breaking news
Sangareddy
-
గుర్తుతెలియని మృతదేహం
మెదక్జోన్: మెదక్ పాతబస్టాండ్ సమీపంలోని ఓకాజ్ మెడికల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు సీఐ మహేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, సమాచారం తెలిస్తే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. వ్యవసాయ శాఖ గోడౌన్ దగ్ధం జోగిపేట(అందోల్): పట్టణంలోని వ్యవసాయ శాఖగోడౌన్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ గిరి శ్రీకాంత్ ఫైర్ సిబ్బందితో ఘటనా స్థ లానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో తలుపులు తొలగించి మంటలను ఆర్పేశారు. వ్యవసాయ పరికరాలు, పర్నీచర్ దగ్ధమయ్యా యి. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ప్రఽకృతి సంపద.. సంరక్షణ
హుస్నాబాద్కు ఐదు కిలోమీటర్ల దూరంలోని జిల్లెల్లగడ్డ, మహ్మదాపూర్, ఉమ్మాపూర్, ఆకునూర్ గ్రామాల మధ్య విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారనుంది. సుమారు 800 మీటర్ల ఎత్తులో విస్తరించిన 36 గుట్టలు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. 350(3,200 ఎకరాలు) హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణాన్ని చేపట్టారు. అభివృద్ధిలో భాగంగా మూడు పగోడాలు, ఎత్తయిన వాచ్ టవర్లు, వాకింగ్ ట్రాక్లు, పిల్లల పార్కు, రెండు గుట్టల మధ్య బ్రిడ్జి, రాయికల్ జలపాతం వద్ద ట్రెక్కింగ్ స్పాట్ ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ఉద్యానవనాలు, గడ్డి మైదానాలు, పర్యాటకులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే రాయికల్ వాటర్ ఫాల్స్ వద్ద ట్రెక్కింగ్, గుట్టల మధ్య బోటింగ్, ఓపెన్ జిమ్, సాహస క్రీడలు లాంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. -
దరఖాస్తుల ఆహ్వానం
వర్గల్(గజ్వేల్): వర్గల్ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.భాస్కరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామర్స్, కంప్యూటర్ సైన్సు ఫ్యాకల్టీ కోసం సంబంధిత సబ్జెక్టులో పీజీ, నెట్, సెట్ బోధనా అనుభవం కలిగిన అభ్యర్థులు సోమవారం ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో నిర్వహించే డెమో, ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7995076688, 9440698470 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సెమినార్లతో శాసీ్త్రయ దృక్పథం డీఈఓ రాజు మెదక్జోన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి సైన్సు సెమినార్లు ఎంతో దోహదపడతాయని జిల్లా విద్యాధికారి రాజు అన్నారు. స్థానిక పీఎం శ్రీ తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్సు సెమినార్ విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. భారతీయ ఇంధన వనరులపై విద్యార్థులు తమ సెమినార్ పత్రా లను అందజేశారు. ఇందులో ప్రతిభ కనబర్చి న విజేతలకు ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్సు అధికారి రాజిరెడ్డి, ఎంఈఓ శంకర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్ కుమార్, సెమినార్ నిర్వహణ కమిటీ సభ్యులు ప్రభు, లక్ష్మి, స్రవంతి పాల్గొన్నారు. లైన్మెన్కు తీవ్రగాయాలు నంగునూరు(సిద్దిపేట): విద్యుదాఘాతంతో లైన్మెన్కు తీవ్ర గాయాలైన ఘటన పాలమాకులో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. రాంపూర్ సబ్స్టేషన్ పరిధిలోని పాలమాకుల జేఎల్ఎమ్గా పడిగె శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సమస్య ఏర్పడడంతో ఎల్సీ తీసుకొని గ్రామంలోని హన్మాన్ దేవాలయం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతడిని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. విద్యుదాఘాతంతో గేదె మృతి తొగుట(దుబ్బాక): విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందిన ఘటన మండలంలోని లింగంపేటలో శనివారం చోటుచేసుకుంది. బాధితరైతు, గ్రామ స్తుల కథనం ప్రకారం.. చిక్యుడు యాదయ్య రోజూ మాదిరిగా మేత కోసం గేదెలను తన పొలంలో వదిలాడు. అందులో ఒక గేదె మేతమేస్తూ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను తాకడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కుగురై అక్కడికక్కడే మృతిచెందింది. గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని రైతు విలపించాడు. ప్రభుత్వం అతడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రెండు తలల దూడ జననం కొద్ది సేపటికే మృతి బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని నర్సింహులపల్లెకు చెందిన రైతు పాడిగేదె శనివారం రెండు తలల దూడకు జన్మనిచ్చింది. దూడను చూడటానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే జన్మించిన కొద్ది సమయంలోనే దూడ మృతి చెందింది. ఈ సందర్భంగా పశువైద్యాధికారి మాట్లాడుతూ కవలలు ఏర్పడే సమయంలో అసంపూర్తి విభజనతో జన్మించే ఈదూడలు ఎక్కువ సమయం బతకవన్నారు. -
ప్రతి బొట్టూ ఒడిసి పడదాం
ఈఎన్సీ రమేశ్బాబుపుల్కల్(అందోల్): రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే, తాగునీటి అవసరాల కోసం సింగూరు డ్యాంలో నీటిని పెద్ద ఎత్తున నిల్వ చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ రమేశ్బాబు ప్రాజెక్టు ఇంజినీర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మిషన్ భగీరథ, జంట నగరాల తాగునీటి సరఫరా అధికారులతో కలిసి సింగూరు ప్రాజెక్టును సందర్శించి, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై సమగ్రంగా ఆరా తీశారు. సింగూరు డ్యాం భద్రత అధికారుల సూచనల మేరకు, రాతికట్ట మరమ్మతుల కోసం గతేడాది కాలంగా డ్యాంలో నీటి నిల్వలను తగ్గించారు. మొత్తం 29.91 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ డ్యాంలో కేవలం 7 టీఎంసీల మాత్రమే ఉంచి మరమ్మతులు చేపట్టగా, ప్రస్తుతం 4.52 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం కట్ట మరమ్మతుపనులు తుది దశకు చేరుకోవడంతో ఇప్పటి నుంచి కురిసే ప్రతి వర్షపు చుక్కనూ డ్యాంలోనే భద్రపరచాలని ఈఎన్సీ సూచించారు. మిగిలిన చిన్నపాటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టరును, సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగూరు డ్యాం ఆధారంగా జంట నగరాలతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు రాబోయే వేసవి అవసరాలకు ఏమాత్రం సరిపోవని, అందుకే ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని గరిష్టంగా నిల్వ చేసుకోవడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డ్యాం వద్ద జరుగుతున్న రాతికట్ట పనులను, కాల్వల సీసీ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ సీఈ విద్యావతి, ఎస్ఈ యశశ్విని, ఈఈ భీమ్, మిషన్ భగీరథ ఈఈ నాగభూషణం, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఈఈ రామకృష్ణ, డీఈఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణం
తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకున్న ఘటన తూప్రాన్లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బోయవాడకు చెందిన బండారి నరసమ్మ(44) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. భర్తకు దూరంగా ఉండటంతో ఆమె పట్టణంలో ఒంటరిగా నివసిస్తోంది. పలువురి ఇళ్లలో పనులు చేసుకొంటూ కాలం వెల్లదీస్తోంది. ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై శనివారం తన ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గతంలో నరసమ్మ కుమారుడు సైతం ఇలాగే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబంలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఒంటరితనం భరించలేక.. కౌడిపల్లి(నర్సాపూర్): ఒంటరితనం భరించలేక మహిళ ఉరివేసుకున్న ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ అమరేందర్రెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌడిపల్లికి చెందిన బర్ల మొగులమ్మ(55)కు ఇద్దరు కూతుళ్లు. భర్త శాఖయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అయిదేళ్ళ క్రితం కొడుకు కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె మొగులమ్మ ఇంటివద్ద ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఇంటి ఎదుట గేటుకు ఉరివేసుకుంది. ఆమె కూతురు సరిత ఫర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్కొండపాక(గజ్వేల్): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు చాలా కీలకమని పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్ అన్నారు. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో మంద భూదవ్వ–లక్ష్మారెడ్డి ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు నిఘా నీడలో ఉండేందుకు గాను ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ బావులు, దుకాణాలు, హోటళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని, కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం దాతను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్రెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ లక్ష్మీబాబు, నాయకులు తోటకూరి మల్లేశం, రాములు, మల్లేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. వంద మంది పోలీసులతో సమానం చేర్యాల(సిద్దిపేట): ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అదనపు డీసీపీ కుశాల్కర్ అన్నారు. మండల పరిధిలోని కడవేర్గు గ్రామంలో సర్పంచ్ తాళ్లపల్లి రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు ఈ కెమెరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలు తాళ్లపల్లి నర్సయ్య, పొన్నం దాసు, కోడూరి సత్యనారాయణను సత్కరించారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్ఐ అపూర్వరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజు, ఉపసర్పంచ్ సురేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కర్కపట్ల గ్రామంలో.. మర్కూక్(గజ్వేల్): నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. మండలంలోని కర్కపట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకోసం ప్రతిగ్రామంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ అన్వర్ పాషా, సుగుణాకర్రెడ్డి, బాలకృష్ణ, సీఐ రవిరాజు, ఎస్ఐ యూనస్ హైమద్అలీ పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
నిజాంపేట(మెదక్): వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన నాలం రాజగౌడ్(71) శుక్రవారం రాత్రి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. సైకిల్పై వెళ్తూ స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా ఓ కారు ఢీకొట్టింది. గాయపడిన రాజగౌడ్ను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. రాజగౌడ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పదేళ్ల క్రితం మృతి చెందడంతో పెద్దకుమార్తె సులోచన తలకొరివి పెట్టింది. ఆ ఘటనతో గ్రామస్తులు విలపించారు. వంటిమామిడి మార్కెట్ వద్ద ములుగు(గజ్వేల్): ములుగు పోలీస్స్టేషన్ పరిధిలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్ఐ వి.రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్– మల్కాజిగిరి జిల్లా కీసర మండలం యాదగిరిపల్లికి చెందిన పుట్ట బాల్రాజు భార్య పుట్ట లక్ష్మి(37), మామ సోమయ్యతో కలసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వారు ముగ్గురు కలసి వంటిమామిడి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి రహదారి దాటుతుండగా ఓ ట్రాక్టర్ లక్ష్మిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పీర్లపల్లి యాదగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ షాక్తో.. చేగుంట(తూప్రాన్): విద్యుత్షాక్తో దివ్యాంగురాలు మృతి చెందిన ఘటన చేగుంటలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్కు చెందిన బాయికాడి సంధ్య(19) పుట్టుకతో దివ్యాంగురాలు. ఆమె కుటుంబం చేగుంటలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్నానం చేయించేందుకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు వాటర్హీటర్ తగలడంతో విద్యుత్షాక్కు గురైన సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. -
కోటగిరి.. పర్యాటక ఝరి
మారనున్న హుస్నాబాద్ ముఖచిత్రం ● రూ.10 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కు దట్టమైన అడవి, అలరించే లోయలు, అరుదైన పక్షుల కిలకిలారావాలు, శతాబ్దాల నాటి ప్రాచీన రాతి కోటలు కలగలిపి ఉన్న ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది. చరిత్రకు, ఆధ్యాత్మికతకు, సాహస పర్యాటకానికి అనువైన కోటగిరి గుట్టలు అర్బన్ ఫారెస్ట్ పార్కుగా ఆవిష్కృతం కాబోతున్నాయి. హుస్నాబాద్: మండల పరిధిలోని జిల్లెల్లగడ్డలో రూ.10 కోట్ల వ్యయంతో సర్దార్ సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్టు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన కూడా చేశారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రకృతి సంపదను పరిరక్షిస్తూ చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నారు. ఈ పార్కుతో పాటు ఎల్లమ్మ చెరువు గ్లాస్ బ్రిడ్జి, మహాసముద్రం గండి, రాయికల్ జలపాతం, గౌరవెల్లి ప్రాజెక్టును అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక సర్క్యూట్ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హుస్నాబాద్ ప్రముఖ మోడల్ టూరిజం హబ్గా అవతరించనుంది. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరించి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అడవిలో పర్యాటక విహారం -
లారీ డ్రైవర్ అదృశ్యం
చేగుంట(తూప్రాన్): లారీడ్రైవర్ అదృశ్యమైనట్లు ఎస్ఐ చైతన్య కుమార్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ అంబటి చిన్నస్వామి వరంగల్లో పొట్టులోడు నింపుకొని 5న రామంతపూర్ శివారు జాన్స్ పాఠశాల సమీపంలో లారీ నిలిపాడు. ఆగిఉన్న ఆ లారీని డీసీఎం వ్యాను ఢీకొట్టింది. నాటి నుంచి చిన్నస్వామి ఆచూకీ తెలియలేదు. దీంతో అతడి భార్య మున్నీ చేగుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
టూరిజం హబ్గా మారుస్తాం
ప్రకృతి, చారిత్రక సంపద ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ టూరిజం హబ్గా మారుస్తాం. ఎల్లమ్మ చెరువు గ్లాస్ బ్రిడ్జి, రాయికల్ జలపాతం, మహాసముద్రం గండి, సర్దార్ సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును గౌరవెల్లి ప్రాజెక్టుతో అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక కారిడార్గా అభివృద్ధి చేస్తున్నాం. పార్కు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సర్క్యూట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ పార్కు మూడు జిల్లాలకు సరిహద్దు కావడంతో పర్యాటకుల సందడి పెరుగుతుంది. దీంతో హుస్నాబాద్ ముఖచిత్రమే మారనుంది. – మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఆశలతో చెడు‘గూడు’
● ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మహిళ మృతి ● కుమార్తెకు బిల్లు ఇవ్వడానికి అధికారుల నిరాకరణ హత్నూర(సంగారెడ్డి): పూరి గుడిసెలో నివసిస్తున్న పేద కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. సంతోషంగా నిర్మాణ పనులు ప్రారంభించిన వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఇల్లు పూర్తి కాకుండానే ఇంటి పెద్ద దిక్కు అకాల మరణం చెందారు. వారసురాలికి ఇల్లు మంజూరు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలంలోని నస్తీపూర్కు చెందిన చాకలి ఎల్లమ్మది నిరుపేద కుటుంబం. భర్త నారాయణ గతంలోనే మృతిచెందగా, పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఈమెకు గుంట భూమి కూడా లేదు. గతేడాది జూన్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. దీంతో గుడిసెను తొలగించి అదే స్థలంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇల్లు బేస్మెంట్ లెవల్ వరకు చేరుకోగానే దురదృష్టవశాత్తు ఎల్లమ్మ మరణించింది. దీంతో ఆమె వారసురాలు సువర్ణ (భర్త రమేశ్) పేరు మీదకు మార్చాలని అధికారుల చుట్టూ తిరిగారు. రేపు, మాపు అంటూ కాలయాపన చేశారు. గతేడాది అక్టోబర్లో కలెక్టరేట్ ప్రజావాణిలో సైతం వినతి అందించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈక్రమంలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్ ప్రమీల ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీతో పాటు ఇందిరమ్మ కమిటీ తీర్మానం కాపీని అందజేయాలని సూచించగా, ఈ ఏడాది మార్చిలో అందజేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల మరోసారి కలెక్టరేట్ ప్రజావాణిలో రెండోసారి దరఖాస్తు అంజేశారు. అయినా ఫలితం లేదు. సొంతింటి కల నెరవేరుతుందని అప్పు చేసి ఇంటికి సరిపడా సామగ్రి తెచ్చుకోగా, అది పాడవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం కిరాయి ఇంట్లో నివసిస్తున్నామని, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
చిరుధాన్యాల సాగేది?
ఒకప్పుడు మన ఆహార సంస్కృతిలో భాగమైన చిరుధాన్యాల సాగు క్రమంగా కనుమరుగవుతోంది. నాడు గ్రామీణ ఇళ్లలో సజ్జ సంగటి సువాసన వెదజల్లేది. జొన్నలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు, పెసర, వేరుశనగ మన జీవితంలో భాగమయ్యేవి. కాలక్రమేణ అధిక దిగుబడి మార్కెట్ ఆశతో రైతులు వాణిజ్య పంటల వైపు పరుగులు తీశారు. ఫలితంగా తరతరాలుగా మన ఆహార సంస్కృతికి అద్దంపట్టిన చిరుధాన్యాల సాగు అతి స్వల్ప విస్తీర్ణానికే పరిమితమైపోయింది. –మునిపల్లి(అందోల్) జిల్లాలో మొక్కజొన్న 7,364, మినుము 6,250, పెసర 8002, కంది 71,961, పత్తి 3,56,782, సజ్జ 580, కొర్ర 980 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేస్తున్నట్లు సంబంధిత అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కంది, వేరుశనగ, కొర్ర, జొన్న సంప్రదాయ పంటలు కలిపి వెయ్యి ఎకరాలు కూడా దాటలేదు. భవిష్యత్ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం మూడు దశాబ్దాల క్రితం రైతు వ్యవసాయ భూమిలో ఒకే పంట కనిపించేది కాదు. ఒకే భూమిలో సజ్జ, జొన్న, మినుము, పెసలు, కంది, ఉలువలు, వేరుశనగ, పసుపు, మిరప, కొర్రలు, కుసుమ, పొద్దుతిరుగుడు ఇలా ఎన్నో పంటలను రైతులు పండించేవారు. కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, అన్ని ఇంట్లోనే ఉండేవి. వారు ఆరోగ్యమైన ఆహారం కోసం మార్కెట్ వైపు చూడాల్సిన అవసరమే ఉండేదికాదు. ప్రస్తుతం గతంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతోపాటు పంటలకు సరిపడా వర్షాలు పడకపోవడం, ఎక్కువగా వర్షాలు పడినా తట్టుకుని నిలబడే పంటలు కాకపోవడంతో రైతులు సాగు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం గిట్టుబాటు ధరలు అధిక దిగుబడి ఆశతో రైతులు వాణిజ్య పంటలపై ఆధారపడుతున్నారు. దీంతో పంటల వైవిధ్యం తగ్గిపోతుంది. చిరు ధాన్యాలకు తక్కువ నీరు సరిపోతుంది. ఎరువులు, పురుగు మందుల ఖర్చు కూడా తక్కువ. ఎండలను తట్టుకునే శక్తి ఎక్కువ నేల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు రైతు పెట్టుబడిని కూడా తగ్గిస్తాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తు వ్యవసాయానికి ఇవే ప్రత్యామ్నాయమని వ్యవసాయధికారులు చెబుతున్నారు. ఆసక్తి చూపని అన్నదాతలు -
ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
● మంత్రి దామోదర రాజనర్సింహ ● కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం సంగారెడ్డి జోన్: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకలకు ఆయన ముఖ్య అతిథి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కాగా, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలు {ç³gê ´ëÌS¯]l ¨¯ø-™èlÞ-Ðé°² ç³#Æý‡çÜPÇ…^èl$-Mö° hÌêÏ çÜ…„óSÐ]l$ Ô>Q B«§ýlÓ-Æý‡Å…ÌZ ¨ÐéÅ…-VýS$-ÌSMýS$ E_™èl çÜàĶæ$ ç³ÇMýS-Æ>ÌS ç³…í³×îæ M>Æý‡Å-{MýS-Ð]l*°² °Æý‡Ó-íßæ…-^éÆý‡$. çÜ$Ð]l*Æý‡$ Æý‡*.13.10 ÌS„ýSÌS ÑË$Ð]l VýSÌS »êÅr-È™ø ¯]lyìl^ól {Osñæ OòÜMìSâ¶æ$Ï, »êÅrÈ BsZ-ÌS¯]l$ ¨ÐéÅ…-VýS$-ÌSMýS$ ç³…í³×îæ ^ólÔ>Æý‡$. ¨ÐéÅ…VýS$Ë$ çÜÓĶæ$… E´ë«¨ ´÷…§ýl$™èl* BǦMýS…V> ÝëÓÐ]lÌS…-º¯]l Ý뫨…^ól…-§ýl$MýS$ G…™ø §øçßæ§ýl-ç³yýl$-™èl$…-§ýl¯é²Æý‡$. {糿¶æ$-™èlÓ…, ÑÑ«§ýl çÜ…çܦÌS çÜçßæ-M>-Æý‡…™ø ¨ÐéÅ…-VýS$-ÌSMýS$ AÐ]lçÜ-Æý‡-OÐðl$¯]l çÜà-Ķæ*°² A…¨…-çÜ$¢…§ýl-¯é²Æý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ MýSÌñæMýStÆŠæḥ{糡MŠæOgñ毌, Gïܵ ç³Ç™ø‹Ù ç³…MýSgŒæ, A§ýl-¯]lç³# MýSÌñæ-MýStÆý‡$Ï ´ë…yýl$, çÜ…X™èl, hÌêÏ çÜ…„óS-Ð]l$Ô>Q A«¨-M>-ǰ ÌSÍ™èl MýS$Ð]l*Ç ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
కేసీఆర్ హయాంలోనే గిరిజనుల సంక్షేమం
యాలాల: గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడింది మాజీ సీఎం కేసీఆర్ అని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సంగాయిపల్లి తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. స్వయం పాలన, రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతంకు పెంచారని గుర్తు చేశారు. గిరిజన యువతకు విద్యకు పెద్దపీట వేయాలనే ఆకాంక్షతో రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉపాధి, వ్యవసాయం, మౌలిక వసతుల కోసం నిధులు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు రాంచంద్రారెడ్డి, రాజునాయక్, నారాయణ, సుక్యానాయక్, గణేష్, అంజయ్యగౌడ్, హాజీపూర్ రవి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి -
టాస్క్తో కావేరి యూనివర్సిటీ ఒప్పందం
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి దోహదం వర్గల్(గజ్వేల్): విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యం పెంపు ధ్యేయంగా వర్గల్ మండలం గౌరారం కావేరి యూనివర్సిటీ గురువారం ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)తో 2026–27 విద్యా సంవత్సరానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు వివరాలను వైస్ఛాన్సలర్ డాక్టర్ వీ.ప్రవీణ్రావు వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు సాంకేతిక, సాఫ్ట్స్కిల్స్ శిక్షణ, వర్క్షాప్లు, పరిశ్రమ ఆధారిత సర్టిఫికేషన్, కెరీర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వర్సిటీలో చివరి సంవత్సరం విద్యార్థులకు నియామక ప్రక్రియలు, పరిశ్రమ విధానాలు, కార్యాలయ అంచనాలు, కార్పొరేట్ సంస్కృతిపై అవగాహన కల్పించనున్నారు. అధ్యాపకుల కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు, పరిశ్రమ సందర్శనలు చేపట్టనున్నారు. వీటి ద్వారా ఆధునిక సాంకేతికతలు, పరిశ్రమల నైపుణ్య అవసరాలపై అవగాహన పెరుగుతుంది. విద్యార్థులను పరిశ్రమలకు సిద్ధమైన పట్టభద్రులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, టాస్క్తో భాగస్వామ్యం విద్య, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి మధ్య వారధిని బలోపేతం చేస్తుందని వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు, పోల్సాని హర్షరావు, శిక్షణ, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ విశ్వప్రకాశ్బాబు, టాస్క్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
నీలవర్ణంలో వినాయకుడి దర్శనం
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం స్వామివారిని నీలవర్ణంలో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్, అయ్యప్ప, సతీష్ల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు నీలవర్ణ అలంకారంలో దర్శనభాగ్యం కల్పించారు. పూజల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హుస్నాబాద్: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శాంతినగర్కు చెందిన గూడ పద్మ శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తల్లి పద్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు నిఖిల్ రెడ్డి (17) స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనను ప్రైవేట్ కళాశాలలో చదివించాలని నిఖిల్ రెడ్డి తల్లిని అడుగగా ఆర్థిక స్తామత లేకపోవడంతో ఆమె మందలించింది. దీనికి తోడు పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం.. ఆమె భర్త కూడా మరణించడంతో ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నిఖిల్ రెడ్డి జీవితం పై విరక్తి చెంది బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి నిఖిల్ రెడ్డి చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. గణేశ్ మండపం నుంచి తిరిగి వచ్చిన తల్లి కుమారుడు ఫ్యాన్కు వేలాడుతూ విగత జీవిగా కనిపించడంతో గుండెలవిసెలా రోదించింది. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశ్వకర్మ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్మెదక్ కలెక్టరేట్: విశ్వకర్మల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర కార్మిక శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవంలో మంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేశారు. అనంతరం స్థానిక రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో ముఖ్య అతిథిగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశ్వకర్మల కోసం ఏటీల్లో కోర్సు ప్రారంభించేలా సిఫారసు చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసంలో విశ్వకర్మలకు అవకాశం కల్పిస్తామన్నారు. విశకర్మలు నూతన టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. విశ్వకర్మ సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డీవీ. శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, విశ్వకర్మ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలు
ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో శుక్రవారం నుంచి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) క్రీడా పోటీలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్లోని క్రీడల శాఖ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. నాగరాజు మాట్లాడుతూ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలలో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈనెల 17వ తేది వరకు జిల్లాలోని 21 మండలాల్లో మండల స్థాయి పోటీలు పూర్తి అయినట్లు చెప్పారు. కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో క్రీడాంశాల్లో ఇప్పటివరకు సుమారు 12,600 మంది బాలబాలికలు పాల్గొన్నట్లు వివరించారు. అనంతరం ఎస్జిఎఫ్ జిల్లాస్థాయి పోటీల షెడ్యూల్ వివరించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను.. జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు నాగరాజు తెలిపారు. మెదక్ జిల్లా స్థాయిలో: ఫుట్బాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో: కబడ్డీ, సాఫ్ట్బాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బేస్బాల్, రగ్బీ, ఫెన్సింగ్, మార్షల్ ఆర్ట్స్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులకు జిల్లా విద్యాధికారి సహకారంతో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. పోలీస్, మెడికల్, మున్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వెస్లీ ఉన్నత పాఠశాల అధికారుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. పోటీల నిర్వహణకు సుమారు 65 మంది పీడీలు, పీఈటీల సేవలను వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. మొదటి రోజు జరిగే అండర్ 17 వాలీబాల్ పోటీలలో 21 మండలాల నుంచి 21 జట్లు, సుమారు 440 మంది బాలబాలికలు పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం 6 వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాగరాజు తెలిపారు. -
దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలి
మెదక్ ఎంపీ రఘునందన్రావుమెదక్ కలెక్టరేట్: దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. మోదీ గత 25 సంవత్సరాల పేద ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. 6 నెలలుగా 461 మంది దివ్యాంగులను గుర్తించి 850 సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వారికి అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్తోపాటు మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో ఎంపీ, కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆలు సాగుకు సన్నద్ధం
జహీరాబాద్: ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో రైతులు ముందస్తు ఆలుగడ్డ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో వారం రోజుల నుంచి విత్తనం వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. దళారులు యూపీలోని ఆగ్రా నుంచి లారీల్లో ఆలుగడ్డ విత్తనం తెప్పించి అమ్మకాలు జరుపుతున్నారు. అక్కడ విత్తనాన్ని క్వింటాల్కు రూ.1,000కి కొనుగోలు చేసుకుని వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక్కో బస్తాకు రూ.300 ట్రాన్స్పోర్టు పోగా, మరో రూ. 200 కమీషన్ తీసుకుని క్వింటాల్ విత్తనాన్ని రూ.2 వేల వంతున విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. ముందస్తు సాగుతో ధర! గతేడాది ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆలుగడ్డ పంట సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. పంటను ముందస్తుగా సాగు చేయడం వల్ల మార్కెట్కు ఉత్పత్తులు అంతంత మాత్రంగానే వస్తాయని, దీంతో గిట్టుబాటు ధర లభించి గట్టెక్కుతామనే ఆశతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంట నవంబర్లో చేతికి వస్తుంది. డిసెంబర్ నుంచి ఆగ్రాలో చేతికి అందివచ్చిన పంట హైదరాబాద్ మార్కెట్కు వస్తుంది. దీంతో మార్కెట్లో ధరలు పడిపోతాయి. అక్కడి పంట మార్కెట్కు రాక ముందే పంటను తీసుకోవాలనే ఆతృత రైతులను ముందస్తు సాగు వైపు ఆడుగులు వేయిస్తోంది. స్వల్పకాలిక పంట కావడం కూడా ఒక కారణం. 70 రోజుల్లోనే పంట చేతికి అందివస్తుంది. జిల్లాలోనే జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ పంటను ప్రతి ఏటా విస్తారంగా సాగు చేస్తూ వస్తున్నారు. సుమారు 3 వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. వర్షాలు లేకపోవడంతో విత్తనం వేస్తున్న రైతాంగం గతేడాది మార్కెట్లో ధర లేక తీవ్ర నష్టం అయినా పంటపై చావని మక్కువ ఆగ్రాలో అత్యధికంగా పంట నిల్వలు గత రెండేళ్లుగా ఆలుగడ్డ పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. ఒక్కో ఎకరం పంట సాగుపై రూ.20 వేలకు పైగా నష్టపోయారు. మార్కెట్లో ధర లభించకపోవడమే ఇందుకు కారణం. గతేడాది క్వింటాల్ విత్తనం ధర రూ.4 వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది మాత్రం సగానికి సగం ధర తగ్గింది. ఆగ్రా ప్రాంతాల్లో అత్యధికంగా పంట నిల్వలు ఉండడమే ఇందుకు కారణంగా రైతులు పేర్కొంటున్నారు. విత్తనం ధర తక్కువ ఉండడం కూడా రైతులు ముందస్తు సాగుకు మొగ్గుచూపుతున్నారు. అక్టోబర్లో సాగు మేలు ఆలుగడ్డ పంట అక్టోబర్ మొదటి వారంలో వేసుకుంటే సానుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు 30 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు అనుకూలం కాదు. సెప్టెంబర్లో సైతం రైతులు ఏటా పంట వేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంది. ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. – సోమేశ్వరావు, జిల్లా ఉద్యాన అధికారి -
పట్టపగలు రెండిళ్లలో చోరీ
● నాలుగున్నర తులాల బంగారం.. ● 47 తులాల వెండిని ఎత్తుకెళ్లిన దొంగలు మిరుదొడ్డి(దుబ్బాక): రైతులు ఇళ్లకు తాళాలు వేసి వ్యవసాయ పొలాలకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లకిడి ప్రకాష్, వజ్జపల్లి నర్సింగరావు అనే రైతులు ఎప్పటిలాగే తమ తమ ఇళ్లకు ఉదయం తాళాలు వేసి వ్యవసాయ పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి తమ ఇండ్లకు తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగుల గొట్టి ఉండటాన్ని చూసి ఒక్క సారిగా అవాక్కయ్యారు. ఇంట్లో ఉన్న బీరువాలను పగులగొట్టి ఉండటం, సామాన్లు, బట్టలు చిందరవందరగా పడి ఉండటం చూసి ఖంగు తిన్నారు. లకిడి ప్రకాష్ ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సుమారు 25 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్ళారు. అలాగే వజ్జెపల్లి నర్సింగరావు ఇంట్లో నుంచి, తులం బంగారం, 22 తులాల వెండి ఆభరాణాలను ఎత్తుకెళ్ళారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ రాజేష్, మిరుదొడ్డి ఎస్ఐ అందె సతీష్ నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ ఘటనపై విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో దొంగల వేలి ముద్రలను సేకరించారు. -
పంటలెండుతున్నా పట్టించుకోరా?
పెద్దశంకరంపేట(మెదక్): రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెద్దశంకరంపేటలో రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రైతులు పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అనంతరం రైతులతో కలిసి స్థానిక సబ్స్టేషన్ ఏఈ శ్యాంసుందర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు సురేశ్గౌడ్, లింగయ్య, రమేశ్, దత్తు, సుభాశ్, శంకర్గౌడ్, యాదుల్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. -
భూసారం పెంచుకోవాలి
కొమురవెల్లి(సిద్దిపేట): భూమిలో భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ జక్కుల తిరుపతి సూచించారు. మండలంలోని మర్రిముచ్చాల రైతు వేదికలో వ్యవపాయ శాఖ అధికారులు గురువారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవామృతం, ఘనజీవామృతం తయారు వాటి ఉపయోగాలు, నానో ఎరువుల వాడకంపై వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగని రవి, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిద్దిపేట శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి, ఏడీఏ పద్మ, మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ ,ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పాటలు పాడి మురిపించిన జగ్గారెడ్డి
సంగారెడ్డి: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి రాంనగర్లోని రామ్ మందిర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి సంగీత విభావరి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను అలరించాయి. అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండపంలో డోలక్ వాయిస్తూ భజన పాటలు పాడారు. భక్తి గీతాలు, భజనలతో రామ్ మందిర్ పరిసరాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజాము వరకు సంగీత విభావరి కొనసాగింది. కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జయారెడ్డి, పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
విద్యార్థుల పరిశుభ్రతకు పెద్దపీట
మద్దూరు(హుస్నాబాద్): విద్యార్థుల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ రూ.3లక్షతో నూతన టాయిలెట్లకు నిర్మాణం చేపట్టామని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ జాలపల్లి సర్పంచ్ చెట్కూరి కమలాకర్ తెలిపారు. దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో ఎమ్పీయూపీఎస్ పాఠశాల నూతన టాయిలెట్ల నిర్మాణానికి గురువారం మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ టాయిలెట్ల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరుశురామ్గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రీను,వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
చిరుధాన్యాలే ఆరోగ్యానికి అమృతం
రాగులు, జొన్న, సజ్జలు వంటి పంటల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మధుమోహం, రక్తపోటు వంటి సమస్యలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, పుష్కలంగా ఉండటంతో వీటిని ప్రతీ ఒక్కరు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యానికి చిన్న చిన్న సమస్యలు వస్తే పూర్వీకులు చెప్పిన దినుసులను వాడాలి. – డాక్టర్ శివకుమార్ చిరు ధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలి సజ్జలు, జొన్నలు, రాగులు, పెసర, మినుము, కంది, కొర్రలు, మిర్చి, వేరు శనగ, కుసుమ, పొద్దు తిరుగు వంటి పంటలు తక్కువ నీటితో సాగవుతాయి. ఇవి నేల సారాన్ని కాపాడటంతోపాటు రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. వాణిజ్య పంటలతో పాటు సంప్రదాయ పంటల సాగుపైన రైతులు దృష్టి సారించాలి. – అనితారెడ్డి, ఏఓ -
హమారా ప్రసాద్పై చర్యలు తీసుకోండి
వర్గల్(గజ్వేల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై కల్పిత అంశాలతో అభ్యంతరకరంగా పుస్తకం రాసిన హమారా ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం వర్గల్లో ఆయన దిష్టిబొమ్మ దహనం చేసి గౌరారం పీఎస్లో ఆయనపై ఫిర్యాదుచేశారు. ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అవుసులపల్లి నవీన్, ఎంఈఎఫ్ జిల్లా కార్యదర్శి డ్యాగ నవీన్కుమార్, నాయకులు ఉపకార్, సురేష్, నరేష్, పరశురాం, సత్యనారాయణ, అజీజ్, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువకుడు అదృశ్యం జహీరాబాద్ టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమైనట్లు జహీరాబాద టౌన్ ఎస్ఐ–2 సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ చెందిన ఆర్టీసీ డ్రైవర్ మఠం శివరాజ్ కుమారుడు కార్తీక్(18)కు కొన్ని నెలల నుంచి మానసిక స్థితి సరిగ్గా లేదు. ఈ నెల 16న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లిన కార్తీక్ ఇంటికి తిరిగి రాలేదు. తండ్రి శివరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. బస్సులోనే గుండెపోటుతో మహిళ మృతి చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని చుంచనకోటకు చెందిన బింగి మల్లవ్వ(59) గురువారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో ఆస్పత్రికి వెళ్లేందుకు భర్తతో కలిసి బస్సులో సిద్దిపేటకు బయలు దేరారు. బస్సు గుర్జకుంట క్రాస్రోడ్ దాటిన అనంతరం ఆమె ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురైంది. గమనించిన భర్త, తోటి ప్రయాణికులు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా అక్కడకు వచ్చిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుందామని వెళ్లిన మల్లవ్వ బస్సులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నింపింది. చేపల వేటకు వెళ్లి.. వ్యక్తి మృతి నర్సాపూర్ రూరల్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం తుజాల్ పూర్ దామర చెరువులో చోటు చేసుకుంది. నర్సాపూర్ పోలీసులు కథనం ప్రకారం.. శివ్వంపేట మండలం రూప్ల తండాకు చెందిన కాట్రోత్ కిషన్ (36) తుజాల్పూర్ దామర చెరువులోకి వల తీసుకొని చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటల వరకు తిరిగి రాకపోవడంతో భార్య సరిత, కుటుంబ సభ్యులు చెరువు వద్ద ఎక్కిన వెతికిన ఆచూకీ లభించలేదు. తిరిగి గురువారం దామర చెరువులో గాలించగా కిషన్ శవం లభించింది. చేపల కోసం వేసిన వల చుట్టుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. డ్రగ్, గంజాయి డిస్పోజల్ నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ ఎకై ్సజ్ శాఖ పరిధిలోని ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ పౌడర్, గంజాయిని డిస్పోజల్ చేసినట్లు నర్సాపూర్ ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తఫా గురువారం తెలిపారు. నర్సాపూర్ మండల పరిధి కాగజ్ మద్దూర్ వద్ద ఉన్న మెరిడీ బయో కెమికల్ లిమిటెడ్లో.. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్ పౌడర్తో పాటు గంజాయిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి నరసింహారెడ్డి, సీఐ జ్ఞానేశ్వర్, ఎస్ఐ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్మిక్స్ టిప్పర్ ఢీకొని.. వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని గన్నేరువాగు వద్ద బైక్ను రెడ్మిక్స్ టిప్పర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల సత్యం (30) బుధవారం సాయంత్రం నార్సింగిలో పని ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా, మిర్జాపల్లి వైపు వెళ్తున్న రెడ్మిక్స్ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన యువకుడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించ గా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మిర్జాపల్లి రెడ్మిక్స్ ప్లాంట్ వద్ద ఆందోళన ... చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని రెడ్మిక్స్ ప్లాంట్ వద్ద శేరిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించి, టిప్పర్ యజమానితో చర్చలు జరిపేందుకు చర్యలు చేపట్టారు. -
మిడ్ సెమిస్టర్ పరీక్షల బహిష్కరణ
జహీరాబాద్ టౌన్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ’శక్తి’ డిపార్ట్మెంట్ పరిధిలోకి మార్చడాన్ని నిరసిస్తూ రంజోల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిరసన బాట పట్టారు. గత 31 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఈ నెల 18 నుంచి 21 వరకు జరగాల్సిన మిడ్ సెమిస్టర్ పరీక్షలను సంపూర్ణంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా సాంకేతిక విద్య శాఖ కమిషనర్ దేవసేన జేఏసీ నాయకులను అవమానించడాన్ని ఖండిస్తూ కళాశాల సిబ్బంది విద్యార్థుల నిర్ణయానికి మద్దతు తెలిపారు. కమిషనర్ వైఖరికి నిరసనగా తాము సైతం సెమిస్టర్ పరీక్షల విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. -
జోగిపేటలో అగ్నిప్రమాదం.. ఏటీఎం మెషిన్లు అగ్నికి ఆహుతి!
సాక్షి, తెలంగాణ: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న రెండు ఏటీఎంలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రెండు ఏటీఎం మెషిన్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మంటలు మరింతగా వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: మా భూములు గుంజుకుంటారా? -
కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్ పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని నారాయణ రెడ్డి కాలనీలో ర్యాలీ నిర్వహించి బుధవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లింల పోరాటంగా చరిత్రను వక్రీకరించడం బాధాకరమన్నారు. పోరాటం ఫలితంగా దొరల, భూస్వాముల 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకట్రాజ్యం, కాశీనాథ్, సంతోష్కుమార్ గుప్తా, ఫెరోజ్, రజియా, యాదమ్మ, మల్లమ్మ, స్వప్న పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలను వృథా కానివ్వం
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ మద్దూరు(హుస్నాబాద్): బైరాన్పల్లి అమరుల త్యాగాలను వృథా కానివ్వమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 78వ వారోత్సవాల్లో భాగంగా బుధవారం బైరాన్పల్లిలో బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ.. దోపిడీకి వ్యతిరేకంగా బైరాన్పల్లి ప్రజలు సాగించిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. 118 మంది అమరులైన బైరాన్పల్లి నెత్తుటి చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోరాటాన్ని గుర్తించి స్మృతి చిహ్నాలు, అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్ నర్సింహాచారి, మండల కార్యదర్శి యాదగిరి, నాయకులు సంపత్, మల్లేశ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యమై.. శవమై..
గజ్వేల్రూరల్: వ్యక్తి అదృశ్యమై.. శవమై కనిపించిన ఘటన పట్టణ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గజ్వేల్ పట్టణంలోని వినాయక్నగర్లో తన చిన్నకొడుకు బాబు వద్ద ఉంటున్న రాయపోల్కు చెందిన పంబాల చిన్నబాల్రాజు(75)కు మతిస్థిమితం సరిగా లేకపోగా, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 8న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం పట్టణ శివారులోని జాలిగామ రోడ్డు.. ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్ ప్రాంతంలో గల రైల్వేట్రాక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఘటనా స్థలానికి వెళ్లి చిన్నబాల్రాజుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి.. మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పట్టణ సీఐ మహేశ్ వివరాల ప్రకారం.. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే, సమాచారం తెలిసినట్లయితే మెదక్ పట్టణ పోలీసులను 87126 57878, 87125 76101లో సంప్రదించాలని తెలిపారు. మృతుడి ఆచూకీ లభ్యం సిద్దిపేటఅర్బన్: కారు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనలో మృతుడి ఆచూకీ లభ్యమైంది. సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నాందేవ్ గులాబ్ నవాథే (46) కొన్నేళ్లుగా హోటళ్లలో పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాందేవ్ తీవ్రగాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి కుమారుడు నాందేవ్ నవాథే ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్ సాయికృష్ణపై కేసు నమోదు చేశారు. -
ఐడియా అదిరే..
రోడ్డు పాడవకుండా చర్యలు నిజాంపేట(మెదక్): రోడ్ల పరిరక్షణకు మండల కేంద్రంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఫుల్ కేజ్వీల్స్తో ఉన్న ట్రాక్టర్ను రోడ్డుపై నేరుగా నడపకుండా మరో ట్రాక్టర్ సహాయంతో తీసుకెళ్లాడు. కేజ్వీల్స్తో ట్రాక్టర్ను నడిపితే రోడ్డు దెబ్బతినే అవకాశం ఉందని భావించాడు. ఈ నేపథ్యంలో రోడ్లను కాపాడాలనే ఉద్దేశంతో డ్రైవర్ తీసుకున్న ఈ నిర్ణయం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. కాగా డ్రైవర్ను పలువురు అభినందించారు. నీళ్లు అనుకుని పురుగుల మందుతాగి.. వృద్ధురాలు మృతి వర్గల్(గజ్వేల్): మానసిక స్థితి సరిగాలేని వృద్ధురాలు నీళ్లు అనుకుని పురుగుల మందు తాగి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన బుధవారం మండలంలోని శేరిపల్లిలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని పోచమ్మ(70)కు మతి స్థిమితం సరిగా లేదు. దీనికి తోడు కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఉదయం ఆమె పొలం వద్దకు వెళ్లి నీళ్లు అనుకుని అక్కడ డబ్బాలో ఉన్న పురుగుల మందు తాగింది. ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైంది. కుమారుడు స్వామి ఆమె వద్ద పురుగుల మందు వాసన గమనించి ఆరా తీయగా పొలం వద్ద డబ్బాలో నీళ్లు తాగినట్లు చెప్పింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. చిరుత దాడిలో లేగదూడ మృతి తుప్రాన్: మండలంలోని ఇస్లాంపూర్ తండా పరిధిలో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మంగళవారం రాత్రి తండాకు చెందిన రైతు లంబాడి రాజు పొలంలో రోజువారీగా పశువులను కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి చిరుతపులి లేగదూడను దారుణంగా చంపి తినింది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన రాజుకు లేగదూడ మృతి చెంది ఉండటం, చిరుత దాడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో సర్పంచ్ సంతోష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన లేగదూడను, అడుగులను పరిశీలించి అది చిరుతపులి దాడేనని ప్రాథమికంగా నిర్ధారించారు. తండాతో పాటు పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఓపెన్ యూనివర్సిటీలో నూతన కోర్సులు సిద్దిపేటఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట ప్రాంతీయ కేంద్రానికి రెండు నూతన కోర్సులు మంజూరైనట్లు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎంఎస్సీ జాగ్రఫీ పీజీ కోర్సుతో పాటు ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్ ఒక సంవత్సరం డిప్లమా కోర్సులు మంజూరయ్యాయన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. డిమాండ్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు యూనివర్సిటీ నూతన కోర్సులను ప్రవేశ పెడుతుందన్నారు. ఈనెల 30లోగా అంబేద్కర్ ఓపెన్ వర్సీటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోక్సోకేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్ష సిద్దిపేటఅర్బన్: బాలికను వేధించిన కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ సిద్దిపేట ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సిద్దిపేట రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్ వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లికి చెందిన మండెల గణేశ్(26) 2021లో బాలికను వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1,01,000 జరిమానా విధించారు. -
డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్!
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన కల్హేర్(నారాయణఖేడ్): భూమి రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడికి డబ్బులిస్తేనే పనులు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. బుధవారం నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. భూభారతి ద్వారా భూమి రిజిస్ట్రేషన్, పౌతి పట్టా మార్పుకు డబ్బులిస్తేనే పనులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేకుంటే పనులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఈ విషయమై తహసీల్దార్ నాగజ్యోతితో ప్రస్తవించగా ఎవరూ డబ్బులు అడగడం లేదని తెలిపారు. లోన్ కడితేనే పట్టా చేయాలని బ్యాంకు అధికారులు తెలుపడంతో.. ఓ వ్యక్తి పౌతి పట్టా మార్పు కోసం వస్తే నిబంధనల ప్రకారం ఆపామని వివరించారు. -
చెక్పవర్ రద్దుపై హైకోర్టు స్టే
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గుంజోటి గ్రామ సర్పంచ్కు హైకోర్టులో ఊరట లభించింది. సర్పంచ్ చెక్పవర్ను నెల రోజుల పాటు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వివరాలు.. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపు విషయంలో సర్పంచ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసు కోవాలని కోరుతూ గ్రామానికి చెందిన కొందరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్ చెక్పవర్ను నెల రోజుల పాటు నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తన చెక్పవర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కలెక్టర్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించినట్లు బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ పాటిల్ తెలిపారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
దుకాణదారులకు జరిమానా
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్న వ్యాపారులకు రూ.9.500 జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ నవీన్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం శానిటేషన్ అధికారు లు సిబ్బంది పట్టణంలోని దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిల్వ ఉంచిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకొని యజమానులకు జరిమానా విధించారు. ఆరోగ్యం, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగులు, బట్ట సంచులు, స్టీల్ డబ్బాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని కమిషనర్ పిలుపునిచ్చారు. -
బైరాన్పల్లి.. వీరుల తల్లి
ఆ నెత్తుటి గాథకు నేటికీ 79 ఏళ్లు మద్దూరు(హుస్నాబాద్): రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేల.. నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన మట్టి మనుషుల కోట అది. నాటి హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు సాగించిన అరాచకాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఘనత సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామస్తులది. తెలంగాణ సాయుధ పోరాటానికి అసలైన బీజం వేసింది బైరాన్పల్లి పోరాటమేనని చరిత్ర చెబుతోంది. కాగా ఈ ఘటన జరిగి నేటికీ 79 ఏళ్లు అవుతోంది. కానీ నేటికి ఆ వీరత్వానికి దక్కాల్సిన గుర్తింపు దక్కకపోవడం, పాలకులు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం కావడంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శిస్తు కట్టం.. ఎదురు తిరుగుతాం ఆ నాడు రజాకార్లు శిస్తుల పేరిట పల్లెలను దోచుకుంటూ, ప్రజలను బిక్కుబిక్కుమంటూ బతికేలా చేశారు. కానీ బైరాన్పల్లి గ్రామస్తులు మాత్రం ధిక్కార స్వరం వినిపించారు. శిస్తు కట్టం.. మీ అన్యాయాన్ని సహించం అంటూ ఎదురు తిరిగారు. అంతేకాదు.. దూల్మిట్ట, లింగాపూర్ తదితర గ్రామాల్లో రజాకార్లు దోచుకెళ్తున్ను సొమ్మును బైరాన్పల్లి పోరాట యోధులు ధైర్యంగా అడ్డుకొని, సాధ్వీనం చేసుకొని మళ్లీ తిరిగి ప్రజలకు పంచారు. ఈ వీరోచిత ఘటనే తెలంగాణ పల్లెల్లో పోరాట స్ఫూర్తిని రగిల్చింది. గ్రామాల్లోని ప్రజలు సైతం తమ వద్ద ఉన్న వ్యవసాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకొని రజాకార్లకు ఎదురొడ్డారు. 118 మంది బలి.. కదిలిన ఢిల్లీ బైరాన్పల్లి ప్రజల తిరుగుబాటును జీర్ణించుకోలేని రజాకార్ల ముఠా ఆ గ్రామంపై కక్ష గట్టింది. ఖాసీం రజ్వీ నేతృత్యంలోని రజాకార్ల సైన్యం రెండు పర్యాయాలు గ్రామంపై విరుచుకుపడి నరమేధానికి పాల్పడింది. ఏకంగా బైరాన్పల్లి, కూటిగల్ గ్రామాల్లో 118మందిని పొట్టన బెట్టుకున్నారు. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని మించిన ఈ రాక్షసకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త నాటి భారత హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ను కదిలించింది. దీంతో ఆయన నిజాం రాజుపై సైనిక చర్య ఆపరేషన్ పోలోకు ఆదేశించారు. భారత సైన్యం రంగంలోకి దిగడంతో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తోకముడిచి లొంగిపోయాడు. ఫలితంగా సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించింది. హామీల వర్షం.. ఆచరణ శూన్యం ప్రతి ఏటా ఆగస్టు ,సెప్టెంబర్ వస్తే చాలు.. బైరాన్పల్లికి రాజకీయ నాయకుల తాకిడి పెరుగుతుంది. అమరవీరుల స్తూపం, బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించి వేదికలపై హామీల వర్షం కురిపించి వెళ్లడం నాయకులకు ఆనవాయితీగా మారింది. గతంలో గవర్నర్ తమిళిసై, కిషన్రెడ్డి, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు వచ్చి హామీలిచ్చారు. అలాగే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అలాగే బీజేపీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్ నేత విజయశాంతి వచ్చి హామీల వర్షం కురిపించారు. అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్ గ్రామంలో అమరవీరులకు పిండ ప్రదానం చేశాడు తప్ప.. గ్రామానికి చేసిందేమీ లేదు. గ్రామాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, నాటి పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పెన్షన్లు ఇప్పిస్తామని , గ్రామంలో అమరధామం నిర్మిస్తామని ఎన్నో ఆశలు కల్పించారు. కానీ నేటికీ ఏ ఒక్క హామీ ఆచరణకు నోచుకోలేదు. నాయకుల హడివిడి తప్పా.. గ్రామానికి, సమరయోధుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరుల రక్తం చిందిన నేల హుస్నాబాద్ రూరల్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులు.. ఇండియన్ యూనియన్లో కలవాలని నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పోరాటంను ఉధృతం చేశారు. హుస్నాబాద్ ప్రాంతంలో కొనసాగిన దొరలు, భూస్వాముల పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా పొలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్రావు, సిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డి దళాలు ఈ ప్రాంత ప్రజలను చైతన్యం చేస్తూ వెట్టి చాకిరి విముక్తి కోసం వారిని ఐక్యం చేశారు. 1948 మార్చి 14న అటవీ సమీపంలోని మహ్మదాపూర్కు అనభేరి ప్రభాకర్రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి దళాలతో గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి సాయుధ దళాలు వచ్చాయని సమాచారం అందుకున్న రజాకారులు భోజనం చేసే సమయంలోనే వారిపై కాల్పులు జరిపారు. భూషణ గట్టుకు వెళ్తుండగానే రజాకార్లు జరిపిన కాల్పుల్లో 12 మంది సాయుధులు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగిన ఆరు నెలలకు నిజాం నవాబు లొంగిపోవడంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. వీరమరణం పొందిన వీరుల జ్ఞాపకార్థం గుట్ట కింద అనభేరి ప్రభాకర్రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి సమాధులు నిర్మించి ప్రతి ఏటా సెప్టెంబర్ 17న, మార్చి 14న కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు ప్రజలు పార్టీలకు అతీతంగా హాజరై వీరులకు నివాళులర్పించి ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. మెదక్జోన్: రజాకార్ల ఆకృత్యాలకు బలైన ప్రాంతాల్లో మెతుకుసీమ ఒక్కటి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పాలించటంతో ఈ ప్రాంతాన్ని భారత్లో చేరకుండా సతంత్రంగా ఉండాలనే నిరంకుశత్వానికి తెరలేపాడు. వారి హింసను వ్యతిరేకించిన మెదక్ పట్టణానికి చెందిన అన్నదమ్ములు బట్టి కిష్టయ్య, వెంకయ్యలతో పాటు కేవల్ కిషన్, బళ్లాల బాబయ్య, సిల్వర్ రాజయ్య, గంగారాం, ఈశ్వరయ్య, దస్తగిరితో పాటు మొత్తం 80 మంది యువత బాలభారతి మండలి పేరుతో సంఘం పెట్టి రజాకార్ల ఆకృత్యాలను అడ్డుకోవటం, దాడులకు ప్రతిదాడులు చేసి నిలువరింపజేశారని నేటికీ పట్టణ ప్రజలు చెబుతున్నారు. సుభాష్ చంద్రబోస్తో జట్టు కట్టిన చోళ లింగయ్య స్వాతంత్య్రం కోసం భీకరంగా పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో సుభాష్చంద్రబోస్ ఆజాద్ హింద్ స్థాపనకు పిలుపునివ్వగా, మెదక్ పట్టణానికి చెందిన చోళ లింగయ్య ఆర్మీ ఎయిర్ఫోర్స్ విభాగంలో గ్రౌండ్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. బోస్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయనతో జతకట్టి ఆంగ్లేయులతో పోరాటం చేసినట్లు చరిత్ర చెబుతోంది. విమాన ప్రమాదంలో బోస్ మరణించటంతో ఆయన తిరిగి మెదక్కు చేరుకున్నాడు. అప్పుడు ఈ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బాలభారతి మండలిలో సభ్యుడిగా చేరిన లింగయ్య నాటు తుపాకులు, బాంబుల తయారీని స్వయంగా చేసి రజాకార్లపై తిరగబడ్డారు. 1947 ఆగస్టు 15న, జాతీయ జెండాను పటేల్కుంటలో మండలి సభ్యులు ఎగురవేశారు. దీంతో పోలీసులు లింగయ్యతో పాటు బాలభారతి మండలి సభ్యులను అరెస్టు చేసి 7 నెలలు ఔరంగాబాద్ జైలులో పెట్టారు. అనంతరం సర్దార్ పటేల్ మిలిటరీ యాక్షన్తో తెలంగాణకు విముక్తి కలిగాక జైలు నుంచి విడుదలయ్యారు ఉద్యమాల గడ్డ.. రాయికోడ్ రాయికోడ్(అందోల్): నిజాం సైన్యం, రజాకార్ల మూకలు, భూస్వాములు జలగల్లా ప్రజలను దోచుకుంటున్న రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో మేము సైతం అంటూ రాయికోడ్ వాసులు కదిలారు. పోరాటానికి మద్దతుగా కొనసాగిన ఆర్యసమాజ్ ర్యాలీని గ్రామానికి ఆహ్వానించారు. ర్యాలీకి నిజాం సర్కారులోని హద్నూర్ అమీన్సాబ్ అనుమతివ్వలేదు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా కాలిన కడుపులు, మండుతున్న గుండెలతో తెగింపునకు సిద్ధమై ర్యాలీ ప్రారంభించి కొనసాగించారు. ర్యాలీ గ్రామంలోని గౌని ప్రాంతానికి చేరుకోగానే ఉద్యమకారులు, రజాకార్లకు మధ్య ఘర్షణ జరిగింది. రజాకార్లు ర్యాలీలోని ఉద్యమకార్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14 మంది గ్రామస్తులు అమరులయ్యారు. ర్యాలీలో పాల్గొన్నందుకు 8 మందికి నిజాం ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. అనంతరం రజాకార్లు రెచ్చిపోయి గ్రామంలోని ఇళ్లలో ఉన్న ధనం, ధాన్యాన్ని లూటీ చేశారు. ఉద్యమ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లకు నిప్పంటించగా ఇళ్లు, సామగ్రి, పంట ఉత్పత్తులు కాలిబూడిదయ్యాయి. అప్పటి ఉద్యమకారులు, అమరులైన వారి జ్ఞాపకాలు గ్రామస్తుల మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి. ప్రభుత్వాల చిన్నచూపు గొప్ప చరిత్ర కలిగిన వీరబైరాన్పల్లి గ్రామానికి నాటి ఉమ్మడి ఆంధ్రపదేశ్, స్వరాష్ట్రంలో గ్రామానికి గుర్తింపు దక్కడం లేదు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్రామానికి సరైన గుర్తింపును ఇవ్వాలి. –చల్లా చంద్రారెడ్డి (సమరయోధుడు), బైరాన్పల్లి -
రైతులు ఇబ్బంది పడొద్దు
మునిపల్లి(అందోల్): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ రీసర్వే చేయాలని అదనపు కలెక్టర్ సంగీత అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని హైద్లాపూర్లో భూ రీసర్వేను స్వయంగా పరిశీలించారు. గ్రామంలో ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి. ఎన్ని నంబర్లలో ఇప్పటివరకు రీ సర్వే నిర్వహించారనే విషయాలను తహసీ ల్దార్ రంగారావును అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని, వారికి ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రంగారావు, సర్వేయర్లు, తహసీల్ధార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పీత వర్ణంలో గణనాథుడు
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణే్శ గడ్డ దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సా గుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం గణేశ్ గడ్డ దేవస్థానంలో ఆలయ అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్, అయ్యప్ప, సతీష్ ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పీత వర్ణంలో విశేషంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పి ంచారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆలయ ఈఓ లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తెలిపారు. పటాన్చెరు టౌన్: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు స్పష్టం చేశారు. అయితే దేశ ఐక్యత, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది కాటూరి వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు ఆయనకు బుధవారం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 19న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా 1,500 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసుకుని పటాన్చెరుకు చేరుకుందని తెలిపారు. అనంతరం ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొని ముత్తంగిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్టైమ్ టీచర్లను నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 18 సాయంత్రం 4 గంటలలోగా చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సమర్పించాలని సూచించారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో డెమో, ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం 9704550253, 9640382248 నంబర్లలో సంప్రదించాలన్నారు. సంగారెడ్డి క్రైమ్: పట్టణంలోని మహబూబ్సాగర్ చెరువులో వినాయక నిమజ్జనానికి కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. చెరువు కట్టపై పురపాలక సిబ్బందితో పాటు 10 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. మహిళలు, చిన్నారులకు ఇబ్బంది కలగకుండా షీటీమ్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. చెరువు కట్ట వద్ద పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
తీరని విషాదం
ఊహించని అగాథం..పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల నేరేడు చెరువు ఆరుగురు విద్యార్థులను బలి తీసుకుంది. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగిన విద్యార్థుల్లో ఒకరు ఒక్కసారిగా మునిగిపోవడంతో.. అతడిని కాపాడేందుకు మరొకరు చేసిన ప్రయత్నం చివరకు ఆరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు శిరీష చారిటబుల్ ట్రస్ట్కు చెందిన హాస్టల్ విద్యార్థులు సుమారు 20 మంది గణేశ్ నిమజ్జనం కోసం ఈ చెరువు వద్దకు వెళ్లారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు చెరువులోకి దిగారు. మిగిలిన వారంతా చెరువు గట్టున నిలబడ్డారు. కాస్త ముందుకు వెళ్లి వినాయకుడిని నిమజ్జం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా లోతు ఎక్కువ ఉండటంతో ఓ విద్యార్థి అదుపు తప్పి పడిపోయాడు.. అతడిని పట్టుకునే క్రమంలో మరొకరు.. ఇలా ఎనిమిది మందిలో ఆరుగురు విద్యార్థులు నీట మునిగారు. ఇద్దరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చాలా సంవత్సరాలుగా నిమజ్జం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే ఊహించని విధంగా లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మృతి చెందిన వారిలో నరసింహరాజ్(21), సుమంత్ రెడ్డి(17), గణేశ్(18), సిద్ధార్థ్ (17), శ్యామ్ కుమార్(17), ఉదయ్కుమార్(22) ఉన్నారు. విద్యార్థుల మృతదేహాలను పటాన్చెరులోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర, మాజీ మంత్రి హ రీశ్ రావు త దితరులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లాలో పోలీసుశాఖ వద్ద నమోదైన విగ్రహాల సంఖ్య సుమారు 3,525 ఉన్నట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి. నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు 66 నమోదైనట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అడ్డగోలుగా మట్టి తవ్వకాల వల్లే చెరువు వద్ద జరిగిన సంఘటనలో చిన్నారులు మరింత లోతుగా వినాయకుడిని నిమజ్జనం చేయాలనే ఆలోచన వారి మునకకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నా రు. అయితే చెరువుల్లో అడ్డగోలు మట్టి తవ్వకాల వల్లే గోతులు ప్రమాద భరితంగా మారుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని చెరువుల మట్టిని రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు. పర్యవసానంగా ప్రమాదకర గుంతలు ఏర్పడుతున్నాయి. నిమజ్జనం వేళ .. జాగ్రత్తలివి చెరువులు, కుంటల వద్ద పోలీసులు, అధికారులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలి. ఎక్కువ లోతు, ఉధృతంగా ప్రవాహం ఉన్న చెరువుల గురించి ముందే తెలుసుకోవాలి. అధికారులు ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడం మంచిది. ర్యాంప్ గానీ, ప్లాట్ఫామ్ నుంచే విగ్రహాన్ని నీటిలోకి వదలాలి. భారీ, పెద్ద విగ్రహాలను తప్పనిసరిగా క్రేన్ సహాయంతో నిమజ్జనం చేయాలి. నదిలో ప్రవాహం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. ఈత రానివారు, చిన్న పిల్లలు నీటిలోకి దిగకుండా పెద్దలు పర్యవేక్షించాలి. మద్యం సేవించి నిమజ్జనానికి రావడం, నీటిలో దిగడం అస్సలు చేయకూడదు. వినాయక శోభాయాత్ర సమయంలో విద్యుత్ తీగలు, రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి. విగ్రహం ఎత్తు, బరువు బట్టి అవసరం మేరకు వ్యక్తులను, సహాయకులను అందుబాటులో ఉండేలా చూసు కోవాలి. పోలీసులు,అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలి. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి చెరువు లోతు తెలియక ముందుకు వెళ్లిన విద్యార్థులు ఒకరిని కాపాడబోయి.. మరొకరు.. ఆరుగురు మృత్యువాత పెద్దకంజర్ల నేరేడు చెరువులో దుర్ఘటన -
రైతుకు విపత్తి
రాలుతున్న పూత, గూడ ● జిల్లాలో అత్యధికంగా పంట సాగు ● దిగుబడులపై తీవ్ర స్థాయిలో ప్రభావం ● నేలలో తేమ శాతం తగ్గడమే కారణం ఎల్నినో ప్రభావంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షాభావం నెలకొంది. వాతావరణంలో వచ్చిన మార్పులు, భూమిలో తేమశాతం తగ్గడం, తదితర కారణాలతో పత్తి పంటలో పూత, గూడ రాలుతోంది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చినుకు జాడ లేకపోవడం, వేసవిని తలపిస్తుండటంతో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గింది. – సంగారెడ్డి జోన్ ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 7,62,580 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 3,65,000 ఎకరాల్లో పత్తి పండిస్తారని తెలిపారు. అయితే ఎల్నినోతో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత 20 రోజులుగా వరుణుడి జాడ లేకపోవడంతో పాటు ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో భూమిలో తేమశాతం తగ్గిపోయి పంటల సాగుపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పత్తి పూత, గూడ(కాత) దశలో ఉంది. సరైన నీటి లభ్యత, పోషకాలు లభించకపోవడంతో పాటు వాతావరణంలో మారుతున్న పరిస్థితులకు ఎండిపోయి పూత, గూడు రాలుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబడి గత 15 ఏళ్లుగా జిల్లాలోని జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, మొగుడంపల్లి, మునిపల్లి, సదాశివపేట, మనూర్, నాగలగిద్ద, నారాయణఖేడ్ తదితర మండలాల్లో ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండటంతో పత్తి సాగు తగ్గించుకొని ఇతర పంటలు వేశారు. గతంలో కంటే ఈ సంవత్సరం సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణం పత్తి పంట సాగు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ఎకరా పత్తి సాగుకు సుమారు రూ.60 నుంచి రూ.65 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కండ్ల ముందే పూత రాలిపోతుండడంతో ఆకాశం వైపు వర్షం కోసం దీనంగా చూస్తున్నారు. ఒక మొక్కకు కనీసం పదిలోపే పత్తి కాయలు ఉంటున్నాయి. పంట దిగుబడిపై ప్రభావం చూపి కనీసం పెట్టుబడి ఖర్చులైనా వస్తాయో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు అధికారుల సూచన మేరకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. -
లోధా సామాజిక వర్గంపై నివేదిక
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్రంలో వెనకబడిన లోధ్, లోధా సామాజిక వర్గం ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, వృత్తి, జీవన పరిస్థితుల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. బుధవారం సిర్గాపూర్ మండలం కడ్పల్, నిజాంపేట్ మండల కేంద్రంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, సబ్కలెక్టర్ ఉమాహరతితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. హైదరాబాద్, కొన్ని జిల్లాల్లో లోధా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నా రు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు రావడం లేదని కోరుతూ వినతులు అందినట్లు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం, నిజాం సంస్థానం విలీనమైన తర్వాత ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వివరాలు, ఆధారాలను సరైన రీతిలో సమర్పించడంలో లోపాలు ఉన్నాయన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి సతీష్కుమార్, జిల్లా అధికారి జగదీశ్, డీఏస్పీ వెంకట్రెడ్డి తహసీల్దార్లు కిరణ్కుమార్, నాగజ్యోతి, ఎంపీడీఓలు అండాలమ్మ, సంగ్రామ్, నాయకులు యాదవరెడ్డి పాల్గొన్నారు. -
చరిత్రను వక్రీకరించడం సరికాదు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములుసంగారెడ్డి ఎడ్యుకేషన్: విమోచనం పేరిట చరిత్రను మతోన్మాద శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. బుధవారం సంగారెడ్డిలో తెలంగాణ సా యుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా దొడ్డి కొమురయ్య విగ్రహం నుంచి సంగారెడ్డి న్యూ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ.. నిజాం రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు. సాయుధ పోరాటానికి ఆర్ఎస్ఎస్, జీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. మతం పేరిట ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ బీజేపీ తప్పు డు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మాణిక్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల విస్తరణ పనులు వేగిరం
స్వచ్ఛందంగా కూల్చివేసుకుంటున్న యజమానులు● మూడు అంతస్తుల వరకు తొలగింపు ● 40 ఫీట్ల వంతున సాగుతున్న విస్తరణ ● పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం జహీరాబాద్: పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే హనుమాన్ మందిర్, భవానీ మందిర్ రహదారులను విస్తరించే పనులకు మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. దీంతో వ్యాపారులు, ఇండ్ల యజమానులు వారం రోజుల గడువు కోరగా అధికారులు సమ్మతించారు. ఇచ్చిన గడువు ముగియడంతో యజమానులు ఎవరికి వారు స్వచ్ఛందంగా భవనాలను కూల్చివేసుకుంటున్నారు. అధికారులు 40 ఫీట్ల రోడ్డు వెడల్పుతో మార్కింగ్ ఇవ్వగా, ఆ మేరకు కూల్చివేతలు చేపట్టారు. హనుమాన్ మందిరం రహదారిపై ఆక్రమణలను ఎవరికి వారు కూల్చివేసుకునే పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. అధికార యంత్రాంగం జేసీబీలతో కూల్చివేస్తే కట్టడాలు దెబ్బతింటాయని, మార్కింగ్ చేసి గుర్తించిన ప్రదేశం వరకు తొలగించుకుంటామని వ్యాపారులు, యజమానులు ఇచ్చిన హామీ మేరకు స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. మందకొడిగా పనులు మూడు అంతస్తుల భవనాలు ఉన్న వారు సైతం రహదారి వైపు ఉన్న కట్టడాలను కుల్చివేసుకుంటున్నారు. ఇప్పటికే వ్యాపారులు షటర్లను సైతం తొలగించుకున్నారు. అయితే భవానీ మందిర్ రహదారిపై మాత్రం పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఆక్రమణలను తొలగించుకునే పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వ్యాపారులు, ఇండ్ల యజమానుల్లో చలనం రాకుంటే ఇక మున్సిపల్శాఖ అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వినాయక నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకునే శిథిలాలను మున్సిపల్ శాఖ ఇతర ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసింది. రాజకీయ ఒత్తిడులను పక్కన పెట్టి ప్రజల వైపు నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధికారులు రంగంలోకి దిగారు. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గితే ప్రజల వైపు నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉండడంతో బహిరంగంగా ఎవరూ ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. రెండు రహదారుల విస్తరణ పనులతో పాటు అధికంగా రద్దీగా ఉండే లతీఫ్ రోడ్డు, బ్లాక్ రోడ్డు విస్తరణ పనులను సైతం త్వరలో చేపట్టే అవకాశం ఉంది. ఆయా రహదారులు ఆక్రమణలతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు గుర్తించారు. మూడు దశాబ్దాలుగా ఎదర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తీరుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరును అభినందిస్తున్నారు. -
డిప్యూటీ డీఎంహెచ్ఓగా సీతారామరాజు
జహీరాబాద్: జహీరాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ఓగా డాక్టర్ జె.సీతారామరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా వైద్యాధికారి లలితాదేవి వద్ద రిపోర్టు చేశారు. సీతారామరాజు ఇంతకుముందు మొగుడంపల్లి, నారాయణఖేడ్లో విధులు నిర్వర్తించి మంచిర్యాలకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడి నుంచి జహీరాబాద్ డివిజన్కు డిప్యూటీ డీఎంహెచ్ఓగా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పరిధిలోని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది హాజరుపై దృష్టి పెడతానన్నారు. మందుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించి, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు. -
వంట నూనెలు సలసల!
జహీరాబాద్ టౌన్: సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. వంట నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. నెల రోజుల్లోనే లీటర్ నూనైపె ఏకంగా రూ.50 పైగా పెరగడంతో వినియోగదారులు అందోళన చెందుతున్నారు. గత మార్చిలో పెరిగిన ధరలు, ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల వంట నూనెల ధరలు రూ. 150 నుంచి రూ. 270 వరకు పలుకుతున్నాయి. సన్ఫ్లవర్, రైస్బ్రాన్ ఆయిల్, పామాయిల్, వేరుశనగ, సోయా ఆయిల్ నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే బియ్యం, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు, ప్రస్తుతం వంట నూనెల ధరలు కూడా తోడవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. సామాన్యుడిపై మరో భారం -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): నదిలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కోణాపూర్ గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ హైమద్ మోహీనొద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి భిక్షపతి(40)ఈనెల 13న సాయంత్రం చేపల వేటకని గ్రామ శివారులోని మంజీరా నది వద్దకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడతో నది వద్దకు వెళ్లి చూడగా భిక్షపతి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బందితో నదిలో వెతికించగా భిక్షపతి మృతదేహం లభ్యమైంది. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని యువకుడి మృతదేహం నారాయణఖేడ్: మనూరు మండలం రాయిపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ కోటేశ్వర్రావు వివరాల ప్రకారం.. సుమారు 30 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఒంటిపైన నల్లటి రంగు టీ షర్టు, మెరూన్ కలర్ డ్రాయర్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిస్తే మనూరు పోలీస్స్టేషన్ 87126 56758 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
రైస్మిల్లులో తనిఖీలు
శివ్వంపేట(నర్సాపూర్): శివ్వంపేటలోని ఓం సాయి వెంకటరమణ రైస్మిల్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2022– 23 రబీ సీజన్లో ప్రభుత్వం ఈ మిల్లుకు 6,996 టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. అయితే, మిల్లులో నిల్వలను పరిశీలించగా 241 టన్నుల ధాన్యం (సుమారు 6,026 బస్తాలు) తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేటాయించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లులో తగినంత గోదాం సదుపాయం లేకపోవడంతో ఆరుబయట నిల్వ చేయాల్సి వచ్చిందని యజమానులు తెలిపారు. ఈ క్రమంలో వర్షాలకు వడ్ల బస్తాలు తడిసి పాడైపోవడంతో పాటు, కోతుల బెడద కారణంగా ధాన్యం నష్టం వాటిల్లిందని అధికారులకు వివరించారు. తక్కువగా వచ్చిన 241 టన్నుల ధాన్యం విలువ రూ. 53,91,000 ప్రభుత్వానికి రికవరీ కింద చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. స్పందించిన మిల్లు యజమానులు ఆ మొత్తాన్ని చెల్లిస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో మెదక్ సివిల్ సప్లయి ఆర్ఐ నర్సింలు, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. -
వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ లక్ష్మిబాబు వివరాల ప్రకారం.. అంకిరెడ్డిపల్లికి చెందిన రాసుల శ్రీకాంత్(25) ఓ ప్రైవేటు సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య చవితి పండుగకు పుట్టింటికి వెళ్లగా భార్యకు ఫోన్ చేసి గొడవపడి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై అంకిరెడ్డిపల్లి నుంచి దుద్దెడ గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పండుగ ఫూట కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేశారు. కారు ఢీకొని.. సిద్దిపేటఅర్బన్: కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నాల దాబా వద్ద ఓ వ్యక్తి డివైడర్ దాటి కింగ్ ప్యాలెస్ హోటల్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు సమీపంలోని హోటల్లో పని చేసే వ్యక్తిగా తెలుస్తోందని, పూర్తి వివరాలు తెలియలేదని సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు పేర్కొన్నారు. -
శాస్త్ర విజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా శాస్త్ర విజ్ఞానాన్ని నిత్య జీవితానికి అన్వయించుకోవాలని డీసీఈబీ కార్యదర్శి లింబాజీ విద్యార్థులకు సూచించారు. సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో డీఈఓ సూచనల మేరకు మంగళవారం ‘శాస్త్రం – సమాజం’అనే అంశంపై జిల్లాస్థాయి సైన్స్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా లింబాజీ మాట్లాడుతూ ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయన్నారు. ఈ పోటీల్లో పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ త్రివేణి పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి, ఖేడ్లోని తక్షశిల పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి, జిన్నారం మండలం ఖాజిపల్లి తులిశారెడ్డి పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి దక్కించుకున్నారు. వీరికి డీసీఈబీ సెక్రటరీ లింబాజీ, జిల్లా సైన్స్ అధికారి సిద్దారెడ్డి బహుమతిని అందజేశారు. మొదటి స్థానం పొందిన విద్యార్థులు ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు రవీందర్రెడ్డి, మురళి, అశోక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సిఆర్పీలు దత్తు, కల్పన, లలిత పాల్గొన్నారు.డీసీఈబీ కార్యదర్శి లింబాజీ -
టీబీ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
టీబీ జిల్లా కో ఆర్డినేటర్ అరుణ పటాన్చెరు టౌన్: క్షయవ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా తొలిదశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించాలని టీబీ జిల్లా కో ఆర్డినేటర్ అరుణ సూచించారు. పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం క్షయవ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, చికిత్స అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు టీబీపై అవగాహన పెంచుకుని, చుట్టుపక్కల ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రవీణ, భాగ్య క్లబ్ కన్వీనర్ డాక్టర్ శివదీప్తి, ఎన్ఎస్ఎస్ అధికారులు ప్రొఫెసర్ వెంకటేశం, కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆరోపణలు సిగ్గుచేటు ఎమ్మెల్యే సంజీవరెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు నీటి సరఫరా, కాలువల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి మండిపడ్డారు. మండలంలోని మార్డిలో మంగళవారం లబ్ధిదారులకు స్మార్టురేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నల్లవాగు ప్రాజెక్టు కాల్వల్లో పూడిక తీయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. పనులు చేయకుండా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివశ్రీనివాస్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు పోచయ్య, రవీందర్రెడ్డి, దేవదాస్, జితేందర్రెడ్డి, సంగారెడ్డి పాల్గొన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ సదాశివపేట(సంగారెడ్డి): సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం పాలనలో జమిందారులు, భూస్వాములు చేసిన దోపిడీ, పీడన, హత్యలు మహిళలపై జరిగిన లైంగిక దాడులకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం సాయుధపోరాటం సాగిందన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నాయకులు రమేశ్గౌడ్,భూషణం, ఖయ్యుం, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా రీ సర్వే హవేళిఘణాపూర్(మెదక్): భూ భారతి రీ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూ రికార్డులను పరిశీలిచాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం మెదక్ మండలం పాశాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూ భారతి రీసర్వేను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ల్యాండ్ సర్వే కిషన్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు పాల్గొన్నారు. -
బైరాన్పల్లి మహిళల పోరాటం స్ఫూర్తిదాయకం
మద్దూరు(హుస్నాబాద్): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బైరాన్పల్లి మహిళల పోరాటం స్ఫూర్తిదాయకమైనదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. అమరులైన వీరవనితలను స్మరించుకుంటూ ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన స్ఫూర్తియాత్ర మంగళవారం కడవెండిలో ప్రారంభమై సాయంత్రం బైరాన్పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో 1946–51 వరకు జరిగిన పోరాటంలో ఎందరో మహిళలు అమరులయ్యారన్నారు. రజాకార్లు మహిళల వస్త్రాలను తొలగించి శవాల చుట్టూ బతుకమ్మ ఆడించిన ఘటన ఆనాడు జరిగిందన్నారు. మహిళలు చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో వీరవనితల్లాగా ఉద్యమించి నిజాం రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తియాత్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, ఉపాధ్యక్షురాలు ఆశాలత, సరళ, పద్మ, రమణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు నవీన, కార్యదర్శి శారద, సహాయ కార్యదర్శి శిరీష పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
గణేశ్ గడ్డపై భక్తిపారవశ్యం
● సందడిగా నవరాత్రి ఉత్సవాలు ● భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం సమీపంలో ఉన్న ప్రసిద్ధ గణేశ్ గడ్డ ఆలయం ఆధ్యాత్మిక శోభతో వికసించింది. సోమవారం ప్రారంభమైన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణలు, గణపతి బప్పా మోరియా జయజయధ్వనులతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు, పల్లకీ సేవ, పవిత్ర హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు సంతోష్ జోషి, జగదీశ్వర స్వామి, చంద్రశేఖర్, అయ్యప్ప, సతీష్లు మాట్లాడుతూ... తొమ్మిది రోజుల పాటు స్వామివారు రోజుకో ప్రత్యేక విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్లు తెలిపారు. అదే విధంగా భక్తులందరికీ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలుసంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నెలవారీ సమీక్షను నిర్వహించారు. వివిధ కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజాభద్రత, సైబర్ నేరాల నివారణ కమ్యూనిటీ పోలీసింగ్, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో దర్యాప్తు చేపట్టి వేగంగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్లకు కేటాయించిన పోలీసు వాహనాలను పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు అభినందించి నగదు రివా ర్డులు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, వెంకట్రెడ్డి, సైదానాయక్, ఏఆర్డీ ఎస్పీ నరేందర్ పాల్గొన్నారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ ఎస్పీ ఆఫీస్లో విఘ్నేశ్వరుడికి పూజలుసంగారెడ్డి జోన్: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో మిన్నంటాయి. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయం ఆధ్యాత్మిక నిలయాన్ని తలపించింది. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం విఘ్నేశ్వరుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. -
చేనేత కళను కాపాడుకుందాం
దుబ్బాక: అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకుందామని దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు అన్నారు. స్టడీ టూర్లో భాగంగా మంగళవారం దుబ్బాక మండలం హబ్షీపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 7,8 తరగతుల విద్యార్థులు సోషల్ టీచర్ కృష్ణ నేతృత్వంలో చేనేత సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు మగ్గాలపై వస్త్రాలను ఎలా నేస్తారు? రంగులు అద్దడం, ఆసు పోయడం, దారాల అల్లిక , జకార్డ్ మగ్గాల పనితీరుపై విద్యార్థులకు చైర్మన్ వివరించారు. ఒకప్పుడు దుబ్బాక చేనేత పరిశ్రమ దేశంలోనే ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు. గొల్లభామ చీరతో పాటు పలు కళాఖండాలను ఆవిష్కరించిన నేత కార్మికులు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మగ్గాలపై చేనేత కార్మికులు తయారు చేస్తున్న చీరలు, టవల్స్ను ఆసక్తిగా తిలకించారు. దుబ్బాక చేనేత సంఘం చైర్మన్ మధు -
కంచి కామకోటి పీఠాధిపతికి ఆహ్వాన పత్రిక అందజేత
కొండపాక(గజ్వేల్): మండలంలోని మర్పడ్గ శివారులో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఫిబ్రవరి 1,2,3వ తేదీల్లో మహా సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఆహ్వాన పత్రికను మంగళవారం తమిళనాడు కాంచీపురంలోని మణిమండపంలో చతుర్మాస దీక్షలో ఉన్న కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి క్షేత్ర నిర్వహణ కమిటీ అందించింది. మహా పట్టాభిషేక నిర్వహణ కార్యక్రమాల్లో పాటించే పద్ధతులు, చేపట్టాల్సిన పనులపై తగు సూచనలు చేసి, కమిటీని ఆశీర్వదించారు. పీఠాధిపతిని కలిసిన వారిలో క్షేత్రం నిర్వాహకులు హరినాథ శర్మ, సర్పంచ్ బాలరాజు, కమిటీ సభ్యులు మోహనకృష్ణశర్మ, రాజేంద్రప్రసాద్, సత్యం, తిరుపతిరెడ్డి ఉన్నారు. సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్లో అనభేరి విగ్రహాన్ని పున:నిర్మించాలని, వీర మరణం పొందిన మహ్మదాపూర్ గుట్టలను పర్యటక కేంద్రం చేయాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. సాయుధ పోరాట 78వ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశపాలనలో.. అనభేరి ప్రభాకర్రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసి పేదలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారన్నారు. కార్యక్రమంలో మల్లేశ్, స్వామి, అశోక్, శ్రీనివాసు, కళ్యాణ్, సృజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి(తూప్రాన్): బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మాసాయిపేట్ మండలం హకీంపేట్ గ్రామ శివారులోని డ్యామ్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూదం ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్రెడ్డి, ఎండీ హుస్సేన్, వినోద్, మల్లబోయిన గణేశ్, పాశం మాణిక్రెడ్డి, గాండ్ల రాజు ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి క్రైమ్: ఆటో అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ పోలీసు స్టేషన్ ఫరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి బైక్పై గుర్తుతెలియని వ్యక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని బైపాస్ స్థానిక సాయి బాబాగుడి దగ్గర వద్ద ఆటో అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. -
సాగు వ్యయం తగ్గి.. స్థిరమైన దిగుబడులు
దుబ్బాకటౌన్: ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల సారం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి అన్నారు. మంగళవారం రాయపోల్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫార్మర్ కిట్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం, రాయపోల్లో రైతులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి స్థానిక వనరులతో సహజ పద్ధతుల్లో సాగు చేయడం ప్రకృతి వ్యవసాయం ప్రధాన లక్ష్యమన్నారు. దీనివల్ల సాగు వ్యయం తగ్గడంతో పాటు నేల సారం, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడి దీర్ఘకాలంలో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి -
సామ ఎల్లారెడ్డి యాదిలో..
సిద్దిపేటజోన్: ప్రముఖ ప్రకృతి వ్యవసాయ రైతు, రైతు నేస్తం అవార్డు గ్రహీత సామ ఎల్లారెడ్డి సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం ఆయన స్వగ్రామం సిరిసిల్ల జిల్లా లింగంపల్లిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్పెయిన్ దేశంలో ఉద్యోగాన్ని వదులుకొని స్వదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి ప్రకృతి వ్యవసాయ రైతుగా పేరు సాధించాడు. రసాయనిక ఎరువుల వాడకం లేకుండా సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ, సేంద్రియ వ్యవసాయంపై ప్రచారం చేశారు. సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాల్లో ఆహార యోగ పేరిట సేంద్రియ ఉత్పత్తుల స్టోర్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి గుర్తింపు పొందారు. 2016లో ఆయనకు రైతు నేస్తం అవార్డు లభించింది. -
నామినేటెడ్ పదవులెవరికో?
కోహెడరూరల్(హుస్నాబాద్): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గమైన హుస్నాబాద్లోని కోహెడలో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా.. అత్యంత కీలకమైన కోహెడ సింగిల్ విండో చైర్మన్ పదవి భర్తీ కాకపోవడంతో స్థానిక అధికార పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. స్వయంగా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సొంత ఇలాకాలోనే నిర్ణయాలు ఇంత ఆలస్యమైతే, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయంటూ ద్వితీయ శ్రేణి నాయకులు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేసి, బయోడేటాలు ఇచ్చి అలిసిపోయామని, క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇంకెంత కాలం! కోహెడ సొసైటీ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలా? లేక ఎస్సీలకే ఇవ్వాలా? అనే అంతర్గత వివాదమే ఈ సుదీర్గ జాప్యానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే మంత్రి నియోజకవర్గంలో సామాజిక సమీకరణల పేరుతో కాలయాపన చేస్తూ నిర్ణయాన్ని నానబెట్టడంపై ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం రాత్రింభవళ్లు కష్టపడిన మాజీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్యతో పాటు మాజీ సర్పంచ్లు, సీనియర్ నేతలు ఈ పదవి కోసం వేచి చూస్తున్నారు. నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల క్షేత్ర స్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలకు ఇది పొలిటికల్ అస్త్రంగా మారుతుందని నియోజకవర్గ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. కోహెడ సహకార సంఘం కార్యాలయం కోహెడ సింగిల్ విండో పదవిపై కాలయాపన సమీకరణాల సాకుతో నానబెడుతున్న వైనం మంత్రి చుట్టూ క్యాడర్ ప్రదక్షిణలు పాలక మండళ్లు లేక రైతుల ఇబ్బందులు ఒక వైపు రాజకీయ లాబీయింగ్, పైరవీలు నడుస్తుంటే మరోవైపు పాలక మండళ్లు లేకపోవడంతో సొసైటీల్లో రైతుల సమస్యలు గాలికొదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎరువుల పంపిణీ, పంట రుణాలు మంజూరు వంటి కీలక నిర్ణయాలు సకాలంలో జరగక క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలప్పుడు పార్టీ విజయానికి తోడ్పడిన నిఖార్సైన గ్రౌండ్ లెవల్ కార్యకర్తలను కాదని కేవలం పైరవీలకే పెద్దపీట వేస్తారేమోనన్న అనుమానాలు కార్యకర్తల్లో బలంగా నాటుకుంటున్నాయి. మంత్రి గతంలో కార్యకర్తలతో భేటీ అయినప్పుడు కష్టపడిన వారికే న్యాయం జరుగుతుంది, ఎవరూ అధైర్యపడొద్దు అని హామీ ఇచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా క్షేత్ర స్థాయిలో హామీలు ఆచరణకు నోచుకోకపోవడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తైవాన్లో మెరిసిన ఐఐటీహెచ్ విద్యార్థులు
● సోలార్ ప్యానెల్స్పై పరిశోధనకు థైవాన్ ఎక్స్లెన్స్ అవార్డు ● ప్రతిభ చాటిన హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తైవాన్ నేషనల్ యూనివర్సిటీ ఆ దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో హైదారాబాద్ ఐఐటీ విద్యార్థులు ప్రతిభను చాటారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థుల బృందం ప్రదర్శనకు అంతర్జాతీయస్థాయిలో ఎక్స్లెన్స్ అవార్డు వరించింది. రూ.1.5 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన విద్యార్థులు మహక్గాడియా, రాఖీమహమ్మద్, మెకానికల్ విభాగానికి చెందిన ఉదిత్మైనీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్కు చెందిన యుగ్నికేష్లు సోలార్ ప్యానెల్స్పై చేస్తున్న పరిశోధనలను ప్రదర్శించారు. 70 సెం.మీల ఉష్ణోగ్రతతో పాటు, అత్యధిక తేమను తట్టుకోగలిగిన 25 సెం.మీ స్కొయర్ ప్యానెల్స్లను ప్రదర్శించారు. అంతర్జాతీయ జ్యూరీ విభాగం ఈ ప్రదర్శనను ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు దక్కించుకున్న విద్యార్థులను ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి, ఈ బృందం సూపర్వైజర్ ఆశిశ్కులకర్ణిలు అభినందించారు. -
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
నర్సాపూర్ రూరల్: ప్రకృతి వ్యవసాయంతో మంచి లాభాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని లింగాపూర్ రైతువేదికలో ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికై న చిన్నచింతకుంట, జక్కపల్లి రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే నేలతో పాటు వాటిని భుజించిన మనుషుల ఆరోగ్యం బాగుంటుందన్నారు. టీఆర్ వికె శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం కోసం అనేక రాయితీలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు. అనంతరం రైతులకు కావలసిన ఆయా రకాల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఏడీఏ సంధ్యారాణి, మండల వ్యవసాయ అధికారి దీపిక, ఏఈలు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ -
వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యం
పటాన్చెరు టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, కోనసీమ జిల్లా... గంగవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన తోట ప్రభాకరరావు(40) తన సోదరునికి నర్సరీ పనుల్లో సహాయం చేసేందుకు ఈ నెల 10న ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధనూర్కు వచ్చాడు. 12వ తేదీన రాత్రి సుమారు 9 గంటలకు సోదరునితో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటలకు చూడగా ప్రభాకరరావు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ప్రభాకర రావుకు మతిస్థిమితం సరిగా లేదని, అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సాపూర్లో తల్లీముగ్గురు పిల్లలు.. నర్సాపూర్ రూరల్: తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన నర్సాపూర్లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. నర్సాపూర్ పట్టణానికి చెందిన జమ్లా రవి భార్య మమత(30), పెద్ద కూతురు ప్రవళిక, చిన్న కూతురు ఆరాధ్య, కుమారుడు కార్తీక్ను తీసుకొని తల్లి గారి గ్రామం మూసాపేటకు వెళ్తున్నట్లు 12వ తేదీన సాయంత్రం ఇంట్లో చెప్పి వెళ్లింది. అదే రోజు చేరుకున్నారా లేదా అని తెలుసుకునేందుకు మమతకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మమత తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కరెంట్ కష్టాలు
అన్నదాతలకు కరెంట్ కష్టాలు షురువయ్యాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అప్రకటిత కోతలు..లో ఓల్టేజీ సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ సమస్యను నిరసిస్తూ ఇటీవల నిజాంపేటలో రైతులు నిరసనకు దిగారు. నాందేడ్–అకోలా రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు తక్షణం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. –సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ప్రధానంగా వరి పొట్ట దశలో ఉంది. ఇలాంటి కీలక దశలో సమయానికి సాగు నీరు అందితేనే వరి గట్టెక్కుతుంది. కానీ ఈ దశలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేక పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనులో 7.04 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వరి 1.22 లక్షల ఎకరాల్లో వేసుకున్నారు. ప్రధానంగా హత్నూర, ఆందోల్, గుమ్మడిదల, జిన్నారం, నిజాంపేట, కల్హేర్, కంగ్టి, నారాయణఖేడ్, పుల్కల్, చౌటకూర్, వట్పల్లి తదితర మండలాల్లో వరి సాగవుతోంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురియలేదు. దీంతో రైతులకు బోర్లే ఆధారం. ● గత కొన్ని రోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చాలాచోట్ల ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. అయితే తరచూ ట్రిప్ అవుతోంది. దీంతో తడిసిన మడే తడిస్తోందని, చివరి మడి ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. లోఓల్టేజీ సమస్యతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి మరమ్మతులు అదనపు భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33 వేల యూనిట్లు పెరిగిన వినియోగం జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయ విద్యుత్తోపాటు, గృహ విద్యుత్ వినియోగం కూడా ఒకేసారి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 8.91 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.09 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు న్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 32.88 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగితే.. ప్రస్తుతం 33.21 లక్షలకు పెరిగిందని పేర్కొంటున్నారు. ● ఉన్నఫళంగా వినియోగం గణనీయంగా పెరగడంతో సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. దీన్ని ఈ సమస్యను అధిగమించేందుకు ఆశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏఈలు, ఏడీఈలు, డీఈ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొంతమేరకు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని కూడా సూచిస్తున్నారు. లో ఓల్టేజీ సమస్యతోనూ ఇబ్బందులు నిజాంపేటలో రోడ్డెక్కి నిరసన తెలిపిన రైతులు అప్రమత్తమైన విద్యుత్శాఖ అధికారులు రెండు రోజుల క్రితం కురిసిన వాన రైతులకు ఎంతో మేలు చేసింది. సరిగ్గా నీరు అందక ఎండిపోయే పరిస్థితికి దారితీసిన తరుణంలో ఈ వానప్రాణం పోసిందని రైతులు పేర్కొంటున్నారు. లేనిపక్షంలో వ్యవసాయవిద్యుత్ వినియోగం మరింత పెరిగేది. ఈ వాన వారం రోజుల పాటు పంటలను కాపాడుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. -
ఎఫ్పీఓలుగా పీఏసీఎస్లు
● జిల్లాలో 18 సొసైటీ కార్యాలయాలు ఎంపిక ● రూ.15 లక్షల వరకు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ● 750 మంది రైతులతో సభ్యత్వాలు సంగారెడ్డి జోన్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సొసైటీ కేంద్రాలు)ను రైతుల ఉత్పత్తి సంస్థలు (ఎఫ్పీఓ)లుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తొలుత రాష్ట్రంలోని నిజామాబాద్, నల్లగొండ జిల్లాలను గుర్తించింది. తాజాగా జిల్లాలోని 53 సొసైటీ కేంద్రాల్లోని 18 కేంద్రాలను ఎఫ్పీఓలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఇప్పపల్లి, ఇందూర్, సత్వార్, చెల్మెడా (కలాన్), సదాశివాపేట, కంది, మనూర్, కంగ్టి, కృష్ణపూర్, ఇస్మాయిల్ ఖాన్ పేట, శివంపేట, సోలాక్పల్లి, ముత్తాంగి, హత్నూర, తెల్లపూర్, పటాన్ చెరు, గుమ్మడిదల సొసైటీలను ఎఫ్పీఓలుగా మార్చనుంది. ఒక్కో సొసైటీలో 750 మంది రైతుల సభ్యత్వాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ఏర్పాటైన కేంద్రంలో 750 మంది రైతులకు సభ్యత్వాలు అందిస్తారు. సభ్యత్వం పొందిన రైతు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సభ్యత్వం పొందిన ప్రతీ ఒక్కరికి సమానంగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు అందజేస్తుంది. ఈ విధంగా రైతులు రూ.15 లక్షలు సమకూర్చుకోగా కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు సబ్సిడీ అందిస్తుంది. వీటితోపాటు రూ.రెండు కోట్ల వరకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తుంది. వీటి ద్వారా వ్యాపారాలు నిర్వహించి ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చేయూతనిస్తుంది. ఎఫ్పీఓ లుగా మారిన ప్రతీ సొసైటీకి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, నాబార్డ్ సంస్థల నుంచి రుణ సౌకర్యం అందుతుంది. పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా గ్రేడింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, మినీ రైస్ మిల్లులు, ప్యాకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సులభతరంగా ఉంటుంది. మెరుగైన సేవలు సొసైటీలో సభ్యత్వం పొందిన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు తోటి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుంది. కొనుగోలు కేంద్రాలతోపాటు ఎరువుల అమ్మకాలకు మొదటగా ఎఫ్పీఓలకు ప్రాధాన్యం ఇస్తారు. దళారుల ప్రమేయం లేకుండా సభ్యులే నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వివిధ రకాల కంపెనీల నుంచి నేరుగా ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న రైతులకు హోల్ సేల్ ధరలకే అమ్ముతారు. ఎఫ్పీఓలుగా మార్పు చెందితే ప్రస్తుతం ఉన్న సేవలతోపాటు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతు ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా... సొసైటీ పరిధిలో ఉన్న రైతుల ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతున్నారు. జిల్లాలో ఉన్న 18 సొసైటీలను మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సొసైటీల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతోంది. ప్రక్రియ పూర్తయితే రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. –కిరణ్ కుమార్, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, సంగారెడ్డి -
భెల్ను సందర్శించి.. సమస్యలు చర్చించి
భెల్ను సందర్శించిన రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రామచంద్రాపురం(పటాన్చెరు): బీహెచ్ఈఎల్ పరిశ్రమను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సందర్శించారు. భెల్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి, భెల్ టౌన్షిప్లోని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనకు భెల్ ఈడి వై.శ్రీనివాస్రావు, జీఎంలు జె.ఉమామహేశ్వరరావు, నందు, సంధ్యాకర్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెల్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలను కార్మికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం భెల్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. రైస్ మిల్లులపై సోదాలు నిలిపివేయాలితెలంగాణ రైస్ మిల్లు అసోసియేషన్ సమావేశం ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సోదాలు నిలిపివేయాలని తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కన్వేన్షన్ హాల్లో శనివారం తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం కేటాయించకపోవడం దారుణమన్నారు. మూడు రోజులుగా కలెక్టర్, పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 9.70 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఇవ్వగా 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యంను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చామన్నారు. కొందరు మిల్లర్లు చేసిన అవినీతికి అందరిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అవినీతి పరులను రైస్ మిల్ అసోసియేషన్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 75లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఇవ్వగా 51లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అందుకు గాను డిసెంబర్ 31 వరకు సమయం ఇవ్వాలన్నారు. -
పూర్తిస్థాయిలో రైల్వే సమస్యల పరిష్కారం
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్నగర్ కాలనీకి వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జిని రైల్వే, సీఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసుత్తం ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈసమస్యను పరిష్కరించేందుకు రూ.21 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు చెప్పారు. అందులో భాగంగా రైల్వే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. త్వరలో అండర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. నిర్మాణం పనుల సమయంలో ప్రజలకు, వాహనాదారులకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా తెల్లాపూర్ రైల్వేస్టేషన్, రేడియల్ రోడ్డు7కు అసుసంధానం చేసేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ ఉపకమిషనర్ జ్యోతిరెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, తేనా అధ్యక్షుడు రమణ, మాజీ కౌన్సిలర్ రాజు తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
22 ఏ జాబితాలో 318 అపార్టుమెంట్లు 1,799 ఇళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత జాబితా 22ఏలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 318 అపార్టుమెంట్లు, 1,799 నివాసాలు ఉన్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. మొత్తం 2,117 ప్రైవేటు స్థిరాస్తులు ఈ జాబితాలో ఉన్నట్లు తేల్చింది. పటాన్చెరు నియోజకవర్గంలో బీహెచ్ఈఎల్ కాలనీల్లో 1,146 ఇళ్లు, సందిగూడెం కాలనీలో 250 ఇళ్లు, బోన్సాయ్కాలనీలో 182 నివాసాలు, బండ్లగూడ కాలనీలో 112, దుర్గా కాలనీలో 56, ముత్తంగి కాలనీలో 53 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే శ్రీరాంనగర్ కాలనీలో ఏకంగా 259 అపార్టుమెంట్లు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలోనూ 59 అపార్టుమెంట్లు 22ఏలో ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్ టెక్నాలజీపై కలిసి పనిచేయనున్న రెండు సంస్థలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అటానమస్ నావిగేషన్ సిస్టమ్పై పరిశోధన చేస్తున్న ఐఐటీ హైదరాబాద్కు చెందిన టీహాన్ సంస్థతో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టీహాన్ సంస్థ ఏపీలో డ్రోన్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడం, డ్రోన్ సిటీ అభివృద్ధికి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. డ్రోన్ ఆర్డీ, యూఏవీ ప్లాట్ఫాంలు, సెన్సార్లు, పేలోడ్లు వంటి అంశాలపై ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ..బలమైన డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఆవిష్కరణలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఆధునిక డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి, పరిశోధకులు, స్టార్టప్లు, పరిశ్రమలకు కొత్త అవకాశాలను సృష్టించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: జాతీయ లోక్ అదాలత్లో 3,625 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర వెల్లడించారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్అదాలత్లో ఆమె పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు తమ వివాదాలను పరస్పర అంగీకారంతో సత్వరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం అందించడం, ప్రజలకు సత్వర న్యాయం అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ డేంజర్ బెల్స్
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026గణపతి నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు చాలా మంది భక్తులు మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించే వారిని ‘సాక్షి’ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మట్టి వినాయకులను పూజించే భక్తులు సెల్ఫీ తీసుకుని ‘సాక్షి’కి పంపిస్తే, వారి ఫొటోలను ప్రచురించనున్నాం. వాట్సాప్ 9949849479కు పంపించండి మరి.. ● డెంగీ నిర్ధారణకు గ్రామాల్లో జ్వర సర్వే ● విపరీతంగా పెరుగుతున్న దోమల ఉధృతిగ్రామాల్లో అనుమానిత కేసులు జిల్లాలో డెంగీ వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణ మార్పుల పరిస్థితుల నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 42 డెంగీ కేసులు నమోదు కాగా అప్రమత్తమైన వైద్యశాఖ ఇంటింటికీ జ్వర సర్వేను చేపట్టింది. మూడు రోజుల్లో తగ్గకపోతే రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. – సంగారెడ్డి జోన్ -
జోగిపేట కోర్టులో 356 కేసుల పరిష్కారం
జోగిపేట(అందోల్): అందోలు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జోగిపేటలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 356 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్లో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ అధ్యక్షులుగా బెంచ్ సభ్యులుగా సీనియర్ న్యాయవాదులు ఎస్.నారాయణరెడ్డి, ఎస్.కృష్ణారెడ్డిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షరీఫ్ మాట్లాడుతూ...లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వలన కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. పరిష్కారమైన కేసుల్లో 33 క్రిమినల్, 19 బ్యాంకు, 56 జరిమానా, 237 డ్రంక్ అండ్ డ్రైవ్, 5 సైబర్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జోగిపేట సర్కిల్ సీఐ అనిల్కుమార్, జోగిపేట, పుల్కల్, వట్పల్లి ఎస్ఐలతోపాటు స్థానిక పోలీసు సిబ్బంది, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాలొన్నారు. జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ అసదుల్లా షరీఫ్ -
పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
సంగారెడ్డి జోన్/సంగారెడ్డి క్రైమ్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ కార్యాలయంలో శనివారం శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రజలు ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలన్నారు. నిర్వాహకులు తెలంగాణ పోలీస్ పోర్టల్లో మండపం వివరాలు, నిమజ్జనం తేదీ, నిమజ్జనానికి వెళ్లే మార్గం తదితర వివరాలను ముందస్తుగా నమోదు చేయాలని సూచించారు. వినాయక ప్రతిష్ఠాపన కోసం ఏర్పాటు చేసే మండపాలను రహదారులపై నిర్మించకుండా, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రతా దష్ట్యా ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైనా సమాచారం ఉన్నప్పుడు డయల్–112కు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వెంటనే సమాచారం అందించాలని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్యగౌడ్, తహస్దీలార్ జయరామ్, తోపాజి అనంత కిషన్, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, గణేశ్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ పరితోశ్ పంకజ్ -
ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ ముఠా అరెస్టు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 52 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్ వైర్ చోరీ చేసిన అంతర్ జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్చంద్ర కేసు వివరాలు వెల్లడించారు. భిక్కనూరు మండల పరిధిలోని పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఐదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, వైరు, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు భిక్కనూరు ప్రాంతంలో 29, మెదక్ జిల్లా పరిధిలో 23 చోట్ల నమోదయ్యాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుమానితులను గుర్తించారు. మరోసారి చోరీ చేసేందుకు భిక్కనూరు సమీపంలోని పరివార్ హోటల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను మేడ్చల్కు చెందిన బల్జీర్ సింగ్, రూప్సింగ్, లకన్ సింగ్లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నాడు. అంతర్ జిల్లా ముఠా సభ్యులు నలుగురూ సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. నిందితులు గతంలో పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారని పోలీసులు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 కిలోల కాపర్ వైరు, రాడ్లు, చోరీకి ఉపయోగించిన పరికరాలు, బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 52 ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొట్టిన నిందితులు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
జిజ్ఞాసలో రాష్ట్రస్థాయి అవార్డులు
పటాన్చెరు టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాస స్టూడెంట్ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించారు. శుక్రవారం కళాశాలలో విజయోత్సవ సభ నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ రంగంపై అంతర్రాష్ట్ర వలస శ్రామికుల ప్రభావంపై చేసిన పరిశోధనకు అర్థశాస్త్రంలో ప్రథమ బహుమతి, ఫుడ్ అడల్టరేషన్ పై చేసిన ప్రాజెక్టుకు వృక్షశాస్త్రంలో ద్వితీయ బహుమతి, ఇంగ్లిష్ స్కిల్స్పై పరిశోధనకు ఆంగ్లంలో తృతీయ బహుమతి లభించాయి. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులు, ప్రొఫెసర్ వెంకటేశం,డాక్టర్ మల్లిక, డాక్టర్ షరీఫ్ మియాలను ప్రిన్సి పాల్ ప్రవీణ, అధ్యాపకుల బృందం అభినందించారు. అనంతరం ఎండీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థులు, సిబ్బందికి మట్టి గణపతులను పంపిణీ చేసి పర్యావరణంపై అవగాహన కల్పించారు. నర్సాపూర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు.. నర్సాపూర్ రూరల్: రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జంతు శాస్త్ర విభాగం విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి అందుకున్నారు. రాష్ట్ర కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిజ్ఞాస పరిశోధన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు. కాగా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం విద్యార్థులు హబీ టాట్ అండ్ ది నర్సాపూర్ ఫారెస్ట్, తెలంగాణ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఆయా రకాల పక్షులపై చేసిన పరిశోధనకు మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు అధ్యాపకుడు డాక్టర్ సురేశ్ను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
తొగుట(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పెద్ద మాసాన్పల్లి మదిర వడ్డెర కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. తొగుట ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోదాసు లక్ష్మి, బాలయ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య చాలా కాలం క్రితం మరణించగా తల్లి కూలీ పనులు చేసి పిల్లలను పెంచి పెద్ద చేసింది. కాగా వారి చిన్న కుమారుడు సంజీవ్ (21) సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. కాగా ఈ నెల 9న రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం మృతదేహం కనిపించింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య -
రికార్డుల్లో తప్పులుండొద్దు
కొండపాక(గజ్వేల్): ఎరువుల క్రయ విక్రయాల రికార్డుల్లో తప్పులుండకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి హెచ్చరించారు. మండలంలోని ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ దుకాణాలను శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. వివిధ రకాల ఎరువులు, పురుగు మందుల నిల్వలు, రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసే వాటికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, ఈపాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరగాలన్నారు. పురుగు మందులు, ఎరువులు ఎంఆర్పీ ధర కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడీఏ బాబూనాయక్, ఏఓ శివరామకృష్ణ పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి -
ఆగమనమూ..వేడుకే
దుబ్బాకలో నయా ట్రెండ్దుబ్బాకటౌన్: వినాయక చవితి వస్తే చాలు పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా నవరాత్రి ఉత్సవాలు, కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కాగా గణేశ్ ఆగమన్ను సైతం ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉద్యమాల పురిటిగడ్డ అయినా దుబ్బాకలో వినాయక నిమజ్జనోత్సవాలకు గొప్ప ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. స్వాగతం అదిరే.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సైతం అప్డేట్ అవుతున్నారు. వినాయక చవితి దగ్గర పడుతుండడంతో భారీ గణనాథులను పట్టణాల నుంచి స్వగ్రామలకు తీసుకొస్తున్నారు. ప్రతీ సంవత్సరం లాగా నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించే యువత ఈసారి గణేశ్ ఆగమన్ పేరిట భారీ గణనాథులకు అదిరిపోయే స్వాగతం పలుకుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు.. వినాయకుని ఊరేగింపును వీడియోలు తీస్తూ యువకులు ఇన్స్టాలో పోస్టు చేయడంతో వినాయక ఆగమన్కు మరింత ప్రత్యేకత పెరిగింది. కేవలం వివాహాల్లో, పెద్ద పెద్ద సభల్లో వాడే డ్రోన్లను సైతం ఆగమన్ ఊరేగింపునకు వాడటంతో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మరింత ట్రెండ్ అవుతున్నాయి. వినాయకులకు అదిరిపోయే స్వాగతం భారీ లైటింగ్.. డీజే హోరుహిందూ పండుగలలో వినాయక చవితి అతి పెద్ద పండుగ. ఈ సారి ఆగమన్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రత్యేక బాణాసంచా, పేపర్ స్ప్రేతో, డ్రోన్తో స్వాగతం పలికాం. ప్రజలు సైతం ఊరేగింపును చూడడానికి వందల సంఖ్యలో రావడం సంతోషం. – నేహాల్ గౌడ్, మిత్రయూత్ అధ్యక్షుడు, దుబ్బాక -
మట్టి ప్రతిమలనే ప్రతిష్ఠించాలి
గజ్వేల్రూరల్: మట్టి గణపయ్యలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుదామని గజ్వేల్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మన్వీర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్లో రామకోటి భక్తసమాజం సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన గణపయ్య విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమయ్యే అవకాశముందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేశ్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్సాగర్రావు, సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయురాలు హరిణ, నాయకులు సత్యనారాయణ, సోమేశ్, విజయ్కుమార్, నర్సింహచారి పాల్గొన్నారు. -
పౌష్టికాహారం.. సంపూర్ణ ఆరోగ్యం
అంగన్వాడీల్లో నెల పాటు పోషణ మాసోత్సవాలుపౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పలు రకాల పోషకాహారం అందిస్తూ ఐసీడీఎస్ ఆరోగ్య తెలంగాణ సాధనకు కృషి చేస్తుంది. తల్లి మంచి పౌష్టకాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని.. తద్వారా దేశానికి భావి భారతపౌరుడిని అందించగల్గుతామన్న మంచి లక్ష్యంతో పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1150 అంగన్వాడీ కేంద్రాలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1150 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. టీచర్లు 1,059, ఆయాలు 860, గర్భిణులు 5,932, బాలింతలు 4,270, సున్నా నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 66,508 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల 8 వరకు.. ఈ నెల 9న ప్రారంభమైన పోషణ మాసంను అక్టోబర్ 8 వరకు చేపడతారు. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి? స్వయంగా తయారు చేసిన రకరకాల పౌష్టికాహారంను అందిస్తూ అంగన్వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ● మొదటి వారంలో ధాన్యాలు, చిరు ధాన్యాలు, ఆకుకూరలు, పళ్ల సమూహాల ప్రదర్శన, బొమ్మలతో అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో అంగన్వాడీల నిర్వహణ కమిటీల ఏర్పాటు, తల్లి పాలు, ఆలన పాలనపై అవగాహన, మూడో వారంలో పిల్లల్లో స్వీయ అవగాహన, ఎదుగుదల ప్రోత్సాహానికి అద్దాల ఏర్పాటు, గర్భిణులు, బాలింతల ఇళ్ల సందర్శన, వైద్య సిబ్బందితో సహకారం అందించనున్నారు. నాలుగో వారం ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్యాకేజీ ఆహారంతో కలిగే నష్టాలను వివరిస్తారు. తల్లిదండ్రులు, మహిళా సంఘాలు, పంచాయతీ వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆధునిక యుగంలోనూ పౌష్టికాహార లోపంతో మాతాశిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడంతో అబార్షన్లు కావడం.. ప్రసవమయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి తల్లీబిడ్డలు పురిట్లోనే మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. పేద కుటుంబాల్లో ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో మాతాశిశు మరణాలను నివారించడానికి ఆరోగ్య తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ మాసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. – దుబ్బాక పోషకాహార లోపంపై విస్తృత ప్రచారం సిద్దిపేట జిల్లాలో 1150 అంగన్వాడీ కేంద్రాలు సరైన అవగాహన లేక గర్భిణులు పోషకాహారం తీసుకోవడం లేదు. దీంతో పుట్టబోయే పిల్లలు అవయవ లోపాలు, తక్కువ బరువుతో పాటు చాలా రకాల అనారోగ్యంతో పుడుతున్నారు. పౌష్టికాహార లోపాలు లేకుండా భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. – శారద, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిఅంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు, ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం అందిస్తున్నాం. క్రమం తప్పకుండా వారి ఆరోగ్యాన్ని పరిక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. – సుజాత, అంగన్వాడీ టీచర్, దుబ్బాక -
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
మద్దూరు(హుస్నాబాద్): మండలంలో గాగిల్లాపూర్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు తుమ్మల గోపీ, వల్లపు అనిల్పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తీవ్ర గాయాలు దుబ్బాకరూరల్: విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్కు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని హబ్సిపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోరబొంతల రమేశ్ సబ్ స్టేషన్లో విద్యుత్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేస్తున్న సమయంలో ప్రక్కన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం రావడంతో పొలాల వద్ద ఉన్న రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న రమేశ్ను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. మిరుదొడ్డి(దుబ్బాక): భూంపల్లి పీహెచ్సీలో కాలం చెల్లిన ఇంజక్షన్ విషయంలో తలెత్తిన వివాదంలో ఘర్షణ పడ్డ వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్తో పాటు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు వినోద్ బాబ్జీ, నిర్మల భూంపల్లి పీహెచ్సీని సందర్శించారు. ఇంజక్షన్ విషయంలో ఘర్షణ పడిన ఝాన్సీ, దీపికలను వేర్వేరుగా విచారించారు. తుది నివేదికల అనంతరం వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పీహెచ్సీలోని మెడిసిన్ ల్యాబ్, స్టాక్ రూం, ఓపీ, రికార్డులను, కాలం చెల్లిన ఇంజక్షన్ల వివరాలపై ఆరా తీశారు. పీహెచ్సీకి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. సిద్దిపేటకమాన్: బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఉద్యోగులు తెలిపారు. శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పేస్కేల్కు అనుగుణంగా కేటగిరి వారీగా వేతనాలు చెల్లించాలన్నారు. బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన జీడి చిన్న అంజాగౌడ్ బైక్పై వెళ్తుండగా పాత బస్టాండ్ వద్ద వెనక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా విద్యార్థిని.. చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు దాటుతున్న విద్యార్థిని కారు ఢీకొట్టగా గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. శుక్రవారం పాఠశాలకు వెళ్తున్న పదవ తరగతి విద్యార్థిని శ్వేత రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీ రఘునందన్రావు దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులు అండర్పాస్ ద్వారా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
బీజీ –3 పత్తి సాగు చేస్తే చర్యలు
కొండపాక(గజ్వేల్): బీజీ– 3 పత్తి విత్తనాలు అధికంగా సాగు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి హెచ్చరించారు. మండలంలోని రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కాటన్ సాగు విషయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ బీజీ 3 కాటన్ విత్తనాల సాగు వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. అధిక శాతం విత్తనాలు వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు, పర్యావరణ ప్రభావం, నేల, నీరు కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల పంటలను సాగు చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు పత్తి పంటను పరిశీలించి తెగుళ్ల నివారణకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాబూనాయక్, ఏఓ శివరామకృష్ణ, సర్పంచ్ కవిత, ఏఈఓలు రమ్యశ్రీ, సుష్మిత, మౌనిక, సాత్విక, రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త పల్లవి -
రసాయనాల్లేని సాగుతోనే మేలు
ములుగు(గజ్వేల్): తెలంగాణలో ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించే సాంకేతికతపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని ములుగు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యాన పంటల్లో రసాయనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హిత జీవ సాంకేతిక విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో విశ్వవిద్యాలయం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ శ్రీ బయో ఎస్తటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో శుక్రవారం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అన్నదాతలు ఎరువులు, పురుగుల మందులను విచక్షణా రహితంగా వాడకుండా తక్కువ మోతాదు రసాయనాలతో అధిక దిగుబడులు సాధించే సమగ్ర యాజమాన్య పద్ధతులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి శ్రీబయోతో వర్సిటీ ఒప్పందం -
హరీశ్రావుకు మట్టి గణపతి అందజేత
సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్రావును బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని అఖిల్ పేర్కొన్నారు. మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించిన హరీశ్రావు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. కల్హేర్(నారాయణఖేడ్): క్రీడలు విద్యార్థుల్లో మానసిక ప్రశాంతతకు దోహదపడుతాయని ప్రోబేషనరీ డిప్యూటీ కలెక్టర్ కె.లక్ష్మి దీపిక తెలిపారు. సిర్గాపూర్లో మండలస్థాయి బాలుర ఎస్జీఎఫ్ క్రీడలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఆటలతో ఆరోగ్యంగా ఉంటూ చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. -
ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి
డీఎస్పీ సత్తయ్య గౌడ్ సంగారెడ్డి టౌన్/ సంగారెడ్డి క్రైమ్: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, ప్రజలు సహకరించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ కోరారు. ఈ నెల 14న వినాయక చవితి పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పట్టణంలో ఈసారి ఇప్పటివరకు 200 పైగా మండపాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. పోలీస్ పోర్టల్లో మండప నిర్వాహకులు తప్పకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీ మండపం వద్ద ఉత్సవ సమితి సభ్యులు సీసీ కెమెరాలను తప్పకుండా బిగించుకోవాలి వినాయక మండపాల వద్ద అన్నదానం చేసేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, స్పీకర్లను మాత్రమే పెట్టాలని స్పష్టం చేశారు. స్పీకర్లను రాత్రి 10 గంటల తర్వాత బంద్ చేయాలని చెప్పారు. అసెంబ్లీలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: వ్యవసాయ, పశుసంపద ఆధారంగా ఆగ్రోబేస్డ్, డెయిరీ బేస్డ్ పరిశ్రమలను ఖేడ్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో జీరో అవర్లో మాట్లాడుతూ..ఆయా పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రైతులు తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. పాడిరైతులకు సైతం ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేత మవుతుందన్నారు. ఖేడ్ నియోజకవర్గ రైతులు, పశుపోషకుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని పశువైద్యుల నియామకం, సంచార అంబులెన్స్ల పెంపు, పశుపోషణకు రాయితీలు, ఆగ్రో, డెయిరీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పటాన్చెరు టౌన్: సింఫనీ హోమ్స్ కాలనీలో 22–ఏ నిషేధిత జాబితాపై నెలకొన్న సందేహాలను నివృతి చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ శేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సింఫనీ హోమ్స్లో 55 ఎకరాల్లో సుమారు 900 విల్లాలున్నాయని, 5 వేల మంది నివసిస్తున్నారని తెలిపారు. 22–ఏ లో మొత్తం కాలనీని చేర్చారంటూ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. తహసీల్దార్ వివరాల ప్రకారం..రైల్వే లైన్ కోసం సేకరించిన సుమారు 4.15 ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే 22–ఏ లో చేర్చినట్లు తెలిపారు. ఆ స్థలాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎంపీ రఘునందన్రావుపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మతిన్, యువరాజ్, రాజు, సాయిలు, అక్షిత్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి: సంగారెడ్డి పోస్టల్ డివిజన్ నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్గా బి. అంబేడ్కర్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డి. శ్రీహరి బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. ఆయన స్థానంలో అంబేడ్కర్ రాజు బాధ్యతలు చేపట్టారు. -
లోటు వర్షపాతమే
సాధారణం కంటే తక్కువగా కురిసిన వర్షం● 16 మండలాల్లో నమోదు ● పంట ఎదుగుదలపై వర్ష ప్రభావం ● తగ్గుతున్న భూగర్భ జలాలు సంగారెడ్డి జోన్: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 16% వర్షం తక్కువ కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సుమారు గత 20 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూన్, జూలైలో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసిన ఆగస్టు నెలలో లోటు వర్షపాతం నమోదైంది. పంట ఎదిగే సమయంలో వర్షాలు కురువకపోవడంతో రైతులు ఆకాశం వైపు దిక్కులు చూస్తున్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఏడు లక్షల అరవై వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ సీజన్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సుమారు 60వేల ఎకరాల మేర సాగు విస్తీర్ణం తక్కువగా ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పంట సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నెల చివరి వరకు ఎంతమేర పంట సాగైందో తెలిసే అవకాశాలున్నాయి. అత్యధికంగా పత్తి, వరి, చెరుకు పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉన్నాయి. సోయా కాత దశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో పంట ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. చాలాచోట్ల పత్తి పంట తక్కువ ఎత్తులో ఉండగా, సోయాబీన్ పంట ఎండు ముఖం పట్టింది. 16 మండలాల్లో లోటు వర్షపాతం జిల్లావ్యాప్తంగా 28 మండలాలుండగా 16 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. రెండు మండలాల్లో అత్యధికంగా 10 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా జూన్, జూలైలో సాధారణం కంటే 12% ఎక్కువగా కురిసింది. ఆగస్టు నెలలో 56% తక్కువగా నమోదైంది. ప్రస్తుత నెలలో పది రోజులు పూర్తయినప్పటికీ చినుకు జాడ లేకుండా పోయింది. సీజన్ మొదటి రెండు నెలలు సాధారణం కంటే 12% అదనంగా ఉన్న వర్షపాతం ఆగస్టులో ఏకంగా 56% తక్కువగా కురిసి లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యామ్లు నీరు లేక కళావిహీనంగా మారాయి. నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం శనివారం నుంచి మరో నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని సంబంధిత శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. ఈ ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులకు ఈ వర్షాలు ఊరట కలిగించనున్నాయి. ఒకవేళ ఆశిస్తున్నట్లుగా ఈ నెలలో వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి, పెట్టుబడులు రావడం కూడా కష్టమేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. పడిపోతున్న భూగర్భ జలాలు వర్షాభావంతో జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అధికారులు చెప్పినట్లుగా ఆగస్టు పూర్తయ్యేసరికి 11.22 మీటర్ల లోతులో జలం లభిస్తోంది. వట్టిపల్లి మండలంలో 3.32మీటర్ల లోతులో నీరు ఉండగా గుమ్మడిదల మండలంలో 18.15 మీటర్ల లోతులోకి పడిపోయింది. అందోల్, హత్నూర, ఝరాసంగం, జిన్నారం, కంగ్టి, కల్హేర్, కంది, కోహీర్, నిజాంపేట, పుల్కల్ మండలాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతున్నాయి. సంగారెడ్డి, గుమ్మడిదల, పటాన్చెరు మండలాల్లో 16.5 మీటర్ల లోతులో ఉండి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. మిగతా మండలాల్లో సాధారణ పరిస్థితుల్లో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ఇబ్బందులే జిల్లాలో నమోదైన వర్షపాతానికి ఆరుతడి పంటలు సాగు కూడా కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోయాబీన్, మినుము, పెసర పంటలకు ప్రస్తుతం వర్షం ఎంతో ముఖ్యం. నీరు లేక ఎండుముఖం పడుతున్నాయి. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలకు సిద్ధమవుతున్నారు. నీటి సౌకర్యం ఉన్నవారు పైప్ లైన్తోపాటు స్ప్రింకర్ ద్వారా నీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారు
● టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి ● సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన సంగారెడ్డి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకుల తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డిలో నిరసన నిర్వహించారు. రామ్నగర్లోని జగ్గారెడ్డి నివాసం నుంచి పాతబస్టాండ్లోని అంబేడ్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నిర్మలారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరాచకం, గూండాయిజానికి పాల్పడ్డారన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరించడం దారుణమని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తమకు తామే నెట్టుకుని, పోలీసులపై దాడి చేసి, తిరిగి తామే బాధితులమన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దళిత వర్గాన్ని అవమానించేలా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, చర్యలను రాష్ట్ర ప్రజలంతా గమనించారని పేర్కొన్నారు. దళితులు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం బీఆర్ఎస్ పార్టీ కుసంస్కారానికి, అనాగరిక చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, నాయకులు జార్జ్, కిరణ్గౌడ్, సంతోశ్, శ్రీకాంత్, రామ్చందర్నాయక్, శ్రీకాంత్రెడ్డి, సందీప్రెడ్డి, భూమేశ్, తదితరులు పాల్గొన్నారు.జాతీయ రహదారి పనుల పరిశీలననారాయణఖేడ్: నిజాంపేట్– నారాయణఖేడ్– బీదర్ 161బీ జాతీయ రహదారిపై మంజీరా నదిపై పుల్కుర్తి–రాఘవాపూర్ల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన పనులను శుక్రవారం నేషనల్ హైవే క్వాలిటీ కన్సల్టెంట్ అధికారులు బృందం పరిశీలించింది. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.303 కోట్లు విడుదల చేసింది. నిజాంపేట్ నుంచి బీదర్ వరకు ఖేడ్ మీదుగా 46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టింది. ఇప్పటివరకు 70% పనులు పూర్తి కాగా మంజీరా నదిపై వంతెన నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు వంతెన నిర్మాణపు పనులను నేషనల్ హైవే డిప్యూటీ ఈఈ సందీప్, ఏఈ భానుప్రకాష్, క్వాలిటీ కన్సల్టెంట్ అధికారి శ్రీనివాస్రెడ్డి బృందం, ఆర్ఎంఎన్జీఎం నాగరాజు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈఈ సందీప్ మాట్లాడుతూ...ఈ రోడ్డు నిర్మాణ పనులు మరో ఆరు నెలల్లో పూర్తవుతాయన్నారు. జరుగుతున్న పనుల నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. -
నల్లవాగు చివరి ఆయకట్టుకు నీరివ్వాలి
కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళనకల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు చివరి ఆయకట్టు కింద ఎండుతున్న పంటలు కాపాడేందుకు సాగు నీరు అందించాలని శుక్రవారం కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేశారు. ఇందిరానగర్, కల్హేర్ వద్ద నల్లవాగు ఆయకట్టు కింద సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. నల్లవాగు కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండటంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంలేదని తెలిపారు. అధికారులు వెంటనే నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శివశ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. కదిలిన అధికార యంత్రాంగం నల్లవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో నీటి పారుదల శాఖ అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘రైతన్నలకు తప్పని నీటి గోస’శీర్షికతో సాక్షిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మరో పక్క రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో నీటి పారుదల శాఖ డీఈఈ ఎజాజ్, ఎఈ శ్రీవర్ధన్రెడ్డి కృష్ణాపూర్, ఇందిరానగర్ వద్ద నల్లవాగు కుడి కాల్వను పరిశీలించారు. కాల్వల్లో చెట్లు, పూడిక తొలగించి నీటి సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు తీసకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగన్న, రైతులు ఉప్పరి విఠల్, సాయిలు, ప్రకాశ్ పాల్గొన్నారు. -
కీలక ఆధారాలు లభ్యం!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నేదునూరు గ్రామంలో జరిగిన రియల్ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి ఆత్మహత్య ఘటన సంగారెడ్డి జిల్లాలోనూ కలకలం రేపింది. ఈ ఆత్మహత్యకు కారణం పటాన్చెరు ప్రాంతంలోని ఓ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ భూ వివాదాలే కారణమని ప్రాథమికంగా తేలడం చర్చనీయాంశంగా మారింది. రాంరెడ్డి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రామేశ్వరం బండ ప్రాంతంలో రాంరెడ్డి సుమారు 200 ఎకరాలకు భారీ వెంచర్ వేశారు. ఈ వెంచర్ భూవివాదాలే ఆత్మహత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. వాయిస్ రికార్డులో కీలక అంశాలు.. పోలీసులు స్వాధీనం చేసుకున్న రాంరెడ్డి సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డుల్లో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన డెవలప్చేస్తున్న వెంచర్కు సంబంధించిన భూమి యజమానులకు ఈ వాయిస్ రికార్డులు పంపినట్లు సమాచారం. ఈ భూవివాదాన్ని పరిష్కరించుకునేలా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఈ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత భూమి యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ వెంచర్కు భూములను హెచ్ఎండీఏ క్లియరెన్స్ల కోసం ఇప్పటికే ఆయన రెండు, మూడు పర్యాయాల్లో సుమారు రూ.28 కోట్ల వరకు వెచ్చించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా రాంరెడ్డి క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ వెంచర్తోపాటు, పటాన్చెరు ప్రాంతంలో మరికొన్ని వెంచర్లు అభివృద్ధి చేశారు. రాంరెడ్డి దగ్గరి బంధువుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ వెంచర్లో పెట్టుబడులు పెట్టి వివాదంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రమేయంపైనా ప్రచారం! ఈ కేసులో రాంరెడ్డికి ఉన్న ఆర్థిక ఇతర ఇబ్బందులు ఒక అంశమైతే.. పటాన్చెరుకు చెందిన ప్రజాప్రతినిధుల వేధింపులు కూడా మరో కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్కు సంబంధించి స్థానిక కీలక ప్రజాప్రతినిధులు వాటాలు, పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ భూముల జోన్ మార్పిడి వ్యవహరంలోనూ ఈ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అధికారులకు సిఫార్సులు చేసినట్లు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్ భూవివాదంలో పోలీసు అధికారి పాత్ర కూడా తెరపైకి వస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఓ పోలీసు అధికారి ఈ భూవివాదాల్లో కలగజేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు పోలీసు అధికారి సెటిల్మెంట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో కలకలం రేగిన రియల్ వ్యాపారి రాంరెడ్డి ఆత్మహత్య పటాన్చెరు సమీప వెంచర్ భూవివాదాలే కారణం! పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో కీలక అంశాలు -
నానో ఎరువుల వాడకంపై అవగాహన
సిద్దిపేటఅర్బన్: నానో ఎరువుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల మధిర భట్టి రామన్నపల్లి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటీఎంఏ) సిద్దిపేట ఆధ్వర్యంలో వరి పంటలో నానో ఎరువుల వాడకంపై బుధవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. అలాగే పత్తి పంటలోఅంతర పంటగా కంది సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త పల్లవితో కలిసి మండల వ్యవసాయ అధికారి శ్రీనాథ్ రైతులకు నానో యూరియా, నానో డీఏపీ, లింగాకర్షణ బుట్టలు, వేప నూనెలను అందజేశారు. వీటి వాడకం, ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తోర్నాల శాస్త్రవేతలు, సర్పంచ్ వెంకటయ్య , ఉప సర్పంచ్ సృజన, సంపత్ , ఏఈఓ మీరా, వార్డు మెంబర్ గోపి, రైతులు పాల్గొన్నారు. -
18 గంటలు విద్యుత్ ఇవ్వాలి
● భారతీయ కిసాన్ సంఘ్ ● విద్యుత్ శాఖ ఎస్ఈకి వినతి పత్రం అందజేత ప్రశాంత్నగర్(సిద్దిపేట): రైతులకు 18 గంటల పాటు నిరంతర విద్యుత్ను అందించాలని, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి, జిల్లా అఽధ్యక్షుడు జశ్వంత్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి జిల్లా విద్యుత్ భవన్ వరకు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ర్యాలీ నిర్వహించి, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం 10 గంటలు మాత్రమే విద్యుత్ ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటను కాపాడాలంటే సరఫరాను వెంటనే పెంచాలని కోరారు. సిద్దిపేట చుట్టుపక్కల కాల్వలు ఉన్నప్పటికీ చెరువుల్లోకి సాగునీరు రాకపోవడం దురదృష్టకరమని, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉన్న నీటి వనరులతో చెరువులు, కుంటలను నింపేలా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పలు గ్రామాల్లో ఐదు నుంచి ఆరు గంటలు సక్రమంగా విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. రైతులు ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టారని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని బస్తీ దవాఖాన, ఫైలేరియా యూనిట్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెంటర్కు వచ్చే వారి నుంచి సేకరించిన రక్త నమునాలను ఎప్పటికప్పుడు సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్కు పంపించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల పనితీరు మెరుగుపర్చుకోవాలని, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత కేసులను స్క్రీనింగ్ చేసి, వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల గంజాయి పట్టివేత
ముగ్గురు అరెస్ట్ పటాన్చెరు టౌన్: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పటాన్చెరు ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ సీఐ శ్రవణ్ కుమార్ వివరాల ప్రకారం.. పటాన్చెరు ఎకై ్సజ్ పోలీస్ బృందం అమీన్పూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడి వద్ద గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్గా గుర్తించారు. అతడి వద్ద నుంచి 1.76 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు షేక్ ఫయాజుద్దీన్, స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు. ఇస్నాపూర్లో 2.8 కిలోలు.. గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇస్నాపూర్లోని మహేశ్వర కాలేజీకి వెళ్లే రోడ్డులో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి సరఫరా చేస్తున్న సంగారెడ్డి మామిడిపల్లికి చెందిన గణపతి, సదాశివపేట గొల్లగూడెంకు చెందిన మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.8 కిలోల గంజాయి, బుల్లెట్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. -
బాలల కథల పుస్తకం ఆవిష్కరణ
సిద్దిపేటఅర్బన్: బాలల లోకంలో విహరించిన కథలు ఎల్లకాలం నిలుస్తాయని కథాశిల్పి ఐత చంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రచించిన కథల పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు రచించిన కథలను ముద్రించడం గొప్ప విషయమని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేశ్, ప్రధానోపాధ్యాయుడు నాగేందర్రెడ్డి, కవులు ఉండ్రాళ్ల రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, ఎన్నవెళ్లి రాజమౌళి, పెందోట వెంకటేశ్వర్లు, భైతి దుర్గయ్య, ఎడ్ల లక్ష్మి, మాధవీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఒక్క క్షణం.. ప్లీజ్
ఆత్మహత్యలు వద్దు.. ఆలోచించండిసంగారెడ్డి క్రైమ్: చదువు భారమని.. ఉద్యోగం రాలేదని.. ప్రేమ విఫలమైందని కొందరు, అప్పులు తీర్చలేక.. భర్త అనుమానించాడని భార్య.. తల్లిదండ్రులు మందలించారని పిల్లలు.. లవ్ ఫెయిల్ తదితర కారణాలతో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కన్నవారికి, తమ కుటుంబానికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో ఒకచోట ఆత్మహత్యకు పాల్పడుతూనే ఉన్నారు. జీవితం చాలా విలువైనది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా అరికట్టవచ్చు వైద్యనిపుణుల విశ్లేషణ ప్రకారం... ఆత్మహత్యకు పాల్పడాలనుకునేవారు ఒంటరిగా ఉంటారు. వెంటనే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వొచ్చు. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. మహిళల కోసం 181కు కాల్ చేస్తే సఖి కేంద్రం సిబ్బంది ఇంటికొచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. పిల్లలకై తే 1098కి సమాచారం ఇవ్వాలి.పరిష్కార మార్గాలు తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చర్చిస్తే పరిష్కార మార్గాలు లభిస్తాయి. కానీ అవేమీ ఆలోచించకుండా చాలామంది చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో వారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. వారిపై ఆధారపడ్డ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు. ఎవరైనా తాను బతకనని, కుటుంబానికి బరువయ్యానని చెబితే తేలికగా తీసుకోవద్దు. నేను లేని ఇంటిని, జీవితాన్ని ఊహించుకోండి అంటూ చాలా మంది మానసిక వేదన వెలిబుచ్చుతారు. వారిని మార్చే దిశగా ప్రయత్నం చేయకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాయామం అలవాటు చేయడం ద్వారా కొంత మార్పు ఉంటుంది. కొన్ని ఘటనలు.. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో యువతి ఆగస్టు 23న ఆత్మహత్య చేసుకుంది. మనోవేదనతో క్షణికావేశంలో మత్తు ఇంజక్షన్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పుల్కల్ మండలానికి చెందిన యువకుడు కడుపు నొప్పి తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. -
శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడి
జహీరాబాద్లో రైతు సదస్సు జహీరాబాద్ టౌన్ : గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా డీడీఎస్ కేవీకే ఆధ్వర్యంలో శ్రీరైతు సదస్సుశ్రీ నిర్వహించారు. మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు, శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు శాసీ్త్రయ పద్ధతులు, నాణ్యమైన సాంకేతికతను జోడించి పంట దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మల్లారెడ్డి వ్యవసాయ పాఠశాల డీన్ డాక్టర్ రాజారెడ్డి, ఫ్యాకల్టీ సభ్యులు, బసంత్పూర్ శాస్త్రవేత్త శ్రీమతి జి.విజయలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు నేల ఆరోగ్యం, సమగ్ర పోషక యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణ, నీటి సంరక్షణపై సూచనలు చేశారు. నారింజ రైతు మిత్ర ప్రతినిధులు పాల్గొని, రైతులు సమష్టిగా పంటలను మార్కెటింగ్ చేస్తూ మెరుగైన మద్దతు ధర పొందే మార్గాలను వివరించారు. -
కొండపాక.. ఆధ్యాత్మికతకు నిలయం
అష్టాదశ శక్తి పీఠం దేవాలయ చైర్మన్ కొండపాక(గజ్వేల్): ఆధ్యాత్మికత, సేవా దృక్పథానికి కొండపాక ప్రాంతం భవిష్యత్తులో నిలయంగా మారనుందని అష్టాదశ శక్తి పీఠం దేవాలయ చైర్మన్, ప్రభుత్వ మాజీ సలహాదారు కే.వీ రమణాచారి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మహిమాన్వితమైన దేవతామూర్తుల దర్శనం ఒకే చోట లభించేలా ఉమా రామలింగేశ్వర సహిత అష్టాదశ శక్తి పీఠం దేవాలయాన్ని నిర్మించామన్నారు. బుధవారం దేవాలయ ఆవరణలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అష్టాదశ శక్తి పీఠం దేవాలయం దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆనంద నిలయం చైర్పర్సన్ లత, వికలాంగుల సేవా సంస్థ చైర్మన్ వంశీ రాధాకృష్ణ, కొండలరావు, ట్రస్టు చైర్మన్ నాగరాజు, రిటైర్టు డిప్యూటీ డీఈఓ వైకుంఠం, సర్పంచ్ నవీన పాల్గొన్నారు. -
వాహనదారులకు తీపి కబురు
● బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ● ఎంపీ రఘునందన్రావుకు కృతజ్ఞతలు తూప్రాన్ /శివ్వంపేట: తూప్రాన్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. ఈ రైల్వే గేట్ వద్ద నిత్యం వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను, అలాగే అక్కన్నపేట రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్కు స్టాపేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై వివరిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్రావు రైల్వే జనరల్ మేనేజర్ను బుధవారం కలిసి సమగ్ర నివేదిక సమర్పించారు. ఎంపీ అభ్యర్థనపై స్పందించిన రైల్వే జీఎం 10 రోజుల్లోనే డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి, మంజూరు ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే తూప్రాన్–నర్సాపూర్ రహదారిపై ప్రయాణించే వాహనదారుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతో ఎంపీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు జానకిరామ్గౌడ్, ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సిద్దిపేట వాసికి డాక్టరేట్ సిద్దిపేటజోన్: సిద్దిపేటకు చెందిన డాక్టర్ బలరాంకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరులను మైక్రో గ్రిడ్ పవర్ సిస్టంలో సమర్థవంతంగా అనుసంధానం చేయడం, హార్మోనిక్స్ తగ్గించడం, విద్యుత్ వ్యవస్థలో సమతుల్యత మార్పిడి తదితర అంశాలపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. రాష్ట్ర గవర్నర్ శుక్లా ఆయనకు డాక్టరేట్ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బలరాం ను అభినందించారు. బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి మిరుదొడ్డి(దుబ్బాక): బీడీ కార్మికులకు ప్రభుత్వం వెంటనే రూ. 4,016 జీవన భృతి చెల్లించాలని సీఐటీయూ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దెల అంజయ్య కోరారు. బుధవారం మిరుదొడ్డి ఎంపీడీఓ వినోద్ కుమార్, ఇన్చార్జి ఎంపీఓ ఫహీంకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమల్లో పని రోజులు తగ్గిపోవడంతో పాటు, పెరిగిపోతున్న నిత్యావసర ధరల కారణంగా కార్మికుల కుటుంబాలు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవన భృతిని అమలు చేయాలని కోరారు. కేసీఆర్పై వ్యాఖ్యలకు నిరసనగా.. సమావేశం బైకాట్ సిద్దిపేటరూరల్: మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల సర్పంచ్లు సమావేశంను బైకాట్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం మండల ప్రత్యేకాధికారి ప్రియాంక అధ్యక్షతన సాధారణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కాగా 10 గంటలు దాటినా సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో ప్రత్యేకాధికారి ప్రియాంక, మండల స్థాయి అధికారులు సీట్లలో కూర్చొని సుమారు రెండు గంటల పాటు వేచి చూశారు. తీరా సర్పంచ్లు కార్యాలయం వద్దకు వచ్చినా లోపలికి రాలేదు. మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమావేశాన్ని బైకాట్ చేశారు. అనంతరం రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ నవతకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, సర్పంచ్లు పద్మ శ్రీనివాస్, మమతరాజు, తిరుపతి, పద్మాదేవి, బాల్రాజు ఉన్నారు. -
రాజీ మార్గమే రాజమార్గం
మెదక్జోన్: చిన్నపాటి వివాదాలను పెద్దవిగా చేసుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీపడాలని కోరారు. దీంతో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. కాగా రాజీ పడదగిన కేసులను గుర్తించి సంబంధిత కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ పరిష్కారానికి పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది కృషి చేస్తారని తెలిపారు. రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. -
వాహనం ఢీకొని లేగదూడ మృతి
కల్హేర్(నారాయణఖేడ్): గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం నిజాంపేట్ మండలం బాచేపల్లి వద్ద 161 నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బద్దరం నాగయ్య పశువులను రోడ్డు దాటిస్తున్న క్రమంలో వాహనం ఢీకొని లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని బాధిత రైతు అధికారులను కోరారు. ఇద్దరు అదృశ్యం పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన భానూర్ పోలీస్స్టేషన్న్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన సువర్ణ(51), భర్త లక్ష్మినారాయణతో మంగళవారం రాత్రి గొడవ పడింది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. బీటెక్ విద్యార్థి.. వర్గల్(గజ్వేల్): బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని గుంటిపల్లిలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్సై ఆరోగ్యం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మ సందీప్(17) గౌరారం సమీప యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. రోజు మాదిరిగా మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. బుధవారం తండ్రి కనకయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి కల్హేర్(నారాయణఖేడ్): పంట చుట్టూ కరెంట్ తీగలతో కంచె ఏర్పాటు చేసేందుకు వెళ్లిన యువకుడు షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకులు, తండావాసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్ తండాకు చెందిన మలోత్ జైపాల్(32) తోటి స్నేహితుడికి సంబంధించిన వరి పొలం వద్ద అడవి పందులు రాకుండా కరెంట్ తీగలు పెట్టేందుకు కలిసి వెళ్లాడు. పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసేందుకు స్నేహితుడికి సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా జరగడంతో జైపాల్ తీవ్రంగా గాయపడి పంట పొలంలోనే మరణించాడు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పిడిచెడ్ గ్రామానికి చెందిన గద్ద గంగయ్య(45) తుర్కపల్లిలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా బుధవారం విధులకు వెళ్లాడు. సమీప బంధువు చనిపోవడంతో భార్య ఊరికి వెళ్లాలని గంగయ్యకు ఫోన్ చేయడంతో అతడు బయలుదేరాడు. కాగా తుర్కపల్లిలో లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యలో ప్రజ్ఞాపూర్ శివారు పాతూరు ప్లైఓవర్ బ్రిడ్జీ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి, వెనుక కూర్చున్న గంగయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా గంగయ్య మార్గమధ్యలో మృతి చెందాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టిప్పర్ ఢీకొట్టడంతో వ్యక్తి.. పటాన్చెరు టౌన్: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్కు చెందిన రాజు(33) తన స్నేహితుడు సాయి కిరణ్తో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. సాయి కిరణ్ వాహనం నడుపుతుండగా రాజు వెనుక కూర్చున్నాడు. సంగారెడ్డి నుంచి పటాన్చెరు వైపు వస్తున్న టిప్పర్ వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. వెనుక కూర్చున్న రాజు రహదారిపై పడిపోవడంతో అతనిపై నుంచి టిప్పర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో అతడికి కాళ్లకు, తలకు గాయాలయ్యాయి. పటాన్చెరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
రోడ్ల విస్తరణకు శ్రీకారం
గడువు కోరిన వ్యాపారులుజహీరాబాద్ టౌన్: పట్టణంలో రోడ్ల విస్తరణ పనులకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రహదారులను 40 అడుగుల వెడల్పుతో విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో దుకాణాల ఎదుట భాగంలోని మెట్లను తొలగిస్తూ కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే, జేసీబీలతో నేరుగా కట్టడాలు తొలగిస్తే భవనాలు తీవ్రంగా దెబ్బతింటాయని భావించిన వ్యాపారులు.. తామే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకుంటామని అధికారులకు విన్నవించారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి, ఈనెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ తేదీలోగా మార్కింగ్ వరకు ఉన్న కట్టడాలను స్వయంగా తొలగించుకోవాలన్నారు. లేనిపక్షంలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. కాగా, రోడ్ల విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
● ఎల్సీ రిటర్న్ ఇవ్వకముందే ఆన్ ● ప్రాణాలతో బయటపడిన రైతు పాపన్నపేట(మెదక్): విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ నిర్వాకంతో మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ రైతు.. సమయస్ఫూర్తితో వ్యవహరించి త్రుటిలో ప్రాణపాయం నుంచి బయపడిన సంఘటన మండలంలోని రుగ్యా తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్యాతండా పరిధిలోని రుగ్యా తండాలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద బోర్ మోటార్కు వెళ్లే వైరు తెగిపోయింది. దీంతో సంబంధిత గిరిజన రైతు రవి నార్సింగి లైన్మెన్ బాబుకు ఫోన్ చేసి ఎల్సీ అడిగాడు. వెంటనే ఎల్సీ ఇచ్చిన బాబు, పని చేసుకోమని పురమాయించాడు. వెంటనే ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కిన రవి, రెండు నట్లు విప్పి, మూడో నట్టు విప్పుతుండగా కరెంట్ వచ్చింది. అయితే ఆ సమయంలో నట్టు పూర్తిగా ముట్టుకోకపోవడంతో కొంచెం హమ్మింగ్ వచ్చింది. కాళ్లకు చెప్పులు ఉండటంతో పాటు కరెంట్ పనులపై కొంచెం అవగాహన ఉండటంతో కింద ఉన్న వారికి విషయం తెలిపాడు. వెంటనే రైతులు లైన్మెన్కు విషయం తెలపడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేయించాడు. దీంతో తృటిలో రవి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే విషయమై డీఈ రామేశ్వర్స్వామి వివరణ కోరగా.. సాధారణంగా ఒకేసారి రెండు ఫీడర్లకు ఎల్సీ ఇవ్వొద్దు, కానీ విద్యుత్ సిబ్బంది పొరపాటున ఇచ్చారని తెలిపారు. అవగాహన లోపంతో బాచారం ఫీడర్ రిటర్న్ ఇవ్వాల్సి ఉండగా, నార్సింగి ఫీడర్ ఇచ్చాడన్నారు. అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఏసీబీ వలలో విద్యాశాఖ అధికారి
రూ. 20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఐఈఓ గోవిందరాంసంగారెడ్డి ఎడ్యుకేషన్: ఏసీబీ వలకు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవిందరాం చిక్కారు. ఓ ప్రైవేట్ కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు సదరు యాజమాన్యం నుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. జిల్లా విద్యాధికారి గోవిందరాం గత కొన్ని రోజుల క్రితం పట్టణంలోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో కళాశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు చిన్ని చిన్న లోటుపాట్లను గుర్తించారు. దీంతో కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర విద్యాశాఖకు కళాశాలపై నెగిటివ్ రిపోర్టు ఇస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో కళాశాల నిర్వాహకులు ఒప్పందం ప్రకారం ముందుగా రూ. 30 వేలు ఇచ్చారు. మిగితా రూ. 20 వేల కోసం రోజు ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు ఈనెల 7న ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం కలెక్టరేట్లోని ఇంటర్మీడియెట్ కార్యాలయంలో కళాశాల యాజమాన్యం నుంచి రూ. 20 వేలు తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, జిల్లా గోవిందరాంపై విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. బీరంగూడతో పాటు సంగారెడ్డి పట్టణంలోని రెండు కళాశాలలు అనుమతి లేకున్నా, కొనసాగుతున్నాయని విద్యార్థి సంఘాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
కాళోజీ సేవలు చిరస్మరణీయం
సంగారెడ్డి జోన్: కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో వేర్వేరుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి అక్షర యోధుడిగా కాళోజీ నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయకులనే పూజించాలి పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిర్వాహకులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అసైన్డ్’లో అక్రమ నిర్మాణాలు
● అనుమతులు లేకున్నా అడిగేవారు కరువు ● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేకుల షెడ్లు హత్నూర(సంగారెడ్డి): అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికారుల అనుమతి లేకున్నా బడాబాబులు ఇష్టారాజ్యంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో సర్వే నంబర్ 98, 242లో అసైనన్డ్ భూములను ప్రభుత్వం పేదలకు కేటాయించింది. ఆ భూములను రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. పక్క నే ఆనుకొని ఉన్న తురకల ఖానాపూర్ శివారులోని అసైనన్డ్ భూములు సైతం లీజు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారు. ఇంకేముంది ఇష్టానుసారంగా రేకుల షెడ్లు నిర్మించారు. వాటిని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బడా నాయకుల బరితెగింపు అనుమతుల్లేని నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో బడా నాయకులు బరితెగించి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పంటల సాగు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినా, ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చర్ల– తురకల ఖానాపూర్ శివారులోని మల్కాపూర్– పటాన్చెరు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని కబ్జా చేసి రేకుల షెడ్ల నిర్మాణాలు చేపట్టి వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో బడాబాబులు అనుమతులు లేకున్నా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నా రు. మండల అధికారులు ఎలాగూ స్పందించడం లేదని, కనీసం కలెక్టర్ అయినా అసైన్డ్ భూములను కాపాడాలని కోరుతున్నారు. -
రూ.21కోట్లతో తెల్లాపూర్ అండర్బ్రిడ్జి
ఎంపీ రఘునందన్రావురామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించినట్లు మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ను కలిసి రైల్వే సమస్యలపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెల్లాపూర్ – విద్యుత్నగర్ మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వెడల్పు కోసం రూ.21 కోట్లు మంజూ రయ్యాయని తెలిపారు. దీనిపై శనివారం సాయిబాబా ఆలయం వద్ద రైల్వే, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెల్లాపూర్ రైల్వే స్టేషన్ను రేడియల్ రోడ్డుకు అనుసంధానించేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మంజూరైందని చెప్పారు. ఇందులో భాగంగానే త్వరలో ఆ పనులకు భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, బీజీపీ రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్, తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, నాయకులు సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై పాముల కలకలం
కల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట్ మండల కేంద్రం సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పాములు కలకలం రేపాయి. వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రహదారిపైకి కొండచిలువ, ఇతర పాములు వస్తున్నాయని వాహనదారులు తెలిపారు. సంగారెడ్డి టౌన్: పట్టణంలోని బాల సదన్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే పిల్లల సంరక్షణ, భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం అక్కడి పిల్లలతో ముచ్చటించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. బాల సదన్లో అందుతున్న భోజనం, తాగునీటి సదుపాయాలు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్ఫాం రూ. 40 కోట్లతో నిర్మాణం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్లో రూ. 40 కోట్లతో అదనపు ప్లాట్ ఫాం నిర్మించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధి కారి పద్మజ వెల్లడించారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అఽధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో రెండు రైళ్లను పెంచాలని వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులు పూర్తయితే టెంపుల్ కారిడార్ ఏర్పాటు అవుతుందన్నారు. 24 గంటలూ భక్తులకు రైల్వే సిబ్బంది స్టేషన్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. మల్బరీ సాగుతో సిరులు రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ జేడీ లత తొగుట(దుబ్బాక): మల్బరీ సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మండలంలోని పెద్దమాసాన్పల్లి రైతు వేదికలో ‘నాపట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడారు. పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మల్బరీ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎల్ని నో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేనందన రైతులు సాగుకు ముందురావాలన్నారు. మిగితా పంటల మాదిరిగా పంట పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసే దిశగా రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు మల్లికార్జున్, రాఘవేంద్ర మల్బరీ సాగుపై రైతులకు ఆవగాహన కల్పించారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
నర్సాపూర్ రూరల్: మండలంలోని చిన్న చింతకుంటలో ప్రకృతి వ్యవసాయ సాగు కోసం ఎంపికై న 40 మంది రైతులకు బుధవారం తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి (సేంద్రియ) ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం కోల్పోవడంతో పాటు పంటలు దిగుబడి పూర్తిగా తగ్గుతుందన్నారు. దీంతో పాటు రసాయన ఎరువులతో పండించిన ధాన్యం, పప్పు దినుసులు ఇతర ఆహార పదార్థాలతో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. మనుషుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకొని పంటలు సాగు చేయాలని వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికై న రైతులకు వేప నూనె, హ్యూమిక్ ఆమ్లం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత, రైతులు మహేశ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను దూషించిన యువకుడిపై కేసు
కొల్చారం(నర్సాపూర్): సామాజిక మాధ్యమంలో సీఎంను దూషించిన యువకుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం.. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఎంజాల శ్రీనివాస్ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన పదజాలంతో దూషించాడు. పైగా సెల్ఫోన్లో చిత్రీకరించి తన వాట్సప్ స్టేటస్లో, ఇతరులకు షేర్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గొండ కష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చేగుంట(తూప్రాన్): జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పులిమామిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రె దుర్గయ్య(70) భార్య సత్తమ్మ మూడేళ్ల క్రితం మృతి చెందింది. ఈ విషయంలో దుర్గయ్య మనస్తాపానికి గురై నిత్యం తన భార్యను గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద దుర్గయ్య చెట్టుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ బిక్యానాయక్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రాహుల్ను ప్రధానిగా చేసుకుందాం
డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డిసంగారెడ్డి: రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే ఏకై క లక్ష్యంగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన సంఘటన్ సజన్ కార్యక్రమంలో ఆమె పాల్గొ మాట్లాడా రు. స్వాతంత్య్రం రాకముందునుంచి దేశ ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు నిచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ లింగం నాయక్ మాట్లాడుతూ... ఆదివాసీలు, యానాదులు, చెంచులు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ గిరిజనుడికి గుర్తింపునిచ్చేందుకు సంఘటన్ సజన్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా కమిటీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, జిల్లా అధ్యక్షుడు రామ్చందర్ నాయక్, ఇన్చార్జ్ కిషన్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తాతా మధుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
● మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి ● అదనపు డీసీపీకి ఫిర్యాదు పటాన్చెరు టౌన్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అదనపు డీసీపీ ఉదయ్కుమార్, సీఐ రవీందర్కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని, ఆయనపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ పదవిని అవమానించడంతోపాటు ఎస్సీ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్లు వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయని, వాటిని పరిశీలించి విచారణ చేపట్టాలని కోరారు. -
విధుల్లోనే కుప్పకూలి..
తుప్రాన్: విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అల్లాపూర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విధులకు మెదక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ డి.ఆనంద్ (52) హాజరయ్యారు. విధుల్లో ఉండగానే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి పోలీసు సిబ్బంది ఆయనను మేడ్చెల్ జిల్లాలోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆనంద్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా హెడ్ కానిస్టేబుల్ మరణ వార్త తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆనంద్ స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా, మల్కాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. గుండెపోటుతో ఏఆర్ హెడ్కానిస్టేబుల్ మృతి -
టోల్ ప్లాజా వద్ద తనిఖీలు
కొండపాక(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రేరేపించడాన్ని నిరసిస్తూ ఎర్రవల్లిలో ఫాంహౌజ్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా వెళ్తారని, వీరిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్తారన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు మంగళవారం పోలీసులు కొండపాక , కుకునూరుపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు కాకుండా బయట ఉన్న నాయకులు ఫాంహౌజ్ వద్దకు వెళ్లకుండా దుద్దెడ శివారులోని రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అయినా బీఆర్ఎస్ నాయకులు ఫాంహౌజ్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. టోల్ ప్లాజా వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. -
భాషకు ప్రాణాధారం యాస
● ఉద్యమంలో కీలకంగా మారిన యాస ● నేడు తెలంగాణ మాండలిక (భాషా) దినోత్సవం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఏ భాష సాహిత్యాలైనా ఆ ప్రాంత జీవన స్థితిగతులను, చారిత్రక నేపథ్యాన్ని, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రజల మనోభావాలను ప్రతిబింబించే అమూల్య సాధనాలు. ఈ క్రమంలో తెలుగు నేల ప్రాశస్త్యాన్ని, తెలుగు ప్రజల జీవన వైవిధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సాహిత్యానికే దక్కుతుంది. రచనకు ప్రాణాధారం భాష అయితే, భాషకు ప్రాణాధారం యాస. ప్రజల నిత్య వ్యవహారం లోంచి పుట్టిన పలుకు సాహిత్యంలో ప్రతిధ్వనించినప్పుడే అది ప్రజల హృదయాలను తాకుతుంది. భాష ఎంత సహజంగా, జనజీవనానికి ఎంత దగ్గరగా ఉంటే ఆ సాహిత్యం అంతగా దేదీప్యమానమవుతుంది. అలాంటి తెలంగాణ ప్రజల పలుకుకు, పల్లె భాషకు, ప్రాంతీయ యాసకు పట్టం గట్టిన తొలి వైతాళికుడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ మట్టి వాసనను, మనిషి మనసు తడిని, పల్లె పలుకుబడిని తన కలానికి అద్దిన ప్రజాకవి. సెప్టెంబర్ 9న ప్రజాకవి కాళోజీ జయంతిని, తెలంగాణ మాండలిక (తెలంగాణ భాషా) దినోత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రజాకార్ల సమయంలో, ప్రజల ఆవేదనకు అద్దం, ఆత్మగౌరవానికి ఆయుధం, సామాజిక చైతన్యానికి శంఖారావంగా మన యాస నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాటల్లో, చేతల్లో, రాతల్లో, ఆలోచనల్లో, ఆవేదనలో, ఆహార్యంలో తెలంగాణ స్వరూప స్వభావాలను సంపూర్ణంగా దర్శింపజేసిన జిల్లా కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కవులు తమ కవితలు, రచనల ద్వారా ఉద్యమానికి మరింత వన్నె తెచ్చారు. దీంతో ఉద్యమం పూర్తిగా కింది స్థాయికి వెళ్లి, ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. నేటికి యువ కవులు, రచయితలు రచనలు, కవితలను తెలంగాణ యాసలోనే వెలువరిస్తున్నారు. తెలంగాణ భాషా సంస్కృతికి ప్రతీక కాళోజీ. తెలంగాణ ఉద్యమ సమయంలో యాస కీలకపాత్ర పోషించింది. తెలంగాణ యాస ఒక భాషా రూపం కాదు. అది ప్రజల జీవన స్వరం. తెలంగాణ యాస సాహిత్యంలో గౌరవాన్ని పొంది, పల్లె పలుకును పండితుల పీఠంపై కూర్చోబెట్టింది. –డాక్టర్ బామండ్ల రాజు, తెలుగు అధ్యాపకులు మన అమ్మ భాష, మాట్లాడే భాష మనకు ప్రత్యేకం. తెలంగాణ యాసకు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారు 10కోట్ల మంది ఉన్నా.. వారు మాట్లాడే యాసను గుర్తించి తెలంగాణ వారిని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. –అమ్మన చంద్రారెడ్డి, సిద్దిపేట రచయితల సంఘం అధ్యక్షుడు -
మిగిలింది నియామకమే!
నివేదించారు..జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు దీపక్రాథోడ్ ఆ పార్టీ అధినాయకత్వానికి నివేదిక సమర్పించారు. జిల్లాలో క్షేత్రస్థాయిలోని క్యాడర్ అభిప్రాయం, ద్వితీయశ్రేణి నాయకుల మనోభావాలు, జిల్లా అగ్రనేతల సూచనలను తీసుకున్న దీపక్రాథోడ్ ఈ మేరకు రెండు రోజుల క్రితం నివేదికను ఆ పార్టీ అధినాయకత్వానికి అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అధిష్టానం ఈ పదవిని ఎవరికి ఫైనల్ చేస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈ పదవి ఆశిస్తున్న నాయకులు అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని వేచి చూస్తున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైన అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రధానంగా జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు తమ అనుచరులకు ఈ పదవిని ఇప్పించుకునేందు కు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఐదు నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షుల ని యామకం జరిగి ఏడాదిన్నర దాటినప్పటికీ సంగారెడ్డి డీసీసీ నియామకం మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. సంగారెడ్డితోపాటు, రంగారెడ్డి, రామగుండం సిటీ డీసీసీలు పెండింగ్లో ఉండిపోయాయి. డీసీసీపై అధిష్టానానికి నివేదిక! -
నల్లవాగు ఆయకట్టుకు నీరందించాలి
మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డిడిమాండ్ కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు చివరి ఆయకట్టు కింద ఎండుతున్న పంటలు కాపాడేందుకు సాగు నీరు అందించేంతవరకు పోరాటం చేస్తామని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని ఖానాపూర్(కె)లో భూపాల్రెడ్డిను కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు. నీటి సరఫరా చేయాలని కలెక్టరేట్కు బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు. వర్షాలతో నల్లవాగు ప్రాజెక్టు నిండినా ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. నల్లవాగు కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండటంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంలేదని తెలిపారు. ప్రజల తరఫున మాట్లాడితే గొంతు నొక్కేందుకు నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామ్సింగ్, నాయకులు ఉప్పరి మోహన్ పాల్గొన్నారు. -
దాడి కేసులో ఇద్దరి అరెస్ట్
ఆయుధాలు, బైక్ స్వాధీనం జహీరాబాద్ టౌన్ : కత్తితో దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం జహీరాబాద్ రూరల్ ఎస్సై రాజేందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న దిడ్గి గ్రామానికి చెందిన సయ్యద్ అస్లాం(33), జుబేర్ అదే గ్రామానికి చెందిన నీరటి రాజుతో గొడవపడ్డారు. అడ్డుకోబోయిన నీరటి ప్రశాంత్, నీరటి యశ్వంత్ను బెదిరిస్తూ అస్లాం కత్తితో, జుబేర్ ఇనుప రాడ్తో వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి అల్గోల్ చౌరస్తాలో మెహఫిల్ హోటల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, ఇనుప రాడ్, పల్సర్ బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిరాకుపల్లి ఎస్సై వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
బంతిపూల సాగు..
ఆరుతడి కింద సేద్యం చేస్తున్న రైతులు కొల్చారం(నర్సాపూర్): ఒకే రకమైన నీటి ఆధారిత పంటలు సాగు చేసి నష్టపోకుండా ఉండేందుకు, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్న అధికారుల సూచనల మేరకు రైతులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సంగాయిపేట గ్రామ శివారులో గ్రామానికి చెందిన తుంగని సత్తయ్య బోరు బావిలో పుష్కలంగా నీరున్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి ఆధారిత పంట వరి సాగు చేస్తున్నాడు. కాగా నష్టపోవద్దన్న అధికారుల సూచనలతో ఆరుతడి కింద బంతితోటను సాగు చేస్తున్నాడు. ఎకరంలో బంతి సాగు చేస్తూ నీటిని పొదుపుగా వాడుతున్నాడు. తద్వారా ఒక పంట దెబ్బతిన్న మరో పంట ఆదుకుంటుందని ఆ రైతు భిప్రాయపడ్డాడు. మొదటి బోరు కింద వరి పంట సాగు చేశాను. ఎకరం పొలం ఊరికే వదిలేశాను. వరికి నీరు ప్రస్తుతం పుష్కలంగా అందిస్తుంది. ఊరికే వదిలేసిన ఎకరంలో ఆరుతడి పంట కింద బంతి సాగు చేసా. పంటకు నీటి వినియోగం కూడా తక్కువే. వచ్చేది పండుగల సీజన్, బంతి సాగు ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది. – తుంగని సత్తయ్య, రైతు, సంగాయిపేట. -
మహిళలపై పోలీసుల తీరు సరికాదు
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జోగిపేట(అందోల్): అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం, పోలీసుల తీరుకుని నిరసనగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం మహిళ ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరును ఆయన పూర్తిగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి.జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్లో చైర్మన్లు నారాయణ, డీబీ నాగభూషణం, మాజీ ఎంపీపీ బాలయ్య పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అందోల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విద్యార్థినులకు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మద్దతు పలికారు. -
బస్తీ దవాఖానాలకు సుస్తీ!
● అంతంత మాత్రంగానే వైద్య సేవలు ● సమస్యల నిలయాలుగా ఆరోగ్య కేంద్రాలు ● వేధిస్తున్న సిబ్బంది కొరత జహీరాబాద్ టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువనున్న హమాలీ కాలనీ, గడీ తదితర ప్రాంతాల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్నాయి. పాలకుల శ్రద్ధ లోపించడం, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవటంతో ఆయా దవాఖానాల్లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉండగా..సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ బస్తీ దవాఖానాలో వైద్యుడితోపాటు నర్సు, అటెండర్, స్వీపర్ అందుబాటులో ఉండాలి. కానీ, ఇక్కడ కేవలం వైద్యుడు, నర్సు మాత్రమే పనిచేస్తుండటంతో పారిశుద్ధ్యం సహా ఇతర పనుల నిర్వహణ పడకేసింది. సరైన మోతాదులో మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల అపరిశుభ్రత..పశువులు, కుక్కల స్వైరవిహారం, దవాఖానాల చుట్టూ మురుగునీరు చేరి ఈగలు, దోమలకు నిలయంగా మారాయి. దీంతో ఆస్పత్రికి రావాలంటేనే బాధితులు జంకుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్తీ దవాఖానాలలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి, సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
జీపీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి
న్యాల్కల్(జహీరాబాద్): నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్) గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం గ్రామ పంచాయతీ నిధులను డ్రా చేయాలంటే సర్పంచ్తోపాటు ఉప సర్పంచ్ సంతకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గ్రామ సర్పంచ్గా ఎన్నికై న అక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అధికారులు ఉప సర్పంచ్గా ఉన్న శ్రీకాంత్రెడ్డికి సర్పంచ్ బాధ్యతలను అప్పగించారు. గ్రామ పంచాయతీ నిధుల డ్రాకు సంబంధించి మరో సభ్యుని సంతకం అవసరం కాగా పాలక వర్గం సభ్యులు వార్డు సభ్యుడు జగన్ను ఎన్నుకున్నారు. కానీ పంచాయతీ కార్యదర్శి సంపత్కుమార్ మాత్రం గత ఆరు నెలలుగా తమ సంతకం లేకుండానే ఆయన సంతకం పెట్టి నిధులు డ్రా చేస్తున్నారని వార్డు సభ్యులు జగన్ తదితరులు ఆరోపించారు. టీఎస్ బీపాస్ అకౌంట్ నుంచి తమకు తెలియకుండానే నిధులు డ్రా చేస్తున్న ఈ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు డీపీఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
భద్రత ప్రమాణాలే ముఖ్యం
జిన్నారం (పటాన్చెరు): పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం బొల్లారం పారిశ్రామికవాడలోని సీఐ సుధీర్కుమార్ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవాడలో భద్రత ప్రమాణాల విషయంలో పరిశ్రమల సహకారం అందించాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు వాటి పర్యవేక్షణకు యాజమాన్యాలు బాధ్యత వహించాలన్నారు. అలాగే పరిశ్రమల్లో విధులు నిర్వహించే కార్మికుల వ్యక్తిగత వివరాలు సేకరణకు సంబంధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి రాయుడు, ఇతర పరిశ్రమల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్ -
‘సర్’ నోటీసులపై గుబులు
ఇంకా పూర్తికాని పంపిణీ ప్రక్రియ ● బూత్ల వారీగా ఓటర్ల వివరాలు సేకరణ ● అభ్యంతరాల స్వీకరణకు స్పెషల్ డ్రైవ్ ● నోటీసుల జారీలో అధికారుల నిర్లక్ష్యం సంగారెడ్డి జోన్: సమగ్ర ఓటరు జాబితా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం జూన్ 25న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ చేపట్టింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఓటర్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు తిప్పలు తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. 2002 జాబితా ఆధారంగా 2025 జాబితాను అనుసంధానం చేసుకుంటూ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించారు. గత నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలతో గత ఓటరు జాబితాకు తేడాలు ఉండటంతో సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. 4 లక్షల 60 వేల మందికి నోటీసులు జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాకు మ్యాపింగ్ కాని వారితో పాటు ముసాయిదా జాబితాలో ఉన్న వివిధ రకాల తేడాలు, చిన్నపాటి పొరపాట్లు ఉన్న వారందరికీ నోటీసులు అందిస్తున్నారు. ఈ మేరకు 5 నియోజకవర్గాల్లో 4,60,387 మంది ఓటర్లకు నోటీసులు అందించేందుకు జనరేట్ చేశారు. ఇప్పటివరకు 3 లక్షల 12 వేల వరకు నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా లక్షా 48 వేల మందికి నోటీసులు అందించాల్సి ఉంది. అన్ మ్యాపింగ్ అయిన ఓటర్లు, గత ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న వివరాలను పోలుస్తూ స్వల్ప తేడాలు ఉన్న, ఓటరు పేరు మార్పు చెందినా వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. మ్యాపింగ్ పూర్తయినప్పటికీ ఓటరు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లలో తేడాలు ఇతర కారణాలతో నోటీసులు అందాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి తేడాలు ఉన్నా నోటీసులు జనరేట్ చేస్తుంది. నోటీసులు జారీ చేయడంలో పలువురు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం. ఇబ్బందులు పడుతున్న ఓటర్లు.. అర్హులైన ఓటర్లకు వివిధ కారణాలతో నోటీసులు రావటంతో సరిదిద్దుకునేందుకు తమ పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఓటరుగా ఉండేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏవైనా నాలుగు సంబంధిత బీఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. ఎక్కువగా నిరుపేదలతో పాటు నిరక్షరాస్యులు ఉండటంతో ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ వేస్తున్నారు. పత్రాలు లేకపోవడంతో తమ ఓటు గల్లంతవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఈనెల 16 వరకు ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సర్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాల సేకరణకు బూత్ల వారీగా ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నియోజకవర్గం జనరేట్ అయిన జారీ చేసిన పెండింగ్లో నోటీసులు నోటీసులు ఉన్నవినారాయణఖేడ్ 74,960 68,189 6,771 అందోల్ 66,306 50,797 15,509 జహీరాబాద్ 79,539 67,084 12,455 సంగారెడ్డి 75,641 48,829 26,812 పటాన్చెరు 1,63,941 77,112 86,829 -
నిజాయితీతో కూడిన రచనలకే ఆదరణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీతినిజాయితీతో కూడిన రచనలనే ప్రజలు ఆదరిస్తారని సీనియర్ రచయిత, ఉపాధ్యాయ ఉద్యమనేత దారం మల్లారెడ్డి, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి పేర్కొన్నారు. వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన కవిసమ్మేళనంలో, దారం మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూనే లక్ష్యసాధన దిశగా రచనలు సాగాలని సూచించారు. వర్తమాన సమాజం అనేక సంక్షోభాలతో సతమతమవుతున్నదని, దీని వెనకున్న సూత్రధారులు, పాత్రధారులెవరో తేటతెల్లం చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. సహజ వనరులను చెరబట్టేందుకు కార్పోరేట్ శక్తుల పన్నాగాలను తమ రచనల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరి, స్రవంతి మహిపాల్, మహమూద్ పాషా, అశోక్ రాజు, కొమురవెల్లి అంజయ్య, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి, సుధాకర్, తాటికొండ విష్ణుమూర్తి, అందె ప్రవీణ్, రాజయ్య, రమేశ్ లాల్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యమనేత దారం మల్లారెడ్డి -
పాముకాటుతో బాలుడి మృతి
కంగ్టి(నారాయణఖేడ్): పాముకాటుకు గురై బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాంతీర్థం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పార్వతి, నగేశ్ దంపతులు తమ కుమారుడు సూర్య(12)తో కలిసి చేనులో వ్యవసాయం పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు పాము కరిచినట్లు బాలుడు తెలుపడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అక్కడి నుంచి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో బాలుడు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఏకై క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చికిత్స పొందుతూ వివాహిత.. బెజ్జంకి(సిద్దిపేట): చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చీమలకుంటపల్లెకు చెందిన తుమ్మ కొమరయ్య గతంలో ఉపాధి నిమిత్తం బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామానికి వచ్చాడు. అతని పెద్ద కుమార్తె తేజ(27)కు గ్రామంలోని మెండ రాజుతో 2018లో పెళ్లి చేశాడు. ఆ తరువాత కొమరయ్య స్వగ్రామానికి కుటుంబంతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తేజకు తమ కుటుంబాన్ని కలవలేననే బాధ ఉండేది. ఈనెల 4న తేజ ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన బంధువులు వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తేజ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సంగారెడ్డికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు
● 31వ వార్డుకు రూ.10 లక్షల నగదు రివార్డుసంగారెడ్డి: స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో రాష్ట్రస్థాయిలో సంగారెడ్డి మున్సిపాలిటీకి గుర్తింపు లభించడంతోపాటు, 31వ వార్డుకు రూ.10 లక్షల రివార్డు లభించింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ జగ్గరి సతీశ్రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా 31వ వార్డుకు సంబంధించి 100% డోర్ టూ డోర్ కలెక్షన్, 60% సోర్స్ సెగ్రిగేషన్, వార్డుల్లో గ్రీన్ డెవలప్మెంట్, ప్రతీ వీధికి డ్రైనేజ్ క్లీనింగ్ చేపట్టడం వంటి అంశాలకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు సాధించేందుకు సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్తోపాటు 31 వ వార్డు ప్రజలకు జగ్గారెడ్డి, నిర్మల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, నాయకులు జార్జ్ పాల్గొన్నారు. -
బ్రెస్ట్ ఫీడింగ్ గదిని సద్వినియోగం చేసుకోండి
జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారినారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటుచేసిన మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ గదిని తల్లులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి సూచించారు. ఖేడ్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన గదిని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణ సమయంలో తల్లులు తమచిన్నారులకు బహిరంగ ప్రదేశాల్లో పాలుపట్టేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశామన్నారు. తల్లిపాలు శిశువులకు అత్యంత శ్రేష్టమైన పోషకాహారంతోపాటు ఎదుగుదలకు ఎంతో కీలకమని చెప్పారు. అనంతరం కేజీబీవీలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, ఆర్టీసీ డీఎం సుబ్రహ్మణ్యం, సీడీపీఓ సుజాత, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సఖి సమన్వయకర్త కల్పన, వైద్యాధికారి తరణి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుల పింఛన్కు అవకాశమివ్వండి
సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి వినతి హత్నూర (సంగారెడ్డి): వృద్ధులకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నస్తిపూర్ గ్రామానికి చెందిన సామాజిక సేవ కార్యకర్త వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని రాష్ట్ర ప్రజాభవన్లో ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి విద్యాసాగర్కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు చేయకపోవడంతో ఎందరో చేయూత లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ పెన్షన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. వినతిపత్రం తీసుకున్న నోడల్ అధికారి విద్యాసాగర్ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు. ఆ వినతి పత్రాన్ని గ్రామాభివృద్ధి శాఖ సీఈఓకు పంపిస్తానని చెప్పినట్లు వివరించారు. ఆ ఏజెన్సీలను రద్దు చేయండిమెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డిమాండ్ సంగారెడ్డి: కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యాదగిరి డిమాండ్ చేశారు. ఏజెన్సీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రి ముందు మంగళవారం కార్మికులు ధర్నా చేయడంతోపాటు మోకాళ్లతో నిరసన తెలిపారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సదానందం,నాగరాజు,రమేశ్, రమాదేవి మరియమ్మ, భాగ్యలక్ష్మి, సునీత, మంజుల, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. వ్యాయామమే ఆరోగ్యానికి ఔషధంస్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సుభాష్ రేగోడ్(మెదక్): ప్రజల్లో ఫిజియోథెరపీ.. వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పి.సుభాష్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చన్నారు. గుండె వ్యాధు లు, పక్షవాతం, క్రీడా గాయాలు, సర్జరీకి ముందు–తర్వాత రిహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ కీలకమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫిజియోథెరపీ సేవలపై అవగాహ న మరింత పెరగాలని ఆయన సూచించారు.తొగుట(దుబ్బాక): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు సూచించారు. మిరుదొడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్పంచ్లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
9 బడులు.. రూ.79 కోట్లు
ఉమ్మడి జిల్లాలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 73 స్కూళ్లను ఎంపిక చేసి రూ.699.985 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులిచ్చింది. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలకు నిధులు మంజూరు చేయడంతో వాటి రూపురేఖలు మారనున్నాయి. – సంగారెడ్డి జోన్ ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గే అవకాశముంటుంది. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, మెరుగైన మౌలిక వసతులతోపాటు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం, విశ్వాసం పెంపొందించడమే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఆధునిక సాంకేతికతతో కూడిన తరగతిగదులు, పౌష్టికాహారం, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు, క్రీడా మైదానాలు, పోటీ పరీక్షల కోసం గ్రంథాలయం, తదితర వసతులు కల్పించనున్నారు. మారనున్న పాఠశాలల రూపురేఖలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయితే విద్యా బోధనతోపాటు క్రీడా, కంప్యూటర్ రంగాల్లో సైతం రాణించేందుకు అవకాశాలుంటాయి. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, దౌల్తాబాద్, సంగారెడ్డిలోని మునిపల్లి, జిన్నారం, సదాశివపేట, జహీరాబాద్, నిజాంపేట, మెదక్ జిల్లాలోని మెదక్, వెల్దుర్తి మండలాల్లోని పాఠశాలలను ఎంపిక చేశారు. -
ఎమ్మెల్యే శంకర్పై ఫిర్యాదు
నంగునూరు(సిద్దిపేట): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు లింగంగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్గౌడ్, తిరుపతి, సిద్దు, స్వామి, వెంకటేశ్వర్లు, అనిల్ పాల్గొన్నారు. అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గౌరవెల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన పాఠశాల క్రీడా సమాఖ్య మండలస్థాయి క్రీడా పోటీల్లో కట్కూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరించారు. కాగా వాలీబాల్ సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ , ఖోఖో సీనియర్ బాలికల విభాగంలో ద్వితీయ, ఖోఖో జూనియర్ బాలికల విభాగంలో ద్వితీయ, కబడ్డీ సీనియర్ బాలుర విభాగంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ బహుమతి సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. దీంతో సర్పంచ్ బాలరాజు, ప్రధానోపాధ్యాయులు సీహెచ్.రఘ విద్యార్థులను అభినందించారు. వ్యక్తికి 5 ఏళ్ల జైలు, జరిమానా సంగారెడ్డి: గంజాయి అక్రమ రవాణా కేసులో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయ అధికారి జయంతి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల వివరాల ప్రకారం.. నిందితుడు బీరంగూడకు చెందిన మాలపాటి కరుణాకర్ రెడ్డి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా అప్పట్లో ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఎకై ్సజ్ అధికారులను, సిబ్బందిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ గాయత్రి, జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు అభినందించారు. యువకుడి పరిస్థితి విషమం నర్సాపూర్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో మంగళవారం నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిలోని రెడ్ఫోర్ట్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎర్ల నవీన్ బైక్పై నర్సాపూర్ వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్కు తీవ్ర గాయాలవగా కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. చేర్యాల(సిద్దిపేట): పుట్టుకతో మలద్వారం లేకుండా జన్మించిన దూడకు స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కృత్రిమ మలద్వారం ఏర్పాటు చేశారు. చేర్యాలకు చెందిన రావుల శంకర్గౌడ్కు చెందిన దూడ పుట్టుకతోనే మలద్వారం లేకపోవడంతో పశువైద్యులను సంప్రదించారు. ఈ మేరకు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డా.జంగ రాజిరెడ్డి ఆధ్వర్యంలో దూడకు ‘సీకోస్టమి’ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా దూడ కుడివైపు పొట్టభాగంలో కృత్రిమ మలద్వారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దూడకు మల విసర్జనకు మార్గం ఏర్పడింది. ఈ అరుదైన శస్త్రచికిత్సలో జేవీఓ మనోహర్తో పాటు సిబ్బంది బాలమణి పాల్గొన్నారు. -
ఆధార్కార్డే ఆధారమైంది..
మెదక్ కలెక్టరేట్: పదకొండేళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని అమ్మాయికి ఆధార్కార్డే ఆధారమై తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి హేమభార్గవి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక 11 ఏళ్లున్నప్పుడు 2014లో ఇంటి నుంచి తప్పిపోయింది. హైదరాబాద్లో దొరకడంతో అధికారులు మెదక్ జిల్లా శివ్వంపేటలో గల బేతాని సంరక్షణ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు ఆధార్కార్డు లేకపోవడంతో వివరాలు నమోదు చేయించేందుకు పలుమార్లు ప్రయత్నం చేయగా రిజక్ట్ అయ్యింది. దీంతో ఇటీవల ఆమెను మాదాపూర్లోని ఆధార్ సెంటర్కు తీసుకెళ్లగా అప్పటికే నమోదైన ఆధార్ నెంబర్ వచ్చిందని తెలిపారు. దాని ఆధారంగా తల్లిదండ్రుల ఆచూకీ లభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె వయస్సు 23ఏళ్లు కాగా తల్లిదండ్రులను పిలిపించి ఆమెను అప్పగించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్, సరిత, మంజుల, బేతాని ఆశ్రమ సోషల్ వర్కర్ వీరబాబ పాల్గొన్నారు. 11ఏళ్ల తరువాత తల్లిదండ్రుల చెంతకు చేరిన అమ్మాయి -
విద్యారంగ సమస్యలపై పోరాటం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈనెల 18, 19, 20 తేదీలలో జరిగే యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని కార్యాలయంలో వాల్పోస్టర్లను ఆవిష్కరించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్లీనరీలో విస్తృతంగా చర్చించి, భవిష్యత్లో చేపట్టాల్సిన విద్యార్థి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు జాతీ య, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, రుక్మిణి, జస్విక, ప్రియాంక, సాహితి, ధరణి, చందన తదితరులు పాల్గొన్నారు. -
వినతులు త్వరగా పరిష్కరించండి
అదనపు కలెక్టర్ పాండుసంగారెడ్డి జోన్: ప్రజావాణిలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 80 వినతులు అందాయని తెలిపారు. కలెక్టరేట్లో 50, సంగారెడ్డి డివిజన్లో 24, జహీరాబాద్ 5, నారాయణఖేడ్ 1 వినతి అందగా, అందోల్ డివిజన్లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అదేవిధంగా మండలస్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 317 అర్జీలు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తమకు జీవనాధారమైన భూములను సాగు చేయనీయకుండా కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి కంచె వేస్తున్నారని కందికి చెందిన మహిళా రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు చర్య లు తీసుకొని పంటలు సాగు చేసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. -
అక్రమ అరెస్ట్తో గొంతు నొక్కలేరు
రామచంద్రాపురం(పటాన్చెరు): అక్రమ అరెస్ట్లతో తమ గొంతు నొక్కలేరని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అన్నారు. సోమవారం పట్టణంలోని నివాసంలో ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పిలుపు మేరకు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తమను హౌస్ అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. పుల్కల్(అందోల్): మండల పరిధిలోని సింగూర్ ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) గ్రామ సమాఖ్యలో రుణాల రికవరీలో అవకతవకలు జరిగినట్లు మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 23 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు ప్రతీ నెల వాయిదాల ప్రకారం చెల్లించాలి. అయితే కొందరు సభ్యులు రుణాల రికవరీపై నిర్లక్ష్యం వహిస్తూ చెల్లింపులు జరపలేదు. దీంతో వీఓఏ రెగ్యూలర్గా చెల్లింపులు జరిపే మహిళల నుంచి తీసుకున్న రుణ డబ్బులను సభ్యులందరికీ సర్ధుబాటు చేసి చెల్లింపులు చూపారు. దీంతో సక్రమంగా చెల్లించే మహిళా సభ్యులు సకాలంలో చెల్లించనట్లుగా మారారు. ఈ విషయం బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న మహిళా సభ్యులు ఐకేపీ అధికారులను నిలదీశారు. దీంతో సోమవారం ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సుమారు రూ.10 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. కొండాపూర్(సంగారెడ్డి): రెండు రోజులుగా కొండాపూర్లో జరుగుతున్న డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు సోమవారంతో ముగిశాయి. ముగింపు రోజున జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీకాంత్, కార్యదర్శిగా బాబురావు, ఉపాధ్యక్షులుగా అనిల్, శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా మహేందర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా మోహిన్ పాషా, మహిపాల్, సాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, జయరాజ్, నాగరాజ్, రాజయ్య , నర్సింలు, ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్: జాతీయస్థాయి రాక్బాల్ పోటీలు బీవీరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం రెండో రోజు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణ అభినందనీయమని మురళీయాదవ్ను అభినందించారు. అనంతరం ఆయా రాష్ట్రాల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాక్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పోటీలను పర్యవేక్షించారు. కాగా, వర్షంతో పోటీల నిర్వహణకు కొంత ఇబ్బందిగా మారింది. -
ఇక మాస్టర్ ప్లాన్
మూడు దశాబ్దాలగా జహీరాబాద్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనుంది. వారం రోజుల్లో మాస్టర్ ప్లాన్ అమలుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మున్సిపల్ కౌన్సిల్ పలుమార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తాజాగా చైర్మన్ యూనూస్, కమిషనర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. – జహీరాబాద్ జహీరాబాద్ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్నా రహదారులు మాత్రం ఆక్రమణలతో కుంచించుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో ఎప్పుడైనా రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వ్యాపారుల వైపు నుంచి సైతం సమ్మతం లభించింది. దీపావళి వరకు అయినా విస్తరణ పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని, వచ్చిన విన్నపాలను అధికారులతో పాటు మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది. పట్టణంలోని భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రోడ్డు, లతీఫ్ రోడ్డు, ఆదర్శనగర్, బ్లాక్ రోడ్డు, తహసీల్, మోహన్ థియేటర్ రహదారి, 65వ జాతీయ రహదారులను విస్తరించనున్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించిన పలు ఆక్రమణ కట్టడాలను ఈసందర్భంగా తొలగించనున్నారు. 1987 డిసెంబర్ 15న వెలువడిన జహీరాబాద్ మాస్టర్ ప్లాన్ జీఓ 995, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం రోడ్లను విస్తరించేందుకు గాను అధికారులు నిర్ణయించారు. టౌన్ ప్లానింగ్ సైతం నోటీసులను జారీ చేసింది. మొదట ఈ రోడ్ల విస్తరణ మొదటి విడతలో అధికంగా రద్దీగా ఉండే భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రహదారులను విస్తరించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు, ఇంటి యజమానులతో సమావేశాలు నిర్వహించారు. అన్నివర్గాల నుంచి సమ్మతి లభించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయా రహదారులను 40 ఫీట్ల వెడల్పుతో విస్తరించనున్నా యి. ఇరువైపులా 5 ఫీట్ల వంతున సెట్ బ్యాక్ ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. రహదారులను ఆక్రమించిన దు కాణాలను ఎంత మేర కూల్చి వేయాల్సి ఉంటుందనే విషయమై ఇప్పటికే కొలతలు నిర్వహించి మార్కింగ్ వేశారు. దశలవారీగా గుర్తించిన రోడ్లన్నింటీని విస్తరించనున్నారు. మోహన్ థియేటర్ రోడ్డును 60 ఫీట్లుగా విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జహీరాబాద్లో ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం దశలవారీగా రహదారుల విస్తరణకు మున్సిపల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ మూడు దశాబ్దాల అనంతరం మోక్షం తీరనున్న ట్రాఫిక్ సమస్య ఆయా రహదారులపై పలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. వ్యాపార సంస్థల ముందు పార్కింగ్ సదుపాయం లేదు. 20 నుంచి 30 ఫీట్ల వెడల్పుతో రహదారులు కుచించుకుపోయాయి. కొనుగోళ్ల నిమిత్తం దుకాణాలకు వెళ్లే ప్రజలు వాహనాలను దుకాణాల ముందే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు సందర్భాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. రహదారులను విస్తరించేందుకు మున్సిపల్ శాఖ నిర్ణయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జీపీ కార్యదర్శికి షోకాజ్
హత్నూర(సంగారెడ్డి): ‘చెత్తశుద్ధి కరువు‘ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి స్పందించారు. మండలంలోని ఎల్లమ్మగూడలో సేకరించిన చెత్తను చెరువులో వేసినందుకు కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చెరువులో వేసిన చెత్తను సిబ్బందితో తొలగింపజేశారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లలో వేర్వేరుగా వేసి ఎరువులు తయారు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఇష్టానుసారంగా చెత్తను చెరువుకుంటలో వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. మండలంలో 38 పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు సైతం మెమోలు జారీ చేస్తున్నట్లు ఇన్చార్జి ఎంపీడీఓ యూసుఫ్ తెలిపారు. -
బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ మెదక్జోన్: ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం మెదక్లోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 10న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చా రు. పీఆర్సీ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరు విడతల కరువు భత్యం (డీఏ) పెండింగ్లో ఉందని, అది ఒకే దఫాలో చెల్లించాలన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వద్ద నిలిచిపోయి, ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. నగదు రహిత ఆరోగ్య కార్డులు అనేక ఆస్పత్రుల్లో చెల్లుబాటు కాకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పటం లేదని వాపోయారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు దామోదర్రెడ్డి, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీహెచ్లో ఇగ్నైట్ సదస్సు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వినియోగదారుల అవసరాలు, నూతన సాంకేతికత, ప్రయోగాలు, నిరంతర అభ్యాసనతోనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీఎండీ డాక్టర్ అనిల్ ఖండేల్వాల్ అన్నారు. హైదరాబాద్ ఐఐటీలో గెయిల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఎంస్నీ ఫౌండేషన్, ఐటీఐసీ ఇంక్యుబేటర్ ఆధ్వర్యంలో ‘ఎంసీ 2 ప్లస్ ఇగ్నైట్ హైదరాబాద్ కనెక్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గెయిల్ సీఎండీ దీపక్గుప్త మాట్లాడుతూ.. భారత్లో ఇంధన అవసరాలు వేగంగా పెరుగుతున్న తరుణంలో స్వచ్ఛమై న ఇంధనం, ఇంధన భద్రత, సాంకేతిక స్వావలంబనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్, సెన్సార్లు, రోబోటిక్స్, డ్రోన్లు, డిజిటల్ ట్విన్స్తో సంప్రదాయ మౌలిక వసతులను ‘ఇంటెలిజెంట్ అసెట్స్’గా మార్చాలని సూచించారు. ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్లో వృథాగా పోతున్న కోల్డ్ ఎనర్జీని డెటా సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలు, ఎయిర్సెపరేషన్ యూనిట్లలో వాణిజ్యపరౖంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఎండీ అక్షయ్కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సర్వర్ సతాయిస్తోంది!
జనగణనలో భాగంగా విలేజ్ డైరెక్టరీల తయారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా గ్రామాల్లోని మౌలిక సదుపాయాల వివరాలను నమోదు చేసే ఓఆర్జీఐ వెబ్సైట్ సర్వర్ సతాయిస్తోంది. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాల సమూల సమాచారాన్ని జీపీఓలు క్రోడీకరించినప్పటికీ.. ఆ సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి జనగణన (సెన్సస్)లో భాగంగా ఇప్పటివరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (ఇండ్ల గణన) చేసిన ప్రభుత్వం, ఇప్పుడు విలేజ్ డైరెక్టరీ (గ్రామ సమాచార దర్శని), మున్సిపాలిటీలకు సంబంధించి టౌన్ డైరెక్టరీలను రూపొందిస్తున్న విషయం విధితమే. గ్రామ, పట్టణానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తం తొమ్మిది రకాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల వివరాలను ఈ డైరెక్టరీల్లో నమోదు చేశారు. పాఠశాలలు, వివిధ రకాల కళాశాలలు వంటి విద్యా పరమైన సౌకర్యాలు, ఆసుపత్రులు.. వాటిల్లో అందించే వైద్య సేవలు.. ఆయా గ్రామంలో ఇవి లేకపోతే ఎంత దూరంలో అందుబాటులో ఉన్నాయనే వివరాలను సేకరించారు. తాగునీటి వసతి, డ్రైనేజీలు.. బస్సు, రైలు, విమాన వంటి రవాణ సదుపాయాలతో పాటు కమ్యునికేషన్స్ వంటి వివరాలను కూడా ఈ డైరెక్టరీలో పొందుపరుస్తున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. సాగు భూమి.. గ్రామ/ పట్టణ భౌగోళిక వివరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తులు ఇలా మొత్తం తొమ్మిది అంశాలకు సంబందించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. మూడో వంతు గ్రామాలకే.. జిల్లాలో 647 పంచాయతీలు ఉన్నాయి. 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటికి గ్రామ, పట్టణ డైరెక్టరీలను తయారు చేస్తున్నారు. ఆగస్టు 10 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు ఈ గ్రామ సమాచారాన్ని సేకరిస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ నేటితో ముగియాల్సి ఉంటుంది. కానీ సర్వర్ సమస్య కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈవివరాలన్నింటిని నమోదు చేసే ఓఆర్జీఐ వెబ్సైట్ సర్వర్ తరచూ సతాయిస్తోందని జీపీఓ (పంచాయతీ కార్య దర్శులు) వాపోతున్నారు. ఒక్కో సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలంటే సమయం బాగా తీసుకుంటోందని, తీరా వివరాలన్నీ టైప్ చేశాక సర్వర్ సమస్య కారణంగా సేవ్ కావడం లేదని చెబుతున్నారు. దీంతో 647 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు సుమారు 450 పంచాయతీల్లోనూ ఈ ప్రక్రియ పూర్తికాలేదని అంటున్నారు. దీంతో ఈ గడువు మరికొన్ని రోజులు పొడగించాల్సిన పరిస్థితి నెలకొంది. విలేజ్, టౌన్ డైరెక్టర్ రూపకల్పనకు సాంకేతిక సమస్యలు గ్రామాల, పట్టణాల్లో మౌలిక వసతుల వివరాల సేకరణ ఆన్లైన్లో నమోదుకు మొరాయిస్తున్న ఓఆర్జీఐ వెబ్సైట్ నేటితో ముగియనున్న నిర్దేశిత గడువు జిల్లా పరిధిలో ఉండే పటాన్చెరు, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం, వంటి ప్రాంతాల్లోని ఈ వివరాలను జిల్లా అధికారులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పంపారు. ఈ వివరాలను ఆ కార్పొరేషన్ అధికారులే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): భూ తగాదా విషయంలో సొంత అన్న కొడుకుపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎస్ఐ మహ్మద్ ఆసీఫ్ కేసు వివరాలు వెల్లడించారు. దూల్మిట్ట మండలంలోని హనుమతండా పరిధిలోని మహారాజ్ తండాకు చెందిన సభావత్ దేవేందర్ తన అన్న కొడుకు సభావత్ రాకేశ్తో కొన్నేళ్లుగా భూ తగాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 1న ఉదయం బావి వద్ద గొడవ జరిగిన అనంతరం మధ్యాహ్నం ఇంటికి వెళ్లాడు. తర్వాత దేవేందర్ రాజేశ్పై కత్తితో దాడి చేయగా అతడికి తల వెనుక భాగంలో గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దేవేందర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడ్ని చేర్యాల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా కోర్టు రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
తండాలో జ్వర పరీక్షలు
● కదిలిన ఆరోగ్య సిబ్బంది ● 20మందికి రక్తపరీక్షలు ● సీజనల్ వ్యాధులపై అవగాహన అక్కన్నపేట(హుస్నాబాద్): ‘గిరిజన తండాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు’అంటూ ఈ నెల 06న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆరోగ్యసిబ్బంది స్పందించారు. మండలంలోని చాపగానీతండా గ్రామపంచాయితీలో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 40మంది ప్రజలు పాల్గొని 20 మందికిపైగా రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎంఎల్హెచ్పీ దివ్య మాట్లాడుతూ...తండాలో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా దోమల వ్యాప్తిని నివారించటం, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు చేశారు. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని ప్రజలకు సూచించారు. గ్రామాలలో ఆశా కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు రాజేందర్, హెల్త్ అసిస్టెంట్ బాబురావు, ఏఎన్ఎం రజిత, ఆరోగ్య సిబ్బంది శ్రీనివాస్, సాంబయ్య, ఫరీద్, ఆశ కార్యకర్త తదితులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
న్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్ మండల పరిధిలోని మెటల్కుంట గ్రామ శివారులో రాత్రి రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి (30) మృతదేహం లభ్యమైంది. మృతుడు నీలం రంగు షర్టు, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వికారాబాద్ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 7702629707 నంబర్కు సమాచారం అందించాలన్నారు. రామచంద్రాపురం (పటాన్చెరు): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వృద్ధుడు ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... గత నెల 14న సదరు వృద్ధుడు రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా చెరువు మట్టి తరలింపు జేసీబీ, ట్రాక్టర్లు స్వాధీనం కొండపాక(గజ్వేల్): అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీ, 2 ట్రాక్టర్లకు జరిమానా విధించినట్లు తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. మండలంలోని దుద్దెడలోని చెరువులోంచి ఈనెల 4న అక్రమంగా మట్టిని జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేస్తున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది వెళ్లి జేసీబీతో పాటు 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జేసీబీకి రూ. 5వేలు, ఒక్కొక్క ట్రాక్టరుకు రూ. 2 వేల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. జేసీబీ, ట్రాక్టర్ల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి వాహనాలను అప్పగించామని పేర్కొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): భార్యతో గొడవపడి జీవితంపై విరక్తి చెందిన యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్ద శంకరంపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ. ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బాయికాడి భాస్కర్ (39) ఆదివారం రాత్రి తన భార్యతో కుటుంబ సభ్యుల విషయంలో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం పట్టణ శివారులోని రేగోడుకు వెళ్లే రహదారిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్ స్వర్ణకార వృత్తి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మృతుడికి భార్య దీప, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మంత్రి ఇలాకాలోనే ఇలా..!!
మండలవ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లేనికారణాలతోనే పనులు నిలిచిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నాలుగు ఇరుకు గదుల్లో కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరమ్మతులు చేయించి అందులో నెట్టుకొచ్చారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సైతం ఎంతో ఇబ్బందుల నడుమ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజావాణికి వచ్చే మండల అధికారులు, ప్రజలు వస్తే కూర్చోబెట్టేందుకు కుర్చీలు, టేబుళ్లు కూడా లేని దుస్థితిలో ఉన్నారు. ఇరుకు గదుల్లో ఎంపీడీఓ కార్యాలయం గతేడాది సెప్టెంబర్లో నూతన భవనానికి మంత్రి పొన్నం శంకుస్థాపన ఏడాది కావస్తున్నా ముందుకు సాగని పనులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో పలు అభివృద్ధి పనులకు అట్టహాసంగా శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మండల కేంద్రంలోని ‘పోలీస్స్టేషన్ వెనక భాగంలో...ఇందిరమ్మ మోడల్ హౌజ్కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 387లో సుమారుగా రెండెకరాల ప్రభుత్వ స్థలంలో ‘నూతన ప్రజాపరిషత్ భవనం’నిర్మించేందుకు కేటాయించారు. గతేడాది సెప్టెంబర్లో రూ.1.50కోట్ల వ్యయంతో ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి కలెక్టర్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఏడాది కావస్తున్నా పునాదులు తీసి బండరాళ్లు అడ్డు వస్తున్నాయని పనులను నిలిపివేశారు. అక్కన్నపేట(హుస్నాబాద్) పనులు జరగడం లేదు స్వయంగా మంత్రి శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ఇరుకు గదుల్లో నెట్టుకొస్తున్నారు. త్వరగా నూతన భవనం నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. మంత్రి ఇలాకాలోనే ఇలా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదంటే మాకే బాధేస్తుంది. –జన్నారపు సంపత్, సర్పంచ్ అక్కన్నపేట గ్రామం -
కులసంఘం భూమి కబ్జా చేశారని ధర్నా
హుస్నాబాద్రూరల్: ముదిరాజ్ కుల సంఘం భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇవ్వాలని అక్కన్నపేట మండలం గుబ్బడీ గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్లు మాట్లాడుతూ.. గుబ్బడి ముదిరాజ్ కుల సంఘం కోసం జనగామ శివారులో రెండెకరాల భూమి కొనుగోలు చేశామని, దీనిని అప్పటి కుల సంఘం నాయకుడు రాజయ్య అక్రమంగా ఆర్వోఆర్లో పట్టా చేసుకున్నారని ఆరోపించారు. వంద కుటుంబాలకు చెందిన కుల సంఘం భూమిని అక్రమంగా కుల పెద్దకు ఎట్లా పట్టా చేశారని ప్రశ్నించారు. ఆర్డీవో స్పందించి గ్రామంలో విచారణ జరిపించి, అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణిలో ఆర్డీవో రాంమూర్తికి వినతి పత్రం అందించారు. న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతి -
ట్రాక్టర్ అపహరణ.. నిందితుడి అరెస్టు
ములుగు(గజ్వేల్): ట్రాక్టర్ను అపహరించిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సోమవారం ములుగు ఎస్ఐ రఘుపతితో కలిసి గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని సింగన్నగూడ గ్రామానికి చెందిన మన్నె ప్రవీణ్ తన తండ్రి ఏగొండకు చెందిన ట్రాక్టర్తో వ్యవసాయ పనులు చేసి అక్కడే వదిలేసి వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 5న రాత్రి తన ట్రాక్టర్ను పొలం వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు పొలం వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రఘుపతి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఎస్ఐ, సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింగన్నగూడకు చెందిన పాత నేరస్తుడు మన్నె నరేశ్(33) అపహరణకు గురైన ట్రాక్టర్ను మేడ్చెల్ వైపు తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని విచారించగా ట్రాక్టర్ను అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు -
చిగురుమామిడికి పబ్లిక్ స్కూల్ మంజూరు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్) మంజూరైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించేందుకు 73 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో మౌలిక వసతుల కల్పనకు రూ.699.895 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఈనెల 5న జీవోనం.164 జారీ చేసింది. ఈ జాబితాలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఎంపిక చేశారు. ఈ పాఠశాల అభివృద్ధికి రూ.9.62 కోట్ల అంచనావ్యయం కేటాయించారు. హుస్నాబాద్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతులు హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు హుజూరాబాద్కు మార్గంలో ఎదురవుతున్న ఇబ్బందులు హైలెవల్ బ్రిడ్జి మంజూరుతో తీరనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూరాబాద్ సుందరగిరి రహదారిపై కిలో మీటర్ 10/022 వద్ద హైలెవల్ బ్రిడ్జి (10 మీటర్ల వెడల్పు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి సోమవారం వెల్లడించారు. ఈ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పరిసర గ్రామాల ప్రజలకు ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. హైలెవెల్ బ్రిడ్జి మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
డ్రగ్స్పై అవగాహనలో ఆదర్శం
నషాముక్త్ యువ భారత్లో.. లకుడారం జీపీకి రెండో స్థానం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో సర్పంచ్ శిల్ప యువత మత్తు పదార్థాల బారిన పడితే కలిగే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించి సఫలీకృతురాలైంది. కాగా నషా ముక్త్ యువభారత్ వికసిత్ భారత్ విజేతల్లో లకుడారం గ్రామ పంచాయతీ 2026 ఆగస్టు పోటీల్లో దేశవ్యాప్తంగా ద్వితీయ బహుమతిని గెలుచుకుంది. హర్యానా రాష్ట్రంలో నీర్పూర్ గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రుల క్షోభకు గురి చేసే విషయాలపై గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పిల్లలు మానుకునేలా సర్పంచ్ శిల్ప తల్లిదండ్రులకు అండగా నిలిచారు. దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీల్లో లకుడారం పేరును దక్కించుకుంది. నిరంతరం ఇలాంటి ఆదర్శమైన పనులు చేస్తూ మరిన్ని బహుమతులు అందుకోవాలని నషాముక్త్ యువభారత్ ఆకాంక్షించింది. ఈ సందర్భంగా సర్పంచ్ శిల్ప మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో నషా మక్త్ యువ భారత్ పోటీల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. ఇలాగే సహాయ సహకారాలుంటే మరిన్ని ఆదర్శమైన బహుమతులు అందుకుంటూ, గ్రామ పేరు ప్రతిష్టలను పెంచుతామన్నారు. బహుమతిని గెలుచుకోడంపై గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
జింకపిల్లను కాపాడిన యువరైతు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని చౌకన్పల్లి శివారులో కాలువిరిగి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న జింకపిల్లను స్థానిక యువకులు రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే గాయపడిన జింకపిల్లను స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా.. ఎల్ఎస్ఏ వైద్యులు బస్వయ్య స్వామి ప్రథమ చికిత్స చేసి ఇంజెక్షన్ అందజేశారు. అనంతరం సిర్గాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాముకు సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకుని జింకపిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ జింకపిల్లకు మరింత మెరుగైన వైద్యం అందించి నారాయణఖేడ్ పార్కులో వదిలిపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంతి శ్రీనివాస్, యువకులు పాల్గొన్నారు. -
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): మండల పరిధి చిత్రియాల్ గిరిజన తండాలో సోమవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్లో ఇనుప పైపులు వేసే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్ షాక్ గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల కుమార్ (35) ట్రాక్టర్ నడుపుతూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం చిత్రియాల్ తండాలోని లక్ష్మణ్ వద్ద కూలీ పనుల కోసం వెళ్లాడు. అక్కడ షెడ్డు నిర్మాణం కోసం ఇనుప పైపులు తీసి ట్రాక్టర్లో వేస్తుండగా బ్యాలెన్స్ తప్పి పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు ఆ ఇనుప పైపులు తగిలాయి. దీంతో పుట్టల కుమార్కు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కంది/సంగారెడ్డి క్రైమ్: నాలుగు ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విజయ్కుమార్ వివరాలు వెల్లడించారు. కంది మండలం జుల్కల్కి చెందిన కావలి బాల్రాజ్ (24) గ్రామంలో టైర్ షాప్ నిర్వహిస్తూ నివాసం ఉంటున్నాడు. 2025 జూన్లో ఓ నలుగురేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడగా, బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన న్యాయవాదులు, పోలీసు సిబ్బందిని, భరోసా కేంద్రాన్ని ఎస్పీ అభినందించారు. మార్షల్ఆర్ట్స్లో అవార్డులు సిద్దిపేటజోన్: హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ ఎక్స్లెన్న్స్ ఐకాన్ 2026లో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు మార్షల్ ఆర్ట్స్లో అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పాల్గొన్న టోర్నీలో జిల్లాకు చెందిన కరాటే మాస్టర్ సాజిద్ పాషా గోల్డెన్ నంది అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన శిష్యులు శిఖ, ఎల్లాగౌడ్, ప్రభాకర్, మల్లేశం, నవీన్, అస్మా, హరి, అలీ, రేవంత్, శ్రీరాం, రవళి కావ్యలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి. రాష్ట్ర పోటీలకు గురుకుల విద్యార్థులు చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ పి.నర్సింహ్మచారి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ోటిలింగాలలో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో 8 మంది పాల్గొనగా వర్షిత్, హర్షవర్ధన్, జస్వంత్, వైష్ణో ఆర్యన్, మనోజ్, అభి ఎంపికయ్యారని చెప్పారు. నకిలీ పత్రాలతో ఆస్తుల విక్రయం మూసాపేట: తల్లిదండ్రులకు తానే నిజమైన వారసుడినని నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించారని సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...కూకట్పల్లి జయనగర్లో నివాసం ఉండే ఉన్నం వెంకటేశ్వర్లు, పార్థసారథి తల్లిదండ్రులైన ఉన్నం సుబ్బానాయుడు, అచ్చమ్మలు అమీన్పూర్, బీరంగూడలో సర్వే నం.967లో 1,200 గజాలు కొనుగోలు చేశారు. 2013లో అచ్చమ్మ, 2017లో సుబ్బానాయుడు మరణించారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం తహశీల్దార్ జారీ చేశారు. అయితే వెంకటేశ్వర్లు తల్లిదండ్రుల స్థలాలను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా...ఆ స్థలాలపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2018లో శ్రీనివాస్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందినట్లు తెలిసింది. సుబ్బానాయుడు, అచ్చమ్మలు తమ తల్లిదండ్రులేనని నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని విక్రయించారని, అసలైన వారసులం తామేనని వెంకటేశ్వర్లు, పార్థసారథి ఫిర్యాదు చేశారు. -
2 కోట్ల ఉద్యోగాలెక్కడ?: డీవైఎఫ్ఐ
కొండాపూర్(సంగారెడ్డి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత విధానాలతో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా 4వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తుండగా, మరోవైపు నీట్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆ పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అనిల్, నాయకులు జయరాజు, మాణిక్యం, శ్రీకాంత్, ప్రశాంత్, శ్రీకాంత్, బాబురావు, వాణి, రమేశ్, సాయికుమార్, అర్జున్, ప్రజా సంఘాల నాయకులు రాజయ్య, నాగ భూషణం, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
చెత్తశుద్ధి కరువు
● అధికారుల పర్యవేక్షణ లోపం ● కలుషితమవుతున్న చెరువులు, కుంటలు హత్నూర(సంగారెడ్డి): ప్రతిరోజు గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్డు ఏర్పాటు చేసింది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో సేకరించిన చెత్తను గ్రామ శివారులోని చెరువుల్లో వేస్తున్నారు. మండలంలోని ఎల్లమ్మ గూడ పంచాయతీలో గత ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించింది. ఎరువులు తయారు చేయాలన్న లక్ష్యంతో అది ఏర్పాటు చేసినప్పటికీ లక్ష్యం నీరుగారి పోతోంది. మండలంలోని పలు గ్రామాల్లో రోజూ సేకరించిన చెత్తను చెరువు, కుంటలో వేయడంతో అవి కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను చెరువు, కుంటలో కాకుండా ఇతర ప్రాంతంలో వేయించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండని కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకునే గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలో 38 పంచాయతీలు ఉండగా, సుమారు 35 మంది కార్యదర్శులు పట్టణాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. సర్టిఫికెట్లపై సంతకాలు చేయించేందుకు పంచాయతీకి వెళితే అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి విధులకు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


