూర్ స్వచ్ఛ గ్రామంగా మారుతుండటంతో పాటు ఆదాయాన్ని సృష్టించుకుంటూ జిల్లాలోని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.క్వింటాళ్ల కొద్దీ తయారీ.. మండలంలో మొత్తం 38 గ్రామాలు ఉండగా అందులో కట్కూర్ గ్రామం సేంద్రియ ఎరువుకు కేరాఫ్ అడ్రస్గా పిలుచుకుంటున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 3,512 ఉంటుంది. 1,030 ఇళ్లు ఉండగా 10వార్డులు ఉన్నాయి. ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అయితే, ప్రతి మంగళవారం వారాంతపు సంత నిర్వహించగా, కుళ్లిన కూరగాయలు, పడేసిన ఆకుకూరలను తీసుకెళ్లి డంప్యార్డులోని వర్మీ కంపోస్ట్లో నిల్వ చేస్తారు. 45రోజుల తర్వాత సేంద్రియ ఎరువుగా మారుతుంది. ప్రస్తుతం నాలుగు క్వింటాళ్ల వరకు ఎరువు అందుబాటులో ఉంది. కాగా సుమారు 2క్వింటాళ్ల వరకు కిలో రూ.10 చొప్పున విక్రయించగా రూ.1,500 వరకు ఆదాయం వచ్చింది. ఇదే ఎరువును గ్రామంలో వనమహోత్సవంలో నాటిన మొక్కలకు వేస్తున్నారు. అలాగే మిగిలిన ఎరువును విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. -
మూత్ర విసర్జనకు వెళ్లి..
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కొల్చారం(నర్సాపూర్): మూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామపంచాయతీ వడ్డెర కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ వివరాల ప్రకారం... కాలనీకి చెందిన ముద్దంగుల నర్సింహులు(43) రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో మూత్ర విసర్జనకు గ్రామంలోని పోచమ్మ గుడి వెనకాల ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నర్సింలును మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి జరిమానసిద్దిపేటకమాన్: డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడిన వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి సిద్దిపేట కోర్టు జరిమాన విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో 15మంది మద్యం తాగి, 17మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.2,38,500 జరిమాన విధించారు. -
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
నంగునూరు(సిద్దిపేట): అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి మనసు కలిచివేసిందని, ఎవరు అఘాయిత్యాలకు పాల్పడవద్దని రోడ్డు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ఘణపూర్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఎల్ల రాజిరెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి పరామర్శించారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అప్పుల పేరిట రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. తమది పేదల ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యం అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.16 వందల కోట్ల ఎల్ఓసీ అందజేయగా, తాను రూ.20 కోట్లు ఇప్పించానన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు పెంచామని, ఎవ్వరూ అధైర్య పడొద్దన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేలా చూడాలని ఆర్డీఓ సదానందంను ఆదేశించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి తోపాటు అదే గ్రామానికి చెందిన ఎల్ల రాములు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున అందజేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా -
‘శ్రమశక్తి నీతి’ రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములుసంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులకు వ్యతిరేకమైన శ్రమశక్తి నీతి – 2025ను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో జరిగిన సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన ‘శ్రమశక్తి నీతి 2025 కార్మికుల కోసమా? యజమానుల కోసమా?‘ అనే బుక్లెట్ను ఆవిష్కరించారు. అనంతరం చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చేందుకే శ్రమశక్తి నీతి 2025 తీసుకొచ్చిందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, ఉపాధ్యక్షుడు మాణిక్యం, కోశాధికారి కె.రాజయ్య, ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, ప్రవీణ్, నాగేశ్వరరావు, బాగారెడ్డి, సహాయ కార్యదర్శులు మైపాల్, యాదగిరి, విద్యాసాగర్, సురేశ్, యశోద, మంజుల పాల్గొన్నారు. -
సత్ఫలితాలిచ్చిన దుప్పట్ల సేకరణ
● సంక్షేమ హాస్టళ్లకు 2,498 పంపిణీ ● దాతలకు కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్మెదక్ కలెక్టరేట్: సంక్షేమ హాస్టళ్లలోని పేద విద్యార్థు ల సంక్షేమానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని మెదక్ కలెక్టర్ రాహురాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్స రం సందర్భంగా తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ హాస్టళ్లలోని పేద విద్యార్థుల కోసం దుప్పట్లు తీసుకురావాలని పిలుపునివ్వడంతో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 2,498 దుప్పట్లు అందజేయగా.. వాటిని జిల్లాలోని 17 బీసీ, 6 ట్రైబల్ సంక్షేమ హాస్టళ్లలోని 2,488 మంది విద్యార్థులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. -
కుమ్మరులు ఐక్యంగా ఉండాలి
రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావుప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని కుమ్మరుల అభివృద్ధికి రాష్ట్ర కుమ్మరుల సంఘం అధ్యక్షుడు జయంత్రావు అన్నారు. ఆదివారం రంగదాంపల్లి వద్ద ప్రధాన కార్యదర్శి దయానంద్తో పాటు ఆయనకు జిల్లా కుమ్మరుల సంఘం సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కుమ్మరులంతా ఐక్యంగా ఉండాలన్నారు. అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, యాదయ్య, అశోక్, తరిగొప్పుల రామచంద్రం, దరిపల్లి బాలచంద్రం, వరికోలు రాజలింగం, మూడపల్లి భూమయ్య, ఆంజనేయు లు, రమేశ్, కుకునూరుపల్లి రమేశ్, చందు, వెంకటేశ్, తిమ్మాపురం శేఖర్ పాల్గొన్నారు. -
ధర్మ స్థాపనతోనే లోకం సుభిక్షం
హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీసిద్దిపేటజోన్: సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ధర్మ స్థాపన ద్వారానే లోకం సుభిక్షంగా ఉంటుందని అఖిల భారత హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీ జీ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య భవనంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....లోక కళ్యాణార్థం సమాజం సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో కోటి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పం చేపట్టినట్టు పేర్కొన్నారు. విజయవాడ లో హనుమాన్ దేవాలయ పునః ప్రతిష్ట జరుగుతుందని వివరించారు. హనుమాన్ వైభవం అందరి కి అందాలనే సంకల్పంతో 108 గ్రామాల సందర్శన చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 25న రథ సప్తమి సందర్భంగా కండ్లకోయ ఆశ్రమంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి 108 గ్రామాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామ, హనుమాన్ దీక్ష కమిటీ ప్రతినిధులు పరమేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
యువత స్కిల్స్ నేర్చుకోవాలి
యువత చదువు మాత్రమే కాకుండా, స్కిల్స్ నేర్చుకోవాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్యోజన లాంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిని యువత సద్వినియోగం చేసుకుని, ఉద్యోగాలు సాధించాలి. – రంజిత్రెడ్డి, మై భారత్ మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి యంగ్ లీడర్ ప్రజెంటేషన్కు ఎంపికయ్యా వికసిత్ భారత్లో భాగంగా ఆన్లైన్లో నిర్వహించిన యంగ్ లీడర్ డైలాగ్కు ఎంపికయ్యాను. సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని ఎదుట ప్రసంగించనున్నాను. నేను ప్రస్తుతం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాను. –సాయి కిరణ్ సిద్దిపేట, యంగ్ లీడర్ డైలాగ్ సభ్యుడు -
బగలాముఖిని దర్శించుకున్న ప్రముఖులు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠాన్ని ఆదివారం రాష్ట్ర హైకోర్టు లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పంచాక్షరీ దర్శించుకున్నారు. కార్యదర్శితో పాటు నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి హేమలత పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేసి శక్తిపీఠం విశిష్టత గురించి వారికి వివరించారు. కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదునంగునూరు(సిద్దిపేట): ఎమ్మెల్యే హరీశ్రావు ఫ్లెక్సీని దగ్ధం చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులపై ఆదివారం బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట పోలీస్ కమిషనర్తోపాటు రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం నంగునూరులో విలేకరులతో మాట్లాడుతూ... నర్మేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ మంజూరుకు కృషి చేసిన హరీశ్రావు ఎమ్మెల్యే హోదాలో పనులను పరిశీలించాడని తెలిపారు. కానీ, కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని చాటుకునేందకు చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలపోచయ్య, నాయకులు రమేశ్గౌడ్, భిక్షపతి, మల్లయ్య, కనకయ్య, మహేందర్గౌడ్, శ్రీధర్, పర్శరాములు, రాజేందర్, మహేందర్ పాల్గొన్నారు. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని రాజ్పేట గంగమ్మవాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు.. పోలీసులు, సిబ్బంది వెళ్లి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాపర్ వైరు చోరీ మద్దూరు(హుస్నాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైరును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మారెళ్ల లక్ష్మారెడ్డి రోజు మాదిగానే ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా అక్కడ 16కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి అందులోని కాపర్ వైరును ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో రైతు విద్యుత్ శాఖ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా మండలోని పలు గ్రామాల్లో దొంగలు ట్రాన్స్ఫార్మర్ను పగులకొట్టి కాపర్ వైరును ఎత్తుకెళ్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు. వన్య ప్రాణుల వేటగాళ్లపై ఉక్కుపాదం దుప్పి మాంసం స్వాధీనం రామాయంపేట(మెదక్): మెదక్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని వన్య ప్రాణులను వేటాడుతున్న వారిపై ఆ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం కాట్రియాల శివారులో వన్య ప్రాణులను వేటాడుతున్న మహిళలతోపాటు కొందరి వద్ద రెండు బైక్లతోపాటు వలలను మెదక్ డిప్యూటీ రేంజ్ అధికారి ఖుత్బుద్ధీన్ స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో... దంతేపల్లి గ్రామ శివారులో దుప్పిని వేటాడి దానిని హతమార్చిన ఘటనలో అధికారులు గ్రామంలోని ఒక వ్యక్తి ఇంట్లో దాచిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ఇది తెలుసుకున్న మిగతావారు పారిపోయారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, హతమార్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆలయాల పరిరక్షణకు కేంద్రం కృషి
● ఎంపీ రఘునందన్రావు ● కూడవెల్లి జాతర ఏర్పాట్ల పరిశీలనదుబ్బాక: దేశంలో ఆలయాల పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆదివారం అక్భర్పేట–భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన కూడవెల్లి జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో ప్రఖ్యాతి గాంచిన శివాలయాలను పునరుద్ధరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం వసతులు సమకూరుస్తామన్నారు. ఆలయాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు భానుప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు సాకేత్శర్మ తదితరులు ఉన్నారు. బ్యాట్ పట్టి.. బంతిని కొట్టి.. మిరుదొడ్డి(దుబ్బాక): నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మిరుదొడ్డిలో జరిగిన ఐఎంసీ ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను మెదక్ ఎంపీ రఘునందన్రావు తిలకించారు. ఆటవిడుపుగా క్రికెట్ బ్యాట్ పట్టి బంతులను పరుగులు పెట్టిస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దీంతో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. -
గురుకులం పిలుస్తోంది
ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం ● ఫిబ్రవరి 22న పరీక్ష ● ఈ నెల 21 దరఖాస్తుకు ఆఖరి తేదీ ● ఉమ్మడి జిల్లాలో 80 పాఠశాలలు సంగారెడ్డి క్రైమ్: ప్రభుత్వ గురుకులాలకు 2026–2027 విద్యా సంవత్సరానికి గాను సర్కారు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రవేశ పరీక్షలో మార్కుల ప్రాతిపాదికన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 21 వరకు దరఖాస్తులకు చివరి తేదీ, ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు కామన్ ఎంట్రన్స్ పరీక్షకు అర్హులు. అలాగే ప్రస్తుతం 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు పొందవచ్చు. అర్హులైన విద్యార్థులు మీసేవ లేదా ఆన్లైన్ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 80 గురుకులాలు..7 వేల సీట్లు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక గురుకుల్లో కలిపి మొత్తం 80 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతిలో 7 వేలకు పైగా సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 300నుంచి 500పైగా సీట్లను భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు గురుకుల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి అడ్మిషన్ కల్పిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు టీజీఎస్డబ్ల్యూఆర్ఈ ఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకులాలకు ఎంపి క చేస్తారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, కాస్మోటిక్ చార్జీలు తదిత ర సౌకర్యాలు కల్పిస్తారు. కావల్సిన ధ్రువీకరణ పత్రాలు గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ బోనఫైడ్తో పాటు ప్రస్తుత పాస్ఫొటో, ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. పట్టణ ప్రాంతాల వారి ఆదాయం రూ. రెండు లక్షల లోపు ఉండాలి. అలాగే అర్బన్(గ్రామీణ) ప్రాంతాల వారి ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్లో పరీక్ష దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. అనంతరం ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్క దరఖాస్తుకు ఒక ఫోన్ నంబర్ మాత్రమే పని చేస్తుంది. అభ్యర్థులకు సూచనలు సద్వినియోగం చేసుకోవాలి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు గురుకుల పరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. – రాజేశం, రీజినల్ కోఆర్డినేటర్, ఉమ్మడి మెదక్ జిల్లా -
భిక్షాటన కోసం వచ్చి ..
పిలిచి అన్నం పెడితే రూ.20 వేలు అపహరణ వట్పల్లి(అందోల్): భిక్షాటన కోసం వచ్చి చోరీ చేశాడు. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వని అంజయ్య ఇంటికి భిక్షాటనకు ఓ స్వామి వచ్చాడు. ఆ సమయంలో ఆయన కోడలు, మనుమరాలు మాత్రమే ఉన్నారు. తాను సమ్మక్క, సారలమ్మ నుంచి వస్తున్నానని నమ్మబలికాడు. తనకు ఆకలిగా ఉందని అన్నం పెట్టాలని కోరడంతో.. ఇంట్లో ఉన్న ఓ కుర్చీని తీసుకువచ్చి వేశారు. ఆ సమయంలో కుర్చీ కాలులో ఉన్న రూ.20 వేల నగదును చూసి వెంటనే సంచిలో వేసుకొని, ఎవరికి అనుమానం రాకుండా వారిచ్చిన రొట్టె తిని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన అంజయ్య కుర్చీ బయట కనబడటం చూసి ఒక్కసారిగా అవాక్కయాడు. పంట పెట్టుబడికి తెచ్చిన డబ్బులు కుర్చీ కాలులో దాచానని, ఇంట్లోకి వెళ్లి చూడగా డబ్బులు కనిపించలేదు. కుటుంబీకులు విషయం చెప్పగా... దొంగ స్వామికోసం వెతికాడు. అప్పటికే తాను తెచ్చుకున్న బైక్పై స్వామి ఉడాయించాడు. రైతు ద్విచక్ర వాహనంపై వెంబడించినా ఆచూకీ లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. పచ్చని చెట్టుపై గొడ్డలివేటుసంగారెడ్డి క్రైమ్: పలు గ్రామాల ప్రధాన రోడ్ల వెంట ఉన్న హరితహారం చెట్లను నరికివేస్తున్నారు. పట్టణంలోని కల్వకుంట నుంచి చిమ్నాపూర్ వెళ్లే ప్రధాన దారిలో అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. వాటిని ఇష్టానుసారంగా నరికేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణంలో ఏ చెట్టును నరికినా అధికారులు జరిమాన విధించేవారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలి
పెర్కిట్(ఆర్మూర్): రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో నిర్వహించి 70వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జట్టుకు, బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా జట్టుకు ఎమ్మెల్యే ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆశిరెడ్డి కుంట కట్ట ధ్వంసం..
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులువట్పల్లి(అందోల్): భూముల విలువ పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చెరువులు, కుంటల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. అందోల్ మండల పరిధిలోని రాంసాన్పల్లి శివారులో గల ఆశిరెడ్డి కుంట సుమారుగా 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. కుంట శిఖం భూమిలో పట్టాలు కలిగి ఉండటంతో కొనుగోలు చేసిన రియల్ వ్యాపారి దర్జాగా పట్టపగలే కుంట కట్టను ధ్వంసం చేసి సాగుచేసే పనులు చేస్తున్నాడు. కుంటను ధ్వంసం చేయడంపై చుట్టు పక్కల రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా తన పట్టా భూమి అని, తాను ఏమైనా చేసుకుంటానని సదరు రియల్ వ్యాపారి అంటున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. వారం రోజులుగా కుంట కట్టను ధ్వంసం చేసే పనులు చేస్తున్నా.. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కుంటల ఆక్రమణ, ధ్వంసం వంటి ఘటనలపై పత్రికల్లో కథనాలు వస్తే తప్ప ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కూడా చూడటం లేదని పలువురు చెబుతున్నారు. అధికారులు వెంటనే కుంట కట్ట ధ్వంసంపై చర్యలు చేపట్టి పరిరక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
వివేకమే స్ఫూర్తిపథం
● వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి ● సేవా కార్యక్రమాల్లో యువకులు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 980 సంఘాలు యువత తమ విలువైన సమయాన్ని వృథా చేయకుండా, ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటే అనుకున్న గమ్యాన్ని నిర్ణిత సమయంలో సాధించవచ్చన్న వివేకానందుడి మాటలు నిజం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. సోషల్ మీడియాలో అధిక సమయం , ఆన్లైన్ గేమ్లతో కాకుండా, మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి, సమాజ సేవకు సమయం కేటాయించాలి. దేశ అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంది. నేడు స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) /సంగారెడ్డి టౌన్ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 980 యువజన సంఘాలుండగా ఇందులో 14,700 మంది యువత సభ్యులుగా ఉన్నారు. వీరందరూ జిల్లాలో ప్రజాహిత, ప్రత్యేక సేవా కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా, విద్యార్థులు, యువతలో దేశ భక్తి పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గత ఆక్టోబర్ నుంచి ఆన్లైన్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా యంగ్ లీడర్ డైలాగ్ ఎంపికలు జరిగాయి. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వీరు నేడు ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్రమోదీ ఎదుట తమ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు. ప్రపంచానికి భారతదేశ ఆధ్యాత్మిక విలువలను చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు యువకుల్లో చైతన్యం నింపుతాయి. అందుకే ఆయన జయంతి రోజైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని అడుగు ముందుకు వేస్తున్నారు కొంతమంది యువకులు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం.. ఇలా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ పలువురికి స్ఫూర్తిని రగిలిస్తున్నారు. -
యూత్పార్లమెంట్లో ప్రతిభ
ఎనిమిది మంది వర్గల్ విద్యార్థులకు ఢిల్లీలో బహుమతులుఆదినాథ్వైశాలిరామ్చరణ్ అభినవ్ బెన్హర్పాల్ శ్రీమణి నక్షత్ర వైష్ణవివర్గల్(గజ్వేల్): యూత్పార్లమెంట్ పోటీలో చక్కని ప్రతిభతో ఎనిమిది మంది ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు బహుమతులకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. గత ఫిబ్రవరి నెలలో మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో నిర్వహించిన 26వ జాతీయస్థాయి యూత్ పార్లమెంట్ పోటీలో వర్గల్ విద్యార్థులు పీ వైష్ణవి, అభినవ్, కే వైశాలి, బెన్హర్పాల్, రామ్చరణ్, పీ శ్రీమణి, ఆదినాథ్, టీ నక్షత్ర బహుమతులకు ఎంపికైనట్లు వివరించారు. ఈనెల 15న న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి అర్జున్రామ్ మేఘవల్ నుంచి వీరు బహుమతులు అందుకోనున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మలారెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు ఆధ్వర్యంలో పట్టణంలోని వీరబద్రియ కుల సంఘం ప్రజలు ఆదివారం టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గృహాజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ గృహా నిర్మాణ పథకం వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో వీరబద్రియ సంఘం భవన నిర్మాణానికి నిధులు, స్మశాన వాటిక స్థలం మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, వీరబద్రీయ కులసంఘం అద్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు.టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మలారెడ్డి -
రిజర్వేషన్ టెన్షన్
జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం అవుతుండగా, మరోవైపు కౌన్సిలర్, చైర్మన్ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదల కాగా, సోమవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను పురపాలక శాఖ పూర్తి చేయనుంది. దీంతో ఆశావాహులు, చైర్మన్, కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్ ఎలా ఉంటుందనే విషయమై అంచనాలు వేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా, ఏయే వార్డులు ఎవరెవరికి రిజర్వు అయ్యే అవకాశం ఉంటుందనే దానిపై ఇప్పటినుంచే లెక్కలు వేస్తున్నారు. చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు మాత్రం రిజర్వేషన్ల ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. జనాభా ఆధారంగా మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డుల రిజర్వేషన్లను జనాభా ఆధారంగా ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభాలో వాటా ప్రకారం స్థానాలు కేటాయిస్తారు. బీసీ రిజర్వేషన్లను కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా లెక్కిస్తారు. ఆపై జనరల్ స్థానాలను కూడా గుర్తిస్తారు. అన్ని కేటగిరీలలో మహిళలకు 50% స్థానాలను కేటాయిస్తారు.ఎన్నికల సంఘం కసరత్తు మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలు ఇవ్వడంతో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేశారు. ఈ నెల 12 ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. తదనంతరం చేపట్టాల్సిన చర్యలపై సైతం పురపాలక శాఖ దృష్టి సారించింది. -
నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బల్దియా డివిజన్ల ఏర్పాటులో శాసీ్త్రయత లోపించిందని 1.20లక్షల ఓటర్లున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కేవలం రెండు డివిజన్లనే ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయలను ప్రతిబింబించేలా మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయాలని..లేనిపక్షంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేట గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు. వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అఖిలపక్ష బృందం సభ్యులు పాల్గొన్నారు. బడుగులకు అండగా ఉండాలినారాయణఖేడ్: అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజా సంఘాలు పరస్పరం సహకరించుకుంటూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఖేడ్లో అంబేడ్కర్ ఫూలే సేవాసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పండరి, రక్షణశాఖ సంఘం నాయకులు గోపాల్ నాయక్, లక్ష్మణ్, రెవిన్యూశాఖ సంఘం నాయకులు సుభాష్ తదితరులతో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చాలా సంఘాలు తమతమ హక్కుల సాధన కోసమే పనిచేస్తున్నాయన్నారు. సామాజిక కోణంలో పేదలకు సహాయ, సహకారాలు అందించడానికి శ్రద్ధచూపాలని కోరారు. అన్నిశాఖల ఉద్యోగులు వేతనంలో అయిదు శాతం సమాజాభివృద్ధికి కేటాయించాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలి: పద్మసంగారెడ్డి: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు పద్మ పిలుపునిచ్చారు. వైయస్సార్ భవన్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి పద్మ హాజరై మాట్లాడారు. పట్టణ, మండల అధ్యక్షుల కమిటీ వేయాలని కోరారు. మహిళా కమిటీలను బలోపేతం చేయాలన్నారు. బీసీ సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి అనురాధగౌడ్ మాట్లాడుతూ..త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలుచేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటినిర్మాణానికి ఇందిరమ్మ పథకం కింద రూ.5లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్, ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడిదలలో రక్తదాన శిబిరంజిన్నారం (పటాన్చెరు): స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా గుమ్మడిదల పట్టణ కేంద్రలో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నగరానికి చెందిన నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తలసేమియా వ్యాధి పిల్లలకు, గర్భిణీల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సినీ నటి కరాటే కల్యాణి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసిన యువకులను, చైర్మన్ ఉదయ్ కుమార్ను వారు అభినందించారు. -
లక్ష్యం చేరుకునేనా!
ఆయిల్పామ్ సాగు లక్ష్యం 3,750 ఎకరాలు సంగారెడ్డి జోన్: ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్పామ్ పంటకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈసారి ఆ పంట విస్తీర్ణం 3,750 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో మూడు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతోంది. లక్ష్యంగా నిర్ణయించుకున్న 3,750 ఎకరాల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1,300 ఎకరాల్లో సాగులో ఉండగా మిగతా 2,450 ఎకరాలు మార్చి చివరి నాటికి సాగు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంట సాగుకు ప్రోత్సాహకాలు పంటను సాగు చేసేందుకు ప్రతీ ఎకరాకు రైతుకు రూ.50లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రోత్సాహకరంగా అందిస్తున్నారు. మొదటి ఏడాది డ్రిప్ కోసం రూ.21,600, మొక్కలు నాటేందుకు రూ. 11,600 రాయితీ ఇస్తున్నారు. అంతర పంటలు సాగుకు నాలుగేళ్ల పాటు ప్రతీ ఏటా రూ.4,200 అందిస్తున్నారు. నాలుగో ఏట నుంచి దిగుబడి ఒక ఎకరాకు 57 ఆయిల్పామ్ మొక్కలు నాటుతున్నారు. మొదటి నాలుగేళ్లు అంతర పంటగా అన్ని రకాల పంటలు సాగు చేసుకునే సౌకర్యం ఉంది. పంట వేసిన నాలుగో ఏట నుంచి 30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. జిల్లాలో 2023–24 నుంచి సాగు అవుతుంది. మరో నాలుగు నెలల్లో పంట దిగుబడి ప్రారంభం కానుంది. త్వరలో ఆయిల్ యూనిట్ ఏర్పాటు సాగు చేసిన పంట కొనుగోలు చేసి గెలల నుండి ఆయిల్ తయారు చేసేందుకు జిల్లాలో ఉత్పత్తి యూనిట్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంతంలో నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యూనిట్ ప్రారంభమైతే జిల్లాలో సాగు చేసే పంటకు మరింత డిమాండ్ పెరగనుంది. టన్నుకు రూ.19,860 ధర ఆయిల్ పామ్ పంట గెలలు టన్నుకు రూ.19,860లు ధర ఉంది. సంబంధిత గోద్రెజ్ కంపెనీ నేరుగా రైతు వద్దకు వచ్చి గెలలను కొనుగోలు చేస్తారు. పంటకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.పొట్టి పల్లి లోని ఆయిల్ పామ్ నర్సరీ నర్సరీలో రెండు లక్షల మొక్కలు ఆసక్తి ఉన్న రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు జిల్లాలో ఝరాసంగం మండల పరిధిలోని పొట్టి పల్లి గ్రామ శివారులో నర్సరీని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం 2 లక్షలకు పైగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. -
ఇక చెంతనే ఆహ్లాదం
శరవేగంగా అర్బన్ పార్క్ పనులు ● ఖేడ్ పట్టణ శివారులో నిర్మాణం● తీరనున్న ఏళ్లనాటి కల ● రూ.3.90కోట్ల వ్యయంతో ఏర్పాట్లు అర్బన్ పార్కులో వేసిన రోడ్డు, అటవీ ప్రాంతంలా పచ్చని చెట్లు పట్టణంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల వాసులకు వారాంతంలో ఆహ్లాద వాతావరణంలో కుటుంబంతో గడిపేందుకు సకల సదుపాయాలతో అర్బన్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఖేడ్, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల తీరనుంది. నారాయణఖేడ్: పట్టణీకరణ పెరిగిపోవడం, పట్టణంతోపాటు సమీప గ్రామాల వారికి కనీసం కుటుంబం, పిల్లలతో కొంతసేపు ఉల్లాసంగా గడుపుదామన్నా ఎలాంటి సదుపాయాలు ఖేడ్లో లేవు. ఆ ఇబ్బందులు ఇక తీరనున్నాయి. నారాయణఖేడ్కు మూడు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్ వద్ద అటవీశాఖకు చెందిన సుమారు 350 ఎకరాల అటవీ ప్రదేశంలో అర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. రూ.3.90కోట్లతో నిర్మాణం చేపట్టనున్న ఈ అర్బన్ పార్కుకు మొదటి విడతగా రూ.90లక్షలు విడుదలయ్యాయి. వాటితో ఇప్పటికే పలు పనులను అధికారులు చేపట్టి ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పూర్తి సౌకర్యాలు.. అర్బన్ పార్కులో ఎనిమిది కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్, అటవీ ప్రాంతంలోపల రోడ్డు సదుపాయం, 45 అడుగుల ఎత్తున వాచ్టవర్, రెండు గజబో(పగోడ), రెండు ఓపెన్ జిమ్స్ నిర్మించనున్నారు. ఇదివరకే రెండు కుంటలు నిర్మించి ఉండటంతో అందులో నీటి సదుపాయం ఉంది. పశు పక్ష్యాదులు, అడవి జంతువులకోసం ఐదు సాసర్పిట్స్, పార్కుకు వచ్చే ప్రజల కోసం షెల్టర్, గార్డు రూమ్, టాయ్లెట్స్, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. ఎండ ఉండే సమయాల్లో ఎప్పుడూ నీరు వచ్చేలా సోలార్ బోరు డ్రిల్లింగ్ చేయనున్నారు. 36 రకాల మొక్కలతో ఖాళీ అటవీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. చెక్డ్యామ్ల నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. బోటింగ్ సదుపాయంతోపాటు సీతాకోక చిలుకల కోసం బట్టర్ఫ్లై గార్డెన్, ఔషధ రకాల మొక్కల పెంపకం, యోగ షెడ్ తదితరాల నిర్మాణాలు చేపడుతున్నారు. పార్కులో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుంది. త్వరలో అందుబాటులోకి.. పట్టణవాసులతోపాటు చుట్టుప్రక్కల ప్రజల సౌకర్యార్థం ఏళ్లనాటి కలగా ఉన్న అర్బన్పార్కు ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేశాను. అర్బన్ పార్కులో పనులు ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు సూచించాం. తొలివిడత విడుదలైన నిధులతో పలు పనులు కొనసాగుతుండగా త్వరలో మరిన్ని నిధులు కూడా విడుదల కానున్నాయి. వాటితో పార్కు నిర్మాణం పూర్తి చేస్తాం. – సంజీవరెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్ 350 ఎకరాల్లో.. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో 161బీ జాతీయ రహదారిపైన వెంకటాపూర్ వద్ద 350 ఎకరాల దట్టమైన అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కు నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో భారీ వృక్షాలు, పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఈ స్థలంలో రూ.3.90కోట్లతో అర్బన్ పార్కు నిర్మాణానికి అటవీశాఖకు ప్రతిపాదనలు పంపించగా మొదటి విడతగా రూ.1.77కోట్లకు అప్రూవ్ కాగా రూ.90లక్షలు విడుదలై డీఎఫ్ఓ ఖాతాలో నిధులు జమయ్యాయి. ఈ నిధులతో ఒక చెక్డ్యామ్, ఒక పర్కులేషన్ ట్యాంకు నిర్మాణం పూర్తయ్యింది. బోరు డ్రిల్లింగ్ చేశారు. పార్కులో వాకింగ్కు సంబంధించి పలు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ప్రతిపాదనలు ఇవ్వండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించే పెద్దరెడ్డి ఎత్తిపోతల పథకం అంచనాలు వెంటనే రూపొందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సింగూర్ కాల్వల మరమ్మతులు, లైనింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్కు ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. సింగూరు నీటిని వృథా చేయకుండా జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తితోపాటు దిగువన ఉన్న ఘన్పూర్ ఆయకట్టుకు, నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని తరలించాలన్నారు. సమీక్షలో ఈఎన్సీ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైభీమ్, ఇంజనీర్లు రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.నీటిపారుదలశాఖ అధికారులకు మంత్రి దామోదర ఆదేశం -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ మండల పరిధిలోని మగ్దూంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా... గ్రామానికి చెందిన మల్లేశంతో చిన్నశంకరంపేటకు చెందిన రేణుక(36)కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. కాగా భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలు తాళలేక ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. కాగా తమ కూతురు ఆత్మహత్యకు భర్త, అత్త కారణమని, అదనపు కట్నం కోసం వేధించడంతోనే చనిపోయిందని మృతురాలు కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతిహవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని జక్కన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శీల నాగయ్య(45) తనకున్న పొలంలో సాగు చేసేందుకు ఉదయం మోటార్కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో డబ్బా వద్ద రిపేరు చేస్తున్నాడు. ఈ క్రమంలో కరెంటు షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించగా వారు వెళ్లి చూసేలోపే ప్రాణాలొదిలాడు. ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిచిన్నశంకరంపేట(మెదక్): గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సృజన కథనం మేరకు...వల్లూర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి కొంతకాలంగా సంచరిస్తున్నాడు. ఎవరైనా పెట్టింది తిని రహదారిపై ఎక్కడ పడితే అక్కడ నిద్రించేవాడని తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న రైతులు హెచ్పీ పెట్రోల్పంప్ సమీపంలో మృతి చెందిన వ్యక్తిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని రామాయంపేట మార్చురీకి తరలించారు. -
పార్టీ కోసం కష్టించేవారికే పదవులు
సదాశివపేట(సంగారెడ్డి): పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు వరిస్తాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటిటీ చైర్పర్సన్ అలవేణి ప్రమాణస్వీకార మహోత్సవానికి జగ్గారెడ్డి, నిర్మలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వ్యవసాయానికి సంబంధించి సమస్యలుంటే మార్కెట్ చైర్పర్సన్తో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి సంగారెడ్డికి రానున్నారని మార్కెట్ సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు. రైతులకు మెరుగైన సేవలందించడానికే మార్కెట్ కమిటీ ఉందని రైతులందరు సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కంది కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, చాట్ల సిద్దన్న, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న కబ్జాదారులు
పటాన్చెరు: అమీన్పూర్ పట్టణంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి చక్కగా రిజిస్ట్రేషన్లు చేసి మున్సిపల్ అనుమతులతో దర్జాగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న లేఔట్ సర్వే నంబర్లు వేసి, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతున్నదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్న రెవెన్యూ అధికారులు భూములను పరిరక్షించడంలో ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిష్టారెడ్డిపేటలోని ఓ వెంచర్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్పష్టంగా తెలిసినా అధికారులు నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇదేమంటే సర్వే రిపోర్టు వస్తేనే కానీ చేసేదేమి లేదని చెబుతున్నారు. అమీన్పూర్ సర్వే నంబర్ 343లో తమకు అసైన్డ్ పట్టాలున్నాయంటూ కొందరు దర్జాగా ఫెన్సింగ్ వేస్తున్నారు. అయినా స్పందన లేదు. గతంలో ఇవే జాగాలో కనీసం ఇటుక రాయిపెట్టేందుకు జంకిన కబ్జా కోరులు ఏకంగా ఫెన్సింగ్ వేస్తున్నారు. సర్వే నం. 630, 993, 994, 996లో కబ్జాలు జరుగుతున్నాయని బీరంగూడ గ్రామ పెద్దలు మొత్తుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాము పుట్టినప్పటినుంచి ఇవి ప్రభుత్వ భూములని, తమకు తెలుసని.. కానీ ఇప్పుడు తప్పుడు సర్వేలతో వాటిని ప్రైవేటు పరం చేశారని గతంలో వారు అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు మాత్రం నేటీకీ చర్యలు తీసుకోలేదు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన సమయంలో హడావిడిగా రిపోర్టులు, సర్వేల కోసం లేఖలు రాస్తున్నారే తప్ప కేసులు పెట్టడం లేదు. దీంతో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు.కూల్చిన చోటే నిర్మించి అమ్మకాలు.. నిద్రావస్థలో రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూముల కబ్జాపై చర్యలు శూన్యం సర్వే రిపోర్టులొచ్చాకే చర్యలు: అధికారులుసిబ్బంది కొరత ఉంది ‘మేం ఖాళీగా లేము. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉంది. జిల్లా అధికారులకు చెబుతాం. మా పని మేం చేస్తున్నాం. కొత్తగా వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూల్చివేతల పనులు పర్యవేక్షిస్తున్నారు. కబ్జాలను నిరోధిస్తున్నారు. కిష్టారెడ్డిపేట రేయిన్బో వెంచర్స్ వ్యవహారంపై పూర్తిగా సర్వే రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటాం. ఇతర కబ్జాలను కూడా గుర్తించి అన్నింటినీ కాపాడుతాం’. – వెంకటేశ్, తహసీల్దార్, అమీన్పూర్బీరంగూడ నుంచి పటేల్గూడ వెళ్లే దారిలో నర్రెగూడెం చౌరస్తా సమీపంలో అనేక చిరు హోటళ్లు వెలిశాయి. ఆ ప్రాంతం అంతా(డీఆర్ఓ) రెవెన్యూ కస్టోడియన్ జాబితాలో ఉన్న భూములు. వాటిలో తాత్కాలిక నిర్మాణాలతో అద్దెలకు ఇస్తున్నారు. సర్వే నం.969లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానిక నాయకులు, మాజీ వార్డు సభ్యులు లింగం గౌడ్, భాస్కర్రెడ్డి తాజాగా మరోసారి ఫిర్యాదు చేశారు. గతంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహగౌడ్, బీజేపీ నేత ఆదెల్లి రవీందర్తో పాటు బీరంగూడ గ్రామ పెద్దలు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా సర్వే నం.993లో కబ్జాల పర్వం కొనసాగుతుంది. గతంలో ఇక్కడ ఆర్ఐగా పని చేసిన రఘునాథ్రెడ్డి నేతృత్వంలో జరిపిన కూల్చివేతల స్థానంలో నిర్మాణాలు పూర్తి చేశారు. వాటికి రంగులు వేసి అమ్మకానికి కూడా పెట్టారు. -
చెక్ ప‘వర్రీ’
గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు రెండేళ్ల తర్వాత కొలువుదీరాయి. సర్పంచ్, ఉప సర్పంచ్లు బాధ్యతలను స్వీకరించారు. దాదాపు రెండేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న జిల్లాలోని 613 గ్రామాలు ఈ కొత్త పాలకవర్గాలకు సమస్యల తోరణంతో స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు బాధ్యతలు స్వీకరించిన కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్లు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అవసరమైన నిధులు వాటి ఉపసంహరణ కోసం అవసరమైన ‘చెక్ పవర్’కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బాధ్యతలు స్వీకరించి పక్షం రోజులు దాటినా ఇంకా వీరికి చెక్ పవర్ ఇవ్వకపోవడంతో ‘వర్రీ’అవుతున్నారు. జహీరాబాద్ టౌన్:సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గ్రామాభివృద్ధికి చేయాల్సిన ఖర్చుల్ని పంచాయతీకున్న బ్యాంక్ ఖాతా నుంచే నిధుల్ని ఉపసంహరించాలి. ఇప్పుడు ఈ నిధులను విత్ డ్రా చేయడానికి ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారులకున్న చెక్ పవర్ను కొత్తగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్ల పేరిట బదిలీ చేయాలి. ఇందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకాలు, ఆధార్ కార్డు, పాన్కార్డు, వేలి ముద్రలు, ఫోన్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఈ పక్రియ చేపట్టాల్సి ఉంది. పంచాయతీ నిధులకు సంబంధించిన అన్ని చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేసిన తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రెండు సంతకాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటిని ఆమోదించి నిధుల విడుదలకు నిర్ణయం తీసుకోవాలని ట్రెజరీ శాఖ అధికారులను సూచించింది. సర్పంచ్, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రావడానికి కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పంచాయతీలకు ఎస్డీఎఫ్ నిధులు! కేంద్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లోకి నేరుగా నిధులు విడుదల చేస్తుంది. ప్రతీ మూడు లేదా ఆరు నెలలకు ఓ సారి విడుదలవుతాయి. ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లే గ్రామ పంచాయతీలకు సైతం సీఎం నిధులు నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్ గ్రామపంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వ నిధులు రానున్నాయి. కేంద్రం ఇచ్చే గ్రాంట్తో పాటు సీఎం ఇస్తామన్న ఎస్డీఎఫ్ నిధులు విడుదలవుతే గ్రామాల్లో నెలకొన్న కొన్ని సమస్యలైనా తొలగిపొయే అవకాశం ఉందని సర్పంచ్లు అభిప్రాయపడుతున్నారు. -
జాతీయస్థాయి హాకీ పోటీలకు విద్యార్థి
దుబ్బాకటౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ –19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు దౌల్తాబాద్ మహాత్మ జ్యోతి బాపూలే బాలుర కళాశాల విద్యార్థి చరణ్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల సరూర్ నగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని చెప్పారు. ఈనెల 12న రాజస్థాన్ ఉదయపూర్లో జరిగే పోటీల్లో తెలంగాణ హాకీ జట్టు తరఫున పాల్గొంటారన్నారు. విద్యార్థి జాతీయ స్థాయిలో ఎంపిక కావడానికి శిక్షణనిచ్చిన కళాశాల పీడీ సాయికృష్ణ, పీఈటీలు డాంబు, బసవరాజులను అభినందించారు. అథ్లెటిక్స్కు ఎంపికై న చిట్కుల్ విద్యార్థులు చిలప్చెడ్(నర్సాపూర్): ఈ నెల 18న ఆదిలాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని చిట్కుల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ సుజాత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 8న మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థులు అండర్–12 విభాగంలో నవదీప్ 60 మీటర్లు, 400మీటర్ల రన్నింగ్, లాంగ్జంప్లలో ప్రథమస్థానం సాధించాడు. మరో విద్యార్థి లోహిత్, షార్ట్ఫుట్లో 2వ స్థానం, 400 మీటర్ల రన్నింగ్, లాంగ్జంప్లో 3వ స్థానం సాధించాడు. అండర్–14 విభాగంలో సతీశ్ ట్రయాథ్లాన్ (రన్సింగ్, లాంగ్జంప్, షార్ట్పుట్)లో 2వ స్థానం సాధించి, రాష్ట స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను హెచ్ఎం నాగరాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. -
ఆర్ఎంపీ నిర్వాకం
● మళ్లీ యథాతథంగా చికిత్సలు ● చోద్యం చూస్తున్న అధికారులుకొండపాక(గజ్వేల్): గతంలో ఆస్పత్రిని సీజ్ చేసినా ఓ ఆర్ఎంపీ మళ్లీ యథాతథంగా వైద్యం చేస్తున్నాడు. వివరాలు ఇలా... గజ్వేల్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ సుదర్శన్ కుకునూరుపల్లిలో సుదర్శన్ హాస్పిటల్ అని పేరుపెట్టుకొని కొన్నేళ్లుగా చికిత్స చేస్తున్నాడు. కాగా 2025 ఆగస్టులో జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా అత్యవసర వైద్యం అందించడంతో అతడు మృతి చెందాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు గజ్వేల్ డివిజన్ డిప్యూటీ వైద్యాధికారి శ్రీనివాస్ హాస్పిటల్ను సీజ్ చేసి ఆర్ఎంపీపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయినా ఆస్పత్రి వెనక నుంచి చికిత్స చేస్తుండటంతో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ ఆస్పత్రిని సీజ్ చేయించారు. సీజ్ను తొలగించాలని, యజమాని నుంచి ఒత్తిడి పెరిగిందని.. ఎలాంటి వైద్యం చేయనని ఆర్ఎంపీ కలెక్టర్కు దరఖాస్తు చేశాడు. దీంతో అద్దె కోసం భవనాన్ని ఇవ్వకూడదంటూ కొన్ని ఆంక్షలతో డిప్యూటీ వైద్యాధికారి సీజ్ను తొలగించారు. ఈ నేపథ్యంలో సూర్య మెడికల్ హాల్ పేరిట మునుపటి అద్దె భవనంలోనే ఆర్ఎంపీ సుదర్శన్ వైద్య పరీక్షలు చేస్తుండగా శుక్రవారం సాక్షి క్లిక్మనిపించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరగా... ఆర్ఎంపీ తీరుపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. -
నేటి నుంచి సంక్రాంతి సెలవులు
న్యాల్కల్(జహీరాబాద్): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు ఏడు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు 17వ తేదీన పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి టీజీపీఎస్సీ చైర్మన్కు ఎమ్మెల్సీ అంజిరెడ్డిలేఖ రామచంద్రాపురం(పటాన్చెరు): ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. స్థానిక విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ...జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో నియామక ప్రక్రియల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థగా టీజీపీఎస్సీ పారదర్శకంగా, సమయానుకూలంగా వ్యవహరించి అభ్యర్థుల్లో మరింత నమ్మకం పెంచాల్సినవసరం ఉందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయని పక్షంలో నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్తోనే ప్రజాసంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం పటాన్చెరు టౌన్: M>…{VðS‹Ü ´ëÈ-t-™ø¯ól {ç³gê-çÜ…-„óSÐ]l$… Ýë«§ýlÅÐ]l$° GïÜÞ M>ÆöµÆó‡-çÙ¯ŒS O^ðlÆý‡Ã¯ŒS {ï³™èl… õ³ÆöP-¯é²Æý‡$. Ð]l¬™èl¢…W yìlÑ-f¯ŒS ç³Ç-«¨ÌZ° M>…{VðS‹Ü ´ëÈt GïÜÞ yìl´ë-Æý‡Š-ె-r-Ã…sŒæ gê¡Ä¶æ$ A«§ýlÅ-„ýS$Ë$ Æ>gôæ…{§ýl-´ë-ÌŒæ-™ø-´ër$ M>…{VðS‹Ü ¯éĶæ$-MýS$-ÌS™ø Ô¶æ${MýS-ÐéÆý‡… °Æý‡Óíßæ…_¯]l çÜÐ]l*Ðól-Ôèæ…ÌZ {ï³™èl… ´ëÌŸY° Ð]l*sêÏ-yéÆý‡$. A…™èl-MýS$Ð]l¬…§ýl$ sîæï³ïÜïÜ Æ>çÙ‰ GïÜÞ òÜÌŒæ MýS±-Ó-¯]lÆŠ‡ §ýl…yøÆ> ¯]lÆý‡íÜ…çßæ-™ø´ër$ ¯éĶæ$-MýS$Ë$ Ð]l¬QÅ A†£ýl$-ÌS¯]l$ çܯéÃ-°…-^éÆý‡$. D çÜ…§ýlÆý‡Â…V> ÐéÆý‡$ Ð]l*sêÏ-yýl$-™èl*...-Æ>»ZÄôæ$ Ð]l¬°Þ´ë-Ísîæ,-G…-ï³-sîæïÜ, gñæyîlµ-sîæïÜ,-i-òßæ-^Œl-G…ïÜ G°²MýSÌZÏ ´ëÈt ^ólç³-yýl$-™èl$¯]l² çÜ…„óSÐ]l$ ç³£ýl-M>-ÌS¯]l$ {ç³f-ÌSMýS$ ÑÐ]l-Ç…-_, ´ëÈt ºÌSç³-Ç-_¯]l A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ VðSÍ-í³…-^éÌS° MøÆ>Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ´ëÈt ïܰ-Ķæ$ÆŠ‡ ¯éĶæ$-MýS$Ë$, ĶæÊ™Œæ M>…{VðS‹Ü ¯éĶæ$-MýS$Ë$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. జాబ్ మేళాలో 79 మందికి ఉద్యోగాలుపటాన్చెరు టౌన్: పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 79 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ మెగా జాబా మేళాలో 13 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 200 మంది హాజరయ్యారని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారికే అక్కడే నియామక పత్రాలను అందజేసినట్లు వివరించారు. కార్యక్రమం కళాశాల టీఎస్కేసీ కో ఆర్డినేటర్ విమల,అధ్యాపకుడు డాక్టర్, ఎన్.యోగిబాబు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి రిమాండ్
● ఐదు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన రామచంద్రపురం ఏసీపీపటాన్చెరు టౌన్: మల్లన్న ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పటాన్చెరు పోలీస్స్టేషన్లో రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 6న ఆలయ తాళాలు పగులగొట్టి స్వామివారి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్లోని మార్కెట్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చిన గోకుల్ నగర్కు చెందిన దండు రవి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. 5 కిలోల వెండి ఆభరణాలను విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. వాటిని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్కి తరలించారు. కాగా నిందితుడిపై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు, ఎస్సైలు మహేశ్వర్ రెడ్డి, అసిఫ్ అలీ పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయించాలి
కంది (సంగారెడ్డి): సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. విద్యా ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం కంది మండలం చేర్యాలలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. ఏఐజేఏసీటీవో పిలుపుమేరకు ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. ఎస్జీటీ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, కొత్త పింఛను విధానాన్ని రద్దుచేసి పెన్షన్ భద్రత నిచ్చే పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల విద్యను ప్రశ్నార్థకం చేసే పాఠశాలల మూసివేత నిర్ణయాలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నారాయణ్ ఖేడ్ మండల పరిధిలోని అనంతసాగర్ పాఠశాల వద్ద టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన -
షార్ట్ సర్క్యూట్తో చెరుకు దగ్ధం
రూ.2.50 లక్షల నష్టం న్యాల్కల్(జహీరాబాద్): చెరుకు పంటకు నిప్పంటుకొని నాలుగు ఎకరాలు దగ్ధమైంది. దీంతో రూ.2.50 లక్షలు మేర నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా... మండల పరిధిలోని మామిడ్గి గ్రామ శివారులో శుక్రవారం ఎప్పటిలాగే రైతు రాజశేఖర్రెడ్డి శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరుకు తోటకు నిప్పంటుకొని మంటలు ఎగిసిపటడం గమనించిన రైతు తోటి రైతులతో కలిసి జహీరాబాద్లోని ఫైరింజన్కు సమాచారం ఇచ్చాడు. ఫైరింజిన్ వచ్చే సరికి దాదాపు చెరుకు తోట కాలిపోయింది. అయితే సమీపంలో తోటలకు మంటలు వ్యాపించకుండా ఫైరింజిన్ మంటలను ఆర్పి వేసింది. షార్ట్ సర్క్యూట్తోనే మంటలు చెలరేగి నిప్పంటుకున్నట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. చైనా మాంజా సీజ్హత్నూర( సంగారెడ్డి): ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయిన్న వ్యక్తిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని, మాంజాను సీజ్ చేశారు. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో మహమ్మద్ వాజీర్ హలీ చైనా మాంజా అమ్ముతున్నాడని వచ్చిన సమాచారం మేరకు వెళ్లి షాపుని తనిఖీ చేశారు. అందులో 19 మాంజా బాబిన్లు, నైలాన్ సింథటిక్ చైనా మాంజాలు ఉండగా వాటిని సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, అతడిపై కేసు నమోదు చేశారు. చైనా మాంజాతో ప్రాణాలు పోతాయని ఎవరైనా, అమ్మినా కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకల్హేర్(నారాయణఖేడ్): అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్ వివరాల ప్రకారం... అక్రమంగా రేషన్ బియ్యం లారీలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రంగంలోకి దిగారు. శుక్రవారం మండలంలోని మాసాన్పల్లి చౌరస్తాలో సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవే వద్ద రాజారాం దాబా సమీపంలో లారీని పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి నిజాంసాగర్ వైపు తరలిస్తున్నారని విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకుని సివిల్ సప్లయ్ అధికారులకు బియ్యం అప్పగించినట్లు తెలిపారు. అధికారుల పనితీరు భేష్జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మనోహరాబాద్(తూప్రాన్): ఎన్నికల్లో భాగంగా మండలంలో అధికారుల పనితీరు బాగుందని జిల్లా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ అధికారులు పరిశుభ్రత, పచ్చదనం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. -
ఆస్తి కోసమే అత్త హత్య
కొండపాక(గజ్వేల్): ఆస్తి కోసం అత్తను హత్య చేసిన ఘటనలో అల్లుడితో పాటు సహకరించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కుకునూరుపల్లి పోలీస్టేషన్లో తొగుట సీఐ లతీఫ్తో కలిసి గజ్వేల్ ఏసీపీ నర్సింహులు కేసు వివరాలు వెల్లడించారు. మృతురాలు రాములమ్మ భర్త నర్సింహా రెడ్డి 2020లో చనిపోగా హోటల్ను నడుపుతూ ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశారు. పెద్ద కూతురు కుటుంబానికి ఆమె ఆర్థికంగా అండగా ఉంటుండగా, చిన్న కూతురు కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ములుగు మండలంలోని తున్కి బొల్లారానికి చెందిన చిన్న కూతురు భర్త జీవన్రెడ్డి కూలీ పనులు చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఎలాగైనా అత్త ఆస్తిని కాజేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సలీంకు విషయం చెప్పి, హత్యకు సహకరిస్తే డబ్బు ఇస్తానన్నాడు. దీనికి అతడు ఒప్పుకోవడంతోపాటు స్నేహితుడు పాండుతో పాటు మరో ఇద్దరిని జీవన్రెడ్డికి పరిచయం చేశాడు. ఈనెల 6న మధ్యాహ్నం రెండు బైక్లపై నలుగురు హోటల్ వద్దకు వెళ్లారు. అందులో ముందుగా జీవన్రెడ్డితో పాటు పాండు లోపలికి వెళ్లగా అల్లుడికి చాయ్ ఇచ్చేందుకు రాములమ్మ లోపలికి వెళ్లింది. పథకం ప్రకారం కృష్ణ, మహేశ్ లోపలికి వెళ్లి వెంట తెచ్చుకున్న టవల్తో ఆమె మెడ చుట్టూ గట్టిగా బిగించగా, అక్కడే ఉన్న అల్లుడు, పాండు హత్య చేశారు. ఈ సమయంలో టీ కోసం వచ్చిన వ్యక్తి డోర్ మూసి ఉండటంతో రాములమ్మ అని పిలువగా నిందితులు వెనుకనుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న సీఐ లతీఫ్, ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించి చిన్నల్లుడు జీవన్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా తనతో పాటు మరో ముగ్గురుతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. జీవన్రెడ్డితో పాటు పాండురంగ, గజ్జెల మహేశ్, బిల్లాడి క్రిష్ణ, మహమ్మద్ సలీం, కై ర సత్యనారాయణ, నక్క నరేశ్ గౌడ్, కుంభ లక్ష్మణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్, పోలీసులు పాల్గొన్నారు. -
పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశుగృహ, సఖీ కేంద్రాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ..శిశుగృహ, సఖీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం సఖీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. కందిలోని సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. -
సింగూరు.. రిపేరు
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026కట్ట బలోపేతం దిశగా మొదలైన రివీట్మెంట్ పనులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సింగూరు ఆనకట్ట మరమ్మతు పనులు షురూవయ్యాయి. ప్రస్తుతానికి కట్టకు ఇరువైపులా చివరలో రివీట్మెంట్ పనులు చేపట్టారు. ప్రాజెక్టులో నీటి మట్టం 520 (16.5 టీఎంసీలు) మీటర్ల మేర ఉండటంతో కట్ట దెబ్బతిన్న ప్రదేశంలో రివీట్మెంట్ పనులు చేసేందుకు వీలు పడటం లేదు. దీంతో చివరిభాగంలో ఈ పనులను ప్రారంభించారు. హైదరాబాద్తోపాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు తాగు నీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఆనకట్ట పూర్తిగా దెబ్బతిన్నదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తక్షణం ఈ మరమ్మతులు చేపట్టకపోతే ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే జరిగితే సుమారు 12 గ్రామాలు కొట్టుకుపోతాయని, ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి సారించింది. తీవ్ర తర్జన భర్జనల మధ్య ఈ ప్రాజెక్టును ఖాళీ చేసి మరమ్మతులు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులోభాగంగా ఈ కట్ట మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రివీట్మెంట్తోపాటు, రాతికట్టడాల పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం ఇప్పటికే రూ.16 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే. పరిపాలన వ్యయం పోగా సుమారు రూ.13 కోట్లకు ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఈ కాంట్రాక్టు కంపెనీ పనులను ప్రారంభించింది. వచ్చే సీజనులో డెడ్ స్టోరేజీకి నీటి మట్టం.. ఈ జలాశయం ఆనకట్టతోపాటు, ప్రాజెక్టు ఆఫ్రాన్ కూడా దెబ్బతింది. గేట్లు కూడా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తరచూ గేట్లు మొరాయిస్తున్నాయి. గేట్లకు పెయింటింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది. ఈ పనులు వచ్చే సీజనులో ప్రారంభిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వచ్చే సీజను ప్రాజెక్టు నీటి మట్టాన్ని డెడ్స్టోరేజీకి నీటిమట్టాన్ని తగ్గించాలని నిర్ణయించారు. డెడ్స్టోరేజీకి తగ్గించాక పూర్తిస్థాయిలో కట్ట రివీట్మెంట్ పనులతోపాటు, ఆఫ్రాన్ పనులు కూడా చేసేందుకు వీలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.సింగూరు ప్రాజెక్టులో జరుగుతున్న రివీట్మెంట్ పనులను పరిశీలిస్తున్న అధికారులునీటి విడుదలకు కలెక్టర్ అనుమతి ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్ల (8.1 టీఎంసీ)కు తగ్గిస్తే ఈ సీజనులో కొంత మేరకు కట్ట బలోపేతం పనులు చేసేందుకు వీలుంటుంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేయాలని నిర్ణయించారు. హైదరాబాద్తోపాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 8.1 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆది లేదా సోమవారం గానీ ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఐదు వేల క్యూసెక్కు నీటి విడుదల ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని వదిలేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి రాగా, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఒకటీ రెండో రోజుల్లో నీటిని వదులుతాం సింగూరు ప్రాజెక్టు ఆనకట్ట బలోపేతం పనులు ప్రారంభించాం. నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517కు తగ్గిస్తాం. ఇందుకోసం ఒకటీ రెండు రోజుల్లో ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలేస్తాం. ఇందుకోసం జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నాం. నీటిని విడుదల చేస్తున్నందున ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులు, పశువుల కాపరులు మంజీరా నదివైపు వెళ్లకుండా చాటింపు వేయిస్తాం. ఈ సీజనులో ఈ మరమ్మతు పనులు వీలైనంత మేర జరిగేలా చర్యలు చేపట్టాం. – శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్, నీటిపారుదలశాఖ -
క్రీడాకారుల కోసమే సీఎం కప్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నేడు అంతర్జాతీయ స్థాయి లో రాణిస్తున్న క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి వచ్చినవారేనని, మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికే సీఎం కప్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికే ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందన్నారు. యంగ్ ఇండియా స్సోర్ట్స్ యూనివర్సిటీ మాత్రమే కాకుండా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. క్రీడలు జీవితంలో భాగమన్నారు. ఎంతోమంది చిన్నారులకు శక్తి, సామర్థ్యాలు ఉన్నా.. క్రీడల్లో పాల్గొనే అవకాశం రావడం లేదన్నారు. అలాంటి వారిని వెలికితీయడమే లక్ష్యంగా క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. వసతి గృహం కోసం వినతి.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేయాలని కళాశాల అధ్యాపకులు మంత్రి పొన్నంకు వినతి పత్రం అందించారు. దీనికి ఆయన స్పందించి, పైస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. ప్రొటోకాల్ వివాదం.. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహణలో ప్రొటోకాల్ నిబంధనలు పాటించలేదని, స్థానిక కౌన్సిలర్ అధికారులను నిలదీశారు. స్టేజీపై ఉన్న కుర్చీల్లో అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారు. ఒకనొక దశలో మంత్రిని స్వాగతించే క్రమంలో కలెక్టర్ పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారిని కలెక్టర్ ఈ విషయంపై వేదికపైనే హెచ్చరించారు. -
తప్పిపోయిన బాబు అప్పగింత
సిద్దిపేటకమాన్: తప్పిపోయిన బాబును పోలీసులు తల్లికి అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... కుమురం భీం జిల్లా దాయిగాం మండలం లగ్గామ గ్రామానికి చెందిన మౌనిక నాలుగేళ్ల కుమారుడితో కలిసి సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె చెల్లిని పరామర్శించడానికి వచ్చారు. అక్కడ మౌనిక తన తల్లితో మాట్లాడుతుండగా బాబు ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. బాబు ఏడుస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బ్లూకోట్ సిబ్బంది వివరాలు అడగగా బాబు చెప్పలేదు. దీంతో బాబు ఫొటోను వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయగా విషయం తెలుసుకున్న తల్లి స్టేషన్కు చేరుకుంది. వివరాలు తెలుసుకుని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది వెంకటరామరాజు, శ్రావణ్ బాబును తల్లికి అప్పగించారు. దీంతో తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. -
తంజావూరు చిత్రకళను కాపాడుకోవాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: తంజావూరు పెయింటింగ్ అరుదైన కళని దానిని కాపాడుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. విద్యార్థులు వేసిన తంజావూరు పెయింటింగ్స్ అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తంజావూరు పెయింటింగ్స్పై నాలు గు రోజుల పాటు జరిగిన సర్టిఫికెట్ కోర్సు శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి శుక్రవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. సోలాపూర్కు చెందిన స్వచ్ఛంద సంస్థ జ్ఞాన ప్రబోధిని, మల్లికార్జున హైస్కూల్, రాకంబాయి హత్తురే జూనియర్ కళాశాల, సోలాపూర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో ప్రొఫెసర్ మల్లికార్జున బిరాజ్ దార్ విద్యార్థులకు పెయింటింగ్ మెళకువలు నేర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీ ణ్య మాట్లాడుతూ..తంజావూరు పెయింటింగ్ కళలను కాపాడటం కోసం కళాశాలలో ఈ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించారన్నారు. ఈ కళల ద్వారా విద్యార్థులకు మానసిక స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపల్స్ నిర్మల, డాక్టర్ జగదీశ్వర్ అర్థశాస్త్ర విభాగ అధ్యాపకురాలు డాక్టర్ అనురాధజ్ఞాన ప్రబోధిని కి చెందిన మురళి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
నారాయణఖేడ్: అర్హులైన పేదలకు జూకల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలో అందజేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలకు శుక్రవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. పలు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ..795 డబుల్బెడ్ రూం ఇళ్లకు అర్హుల గుర్తింపు 50% పూర్తయ్యిందని, మిగతా వారిని గుర్తించి మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి కాగానే అందజేస్తామన్నారు. గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారిలో అర్హులు ఉన్నవారికి కూడా ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఖేడ్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, గృహనిర్మాణశాఖ డీఈఈ తివారీ, ఏఈలు, నాయకులు నర్సిహ్మారెడ్డి, దారం శంకర్, పండరిరెడ్డి పాల్గొన్నారు. నిధులకోసం కలెక్టర్కు వినతి నారాయణఖేడ్: ఖేడ్ పట్టణం చుట్టూ నిర్మిస్తున్న రింగు రోడ్డు నిర్మాణానికి, నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిసి కోరారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి ఉన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
సీనియర్ జర్నలిస్టు మృతి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఫజల్ రహమాన్ (60)అనారోగ్యంతో మృతి చెందారు. పది రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన ప్రస్తుతం ప్రతిపక్షం దిన పత్రికలో ఎడిటర్గా పని చేస్తున్నారు. కాగా ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు పత్రికా రంగంలోనే పని చేస్తున్నారు. ఆయన మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు పిట్టల తిరుపతి, నన్నె అజయ్, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
రెండేళ్ల కాంగ్రెస్ పాలన అస్తవ్యస్థం
నంగునూరు(సిద్దిపేట): దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని రైతులను, ఉద్యోగాలు లేవని నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టడంతో రెండేళ్ల రేవంత్రెడ్డి పాలన అస్తవ్యస్థంగా మారిందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం నర్మెటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించి యంత్రాలు, గెలల ద్వారా క్రూడాయిల్, గింజల ద్వారా కెర్నల్ ఆయిల్, పిప్పి ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారిందన్నారు. ఈ ప్రాంతాన్ని ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా మార్చడమే కాకుండా నర్మెటకు ఫ్యాక్టరీ మంజూరీ చేసి 45 ఏళ్ల కలను కేసీఆర్ సాకారం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్రెడ్డి, సారయ్య, సోమిరెడ్డి, సర్పంచ్ స్వాతి, పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే హరీశ్ రావు -
ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి
మెదక్ ఎంపీ రఘునందన్రావుమెదక్జోన్/నర్సాపూర్: పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికి వదిలేశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపుతానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ కింద కేంద్రం నుంచి ప్రతి జిల్లాకు నిధులు మంజూరైతే కేవలం సిద్దిపేట, గజ్వేల్కు మాత్రమే వినియోగించారన్నారు. మెదక్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్రోడ్డు నిర్మాణం కోసం డీపీఆర్ తయారు చేశామని, అనుమతులు రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. మార్చి 31 వరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ. 950 కోట్లు వాపస్ పోతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆరాట పడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు రంజిత్రెడ్డి, నందారెడ్డి, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నర్సాపూర్ మేజర్ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారినా అభివృద్ధి అంతంతే జరిగిందన్నారు. నాయకులు సమష్టిగా ముందుకు సాగితే మున్సిపాలిటీని బీజేపీ కై వసం చేసుకుంటుందన్నారు. గెలిచే వ్యక్తులను మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేస్తారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, ఇన్చార్జి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
ఆధునిక సదుపాయాలతో సౌండ్ లైబ్రరీ
సంగారెడ్డి, మునిపల్లి(అందోల్): దృష్టిలోపం (విజువల్లీ చాలెంజ్డ్) ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యా సమాచారం సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో అంధుల శ్రవణ గ్రంథాలయం (సౌండ్ లైబ్రరీ)ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో గురువారం అంధుల శ్రవణ గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ సౌండ్ లైబ్రరీ ద్వారా దృష్టి లోపం ఉన్న వారు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలరన్నారు. ఈ లైబ్రరీ భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. భారతీయ యాసతో స్పష్టంగా చదివే విధానం లైబ్రరీ ప్రత్యేక ఆకర్షణగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ...ఎక్కడాలేని విధంగా దృష్టి లోపం గల వారి కోసం జిల్లాలో శ్రవణ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులు ఈ సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్య మాట్లాడుతూ...ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ సౌండ్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి వసుంధర, పంచాయతీ రాజ్శాఖ డీఈ దీపక్, వివిధ దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, డీడబ్ల్యూఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య అంధులు సౌండ్ లైబ్రరీనిసద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ -
నిఘానేత్రం.. భలే పట్టేసింది..
చిన్నశంకరంపేట(మెదక్): పోయిందనుకున్న బంగారం సీసీ కెమెరా సహాయంతో పోలీసులు బాధిత మహిళకు అప్పగించారు. ఈ సంఘటన చిన్నశంకరంపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణగౌడ్ కథనం ప్రకారం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్కు చెందిన పడాల సరిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం మెదక్లోని బంధువు అంత్యక్రియలకు హాజరయింది. తిరుగు ప్రయాణంలో గవ్వలపల్లి చౌరస్తాలోని కారు దిగి టీ తాగి బయలుదేరారు. తీరా ఇంటికి వెళ్లాక బంగారు చైన్ ఉన్న పర్సుపోయినట్లు గమనించారు. దీంతో బాధిత మహిళ గురువారం మధ్యాహ్నం చిన్నశంకరంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్ గవ్వలపల్లి చౌరస్తాలోని సీసీ కెమెరాలను పరిశీలించగా రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఓ వ్యక్తి పర్సును తీసుకుపోయినట్లు గుర్తించి అతని వద్దకు వెళ్లి అడగ్గా పర్సు, బంగారం తిరిగి ఇచ్చాడు. పోలీసులు బాధిత మహిళకు అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ను ఎస్ఐ అభినందించారు. -
మంజీర నదిలో మహిళ మృతదేహం
పుల్కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు దిగువన మంజీర నదిలో సదాశిపేట మండలం పొట్టిపల్లికి చెందిన వడ్డే రాములమ్మ (45) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 6వ తేదీన గ్రామం నుంచి సదాశివపేట వచ్చిన ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు బంధువులను సంప్రదించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పుల్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నీటిలో ఓ మహిళా మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు సంప్రదించి మృతదేహాన్ని గుర్తు పట్టారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పొంతన లేని ఓట్ల జాబితా
హుస్నాబాద్: మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పొంతలేని అధిక ఓటర్ల సంఖ్యతో బెంబేలెత్తుతున్నారు. వార్డు వార్డుకు వందలాది ఓటర్లు తేడా ఉండటాన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్న వార్డుల్లో ఎన్నికల ఖర్చును భరించలేని పరిస్ధితి. హుస్నాబాద్ మున్సిపాలిటిలో 20 వార్డులకు గాను 19,227 ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేయకుండా, కొన్ని వార్డుల్లో ఎక్కువ, మరికొన్ని వార్డుల్లో తక్కువ ఓటర్లతో జాబితాను తయారు చేశారు. పట్టణంలోని 16వ వార్డులో 608 ఓట్లు, 4వ వార్డులో 1304 ఓట్లు ఉన్నాయి. దాదాపు 700 ఓట్లు తేడా ఉంది. ఇలా చాలా వార్డుల్లో హెచ్చు, తగ్గులతో ఓటరు జాబితాను తయారు చేశారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో ఓటరు జాబితా పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్ని వార్డుల్లో ఎక్కువ , మరి కొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లు కాకుండా అన్ని వార్డుల్లో ఓటర్లు సమానంగా ఉండేలా జాబితాను తయారు చేయాలని సూచనలు చేశారు. ఒక వార్డులో కనీసం 800 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీలుకాని పరిస్ధితితుల్లో అదనంగా మరో రెండు వార్డులు పెంచాలని కోరారు. మోయలేని ఆర్ధిక భారం అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న వార్డుల్లో పోటీ చేసే అభ్యర్దులకు ఎన్నికల ఖర్చు మోయలేని భారం పడుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 50 నుంచి 100 వరకు తేడా ఉన్నా ఎలాగోలా నెట్టుకురావొచ్చు. వందల కొద్ది ఓట్ల తేడాతో అభ్యర్ధులకు తలకు మించిన భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చి ఎక్కువ ఓట్లు ఉన్న వార్డులో పోటీ చేసే వారికి ఎన్నికల ఖర్చుతో పాటు ఓటర్లను కలుసుకునేందుకు సమయం ఎక్కువ పడుతుంది. ప్రస్తుతం ఎక్కువ ఓటర్లు ఉన్న వార్డులో ఇల్లు ఒక వార్డులో, ఓటు మరో వార్డులో ఉన్నాయి. దీంతో ఓటర్ల అడ్రస్ను తెలుసుకోవాలంటే శక్తికి మించిన భారం అవుతుంది. మున్సిపల్ అధికారులు అన్ని వార్డుల్లో ఓటర్లు సమానంగా ఉండేలా జాబితాను తయారు చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు. అలాగే 20 వార్డులకు గాను 18 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్ని వార్డులు ఉంటే అన్ని పోలింగ్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొని జాబితాను తయారు చేస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే. వార్డు, వార్డుకు వందలాది ఓటర్ల తేడా -
సౌతిండియా సైన్స్ఫెయిర్ను విజయవంతం చేయాలి
● ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ● 2026 సైన్ ్స ఫెయిర్ ఏర్పాట్లపై సమీక్ష రామచంద్రాపురం (పటాన్చెరు): సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ నిర్వహణ రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కంటే భిన్నంగా ఉంటుందని ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లపై గురువారం సన్నాహక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా 22 కమిటీలకు సంబంధించిన కన్వీనర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సీఈఆర్ డైరెక్టర్ రమేశ్ మాట్లాడుతూ... వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల భాష, ఆహార అలవాట్లు, సాంస్కృతిక భిన్నతలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలు నిర్వహణ చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ...జిల్లాకు వచ్చిన ఈ ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి లింభాజీ, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, గాడియం స్కూల్ ఏజీఎం ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు -
ఒకే ఒక్కడు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో మూడు కీలక ఉన్నతాధికారి పోస్టుల్లో ఒకే ఒక్కరు కొనసాగుతున్నారు. జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన ఆర్.పాండు ఇప్పుడు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా, ఆందోల్ ఆర్డీఓ పోస్టుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా ఆందోల్ ఆర్డీఓగా ఉన్న ఆర్.పాండును జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా నియమిస్తూ 2025 డిసెంబర్ చివరి వారంలో ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆయన డీఆర్ఓగా వారం క్రితం బాధ్యతలు తీసుకున్నారు. ఖాళీ అయిన ఆందోల్ ఆర్డీఓ పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. దీంతో ఈ ఆర్డీఓగా ఎఫ్ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు)లో పాండు కొనసాగుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు కూడా గత నెలలో ఖాళీ అయింది. బి.చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. దీంతో ఖాళీ అయిన ఈ పోస్టులో కూడా పాండుకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మూడు కీలక పోస్టుల్లో ఒకే అధికారి కొనసాగుతున్నట్లయింది. మాధురికి అప్పగిస్తారని అనుకున్నా... అయితే జిల్లాలో మరో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా మాధురి ఉన్నారు. అయితే ఖాళీ అయిన ఈ పోస్టులో అదనపు కలెక్టర్ మాధురికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ మాధురి కూడా పదోన్నతిపై బదిలీ అయ్యే అవకాశాలు ఉండటంతో..డీఆర్ఓకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త అధికారుల నియామకం అధికారుల బదిలీల్లో భాగంగా ఖాళీ అయిన ఈ కీలక పోస్టుల్లో కొత్త అధికారులను నియమిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల్లో ఒకటైన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే మున్సిపాలిటీల ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఇన్చార్జితో నెట్టుకొస్తే ఈ ఎన్నికల నిర్వహణలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ పోస్టులో త్వరలోనే కొత్త అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు ఖాళీ అయిన ఆందోల్ ఆర్డీఓ పోస్టులో కూడా కొత్త అధికారి వస్తారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీలు చేసే అవకాశాలున్నాయి. దీంతో ఖాళీగా ఉన్న ఈ రెండు పోస్టులు భర్తీ అవుతాయని చెబుతున్నారు.మూడు కీలక పోస్టుల్లో... -
రుణం ఇప్పిస్తానని మోసం
నర్సాపూర్: బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తానని ఓ మోసగాడు రైతు నుంచి సెల్ఫోన్, రూ. 3 వేలు కాజేశాడు. చిలప్చెడ్ మండలం అంతారం గ్రామానికి చెందిన రైతు సాయిలు గురువారం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో తన రుణానికి సంబంధించిన వాయిదా చెల్లించేందుకు వెళ్లాడు. రూ. 9 వేల వాయిదా చెల్లించాల్సి ఉండగా, తన వద్ద ఉన్న రూ. 3 వేలు చెల్లించి మిగిలిన సొమ్ముకు గడువు కోరాలని భావించాడు. అయితే బ్యాంకులో ఒక వ్యక్తి తన పేరు మల్లేశం అని, బ్యాంకు అధికారులతో పరిచయం ఉందని సాయిలును నమ్మించాడు. కావాల్సిన సహాయం చేస్తానని నమ్మబలికాడు. మాట్లాడుకుందామని జాతీయ రహదారిపై ఉన్న హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. కావాల్సిన రూ. 6 వేలు ఇస్తానని, బ్యాంకు అధికారులు తనకు తెలుసని, నీ వద్ద ఉన్న రూ. 3 వేలు ఇస్తే మిగిలిన ఆరు వేలు తాను కలిపి బ్యాంకులో చెల్లిస్తానని చెప్పాడు. మళ్లీ రుణం సైతం ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో రైతు తన వద్ద ఉన్న రూ. 3 వేలతో పాటు సెల్ఫోన్ సైతం ఇచ్చాడు. అనంతరం రైతుకు రూ. 500 ఇచ్చి మద్యం తీసుకురమ్మని పంపించాడు. అతడు మద్యం తీసుకొని వచ్చే సరికి ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలని రైతు అధికారులను కోరాడు. ఈ విషయమై ఎస్ఐ రంజిత్రెడ్డి వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదని చెప్పారు. -
వాటి కేంద్రంగానే బల్దియా కార్యకలాపాలు
బల్దియా సర్కిల్పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచనపటాన్చెరు: ప్రజల సౌకర్యార్థం పటాన్చెరు, రామచంద్రాపురం కేంద్రాలుగానే బల్దియా సర్కిల్ కార్యకలాపాలు కొనసాగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్కు తరలించారని కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించాలని..లేనిపక్షంలో ప్రజలతోపాటు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయన్నారు. అమీన్పూర్ కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాన్ని రామచంద్రపురం కేంద్రంగా కొనసాగించాలని కమిషనర్ను కోరారు. నూతన డివిజన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కమిషనర్ కర్ణన్ ఎమ్మెల్యేకు తెలిపారు. -
గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పరుపులు తయారు చేస్తున్న గోదాంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక జిల్లా అధికారి నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్లోని తేజ కాలనీ సమీపంలో అనుమతులు లేకుండా పరుపుల తయారీ గోదాం నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న పరుపులు, తయారీ సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న పటాన్చెరు అగ్ని మాపక శాఖ సిబ్బంది, పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన రెండు అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు కార్మికులు ఉండగా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించవద్దని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు హెచ్చరించారు. అయితే ఈ తయారీ కేంద్రానికి ఎటువంటి అనుమతి లేదని ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు తెలిపారు. -
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి ● ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ సంగారెడ్డి జోన్: ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ బైక్ షోరూంల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీని నిర్మలారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా రవాణ అధికారి అరుణ మాట్లాడుతూ...రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా రోడ్డు భద్రతపై విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్య గౌడ్, రవాణ శాఖ సభ్యులు తాహెర్, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారంతోనే ఆరోగ్యం
ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలోసబ్ కలెక్టర్ ఉమాహారతినారాయణఖేడ్: పోషక విలువలతో కూడుకున్న వంటకాలతోనే ఆరోగ్యమని సబ్ కలెక్టర్ ఉమాహారతి పేర్కొన్నారు. మనూరు మండలంలోని మాయికోడ్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఫుడ్ఫెస్టివల్ను ఉమాహారతి లంఛనంగా ప్రారంభించారు. ఇందులో పాఠశాల విద్యార్థులు వివిధ రకాల తెలంగాణ వంటకాలను ప్రదర్శించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. విద్యార్థులను వంటకాలు, వాటి ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సైతం పలు వంటకాల గురించి వివరించగా..సబ్ కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీ మనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అడవి పందుల దాడి.. మొక్కజొన్న ధ్వంసం
● రూ. 20 వేల నష్టం ● లబోదిబోమంటున్న అన్నదాతఅక్కన్నపేట(హుస్నాబాద్): రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట అడవిపందుల దాడిలో ధ్వంసమైంది. ఈ ఘటన అక్కన్నపేట మండలం పంతుల్తండా గ్రామ పరిధిలోని ధరావత్తండాలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరావత్ విజయ్ అనే యువ రైతు తన ఇంటి సమీపంలో సుమారుగా 10 గుంటల్లో మక్కజొన్న సాగు చేశాడు. రాత్రి, పగలు కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి అడవి పందుల గుంపు ఒక్కసారిగా పంటపై దాడి చేసింది. దీంతో చేతికందే కంకులను నేలపాలు చేశాయి. సుమారుగా రూ.20 వేల నష్టం వాటిల్లిందని రైతు విజయ్ వాపోయాడు. చేసేదేమీ లేక నేలపాలైన మక్కజొన్న పంటను పశువులకు మేతగా వేశాడు. సంబంధిత అటవీశాఖ అధికారులు ఆయనకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
పూసింది పూత.. నిలబడేనా కాత!
వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోతున్న రైతులు ● యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు ● ఉద్యానశాఖ డీడీ సోమేశ్వర్రావు జహీరాబాద్ టౌన్: మామిడి రైతులు తరచూ నష్టాలు చవిచూస్తున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులపై ప్రభావం చూపుతోంది. మామిడితోటలో వాతావరణ పరిస్థితులు కీలకపాత్ర పోషిస్తాయి. పూత ఆలస్యంగా రావడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా పూత పూసింది. మామిడికాయలు చేతికి వచ్చే సమయానికి పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల పూత రావడంతోపాటు అధిక దిగుబడులు పొందవచ్చని ఉద్యానశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్రావు చెబుతున్నారు. యాజమాన్య పద్ధతులు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మామిడిలో యాజమాన్య చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. మూడు నెలల పాటు యూరియా, పొటాష్, బోరాన్ ఎరువులు వినియోగించాలి. మందులు ఒకేసారి కాకుండా పలు దఫాలుగా వేయాలి. పదేళ్లు పైబడిన చెట్లకు 700 గ్రాముల డీఏపీ, 400 గ్రాముల యూరియా, 600 గ్రాముల ఎంవోపీ మందును కలిపి వేసి క్రమం తప్పకుండా నీటి తడులు పెట్టాలి. పిందె దశలో జాగ్రత్తలు తీసుకోవాలి పిందె దశలో ఎక్కువగా రాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మామిడి పిందెలు బఠాణి నుంచి నిమ్మకాయ సైజుల మధ్య ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. ఫలదీకరణ చెందని పుష్పాలు రాలిపోతాయి. నీటి ఎద్దడి అధిక తేమ, హార్మోన్ల లోపం తదితర కారణాల వల్ల పిందె దశలో తెగుళ్లు అధిక నష్టం కలిగిస్తాయి. తేనెమంచు పురుగు, మసి మంగు, పక్షికన్ను, మచ్చతెగులు, బూడిద తెగులు ఆశిస్తాయి. జహీరాబాద్, పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో... జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరువు తదితర ప్రాంతాల్లో అధికశాతం మామిడి తోటలున్నాయి. మామిడిలో సాధారణంగా డిసెంబర్ నుంచి జనవరి నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో పూత రావడానికి సమయం పడుతుంది. నవంబర్లో పూత వస్తే కాత నిలబడుతుంది. పూత రావడానికి పొటా షియం నైట్రేట్ 10 గ్రాములు, 5 గ్రాముల యూరియా లీటరు నీటిలో కలిపి చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. పొటాషియం నైట్రేట్ ఆకులపై నేరుగా పిచికారీ చేయడం వల్ల త్వరగా ఆహార పదార్థాలుగా మార్చుకుని పూ మొగ్గలకు తొందరగా చేర వేసి పూత రావడానికి దోహదపడుతుంది. పూత రావడం మొదలైన వెంటనే ఫ్లానోఫిక్స్ 2.6 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కొమ్మకు వేల సంఖ్యలో పుష్పాలు వచ్చినా చివరకు ఐదారే పిందెలు కడతాయి. 5 నుంచి 6 వరకు పిందెలలో ఆఖరున ఒకటి నుంచి రెండు పిందెలు మాత్రమే ఎదిగి కాయలుగా మారుతాయి. -
పల్లెల్లో మద్యపాన నిషేధం
ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రగతి ధర్మారం, కొల్చారం గ్రామస్తులుÆ>Ð]l*Ķæ$…õ³-r(-Ððl$-§ýlMŠS)/MöÌêaÆý‡…(¯]lÆ>Þç³NÆŠḥ): మండలంలోని ప్రగతి ధర్మారంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం గురువారం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈమేరకు సర్పంచ్ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో సమావేశమై చర్చించారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ. 50 వేలు, కొన్నవారికి రూ. పది వేల జరిమానా విధి స్తామని స్పష్టం చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్షాపులు పెరిగిపోవడంతో యువత మద్యానికి బానిస అవుతున్నారని వాపోయారు. మద్యం అమ్మకాలు పూర్తిగా రూపు మాపితేనే గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. అలాగే దుకాణాల్లో మైనర్లకు సిగరేట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించవద్దని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ బాల్రాజుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే కొల్చారం మండలకేంద్రంలో నూతన పాలకమండలి సర్పంచ్ దేవన్నగారి శేఖర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈనెల 26 గణతంత్ర దినోత్సవం నాటి నుంచి గ్రామంలో పూర్తిగా మద్య నిషేధం అమలు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
భయమేస్తుందని.. స్నేహితుడికి ఫోన్ చేసి
చెరువులోకి దూకి ఆరోగ్య మిత్ర ఆత్మహత్యజోగిపేట(అందోల్): కొంతకాలంగా అనారోగ్యం, మానసికంగా ఇబ్బంది పడుతూ తనకే మరణే శరణ్యమని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రగా బాధ్యతలను నిర్వహిస్తున్న రవీందర్ (40) అందోలు పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అందోలు మండలంలోని సంగుపేటకి చెందిన రవీందర్ ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సుమను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయనకు తలకు తీవ్ర గాయాలై మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలోనే ఆదివారం భార్యను పుట్టింట్లో వదిలే పెట్టి సోమ, మంగళవారం సంగారెడ్డిలోని తన సోదరుడు మహేందర్తో ఉన్నాడు. అయితే బుధవారం తన మిత్రుడు నాగేందర్కు ఫోన్ చేసి తాను చెరువు కట్టపై ఉన్నానని చెప్పాడు. రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి భయమేస్తుందని, ఉండలేకపోతున్నానని వాపోయాడు. ఆ తర్వాత వెంటనే అతని సోదరుడు మహేందర్కు రవీందర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలోనే నాగేందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అతని సోదరుడు జోగిపేట, అందోలు ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఉదయం చెరువుకట్ట మధ్యలో మెట్ల వద్ద షర్టు, చెప్పులు గుర్తించి తన సోదరుడివేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సహాయంతో రవీందర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అల్పాహారం 19 రోజులే
న్యాల్కల్(జహీరాబాద్)/నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఉపశమనం లభించింది. పది విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా సదరు విద్యార్థులకు అల్పాహారాన్ని సైతం ప్రభుత్వం ఇంతవరకు అందించలేకపోయింది. దీంతో ఉపాధ్యాయులు చెప్పిన చదువులు ఒంటబట్టడం లేదని, అల్పాహారం అందించాలని విద్యార్థులు కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం వచ్చే నెల 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారాన్ని అందించాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి 12,394 మంది జిల్లాలో 249 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 12,394 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఈసారి అక్టోబర్ 7 నుంచే టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ ప్రారంభించింది. రెగ్యులర్ తరగతులతోపాటు ప్రతీ రోజు సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు గంట పాటు డిసెంబర్ వరకు ఒక పూట మాత్రమే ప్రత్యేక తరగతులు కొనసాగగా, జనవరి 1 నుంచి 52 రోజుల ప్రణాళికలు తయారు చేసిన ప్రభుత్వం ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా దూర ప్రాంతాల నుంచి పొద్దునే వచ్చే విద్యార్థులు ఆకలితో ప్రత్యేక తరగతులకు హాజరవుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అధ్యాపకులు స్వచ్చంద సంస్థలు, దాతల సహకారంతో అరకొరగా స్నాక్స్ సదుపాయాలు కల్పించారు. అయితే కనీసం బిస్కెట్లు, పాలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. డిసెంబర్ నుంచే కోరినా.. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 19 రోజులు మాత్రమే అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత డిసెంబర్ నుంచి అల్పాహారం అందించాలని విద్యాశాఖ ఆర్థిక శాఖను కోరగా కేవలం 19 రోజులకే అల్పాహారం అందించేందుకు ఆర్థికశాఖ అనుమతించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15లు చొప్పున రూ.285 అందించనుంది. ఈ లెక్కన జిల్లాలోని12,394 మంది విద్యార్థులకు సంబంధించి రూ.35,32,290లు నిధులు విడుదల చేసింది. పోషక విలువలతో చిరుతిళ్లు విద్యార్థులకు ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకు ఒక్కోరకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చ ఇప్పటి నుంచైనా అందిస్తే బాగుండేది ఫిబ్రవరి 16 నుంచి కాకుండా కనీసం ఇప్పటినుంచైనా అల్పాహారం అందిస్తే దూరప్రాంతాల నుంచి వచ్చే తమలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేది. పొద్దునే ఇంటి నుంచి తినకుండా వస్తున్నాం. ఉదయం, సాయంత్రం సమయంలో టీచర్లు చెప్పే పాఠాలు సక్రమంగా అర్థం కావాలంటే స్నాక్స్ను ఇప్పటినుంచే అందించాలి. సాజీద్, విద్యార్థి, న్యాల్కల్ ఫిబ్రవరి నుంచి అల్పాహారం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున జిల్లాలోని 12,394 మంది పది విద్యార్థులకు రూ.35,32,290 విడుదల చేసింది. వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డిటెన్త్ ప్రత్యేక తరగతులకుహాజరయ్యే విద్యార్థులకు.. -
పట్టించుకుంటే పర్యాటక శోభ
జహీరాబాద్: జహీరాబాద్కు సమీపంలో గల నారింజ ప్రాజెక్టును ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మారనుంది. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులో గల నారింజ ప్రాజెక్టు జహీరాబాద్–బీదర్ రహదారిపై ఉంది. ఐదు దశాబ్దాల క్రితం వ్యవసాయ భూముల సాగు కోసం దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు బీదర్ రహదారిపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రహదారిపై రాకపోకలు సాగించే వారు రిజర్వాయర్ను చూడటం, దీని గురించి తెలుసుకుని వెళ్తుంటారు. జహీరాబాద్–బీదర్ రహదారి వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేర పొడవు ఈ నారింజ ప్రాజెక్టు ఉంది. దీనిని రోడ్డు వైపు ట్యాంక్బండ్గా మార్చేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ట్యాంక్బండ్గా మారిస్తేతే పర్యాటకులతో సందడిగా మారుతుందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ట్యాంక్బండ్గా మార్చడంతోపాటు పలు అభివృద్ధి పనులు చేపడితే దారిన వెళ్లే వారే కాకుండా జహీరాబాద్ పట్టణ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు ఆహ్లాదం కోసం సందర్శించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకుగాను ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మాణం పూర్తిచేస్తే పర్యాటకులకు ఆహ్లాదం నారింజ ప్రాజెక్టు ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తే పర్యాటకులు సేదతీరేందుకు ఉపయోగపడనుంది. దీనికి దగ్గరలోనే సిద్ధివినాయక దేవాలయం కూడా ఉండటంతో అక్కడికి ప్రతీ నెల సంకట చవితి రోజున వేలాదిమంది భక్తులు దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తుంటారు. వారు కూడా సేదతీరేందుకు సౌకర్యంగా మారుతుంది. జహీరాబాద్ ప్రాంతంలో చెప్పుకోదగిన పార్కులు, పర్యాటక కేంద్రాలు లేనందున నారింజ ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపే అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు. అంచనాల తయారీలో అధికారులు ప్రాజెక్టును ట్యాంక్బండ్గా మార్చేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అంచనాల తయారీలో నిమగ్నమయ్యారు. రహదారి వైపున 6 మీటర్ల వెడల్పుతో బండింగ్ నిర్మాణం, బతుకమ్మ ఘాట్, రెయిలింగ్ నిర్మాణం, చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆటవస్తువులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కట్ట 3 నుంచి 6 మీటర్ల వెడల్పు కోసం ప్రతిపాదించనున్నారు. కట్టచుట్టూ, నీటివైపు వెళ్లినా కింద పడకుండా రెయిలింగ్ నిర్మించనున్నారు. సేదతీరేందుకు గార్డెనింగ్, సిబ్బంది నివాసం ఉండేందుకు వీలుగా డబుల్ బెడ్రూం, అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు జనరేటర్, వర్కర్ల కోసం రెండు గదులు, గెస్ట్హౌస్ నీరు ఉండే వైపున బండపరుపులు వేసి రాళ్లు పేర్చడం వంటి పనుల్ని ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.నిధులు కేటాయిస్తే నారింజకు మహర్దశ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేసే అవకాశం బీదర్ రహదారిపై ఉండటం కూడా అనుకూల అంశం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికుల డిమాండ్ -
ఫొటోలతో ఓటర్ల జాబితా ప్రచురించాలి
కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 12న ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి ఆమె హాజరయ్యారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఈనెల 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీ పోల్లో అప్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను వార్డుల వారీగా ఆయా స్టేషన్ల వద్ద ప్రచురించాలన్నారు.జాబ్మేళాలో 34మందికి ఉద్యోగాలుజహీరాబాద్: మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాకు మంచి స్పందన లభించింది. ఈ జాబ్మేళాలో 34 మంది ఎంపికయ్యారు. 9న ‘మెగా జాబ్ మేళా’ పటాన్చెరు టౌన్: పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విజ్ఞాన కేంద్రం, నిర్మాణ్.ఆర్గ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ టీఎస్ కేసీ కో ఆర్డినేటర్ విమల ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మెగా జాబ్మేళా ద్వారా పటాన్చెరు, పరిసర ప్రాంతాల ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. సమాజ సేవలో భాగస్వామ్యమవ్వాలిసీనియర్ సివిల్ కోర్టు జడ్జీ కవితాదేవి ఝరాసంగం(జహీరాబాద్): ప్రతీ విద్యార్థి చదువుతో పాటు పమాజ సేవలో భాగస్వామ్యం కావాలని జహీరాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జీ కవితాదేవి పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ఝరాసంగంలో చేపట్టిన ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆమె మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు తెలుసుకుని వాటిపై అవగాహన పెంచుకోవటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డాకే వివాహాలు చేసుకోవాలని హితవు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల హరికుమార్, ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్లు వెంకట్రామ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. శాసీ్త్రయపద్ధతుల్లో పప్పుధాన్యాల సాగుగొటిగార్పల్లిలో రైతు క్షేత్ర దినోత్సవం జహీరాబాద్: పప్పుధాన్యాల సాగుకు శాసీ్త్రయ పద్ధతుల అనుసరణ ఎంతో అవసరమని సీనియర్ శాస్త్రవేత్త సి.వరప్రసాద్ పేర్కొన్నారు. మోడల్ పల్స్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా మొగుడంపల్లి మండలంలోని గొటిగార్పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన రైతు క్షేత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని డీడీఎస్–కేవీకే ఆధ్వర్యంలో కందిపంట సాగుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కంది పంట సాగు పద్ధతులపై పంటల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు. మెరుగైన రకాల ఎంపిక, విత్తనశుద్ధి, పోషక యాజమాన్యం, సమగ్ర కీటక–వ్యాధి నియంత్రణ, దిగుబడుల పెంపు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు రైతులకు ఆయా అంశాలపై సూచనలు చేశారు. -
సైన్స్ ఫెయిర్ పోటీల్లో సత్తాచాటిన గుమ్మడిదల విద్యార్థి
జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి లక్ష్మీప్రసన్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో ప్రతిభ చాటింది. ఉపాధ్యాయురాలు శోభారాణి ప్రోత్సాహంతో లక్ష్మీప్రసన్న స్మోక్ క్యాన్సర్ ప్రాజెక్టును ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యంతో నియంత్రణ అంశాల్లో రూపొందించిన ఈ ప్రాజెక్టు పోటీల్లో ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంది. విద్యార్థి ప్రతిభను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. టీచర్లకు టెట్ నిబంధన తొలగించాలి: ఎస్టీయూ -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
హత్నూర(సంగారెడ్డి): బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం శివారులోని కొన్యాల గేటు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మండలంలోని చిక్ మద్దూర్కి చెందిన పుట్టి రమేష్(40) భార్య లక్ష్మితో మంగళవారం రాత్రి గొడవపడి దుస్తులు తీసు కొని బైక్పై బయలుదేరాడు. అతివేగంగా వెళ్తున్న ఆయన కొన్యాల గేటు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమేష్కు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం రాత్రి జరగడంతో బుధవారం ఉద యం రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయంపై భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
ప్రయోగాలకు పైసలొచ్చాయి
ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో ప్రయోగ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. గతేడాది ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి అందుకు రెట్టింగాపు ఒక్కో కళాశాలకు రూ.50వేల చొప్పున కేటాయించింది. ప్రయోగ పరీక్షల పరంగా ఇబ్బందులు పడే విద్యార్థులకు ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. పరీక్షా సమయంలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందస్తుగా నిధులను విడుదల చేసింది. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలకు రూ.50వేల చొప్పున జిల్లాకు రూ.10లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించారు. – నారాయణఖేడ్: కొన్ని చిన్న కళాశాలలు మరికొన్ని విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న కళాశాలలున్నాయి. దీంతో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, కొన్ని కళాశాలల్లో చాలా పరికరాలు లేకపోవడంలాంటి సమస్యలు నెలకొన్నాయి. ఏయే కళాశాలలకు ఎలాంటి పరికరాలు కావాలి, ఏయే రసాయనాలు అవసరం ఉంది అనే అంశాలపై ఆయా కళాశాలల వారీగా డీఐఓ ద్వారా కలెక్టర్ నివేదిక తెప్పించుకోనున్నారు. ఈ నివేదిక ప్రకారం డిస్ట్రిక్ పర్చేజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రాక్టికల్స్కు ఏ కళాశాలకు ఏమేమి అవసరమవుతాయో ఆ మేర కొనుగోళ్లు చేయనున్నారు. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు థియరీతోపాటు ప్రాక్టికల్ తరగతులు కూడా ఉంటాయి. తరగతుల నిర్వహణ సందర్భంగా విద్యార్థులు ప్రాక్టికల్స్ స్వయంగా చేస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. గత 9 ఏళ్లుగా కళాశాలల ప్రాక్టికల్స్కు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించడం గాలిలో దీపంలానే ముగించారు. గతేడాది నుంచి ప్రాక్టికల్స్కు నిధుల విడుదల ప్రారంభమైంది. కాగా, ఈ నిధులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో కొనుగోళ్లు -
పేట మున్సిపల్ అభివృద్ధికి కృషి
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలో నెలకొన్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకోసం అవసరమైన నిధుల మంజూరుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని సాయినగర్ కాలనీ నుంచి శ్రీ కృష్ణమందిరం వరకు రూ.50 లక్షల నిధులతో పూర్తయిన సెంటర్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభోత్సవం, పాత మున్సిపల్ భవనం స్థలంలో రూ.కోటితో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, 65వ నంబర్ జాతీయ రహదారి కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రూ.2 కోట్ల నిధులతో సెంటర్ లైటింగ్ డివైడర్ పనులకు భూమిపూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ...గత ప్రభుత్వం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయగా టెండర్ ప్రక్రియ పూర్తయి కొంత అభివృద్ధి జరిగాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని తిరిగి ఆ నిధులను టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి మంజూరు చేయించి మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయించాలని కోరారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మునిపల్లి సత్యనారాయణ, పట్నం విజయలక్ష్మి, అపర్ణపాటిల్, మాజీ కౌన్సిలర్లు కోవూరి శంకర్గౌడ్, నాగరాజ్గౌడ్, గుండురవి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి -
సమయపాలన పాటించని టీచర్లు
చిన్నశంకరంపేట(మెదక్): సర్కార్ బడుల్లో టీచర్ల సమయపాలనను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ సిస్టం ప్రవేశపెట్టింది. అయినా టీచర్లలో మార్పు రావడం లేదు. తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. బుధవారం చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి ఉన్నత పాఠశాలలో ప్రార్థన సమయానికి ముగ్గురు టీచర్లు మాత్రమే హాజరు కాగా, ఇన్చార్జి ఎంఈఓ, పాఠశాల హెచ్ఎంతో పాటు మరో ఏడుగురు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయులు హైదరాబాద్ నుంచి రైలులో రాకపోకలు సాగిస్తుండడంతో రైలు లేటు అయినప్పుడల్లా పాఠశాలకు లేట్గా రావడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ వచ్చిన తర్వాత స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, డీఈఓలు పర్యవేక్షణకు దూరమై.. కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ విషయంపై ఇన్చార్జి ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం పుష్పవేణి మాట్లాడుతూ.. పాఠశాలకు ఉపాధ్యాయులు అలస్యమైనప్పుడు సీఎల్ వేస్తున్నట్లు తెలిపారు. తాను రామాయంపేటలో పని ఉండండతో వెళ్లినట్లు తెలిపారు. -
ప్రారంభమైన అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియం అంతర్రాష్ట్ర కీజర్ యాఫై గోల్డ్కప్ క్రికెట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జహీరాబాద్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుభాష్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. ఎనిమిది రోజుల పాటు కొనసాగే క్రికెట్ టోర్నమెంట్లో పలు రాష్ట్రాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయి. విజేత జట్టుకు ఫస్ట్ ఫ్రైజ్ కింద రూ. 7 లక్షల నగదుతో పాటు గోల్డ్ కప్, రన్నరప్కు జట్టుకు రూ.4 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక అందజేయనున్నారు. మొదటి మ్యాచ్లో సేవాలాల్ జట్టు విజయం క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో హైదరాబాద్కు చెందిన అనస్ జట్టుపై జహీరాబాద్ సేవాలాల్ జట్టు 23 పరుగల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సేవాలాల్ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 163 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్కు దిగిన అనస్ జట్టు 9 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసింది. -
విధుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
ఇంటర్మీడియెట్ విద్యాధికారిని కలిసిన గెజిటెడ్ లెక్చరర్స్ప్రశాంత్నగర్(సిద్దిపేట): గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జిల్లా శాఖ సభ్యులు బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన లెక్చరర్లకు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సీఎస్డీవో డ్యూటీలు, పేపర్ వాల్యుయేషన్ సీవో, ఏసీవో డ్యూటీలతో పాటు ఇతర డ్యూటీలు ఇచ్చే సందర్భంలో ప్రాధాన్యత ఇవ్వాలని డీఐఈవోకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్షుడు రమేశ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, జనరల్ సెక్రెటరీ వంశీ, ఇతర లెక్చరర్లు పాల్గొన్నారు. -
ఆలు..ధర దిగాలు
సంగారెడ్డి జోన్: ఆరుగాలం కష్టపడి మంచి లాభాలు వస్తాయని ఎంతో ఆశతో సాగు చేసిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఆలు పంట సాగు చేసిన రైతులకు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వానకాలం సీజన్లో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటతో ఇతర పంటలు నష్టపోయారు. అనంతరం సాగుచేసిన ఆలు రైతులకు ప్రకృతి అనుకూలించినా మార్కెట్ మాత్రం అనుకూలించడం లేదు. దీంతో నష్టాలు చూడాల్సి వస్తుంది. ఈ నష్టాలతో రైతుల పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది. పంట కోత సమయంలోనే పతనం పంట సాగు చేసే సమయంలో మంచి ధర ఉండటంతో పంట కోత సమయంలో ధరలు అమాంతంగా పడిపోతున్నాయి. నిలకడగా ధరలు లేకపోవడంతో మార్కెట్కు వెళ్లేంత వరకు ధర ఏంటో తెలుసుకోలేక పోతున్నారు. పంట సాగు సమయంలో క్వింటాలుకు రూ.3 నుంచి రూ.4 వేల వరకు పలికింది. ప్రస్తుతం అందుకు భిన్నంగా పంట నాణ్యతను బట్టి రూ.1000 నుంచి రూ.1,500 వరకు పలుకుతుంది. ధర పెరుగుతుందేమోనని ఆశతో కొంతమంది రైతులు వేచి ఉండగా మరికొంతమంది రైతులు మాత్రం ఉన్న కొద్దిపాటి ధరకే మార్కెట్కు తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతితోనే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పంట హైదరాబాద్ మార్కెట్కు తరలుతోంది. అయితే పంట మొత్తం ఏకకాలంలో రావడం...పొరుగు ప్రాంతాల నుంచి సైతం దిగుమతులు పెరగడంతో స్థానికంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఆలు పంట సాగు చేసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, మనూర్, మునిపల్లి, మొగుడంపల్లి ప్రాంతాలలో ఎక్కువగా సాగవుతోంది. ప్రతీ ఏటా పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరాకు సుమారు రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఒక ఎకరా సాగు చేసిన పంట అమ్మితే రూ.1.20లక్షలు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు గిడ్డంగులు లేక అమ్మకాలు.. చేతికొచ్చిన పంట నిలువ ఉంచేందుకు స్థానికంగా కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో అమ్ముకోవాల్సి వస్తుంది. జిల్లాలోని పలుచోట్ల ఉన్నప్పటికీ కిరాయి ఎక్కువగా ఉండటంతో ఉంచుకోలేకపోతున్నారు. స్థానికంగా స్టోరేజ్లు ఉంటే మంచి ధర వచ్చినపుడు అమ్ముకునేందుకు వీలుంటుందని రైతులు చెబుతున్నారు. -
జల్సాల కోసమే దొంగతనాలు
● ఏడుగురు మైనర్ నిందితులు రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఎస్సై ప్రశాంత్ అక్కన్నపేట(హుస్నాబాద్): చోరీలకు పాల్పడిన మైనర్ నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని రామవరం, గండిపల్లి గ్రామాల్లో వరుసగా ధాన్యం బస్తాల చోరీలు జరగగా..పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే మండలంలోని గౌరవెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లను అపహరించారు. మద్దూరు ప్రభుత్వ పాఠశాల తాళాలు పగులగొట్టి ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లినట్లు విచారణలో మైనర్ బాలురు ఒప్పుకున్నారు. ఈ చోరీలకు పాల్పడిన మైనర్లది మండలంలోని బంజార హిల్స్తండా, సేవాలాల్ మహారాజ్తండా, దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని హనుమతండాలకు చెందిన మొత్తం ఏడుగురు మైనర్ నిందితులను అరెస్టు చేసి జువైనెల్ జస్టిస్ కోర్టులో హాజరుపరిచా రు. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం వారిని జువైనెల్ హోమ్కు తరలించాలని సూచించింది. ఈ కేసును ఛేదించిన ఎస్ఐను ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ అభినందించారు. -
439 వీఓ భవనాలు
జిల్లా వ్యాప్తంగా నిర్మాణానికి కసరత్తు● కేంద్ర నిధులతో ఊరూరా పక్కా భవనాలు ● మార్చిలోపు పూర్తి చేయాలని గడువు నంగునూరు(సిద్దిపేట): డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న గ్రామీణ మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్వయం సహాయక గ్రూపు సభ్యులకు ఊరూరా పక్కా భవనాలు నిర్మించాలనే సంకల్పంతో నిధులు మంజూరు చేసింది. మహిళాశక్తి పథకం కింద ఎమ్జీ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) గ్రూపులకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. మార్చి నెలాఖరు నాటికి భవనాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలోని 477 గ్రామ పంచాయతీలకు గాను 18,513 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కాగా 1,96,117 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గ్రామ సమైఖ్యలోని 20 నుంచి 25 గ్రూపులను విభజించి వీఓలను ఏర్పాటు చేశారు. గ్రూపునకు సంబంధించిన లావాదేవీలను ఏపీఎం, సీసీల పర్యవేక్షణలో సీఏలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 10న నిర్వహించే సమావేశాలకు చాలా గ్రామాల్లో సొంత భవనాలు లేక పోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కా భవనాలు మంజూరు జిల్లా వ్యాప్తంగా 726 వీఓలు ఉండగా కేవలం 287 సొంత భవనాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి నెల నిర్వహించే సమావేశాలకు పెద్ద ఎత్తున వచ్చే సభ్యులకు స్థలం లేకపోవడంతో విడుతల వారీగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎమ్జీ ఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం) కింద ప్రతి గ్రామంలో వీఓ భవన నిర్మాణం కోసం రూ 10 లక్షలు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా మొత్తం 439 భవనాలు నిర్మించాల్సి ఉండగా.. 219 నిర్మాణాలకు అనువైన స్థలం లభించింది. మార్చి నెలాఖరు వరకు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంకా 220 భవనాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. భవనానికి స్థల దాతల పేర్లు భవన నిర్మాణం కోసం గ్రామైఖ్య సంఘాలు తీర్మానం చేసి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆమోదంతో 250 గజాల అనువైన స్థలాన్ని గుర్తించి ఎంపీడీఓలకు అందజేయాల్సి ఉంటుంది. సెర్ప్, ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల ఆమోదంతో డీఆర్డీఓ పర్యవేక్షణలో కలెక్టర్ అనుమతి లభించగానే భవన నిర్మాణాలు చేపడుతారు. గ్రామ కంఠంలో అనువైన స్థలం దొరుకక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి స్థలం ఇస్తే భవనానికి వారి పేర్లు పెడుతామని అధికారులు పేర్కొంటున్నారు. లక్ష్యం పూర్తి చేస్తాం ఎమ్జీ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా వీఓ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. నూతనంగా ఎన్నికై న సర్పంచ్ల సహకారంతో ఈజీఎస్, సెర్ప్ అధికారుల సమన్వయంతో అనువైన స్థలాన్ని గుర్తిస్తున్నాం. కలెక్టర్ అనుమతితో త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – డీఆర్డీఓ జయదేవ్ఆర్యా -
తప్పుల తడక! మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు దొర్లాయి. వివరాలు 11లో u
ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్ఫిబ్రవరి 2 నుంచి మూడు విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ బ్యాచ్కు 25 మంది విద్యార్థుల చొప్పున ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. సీసీ కెమెరాలున్న కళాశాలలకు మాత్రమే ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రం కేటాయించనున్నారు. సీసీ కెమెరాలు లేని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సీసీ కెమెరాలున్న సమీపంలోని ప్రభుత్వ కళాశాలకు వచ్చి పరీక్షలు జరపాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా నిఘా నీడలోనే పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాల నీడలో జరగనున్న పరీక్షలను కళాశాలలో సీసీ కెమెరాలతో అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా జిల్లా కేంద్రంతోపాటు, ఇంటర్బోర్డు అధికారులు పర్యవేక్షించనున్నారు. గతేడాది ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున కేటాయించిన ఇంటర్బోర్డు అందులోంచి రూ.12వేల చొప్పున నిధులు సీసీ కెమెరాలకు కేటాయించింది. ఈ నిధులతో అన్ని కళాశాలల పరీక్షా కేంద్రాల్లో హై రిజుల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేయించింది. ఈ కెమెరాల నిఘా నీడలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. లైవ్లో అధికారులు పరీక్షల నిర్వహణ పరీక్షిస్తూ పారదర్శకత, సమగ్రతతోపాటు, భద్రతతను నిర్ధారించాలని భావిస్తున్నారు.నిఘా నీడలోనే.. -
జిల్లాకు విశేష సేవలందించారు
సంగారెడ్డి జోన్: జిల్లాలో విధులు నిర్వహించి పదోన్నతి పొంది బదిలీ అయిన అధికారులను బుధవారం కలెక్టరేట్లో సన్మానించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టర్గా పదోన్నతి పొంది నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. జిల్లా యువజన క్రీడాధికారి ఖాసీంబేగ్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్రావులు బదిలీ అయ్యారు. కలెక్టరు ప్రావీణ్యతోపాటు అధికారులు హాజరై పూలమాల, శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాకు విశేష సేవలందించారని ప్రశంసించారు. స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాండు, మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రావీణ్య -
షార్ట్ సర్క్యూట్తో కిరాణ షాపు దగ్ధం
కంది(సంగారెడ్డి): షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి కిరాణా షాపు దగ్ధమైంది. మండల కేంద్రంలోని నాల్గో వార్డులో సంగారెడ్డికి చెందిన మామిళ్ల నాగరాజు 13 ఏళ్లుగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. 15 నెలల క్రితం కంటైనర్ను కొనుగోలు చేసి అందులో కిరాణా షాపు నడుపుతున్నాడు. అయితే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రోజువారీగా షాపును మూసేసి ఇంటికి వెళ్లి పోయాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో కిరాణాషాప్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు నాగరాజుకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే షాపు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.18లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని బోరున విలపించాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని ముట్రాజ్పల్లి గామానికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యం సంఘటన మండలంలోని ముట్రాజ్పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఉలా ఉన్నాయి. ముట్రాజ్పల్లి గ్రామానికి చెందిన బంజ రవి అనార్యోగంతో ఈనెల 6న ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవి వ్యసాయం పొలం, పెద్దచెరువు సమీపంలో అతని పొలంవద్ద సెల్ఫోన్, ఒక చెప్పు కనిపించడంతో గ్రామస్తుల ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చి వెతికారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మతిస్థిమితం లేని వృద్ధురాలు.. చేగుంట(తూప్రాన్): మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన పొలంపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపిన ప్రకారం.. పొలంపల్లి గ్రామానికి చెందిన కిష్టపురం పెంటవ్వ అనే వృద్ధురాలు మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో మంగళవారం పెంటవ్వ ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లేనందున వృద్ధురాలి కొడుకు నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తిరుమలలో కోనాపూర్ వాసి.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని కోనాపూర్ వాసి తిరుమలలో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కోనాపూర్కి చెందిన చిరంజీ వీరన్న(62) తన మిత్రుడితో కలిసి తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈనెల 2న తిరుమల కొండపై బస చేసిన తర్వాత బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో తోటి మిత్రుడు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. బంధువులను, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో బుధవారం తిరుమల కొండపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికై న ఆచూకీ తెలిస్తే 9704953117, 9912256188 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి
పటాన్చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ 18వ జాతీయ మహాసభలలో సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై న చుక్కా రాములుకు బుధవారం శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... విద్యుత్ చట్ట సవరణతో, రైతు చట్టంతో, లేబరుకోడ్స్తో కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకొంటున్నదని తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు -
వందశాతం ఫలితాలు సాధించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధ్యాయులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేసి వందశాతం ఫలితాలు సాధించాలని ఎంజేపీ సొసైటీ ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ రాజేశం అన్నారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ గురుకుల పాఠశాల, కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్లో వందశాతం ఫలితాలు సాధించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలి పెద్దశంకరంపేట(మెదక్): విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి మాధవి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు పరీక్షలు, ప్రాక్టికల్స్పై అవగాహన పెంచుకోవాలని, భయాందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అలాగే ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ శోభారాణి, లెక్చరర్లు అనంతరాజశర్మ, ప్రభాకర్, హరిత, రాజు, మల్లేషం, శ్రీశైలం, జహీరాబేగం ఉన్నారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు నర్సాపూర్ రూరల్: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సీసీ కెమెరాలు అందజేయడం అభినందనీయమని ఎస్సై రంజిత్కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 2వ వార్డు ఇన్చార్జి, యువజన కాంగ్రెస్ నాయకుడు అంతారం సుధీర్గౌడ్ రూ. 80 వేలు విలువ చేసే సీసీ కెమెరాలను అందజేశారు. ఇటీవల 2వ వార్డులోని పలు ఇళ్లలో దొంగతనాలు జరిగి, నగదు బంగారం ఎత్తుకెళ్లారు. వార్డులో సీసీ కెమెరాలు ఉంటే దొంగల ఆచూకీ తెలిసేదన్నారు. విషయం తెలుసుకున్న సుధీర్గౌడ్ సొంత నిధులతో కెమెరాలు ఇవ్వడంతో పాటు వాటిని బిగించే పనులు చేయిస్తున్నాడని ఎస్సై కొనియాడారు. కొండపోచమ్మ హుండీ రూ.7.18 లక్షలు గజ్వేల్: జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ.7.18లక్షల ఆదాయం సమకూరింది. బుధవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. అమ్మవారికి 88 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈఓ రవికుమార్ తెలిపారు. మరోవారంలో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ తాజా మాజీ చైర్మన్ అనుగీత, సర్పంచ్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
కూడవెల్లి జాతరను ఘనంగా నిర్వహిద్దాం
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ● ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష దుబ్బాక: రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన కూడవెల్లి జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన అక్భర్పేట–భూంపల్లి మండలం రామేశ్వరంపల్లిలోని కూడవెల్లి రామలింగేశ్వర జాతర ఈ నెల 18న ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపర్చాలని ,తాత్కాలిక మరుగుదొడ్లు, అంబులెన్స్, ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు , విద్యుత్, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, సీసీ టీవీల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఊషయ్యగారి రాజిరెడ్డి, ప్రధాన అర్చకులు సాకేత్శర్మ, డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
పండుగకు 503 ప్రత్యేక బస్సులు
● సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ సర్వీసులు ● ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులుసంగారెడ్డి టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సర్వీసులతో పాటుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 503 ప్రత్యేక బస్సులను అదనంగా నడపనుంది. జనవరి 9 నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది ఆర్టీసీ డిపోలలో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచడంతో కొంతమేర ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత రవాణ సౌకర్యం ఉండటంతో దీనికి అనుకూలంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నాను. ఈనెల 11, 12, 13 ప్రత్యేక బస్సులు ఉంటాయి. పండుగరోజుల్లో సాధారణ బస్సులు నడవడంతో తిరుగు ప్రయాణంలో 16,17,18,19,20 తేదీలలో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్లే వారికి సెలవులు ఉండటంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా డిపోల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేకంగా బస్సులు కావాలన్నా, విహార యాత్రలకు కూడా ప్రత్యేకంగా బస్సులను పంపిస్తున్నారు.డిపో పేరు ప్రత్యేక బస్సులు మెదక్ 26 నారాయణఖేడ్ 112 నర్సాపూర్ 29సంగారెడ్డి 103 జహీరాబాద్ 52 సిద్దిపేట 95గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 63దుబ్బాక 23రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే వారికోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. రద్దీ పెరిగితే మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తాము. ప్రతి డిపోలలో సలహాలు సూచనల కోసం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాలకు వెళ్లే వారికి ప్రత్యేకంగా బస్సులు కావాలన్నా కూడా అందుబాటులో ఉంచుతాం. – విజయ్ భాస్కర్, ఆర్టీసీ ఆర్ఎం. -
ఖేడ్లోనే ఎంవీఐను ఏర్పాటు చేయండి
నారాయణఖేడ్: రవాణ శాఖకు సంబంధించి ఎంవీఐ శాఖను నారాయణఖేడ్లో ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల ఇబ్బందులు దూరం చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ..తన కోరిక మేరకు ఏడాది కాలంగా ప్రతీ గురువారం జహీరాబాద్ ఎంవీఐ ఇక్కడకు వచ్చి వాహనాల ఫిట్నెస్ చేస్తున్నారన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బీమా తదితరవాటి కోసం జహీరాబాద్ వెళ్లక తప్పడంలేదని చెప్పారు. రోడ్లు బాగాలేక ప్రమాదాలు జరుగుతుండగా అంతదూరం వెళ్లి లైసెన్సులు తీసుకోవడానికి యువత ఆసక్తి చూపడంలేదని వెల్లడించారు. ఖేడ్లో ఎంవీఐ శాఖ ప్రతిపాదన పంపగా కమిషనర్ వద్ద పెండింగులో ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఫొటో క్యాప్చర్లో ఇబ్బందులతో చాలామందికి బిల్లులు అందడంలేదని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న కౌలాస్ నాలా ప్రాజెక్టు ఉందని సింగూరు నుంచి కంగ్టి మండలానికి మిషన్ భగీరథ నీరందించడంలో ఇబ్బందులు ఎదురవుతుండగా కౌలాస్నాలా ప్రాజెక్టు వద్ద రూ.20 కోట్ల వరకు వెచ్చించి ఫిల్టర్ బెడ్లను ఏర్పాటుచేస్తే జుక్కల్, ఖేడ్ నియోజకవర్గాల్లోని 100 గ్రామాల వరకు తాగునీటిని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అందుకు కృషి చేయాలని కోరారు.అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిషిప్ మేళా
హత్నూర (సంగారెడ్డి): హత్నూర ఐటీఐలో ఈ నెల 12న ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ రాఘవేందర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకోవాలని బయోడేటాతో పాటు సంబంధిత విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలను స్వయంగా ఐటీఐలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 984 9546979కు సంప్రదించవచ్చని తెలిపారు.పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలిఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి సంగారెడ్డి జోన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు చెల్లించాల్సిన పెండింగ్ నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు పంపితే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన పది మంది ఎస్సీ రైతులకు డ్రాఫ్ట్ పాస్బుక్లను అందజేశారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, శంకర్, అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, అదనపు ఎస్పీ రఘునందన్రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించడం తప్పనిసరిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో రోడ్ సురక్ష అభియాన్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సంగారెడ్డిలోని ఆంథోని కళాశాలలో మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రవాణ అధికారి అరుణ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సమన్వయ కమిటీ నియామకంజహీరాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సమన్వయ కమిటీని బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే కె.మాణిక్రావు ఈ మేరకు మంగళవారం సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. మాజీమంత్రి టి.హరీశ్రావు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కమిటీలో ఎం.డి.తంజీం, నామ రవికిరణ్, మొహియొద్దీన్, బండి మోహన్, ఆర్.సుభాష్లకు స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు సమన్వయ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. కష్టపడి పనిచేసి ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకోవాలని సూచించారు. -
సమర్థవంతంగా నిర్వహించాలి
● మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన నోడల్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో ప్రావీణ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఎన్నికల సంఘం ఆదేశాలను అధికారులు పాటించాలన్నారు. జిన్నారంలో ఆకస్మిక తనిఖీలు జిన్నారం(పటాన్చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. 2012 నుంచి కొత్త ఓటర్ల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోగస్ ఓట్లను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వచ్చే నెలలో జరగనున్న వార్షిక పరీక్షలకు సంసిద్ధం కావాలని తెలిపారు. కళాశాలలో ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ కలెక్టర్కు విన్నవించారు. అనంతరం పక్కనే ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాసు, కమిషనర్ తిరుపతి, ఎస్సై హనుమంత్, ఆ యా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టికెట్ల ఖరారుకు కమిటీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పురపాలక పోరుకు సిద్ధమైన పార్టీలు అభ్యర్థిత్వాల ఎంపికపై పూర్తిగా దృష్టి సారించాయి. ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాల టికెట్ల ఖరారుకు కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీలపై తమ పార్టీల జెండాలను ఎగురవేసేందుకు గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు మున్సిపాలిటీల ఓటరు జాబితా సవరణ ప్రక్రియను చేపట్టిన విషయం విదితమే. దీంతో ఈ ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా, మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండటంతో పార్టీలు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ సమన్వయ కమిటీలు.. కౌన్సిలర్ అభ్యర్థిత్వాల ఖరారుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి నలుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటు సంగారెడ్డి, సదాశివపేట పురపాలక సంఘాల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు కోసం ఎమ్మెల్యే చింతప్రభాకర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. కమిటీలు వేసిన కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాల్లో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపుతో బల్దియా ఎన్నికలకు సై అంటోంది. సంగారెడ్డి నియోజకవర్గంలో మున్సిపాలిటీల వారీగా నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుని టికెట్లను ఖరారు చేసే బాధ్యతలను సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ కమిటీ సభ్యులకు అప్పగించినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున.. పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మున్సిపాలిటీలను కై వసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఒక్కో కౌన్సిల్ స్థానానికి ముగ్గురు చొప్పున (బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అనుగుణంగా) ఆశావహుల జాబితాలను సిద్ధం చేస్తోంది. ఆ పార్టీలోకి కొందరు ముఖ్య నేతలకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, పటాన్చెరు నుంచి ఐదు మున్సిపాలిటీల్లో ఈ కసరత్తు జోరందుకుంది. పోటాపోటీగా సన్నాహాక సమావేశాలు..మున్సిపల్ పోరు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆయా బల్దియాలపై తమ పార్టీల జెండాలను ఎగురవేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. టికెట్ల ఖరారుపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీ శ్రేణులను ఈ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఆశావహులతో సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. సంగారెడ్డితోపాటు, సదాశివపేటల్లో జరిగిన ఈ సన్నాహక సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం శ్రేణులను సిద్ధం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్హాలులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. మరోవైపు బీజేపీ సైతం ఈ సన్నాహాక సమావేశాలు నిర్వహించింది. సంగారెడ్డితో పాటు, పటాన్చెరు నియోజకవర్గాల కమలం పార్టీ ముఖ్య నేతలకు ఇటీవల పటాన్చెరు ఐబీలో జరిగిన సమావేశంలో ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.పురపోరుకు అభ్యర్థిత్వాల ఎంపికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు -
సంక్రాంతి తర్వాతే అందుబాటులోకి..
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు/పటాన్చెరు టౌన్: సంక్రాంతి పండుగ అనంతరం పటాన్చెరుకేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్న పాత తహసీల్దార్ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మితో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. శాశ్వత భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా ఈ భవనంలోనే కార్యాలయం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు. కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పాత అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల అఖిలపక్ష బృంద సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకుని వెళ్లి నూతన డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గులాబీయింగ్ ఫలించేనా!
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయ గందరగోళ పరిస్థితి నెలకొంది. గ్రామాలు పట్టణ ప్రాంతాలుగా మారాయి. మున్సిపాల్టీలు గ్రేటర్లో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నాయకులకు రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నాయి. స్థానిక ఎమ్మెల్యే తీరుతోనూ స్థానికంగా రాజకీయ నాయకుల్లో అయోమయం నెలకొంది. ఏ గ్రామంలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇతర పార్టీల ప్రభావం పెద్దగా లేదు. అయితే బీఆర్ఎస్ క్యాడర్ తమ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారనే కారణంగా అయోమయంలో పడింది. దీంతో వారందరూ మళ్లీ బీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కారు గుర్తుపై పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అనుచరవర్గం తీవ్ర గందరగోళంలో పడింది. బీఆర్ఎస్ నుంచి తమకు బీఫామ్లు అందే అవకాశం లేదనే ఉద్దేశ్యంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరారని స్థానికంగా తామంతా కాంగ్రెస్లోనే ఉన్నామని ఎమ్మెల్యే అనుచరులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్లో మాత్రం ఆయనకు రీ ఎంట్రీ లేదని ఆ పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇదిలాఉండగా త్వరలో పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అనుచరులు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. దీంతో కొందరు నాయకులు ఇతర పార్టీలవైపు దృష్టి సారించారు. క్యాడర్ను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే కొత్త ఎత్తుగడ వేశారని చెప్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ప్రజలతో సత్సంబంధాలున్నాయి. ఆయన తన అనుచరులను కాపాడుకునేందుకు ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించి వారందరినీ బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే సంకేతాలు ఇచ్చారని చెప్తున్నారు. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి ఇటీవల స్థానిక నేతలతో కలిసి వెళ్లి బీఆర్ఎస్ నేత హరీశ్రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఇది తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తమ్మీద గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారందరూ మళ్లీ బీఆర్ఎస్లో చేరనున్నారు. నియోజకవర్గంలో గతంలో కారు గుర్తుపై పోటీ చేసి ఆపై కాంగ్రెస్లో చేరిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఇతర ముఖ్య నాయకులంతా గూడెం మధుసూదన్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సర్పంచ్ కావాలనే ఆశలు ఆవిరి నియోజకవర్గంలో 55 గ్రామ పంచాయతీలు ఉండేవి. అందులో ఇప్పుడు 11 పంచాయతీలు మాత్రమే మిగిలాయి. ఇటీవల ఆ పదకొండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆ 55 పంచాయతీల్లో సర్పంచ్లుగా ఉన్న వారు, ఈసారి ఎలాగైనా సర్పంచ్లుగా కావాలని కలలు కన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. గ్రామాల సంగతి అలా ఉండగా, పటాన్చెరు నియోజకవర్గంలో గ్రేటర్లో విలీనం కాక ముందు మూడు మున్సిపాల్టీలు కలిపి 64 వార్డులు ఉండేవి. అలా మున్సిపాల్టీల్లోని కౌన్సిలర్లకు ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు అమీన్పూర్లో 24 మంది కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు అదే విస్తీర్ణంలో అన్ని వార్డులు కలిపి నాలుగు డివిజన్లుగా మారాయి. దాంతో కౌన్సిలర్లుగా పని చేసిన వారిలో చాలామంది ప్రజాసేవ నుంచి రిటైర్ తీసుకోవడం తప్ప వేరే అవకాశం లేదని చెప్తున్నారు.పటాన్చెరులో రాజకీయ గందరగోళం ఎమ్మెల్యే సోదరుడి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి రీ ఎంట్రీ ప్లాన్ పట్టణీకరణ నేపథ్యంలో గ్రామ రాజకీయాలకు ఫుల్స్టాప్ -
8 రోజులు..16 జట్లు
● నేటి నుంచి అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు ● ఆహ్వాన కమిటీ ప్రతినిధి రాములునేత జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియం అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలకు సిద్ధమైంది. బుధవారం నుంచి ఈ నెల 14 వరకు కీజర్ యాఫై క్రికెట్ టోర్నమెంట్కు బాగారెడ్డి స్టేడియం ముస్తాబైంది. ఈ మేరకు ఆహ్వాన కమిటీ అధికార ప్రతినిధి రాములు నేత టోర్నమెంట్ వివరాలను మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గత నాలుగేళ్ల నుంచి కీజర్ యాఫై అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా స్థానిక బాగారెడ్డి స్టేడియంలో నిర్వహించే క్రికెట్ పోటీలకు దేశంలోని 16 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. విజేత జట్టుకు ఫస్ట్ ఫ్రైజ్ కింద రూ.7 లక్షల నగదుతో పాటు ట్రోఫీ, రన్నరప్కు జట్టుకు రూ.4 లక్షల నగదుతోపాటు జ్ఞాపికను అందజేస్తామన్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సీరీస్లకు సంబంధించి నగదు బహుమతులను అందజేస్తామన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు హీరు రాథోడ్, అక్బర్, గోవర్థన్రెడ్డి, భీంరావు, జుబేర్, లష్కర్,మోహన్,ప్రవీణ్, ఫిరోజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కరపత్రం విడుదల చేశారు. -
గ్రామాల్లో ఐదేళ్లు పనిచేయాలి
● ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ● అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఐదారేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధనలు విధించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...పిల్లల చదువుల కోసం పట్టణాలు, నగరాల్లో, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుండటం, గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్నా డిప్యూటేషన్పై వెళ్తుండటంతో గ్రామీణప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడంలేదన్నారు. విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతానికే పరిమితమవుతున్నాయన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు. నిజాంసాగర్ సమీపంలోని ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ను పునరుద్ధరిస్తే ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాలకు మేలు చేకూరుతుందని వివరించారు. హాస్టల్ బెడ్స్ అమ్మకం సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్కు సరఫరా అయిన బెడ్స్, మంచాలను అమ్ముకున్నట్లు సంజీవరెడ్డి అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకొవచ్చారు. ఈ హాస్టల్ వార్డెన్ 8 ఏళ్లుగా లాంగ్స్టాండింగ్గా ఉండటం, పిల్లలకు సక్రమంగా భోజనం పెట్టడంలేదని పిల్లలు చెప్పారన్నారు. కాగా హాస్టల్ బెడ్స్, మంచాలు అమ్ముకున్న విషయం సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన విషయం విదితమే. లాంగ్ స్టాండింగ్ ఉన్న వార్డెన్లు, ఉద్యోగులను బదిలీలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఏఎస్డబ్ల్యూఓ పర్యవేక్షణ, టూర్ డైరీ సక్రమంగా చేపట్టడంలేదని పేర్కొన్నారు. -
మున్సిపోల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేట(సంగారెడ్డి): అధికారం లేదని అధైర్యపడవద్దని బీఆర్ఎస్కు మంచివాతావరణం ఉందని ప్రజలంతా బీఆర్ఎస్వైపు చూస్తున్నారని, మీరంతా కలిసి క్రమశిక్షణ ఐక్యమత్యంతో పనిచేస్తే సదాశివపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేయడం తఽథ్యమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం పట్టణ పరిధిలోని ఓ ఫాంహౌజ్లో 26 వార్డుల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై దిశానిర్ధేశనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చైతన్య పరచాలని సూచించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల హామీల అమలులో జరిగిన వైఫల్యాలను నాయకులు కార్యకర్తలు వార్డుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. ఎన్నికలు వస్తున్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. వార్డుల రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఐకమత్యంతో పనిచేసి పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి శ్రమించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లన్న, పార్టీ నాయకులు శివరాజ్పాటిల్, కొత్తగొల్ల కృష్ణ,కోడూరి రమేశ్, అంజయ్య, పెద్దగౌడ్, ముస్తఫా, విద్యాసాగర్రెడ్డి, చంద్రశేఖర్, మక్సుద్, మోబిన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
చట్టబద్ధ ప్రయోజనాలతో పరిహారం
సంగారెడ్డి జోన్: పరిశ్రమల ఏర్పాటులో భూములు కోల్పోయే రైతులకు చట్టబద్ధ ప్రయోజనాలతో పరిహార అవార్డులు అందించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో నిమ్జ్, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులతో భూసేకరణపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ కీలకం అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన పరిహార అవార్డుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మొత్తం 12,635 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు 6,500 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేక అధికారి విశాలాక్షి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్ సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓ రాజేందర్, దేవుజాతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి 42 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమానికి 42 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్, భూ తగాదాలు, పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖలతో పాటు తదితర శాఖలపై ఫిర్యాదులు చేశారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వీఆర్వో పాండు ఉన్నారు. ముందస్తు సమాచారం అందించాలిసింగూరు డ్యామ్ మరమ్మతులపై కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: సింగూర్ డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో నీటిని ఖాళీ చేసే సమయంలో ముందస్తుగా రైతులు, ప్రజలకు సమాచారం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. డ్యామ్ మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.కలెక్టర్ ప్రావీణ్య ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావోకార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో విద్యా, క్రీడా రంగాలలో పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందించారు. -
మెట్రో ప్రయాణం సంతోషంగా ఉంది
ఎమ్మెల్సీ అంజిరెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు): మెట్రో రైల్లో ప్రయాణం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. సోమవారం రామచంద్రాపురంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ...మండలి శీతాకాల సమావేశాలకు మియాపూర్ నుంచి అసెంబ్లీ వరకు మెట్రో రైల్లో వెళ్లినట్లు వివరించారు. మైట్రో రైలులో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సకాలంలో గమ్యానికి చేరుకుంటామని తెలిపారు. తప్పుల్లేకుండా జాబితా రూపొందించాలికమిషనర్ జగ్జీవన్ నారాయణఖేడ్: తప్పులు లేకుండా ఓటరు జాబితాలను రూపొందించే విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఖేడ్ మున్సిపల్ కమిషనరు జగ్జీవన్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకోసం ఆదివారం వరకు 113 దరఖాస్తులు వచ్చాయన్నారు. అభ్యంతరాలకు సోమవారం సాయంత్రమే సమయం ఉండగా ఆలోపు అభ్యంతరాలను రాతపూర్వకంగా అందించాలని కమిషనరు సూచించారు. ఈనెల 10న తుదిఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. అందోల్ పిల్లలు అదరగొట్టారుజిల్లాస్థాయి క్రీడల్లో మెరిసిన పాలిటెక్నిక్ విద్యార్థులు జోగిపేట(అందోల్): మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్మీట్ (ఐపీఎస్జీఎం)లో అందోలు–జోగిపేట బాలికల పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థినులు వివిధ క్రీడల్లో అదరగొట్టారు. ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానాన్ని నిలబెట్టుకోగా, అథ్లెటిక్స్లో ఓవరాల్ చాంపియన్షిప్ను దక్కించుకున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వాణి సోమవారం మీడియాకు వెల్లడించారు. క్రీడల్లో మంచి ప్రతిభను కనబరిచి కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్తోపాటు కళాశాల సిబ్బంది అభినందించారు మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయవద్దుజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్ : మొబైల్లో మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు. సంగారెడ్డిలోని పయనీర్స్ పాఠశాలలో రోడ్డు భద్రతపై సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో రోడ్ సురక్ష అభియాన్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటంఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పటాన్చెరు: కార్మిక హక్కుల కోసం ఐఎన్టీయూసీ రాజీలేని పోరాటం చేస్తోందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు పారిశ్రామికవాడలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో హమాలీ కార్మికులకు సోమవారం గ్రాడ్యూటీ, ఇన్సూరెన్స్ను ఇప్పించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ..హమాలీ కార్మికులకు కోసం ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి నాయకత్వంలో హమాలీ కార్మికులకు కార్మిక సంఘం ఏర్పాటు చేసి అనేక వేతన ఒప్పందాలు చేశామన్నారు. -
మైనారిటీలకు మరో అవకాశం
ఆర్థిక భరోసా పథకాల దరఖాస్తుకు గడువు పెంపుసంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల ఆర్థిక భరోసాకు రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. గతేడాది ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన, రేవంతన్నకా సహారా మిస్కిన్ కో లియే పథకాలను లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించింది. మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, పేదలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పథకాలు అమలు చేసేందుకు రూ.30 కోట్లను కేటాయించింది. రాష్ట్రం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అమలు కానున్నాయి. ఎన్నికల కోడ్తో నిలిచి.. ఈ పథకాలకు గతేడాది అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా సెప్టెంబరులో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలతో దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో మైనార్టీల అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును పెంచారు. అర్హత గల మైనార్టీలు దరఖాస్తు చేసుకునేందుకు ttps://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 వరకు ఆన్లైన్ విధానంలో నమోదు చేసుకుని స్థానిక మండల పరిషత్తు, మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో 2లక్షలకు పైగా మైనార్టీలు 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 2.49లక్షలకు పైగా మైనార్టీలున్నారు. ఇప్పటివరకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కోసం 1503, రేవంతన్నా కా సహారా మిస్కినో కేలియే పథకం కోసం 222 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రూ.50 వేలతో ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం ద్వారా రూ.50 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. నిరాశ్రయులు, వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, ఒంటరి మహిళలు లబ్ధి పొందనున్నారు. చిన్నపాటి వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఆర్థికంగా సాయం అందించనున్నారు. మోపెడ్ వాహనాలకు 100% సబ్సిడీతో రూ.లక్ష రేవంతన్నా కా సహారా మిస్కినో కేలియే పథకం ద్వారా 100% సబ్సిడీతో మోపెడ్, ఈ చార్జింగ్ వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్ష అందించనున్నారు. మైనారిటీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పథకాలను ప్రవేశపెట్టారు.ఇవీ అర్హతలు అర్హతలు -
ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయండి
పటాన్చెరు టౌన్: పటాన్చెరు డివిజన్ పరిధిలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలకనుగుణంగా నూతన ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సైబరాబాద్ కమిషనర్ రమేశ్రెడ్డిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఉదయం రమేశ్రెడ్డితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంగా పనిచేయాల్సిన ఏసీపీ కార్యాలయాన్ని ఆర్సీపురం కేంద్రంగా ఏర్పాటు చేశారని దీంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. పటాన్చెరులో అధునాతన సౌకర్యాలతో డీఎస్పీ భవన నిర్మాణ పనులకు ఇటీవలే శంకుస్థాపన చేశామని..పనులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నూతన భవనంలోనే పటాన్చెరు ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కొల్లూరు పోలీస్స్టేషన్ను నార్సింగి ఏసీపీ కార్యాలయం పరిధిలోకి చేర్చారని, రామచంద్రపురం ఏసీపీ పరిధిలోని చందానగర్ పోలీస్స్టేషన్కు బదులుగా కొల్లూరు పోలీస్స్టేషన్ను చేర్చాలని కోరారు. దీని మూలంగా పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. పటాన్చెరు కేంద్రంగా పనిచేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ విభజన ప్రక్రియలో ఇస్నాపూర్ పరిధిలోకి వెళ్లిందని దీనిని వెనక్కి తీసుకుని నూతన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రమేశ్రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. -
తేలిపోయాయి
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026సంతకాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరువుల పరిరక్షణ సర్వేలో అధికారుల అడ్డగోలు వ్యవహారాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఓ చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ట్యాంక్ లెవల్), బఫర్జోన్ విస్తీర్ణాలను 14 ఎకరాలు తగ్గించేందుకు వేసిన పన్నాగంలో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. రూ.కోట్లు విలువ చేసే ఈ చెరువు విస్తీర్ణం విషయంలో ఫైనల్ నోటిఫికేషన్ కోసం పంపిన ఫైలులో సదరు మండలంతో సంబంధంలేని ఓ అధికారి సంతకాలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బదిలీ వేటు పడిన ఈ అధికారి పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుని తనకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ ఫైలుపై సంతకాలు చేసినట్లు నీటిపారుదలశాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆశాఖ ఉన్నతాధికారుల వద్దకు వచ్చిన ఈ ఫైలులో సంబంధం లేని ఈ అధికారి సంతకం కనిపించడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి లోతుగా పరిశీలించడంతో ఈ పన్నాగం బయటపడినట్లు తెలిసింది. దీంతో ఈ ప్రతిపాదనల ఫైలును తిప్పి పంపినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పాతుకుపోయిన మరో ఉన్నతాధికారి కూడా ఈ కుట్రలో పాత్ర ఉన్నట్లు సమాచారం. రూ.కోట్లు విలువ చేసే చెరువు భూమిని చెరబట్టేందుకు అక్రమార్కులు వేసిన స్కెచ్కు ఈ ఇద్దరు అధికారులు వంతపాడినట్లు ఆశాఖ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది.అస్తవ్యస్తంగా చెరువుల పరిరక్షణ సర్వే.. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణలో భాగంగా చేపట్టిన సర్వే అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న సంగారెడ్డి, కంది, హత్నూర, జిన్నారం, రామచంద్రాపురం, పటాన్చెరు, గుమ్మడిదల, అమీన్పూర్ మండలాల్లో సుమారు 496 చెరువులున్నాయి. ఈ చెరువులన్నింటికీ ఫైనల్ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ కొనసాగుతోంది. నీటిపారుదలశాఖతోపాటు, హెచ్ఎండీఏ, రెవెన్యూ, సర్వే అండ్ రికార్డుల శాఖలు సంయుక్తంగా చేస్తున్న ఈ సర్వేలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన ఎఫ్టీఎల్తోపాటు, బఫర్ జోన్ల నిర్ధారణలో కొందరు అధికారులు చెరువులను చెరబట్టిన అక్రమార్కులకు భూమి కలిసొచ్చేలా ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చెరువుల విస్తీర్ణం రికార్డులను సైతం మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను సదరు అక్రమార్కులు రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన చెరువులపై లోతైన విచారణ జరిపితే ఈ అధికారుల బాగోతాలు మరిన్ని వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఫైనల్ నోటిఫికేషన్ ఈ సర్వే ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా ఆశాఖ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే చెరువులు కనుమరుగుకాకుండా కాపాడటం సాధ్యమవుతుందని అంటున్నారు. -
గాంధీ పేరు తీసేసి కేంద్రం తప్పు చేసింది
ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం ముగింపు సభలో ఎంపీ సురేశ్ షెట్కార్సంగారెడ్డి: ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని ఎంపీ సురేశ్ షెట్కార్ విమర్శించారు. నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడురోజులపాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసీ కార్యకర్తల, నాయకుల శిక్షణ శిబిరం సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ...ఉపాధి హామీ పనుల పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం కావాలనే తీసేసిందని, ఈ చర్యకు నిరసనగా పార్లమెంట్లో పోరాడుతామన్నారు. పేదలకు ఉపాధి కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ...నారాయణఖేడ్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. దేశ స్వాతత్య్రం కోసం పోరాటం చేయని వారు గాంధీ బొమ్మను తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఇలాంటి కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ శిక్షణ శిబిరంలో కార్యకర్తలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండాగా రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చిరుత సంచారంపై ఆరా!
తాడూరులో పర్యటించిన ఫారెస్ట్ అధికారులు చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని తాడూరులో సోమవారం జిల్లా అటవీ శాఖ అధికారులు పర్యటించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ వ్యవసాయ పనులు చేస్తుండగా చిరుత వచ్చిందన్న చెప్పడంతో సర్పంచ్, కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన అధికారులు చిరుత పులికి సంబంధించిన గుర్తులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిరుత సంచరిస్తుందన్న చెప్పడంతో వచ్చామని, తాము పరిశీలించిన ఆనవాళ్లు ఏవి చిరుతకు సంబంధించినవి కావని తెలిపారు. మహిళతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న వారిని అడగగా తామెవరం చూడలేదన్నారు. ప్రస్తుతం చిరుత సంచారం, ఆనవాళ్లు ఏమి లేవని, ఏదైనా అనుమానం ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈజీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం రూ.18 వేల జరిమాన బెజ్జంకి(సిద్దిపేట): ఉపాధి హామి పనుల వివరాలు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఈజీఎస్ మండల సిబ్బందికి రూ.18వేల జరిమాన విధించిట్లు ఎంపీడీఓ ప్రవీణ్ తెలిపారు. బెజ్జంకి రైతు వేదికలో ఉపాధి హామి మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. 3.42 కోట్లతో మండలంలో 466 పనులు చేపట్టినట్టు వివరించారు. వాటి రికార్డులను సక్రమంగా నమోదు చేయందుకు ఏపీఓ రాజబాబుతో పాటు టీఏలు, కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్గౌడ్, సంతోష్, సతీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మహిళ అదృశ్యం నర్సాపూర్ రూరల్: మహిళ అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అద్మాపూర్కు చెందిన వడ్ల వీరమణి (62) ఈనెల 3వ తేదీన ఇంట్లో జరిగిన గొడవల కారణంగా అదే రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల వారితో పాటు బంధువుల వద్ద ఆరా తీశారు. అయినా జాడ తెలియరాలేదు. దీంతో ఆలస్యంగా సోమవారం ఆమె కుమారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని గాలిస్తున్నట్లు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో మూడు రోజుల జైలుసంగారెడ్డి జిల్లా న్యాయస్థానం తీర్పు సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డి పల్లి చౌరస్తా, బైపాస్లోని గుర్రపు బొమ్మ, పాత బస్టాండ్, ఐబీ వద్ద నిర్వహించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 33 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరి మూడు రోజులు జైలు, మరో ముగ్గురికి రెండు రోజులు జైలుశిక్ష, మిగతా ఇద్దరికి రూ. 2000, పదిమందికి రూ.1500, 17 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు తెలిపారు. 8 మందికి ఒకరోజు జైలు గజ్వేల్రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో 8 మందికి ఒకరోజు జైలు శిక్ష పడినట్లు గజ్వేల్ సీఐ రవికుమార్ తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో 12 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి గౌడ్ ఎదుట హాజరు పర్చగా విచారణ అనంత రం నలుగురికి రూ. 40వేల జరిమానా, మరో 8 మందికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. -
ముగ్గురు మోసగాళ్లు అరెస్టు
రామాయంపేట(మెదక్): గుప్త నిధులు వెలికితీస్తాం.. జాతకం చెపుతామని ప్రజలను మోసగిస్తున్న ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్ కథనం ప్రకారం.. కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్లా జిల్లాకు చెందిన కడమంచి రాజారాం, రాకేశ్, సాదుల అశోక్ అనే ముగ్గురు వ్యక్తులు వచ్చి మీఇంటిలో బంగారం ఉందని, తీసి ఇస్తామని నమ్మబలికారు. వారిని నమ్మిన బాధితుడు నాలుగు లక్షల రూపాయాలు ఇచ్చారు. నాలుగైదు రోజుల తరువాత నష్టపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేస్తున్నారు. గ్రామాల్లోకి ఎవరైనా వస్తే తమకు సమాచారం అందజేయాలని సీఐ సూచించారు. ఎస్ఐ బాల్రాజు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రతిభ చాటి.. పతకాలు సాధించి..
దుబ్బాకటౌన్: హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో దుబ్బాక విద్యార్థులు ప్రతిభ చాటారని కరాటే మాస్టర్ శ్రీకాంత్ తెలిపారు. దాదాపు రెండు వేల మంది పాల్గొన్న ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఐదుగురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా సత్తా చాటిన విద్యార్థులను, మాస్టర్ శ్రీకాంత్ను సినీ హీరో ఇంద్రసేన అభినందించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులను తల్లిండ్రులు, స్థానికులు ప్రశంసించారు. కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు హుస్నాబాద్: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హు స్నాబాద్కు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ సాధించి పతకాలు సాధించారు. సోమవా రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతిభ సాధించిన విద్యార్థులను ఎంఈఓ బండారి మనీల అభినందించారు. ఈ నెల 4న వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల, బీసీ హాస్టల్, మోడల్ స్కూల్ విద్యార్థులు కరాటే విభాగాల్లో ప్రతిభ సాధించి పతకాలు సాధించారు. కార్యక్రమంలో హెచ్ఎం వాసుదేవరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, కరాటే మాస్టర్ రాజు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
రాజయ్యకు విశిష్ట సాహితీ సేవ పురస్కారం
నారాయణఖేడ్: తెలుగు సాహిత్య సేవలో విశేషమైన కృషి చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఖేడ్కు చెందిన డాక్టర్ వడ్ల రాజయ్యకు విశిష్ట సాహితీసేవా పురస్కారం లభించింది. చిట్టితల్లి శతకంతోపాటు అనేక రచనలు చేసి ఆశావాది ప్రకాశరావు అవధానంపై పరిశోధనలు చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రాజయ్య డాక్టరేట్ పట్టా పొందారు. సంగారెడ్డి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో సోమవారం రాజయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఖేడ్ రసగీతి సాహితీసంస్థ అధ్యక్షులు మహారెడ్డి మహిపాల్ రెడ్డి, సాహితీ మిత్రమండలి సభ్యులు భూమయ్య, నాగభూషణం, చంద్రకాంత్, జగదీష్, చంద్రశేఖర్ తదితరులు రాజయ్యను అభినందించారు. -
శాస్త్రవేత్తల సలహాలు తప్పనిసరిగా పాటించాలి
డాక్టర్.ఆర్.ఉమారెడ్డి సంగారెడ్డి టౌన్: రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా లు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ మండలం సహాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఉమా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డిలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పరిశోధన ఫలితాలు విస్తృతంగా ఉన్నాయని, విస్తరణ కార్యక్రమా ల అభివృద్ధి మన జిల్లాలో రైతులకు ఎలా అమలు అవుతున్నాయో క్లుప్తంగా వివరించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వానాకాలం, యాసంగి సంబంధించిన క్షేత్ర పరిశీలనకు సంబంధించిన వ్యవసాయ సాంకేతిక కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, నాణ్యమైన విత్తనం రైతన్న కు నేస్తం వంటివి పవర్ పాయింట్ ద్వారా అధికారుల సమక్షంలో రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వర్, యూనివర్సిటీ ప్రత్యేక అధికారి వసంత, శాస్త్రవేత్తలు కె.రాహుల్, విశ్వకర్మ, డా. నిర్మల. డా. అరుణ, డా.పల్లవి, రైతులు పాల్గొన్నారు. -
ఐక్యంగా ఉంటేనే హక్కుల పరిరక్షణ
ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుసిద్దిపేటకమాన్: ఓసీలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను కాపాడుకోగలమని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. హన్మకొండలో జనవరి 11న లక్ష మందితో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమారం సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సమరభేరి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్రెడ్డి, జిల్లా మహిళా ఐకాస వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమారెడ్డి, కృష్ణమూర్తి, వంగ శైలజ, శ్రీనివాస్, రవి, రాజేంద్రప్రసాద్, దామోదర్ పాల్గొన్నారు. -
సజావు ఎన్నికలకు పార్టీలు సహకరించాలి
జహీరాబాద్ టౌన్: మున్సిపల్ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీ లు సహకరించాలని తహసీల్దార్ దశరథ్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ కోరారు. మున్సిపల్ సమావేశ మందిరంలో సోమ వారం వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర కీలక అంశాలపై రాజకీ య పార్టీలతో చర్చించారు. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు,ఫిర్యాదులను స్వీకరించారు. ఈ నెల 10న తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. డ్రగ్స్ పట్టివేతజహీరాబాద్ టౌన్: మండలంలోని రాష్ట్ర సరిహద్దులో గల చెక్పోస్టు వద్ద సోమవారం ఎండీఎంఏ డ్రగ్స్ను పట్టుకున్నట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్కు చెందిన అనిరుధ్రెడ్డి వద్ద 0.42 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించిందన్నారు. మరో రెండు వాహనాల్లో 22 లీటర్ల మద్యం బాటిళ్లు దొరి కాయి. కాగా వాటిని తీసుకొస్తున్న రమేశ్, జగదీశ్ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి జహీరాబాద్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు అబ్కారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేపు జహీరాబాద్లో జాబ్ మేళా జహీరాబాద్ టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 7న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం విశ్వేశర్గౌడ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాలో పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ప్రతినిధులు హాజరవుతారన్నారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్ చదివిన 25 సంవత్సరాల వయసు కల్గిన యువతీ యువకులు అర్హులన్నారు. -
‘మోడల్ పార్లమెంట్’కు రెఢీ
● వర్గల్ నవోదయలో సర్వం సిద్ధం ● పోరుకు గుజరాత్, కేరళ విద్యార్థులు ● హాజరుకానున్న ప్రముఖులు నేడు జాతీయస్థాయి పోటీలు వర్గల్(గజ్వేల్): జాతీయస్థాయి యూత్పార్లమెంట్ పోటీలకు ఉమ్మడి మెదక్జిల్లా వర్గల్ నవోదయ సిద్ధమైంది. విద్యార్థులలో ప్రజాస్వామ్య విలువల పెంపు, చట్టాలు, వాటి రూపకల్పన, నాయకత్వ లక్షణాలు పెంపు, సామాజిక స్థితిగతులపై అవగాహన ధ్యేయంగా ప్రతి సంవత్సరం నవోదయ విద్యాలయ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో భాగంగా 27వ జాతీయస్థాయి యూత్ పార్లమెంట్ (మోడల్ పార్లమెంట్) పోటీలకు వర్గల్ నవోదయ వేదికగా నిలుస్తున్నది. ఆకట్టుకునే స్వాగత తోరణాలతో పోటీలకు ముస్తాబై అతిథులకు, ఆయా జట్లకు ఆహ్వానం పలుకుతోంది. వర్గల్ నవోదయ వేదికగా యూత్ పార్లమెంట్ పోటీలకు ముఖ్యఅతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్రావు, భారతప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనీల్కుమార్, నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరా, భోపాల్ రీజియన్ అసిస్టెంట్ కమీషనర్ డీకే సింగ్, న్యూఢిల్లీ విద్యాలయ సమితి ఏఎస్ఓ అంకిత్ ముద్గల్ హాజరవుతున్నట్లు స్థానిక నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. పోటీలు తిలకించి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారు. విజేతగా నిలిచిన జట్టు జాతీయ స్థాయి పోటీలకు అర్హతసాధిస్తుందన్నారు. -
కలిసి తిరిగిన వాడే హంతకుడు
వర్గల్(గజ్వేల్): నాచారం వద్ద వివాహిత హత్యకేసు మిస్టరీ వీడింది. రూ.10 వేలు డబ్బులు కావాలని బెదిరిస్తుండటంతో, కలిసితిరిగిన వ్యక్తే మహిళ మెడకు తాడు బిగించి హత్యచేశాడు. ఆధునిక సాంకేతిక, సీసీ కెమెరాల పరిశీలన, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో పలు దొంగతనాల కేసులో అతడు రిమాండ్కు వెళ్లివచ్చినట్లు గుర్తించారు. కొత్త సంవత్సరం రోజున వర్గల్ మండలం నాచారం వద్ద కలకలం రేపిన ఈ హత్యోదంతం కేసు వివరాలను సోమవారం గజ్వేల్ ఏసీపీ నర్సింహులు మీడియాకు వెల్లడించారు. మెదక్ జిల్లా మసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన భదనపురం పెంటయ్య(30) డ్రైవర్. ఇతను గతంలో జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడిన ఘటనల్లో మనోహరాబాద్, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, కామారెడ్డి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రిమాండ్కు కూడా వెళ్లివచ్చాడు. నెల రోజుల క్రితం చేగుంట కల్లు డిపో వద్ద ఇస్లాంపూర్కు చెందిన మహిళ మంతూర్ కల్పన(26)తో ఇతనికి పరిచయమేర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ అప్పుడపుడు కలుసుకునేవారు. డిసెంబరు 31న సాయంత్రం కల్పన దావత్ చేసుకుందామని నిందితుడికి ఫోన్ చేసి పిలి రూ.10వేలు ఇవ్వాలని పెంటయ్యను డిమాండ్ చేసింది. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పడంతో రేప్, చీటింగ్ కేసు పెడతానని బెదిరించింది. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో పెంటయ్య వాహనంలోని తాడును ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి వాహనం, తాడు, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
భూములకు హద్దులు చూపండి
నర్సాపూర్ రూరల్: దళితుల భూములకు హద్దులు చూపాలని డిమాండ్ చేస్తూ సోమవారం నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ మహిపాల్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి నందన్ మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్కు చెందిన 24 మంది దళితులకు 20 గుంటల చొప్పున సర్వే నంబర్ 108లో 12 ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాస్బుక్లు అందజేసి నేటికీ హద్దులు చూపలేదన్నారు. ఇదే మండలం చిన్నగొట్టుముక్కలలో 26 మంది దళితులకు ప్రభుత్వం 50 ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించి పట్టాలు ఇచ్చిందని, ఆ భూముల్లోకి అటవీ శాఖ అధికారులు లబ్ధిదారులను రానివ్వడం లేదని ఆరోపించారు. గంగాయపల్లి, పాంబండ గ్రామాల్లోని భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
వంతెన వేశారు.. రోడ్డు మరిచారు
అవస్థలు పడుతున్న వాహనదారులు జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణం నుంచి అల్గోల్ వెళ్లే దారిలో చేపట్టిన రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పనులు పూర్తి చేశారు గానీ రోడ్డు నిర్మాణం పనులు మాత్రం అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ నుంచి భరత్నగర్ గుండా అల్గోల్ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డుకు అడ్డంగా పెద్ద మురికి (వాగు) కాలువ ప్రవహిస్తుంటుంది. పట్టణం నుంచి వచ్చే మురికినీటి వల్ల వాగు నిత్యం ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రోడ్డు నీటిలో మునిగిపోతుంది. అప్పుడు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆర్అండ్బీ అధికారులు నాలుగేళ్ల క్రితం వాగుపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి రూ.33 లక్షలు మంజూరు చేశారు. టెండర్ పనులు పూర్తికాగానే కాంట్రాక్టర్ వంతెన పనులను ప్రారంభించారు. పలు కారణాల వల్ల నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి. ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసినా రోడ్డు పనులు మాత్రం నిలిచిపోయాయి. గతేడాది వినాయక చవితి సందర్భంగా నిమజ్జనానికి వెళ్లే వాహనాల కోసం బ్రిడ్జికి ఇరువైపులా మొరంమట్టిని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. వాహనాలు తిరగడం వల్ల దెబ్బతిని రోడ్డుపై గుంతలు పడ్డాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
తుదిపోరు అర్హత దిశగా గుజరాత్, కేరళ
పోటీలో తలపడనున్న కేరళలోని కొల్లాం నవోదయ విద్యార్థుల బృందం, గుజరాత్లోని వల్సాడ్ నవోదయ విద్యార్థులువర్గల్ నవోదయ ఎంపీ హాల్ వేదికగా మంగళవారం ఉదయం 11 గంటలకు యూత్ పార్లమెంట్ పోటీలు ప్రారంభమవుతాయి. విద్యాలయ స్థాయి నుంచి ఒక్కో మెట్టు అధిగమించిన గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్, కేరళలోని కొల్లాం నవోదయ విద్యార్థులు జాతీయ స్థాయి పోరులో అర్హత కోసం ఇక్కడ తలపడనున్నారు. లోక్సభ స్పీకర్, ప్రధానమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, పార్లమెంట్ సభ్యులు, అధికారగణం తదితర 55 మంది సభ్యులతో అచ్చం పార్లమెంట్ సమావేశాలు ప్రతిబింబించేలా విద్యార్థులు తమ ప్రదర్శనతో ‘మాక్ పార్లమెంట్’ను ఆవిష్కరించనున్నారు. వాడివేడి చర్చలు, వాదో పవాదాలు, బిల్లుల ఆమోదం, తీర్మానాలతో పార్లమెంటేరియన్ల మాదిరి సత్తాచాటనున్నారు. -
125
కాదు..● ఉపాధి పని దినాలు పెంపు ● హర్షం వ్యక్తం చేస్తున్న కూలీలు రామాయంపేట(మెదక్): గ్రామీణ ప్రాంతాల్లో కూలీల జీవనోపాధి భద్రతను పెంచడానికి కేంద్రం ఎప్పటికప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీల పని దినాల సంఖ్యను వంద నుంచి 125 రోజులకు పెంచింది. వ్యవసాయ పనులు లేని రోజుల్లో పనులు కొనసాగించే విషయంలోనూ కొన్ని మార్పులు చేసింది. పెంచిన పని దినాలతో కూలీలకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. కాగా పని చేసిన కాలానికి 15 రోజుల్లో కూలీ డబ్బులు వారి ఖాతాల్లో జమకానున్నాయి. పెరిగిన ఉపాధి కూలీ జిల్లా పరిధిలో 492 పంచాయతీలకు గాను లక్షా 63 వేల జాబ్ కార్డులున్నాయి. కూలీల సంఖ్య 3.22 లక్షలు. ఈమేరకు ఇటీవల కూలీలకు చెల్లిస్లున్న రేట్లను కేంద్రం సవరించింది. గతంలో గరిష్టంగా ఒక్కో కూలీకి రూ. 272 చెల్లించేవారు. ప్రస్తుతం అది రూ. 300కు పెరిగింది. ముఖ్యంగా వేసవిలో పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి పనులతో కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. పంట పొలాల వద్దకు మట్టి రోడ్డు నిర్మాణం, బండరాళ్ల తొలగింపు, పంట చేలల్లో ఇసుక మేటలు తొలగించడం, పశువుల షెడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, భూమి చదును లాంటి పనులు చేపడుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలు ఉపాధి పథకంలో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి 125 రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత నెలలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టగా, అది పాసైంది. వంద రోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకున్న కూలీలకు ఇది ఉపయోగం కానుందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు కేంద్రం ఈపథకం పేరును వీబీ– రామ్ జీగా మార్చింది.100 -
క్రీడలకు కేంద్రంగా పటాన్చెరు
జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెంపటాన్చెరు టౌన్: జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరు కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జరగనున్న జిఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఆదివారం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాడీ బిల్డర్స్ తమ ప్రదర్శనలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రదర్శన నిర్వహించిన బాడీ బిల్డర్లకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్థానిక యువతకు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పోటీలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెలలో జాతీయస్థాయి మహిళా కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, గూడెం మధుసూదన్రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, నిర్వాహకులు షకీల్, ఒమర్,, తదితరులు పాల్గొన్నారు. -
పది వేల మందికి ఉద్యోగాల కల్పన
నర్సాపూర్: నియోజకవర్గంలో రాబోయే మూడేళ్లలో పది వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాజన్న ఎంప్లాయిమెంట్ సెల్ ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రాజన్న ఎంప్లాయిమెంట్ సెల్ అఫిషియల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేజీని ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియను నిరంతరం కొనసాగించడానికి ఎంప్లాయిమెంట్ సెల్ను ప్రారంభించినట్లు చెప్పారు. నిరుద్యోగులు తమ విద్యార్హతలను ఆన్లైన్ ద్వారా పంపించవచ్చన్నారు. పార్టీలకు అతీతంగా ఈ సెల్ పని చేస్తుందని తెలిపారు. హెచ్ఆర్ కో సంస్థ సహకారంతో సెల్ పని చేస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సైతం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో హెచ్ఆర్ కో సంస్థ భాగస్వామి కార్తిక్, ఫౌండేషన్ ప్రతినిధి మారుతిరావు, కాంగ్రెస్ నాయకులు రాజుయాదవ్, రిజ్వాన్, నగేష్, సుధీర్గౌడ్, రషీద్, హర్షవర్ధన్, రవిగౌడ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బడుల తనిఖీలు షురూ
జిల్లా వ్యాప్తంగా 15 కమిటీల నియామకంజహీరాబాద్ టౌన్: ప్రభుత్వ బడులపై పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. విస్తృత తనిఖీలతో పాఠశాల నిర్వహణను గాడిలో పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసే లక్ష్యంతో తనిఖీ బృందాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఉపాధ్యాయులతో 15 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న వ్యవస్థకు ప్రత్యేక బృందాలు అదనంగా పనిచేస్తున్నాయి. బృందాలు ఇలా... సంగారెడ్డి జిల్లాలో 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యూపీఎస్, ప్రాథమిక పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం పాఠశాలలకు వేర్వేరుగా టీంలను నియమించింది. ఒక్కో టీమ్లో ముగ్గురు టీచర్లు ఉంటారు. ప్రతీ బృందంలో మొదటి వ్యక్తి నోడల్ అధికారిగా మిగిలిన ఇద్దరు సభ్యులు కొనసాగుతారు. ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శించి విద్యా ప్రగతిని అంచనా వేస్తాయి. తనిఖీకి నియమితులైన టీచర్లు పాఠశాల విధులకు హాజరయ్యేందుకు అవకాశం లేదు. బోధనకు అంతరాయం కలగకుండా వారిస్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రతీ మూడు నెలల్లో ఒక్కో టీం ప్రాథమిక, ప్రాథమికోన్నతస్థాయిలో వంద పాఠశాలలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 50 పాఠశాలలను తనిఖీలు చేపట్టాలి. కేటాయించిన పాఠశాలలను ప్రత్యేక బృందం సభ్యులు ప్రతీ రోజు రెండు చొప్పున తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. తనిఖీ టీంలు పది రోజులకు ఓసారి డీఈఓకు నివేదికలను సమర్పిస్తారు. ఇలా ఉండగా పాఠశాల తనిఖీల పట్ల ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి వాటిని బలోపేతం చేయడం. నిరంతర సమగ్ర మూల్యాంకన సాధన. ప్రాథమిక స్థాయిలోఎఫ్ఎల్ఎన్, ఉన్నత పాఠశాల స్థాయిలో ఎల్ఐపీ ప్రణాళిక అమలు. విద్యా ప్రమాణాల పెంపుదల. టెక్ట్స్ బుక్, వర్క్షాపులతో విద్యార్థులకు అభ్యాసన. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం. సలహాలు సూచనలు ఇవ్వడం, పాఠశాల రికార్డుల పరిశీలన. -
వెహికిల్స్పై నజర్
సంగారెడ్డి జోన్/టౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారికి, సరైన పత్రాలు లేకుండా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ఈ తనిఖీల్లో కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్లో మళ్లీ మళ్లీ పట్టుబడితే జైలుకు పంపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెరిగిన తనిఖీలు రోడ్డు భద్రతా నియమాలు ప్రతీ వాహనదారుడు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఐదు పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రదేశాలు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ ద్వారా ఓవర్ స్పీడ్ చలాన్లు విధిస్తున్నారు. గతేడాది వాహన తనిఖీల్లో 3,25,660 కేసులు నమోదు చేసి రూ.10,82,17,328లు జరిమానాలు విధించారు. అంతకుముందు ఏడాదిలో 2,06,687 కేసులు నమోదు చేసి రూ.7,58,48,351ల మేర జరిమానాలు విధించారు. వీటితోపాటు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేయగా గతేడాది 16,326 కేసులు నమోదుచేసి రూ.1,85,90,315 ల జరిమానా విధించారు. పలుమార్లు మద్యం తాగి పట్టుబడిన 65 మందిని జైలుకు పంపించారు. తగ్గిన రోడ్డు ప్రమాదాలు తనిఖీలు ముమ్మరం చేయడంతో రోడ్డు ప్రమాదాలు కొంత మేర తగ్గినట్లు తెలుస్తోంది. 2025లో 917 రోడ్డు ప్రమాదాలు జరగగా 423 మంది మృత్యువాత పడ్డారు. 895 మంది గాయాలపాలయ్యారు. అంతకుముందు ఏడాది 958 రోడ్డు ప్రమాదాలు జరగగా 433 మంది మృత్యువాత పడగా, 1011 మందికి గాయాలయ్యాయి. పట్టుబడుతున్న చోరీ వాహనాలు జిల్లాతో పాటు సరిహద్దు రాష్ట్రాలలో చోరీకి గురైన వాహనాలు తనిఖీలలో పట్టుబడుతున్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు జప్తు చేసి, యజమానులకు ఇస్తున్నారు. అదేవిధంగా కొన్ని కేసులలో అనుమానితులు, నిందితులను గుర్తించడానికి దోహదపడుతున్నాయి. అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక, నిషేధిత డ్రగ్స్, గంజాయి, గుట్కా, పాన్ మసాలా వంటివి పట్టుబడుతున్నాయి. గతేడాది 786.635 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 80 మంది నిందితులను అరెస్టు చేశారు. 248 అక్రమ ఇసుక రవాణ కేసులు నమోదయ్యాయి. చికిత్స తప్పనిసరిడ్రైవర్లు కంటి సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవాలి. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించాం. డ్రైవర్ల కంటిచూపు మెరుగుపడటం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారించవచ్చు. – అరుణ, జిల్లా రవాణా అధికారి జిల్లాలో వాహన తనిఖీ–జరిమానా వివరాలు ఏడాది తనిఖీలు జరిమాన డ్రంకెన్ డ్రైవ్ జరిమాన 2024 2,06,687 రూ.7,58,48,351 10,216 రూ.1,31,90,473 2025 3,25,660 రూ.10,82,17,328 16,326 రూ.1,85,90,315 రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు గతేడాది 3,25,660 కేసులు డ్రంకెన్ డ్రైవ్లో 10,216 మందికి జరిమానా -
కుక్కల దాడిలో రెండు జింకల మృతి
దుబ్బాకటౌన్ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిమ్మక్పల్లి గ్రామ పరిసరాల్లో కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. ఆదివారం కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో మేత కోసం వచ్చిన జింకలపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో అక్కడికక్కడే రెండు జింకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీ శాఖ బీట్ ఆఫీసర్లు వేణు, జహంగీర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతిచెందిన జింకల మృతదేహాలను పంచనామా నిర్వహించి దౌల్తాబాద్ పంపించారు. తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. గ్రామాలలో వీధి కుక్కల సంఖ్య పెరగడంతో చిన్న పిల్లలకు, వన్య ప్రాణులకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని అటవీ అధికారులు తెలిపారు. -
స్థిత ప్రజ్ఞత.. వివేకవంతుడి లక్షణం
హరేరామ హరేకృష్ణ ఆలయ నిర్వాహకుడు గోకులేష్ ప్రభూజీజహీరాబాద్: స్థిత ప్రజ్ఞత కలిగి ఉండడమే వివేకవంతుడి లక్షణమని కందిలోని హరేరామ హరేకృష్ణ ఆలయ నిర్వాహకుడు గోకులేష్ ప్రభూజీ అన్నారు. ఆదివారం స్థానిక పట్టణంలోని మహీంద్రకాలనీలో ఉన్న గోదా సమేత వెంకటేశ్వర ఆలయంలో 188వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగ్ సమావేశంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో మంచి, చెడు ఏదో ఒకటి తప్పని సరిగా జరుగుతుందన్నారు. ఈ పరిణామాలతో కలత చెందకపోవడమే ఉత్తమమైన మార్గమన్నారు. అంతకు ముందు కాలనీలో శోభాయాత్ర నిర్వహించారు. అదేవిధంగా హుగ్గెల్లిలో 153వ పల్లె సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. -
విద్యార్థులను వేధిస్తే ఉపేక్షించం
కల్హేర్(నారాయణఖేడ్): హాస్టల్ విద్యార్థులను వేధింపులకు గురిచేస్తే ఊపేక్షించేదిలేదని ఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్లో ఎస్సీ బాలుర హస్టల్ను ఆదివారం సందర్శించారు. హాస్టల్ వార్డెన్ కిషన్ వేధింపులు, కరెంట్ సమస్య, వసతులలేమితో విద్యార్థులు చీకట్లో రోడ్డెక్కి ధర్నా చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్లో కిచెన్, పరిసరాలు పరిశీలించారు. హాస్టల్ను ఎప్పటికి సందర్శించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని ఏఎస్డబ్ల్యూఓ చంద శ్రీనివాస్కు ఆదేశించారు. కాస్మెటిక్ చార్జీలు, ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఇన్చార్జి వార్డెన్ సంతోష్, నాయకులు యాదవరెడ్డి, పీరప్ప, కల్యాణ్రావు పాల్గొన్నారు. సిర్గాపూర్లో ఎస్సీ బాలుర హాస్టల్ సందర్శనలో ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి -
ఆప్యాయంగా పకలరిస్తూ.. టీ తాగుతూ
కోహెడరూరల్(హుస్నాబాద్): రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సామాన్యులతో మమేకం కావడంలోనే తృప్తి ఉంటుంది. సీపీఐ జాతీయ కార్యదర్శి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి ఆదివారం కరీంనగర్ సీపీఐ వంద సంవత్సరాల ఉత్సావాల బహిరంగ సభను ముగించుకుని తిరిగి వస్తుండగా మండలంలోని శనిగరం గ్రామ సమీపంలో అయన టీ కొట్టు వద్ద ఆగి చిరువ్యాపారులతో మూచ్చటించి టీ తాగారు. ఆయన వెంట సీపీఐ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మారుపాక అనిల్, పల్లె నర్సింహ,కనుకుంట్ల శంకర్,అందే అశోక్ తదితరులు ఉన్నారు. ఇసుక టిప్పర్లు సీజ్ పాపన్నపేట(మెదక్)/హవేళిఘణాపూర్: మెదక్ మండలం హల్దీ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లను సీజ్ చేసినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మెదక్ శివారు ప్రాంతంలోని హల్దీ వాగు నుంచి జహీరాబాద్కు మూడు టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పాపన్నపేట వద్ద, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వామి వాటిని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అలాగే మెదక్ మండల పరిధిలోని సంగాయిగూడ తండా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక టిప్పర్, రెండు హిటాచీలను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మెదక్ రూరల్ ఏఎస్ఐ దయానంద్ తెలిపారు.సీజ్ చేసిన ఇసుక టిప్పర్లు -
పెళ్లి కావడం లేదని..
కౌడిపల్లి(నర్సాపూర్): పెళ్లి కావడంలేదని మనస్తాపంతో సెంట్రింగ్ కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రం కౌడిపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక ఎస్ఐ మురళి కథనం ప్రకారం.. కౌడిపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ వడ్డెర అంజయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్దకొడుకు ప్రశాంత్(26), సెంట్రింగ్ పని చేస్తున్నాడు. పెళ్లి చేయాలని పలుమార్లు కోరిన కావడంలేదు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు వాట్సాప్లో పెట్టి ఉరేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. మృతుడి తమ్ముడు ప్రవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు అడ్డుకున్నారు. దేవక్కపల్లెలో బెజ్జంకి(సిద్దిపేట): ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దేవక్కపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోరుపాక మల్లయ్య చిన్న కుమారుడు అమర్ (21) చదువుకోకుండా ప్రేమ అంటూ తిరుగుతూ మానసిక వేదనకు గురయ్యాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం అంబెలున్సులో కరీంనగర్ అస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సౌజన్య తెలిపారు. నీట మునిగి వ్యక్తి మృతి హవేళిఘణాపూర్(మెదక్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధి శమ్నాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. దూరబోయిన నర్సింలు(45), ఆదివారం ఉదయం రౌతుకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వల కాలుకు తట్టుకొని నీటమునిగి మృతి చెందాడు. ఉదయం వెళ్లిన నర్సింలు ఇంటికి రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై కనిపించినట్లు కుటుంబీకులు తెలిపారు. సంఘటన స్థలాన్ని హవేళిఘణాపూర్ పోలీసులు సందర్శించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
చికిత్స పొందుతూ జూనియర్ డాక్టర్ మృతి
సిద్దిపేటఅర్బన్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ రూంలో డ్యూటీలో ఉండగా అనారోగ్యంగా ఉండటంతో క్యాజువల్ డిపార్ట్మెంట్లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్కు వెళ్లారు. శనివారం ఉదయం ప్రభుత్వ కళాశాల హాస్టల్లో గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు జీజీహెచ్కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఇంటర్న్షిప్ డ్యూటీలు, నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు మెడికల్ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ఆత్మహత్యకు గల కారణాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. -
అమెరికా దాడిని ఖండించండి
పటాన్చెరు టౌన్: వెనుజువెలాపై అమెరికా దాడిని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని సీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య పేర్కొన్నారు. వెనుజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో శ్రామిక భవన్ నుంచి జాతీయ రహదారి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...వెనుజువెలాపై అమెరికా టెర్రరిస్టుల కంటే భయంకరంగా విరుచుకుపడిందన్నారు. ఒక దేశంపై అమెరికా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే వెనుజువెలాలో ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న దేశమని, అది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, సాయన్న, నరసింహారెడ్డి, నరసింహులు, నారాయణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య -
కాంగ్రెస్, బీఆర్ఎస్కు విజన్ లేదు: రఘునందన్
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు విజన్ లేదని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఐబీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డితో కలసి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదీ జలాల అంశంపై తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీరు సరిపోతాయో అంగీకరించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పెట్టిన సంతకం తాలూకూ పత్రాలు ప్రజలముందు ఉంచామని చెప్పారు. తెలంగాణకు నష్టం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు దొందూ దొందేనని విమర్శించారు. రాష్ట్రాన్ని బాగు చేసి పాలమూరుకు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఈ పార్టీలకు లేదన్నారు. వ్యక్తిగత దూషణలు కాకుండా సబ్జెక్టుపైనే మాట్లాడితే బాగుంటుందని కాంగ్రెస్, బీఆర్ఎస్లకు హితవు పలికారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: ఖేడ్ పట్టణ ఓటరుగా సబ్ కలెక్టర్ ఉమాహారతి తన పేరును నమోదు చేయించుకున్నారు. సబ్ కలెక్టర్ పట్టణంలోని రెండవ వార్డులో ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఓటరు జాబితాలో 230 క్రమ సంఖ్యతో ఎస్డబ్ల్యూడీ 2226349 ఎఫ్ నంబరుతో ఉమాహారతి పేరుతో ఓటరుగా నమోదు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం చిరునామాను జాబితాలో నమోదు చేశారు. బొల్లారంలోనే పోలీస్స్టేషన్ సేవలు జిన్నారం(పటాన్చెరు): బొల్లారం పారిశ్రామికవాడలో పోలీస్స్టేషన్ను తరలించవద్దని ఇటీవల చేపట్టిన నిరసన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి స్టేషన్ను స్థానికంగానే కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పోలీస్ స్టేషన్ కొనసాగింపు నిర్ణయంపై మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాల్రెడ్డి ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ..బొల్లారంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారన్నారు. స్థానికంగా శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా పోలీస్స్టేషన్ కొనసాగించడం హర్షణీయమన్నారు. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పోలీసులు ఆదివారం మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బీదర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఏడుగురు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఐ వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు తప్పవు ఎస్ఐ శంకర్ అల్లాదుర్గం(మెదక్): సంక్రాంతి పండగను పురస్కరించుకుని పతంగులు ఎగురవేయడానికి చైనా మాంజా విక్రయించిన, వాడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శంకర్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. చైనా మాంజా అత్యంత ప్రమాదకరమన్నారు. పతంగులు ఎగురవేయడంతో మాంజా దారం తాకి మనుషులు, పక్షులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని వివరించారు. మాంజాను వాడటం ప్రభుత్వం నిషేధించిందని ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మాంజాను నిల్వ చేసినా, రవాణా చేసినా, తయారు చేసినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు. కేసుల్లో బీఏఎస్ సెక్షన్ 223, 125తో పాటు, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 5, 15 కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
న్యాయసేవలు
మహిళా సంఘాలకు● గ్రామస్థాయిలోనే పరిష్కారానికి ఏర్పాటు ● జిల్లాలో రెండు మండలాల్లో జీఆర్సీల అమలు సంగారెడ్డి టౌన్: గ్రామాల్లోని మహిళలు సమాజంలో గౌరవంతోపాటు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారికి అవసరమైన న్యాయపరమైన సేవలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామాల్లోని మహిళలు వివిధ రకాల సమస్యలకు గురైనప్పుడు వారికి అవగాహన కల్పించేందుకు, వివిధ రకాల తగాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకునేందుకు న్యాయ సేవలు అందించేలా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామ కమిటీల్లో మహిళా సంఘంలోని మహిళలే సభ్యులుగా వ్యవహరిస్తారు. మహిళకు ఎదురయ్యే సమస్యలను పోలీస్స్టేషన్ వరకు వెళ్లకుండా వీలైనంత వరకు గ్రామాలలోనే పరిష్కరించుకునే విధంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను జెండర్ రిసోర్స్ సెంటర్లు (జీఆర్సీ)గా వ్యవహరిస్తున్నారు. ఇదీ ఉద్దేశ్యం.. అటు సామాజిక మాధ్యమాలతోపాటు ఇంటా బయట మహిళలకు ఎదురయ్యే చాలా ఘటనల్లో ఎవరికీ చెప్పుకోకుండా వారివారే మానసికంగా కుమిలిపోతున్నారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి మహిళల కోసమే ఈ జీఆర్సీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధులే వీటిని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కమిటీలు బాధిత మహిళలకు అండగా నిలిచి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తోడ్పాటునందిస్తాయి. ఈ కేంద్రాల్లోనే ఒకటి రెండు రోజులు వసతి సదుపాయం కలిస్పారు. ప్రత్యేక కమిటీలు మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి. పొదుపు సంఘాల్లోని మహిళల్లో చదువుకున్న వారు ఆర్పీలుగా సేవలందిస్తున్నారు. జీఆర్సీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ గ్రామ, మండల సమాఖ్య సంఘాల్లోని సభ్యులతో సామాజిక కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. గ్రామ కమిటీ, మండల కమిటీ చొప్పున సభ్యులను నియమిస్తారు. వీరికి డీఆర్డీఏ తరఫున జెండర్ రీసోర్స్ సెంటర్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణనిస్తారు. తొలుత సంగారెడ్డి, ఝరాసంఘం మండలాలను ఎంపిక చేసి జీఆర్సీ సేవలు కొనసాగిస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం సమాజంలో మహిళలకు భద్రత కల్పించే విధంగా జెండర్ సేవలను కల్పిస్తున్నాం. గ్రామస్థాయిలోనే పూర్తిగా పరిష్కరించుకునేందుకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచుతున్నాం. మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. –సూర్యారావు, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం పోలీసుల కథనం ప్రకారం.. మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన పాలేటి వెంకటేశ్(49), మేసీ్త్ర పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. శనివారం పనులకు వెళ్లి టీవీఎస్పై ఇంటికి వస్తున్న క్రమంలో కాళ్లకల్ శివారులో సాగర్ ఏషియా పరిశ్రమ వద్ద జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటెనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్కు తీవ్రగాయాలు కావడంతో మేడ్చల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. రామచంద్రాపురం పట్టణంలో జిమ్కోచ్.. రామచంద్రాపురం(పటాన్చెరు): ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఓ జిమ్కోచ్ మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భారతినగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరి(25) బీరంగూడలోని ఓ జిమ్లో కోచ్గా పని చేస్తుంది ఆదివారం తన స్కూటీపై జిమ్కు వెళ్తుండగా.. బెల్ ఆర్టీసీ డిపో రోడ్డులో ఏలూరు డిపోకు చెందిన బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమామహేశ్వరి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సంతోషకరం
ఉపాధి పథకంలో కూలీల పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచడం సంతోషకరం. దీంతో తమకు మరింత పని దొరికే అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకాన్ని తాము పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాం. – ఎల్లయ్య, కూలీ, నస్కల్ మరింత ప్రయోజనం పెరిగిన పని దినాలతో తమకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. అయితే పెరిగిన కూలీ రేట్లతో పాటు మరిన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. డబ్బులు సకాలంలో తమ ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. – లాక్యానాయక్, దంతేపల్లి తండా -
సమస్యలతో సహజీవనం
ఐదే మరుగుదొడ్లు నారాయణఖేడ్: సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న పిల్లలను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన అధికారులు వారిని అర్థాకలితో అలమటింపచేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో వారిని ఉంచుతూ కనీస వసతి సదుపాయాలను కూడా కల్పించలేకపోతున్నారు సదరు హాస్టళ్ల అధికారులు. వసతిగృహాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇటువంటి ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఇటీవల సిర్గాపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు పురుగులు పట్టిన నాసిరకం కూరగాయలతో భోజనం వడ్డిస్తుండటంతో విద్యార్థులు రాత్రిపూట రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. ఇదే హాస్టల్కు చెందిన వార్డెన్ తన కింది స్థాయి సిబ్బందికి ఫోన్లో ‘‘అన్నంలో పురుగుల మందు కలిపి పిల్లల్ని చంపేడయండి’’అంటూ హుకుం జారీ చేయడం, ఆ ఆడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారడంతోపాటు విద్యార్థుల భద్రతపై ఆందోళన లేవనెత్తింది. విద్యార్థుల ధర్నా చేసిన విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రావీణ్య ఈ ఘటనపై విచారణ జరిపి సదరు వార్డెన్ను విధుల నుంచి తొలగించారు. ఇలాంటి పరిస్థితి ఒక్క సిర్గాపూర్ హాస్టల్ విద్యార్థులే కాదు మెజార్జీ సంక్షేమ హాస్టళ్లలో దాదాపు ఇవే దుస్థితులను విద్యార్థులు మౌనంగా ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 48 సాంఘిక సంక్షేమ వసతిగృహాలు ఉండగా వీటిల్లో 5,068మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి సిర్గాపూర్, మనూరు, ఖేడ్, జహీరాబాద్లలోని బాలికల వసతిగృహం భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కూల్చివేసి నూతన భవనాలు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. సమస్య వచ్చినపుడే ఆదరా బాదరా.. వసతిగృహాలపై పర్యవేక్షణ కొరవడటం, విద్యార్థులు ఆందోళనలకు దిగి పత్రికల్లో కథనాలు వచ్చిన సందర్భాల్లోనే అధికారులు ఆదరా బాదరాగా హడావుడి చేయడం కన్పిస్తోంది. సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే చిత్తశుద్ధి అధికారుల్లో కనిపించకపోవడం శోచనీయం. దీంతో విద్యార్థులు నిత్యం సమస్యలతో సహజీవనం చేస్తూనే ఉన్నారు. తరచూ ఉన్నతాధికారుల తనిఖీలు, పర్యవేక్షణ ఉంటే వార్డెన్లు కాస్తయినా జాగరూకతతో వ్యవహరిస్తారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల దుస్థితి అర్థాకలితో అలమటిస్తున్న చిన్నారులు ప్రశ్నిస్తే వేధింపులు.. మనూరు మండల కేంద్రంలోని హాస్టల్లో 15 మరుగు దొడ్లకు గాను 5 మాత్రమే పనిచేస్తున్నాయి. విద్యార్థులు ఉదయం పూట మరుగుదొడ్డికి వెళ్లేందుకు క్యూ కట్టాలి. భవనం శిథిలావస్థకు చేరుకుంది. నాణ్యమైన భోజనం ఇక్కడ కూడా వడ్డించడంలేదని విద్యార్థులు చెబుతున్నారు. నాసిరకం కూరగాయలు పెడుతున్నారని, అప్పుడప్పుడూ ఇచ్చే చికెన్ కూడా తక్కువగానే ఇస్తున్నారని వాపోతున్నారు. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వార్డెన్ వేధిస్తారేమోనని పిల్లలు భయపడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, హాస్టళ్లలో సామగ్రి, సరుకుల తరచూ మాయమవుతుంటాయి. సిర్గాపూర్ హాస్టల్కు వచ్చిన కొన్ని మంచాలు, బెడ్లు మాయం అయ్యాయన్న ఆరోపణలున్నాయి. సరైన బెడ్లు లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారిస్తే పలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ఖేడ్ ఏఎస్డబ్లూఓ శ్రీనివాస్ను వివరణ కోరగా బెడ్లు కొన్ని వేరే హాస్టల్లో తక్కువగా ఉండటంతో అక్కడకు పంపించామని తెలిపారు.


