breaking news
Sangareddy
-
తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ‘చెత్త’ పంచాయితీ..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బీదర్, మల్గి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.వివరాల మేరకు.. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డు తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో చెత్తను అక్కడ పడేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త డంపింగ్ కారణంగా తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.మరోవైపు.. చెత్త వాహనాలను అడ్డుకున్న వారిని బీదర్ మున్సిపల్ అధికారుల బెదిరిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు బీదర్కి ఎలా వస్తారో చూస్తాం అంటూ మల్గి, బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్తను మున్సిపల్ అధికారులు పారబోసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. బీదర్, మల్గి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. -
క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తోనే నిందితులకు శిక్ష
వర్గల్(గజ్వేల్): గ్రేవ్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. మంగళవారం గౌరారంలోని గజ్వేల్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సౌకర్యాలు, రికార్డుల నిర్వహణ, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. నూతనంగా ఏర్పాటు చేసిన 6 సీసీటీవీ కెమెరాలు, వాహన పార్కింగ్ షెడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, సీఐ రవిరాజు, ఎస్ఐలు ఆరోగ్యం, రఘుపతి, కృష్ణారెడ్డి, యూనుస్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ -
రూ.124.83 కోట్లు..2,42,753 మంది రైతులు
సంగారెడ్డి జోన్: వానాకాలం సీజన్ వ్యవసాయ పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. సాగుకు పెట్టుబడి సాయంగా తొలి విడతలో రెండు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. జిల్లాలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన 2,42,753 మంది రైతులకు రూ.125.83 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్లో మంగళవారం శిల్పారామం వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డిలతో కలిసి బటన్నొక్కి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం సాయంత్రానికి రైతుల ఖాతాలో నగదు జమ కానుంది. విత్తన కొనుగోలు, పురుగు మందులు, తదితర వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోనున్నారు. మిగతా రైతులకు విడతలవారీగా నిధులు త్వరలో జమ కానున్నాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా... రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలసి ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, రైతులు తదితరులున్నారు. రైతు భరోసా నిధుల విడుదల విడతలవారీగా రైతుల ఖాతాలో జమ తొలి విడతలో రెండు ఎకరాల వరకు రైతు వేదికలో పాల్గొన్న టీజీఐఐసీ చైర్పర్సన్, కలెక్టర్ తదితరులు -
సిగాచి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
పటాన్చెరు టౌన్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచినా ఇంతవరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని..ఇది అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విమర్శించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం బీపీఎల్ చౌరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతేడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో 54 మంది మృతి చెందగా..8 మంది ఆచూకీ తెలియకపోవడంతోపాటు 40 మంది తీవ్రంగా గాయపడి నేటికి నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం మూలంగా జరిగిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత దారుణంగా ఉందని దుయ్యబట్టారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమ యాజమాన్యాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం పోరాడుతున్న వారిని విమర్శించడం తప్ప బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మంత్రి వివేక్ రూ.60 లక్షల పరిహారం అందించామని చెబుతున్నది అసత్యమని, సెబీలో రూ.118 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని వెల్లడించారని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు నివాళి అర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వంఅనుమతించకపోవడం దుర్మార్గ వైఖరికి అర్థం పడుతోందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్జి చార్జ్ ఆదర్శ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
మిడ్ డే మీల్స్ అమలు చేయాలి
నారాయణఖేడ్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి తెంకటి కుమార్ డిమాండ్ చేశారు. ఖేడ్ కళాశాలను మంగళవారం సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే హామీనిచ్చి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఈ పథకాన్ని అమలుచేయలేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం డివిజన్ బాధ్యులు రవి, సుందర్, ప్రవీణ్, స్టాలిన్, సుభాష్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల సేవలు విస్మరించలేనివి
అదనపు కలెక్టర్ పాండు సంగారెడ్డి: విధుల్లో ఉద్యోగులు చేసిన సేవలు మరువలేని అదనపు కలెక్టర్ పాండు పేర్కొ న్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని మంగళవారం జిల్లా పరిషత్ హాలులో ఝరాసంఘం మండలం సూపరిండెంట్ గా పనిచేస్తూ, పుల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటేషన్లో పని చేసి మంగళవారం పదవి విరమణ పొందారు. కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ...గత 38 ఏళ్లుగా రాములు చేసిన సేవలు కొనియాడారు. ఆయన ఉద్యోగ సమయంలో సరైన సమయం, బాధ్యత నిర్వర్తించేవారన్నారు. రాములు దంపతులకు శేషజీవితం ప్రశాంతంగా గడపాలని కోరారు. ఈ సందర్భంగా రాములును పలు మండలాల ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది, అభిమానులు ఘనంగా సన్మానించారు. వైద్యాధికారికి మెమోకొండాపూర్(సంగారెడ్డి): ‘బహిరంగ ప్రదేశంలో సర్కారు మాత్రలు’శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు. కొండాపూర్ మెడికల్ ఆఫీసర్ అనుదీప్కు మెమో జారీచేసినట్లు డీఎంహెచ్ఓ లలితాదేవి తెలిపారు. డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగనిర్మల దొబ్బకుంట గ్రామానికి వచ్చి పంచాయతీ కార్యాలయం బయట సర్కారు మందులు పడి ఉండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం డీఎంహెచ్ఓకు తుది నివేదిక అందజేస్తానని నాగనిర్మల తెలిపారు. కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతిదరఖాస్తుల కోసం ఆహ్వానం హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం దౌల్తాబాద్ బీసీ సంక్షేమ వసతి గృహంలో ఇంటర్మీడియెట్ చదువుకునే విద్యార్థులకు వసతి సౌకర్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని హాస్టల్ వార్డెన్ బద్రి ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం దౌల్తాబాద్ బీసీ హాస్టల్ ఇంటర్ చదువుకునే విద్యార్థుల కోసం వసతిగృహంగా మార్చినట్లు తెలిపారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంతోపాటు డిగ్రీ, బీకాం, ఐటీఐ చదువుకునే విద్యార్థులు సైతం ఈ వసతిగృహంలో ఉండేందుకు ఉన్నతాధికారులు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండేందుకు స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పూర్తి సమాచారానికి ఫోన్ నంబర్ 7989667072కు సంప్రదించాలని ఆయన కోరారు. ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి మెమో, కుల,ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలు, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, ప్రస్తుతం చదువుతున్న కళాశాల బోనఫైడ్ జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహనసదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఖేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మందికుంట రైతు వేదికలో మంగళవారం స్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జహీరాబాద్లోని డీడీఎస్–కేవీకే వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శాస్త్రవేత్తలు వ్యవసాయ సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రోగ్రాం అధికారి స్వామి మాట్లాడుతూ..పోషక విలువల గురించి తెలుసుకోవడానికి తప్పకుండా నేల పరీక్షలు చేయించాలన్నారు. పరీక్షల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని చెప్పారు. శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత వరి పంటలో ఆశించే ప్రధాన కీటకాల గురించి వివరించారు. పంట ప్రారంభం దశ నుంచి తీసుకొవల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సునీత, ఏఈఓ మనోహర్ రైతులు పాల్గొన్నారు. -
ఓట్లు తొలగించే కుట్ర
న్యాల్కల్(జహీరాబాద్): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైందని దానిని తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఆరోపించారు. మండల పరిధిలోని ముంగి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం ఎస్ఐఆర్పై బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్ఏలకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటరు జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా?లేదా? తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. ఓటరు జాబితాల్లోని ఓట్లను తొలగించడం కాని, ఓటు చోరికి పాల్పడినట్లు తెలిస్తే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన బీఎల్ఏలకు సూచించారు. ఎస్ఐఆర్పై గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అసెంబ్లీ కో–ఆర్డినేటర్ మహమ్మద్గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉజ్వల్రెడ్డి, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ సిద్దిలింగయ్య స్వామి, మాజీ జెడ్పీటీసీ చంద్రప్ప, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.బీఎల్ఏల అవగాహన సదస్సులో మాజీమంత్రి చంద్రశేఖర్ -
క్షయను పూర్తిగా నిర్మూలిద్దాం
నారాయణఖేడ్: సమాజంలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఖేడ్ మండలం పంచగామలో మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు వారాలకుపైగా తగ్గని దగ్గు, రాత్రిపూట జ్వరం రావడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం క్షయవ్యాధి ప్రధాన లక్షణాలని తెలిపారు. లక్షణాలున్నవారు ప్రభుత్వ వైద్యశాలలో వెంటనే ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, వైద్యం, మందులు ఉచితంగా అందజేయడమే కాకుండా బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థికసహాయం, పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. వైద్యాధికారి డా.అఖిల, ఆరోగ్య సహాయకులు జెట్ల భాస్కర్, ప్రకాష్, సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్రెడ్డి, ఏఎన్ఎం జానకి పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమానికి రైతులు బస్సుల్లో తరలివెళ్లగా జెండా ఊపి సాగనంపారు. రైతుభరోసా, రాయితీపై వ్యవసాయపనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు, వడ్లకు బోనస్ తదితర రైతుసంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, డివిజన్ పరిధిలోని మండలాల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
వట్పల్లి(అందోల్): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి పిలుపునిచ్చారు. ఆందోల్ మండలం సంగుపేటలోని మంగళవారం జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ...గ్రామాలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాక్షించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, భక్తి మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆలయాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉదయ్ బాబుమోహన్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఖాదిరాబాద్ రమేశ్, సర్పంచ్ రామచంద్రారెడ్డి, నాయకులు రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి -
హ్యామ్ రోడ్లకు ఎక్సెస్ టెండర్లు
అంచనా వ్యయం కంటే సుమారు 4.5% ఎక్కువ..!గుంతలు పడిన రోడ్డుహ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణ పనులకు అంచనా వ్యయం కంటే ఎక్కువ (ఎక్సెస్)కు టెండర్లు దాఖలయ్యాయి. ఈ పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టు కంపెనీలు సుమారు 4.5% ఎక్సెస్కు బిడ్లు దాఖలు చేసినట్లు రోడ్లు భవనాలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా రోడ్ల అంచనా వ్యయం కంటే 5 శాతానికి మించి ఎక్కువ కోట్ చేయడానికి వీలులేకుండా ప్రభుత్వం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఇలా ఎక్సెస్కు టెండర్లు దాఖలు కావడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందని అంచనా. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ హ్యామ్ విధానంలో జిల్లాలో మొత్తం 21 రోడ్లను ఎంపిక చేశారు. 318 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్ల అభివృద్ధి పనులకు రూ.684 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. ఈ లెక్కన 4.5% ఎక్సెస్కు టెండర్లు దాఖలు చేయడంతో సుమారు రూ.30 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాపై భారం పడనుందని అంచనా. ఎంపిక చేసిన 21 రోడ్లలో ఐదు రోడ్లను రెండు లైన్ల రహదారిగా విస్తరించనున్నారు. మిగిలినవి ప్రస్తుతం ఉన్న రోడ్లను బలోపేతం చేస్తారు. మూడు ప్యాకేజీలు.. రోడ్లు భవనాలశాఖ ఈ 21 రోడ్లను మూడు ప్యాకేజీలుగా విభజించింది. ఆందోల్, ఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని ఏడు రహదారులను మొదటి ప్యాకేజీలో ఎంపిక చేశారు. అలాగే జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లోని తొమ్మిది రోడ్లను రెండో ప్యాకేజీలో చేర్చారు. ఈ రెండో ప్యాకేజీలో వికారాబాద్ జిల్లా రోడ్లు కూడా ఉన్నాయి. మూడో ప్యాకేజీలో సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల పరిధిలోని రోడ్లు ఉన్నాయి. ఇలా మొత్తం మూడు ప్యాకేజీలుగా మార్చి టెండరు ప్రక్రియను నిర్వహించారు. ఇందులో మొదటి, రెండో ప్యాకేజీలు హైదరాబాద్కు చెందిన ఓ కాంట్రాక్టు కంపెనీకి దక్కాయి. మూడో ప్యాకేజీ మరో కాంట్రాక్టు కంపెనీ దక్కించుకుంది. ఈ రెండు కాంట్రాక్టు కంపెనీలు ఎక్సెస్కే టెండర్లు దాఖలు చేశారని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ పనుల అగ్రిమెంట్లస్థాయిలో టెండరు ప్రక్రియ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సర్వే నిర్వహించి పనులు ప్రారంభించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.ఈ హ్యామ్ విధానం కింద ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల సంఖ్య, మంజూరైన నిధుల్లో సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లా తర్వాత అత్యధికంగా రోడ్లు సంగారెడ్డి జిల్లాలోనే మంజూరయ్యాయి. ఈ రోడ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాక నిర్ణీత సంవత్సరాల వరకు ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టు కంపెనీదే. ఈ సమయంలో ఏమైనా మరమ్మతులు చేపట్టాల్సి వచ్చినా ఈ కంపెనీలే పనులు చేస్తాయి. అయితే జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో చాలా రోడ్లు మోకాళ్లలోతులో గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులు సకాలంలో పూర్తయితే రోడ్ల కష్టాల నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగే అవకాశాలున్నాయి. ఖజానాపై రూ.30 కోట్లకు మించి అదనపు భారం రూ.684 కోట్లతో 21 రోడ్ల అభివృద్ధి పనులు మూడు ప్యాకేజీలుగా విభజించిన ఆర్ అండ్ బీ శాఖ -
జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా నారాయణఖేడ్: కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నుంచి ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.నర్సింహులు మాట్లాడుతూ...ఖేడ్ పరిధిలోని పంచాయతీ కార్మికులకు ఐదు నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉండటంతో వారి కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, రెండు ఫొటోలు తీయాలనే నిబంధనలు తీసుకు రావడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు రూ.26వేల కనీస వేతనంగా చెల్లించాలని, ప్రతీనెల సబ్బులు, సర్ఫ్, పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
వరి నారులో మెలకువలు
హత్నూర(సంగారెడ్డి): ప్రస్తుతం వానాకాలం వరి సాగుకు రైతులు నారు పెంచుతున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నదాతలకు సూచనలు చేశారు. నారు మడి కోసం.. రైతులు మొదట నారు కోసం మడిని బాగా దున్ని, మూడు సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు చేయాలి. రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. వీటితో పాటు పశువుల పేడ కూడా వేయాలి. సేంద్రియ ఎరువు కూడా వేసుకుంటే బాగుంటుంది. విత్తనం చల్లే విధానం.. మొలక కట్టిన విత్తనాన్ని మడిలో చల్లాలి. మొదట పలుచగా నీరు ఉంచాలి. జింకు లోపం సవరణకు లీటరు నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. నాటు వేయడానికి ఎదిగిన నారుకు వారం ముందు గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోరన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి చల్లాలి. 15 రోజుల ముందు దమ్ము చేయాలి. జీవన ఎరువులు అనగా అజోలా 150 కిలోలు, 50 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ పొలంలో వేసి మూడు వారాల పాటు పెరగనిచ్చి నేలలోనే కలియదున్నాలి. ఈ విధంగా చేస్తే ఎకరాకు మూడు టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజనిని అందిస్తుంది. భూసారం పెరిగి దిగుబడులు ఎక్కువగా వస్తాయి. నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు ఒకటి చొప్పున కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. పంటల సాగులో సమస్యలు తలెత్తితే వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్దున్నడం నుంచి సాగు వరకుజాగ్రత్తలు తప్పనిసరి నారు పెంపకంపై రైతులకుపలు సూచనలు -
ఫీజు బకాయిలను చెల్లించాలి
సంగారెడ్డి: విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభూ గౌడ్ మాట్లాడుతూ... తక్షణమే ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడిన రూ.8వేల కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలేజీలు విద్యార్థుల ఫీజు బకాయిలు ఉండటంతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీని వల్ల ఉద్యోగ అవకాశాలు చేజారి పోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, కార్యదర్శి శేఖర్, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, అధికార ప్రతినిధి సాయిలు, కోశాధికారి కె.సుధాకర్ గౌడ్, సలహాదారులు కరణ్, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రవీణ్, గౌలిశ్వర్, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాయి భాష, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు లత, అధికార ప్రతినిధి మంగ గౌడ్, కార్యదర్శి వీరమని, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనూప్ ముదిరాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘంఆధ్వర్యంలో ర్యాలీ విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
పంట మార్పిడి చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పంటమార్పిడి చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో సీఎం రేవంతర్రెడ్డి నిర్వహించిన రైతుభరోసా వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని కౌడిపల్లి రైతువేదికలో అదనపు కలెక్టర్ నగేశ్ వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వానాకాలం పంటలకు సంబంధించి మొదటి విడతగా జిల్లాలో 2.66లక్షల మంది రైతుల ఖాతాల్లో లక్షల రైతు భరోసా నిధులు సీఎం జమ చేశారని చెప్పారు. జిల్లాలో రైతులు ఎక్కువగా వరి పంటను సాగు చేస్తున్నారని, పంటమార్పిడి చేయాలన్నారు. ఆయిల్పాం సాగుతో అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. మూడున్నరేళ్ల నుంచి ముప్పై ఏళ్లవరకు పంట దిగుబడి వస్తుందని చెప్పారు. జొన్న, మొక్కజొన్న, కందులు, కూరగాయల పంటలు సాగుచేయాలన్నారు. అనంతరం విత్తనమేళా సందర్భంగా పలువురు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఏడీఏ పుణ్యవతి, సర్పంచ్లు చంద్రం కృష్ణగౌడ్, ప్రవీణ్ రెడ్డి, రమేశ్, ఏఓ స్వప్న, శ్వేత, ఏఈఓలు సాహితి, స్నేహ, నరేందర్, రైతులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
న్యాయం కోసం నిలదీత
నంగునూరు(సిద్దిపేట): తాము కొనుగోలు చేసిన భూమిని సాదాబైనామా కింద మరొకరి పేరిట బదలాయిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం ఖానాపూర్ రైతులు నంగునూరు తహసీల్దార్ను నిలదీశారు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన కాపీని తహసీల్దార్ లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గుండెల్లి పోషరాములు 26 ఏళ్ల కింద సర్వే నం.170, 63,75,76లో 5.22 గుంటల భూమిని గుండెల్లి మల్లయ్య వద్ద తెల్లకాగితంపై రాసుకొని భూమి కొనుగోలు చేసి కాస్తులో ఉన్నాడు. 2019లో సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకోగా అధికారులు పట్టాపాసు బుక్కులు అందజేశారు. ఇటీవల తన మనవళ్లు గుడికందుల ప్రవీణ్, రవీన్ పేరిట చెరి 2.20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించడంతో వారికి పట్టాపాసు బుక్కులు సైతం వచ్చాయి. కాగా.. గుండెల్లి మల్లయ్య సాదాబైనామా కింద పోషరాములు తనకు భూమిని అమ్మాడని కోర్టులో కేసు వేసి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. విషయం తెలుసుకున్న పోషరాములు, ప్రవీణ్, రవీన్ కోర్టులో సాక్ష్యాలు సమర్పించడంతో డకెట్ ఆర్డర్ వచ్చింది. సదురు కాపీని ప్రజావాణిలో సమర్పించిన బాధితులు నంగునూరు తహసీల్దార్కు సైతం అందజేసి సాదాబైనామాను నిలిపివేయాలని కోరారు. న్యాయం చేయకుంటే చావే శరణ్యం కోర్టు ఉత్తర్వులు అందలేదనే సాకుతో రెవెన్యూ అధికారులు సదరు భూమిని సాదాబైనామా కింద అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు నంగునూరు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. మల్లయ్య వద్ద డబ్బులు తీసుకొని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గడ్డి మందుతో వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అక్కడి నుంచిపంపించారు.సాదాబైనామా నిలిపివేశాం ఖానాపూర్కు చెందిన గుండెల్లి మల్లయ్య సాదాబైనామా కింద అందించిన దరఖాస్తును నిలిపివేశాం. బాధితులు ఫిర్యాదు చేసిన మాట నిజమే. వారు తెచ్చిన కోర్టు ఆర్డర్ కాపీని తీసుకొని విచారించి న్యాయం చేస్తాం. – ప్రవీణ్ రెడ్డి, తహసీల్దార్ గడ్డి మందుతో కార్యాలయంఎదుట నిరసన కోర్టు ఆర్డర్ ధిక్కరించారనిబాధితుల ఆరోపణ -
2న అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
సంగారెడ్డి క్రైమ్: హెచ్సీఏ ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు అండర్–19 క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 2న నిర్వహించనున్నారు. ఉమ్మడి కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ.. గురువారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెస్ క్రికెట్ మైదానంలో సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సెలక్షన్స్ మొదలవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్రికెట్ కిట్టుతో హాజరుకావాలని సూచించారు. డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శేఖర్ దుబ్బాకటౌన్: డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భీమ్ శేఖర్ ఎన్నికైనట్లు జాతీయ కార్యదర్శి శంకర్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో దళిత బహుజన ఫ్రంట్ 11వ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకర్, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ హాజరయ్యారు. అనతంరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన భీమ్ శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో ఏడుగురికి జైలు పటాన్చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించింది. పటాన్చెరు ట్రాఫిక్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం, సోమవారం నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్లో 20 మంది వాహన దారులను పట్టుకున్నారు. వీరిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా రూ.22 వేల జరిమానాతో పాటు అందులో ఏడుగురికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. చోరీ కేసులో..జిన్నారం (పటాన్చెరు): బొల్లారం డివిజన్ పరిధిలో రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నిందితుడికి జిన్నారం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి పి.తేజశ్రీ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు నడికుడి శ్రీకాంత్ గతంలో కూడా పలు ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడి జైలుకెళ్లాడు. కాగా ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించిన ఎస్ఐ పి.కిష్టారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారి సీహెచ్.అశోక్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లతీఫ్ ఉర్ రహమాన్, రాఘవేంద్ర కీలకంగా కృషి చేసినట్లు బొల్లారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. బైక్ చోరీ నిందితుడి అరెస్ట్ జిన్నారం (పటాన్చెరు): వరుసగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన వ్యక్తిని గుమ్మడిదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన రాళ్లబండి మాణిక్య చారి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గుమ్మడిదల, నర్సాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో ఐదు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లు దుకాణం వివాదంపై విచారణ హత్నూర (సంగారెడ్డి): కల్లు దుకాణంపై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేశారు. మండలంలోని బోరుపట్ల గ్రామంలోని కల్లు దుకాణం, పాఠశాలకు సమీపంలో ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారం డీఎల్పీఓ అనిత, ఎకై ్సజ్ జోగిపేట సీఐ సాగర్ రెడ్డి, ఎంఈఓ వెంకట్ నరసింహ గౌడ్, ఎంపీఈఓ యూసుఫ్తో పాటు పలు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ చేసిన నివేదికను కలెక్టర్కు అందజేస్తామని డీఎల్పీఓ తెలిపారు. సర్పంచ్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ తదితరులున్నారు. -
జోరుగా అక్రమ నిర్మాణాలు
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ పరిధిలోని సర్వే నం.79తో పాటు వావిలాల గ్రామ పరిధిలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు పొందకుండా భారీ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని వాపోతున్నారు. కాగా అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతుండటంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, దీంతో అక్రమ నిర్మాణాలు మరింత వేగంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయంటూ నిర్మాణదారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ -
పాముకాటుతో వ్యక్తి మృతి
నారాయణఖేడ్: పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. గంగాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి నారాయణ(40) సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటువేసింది. గమనించిన కుటుంబీకులు ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయాడు. జీవితంపై విరక్తి..గృహిణి బలవన్మరణంవర్గల్(గజ్వేల్): అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది గృహిణి బలవన్మరణం చెందింది. ఈ ఘటన మంగళవారం మండలంలోని వేలూరులో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర్ల భాగ్యమ్మ(48)కు భర్త జంగయ్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరి వివాహాలు అయ్యాయి. కాగా కొంత కాలం నుంచి ఆమె నరాల వ్యాధితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూపించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికదాడి కేసులో రిమాండ్ పటాన్చెరు టౌన్: లైంగికదాడికి పాల్పడిన నిందితున్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. పటాన్చెరు పోలీసుల కథనం ప్రకారం... 2025లో నిందితుడికి వరుసకు మరదలు అయ్యే మహిళను, ఆమె భర్త గురించి అసత్య ప్రచారం చేశాడు. అలాగే నమ్మించి, బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడని రామచంద్రపురానికి చెందిన గుడపాటి పాండురంగారావుపై జూన్ 6న బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిందితుడిని మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించింది. -
వర్షం వస్తే కోళ్ల వ్యర్థాలన్నీ ‘మోయతుమ్మెద’లోకే..
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని ప్రముఖ సింగరాయ లక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రం సమీప జాతర పరిసరాలు, మోయతుమ్మెద వాగు తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకోనుంది. పర్యావరణ, ఇరిగేషన్ నిబంధనలతో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ విధించిన నిబంధనలు బేఖాతరు చేస్తూ జాతర గుట్టకు, వాగుకు అతి సమీపంలో ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ పౌల్ట్రీ ఫారం నిర్మిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని, భక్తుల మనోభావాలను పణంగా పెట్టి నిర్మించడంపై కోహెడ, బస్వాపూర్ పరిసర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తులో షెడ్లు.. పల్లంలో వాగు ఓ సంస్థ నిర్మిస్తున్న భారీ పౌల్ట్రీ షెడ్లు ఎత్తయిన ప్రదేశంలో ఉన్నాయి. దానికి తక్కువ ఎత్తులో మోయతుమ్మెద వాగు ప్రవహిస్తోంది. దీని వల్ల వర్షాకాలంలో కోళ్ల ఫారం నుంచి వెలువడే వ్యర్థాలు, రసాయనాలు వరదతో పల్లపు ప్రాంతమైన వాగులోకి చేరి ప్రాజెక్టులో కలిసే అవకాశం ఉంది. కాగా ప్రాజెక్టు నుంచి పలు గ్రామాలకు తాగు, సాగు నీరు సరఫరా చేస్తున్నారు. పొరపాటున ఆ వ్యర్థాలు ప్రాజెక్టులోకి చేరితే వేలాది మంది ప్రజలు కలుషిత నీటిని తాగి వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. దీంతోపాటు పశుగ్రాసం, పంటలు కూడా విషతుల్యంగా మారే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు గాలికి! నిబంధనల ప్రకారం పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల నుంచి పౌల్ట్రీఫారాలు కనీసం 500 మీటర్ల వెలుపల ఉండాలి. కానీ క్షేత్ర స్థాయిలో జాతర జరిగే గుట్టకు సమీపంలో కనీస నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కళ్ల ముందే పుణ్యక్షేత్రం కనిపిస్తున్నా అధికారులు ఈ దూర ప్రమాణాలను రిపోర్టులో ఎలా దాచారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్త్తున్నారు. పౌల్ట్రీ నిర్మిస్తున్నట్లు తెలియదు సింగరాయ ప్రాజెక్టు సమీపంలో పౌల్ట్రీ ఫారం నిర్మిస్తున్నట్లు సమాచారం లేదు. ఎంత దూరంలో ఉందో ఏఈని అక్కడికి పంపించి వివరాలు తెలుసుకుంటాం. ప్రస్తుతం ఎలాంటి వివరాలు తెలియదు. – రఫీ, ఇరిగేషన్, ఈఈ వాగు ద్వారా ప్రాజెక్టులోకి పలు గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన చోట పరిశ్రమలా? -
అనుమతి లేని వెంచర్పై చర్యలు
కొండాపూర్(సంగారెడ్డి): అనుమతి లేని వెంచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని మల్కాపూర్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్ను పరిశీలించి రెండోసారి నోటీసును అందజేశారు. గతంలో మొదటి నోటీస్ ఇచ్చినప్పటికీ వెంచర్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. తక్షణమే వెంచర్ ముందు భాగంలో నిర్మించిన గేట్ను కూల్చాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. వెంచర్ ఏర్పాటు చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. వెంచర్లో ప్లాటు కొనే వారు సైతం పర్మిషన్ ఉంటేనే కొనుగోలు చేయాలని, అనుమతులు లేని వెంచర్లో స్థలం కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.మల్కాపూర్లో డీపీఓ పర్యటన -
గైర్హాజరైతే చర్యలు తప్పవు
సంగారెడ్డి జోన్: ప్రజావాణి కార్యక్రమానికి ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. కలెక్టర్, అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్, డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలో 75 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గైర్హాజరయిన అధికారులకు షోకాజ్ నోటీసులు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 55 శాతం ఫారాలు పంపిణీ సంగారెడ్డి జోన్: ఎస్ఐఆర్ ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 55 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. జిల్లాలో 100 శాతం ఫారాలు పంపిణీ చేసి, పూర్తిగా నింపిన ఫారాలను సేకరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఓటరు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ప్రజలకు అవసరమైన సహాయం అందించేలా బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, ఆర్డీఓలు రాజేందర్, రమేశ్, వెంకటేశం, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
సమస్యల పరిష్కారానికి చర్యలు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్థానికంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. త్వరితగతిన న్యాయమైన సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు.ఎస్పీ పరితోష్ పంకజ్ -
క్రషింగ్ అనుమానమే!
జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో 2026–27 సీజన్కు సంబంధించి చెరకు క్రషింగ్ అనుమానంగానే ఉంది. అధికార యంత్రాంగం నోట సైతం ఇదే మాటవినిపిస్తోంది. గత యాజమాన్యం బదిలీ అయిందని, క్రషింగ్కు కర్మాగారాన్ని సిద్ధం చేస్తోందని రైతులు ఆశిస్తూ వచ్చారు. తీరా యాజమాన్యం క్రషింగ్ను నిర్వహించే దిశలో ప్రయత్నాలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – జహీరాబాద్ మరో నాలుగు నెలల్లో క్రషింగ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా.. ఇప్పటివరకు ట్రైడెంట్ యాజమాన్యం లైసెన్స్ కోసం దరఖాస్తు చేయలేదని కేన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. లైసెన్స్ కోసం యాజమాన్యం ప్రభుత్వాన్ని సంపద్రించాల్సి ఉంది. ప్రస్తుతం కర్మాగారానికి జోన్ పరిధి లేదు. ట్రయల్రన్కు సంబంధించి ప్రభుత్వానికి రిపోర్టు కూడా సమర్పించలేదని సమాచారం. చెరకు పరిధిని కేటాయించాలని కోరుతూ ముందుకు సైతం రాలేదు. రైతులకు సంబంధించిన సమాచారం సైతం యాజమాన్యం వద్ద లేక పోగా, అగ్రిమెంట్ కోసం రైతులను ఆహ్వానించిన సందర్భాలు సైతం లేవు. దీంతో క్రషింగ్ విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలు ఫ్రీ జోన్ కింద ఉన్నాయి. కర్మాగారంలో క్రషింగ్ చేపడితే రెండు మండలాలను కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మండలాల్లో సుమారు 6 లక్షల టన్నుల మేర చెరకు ఉత్పత్తి కానుందని అంచనా. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో ఇతర కర్మాగారాల కిందకు చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. చెల్లించని సీడీసీ బకాయిలు కర్మాగారం కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీడీసీ)కి చెల్లించాల్సిన బకాయిలను సైతం చెల్లించలేదు. రూ.31.05 లక్షల మేర సీడీసీకి బకాయి పడింది. వీటిపై రూ.2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా కార్మికులకు సైతం వేతన బకాయి పడినట్లు కార్మికులు చెబుతున్నారు.మూడు సీజన్ల పాటు మూత రైతులకు చెరకు బిల్లులు, కార్మికులకు వేతనాల చెల్లింపుల విషయంలో గత యాజమాన్యం జాప్యం చేసింది. కర్మాగారాన్ని నడిపించే విషయంలో యాజమాన్యం వైఫల్యం కావడంతో విధిలేని పరిస్థితుల్లో కర్మాగారం మూత పడింది. దీంతో వరుసగా 2023–24, 2024–25, 2025–26 సీజన్కు గాను క్రషింగ్ కొనసాగలేదు. ఫలితంగా చెరకు రైతులకు సమస్యలు తలెత్తాయి. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరకును పలు కర్మాగారాలకు తరలించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు చక్కెర కర్మాగారాలను తరలించేలా చర్యలు చేపట్టింది. కొందరు రైతులు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలను ఆశ్రయించారు.సమాచారం లేదు క్రషింగ్ చేపడతామని యాజమాన్యం ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. లైసెన్సు కోసం దరఖాస్తు సైతం చేసుకోలేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను మొత్తం చెల్లిస్తే లైసెన్స్ జారీ చేసే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వారం పాటు యాజమాన్యం తీరును పరిశీలిస్తాం. అనంతరం ఆయా కర్మాగారాలకు చెరకును తరలించుకునేందుకు ప్రత్యామ్నాయంగా మండలాలను అలాట్ చేస్తాం. – రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్, సంగారెడ్డిలైసెన్స్ కోసం దరఖాస్తు చేయని ‘ట్రైడెంట్’ చెరకు అగ్రిమెంట్ కోసం ప్రయత్నం శూన్యం యాజమాన్యం తీరుతో రైతుల్లో నైరాశ్యం -
జహీరాబాద్ మీదుగానే బుల్లెట్ రైలు నడపాలి
ప్రధాని నరేంద్ర మోదీకి లింగాయత్ సమాజ్ వినతి జహీరాబాద్ టౌన్: ముంబై–హైదరాబాద్ బుల్లెట్ రైలును జహీరాబాద్ మీదుగానే నడపాలని లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం పంపారు. ఈ విషయాన్ని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఇక్కడ 12 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక నిమ్జ్ ప్రాజెక్టులుస్తున్నాయని, ఈ ప్రాజెక్టుల కోసం ఇక్కడి రైతులు తమ విలువైన భూములను ఇచ్చారు. పుణె నుంచి హైదరాబాద్కు వచ్చే బుల్లెట్ రైలును మొదట జహీరాబాద్ మీదుగానే ప్రతిపాదించారన్నారు. కానీ, ఆ తర్వాత డీపీఆర్ మార్చారన్నారు. ఈ రూట్ను వికారాబాద్కు మళ్లించడంపై లింగాయత్ సమాజ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్ ప్రాంత పారిశ్రామిక ప్రగతిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలును నడపాలని ప్రధాని మోదీని కోరామని చెప్పారు. ఓటరు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే మాణిక్రావుజహీరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు కోరారు. సోమవారం మండలంలోని అల్గోల్ గ్రామంలో సర్ కార్యక్రమ ఓట్ మ్యాపింగ్ను పరిశీలించారు. ఈ మేరకు సర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. బీఎల్ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు సర్ను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించేందుకు బీఎల్ఓలు కృషి చేయాలని, నకిలీ ఓట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తట్టు నారాయణ పాల్గొన్నారు. చేతులెత్తేస్తున్న బీఎల్ఓలు! జోగిపేట(అందోల్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా బీఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్లో ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గురువారం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. అయితే అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 208వ బూత్లో బీఎల్ఓ తాను స్వయంగా ఫారాలు అందజేయాల్సి ఉండగా, రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టేశారు. నాయకులే ఇంటింటికీ ఫారాలు ఇస్తూ వారే భర్తీ చేసేందుకు చొరవ చూపడం విశేషం. ఇటీవల బీఎల్ఓల పాత్రపై ప్రజాప్రతినిధులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ మధుకర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం న్యాల్కల్(జహీరాబాద్): ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సోమేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని హద్నూర్ గ్రామంలో ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన పరికరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగును పెంచేందుకు రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లతో పాటు విత్తనాలను కూడా సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. -
మాటల యుద్ధం!
సంగారెడ్డి: పట్టణంలోని పీఎస్సార్ గార్డెన్లో సోమవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్కు వేదికై ంది. ఒకే వేదికపై ఉన్న బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవడంతో సభ రసాభాసగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలకు పెంపు వంటి వాగ్దానాలు ఏమయ్యాయని నిలదీశారు. అనంతరం ఈ వ్యాఖ్యలకు నిర్మలారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘తవ్వుకుంటూ పోతే మీ పాత చిట్టా బయటపడుతుంది‘ అంటూ పొలిటికల్ పంచ్ వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా.. మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే కాసేపు ఈ ఇద్దరి లీడర్ల సవాల్–ప్రతిసవాల్తో స్థానికంగా రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సంగారెడ్డిలో ’కల్యాణలక్ష్మి’ రసాభాస కాంగ్రెస్పై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శలు నిర్మలారెడ్డి కౌంటర్ -
35 అడుగుల్లోపే విస్తరించాలి
వ్యాపార, నివాసాల యజమానులునారాయణఖేడ్: పట్టణంలో రోడ్డు విస్తరణను 35 అడుగులకు మించి చేయొద్దని, ఆస్తులు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని రహదారికి రెండువైపులా ఉన్న వ్యాపార, నివాసాల యజమానులు తీర్మానించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం వారు సమావేశమయ్యారు. జాతీయ రహదారులశాఖ 100 అడుగులకు మార్కింగ్ వేయగా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ను కలిసి తమ గోడు వివరించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార సముదాయాలు, నివాసాలు కూల్చడం వల్ల 70 భవనాలు, వెయ్యి మంది భారీగా నష్టపోతారన్నారు. రోడ్డుపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, తమ జీవిత కాలం కష్టపడి సంపాదించిన ఇళ్లు, దుకాణాలు కొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని గుర్తించి నష్టం వాటిల్లకుండా చూడాలని, ఆర్థికంగా ఆదుకోలని కోరారు. -
చేనేత పోరు షురూ..
మోగిన ఎన్నికల నగారాజోగిపేట(అందోల్): చేనేత సహకార సంఘాల ఎన్నికల పోరు మొదలైంది. ఇందుకు ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, హన్మంతరావుపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, భవానీ పీఎల్ సంఘం సదాశివపేటకు జూలైలో ఎన్నికలు జరగనున్నాయి. సహకార సంఘాల ఎన్నికలు 2013 ఫిబ్రవరిలో నిర్వహించగా, 2018లో కాలపరిమితి ముగిసింది. ఆ తర్వాత ఎన్నికలు జరగలేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు పాత పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో మొత్తం 17 సార్లు గడువు పొడిగించగా, చివరిగా పదవీకాలాన్ని మరో మూడు నెలలు పెంచారు. రాష్ట్ర చేనేత వస్త్ర పరిశ్రమల కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్ 32(7)(ఏ)(1) ప్రకారం పొడిగించారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 9 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. జాబితా సిద్ధం.. ఇటీవల చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కార్మికుల నుంచి డిమాండ్ రావడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి ఓటరు జాబితాను సిద్ధం చేసింది. చేనేత జౌళీశాఖ కమిషనర్ ఓటరు జాబితా తయారీకి మార్చి 24న ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు జాబితా తయారీ గడువు విధించగా, ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి చేశారు. చనిపోయిన వారు, డిఫాల్టర్లు, (సొసైటీకి నగదు, లేదా వస్తురూపంలో బకాయి ఉంటే) 90 రోజుల కంటే ఎక్కువ బకాయి ఉంటే వారిని డిఫాల్టర్గా పరిగణించి ఓటును తొలగించారు. అలాగే చనిపోయిన వారి పేర్లను కూడా తీసివేశారు. కాగా అర్హులైన వారి ఓటర్లను గుర్తించి జాబితా సిద్ధం చేశారు.జిల్లాలో ఎన్నికలు ఇలా.. జిల్లాలో ఆరు చేనేత సొసైటీలకు జూలైలో ఎన్నికలు జరగనున్నాయి. జూలై 3న భవానీ పీఎల్ సదాశివపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, హన్మంతరావుపేట సొసైటీలకు, 10న జోగిపేట, సదాశివపేట సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జోగిపేట చేనేత సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ను సోమవారం విడుదల చేశారు. 2,3,4 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 5న పరిశీలన, 6న విత్డ్రా అనంతరం ఈనెల 10న పోలింగ్ నిర్వహిస్తారు. సంఘాల్లో అప్పులు లేకుండా ఉన్న సభ్యులకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 13 ఏళ్ల తర్వాత చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుండటంతో నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆరు సంఘాలకు షెడ్యూల్ విడుదల 3న సదాశివపేట, నారాయణఖేడ్, హన్మంతరావుపేటకు.. 10న జోగిపేట సొసైటీకి ఎన్నికలు -
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
డీఈఓ రాజు, ఎమ్మెల్యే సునీతారెడ్డి కొల్చారం(నర్సాపూర్): విద్యలో ప్రతిభ కనబరుస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీఈఓ రాజు, ఎమ్మెల్యే సునీతారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 49 మంది విద్యార్థులకు పాఠశాల ఆధ్వర్యంలో ’ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం’ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన డీఈఓ, ఎమ్మెల్యే.. ప్రతిభ చాటిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి, మెమోంటోలు అందించి అభినందించారు. అనంతరం పాఠశాలకు చెందిన విద్యార్థులు భవ్యశ్రీ రచించిన ‘ఒక కళ కోసం’, కుమ్మరి అక్షయ రచించిన ‘సారె సాక్షిగా ’ పాఠశాల పీడీ శ్రీధర్ రెడ్డి రచించిన ‘ పురాణ కథామృతం’ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ఈ ఏడాది వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో బాలకవులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వర్ణలత, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఎంఈఓ ఉమారాణి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, పాఠశాల చైర్మన్ మాధవి, ఉపసర్పంచ్ సురేష్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాలసిద్దు, పీఆర్టీయూ మండల అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
నర్సాపూర్: మురికి నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేందుకు మురికి కాల్వవలు నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కమిషనర్ సాయికుమార్ తెలిపారు. సోమవారం వారు పట్టణంలోని 6వ వార్డులో పర్యటించారు. ఆదివారం కురిసిన వర్షాలకు వార్డులోని పలు వీధుల్లో వర్షం నీరు నిలిచిపోయిందని, తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వార్డు ప్రజలు వారి దృష్టికి తెచ్చారు. స్పందించిన చైర్పర్సన్, కమిషనర్లు వార్డు అంతటా పర్యటించి నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. వార్డులో అవసరాన్ని బట్టి మురికి కాల్వలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ ఏఈ కృష్ణయ్యను ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ ఏఈ కృష్ణయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి, వార్డు ఆఫీసర్లు ఉదయ్, కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. లైసెన్సు తప్పనిసరి: కమిషనర్ మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వృత్తి, వ్యాపార లైసెన్సు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ సూచించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు ఆన్లైన్ ద్వారా లైసెన్సు పొందాలని, ఇప్పటికే లైసెన్సు ఉన్నవారు సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. లైసెన్సు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. -
బహిరంగ ప్రదేశంలో సర్కారు మాత్రలు
దొబ్బకుంట తండా పంచాయతీ బయట పడి ఉన్న ప్రభుత్వ మందులు, వాటిపై గడువు ముగియని తేదీ.. కొండాపూర్ (సంగారెడ్డి): ప్రభుత్వ మందులు గ్రామపంచాయతీ కార్యాలయం బయట కనిపించడం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. గడువు ముగియని మందులు బహిరంగ ప్రదేశంలో పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ మందులు సాధారణంగా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు ముగిసిన మందులైతే నిర్దిష్ట బయో మెడికల్ వ్యర్థాల నిబంధనల ప్రకారం మాత్రమే నిర్వీర్యం చేయాలి. కానీ మండల పరిధిలోని దొబ్బకుంట తండాలో సర్కారు పంపిణీ చేసే మందులు సోమవారం పంచాయతీ కార్యాలయం బయట దర్శనమిచ్చాయి. సమీపంలోనే అంగన్వాడీ కేంద్రం ఉంది. ఒకవేళ చిన్నారులు ఆ మందులను మింగితే పరిస్థితి ఏంటని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నాలుగు మోటార్లు చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలోని దొంతిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన రైతులు దశరఽథ్రెడ్డి, యాదగిరి, నర్సింహులు, సత్యనారాయణకు సంబంధించి వారి వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన 5 హెచ్పీ మోటార్లను దుండగులు అపహరించారు. ఖరీఫ్ పనులు ప్రారంభ దశలో నీటి అవసరం ఉండగా మోటార్ల చోరీతో సాగుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరెగూడెంలో రెండిళ్లలో.. వెల్దుర్తి(తూప్రాన్): ఇంట్లో దొంగలు పడి నగదు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి భాగ్య ఇంట్లో రూ.10 వేలు నగదు, 5 తులాల వెండి, మాసం బంగారు ముక్కెర, ఏర్పుల నవీన్ ఇంట్లో బంగారు పుస్తె, వెండి కడియాలు, వెండి గాజులు, పట్టగొలుసులను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు. -
ప్రభుత్వ హామీ ప్రకారం భృతి పెంచాలి
మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్పార్టీ ఎన్నికల హామీ ప్రకారం బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి పెంచి అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మెదక్ సమీకృత కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ పెద్ద ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితంగా జీఎస్టీ పేరుతో పన్నులు పెంచడం, పుర్రెగుర్తు సైజు పంచడంపై బీడీ పరిశ్రమ దెబ్బ తింటుందన్నారు. బీడీ కార్మికులకు షరతులు లేని జీవన భృతిగా రూ.4016 అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేస్తున్న ఠాకూర్, ఉత్తమ్ బీడీ యాజమాన్యాలపై చర్య తీసుకోవాని కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలమణి, మంజుల, సీఐటీయూ నాయకులు సంతోష్, బీడీ కార్మికులు పాల్గొన్నారు. -
మైనింగ్ లారీలను తిరగనివ్వం
అడ్డుకున్న గ్రామస్తులు రేగోడ్(మెదక్): మైనింగ్ లారీలను తిరగనివ్వమని, విచారణ చేయాలని గ్రామస్తులు పలుగు రాయితో వెళ్తున్న లారీని అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అధిక లోడ్తో పలుగు రాయితో లారీలు వెళ్లడం వల్ల రోడ్లు, దుమ్ము, ధూళితో పంటలు పాడవుతున్నాయని తెలిపారు. తిమ్మాపూర్ గుట్టపై తెల్ల పలుగు రాయి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారని తెలిపారు. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా అనుమతులు ఉన్నాయని, నిబంధనల ప్రకారమే పలుగు రాయిని తరలిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. -
ఆదాయానికి పట్టు
పెంపకంపై రైతుల ఆసక్తి ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టు పురుగుల పెంపకంతో ప్రతి నెలా ఆదాయం వస్తుందని రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో మల్బరి సాగు పెరుగుతుండటంతో పట్టు ఉత్పత్తి కూడా అధికమవుతోంది. కాగా వర్షాలు సక్రమంగా పడకపోవడంతో, సాగు నీటి ఇబ్బందుల దృష్ట్యా సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వాణిజ్య పంటల వైపునకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఉద్యాన వన పంటలైన కూరగాయలు, మల్బరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. 1294 ఎకరాల్లో మల్బరి.. సిద్దిపేట జిల్లాలో 2024లో 988 ఎకరాలు సాగులో ఉన్న మల్బరి, 2025లో 1124 ఎకరాలకు, ఈ సంవత్సరం 1294 ఎకరాల్లో సాగవుతుంది. ఈ సాగు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మల్బరి ఆకులతో పట్టు పురుగులను పెంచి వాటి నుంచి వచ్చే పట్టుగూళ్లను విక్రయిస్తారు. జిల్లాలో ప్రతి నెల 25 టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని విక్రయించేందుకు జనగామ జిల్లా కేంద్రం, తిరుమలగిరిలో కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకెళ్తున్నారు. కిలో పట్టు గూళ్లకు రూ.700 వరకు మద్దతు ధర పలుకుతుంది. కాగా విక్రయించిన మూడు రోజుల్లోనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రాయితీలు కేంద్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు పట్టు రైతులకు సబ్సిడీలు అందిస్తుంది. నీటి సౌకర్యానికి సాధారణ రైతులకు రూ.50వేలు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 65వేలు రాయితీ ఇస్తోంది. పట్టు పురుగుల షెడ్డుకు సాధారణ రైతులకు రూ.2.25లక్షలు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.2,92,500, పరికరాలకు సాధారణ రైతులకు రూ.37,500, ఎస్సీ,ఎస్టీ రైతులకు రూ.48,750 అందిస్తుంది. కిసాన్ నర్సరీకి సాధారణ రైతులకు రూ.75వేలు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.97,500 రాయితీ ఇస్తోంది.సంవత్సరం మల్బరి సాగు విస్తీర్ణం 2024 9882025 11242026 1294 జిల్లాలో 1294 ఎకరాల్లో మల్బరి సాగు నెలకు 25 టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయం -
పాముకాటుతో మహిళ మృతి
హత్నూర(సంగారెడ్డి): పాము కాటు వేయడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... తెల్లరాళ్ల తండాకు చెందిన మాదావత్ కవిత (38) తన వ్యవసాయ పొలంలో వరితూకం వద్ద పనిచేస్తుండగా ఒక్కసారిగా పాము కాటు వేసింది. దీంతో వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్తతోపాటు పిల్లలున్నారు. వ్యవసాయ పనులు చేసుకొనే కుటుంబంలో పాముకాటుతో మహిళ మృతి చెందడంతో ఆమె పిల్లల పరిస్థితి ఏంటని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తి బైండోవర్ మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామానికి చెందిన సంకోజు శ్రీశైలంను తహసీల్దార్ ఏజీ రహీం ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆసీఫ్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వాట్సాప్లలో పోస్టులు పెడు తూ గ్రామంలో ప్రజా ప్రశాంతతకు విఘాతం కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో మంచి ప్రవర్తన కల్గి ఉండాలని ,ప్రజా ప్రశాంతతకు భంగం కల్గించే చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు బైండోవర్ చేసినట్లు చెప్పారు. -
ఉలిక్కిపడిన దుబ్బాక
దుబ్బాక: దుబ్బాక పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారస్తుడు చింత రాజ్కుమార్ కుటుంబంతో 9 రోజుల క్రితం కాశీయాత్రకు వెళ్లారు. ఇటీవల రాజ్కుమార్ కొత్తగా బిల్డింగ్ నిర్మించుకొని అందులో ప్రత్యేకంగా లాకర్ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. కాశీయాత్రకు వెళ్లేముందు ఇంట్లోని 1.5 కిలోల బంగారు నగలు, 8 కిలోల వెండి, రూ.8 లక్షల నగదును లాకర్లో భద్రపరిచాడు. గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడి లాకర్ను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. పక్కా ప్లాన్తోనే.. దుండగులు పక్కా ప్లాన్తోనే చోరీకి పాల్పడ్డట్లు సంఘటన తీరుతెన్నులను చూస్తే అర్థం అవుతుంది. రాజ్కుమార్ కుటుంబం కాశీయాత్రకు వెళ్లడం నుంచి లాకర్లో పెద్ద ఎత్తున బంగారం, నగదు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి వెనుక వైపు నుంచి కిటికీ ఇనుప చువ్వలను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. లాకర్ను ధ్వంసం చేసి పెద్ద ఎత్తున దోచుకెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. ఇదంతా ఆ ఇంటి గురించి అన్నీ తెలిసి ఉన్నవారి పనేనా? లేక వారిచ్చిన సమాచారంతో చోరీల్లో ఆరితేరిన వారు చేసిన పనిలాగా తెలుస్తుంది. సీసీ ఫుటేజీ హార్డ్డిస్క్ సైతం.. దుండగులు సీసీ ఫుటేజీ హార్డ్డిస్క్ను సైతం ఎత్తుకెళ్లడం శోచనీయం. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ లేకుండా హార్డ్డిస్క్ను తీసుకపోవడంతో పాటు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా పలు జాగ్రత్తలు వహించడం చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్ దొంగల పనేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబీకులు వస్తే గాని.. కాశీకి వెళ్లిన బాధిత కుటుంబం వస్తేగాని ఎంత చోరీ అయిందన్న విషయంతో పాటు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశాలున్నాయి. బాధిత కుటుంబం అర్ధరాత్రి వరకు ఇంటికి చేరుకోనున్నట్లు తెలిసింది. వరుస చోరీలతో భయాందోళన.. దుబ్బాకలో భారీ చోరీ ఘటనే కాకుండా కొన్ని రోజులుగా హుస్నాబాద్, కొమురవెళ్లి, చేర్యాల ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు సైతం ఉన్నాయి. తాజాగా దుబ్బాకలో జరిగిన భారీ చోరీ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కిలోన్నర బంగారు నగలు, వెండి,భారీ నగదు అపహరణ సీసీ ఫుటేజీలోని హార్డ్డిస్క్నుతీసుకెళ్లిన దుండగులు కాశీయాత్రకు వెళ్లిన బాధిత కుటుంబం సీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలోకేసు దర్యాప్తుక్లూస్టీం తనిఖీలు భారీ చోరీ ఘటనతో సీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా క్లూస్టీంలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్స్క్వాడ్లతో ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను గాలించారు. డాగ్ స్క్వాడ్ ఇంటి నుంచి దుంపలపల్లి రోడ్డు వరకు కొంత దూరం వెళ్లి ఆగిపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అన్వేషిస్తున్నారు.పూర్తిస్థాయిలో దర్యాప్తు: సీపీ చోరీ ఘటనపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు క్లూస్టీంలు, డాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులకు పట్టుకుంటామని చెప్పారు.భారీ చోరీతో భయాందోళనలో ప్రజలు -
ఎస్ఐఆర్కు సహకరించాలి
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ సిద్దిపేటరూరల్: ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం భారత ఎన్నికల సంఘం నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే కచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తిచేసి అధికారులకు అందించాలన్నారు. ప్రతి ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ, ప్రతి ఎన్యూమరేషన్ ఫారంపై సంబంధిత ఓటరు సంతకం ఉండేలా బూత్ స్థాయి అధికారులు నిర్ధారించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.నాగరాజమ్మ, అదనపు కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.ఉత్తమ ఉపాధ్యాయులకు దరఖాస్తులుప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలోని జెడ్పీ, ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయుల నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు జూలై 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారంలను జూలై 13 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలన్నారు. ప్రభుత్వ విత్తనాలనే సాగు చేయాలి దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ రైతు వేదికలో సోమవారం వరి సన్న విత్తనాల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఎఫ్పీఓ చైర్మన్ రంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందించే వరి విత్తనాలనే వాడాలని తెలిపారు. ఏడు రకాల సన్న వడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, కేఎన్ఎం–1638, జై శ్రీరామ్ –హెచ్ఎంటి సోనా, వరంగల్–44, కేఎన్ఎం–7715, ఎంటీటూ–1010, జేజీఎల్–24423, కేఎన్ఎం–118లను సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రేణుక రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ఆఫీసులో నగదు చోరీ గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు నర్సాపూర్: ప్రైవేట్ ఆఫీసులో చోరీ జరిగింది. ఈ ఘటన నర్సాపూర్లో చోటు చేసుకుంది. సీఐ రంగకృష్ణ కథనం ప్రకారం... మెదక్కు చెందిన మేడి శ్రీధర్ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్లో క్యాషియర్గా పని చేస్తూ నర్సాపూర్ ప్రాంతంలోని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేషియో, షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ సంస్థల నుంచి రోజూ వారి నగదును సేకరించే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా ఈనెల 26నుంచి 28 వరకు సెలవులు ఉండటంతో ఆ సంస్థల కార్యాలయాల్లో నగదు ఉందని, దానిని ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. ఈ క్రమంలో టిఫిన్ సెంటరు నిర్వహించే తన బంధువు రవితో కలిసి చోరీకి కుట్ర చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరూ నర్సాపూర్ వచ్చి కార్యాలయం వెనుక తలుపులను తెరిచి లోపల ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఆఫీసులో ఉన్న రూ. 2లక్షల 66వేల 850 , సీసీ టీవీ డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. కాగా సోమవారం పట్టణంలో పోలీసులు చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కన్పించిన టీవీఎస్ స్కూటీని ఆపి తనిఖీ చేయగా అందులో నగదుతోపాటు డీవీఆర్ లభించాయి. కాగా నగదుతో పాటు సీసీటీవీ డీవీఆర్, చోరీకి వినియోగించిన స్కూటీని స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేశారు. కాగా చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును చేధించిన పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు. బార్బర్ ఆత్మహత్య దుబ్బాకటౌన్: సెలూన్ దుకాణంలో బార్బర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం... పట్టణంలోని లచ్చపేట 11వ వార్డుకు చెందిన మిరుదొడ్డి స్వామి (42) దుబ్బాక బస్టాండ్ సమీపంలో హెయిర్ సెలూన్ దుకాణం నిర్వహిస్తూ, భార్య రజిత, కుమారుడు సహాస్తో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం స్వామి దుకాణం లోపల షట్టర్ కిందికి వేసి, తాడుతో ఉరివేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత అందులో పని చేసే వ్యక్తి వచ్చి షట్టర్ పైకి లేపి చూడగా స్వామి మృతదేహం కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కడుపునొప్పి భరించలేక..తూప్రాన్: కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న ఉప్పు వీరమ్మ(72) కొలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుంది. మృతురాలి కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
సిగాచీ.. బాధితులకు దిక్కేది?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ అగ్నిప్రమాద ఘటనకు నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది ప్రాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి కూడా ప్రకటన చేశారు. అయితే ఈ ఘటన జరిగిన ఏడాది పూర్తవుతున్నా ఈ హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ పరిశ్రమలో 2025 జూన్ 30న జరిగిన ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది కాలి బూడిదైన విషయం విదితమే. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నిరుపేద కార్మికులే కావడం గమనార్హం. నెలల తరబడి జాప్యం 54 మంది బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేవలం రూ.24.51 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి సగటున రూ.45 లక్షల మేరకే పరిహారం అందింది. మిగిలిన రూ. 55 లక్షల పరిహారాన్ని చెల్లించడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. పరిహారం కోసం బాధిత కుటుంబాల తరపున రాష్ట్ర ఉన్నత న్యాయస్థాయంలో పిల్ కూడా దాఖలైంది. బాధిత కుటుంబాలు పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేయడంతోపాటు కలెక్టరేట్ ఎదుట నిరసన కూడా తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో క్షతగాత్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏడాది కాలంగా ఇంటివద్దనే చికిత్సలు తీసుకుంటున్నారు. అయినా వారు పూర్తి స్థాయిలో కోలుకోలేకపోతున్నారు. కాలిన గాయాలు కొంత మేరకు మానినా.. తమ సొంత పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారిందని, పనులు చేసుకునేందుకు శరీరం సహకరించడం లేదని బాధితులు వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను పరిహారం కింద చూపుతున్నారు సిగాచీ ప్రమాదంలో నా భర్త బాలకృష్ణ మృతి చెందారు. ఇస్తామన్న పరిహారం కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాం. రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. నా భర్త పొదుపు చేసుకున్న ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను కూడా నష్ట పరిహారం కింద చూపుతున్నారు. ఇద్దరు పిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. వెంటనే ఇస్తామన్న రూ.కోటి పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – మల్లేశ్వరి, ముత్తంగి.వెంటనే చెల్లించాలి సిగాచీ ప్రమాదం మా కుటుంబాన్ని కష్టాల పాలు జేసింది. ఈ ప్రమాదంలో నా భర్త వీ.ఆర్.జీ. నాగేశ్వర్రావు మరణించారు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. ప్రైవేటు టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పరిహారం రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. మిగిలిన పరిహారం మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. –హేమలత, పటాన్చెరుఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను. కాళ్లు, చేతులకు అయిన గాయాలతో పనిచేయలేకపోతున్నాను. సొంత పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇస్తామన్న హామీ మేరకు పరిహారం చెల్లించడంతోపాటు పూర్తి స్థాయి లో చికిత్స చేయించి ఆదుకోవాలి. – రాజేశ్కుమార్ చౌదరి, క్షతగాత్రుడు. -
ఏరువాక సందడి
నారాయణఖేడ్: రైతులు వ్యవసాయ పనులను సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి, పంటలు బాగుండాలని కోరుకుంటారు. అయితే వ్యవసాయ పనుల కోసం పశుసంపదను సన్నద్ధం చేయడంలో భాగంగా రైతులు ఎద్దులపై రంగురంగుల వస్త్రాలు కప్పి, కొమ్ములకు రంగులు వేసి బెలూన్లతో అలంకరించి హనుమాన్ ఆలయాల చుట్టూ వాటితో ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీ. ఖేడ్ నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. కాగా ఎద్దులను అలంకరించే సామగ్రికి సంబంధించిన దుకాణాలు ఆదివారం రైతులతో కిటకిటలాడాయి. -
కారు అదుపుతప్పి.. కల్వర్టును ఢీకొట్టి
ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం సిద్దిపేటరూరల్: అతివేగంగా కారు నడిపి కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన అక్కగారి సాయి భార్యాపిల్లలతో కలిసి దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం సిద్దిపేటలో పని ఉందని చెప్పిన సాయి తన కొడుకుతో కలిసి కారులో వస్తున్నాడు. ఇర్కోడ్ గ్రామ శివారు వద్దకు రాగానే సాయి అతివేఽగంగా అజాగ్రత్తతో కారును నడిపి కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న సాయి(26)తో పాటు కుమారుడు హర్షవర్ధన్(5) అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బైక్ అదుపుతప్పి.. యువకుడి మృతి
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బందారం గ్రామానికి చెందిన నీల అనిల్(24) సిద్దిపేటలోని కార్ల విక్రయ షోరూంలో పని చేస్తున్నాడు. ఈనెల 26న మొహర్రం పండుగ నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై మర్పడ్గ మధిర నాగిరెడ్డిపల్లిలోని అక్క ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి సిద్దిపేటకు వెళ్తుండగా మర్పడ్గ శివారులో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం అటుగా వెళ్తున్న వారు చూసి కుటుంబీకులకు సమాచారం అందించి, అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతునికి సుమారు 45 రోజుల కిందట వివాహమైంది. మృతదేహం వద్ద కుటుంబీకులు, బంధువులు బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ ఎస్సై మల్లేశం తెలిపారు. -
కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
పటాన్చెరు టౌన్: విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ... నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని, దీంతో 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మూడేళ్లలో వరుసగా పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, యువరాజ్ , సాయిలు ముదిరాజ్, అక్షిత్, శ్రీనివాస్, రతన్ సింగ్, మల్లేశ్, అంజయ్య, రాజు సింగ్ పాల్గొన్నారు. -
సీలింగ్ భూములు ప్రజలకే చెందాలి
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని పీపుల్స్ వార్ అమరుల స్థూపానికి సంబంధించిన సీలింగ్ భూములు ప్రజలకే చెందాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అమరుల స్తూపాన్ని జేఏసీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... పట్టణంలో నిర్మించిన అమరువీరుల స్తూపం ఆసియా ఖండంలోనే అతి పెద్దదన్నారు. స్తూపాన్ని కూల్చారని, దీనికి చెందిన 4 ఎకరాల భూమి రిటైర్డ్ డీఎస్పీ రామచంద్రారెడ్డి పట్టా భూమి కాదని, సీలింగ్ భూములని తెలిపారు. ఆయన హైకోర్టుకు వెళ్లినా ఈ భూములు కాశతురుక, ఎస్సీల భూములని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ భూముల్లో రామచంద్రారెడ్డి కుమారుడు భవనం నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ భూముల వ్యవహారం ఆగాలంటే ఆందోళన కార్యక్రమాలే శరణ్యమన్నారు. భూములు కాపాడుతానని పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చారని, ఆయన మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీపీఐ నాయకులు సత్యనారాయణ, మల్లేశ్ , అశోక్ తదితరులు ఉన్నారు.మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి -
యోగా ఇన్స్ట్రక్టర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సురేశ్
సిద్దిపేటరూరల్: హైదరాబాదు నేతాజీ స్కూల్ వారాసిగూడలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సిద్దిపేట జిల్లాకు చెందిన పల్లె సురేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన చిన్నగుండవెల్లి కేంద్రంలో ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్ ఎన్నికపై జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్, వ్యాస మహర్షి యోగా సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, భారత స్వాభిమాన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాములు, పతంజలి యోగా సమితి చీఫ్ పాటర్న్ అంజయ్య, యోగా అసోసియేషన్ బృందం సతీశ్, సంధ్య, ప్రభాకర్, రాజ్కుమార్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. -
పేదల సొంతింటి కల సాకారం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిమర్కూక్(గజ్వేల్): పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళా సాధికారతకు సీఎం పెద్దపీట వేశారన్నారు. మహిళల చేతుల్లోనే కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని, ప్రభుత్వ పథకాలు వారి పేరు మీదనే అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు భాస్కర్, నర్సింహులు, ఆత్మ కమిటీ ములుగు డివిజన్ చైర్మన్ కనకయ్య, డైరెక్టర్ వెంకటేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కొండాపూర్(సంగారెడ్డి): గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని తేర్పోల్లో రూ.8 లక్షలతో ఎన్ఆర్ఈజీఎస్ పనులతో నిర్మించనున్న ఓపెన్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్ సతీశ్ సన్మానించారు. చెర్ల గోపులారంలో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారులకు చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, మోహన్ గౌడ్, మల్లేశం, శేఖర్, మన్సూర్, సర్పంచ్ రామ్ చందర్, మోహన్, కృష్ణ, మాజీ సర్పంచ్ ప్రకాశ్, మాజీ ఎంపీటీసీ అనంత రాములు గౌడ్, పాల్గొన్నారు. -
పోలియో కార్యక్రమంపై ఆరా
పర్యవేక్షించిన స్టేట్ హెల్త్ జాయింట్ డైరెక్టర్హవేళిఘణాపూర్(మెదక్): పలు మండలాల పరిధిలో నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమాన్ని ఆదివారం హెల్త్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ అరుణ్ పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు. హవేళిఘణాపూర్ మండలంలోని కూచన్పల్లి, మెదక్ మండలంలోని రాజ్పల్లి, మెదక్ పట్టణంలో పల్స్పోలియో కేంద్రాలను ఆయన సందర్శించారు. ఎంత మంది సిబ్బందిని నియమించారు? ఎంత మందికి చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేశారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందనే విషయాన్ని వైద్యాధికారులు, సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్ధన పీహెచ్సీ డాక్టర్ వినయ్సుశీల్, కృష్ణ, సిద్దిరాములు, రమేశ్ ఉన్నారు. -
హైనా దాడిలో లేగదూడ మృతి
నర్సాపూర్ రూరల్: లేగదూడపై హైనా దాడి చేసి చంపింది. ఈ సంఘటన మండలంలోని నత్నయపల్లిలో ఆదివారం వేకువ జామున చోటు చేసుకుంది. స్థానికులు, అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఉషన్నగారి శ్రీనివాస్ లేగ దూడపై హైనా దాడి చేయగా మృతి చెందింది. పదేళ్ల క్రితం నత్నయపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుతలు సంచరించి పశువులపై దాడి చేశాయి. కాగా ఆదివారం లేగ దూడ మృతి చెందడంతో తిరిగి చిరుతలు వచ్చినట్లు భావించి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ క్షేత్రాధికారి దివ్య, సాయికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దర్యాప్తులో చిరుత కాదని హైనా తేల్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నర్సాపూర్ రూరల్: పిడుగుపాటుతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని తిరుమలాపూర్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన విఠల సరిత(40), ఆమె కుమారుడు శ్రావణ్ను వెంటపెట్టుకొని పశువులను మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో చెరువు వద్దకు రాగానే ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో సరిత అక్కడికక్కడే మృతి చెందగా, శ్రవణ్కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పారిశ్రామికవాడలోని రోడ్లను ఆక్రమిస్తూ పరిశ్రమల వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్రమ పార్కింగ్పై స్థానికులు ఇప్పటికే మున్సిపల్ అధికారుల దృష్టికి పలుసార్లు తీసుకెళ్లారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ పార్కింగ్ వల్ల గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జహీరాబాద్: అజ్మీర్ షరీఫ్ దర్గా సజ్జాదా నషీన్, అఖిల భారత సూఫీ సజ్జాదానషీన్ కౌన్సిల్ చైర్మన్ హజ్రత్ సయ్యద్ నసీరుద్దీన్ చిస్తీ జహీరాబాద్కు వచ్చిన సందర్భంగా సత్కరించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తూ జహీరాబాద్లోని ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్ ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, మున్సిపల్ చైర్మన్ యూనూస్, ముస్లిం నేతలు సత్కరించారు. కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. శివంపేట (నర్సాపూర్): పేకాట రాయుళ్లను ఆదివారం మెదక్ సీసీఎస్, స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం... మండల పరిధిలోని కొత్తపేట గ్రామ శివారు నిర్మాణంలో ఉన్న ఇంట్లో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 22,930 నగదు, 5 ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా... ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అతి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
చేర్యాల(సిద్దిపేట): అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పట్టణ కేంద్రానికి చెందిన బస్వరాజు రాజయ్య(70) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పనులు చేయవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆదివారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అపూర్వరెడ్డి తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు.. న్యాల్కల్(జహీరాబాద్): అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని రేజింతల్ గ్రామంలో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పొట్పల్లి పాండు(25) శనివారం మొహర్రం పండుగ సందర్భంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పాండుకు ఫోన్ చేయగా కాశీంపూర్కు వచ్చానని, ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు. ఆదివారం ఉదయం ఆయన తల్లి పొలానికి వెళ్లగా అక్కడ పాండు చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తల్లి బిచ్చమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భగీరథ పైపులైన్ లీకేజీ..
కౌడిపల్లి(నర్సాపూర్): మిషన్ భగీరథ పైపులైన్ లీకై నీరు వృథాగా పోతుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కూకుట్లపల్లి గ్రామానికి మిషన్ భగీరథ సరఫరా అయ్యే పైపులైన్ పెద్దచెరువు కట్ట సమీపంలో ప్రాథమిక పాఠశాల వద్దగల కట్వాల్ వద్ద నాలుగురోజులుగా లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతుంది. దీంతో రక్షిత మంచినీటి ట్యాంకుకు నీరు రాకపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. -
పిడుగుల కాలం జాగ్రత్త
● అప్రమత్తంగా ఉండాలి ● హెచ్చరిస్తున్న దామిని యాప్ సదాశివపేట(సంగారెడ్డి): వానాకాలంలో పిడుగులతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పిడుగుపాటుకు జిల్లాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే ఉరుములు, మెరుపులతో కురిసే వర్షం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. రైతులు కూలీలు, పశువుల కాపరులను పిడుగుల రూపంలో మృత్యువు బలి తీసుకుంటుంది. పిడుగుపాటుకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దామిని అలర్ట్తో సురక్షిత ప్రదేశానికి.. పిడుగులతో ఏటా పదుల సంఖ్యలో ప్రజలు, వందల సంఖ్యలో పశుసంపదకు ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకునేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటియోరాలజీ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా దామిని యాప్ను అందుబాటులోకి తెచ్చాయి. ఇది 500 మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంలో పిడుగులు పడే పరిధిని గుర్తించి జీపీఎస్ నోటిఫికేషన్ ద్వారా హెచ్చరిస్తుంది. దీంతో పిడుగులు పడే ప్రాంతానికి దూరంగా వెళ్లి ప్రాణ ఆస్తి నష్టం నుంచి రక్షణ పొందవచ్చు. ప్రాణాలు కోల్పోతున్న.. మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట అనిల్ తన మేనల్లుడు సిద్ధార్థ్తో కలిసి ఇశ్రీతాబాద్ గ్రామశివారులో పశువులు మేపుతున్నాడు. శుక్రవారం ఉరుములు, మెరుపులు భారీ శబ్దాలతో పిడుగుపడి అనిల్ ప్రాణాలు కోల్పోగా సిద్దార్థ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనే కాదు ఏటా వానాకాలంతో పాటు ఇతర సమయాల్లో పిడుగుపాటుకు మనుషులే కాకుండా ఇటు పశువులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలి ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో బయట ప్రాంతాల్లో ఉన్నవారు ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లి మోకాళ్లపై చేతులు తలపెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. ఎత్తయిన చెట్లు టవర్ల కిందకు వెళ్లకూడదు. చెట్లు పిడుగులను ఆకర్షించుకుంటాయి. ఇనుప గొడుగులు వేసుకుని బయటకు వెళ్లరాదు. ఫోన్లు, ఎఫ్ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించరాదు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయాల్లో పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూలీలు, పశువుల కాపర్లు బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు ముందుగానే భూమి పొడిగా ఉండే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భారత వాతావరణ శాఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియాలజీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంయుక్తంగా వర్షంపై ముందస్తు సమాచారం తెలియజేసేందుకు మేఘ్దూత్ యాప్ను రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి మొబైల్ నంబరు, రాష్ట్రం, జిల్లా మండలం పంచాయతీ వివరాలు నమోదు చేసి లాగిన్ అవడంతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వర్షం ఉష్ణోగ్రత గాలి వేగం, గాలిదిశ, గాలిలో తేమశాతం తదితర వివరాలను ముందుగానే తెలుసుకోవచ్చు. -
టేకూర్లో పీర్ల సందడి
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని టేకూర్ గ్రామంలో మొహర్రం సందర్భంగా నిర్వహించే పీర్ల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. శనివారం వివిధ ప్రాంతాల నుంచి దూదిపీర్లతో ప్రజలు వేలాదిగా తరలి వచ్చి మైబుసుభాని దర్గాను దర్శించుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గుట్ట సమీపంలో గల నబీసాబ్ సమాధిని కూడా దర్శించుకున్నారు. నృత్యాలు చేస్తూ గ్రామ ప్రధాన కూడలి వద్దకు చేరుకుని అక్కడ ఆశుర్ఖానా వద్ద ఉంచిన దూదిపీర్లను ప్రజలు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు ప్రజలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడలి వద్ద ప్రజలు ఆడిన రుమాళ్లట ఎంతగానో ఆకట్టుకుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు భాస్కర్రెడ్డి దర్గాను దర్శించుకుని దట్టీలు సమర్పించారు. ఆయన వెంట న్యాల్కల్ పీఏసీఎస్ చైర్మెన్ సిద్దిలింగయ్యస్వామి, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, అశ్విన్ పాటిల్, రమేశ్, సుధాకర్తోపాటు నాయకులు నగేష్, కాశీనాథ్ తదితరులున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హద్నూర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపరచండి
నారాయణఖేడ్: ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషిచే యాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు కేవలం 250 మంది విద్యార్థులే ఉండగా ఈసారి 25 మంది మాత్రమే అడ్మిషన్లు పొందడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫలితాలను పరిశీలించి విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు ఎందుకు తక్కువగా వస్తున్నాయని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెడుతూ నిత్యం గంట అదనంగా పనిచేస్తూ స్టడీఅవర్ నిర్వహించాలని సూచించారు. మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఖేడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అవెంట్ డిజిటల్ సంస్థ సౌజన్యంతో 10 ల్యాప్టాప్లను, లయన్స్క్లబ్ హైదరాబాద్ సౌత్ ఆధ్వర్యంలో 200 భోజనం ప్లేట్లు, నోట్బుక్స్ను పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. స్వచ్చంద, కార్పొరేట్ సంస్థలు ఖేడ్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు. -
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వం పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో టీజీఐఐసీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.5.40 కోట్లు అందాయి. నిధులతో ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో రూ.4కోట్లు వెచ్చించి హాస్టల్ నిర్మించనున్నారు. రూ.75 లక్షలతో బాలికల జూనియర్ కాలేజీలో ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణం కోసం రూ.75 లక్షలు వెచ్చించనున్నారు. తారా డిగ్రీ కళాశాలలో ప్రహరీ నిర్మాణం కోసం ఇందులో నుంచి రూ.50లక్షలు కేటాయించారు. ఈ పనులకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఓటరు ప్రక్రియను సద్వినియోగం చేసుకోండిఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం నారాయణఖేడ్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఖేడ్ నియోజకవర్గ సర్ ఇన్చార్జి ఫహీం సూచించారు. ఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ అర్హుడైన ఓటరును జాబితాలో చేర్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 2004 తర్వాత జన్మించి ఇప్పటివరకు నమోదు కానివారు, 18 సంవత్సరాలు పైబడిన వారు తమ తల్లిదండ్రుల గుర్తింపుతోపాటు విద్యార్హత ధ్రువపత్రం, లేదా 12 రకాల ధ్రువపత్రాలలో ఏదో ఒక ధ్రువపత్రంతో నమోదు చేసుకుంటే మూడవ కేటగిరీలో నమోదవుతారని చెప్పారు. ప్రస్తుతం ఓట్ చోరీ జరుగుతున్నందున సర్ పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ వివరాలతో దరఖాస్తులు అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్్ దారం శంకర్, కాంగ్రెస్ నాయకులు వినోద్పాటిల్, సుబుర్ ఉన్నారు. పాఠశాలలో మౌలిక వసతులుఅదనపు కలెక్టర్ పాండుకు బీఆర్ఎస్వీ వినతి సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని శనివారం హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు బీఆర్ఎస్వీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ... ఈనెల 15వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులైన మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్మాణం, పాఠశాలకు ప్రహరీగోడ వంటివి ఏర్పాట్లు చేయాలని కోరారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల కుదింపును ఆపాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు రఘు, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే రోడ్డు విస్తరణ పనులునారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే రోడ్డు విస్తరణ చేపట్టాలని ఖేడ్ పట్టణ ఏఐఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మొహిద్పటేల్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణతో నష్టపోయే బాధితులు పరిష్కారం కోసం ఎంపీ, ఎమ్మెల్యేను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఒకరిపై ఒకరు బాధ్యతలను నెట్టుకుంటున్నారన్నారు. ఏళ్ల తరబడి బైపాస్ రోడ్లను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల మేర విస్తరణ పేరిట ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. బైపాస్ రోడ్లను అభివృద్ధిచేసి 161బీ జాతీయ రహదారి విస్తరణ పూర్తిచేస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ అంశాలన్నీ త్వరలోనే తమ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. -
నేడు పల్స్ పోలియో
సంగారెడ్డి జోన్: పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఐదేళ్ల లోపు ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు చిన్నారులకు చుక్కలు వేయనున్నారు. మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో వేస్తారు. మిగతా రెండు రోజులు వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, పట్టణ బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లో మిగిలిపోయిన చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి వేస్తారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. 1,80,405 మంది చిన్నారులు. 1,137 కేంద్రాలు జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల లోపు ఉన్న 1,80,405 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ మేరకు 1137 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,583 మంది ఏఎన్ఎంలు, 904 ఆశ కార్యకర్తలు, 1,505 అంగన్వాడీ కార్యకర్తలు, 625 ఇతర వలంటీర్లు, ఆరుగురు ప్రోగ్రామ్ అధికారులు పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేస్తారు. మొదటి రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ కేంద్రాలు, ఆర్టీసీ బస్టాండ్లు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నారు. ప్రతీ చిన్నారికి రెండు చుక్కలు ఐదేళ్లలోపు ఉన్న ప్రతీ చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా భయం వీడి చిన్నారులకు పోలియో వ్యాధి సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కేంద్రాల ఏర్పాటుతోపాటు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు.తప్పనిసరిగా వేయించాలి ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి. మొదటిరోజు కేంద్రాలలో వేసిన తర్వాత మిగిలిన చిన్నారులకు రెండు రోజులపాటు ఇంటింటికీ తిరిగి వెళ్లి వేస్తారు. గతంలో పోలియో చుక్కలు వేసినప్పటికీ, మరోసారి వేయడం ద్వారా పూర్తి రక్షణ కలుగుతుంది. –ప్రతీక్ జైన్, కలెక్టర్, సంగారెడ్డి -
30న సిగాచి బాధితుల సంస్మరణ సభ
సభకు హాజరుకానున్న మాజీమంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు టౌన్: సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల స్మారకార్థం ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఇస్నాపూర్ బీపీఎల్ చౌరస్తాలో సభను నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ సుమలతతో కలిసి జెడ్పీటీసీ మాజీ సభ్యులు గడీల శ్రీకాంత్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సిగాచి పరిశ్రమ ప్రమాదం దేశ పారిశ్రామిక చరిత్రలో విషాదకర ఘటనగా నిలిచిందన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ సంస్మరణ సభకు మాజీమంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. -
ఆయిల్పామ్తో ఆదాయం
గెలలు కోతకు వస్తుండటంతో రైతుల్లో ఉత్సాహం ● టన్నుకు రూ.23,500 చెల్లింపు ● జిల్లాలో 3,500 ఎకరాల్లో సాగుజహీరాబాద్ టౌన్: జిల్లాలో సాగు చేసిన ఆయిల్పామ్ పంట చేతికి వస్తుంది. గెలలు కోతకు వస్తుండటంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో పంట వేయని అన్నదాతలు ఆయిల్పామ్ సాగు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా భారీగా రాయితీలు ఇస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇతర పంటలతో పొల్చి తే రైతులకు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆయిల్పామ్ మొక్కలను ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. నాటిన నాలుగో సంవత్సరం నుంచి పంట చేతికి వస్తుంది. మరో 3,500 ఎకరాల్లో సాగు లక్ష్యం ప్రస్తుతం జిల్లాలో 3,500 ఎకరాల్లో పంట సాగవుతుంది. మరో 3వేల ఎకరాలు టార్గెట్ కాగా 450 ఎకరాల్లో ప్లాంటేషన్ చేశారు. ఽమూడు సంవత్సరాల క్రితం 500 ఎకరాల్లో సాగు చేసిన తోటల్లో ప్రస్తుతం గెలలు కోతకు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి కోయడానికి గెలలు సిద్ధంగా ఉన్నాయి. జహీరాబాద్ నియోజవకర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్ మండలాల్లో అధిక విస్తీర్ణంలో ఆయిల్పామ్ తోటలు సాగవుతున్నాయి. గోద్రేజ్ కంపెనీ.. గెలల కొనుగోలుకు చర్యలు తీసుకుంటోంది. జహీరాబాద్ మండలంలోని గోవింద్పూర్ వద్ద కలెక్షన్ సెంటర్, న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ వద్ద పంట సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయిల్పామ్ గెలలకు మంచిఽ ధర పలుకుతుంది. ప్రస్తుతం టన్నుకు రూ.23.500 ధర పలుకుతుంది. తొలిపంట ఎకరానికి 4 టన్నుల వరకు గెలలు ఉత్పత్తి అవుతాయని ఉద్యానశాఖ అధికారి పండరి తెలిపారు. చెట్ల వయసు పెరుగుతున్న కొద్ది సుమారు 10 టన్ను ల గెలలు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. నెలకు రెండు సార్లు సంవత్సరానికి 24 సార్లు గెలలు కోసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. 150 నుంచి 160 రోజుల్లో పంట చేతికి వస్తుందని, ఆసక్తి గల రైతులు పంట సాగుకు ముందుకు రావాలని సూచించారు.హద్నూర్లో కోతకు వచ్చిన ఆయిల్పామ్ పంటసాగుకు రాయితీవట్పల్లి(అందోల్): రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్పామ్ సాగు దోహదపడుతుందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి పి.సోమేశ్వరరావు అన్నారు. శనివారం అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. 2026–27 సంవత్సరానికి జిల్లాలో 3వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోందన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావుప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గొటిగార్పల్లి గ్రామంలో మూడేళ్ల క్రితం 12 ఎకరాల్లో పంట సాగు చేశారు. గెలలు కోతకు వస్తున్నాయి. క్రాప్ చాలా బాగుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కటింగ్ చేస్తాం. ఎకరానికి సుమారు రూ. 7 వేల ఖర్చు అయింది. ప్రభుత్వం నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి రూ.4.200 నాలుగు సంవత్సరాల వరకు ఇస్తుంది. ఎకరానికి రూ. 50 వేల డ్రిప్ సౌకర్యం కల్పించింది. – చల్ల నాగేశ్వర్రెడ్డి, రైతు, రంజోల్ -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
సంగారెడ్డి: మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య పిలుపు నిచ్చారు. శనివారం సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం, మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన చట్టాలు, సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియో గం నేరమని, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలు, విద్యాహక్కు, పోక్సో, సైబర్ క్రైమ్, బాల్య వివాహాల చట్టం, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. -
ఇస్నాపూర్ వరకు మెట్రోను విస్తరించాలి
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వినతి పటాన్చెరు టౌన్: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2లో మియాపూర్ నుంచి పటాన్చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్రెడ్డిని శనివారం హైదరాబాద్లో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ...పటాన్చెరు–పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం, ఐఐటీ హైదరాబాద్, గీతం యూనివర్సిటీతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెట్రో కారిడార్ను ఫేజ్–2లో చేర్చాలని కోరారు. ఈ మార్గం అమలైతే సంగారెడ్డి, పటాన్చెరు, ఇస్నాపూర్ ప్రాంతాలతోపాటు జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్రో రైల్ సాధన సమితి సభ్యులు రుద్రారం శంకర్, మెట్టు శ్రీధర్, సురేందర్, సాయి తేజ పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ను సాగు చేయాలి
న్యాల్కల్(జహీరాబాద్): మంచి ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ పంటను సాగు చేసుకోవాలని జహీరాబాద్ ఉద్యాన వన శాఖ అధికారి పండరి రైతులకు సూచించారు. మండల పరిధిలోని హద్నూర్ గ్రామంలో శుక్రవారం ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 3,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారని తెలిపారు. సాగు చేసిన పంట మూడేళ్ల తర్వాత నుంచి నెలకు రూ.లక్షా వరకు ఆదాయం వస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్నిచ్చే పంటను సాగు చేసుకోవాలని రైతులను కోరారు. పంట సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కార్యక్రమంలో కొండల్రావు, సూర్యతేజ, సాయి పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లివిరిసే మత సామరస్యం
● మొహర్రం వేడుకల్లో జిల్లాలోనే ప్రథమం ● టేకూర్లో నేటి నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు న్యాల్కల్(జహీరాబాద్): మొహర్రం పండగ వ చ్చిందంటే టేకూర్ గ్రామంలో సందడి నెలకొంటుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు సమీపాన గల కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. జిల్లాలోనే మొహర్రం వేడుకలకు టేకూర్ గ్రామం ప్రసిద్ధి. గ్రామంలో జరిగే పండుగకు దశాబ్దాల చరిత్ర ఉంది. మొహర్రం పండుగ ముగిసిన రోజు నుంచే రెండు రోజుల పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గ్రామం పక్క నే ఉన్న కొండ గుట్టపై ఉన్న దర్గాను దర్శించుకునేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దూది పీర్లతో ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తారు. కుల, మతాలతో సంబంధం లేకుండా అన్నీ వర్గాలు పాల్గొనే ఈ పండుగను మతసామరస్యానికి ప్రతీకగా చూడవచ్చు. రెండు రోజులు ఉత్సవాలు రెండు రోజుల పాటు గ్రామంలో జరిగే ఉత్సవాల్లో పీర్ల ముందు ఎక్కడ చూసినా డప్పుల మోత, నృత్యాలు చేయడం కనిపిస్తుంది. గ్రామం నడిబొడ్డున ప్రజలు పాటలు పాడుతూ రెండు రోజుల పాటు రుమాళ్ల ఆటతోపాటు ఇతర ఆటలు ఆడుతారు. జిల్లాలోనిలోని మాయికోడ్, ముంగి, చినిగెపల్లి, జబ్గి, ధర్మాపూర్, నాగుపల్లి, హస్నాబాద్, ధన్నారం, ఉసిర్కెపల్లి, నాగులపల్లి, మైకోడ్, ఒకరాన, కర్ణాటకలోని మైలూర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 28 వరకు దూదిపీర్లు గ్రామానికి వస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి పీర్లతో వచ్చిన ప్రజలు గుట్టపై గల దర్గాకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుంటారు. మహిమ గల దర్గా టేకూర్ గ్రామం సమీపంలో గుట్టపై ఉన్న గుహలో వందల ఏళ్ల క్రితం వెలసిన మైబు సుభాని దర్గా మహిమ వల్లే ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున దూది పీర్లు వస్తాయని చెబుతుంటారు. దర్గాను దర్శించుకుంటే ఏరోగాలు రావని ప్రజలు పేర్కొంటున్నారు. నబీసాబ్ సమాధి గుట్టపై గల మైబు సుభాని దర్గాకు వెళ్తున్న క్రమంలో కింది భాగంలో ఉండే నబీసాబ్ సమాధిని ప్రజలు తప్పకుండా దర్శించుకుంటారు. గతంలో నబీసాబ్ జీవించి ఉన్నప్పుడు పలు మహిమలు చూపేవాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రెండు రోజులపాటు జరిగే మొహర్రం ఉత్సవాలకు గ్రామస్తులు, యువజన సంఘం సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచే ఇక్కడకు వచ్చే ప్రజలకు గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. -
కల్యాణలక్ష్మి ఎక్కడ?
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం జహీరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా కల్యాణలక్ష్మి–షాదీముబారక్ హామీ అటకెక్కుతోందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఈ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న ఆర్థికసాయంతోపాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక బంగారాన్ని మర్చిపోయిందని, ఆర్థిక సహాయం కూడా సకాలంలో ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా ఉందన్నారు. తులం బంగారం ప్రస్తుత ధర ప్రకారం ఈ హామీ అమలు చేయడానికి సుమారు రూ.22వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ నగదు సహాయానికి రూ.500 కోట్లు అవసరం అవుతాయని, తులం బంగారం కలిపితే మొత్తం రూ.1,225 కోట్ల మేర అవుతుందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే 5వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటికి తులం బంగారం కలిపితే సుమారు రూ.72 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే లబ్ధిపొందిన వా రికి, కొత్త లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చి మా ట నిలుపుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఘనంగా రుద్రచండీయాగం
నారాయణఖేడ్: పట్టణ శివారులోని చక్రసహిత లలితాంబికాదేవి ఆలయంలో ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఆలయ వ్యవస్థాపకులు శ్రీపంతులు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు రుద్రచండీయాగం, కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. శనివారం నవచండీ పారాయణం, రుద్రహోమం, చండీహోమం, సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. అలాగే పట్టణంలోని దత్తాత్రేయస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరామర్శ జహీరాబాద్ టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు బీఆర్ఎస్ నాయకులను కౌన్సిలర్ స్రవంతి పరామర్శించారు. పట్టణంలోని శాంతినగర్లోని తులసీదాస్ గుప్త, ఆర్.సుభాష్ల ఇళ్లకు వెళ్లి పలకరించారు. ఉద్యమకారులకు పార్టీ అండగా ఉంటుందని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ధైర్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, నరేష్రెడ్డి ఉన్నారు. రోడ్డు పనులు ప్రారంభం నారాయణఖేడ్: మండలంలోని తుర్కపల్లి నుంచి పోతన్పల్లి(ఆర్), పలుగు తండాల మీదుగా సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ వరకు రూ.2.77 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకు శుక్రవారం తుర్కపల్లి, పోతన్పల్లి(ఆర్) గ్రామ పంచాయతీల సర్పంచ్లు ప్రతాప్రెడ్డి, శ్రీధర్రెడ్డి పూజ చేశారు. ఈ రోడ్డుతో ఖేడ్, సిర్గాపూర్ మండలాలకు రవాణా సదుపాయంతో పాటు అనేక గ్రామాల వారికి దూరభారం తగ్గుతుందని తెలిపారు. అనంతరం నిధులు మంజూరు చేయించిన ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దత్తుగౌడ్, ఉప సర్పంచ్లు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. 200 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పటాన్చెరు టౌన్: స్థానిక డివిజన్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ విల్లా కమ్యూనిటీ నివాసితులు, రోటరీ క్లబ్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికిపైగా పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ఈశ్వర్, మురళీ కృష్ణ, ఉదయ్, ప్రదీప్, పెద్దిరెడ్డి, ప్రభాకర్, రాజేష్, హరి, ధనిష్ట, పవన్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి నర్సాపూర్: కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకం పొందిన రైతులు ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి దీపిక రైతులకు సూచించారు. గతేడాది నుంచి ఈనెల 15వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
బంగారు ఆభరణాల కోసమే హత్య
● నిందితుడి రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులురాయికోడ్(అందోల్): మహిళను హత్య చేసి పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాయికోడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చైతన్య కిరన్తో కలిసి జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంతు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 17న మండలంలోని సింగితం గ్రామానికి చెందిన లలిత(53) కనిపించకుండా పోయింది. ఆమె కూతురు ప్రభావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 20న సింగితం గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో లలిత మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. మృతురాలి మెడలో బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి గ్రామానికి చెందిన ఎం.భాస్కర్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆభరణాల కోసమే లలితను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి బంగారు గుండ్లు, ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
రైతు భరోసాకు కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలి
తుది గడువు జూలై 5 జహీరాబాద్: కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జూన్ 15వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు మాత్రమే ఇందుకు అర్హులని పేర్కొ న్నారు. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవ సాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని వివరించారు. దరఖాస్తుతో పా టు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలను రైతు భరోసా దరఖాస్తు ఫారం జత చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు జూలై 5వ తేదీ చివరి గడువని పేర్కొన్నారు. నారాయణఖేడ్: తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకూ తెలంగాణ రాష్ట్ర సేనపార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త భవానీశంకర్, ఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి బాపు మల్శెట్టి తెలిపారు. జూలై 2న హైదరాబాద్లోని ఉప్పల్లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట బహిరంగ సభకు సంబంధించి శుక్రవారం ఖేడ్లో సన్నాహక సమావేశం నిర్వహించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తే అధికారంలోకి వచ్చాక రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటిస్థలం, గుర్తింపు కార్డు, ఉచిత బస్సుపాసు ఇస్తామని హామీనిచ్చి మోసం చేసిందన్నారు. భూ పోరాట బహిరంగసభలో ఉద్యమకారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారులు సంజీవరెడ్డి, కవితమ్మ, తెలంగాణ జేఏసీ నాయకులు కిష్టయ్య, శంకర్యాదవ్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్గౌడ్ పటాన్చెరు టౌన్: విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటమాడొద్దని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్గౌడ్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు బకాయలు చెల్లిస్తామని చెప్పిన సీఎం రేవంత్ గద్దెనెక్కిన తర్వాత రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జీఓ నం 8,9 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల 30న కళాశాలల తరగతులు బహిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీధర్ పటాన్చెరు టౌన్ః వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులను తొలగించిన నేపథ్యంలో, హోటళ్లు, రెస్టారెంట్లు గతంలో గ్యాస్ కొరత పేరుతో పెంచిన ఆహార ధరలను వెంటనే తగ్గించాలని నవ భారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. పటాన్చెరులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ అధిక ధరలను కొనసాగించడం సమంజసం కాదన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హోటల్ యాజమాన్యాలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధరలపై పర్యవేక్షణ చేపట్టి న్యాయమైన ధరలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అడుగడుగునా గుంతలే!
జహీరాబాద్ టౌన్: పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే అల్గోల్ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. దశాబ్దాల క్రితం వేసిన ఈ రోడ్డుకు నేటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వెంట నిరంతరం భారీ వాహనాలు, కాంక్రిట్ మిక్సింగ్ వాహనాలు మితిమీరిన లోడ్తో తిరగడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు మూడు నెలల క్రితమే రోడ్డెక్కి నిరసన చేపట్టారు. సర్పంచ్ చల్ల శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో కూడా నిర్వహించారు. అంతేకాదు కలెక్టర్ ప్రావీణ్యను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అయినా నేటికీ అధికారులు, పాలకులు రోడ్డు మరమ్మతులను పట్టించుకునే వారు కరువయ్యారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి దెబ్బతిన్న అల్గోల్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో గ్రామస్తులను సమీకరించి పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సర్పంచ్ చల్ల శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.● అధ్వానంగా అల్గోల్ రోడ్డు ● వాహనదారులకు నిత్యం నరకం -
మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి
జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమలాక్షి రామచంద్రాపురం (పటాన్ చెరు): కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమలాక్షి డిమాండ్ చేశారు. రామచంద్రాపురం పట్టణంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా మహిళా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మహిళా కాంగ్రెస్ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. మహిళల రాజకీయ సాధికారతకు మహిళా బిల్లు కీలకమని తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజలి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ మట్టి దందాపై సమగ్ర విచారణ
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ వట్పల్లి(అందోల్): అందోల్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలను నిలువునా పాతరేస్తూ అధికారుల అండదండలతోనే అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు. ప్రభుత్వ సంపదను, ప్రకృతి మూలాలను కొందరు స్వార్థపరులు కొల్లగొడుతుంటే అధికారులు మౌనం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. మైనింగ్, రెవెన్యూ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున గుట్టల తవ్వకాలు చేపడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది టిప్పర్లు, జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు జరుపుతూ మట్టిని తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణానికి అవసరమై ఒక ట్రాక్టరు మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేసే అధికారులు పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకం దారులపై కేసులు నమోదు చేయడంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. -
చట్టాలపై విద్యార్థులకు అవగాహన
జహీరాబాద్: విద్యార్థులు చెడు అలవాట్లను దరిచేరనీయవద్దని, మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి బ్లెస్సి సూచించారు. శుక్రవారం పట్టణంలోని నవచేతన్య కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో నడుచుకోవాలని, పెద్దలపై గౌరవంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ చాల కీలకమైందని, ఈ దశలో మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయ సేవా సహాయంపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, న్యాయవాదులు గోపాల్, విశ్వనా పాల్గొన్నారు. -
తిరుపతికి యువకుడి సైకిల్ యాత్ర
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణానికి చెందిన యువకుడు సున్నపు భవానీ కుమార్(22) శుక్రవారం తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సైకిల్పై బయలుదేరి వెళ్లాడు. హనుమాన్న్ ఆలయంలో కుటుంబీకులు, సన్నిహితులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి సైకిల్పై యాత్రను ప్రారంభించాడు. రోజూ 60 కిలోమీటర్ల మేర ప్రయాణించి జూలై 5న తిరుమల తిరుపతికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకోనున్నట్లు తెలిపాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కొందరు భక్తులు సైతం సైకిల్పై తిరుపతికి వెళ్తుండగా పెద్దశంకరంపేటకు వారు చేరుకున్నాక వారితో కలిసి సమష్టిగా వెళ్తామని వివరించాడు. కాగా గతేడాది కూడా భవానీకుమార్ అయ్యప్పస్వామి దీక్షను స్వీకరించి తిరుపతికి పాదయాత్రగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. -
పార్కులతో ఆరోగ్యం, ఆహ్లాదం
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ● రూ.1.51 కోట్లతో మూడు పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన పటాన్చెరు: పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటీ శిల్ప లేఔట్ కాలనీ, పీఎన్ఆర్ కాలనీలలో రూ. ఒక కోటి 51 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో ఉన్న ప్రతి పార్కు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పార్కుల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పచ్చదనం పెరిగి, కాలనీలలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. కాలనీవాసుల సౌకర్యార్థం ప్రతి పార్కులో పిల్లల కోసం ఆట వస్తువులు, పెద్దల కోసం వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహాగౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ విభాగం సురేష్, డీఈ వెంకటరమణ, పార్కుల విభాగం మేనేజర్ సతీష్, మాజీ కౌన్సిలర్లు ఉపేందర్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంతి.. సోలార్ కాంతి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పెట్రోల్ బంక్..ఆర్టీసీ బస్సులకు యజమానులైన స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలు ఇకపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కూడా కానున్నారు. జిల్లాలో రెండు గ్రామ మహిళా సమాఖ్య (వీఓ)లకు రెండు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మంజూరయ్యాయి. గుమ్మడిదల మండలం నల్లవల్లి వీఓతో పాటు, నాగల్గిద్ద మండలం అవుదాత్పూర్ వీఓల ఆధ్వర్యంలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్లాంటు సామర్థ్యం ఒక మెగావాట్. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా వచ్చే స్థిరమైన ఆదాయం ఆయా వీఓల్లో సభ్యులుగా ఉన్న ఎస్హెచ్జీ మహిళలకే అందుతుంది. అలాగే ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు కూడా స్థానిక ఎస్హెచ్జీ మహిళలే తీసుకుంటారు. దీంతో వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకం కింద పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన రేటుతో విద్యుత్శాఖ కొనుగోలు చేస్తుంది. ఈ మేరకు విద్యుత్ శాఖతో 25 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఒక్కో ప్లాంటు ఏర్పాటు ఖర్చు రూ.మూడు కోట్లుగా అంచనా వేశారు. ఇందులో పది శాతం అంటే రూ.30 లక్షలు ఆయా గ్రామ మహిళా సంఘాలు చెల్లించాలి. మిగిలిన 90% రూ.2.70 కోట్లు బ్యాంకు రుణంగా మంజూరు చేస్తుంది. మహిళా సంఘాలు చెల్లించాల్సిన రూ.30 లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలను గ్రాంటు రూపంలో మంజూరు చేసింది. రెండు వీఓలకు కలిపి రూ.40 లక్షలు మంజూరయ్యాయి. మిగిలిన రూ.10లక్షల చొప్పున వీఓలు చెల్లిస్తున్నాయి. వీటిలో ఉత్పత్తి అయిన విద్యుత్ను విక్రయించడం ద్వారా దాదాపు ఐదేళ్లలోనే ఆయా వీఓలకు పెట్టిన పెట్టుబడి మొత్తం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ప్లాంటు సామర్థ్యం ఒక మెగావాట్ రూ.మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటు ఇప్పటికే వీటికి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు ఈ రెండు గ్రామాల్లో నాలుగు ఎకరాల సర్కారు భూమిని ప్రభుత్వమే వీఓలకు కేటాయించింది. ఈ భూముల్లో ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన ఫిజిబిలిటీ నివేదిక కూడా వచ్చింది. ఈ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ఓ ఏజెన్సీకి అప్పగించింది. ఇప్పటికే ఈ ప్లాంటు ఏర్పాటు పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్యకారణాలతో ఆ ఏజెన్సీ పనులు ప్రారంభించలేదని తెలిసింది. దీంతో మరో ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించారు. మరో రెండు నెలల్లో ఈ ఏజెన్సీ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు పనులను ప్రారంభించనుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ముమ్మరంగా ఓటరు సర్వే
● ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ● క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమాహారతినారాయణఖేడ్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ –2026లో భాగంగా డివిజన్ పరిధిలో రెండవ రోజు శుక్రవారం శ్రీహౌజ్ టు హౌజ్శ్రీ సర్వే మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. పట్టణంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, తహసీల్దార్ రాజు పటేల్, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతితో కలిసి 169, 176 పోలింగ్ బూత్ల పరిధిలో స్వయంగా పర్యటించారు. ఈ మేరకు సర్వే మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఓటర్ల సందేహాలను కూడా నివృత్తి చేశారు. మునిపల్లిలో ఫారాల పంపిణీ మునిపల్లి (అందోల్): మండలంలోని ఖమ్మంపల్లిలో బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మీనాక్షి సాయికుమార్ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులకు ఈ ఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది శశాంక్ తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలదే కీలక పాత్ర ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్ఓలే అత్యంత కీలకమని తహసీల్దార్ రాంగోపాల్ రావు అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బీఎల్ఓలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులు, ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. 2002 నుంచి 2025 వరకు ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేర్లు ఉన్నవారు, ఓటరు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్లో కొత్తగా ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు.. కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందన్నారు. పాత ఓటర్ల జాబితాతో పోల్చి చూసి.. చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తారు. ప్రస్తుతం స్థానికంగా నివసిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేస్తారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించినప్పుడు ఓటర్లు తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడు సార్లు ఆ ఇంటిని సందర్శిస్తారన్నారు. ఒకవేళ డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నుంచి ఫారం–6తో పాటు డిక్లరేషన్ ఫారం కూడా స్వీకరిస్తారన్నారు. అలాగే ఓటర్లు స్వయంగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారం నింపి సమర్పించే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
విస్తరణ పేరిట కూల్చివేతలు!
●ఇళ్లకు నోటీసులు అంటిస్తున్న మున్సిపల్ సిబ్బంది ●వ్యాపారులు, స్థానికుల్లో ఆందోళన నారాయణఖేడ్: నిజాంపేట్ 161 జాతీయ రహదారి అనుసంధానంగా నారాయణఖేడ్ మీదుగా బీదర్కు 161బీ పేర జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. ఖేడ్ పట్టణం పొలిమేర నుంచి ఈ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. కాగా ఖేడ్ పట్టణంలో ఉన్న పాత రహదారిని సైతం ఇరువైపులా 50 అడుగులు విస్తరిస్తామంటూ మున్సిపల్ కమిషనర్ పేరిట నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ సిబ్బంది పలు నివాసాలకు ఇప్పటికే నోటీసులను అతికించారు. వారంలోగా ఇళ్లను కూల్చుకోవాలని, లేని పక్షంలో తామే కూల్చి ఆ ఖర్చులను వాటి యజమానుల నుంచి వసూలు చేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నోటీసు అస్పష్టం! జాతీయ రహదారుల అధికారుల ఆదేశాల మేరకు రోడ్డుకిరువైపులా 50 అడుగుల మేర ఉన్న నివాసాలు, ఆక్రమణలు వారంలోపు తొలగించుకోవాలని, లేని పక్షంలో తామే కూల్చి ఆ ఖర్చు ఇంటి యజమానులపై వేస్తామని పేర్కొన్నారు. మంగల్పేట్ భవానీ ఆలయం సమీపం నుంచి నూతన బస్టాండ్ వరకు ఉన్న నివాసాలు దాదాపు 100 నుంచి 200 ఏళ్ల క్రితం నిర్మించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ రోడ్డు కూడా లేని సమయంలో ఉన్న బండ్ల బాటను క్రమేపీ రోడ్డుగా ఏర్పాటు చేసి పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్డుగా మార్చారు. అప్పటి పురాతన నివాసాలు ఎలా ఆక్రమణలు అవుతాయని, ఇళ్లుకు నాటి నుంచి ఇంటి నంబర్లు, విద్యుత్, నల్లా కనెక్షన్లు ఉండి, పన్నులు వసూలు చేస్తూంటే అవి ఆక్రమణలు ఎలా అవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హైవే అధికారుల ఆదేశాలు అంటూ పేర్కొన్న నోటీసులో నేషనల్ హైవే అధికారుల లేఖ నంబరు కానీ, లేఖ ప్రతి కానీ అందించక పోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం లేకుండా కూల్చివేతలా!! జాతీయ రహదారి శాఖ రోడ్డును విస్తరిస్తే నివాసాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నష్ట పరిహారం అందించి విస్తరణ చేపడతారు. కానీ మున్సిపల్ అధికారులు ఆక్రమణలు అంటూ నోటీసులో పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. మంగల్పేట్ నుంచి రాజీవ్చౌక్ మీదుగా మనూరు క్రాస్రోడ్డు వరకు విస్తరిస్తే పట్టణంలో సుమారు 340కి పైగా వ్యాపార సముదాయాలు, నివాసాలు కూల్చివేతకు గురవుతాయి. రూ.కోట్లాది విలువగల ఆస్తులు ధ్వంసం అవుతాయి. జరిగే ఆస్తుల నష్టాలకు పరిహారం అందించి రోడ్డు విస్తరణలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. కానీ అధికారులు ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. బాధితులకు పరిహారమివ్వాలిమాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో ఇళ్ల కూల్చివేతతో నష్టపోతున్న బాధితులకు నష్ట పరిహారం అందించిన అనంతరం విస్తరణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణతో నష్టపోతున్న బాధితులు ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం భూపాల్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ...బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రజలకు నష్టం జరగకుండా వారి అభీష్టం మేరకు రోడ్డుకిరువైపులా 35 ఫీట్ల మేర విస్తరించాలని నిర్ణయించానని, అంతలో ఎన్నికలు రావడంతో నిలిచిపోయిందన్నారు. కానీ నేడు 50 ఫీట్ల విస్తరణ పేరిట వందల ఏళ్లనాటి నివాసాలు ఆక్రమణలు అంటూ నోటీసులు జారీ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిహారంపై అధికారులు, నాయకులు స్పష్టత ఇచ్చి బాధితులను ఆదుకున్న తర్వాతే రోడ్డును విస్తరించాలని కోరారు. ఇళ్లు కోల్పోయే వారికి నష్టం కలిగిస్తే బాధితుల పక్షాన పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. బాధితులను ఆదుకోవడంతోపాటు రోడ్డును 35 అడుగుల మేరకే విస్తరించాలని సబ్ కలెక్టర్ ఉమాహారతిని కోరినట్లు వివరించారు. -
ఖేడ్లో ‘కాసం ఫ్యాషన్స్’ కొత్త షోరూమ్
నారాయణఖేడ్: పట్టణంలో శ్రీకాసం ఫ్యాషన్స్శ్రీ 25వ షోరూమ్ను ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధునాతన కలెక్షన్లు, సరికొత్త వైరెటీలకు కాసం ఫ్యాషన్స్ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని, దీనిని నారాయణఖేడ్లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆమె మాల్లోని లేడీస్, జెంట్స్, కిడ్స్ వేర్ విభాగాలను పరిశీలించి సందడి చేశారు. అనంతరం పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడే షాపింగ్ చేయాలని కోరారు. అనంతరం మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ, మల్లికార్జున్, కేదారినాథ్, శివప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా ప్రజల ఆదరణతో 25 స్టోర్లు ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ బ్రాంచ్ ద్వారా 150 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు. అయితే అనసూయను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో మాల్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ -
నూతన విద్యా విధానం రద్దు చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020ను వెంటనే రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఎలాంటి చర్చ లేకుండా నూతన విద్యా విధానాన్ని అమలుతో విద్యారంగాన్ని పూర్తిగా కేంద్రీకరించి రాష్ట్రాల ప్రత్యేక సంస్కృతిని, ఆర్థిక స్థితిగతులను రాబోయేతరాలకు తెలియనివ్వకుండా చేస్తున్నారని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి తెలిపారు. సంఘం పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించకుండా, సరిపడా ఉపాధ్యాయులను నియమించకుండా పేద పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారన్నారు. విద్య కాషాయీకరణకు బాటలు వేస్తున్నారని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరుస్తున్న నూతన విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందరూ టెట్ పాస్ కావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుదింపు సరికాదు రాష్ట్రంలోని 27 వేల పాఠశాలలను 4వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం సరికాదని సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ సంగీత, డీఆర్వో పాండుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు కాశీనాథ్, ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు సాయి ఎ.తేజ, నరేశ్, సంయుద్దీన్, సిరాజ్, ప్రసన్న, ప్రశాంత్కుమార్ జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఎస్యూటీఎఫ్ డిమాండ్ -
సొంత ఊళ్లోనే సర్
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మిక ఓటర్లపైనే అందరి దృష్టి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పలు పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న వలస కార్మికుల ఓటర్లపైనే అందరి దృష్టి నెలకొంది. బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చి సంగారెడ్డి జిల్లాలోని ఖాజీపల్లి, పాశమైలారం, బొంతపల్లి, పటాన్చెరు, గడ్డపోతారం, బొల్లారం వంటి పారిశ్రామికవాడల్లో సుమారు 80 వేల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు ఓటర్లుగా ఉన్నారు. వీరికి ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థలాల్లో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతో ఒకే చోట ఓటు హక్కు ఉండేందుకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఈ వలస కార్మికుల ఓట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరిలో చాలామంది ఓటర్లు ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థలాల్లోనే ఓటును కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కోల్పోతామనే ఆందోళనతో వీరిలో చాలామంది ఇక్కడి ఓటును వదులుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. అరకొరగానే మ్యాపింగ్.. ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఓటర్లను 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేసిన విషయం విదితమే. 2002 నాటి ఓటరు జాబితాలోని ఎపిక్ నంబర్ ఉన్న ఓటర్లను ప్రస్తుత ఓటరు జాబితాలోని ఎపిక్ నంబర్తో మ్యాపింగ్ చేశారు. ఈ వలస కార్మికులున్న పారిశ్రామికవాడల్లోని పోలింగ్ బూత్లలో ఈ మ్యాపింగ్ చాలా తక్కువ నమోదైంది. ఇతర చోట్ల సుమారు 65% ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా, ఈ వలస కార్మికులున్న చోట్ల కేవలం 40% కూడా మ్యాపింగ్ జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మే రెండో వారంలో ప్రకటించిన గణాంకాల మేరకు వలస కార్మికులు అధికంగా ఉండే పటాన్చెరు నియోజకవర్గంలో 4,30,508 మంది ఓటర్లున్నారు. ఇందులో 40% అంటే సుమారు 1.72లక్షల మంది ఓటర్లు మాత్రమే మ్యాపింగ్ జరిగినట్లు అంచనా. దీంతో మ్యాపింగ్ జరగని సుమారు 2.58 లక్షల ఓటర్లు తప్పనిసరి తమ జనన ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాలను అధికారులకు చూపాల్సి ఉంటుంది. అలాగే రెండు, మూడు చోట్ల ఓట్లు ఉంటే ఎక్కడైనా ఒకేచోట మాత్రమే ఓటరుగా కొనసాగాల్సి ఉంటుంది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని అధికారులు, రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పటాన్చెరుతోపాటు సంగారెడ్డి, జహీరాబాద్ వంటి నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంటుంది. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వీటిని ఓటర్లకు అందిస్తున్నారు. ఈ ఫారాలు పూర్తి చేసి, సంబంధిత పత్రాలను జత చేసే ఓటర్ల వివరాలు మాత్రమే ఓటరు జాబితాలో ఉండనున్నాయి. పారిశ్రామికవాడల్లో ఓటు హక్కు పొందిన యూపీ, బిహార్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు ఎస్ఐఆర్లో ఒకే ఓటుకు అవకాశం దీంతో స్వస్థలాల్లోనే ఓటును కొనసాగించేందుకు మొగ్గు -
సాంకేతిక విద్యపై ఆసక్తి
హుస్నాబాద్రూరల్: గ్రామీణ విద్యార్థులు సాంకేతిక విద్యపై ఆసక్తితో అడుగులు వేస్తున్నారు. పాలిటెక్నిక్ చేయడంతో విద్యార్హతతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే నమ్మకంతో పాలిటెక్నిక్లో ప్రవేశం కోసం క్యూ కడుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఈ విద్యా సంవత్సరానికి గాను కొత్తగా ఏఐ కోర్సుకు అనుమతి ఇచ్చారు. దీంతో సాంకేతిక విద్యకు డిమాండ్ పెరిగింది. ఏఐ కోర్సుతో ఆసక్తి హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ను 2017లో ప్రారంభించి సివిల్, ఈఈఈ కోర్సులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మొదటి తరం విద్యార్థులు మౌలిక వసతులులేక ఇబ్బందులు పడ్డారు. అధ్యాపకులు, బస్సుసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు పాలిటెక్నిక్కు మొగ్గుచూపలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏఐ కోర్సుకు అనుమతి ఇవ్వడంతో దూరప్రాంతాల విద్యార్థులు చేరడానికి ముందుకు వస్తున్నారు. హాస్టల్ సౌకర్యం లేక ఇబ్బందులు ప్రభుత్వ పాలిటెక్నిక్లో బాలికలు, బాలుర వసతి గృహాలు నిర్మించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికల హాస్టల్ నిర్మిస్తే దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నారు. కాలేజీలో కావల్సిన స్థలం ఉందని, హాస్టల్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.ప్రభుత్వ పాలిటెక్నిక్లో పెరిగిన ప్రవేశాలు కొత్త ఏఐ కోర్సుకు అనుమతి ఉపాధి అవకాశాలపైవిద్యార్థుల ఆకర్షణ బాలికల హాస్టల్ నిర్మించాలని విజ్ఞప్తిఖాళీలు ఇలా.. పాలిటెక్నిక్లో సివిల్ బ్రాంచిలో 66 సీట్లకు 49 మంది, ఈఈఈ (66) సీట్లకు 51 మంది, ఏఐ (66) సీట్లు 51 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు అధ్యాపకులు తెలిపారు. 27, 28 తేదీలలో స్లైడింగ్కు అవకాశం ఉంటుందని అందులో విద్యార్థుల ప్రవేశాలను బట్టి జూలై 1 తర్వాత స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్కు అనుబంధంగా శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభం కావడంతో అందులో ఇంజనీరింగ్ పూర్తిచేసే ఆలోచనతో ప్రవేశాలు పొందుతున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. -
హత్య కేసులను ఛేదించిన పోలీసులు
రామాయంపేట(మెదక్)/తూప్రాన్: ఇటీవల జరిగిన రెండు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ వెల్లడించారు. చేగుంట మండలంలో మూడు రోజుల క్రితం జరిగిన యువకుడి హత్యకు సంబంధించి గురువారం తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ (22), ఆటో డ్రైవర్ రణబోయిన ప్రభుకు మధ్య కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే శ్రీధర్ చిన్నాన్న కూతురైన శ్రావణిని ప్రభు ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వారి మధ్య కక్ష పెరిగిపోగా, చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో పలు కేసులు సైతం నమోదయ్యాయి. ఈక్రమంలో శ్రీధర్ తన స్నేహితుడితో కలిసి బైక్పై అనంతసాగర్ వెళ్తుండగా.. సమాచారం అందుకొని ఎనిమిది మందితో కలిసి రెండు ఆటోల్లో వచ్చిన ప్రభు ముందస్తూ పథకం ప్రకారం అనంతసాగర్ వద్ద వెనుక నుంచి బైక్ను ఢీకొట్టాడు. అక్కడే ఉన్న దిమ్మకు శ్రీధర్ తల తగిలి మృతిచెందాడు. ఈకేసును విచారించిన పోలీసులు నిందితుడు ప్రభుతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 12 మంది నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించినడీఎస్పీ నరేందర్గౌడ్ -
మురుగు కాల్వలో పడి ఎలక్ట్రీషియన్ మృతి
దుబ్బాకటౌన్: మూత్ర విసర్జనకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడి ఊపిరాడక మృతి చెందాడు. దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణానికి చెందిన ఎలక్ట్రీషియన్ మహమ్మద్ సజిల్ (46), తన భార్యతో కలిసి డబుల్ బెడ్రూం ప్రభుత్వ గృహ సముదాయంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన రాత్రి అయినా తిరిగి రాలేదు. కాగా, పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత రోడ్డులోని ఒక వస్త్ర దుకాణం సమీపంలో ఉన్న మురుగునీటి కాల్వ వద్దకు మూత్ర విసర్జన కోసం వెళ్లిన సజిల్, ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. మురుగునీరు మింగడంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలో పడి ఉన్న సజిల్ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాకలోని వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య నజీమా భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
నాడు ఎమర్జెన్సీ విధించి స్వేచ్ఛను హరించారు
మిరుదొడ్డి(దుబ్బాక): నాడు మాజీ దేశ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు విమర్శిచారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా ఇందిరా గాంధీపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీని విధించి దేశంలో స్వేచ్ఛను హరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు దేశంలో విధించిన ఎమర్జెన్సీ కారణంగా దేశ పౌరులందరూ స్వేచ్ఛను కోల్పోవడంతో పాటు, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిరపరాదులను జైలు పాలు చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ డే విషయంలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మల్లిఖార్జున ఖర్గేలు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ పార్టీలాంటివి ఎన్ని పుట్టుకు వచ్చినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరిని ఏమనకుండా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది ఒక్క బీజేపీ మాత్రమేనన్నారు. నాడు దేశంలో విధించిన ఎమర్జెన్సీని బ్లాక్ డేగా పరిగణిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మెదక్ ఎంపీ రఘుందన్ రావు -
కాలుష్యాన్ని తగ్గించాలి
కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మి పటాన్చెరు టౌన్: పారిశ్రామికవాడలో కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించాలని కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని న్యూలాండ్ లాబోరేటరీస్ లిమిటెడ్, యూనిట్–2 పరిశ్రమలో గురువారం నిర్వహించిన ప్రపంచ డీ కార్బనైజేషన్ దినోత్సవంలో విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. పరిశ్రమలు కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పునరుత్పాదక ఇంధన వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, హరిత సాంకేతికతల ప్రోత్సాహంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేయించి, గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సంస్థ కట్టుబాటును చాటారు. కార్యక్రమంలో సంస్థ సీనియర్ అధికారులు మహేశ్జోషి, అనిల్ కుమార్, రామకృష్ణ, రఘునాథ్, మురళీ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ టౌన్: మండలంలోని దిడ్గి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు నూతన సంఘానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అధ్యక్షులుగా పండరి, డైరెక్టర్లుగా జి.సోము, బి.గోపాల్, రాజు, జె.అశోక్, జి.శ్రీనివాస్, బి.నాగేందర్, ఏ.కృష్ణ, యూ.రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ పూర్ణిమ మాట్లాడుతూ..ఇక నుంచి గ్రామంలోని నీటి వనరులపై సంఘానికే హక్కులుంటాయన్నారు. గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలు చేపల పెంపకానికి దోహదపడతాయని, దీంతో ఉపాధి లభిస్తుందని చెప్పారు. నూతన ఎస్టీఓతో టీపీటీఎఫ్ నాయకులు పటాన్చెరు టౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నాయకులు విజ్ఞప్తి చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి పటాన్చెరు సబ్ ట్రెజరీ కార్యాలయానికి బదిలీపై వచ్చిన ఎస్టీఓ రాజిరెడ్డిని టీపీటీఎఫ్ నాయకులు గురువారం కలిసి శాలువాతో సన్మానించారు. టీపీటీఎఫ్ డైరీతోపాటు జీవోల పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్, రాష్ట్ర కౌన్సిలర్ సంజీవయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నాసర్ పటేల్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగానికి సీఎంఓ ఆదేశాలు జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధిలో గత 45 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘గడ్డపోతారంలో తాగునీటి కరువు’శీర్షికతో గురువారం ‘సాక్షి’పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ తాన్య మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యపై ఆరా తీశారు. -
ఈ ఆటోడ్రైవర్ ‘బంగారం’
రేగోడ్(మెదక్): ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకుని అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లికి చెందిన విజయ మూడు రోజుల క్రితం ఆటోలో నారాయణఖేడ్ వెళ్లింది. అయితే పోచారం సమీపంలో రూ.లక్ష విలువైన బంగారు ఆభరణాలు ఉన్న తన పర్సును రోడ్డుపై పోగొట్టుకుంది. అయితే అదే రూట్లో వెళ్తున్న సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని బెల్లాపూర్కి చెందిన ఆటో డ్రైవర్ విజయ్కుమార్కు ఆ పర్సు దొరికింది. రూ. లక్ష విలువైన బంగారం ఉన్నా ఏమాత్రం ఆశపడకుండా, విజయ్ కుమార్ వెంటనే ఆ పర్సును స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పోచయ్యకు అప్పగించాడు. అనంతరం పోలీసులు బాధితురాలిని పిలిపించి ఆ సొమ్మును సురక్షితంగా అందజేశారు. దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్ నిజాయితీపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అలాగే పోగొట్టుకున్న బంగారం తిరిగి దక్కడంతో ఆనందానికి గురైన బాధితురాలు విజయ.. ఆటో డ్రైవర్తో పాటు ఎస్ఐని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో టి.లింగంపల్లి సర్పంచ్ ఆనందం, న్యాయవాది అలిగే జీవన్ పాల్గొన్నారు.దొరికిన రూ.లక్ష విలువైన స్వర్ణాభరణాలు అప్పగింత -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నారాయణఖేడ్: మండలంలోని అల్లాపూర్ శివారులోని ఖేడ్–కంగ్జి మార్గంలో గురువారం సాయంత్రం తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఖేడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మండల కేంద్రమైన పిట్లంకు చెందిన హుస్సేన్ (25) బైక్పై ఖేడ్కు వస్తున్నాడు. ఖేడ్ నుంచి కంగ్టి వెళ్తున్న తుఫాన్ అల్లాపూర్ సమీపంలో బైక్ను ఢీకొట్టగా.. హుస్సేన్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: మాదక ద్రవ్యాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఐబీ గెస్ట్హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ దుర్వినియోగం, సర్ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి, యువతకు ముప్పుగా మారుతోందన్నారు. అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..డ్రగ్స్ విక్రయం, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. వసతి గృహాల్లో మెరుగైన భద్రత సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, భద్రత కల్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వసతిగృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యార్థులు ఆరోగ్యకరమైన, పరిశుభ్రతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అభ్యసించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సర్కు పార్టీలు సహకరించాలి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారమే ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల వివరాల ధృవీకరణలో ప్రజలు బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిని అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన విద్యార్థిని అదృశ్యం అయింది. గురువారం ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నవాబుపేటకు చెందిన సర్జన శివాని నర్సాపూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం పరీక్ష ఉందని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శివాని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక డివిజన్ పరిధిలోని లక్కదొడ్డికి చెందిన షాదుల్లా(48) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వ్యక్తుల ఇళ్లల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయిల్ చోరీ శివ్వంపేట(నర్సాపూర్): వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కొంతమంది దుండుగులు ఆయిల్ చోరీ చేశారు. మండలంలోని శభాష్పల్లిలో వ్యవసాయ పొలాల వద్ద గల 100కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేసి 240 లీటర్ల ఆయిల్తో పాటు కాయిల్స్ చోరీ చేశారు. ప్రస్తుతం సాగు పనులు ముమ్మరంగా సాగుతుండగా.. ఆయిల్, కాయిల్స్ చోరీతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
పత్రాల పంపిణీ షురూ
సర్ తీరును పరిశీలించిన ఆర్డీఓ దేవుజా, కమిషనర్ ప్రభాకర్ సంగారెడ్డి టౌన్: మండలంలో సర్ ప్రక్రియను బీఎల్ఓలు పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ జయరాం స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంతోపాటు మండలంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటు హక్కు అత్యంత విలువైందని ప్రతీ పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని బీఎల్ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేస్తారని వారికి ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు,బీఎల్ఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
నాచగిరిలో ఇక ఆన్లైన్ టికెటింగ్
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వివిధ సేవల కోసం ఆన్లైన్ టికెటింగ్ సదుపాయం సమకూరింది. దీంతో భక్తజనులు తమ ఇంటి నుంచే ఆయా సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశమేర్పడింది. గురువారం స్వాతి నక్షత్రం శ్రీనృసింహస్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా క్షేత్రం సందర్శించిన పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ చైర్మెన్ పల్లెర్ల రవీందర్గుప్త, ఈఓ రంగాచారిలతో కలిసి ఆన్లైన్ టికెటింగ్ ప్రారంభించారు. ఆన్లైన్ విధానం అందుబాటులోకి రావడంతో భక్తులకు సేవలు మరింత సులభతరమవుతాయని ఈఓ రంగాచారి పేర్కొన్నారు. క్షేత్రం వద్ద నిరీక్షణకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే సేవలకు సంబంధించి టికెట్లను పొందవచ్చన్నారు. క్షేత్రం సందర్శించిన భక్తులు కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ ‘స్కాన్’ చేసి ఆయా టికెట్లు నేరుగా తీసుకోవచ్చన్నారు. https://nacharamguttatemple.telangana.gov.inవెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సేవలు పొందవచ్చని ఆయన సూచించారు.ప్రారంభించిన మాధవానంద సరస్వతి -
కృత్రిమ కాలుకు చేయందించి..
సిద్దిపేటజోన్: చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరుకు చెందిన వరుకోలు మల్లేశం, సాలవ్వ దంపతుల కుమారుడు రంజిత్.. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో కుడికాలును తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి మంచానికి పరిమితమయ్యాడు. చేతికి వచ్చిన కొడుకు మంచం బారిన పడడం, కృత్రిమ అవయవ ఏర్పాటు కోసం సుమారు రూ.8 లక్షలు భారంగా మారింది. రెక్కలు ముక్కలు చేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి వారిది. విషయాన్ని గ్రామ సర్పంచ్ సునీత.. ఎమ్మెల్యే హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి పరిస్థితి వివరించారు.. ఇచ్చిన మాట మేరకు.. ఇటీవల రంజిత్ తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి కొడుకు పరిస్థితి వివరించారు. స్పందించిన ఆయన అందుకు అవసరమైన కృత్రిమ కాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజిత్కు రూ. 5లక్షల విలువైన కృత్రిమ కాలును అందించి అండగా నిలిచారు.హరీశ్రావు పెద్దమనసు రోడ్డు ప్రమాదంలోవైకల్యానికి గురైన వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు -
ద్విచక్రవాహనం, కారు ఢీ
ఒకరికి తీవ్రగాయాలు కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని మర్రిముచ్చాల గ్రామ శివారులో గురువారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివిరాలిలా ఉన్నాయి. చేర్యాల మండలం తాడూరి గ్రామానికి చెందిన పుల్లూరి సత్యనారాయణ గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై మర్రిముచ్చాలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో చేర్యాల నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణకు తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానికులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు బైక్లు చోరీ నర్సాపూర్: నర్సాపూర్లో వారం రోజుల వ్యవధిలో రెండు బైకులు చోరీ అయ్యాయి. ఇళ్ల వద్ద పార్కు చేసిన బైకులను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగలు అపహరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పట్టణంలోని తూప్రాన్ రోడ్డు పక్కన ఉన్న నర్సింగ్ హోం ఎదురుగా పార్కు చేసిన బైక్ను దొంగ ఎత్తుకుపోయిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది. పట్టణంలోని 12వ వార్డులో రమేష్ ఇంటి ఎదుట పార్కు చేసిన బైక్ బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డిని వివరణ కోరగా బైక్ పోయినట్లు ఒక ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేపట్టినట్లు చెప్పారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారుఘటనా స్థలంలోనే మృతి చెందిన యువకుడు చేర్యాల(సిద్దిపేట): ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పట్టణ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ముస్త్యాలకి చెందిన చిగుళ్ల వంశీ(25) ఓ పురుగుమందుల కంపెనీ ప్రమోటర్గా పని చేస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా పట్టణ కేంద్రానికి వచ్చిన వంశీ తన ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి కారు ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడ్డ వంశీ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు వంశీకి ఏడాది క్రితమే వివాహమైంది. తల్లి, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిఒకరికి తీవ్ర గాయాలు మిరుదొడ్డి(దుబ్బాక): గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె శివారులో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరం పల్లి గ్రామానికి చెందిన నరిగె నాగరాజు (33) కూలిపని చేసుకుంటూ భార్య నిరోషా, ఇద్దరు ఆడ పిల్లలను పోషించుకుంటున్నాడు. కాగా, ఇటీవల భార్య నిరోషాతో గొడవపడ్డ నాగరాజు మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటినుంచి వెళ్లిపోయిన నాగరాజు పలు జిల్లాలు దాటుతూ గురువారం రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు 765 డీజీ జాతీయ రహదారి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా...అతడి వెనుక నుంచి సిద్దిపేట మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన బోదాసు యాదగిరి అనే వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోతె శివారులోని భారతీ రైస్మిల్ వద్ద ఏదో గుర్తు తెలియని వాహనం యాదగిరి బైక్తోపాటు, నాగరాజును ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందగా బైక్పై వెళ్తున్న యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన యాదగిరిని 108 లో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి యాదగిరిని తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జగ్గులు ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటర్ల వద్దకు బీఎల్ఓలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ)లు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం ప్రారంభించారు. బీఎల్ఓల వెంట ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు (బూత్ లెవెల్ ఏజెంట్లు) కూడా ఉన్నారు. జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. తొలుత బీఎల్ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఈ ఫారాలను పంపిణీ చేస్తారు. ఓటర్లు పూర్తి వివరాలు నింపిన తర్వాత తిరిగి వాటిని సేకరిస్తారు. ఎవరికైనా ఈ ఫామ్లు అందకపోతే ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎన్యూమరేషన్ ఫారాలను తెలుగులో కూడా ముద్రించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. సెపె్టంబర్ 28 వరకు ఈ అభ్యంతరాలు పరిష్కరిస్తారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
సిద్దిపేటరూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కె.హైమావతి మెడికల్ ఆఫీసర్, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నారాయణరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం పీహెచ్సీ, యూపీహెచ్సీలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. ఎలాంటి వ్యాధుల బారిన పడినా ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. వానాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున మందులు, పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.సిద్దిపేట కలెక్టర్ హైమావతి -
మాక్ పోలింగ్లో ప్రతిభ
విద్యార్థికి విద్యాశాఖ డైరెక్టర్ అభినందనలు చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని బి.అభిజ్ఞ మోడల్ ఐక్యరాజ్య సమితి(యునెటెడ్ నేషన్స్) సమావేశంలో ఉత్తమ ప్రతిభ చాటింది. దీంతో విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందించారు. బుధవారం హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాయంలో విద్యార్థికి ఉత్తమ ప్రతినిధిగా ప్రశంసా పత్రం అందించి అభినందించారు. గత నెలలో హైదరాబాద్లో నిర్వహించిన మాడల్ ఐక్య రాజ్యసమితిలో ఎంఎన్ దేశపు ప్రతినిధిగా పాల్గొని ప్రతిభ చాటింది. గైడ్ టీచర్ లింగమయ్య పాల్గొన్నట్లు మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ వాణికుమారి తెలిపారు. పెరుగురాజన్న కుంటలో సర్వే..కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని తీగలకుంటపల్లి గ్రామంలో ఇటీవల కబ్జా కోరల్లో రాజన్నకుంట అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన వార్త కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. బుధవారం ఎట్టకేలకు కుంటలో పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. పాత పెన్షన్ వర్తింపజేయాలి పోరాట సమితి డిమాండ్ మెదక్ కలెక్టరేట్: 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్కుమార్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పాత పెన్షన్ అమలు చేయడం హర్షనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4,57/5 మెమోల ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా డీఎస్సీ 2003 నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వెలువడిందన్నారు. ఒకే నోటిఫికేషన్లో నియామకమైన టీచర్లకు రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా పెన్షన్ అమలు చేయడం అన్యాయమని తెలిపారు. ఏపీలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ తక్షణమే అమలు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎండు గంజాయి పట్టివేత ఇద్దరి రిమాండ్ పటాన్చెరు టౌన్: అమీన్పూర్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బుధవారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీహెచ్ఈఎల్ బస్టాప్ సమీపంలో చేపట్టిన తనిఖీల్లో 1.56 కిలోల ఎండు గంజాయిని, రెండు ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎస్కే రూహిల్ అమీన్, ఎస్కే ఇస్లాంను అదుపులోకి తీసుకోగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా ఇద్దరిని రిమాండ్కు తరలించారు.ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐ అనంత రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుళ్లు రవి నాయక్, నెహ్రూ నాయక్, శేఖర్, సంజయ్ కుమార్ పాల్గొన్నారు. నలుగురిపై కేసు నమోదుహుస్నాబాద్రూరల్: మండలంలోని మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్యకు కారకులైన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. మాజీ సర్పంచ్ రాసిన సూసైడ్ నోటులోని సర్పంచ్ జిల్లెల తిరుమల, ఉపసర్పంచ్ కత్తుల సమ్మరాజు, వార్డు సభ్యుడు తిరుపతి , పంచాయతీ కార్యదర్శి హరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ సీజ్ కొమురవెల్లి(సిద్దిపేట): అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నుంచి మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్ను సీజ్ చేసినట్లు తహసీల్దార్ దివ్య బుధవారం తెలిపారు. కొమురవెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని గంగరాయకుంటలోనుంచి కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆర్ఐ నర్సింహులు అక్కడికి చేరుకొని టిప్పర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా మట్టి తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పిల్లల ప్రాణాలతో చెలగాటం!
నర్సాపూర్ రూరల్: పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నర్సాపూర్ డాన్బాస్కో స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా మండలంలోని గొల్లపల్లిలో బుధవారం గ్రామస్తులు బస్సును అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ... స్కూల్ డ్రైవర్కు లైసెన్స్ లేకున్నా తమ పిల్లలను బస్సులో తీసుకెళ్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన చదువు చదివించేందుకు ప్రతినెలా వేల రూపాయల ఫీజులు చెల్లించడంతోపాటు, బస్సుకు అద్దెలు చెల్లిస్తున్నామన్నారు. స్కూల్ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా లైసెన్స్ లేని డ్రైవర్ను పంపి మా పిల్లల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై స్కూల్ ఎండీ నర్సిరెడ్డిని వివరణ కోరగా... రెగ్యులర్ డ్రైవర్ విధులకు రాకపోవడంతో తాత్కాలికంగా ఒకరోజు కోసం డ్రైవర్ పంపించామని, లైసెన్స్ సంగతి మాకు గ్రామస్తులు అడ్డుకున్న తర్వాత తెలిసిందన్నారు. లైసెన్స్ లేకుండా స్కూలు బస్సు నడిపిన డ్రైవర్ అడ్డుకున్న గొల్లపల్లి గ్రామస్తులు -
కడచూపును దూరం చేసిన కక్షలు
చిన్నశంకరంపేట(మెదక్): క్షణికావేశంతో హత్య, ఆపై ప్రతీకార హత్యకు పాల్పడ్డారు. కన్నపేగు చివరి చూపునకు దూరమయ్యారు. ఒకరి అంత్యక్రియలు అర్ధరాత్రి జరిగితే, మరొకరి అంత్యక్రియలు ఊరుకాని ఊరులో నిర్వహించారు. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ అంత్యక్రియలు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు. అయితే ఈ అంత్యక్రియలకు కన్నతండ్రి కిషన్, మేనమామ దూరమయ్యారు. శ్రీధర్ను హత్య చేసిన ప్రభాకర్ తండ్రి యాదగిరిని ప్రతీకారంతో హత్యచేసి పోలీసులకు చిక్కడంతో వారు స్టేషన్లో ఉన్నారు. అలాగే యాదగిరి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఊరుకాని ఊరు నర్సాపూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు కుమారుడు ప్రభాకర్, కూతుర్లు దూరమయ్యారు. సోదరులు, పాలివారు నర్సాపూర్ వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సూరారం గ్రామంలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో ప్రతీకార దాడులు జరగవచ్చనే భయంతో యాదగిరి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు వెనకాడారు. క్షణికావేశంతో వరుసగా జంట హత్యలకు పాల్పడడం, కనీసం కన్నవారి కడచూపునకు దూరమవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా గ్రామంలో పోలీసుల పికెట్ కొనసాగుతుంది. తల్లడిల్లిన కన్నపేగు ఊరుకాని ఊరులో అంత్యక్రియలు సూరారంలో కొనసాగుతున్న పికెట్ -
కడుపునొప్పి భరించలేక బాలుడి ఆత్మహత్య
నర్సాపూర్: కడుపునొప్పి భరించలేక బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం... నర్సాపూర్కు చెందిన లక్ష్మిప్రసన్న, ప్రవీణ్ కుమార్గౌడ్ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో రెండో కుమారుడు హర్షవర్ధన్గౌడ్(15)కు పుట్టుకతోనే కిడ్నీ సంబందిత సమస్య ఉంది. దీంతో ఐదు నెలల నుంచి కడుపునొప్పి రావడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇదిలాఉండగా లక్ష్మిప్రసన్న తన పెద్ద కుమారుడు శ్రీవాత్సవ్ ఎఫ్సెట్ పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అతనితో పాటు బుధవారం హైదరాబాద్కు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో హర్షవర్ధన్ ఉరివేసుకున్నాడు. కాగా అతని మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. దైవదర్శనానికి వద్దన్నందుకు..సిద్దిపేటఅర్బన్: దైవదర్శనానికి తనను వద్దన్నారని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కానుగంటి మురళి, బాలలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండవ కుమారుడు రాహుల్ (18) పదవ తరగతి వరకు చదువుకొని ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడు తిరుపతి దైవదర్శనానికి వెళ్తుండగా, తాను కూడా వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో తమ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, అన్న వెళ్లి వస్తాడని చెప్పడంతో మనస్తాపం చెందాడు. మంగళవారం రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు. బుధవారం ఉదయం చూసేసరికి ఇంట్లో కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికారు. సాయంత్రం పక్క పొలం వారు ఫోన్ చేసి వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినట్టు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విదేశీ మద్యం బాటిళ్ల ధ్వంసం
నర్సాపూర్: పట్టుబడిన విదేశీ మద్యం బాటిళ్లను బుధవారం ఎకై ్సజ్ అధికారులు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్కు చెందిన కస్టమ్స్ అధికారులు గతంలో పలు కేసుల్లో పట్టుకున్న విదేశీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేయాలని మండలంలోని కాగజ్మద్దూర్ గ్రామ పరిధిలో ఉన్న మిరిడి బయో కెమికల్స్ కంపెనీ ప్రతినిధులకు అప్పగించారు. కాగా ఆ బాటిళ్లను కంపెనీ ఉద్యోగులు ధ్వంసం చేయకుండా అందులో నుంచి కొన్ని నొక్కేసి, అమ్ముకున్నారు. ఇదిలా ఉండగా.. బాటిళ్ల మాయంపై ఎకై ్సజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కంపెనీ ఉద్యోగుల నుంచి 783 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ బాటిళ్లను ఎకై ్సజ్ అసిస్టెంటు కమిషనర్ శ్రీనివాస్రెడ్డి సమక్షంలో నర్సాపూర్ మున్సిపాలిటీకి చెందిన డంప్యార్డులో ధ్వంసం చేశామని స్థానిక సీఐ గులాం ముస్తాఫా తెలిపారు. ట్రైనీ అధికారి సతీశ్కుమార్, ఎకై ్సజ్ ఎస్ఐలు హజీజ్ హమద్, అరుణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మత్తుకు దూరంగా ఉండాలి
నర్సాపూర్: మత్తుకు దూరంగా ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక డి అడిక్షన్ సెంటరులోని బాధితులకు క్రీడా సామగ్రి పంపిణీ చేసి మాట్లాడారు. మత్తును విడిచిపెట్టి కుటుంబ సభ్యుల అండతో సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. క్రీడలు మానసిక ప్రశాంతతను కల్గించి వ్యసనాల నుంచి దూరంగా ఉండేందుకు దోహదపడతాయని చెప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారిన వ్యక్తులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ద్వారా కొత్త జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ బాధ్యతగా ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి, డీ అడిక్షన్ సెంటరు సిబ్బంది ఉన్నారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు -
అప్రమత్తతే.. శ్రీరామరక్ష
సంగారెడ్డి: వానాకాలంలో వర్షాలతో పాటు పిడుగులు పడటం, వరద తాకిడికి వాగులు, వంకలు పొంగిపొర్లడం, విషసర్పాల సంచారం, విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అన్నదాతలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నారు. వానాకాలం ప్రారంభమై 10 రోజులు గడుస్తుంది. తొలకరి వర్షాలు కురవడంతో ఏ గ్రామంలో చూసినా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు అరకలు, వ్యవసాయ పనిముట్లతో పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. కరెంటుతో జర భద్రం వానాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ వినియోగం తప్పనిసరి కావున పొలాలకు నీళ్లు పారించబోయే సమయంలో రైతులు ప్రమాదాలకు గురవుతుంటారు. స్టార్టర్ల బిగింపు, బోర్ మోటారు కనెక్షన్ మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర వర్షం పడిన సమయంలో వాటి దగ్గరకు వెళ్లొద్దు. రైతులు ఫీజు మార్చేందుకు నేరుగా ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లరాదు. వ్యవసాయ మోటార్లు తడవకుండా చూసుకోవడంతోపాటు ఎర్తింగ్ ఉండాలి. మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే సర్వీస్ వైర్లు భూమిపై ఉందొద్దు. సర్వీస్ వైర్లకు ఎట్టి పరిస్థితుల్లో జాయింట్లు లేకుండా చూడాలి. విద్యుత్పై పూర్తి అవగాహన లేని రైతులు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. మందుల పిచికారీ.. విష కీటకాలు.. పంటల సంరక్షణకు పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు రబ్బర్ బూట్లు వేసుకోవాలి. ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి. మందులను కర్రతో కలపాలి. భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మందులు స్ప్రే చేసే సమయంలో సిగరెట్లు, బీడీలు తాగకూడదు. ఎదురుగా గాలి వీచే సమయంలో పిచికారీ చేయవద్దు. వర్షాకాలంలో చెట్లు, గట్ల వెంట, గడ్డి వాములు ఉన్నచోట పాముల సంచారం అధికంగా ఉంటుంది. పొలానికి వెళ్లేటప్పుడు రైతులు చేతిలో కర్ర, రాత్రి అయితే టార్చిలైట్, కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్లాలి. ఒక వేళ పాము కాటు వేస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. నాటు వైద్యాన్ని నమ్ముకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. వాగులు, వంకలతో.. వానాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు, వంకలు ప్రవహిస్తుంటాయి. నీటి ఉధృతిని అంచనా వేయలేని అన్నదాతలు వాగులు దాటుతూ కొట్టుకుపోయిన సందర్భాలున్నాయి. వర్షం వచ్చి వరదలొస్తే... నీటి ఉధృతిని గమనించాక అంచనాకు రావాలి. వాగులు, వంకలు దాటే సమయంలో ఒంటరిగా కాకుండా గుంపుగా దాటాలి. పశువులను దాటించే సమయంలో మరింత జాగ్రత్త అవసరం. వానాకాలంలో పొంచి ఉన్న ప్రమాదాలు కరెంటు మరమ్మతులు వద్దు వర్షాలు పడేటప్పుడు జాగ్రత్త రైతులు అప్రమత్తంగా ఉండాలన్న నిపుణులుపిడుగులు, మెరుపులతో ముప్పు వర్షాలతో పాటు పిడుగులతోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఇప్పటికే అక్కడక్కడ పిడుగుపాటుకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే జాగ్రత్తలు తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆకాశంలో కారుమబ్బులు, మెరుపులు, ఉరుములు, వేగంగా గాలులు వీయడం లాంటివి పిడుగుపాటుకు సంకేతాలు. ఎత్తయినా ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, టెలిఫోన్ స్తంభాలపై, పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. అప్పడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఫోన్ను వెంటనే స్విచ్ఆఫ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మోకాళ్ల మధ్య తలవంచి రెండు చేతులతో చెవులు మూసుకుని, భూమి తగులకుండా వంగి కూర్చోవాలి. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలున్న ప్రాంతాల్లో ఉండరాదు. -
ప్రభుత్వ పాఠశాలకు పది లాప్ట్యాప్లు
నారాయణఖేడ్: పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యాభివృద్ధిలో పేద విద్యార్థులు సైతం ముందుండాలనే సంకల్పంతో ఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆమ్నెట్ డిజిటల్ సాఫ్ట్వేర్ సంస్థ బుధవారం ఉచితంగా పది లాప్ట్యాప్లు అందజేసింది. హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ సీఈఓ కృష్ణారెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి, సూర్యదేవర, హర్షిత్, మల్లేశ్వరి, అభిలాష్, నాగరాజు, అరుణ, మాధవి,సూర్య మాట్లాడారు. మారుమూల ప్రాంతంలోని ఖేడ్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు లాప్ట్యాప్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్మదకిశోర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, రాజశేఖర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్టు
కొమురవెల్లి(సిద్దిపేట): చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సిద్దిపేట కమిషనరేట్లో సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 30వ తేదీన కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన సార్ల సురేశ్ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎస్ఐ మహేశ్ గుర్జకుంట కమాన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా మెదక్ జిల్లా కుల్చారం స్టేషన్ పరిధిలో మహిళ పుస్తెలతాడు, ఫోన్, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి పీఎస్ పరిధిలో మొబైల్ షాప్లో లాప్ట్యాప్, సీసీ కెమెరా మానిటర్, కొమురవెల్లి పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులు డొంగరి రాజు, పొట్ట ప్రవీణ్, బొద్దుల శ్రీనాధ్ను అరెస్టు చేశారు. కాగా వారి నుంచి రూ.7లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కుల్చారానికి సంబంధించిన పుస్తెలతాడును నిజామాబాద్లోని ఎఫ్ఈడీ బ్యాంకులో కుదువబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కేసు ఛే దించిన చేర్యాల సీఐ రమేశ్, ఎస్ఐ మహేశ్, రవీందర్, తిరుపతిరెడ్డిలను సీపీ అభినందించారు. సుమారు రూ .7లక్షల సొత్తు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన సీపీ -
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే..
నర్సాపూర్ రూరల్: నీట్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ప్రారంభించిన ‘ఛాత్రోన్ కి గూంజ్’ ఉద్యమానికి మద్దతుగా బుధవారం నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, తరచూ లీక్ అవుతున్న ప్రశ్నాపత్నాలు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జాప్యం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయలేని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్, నాయకులు విజయ్ కుమార్, అశోక్గౌడ్, సుధీర్ కుమార్, పాషా, అజ్మత్, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల నా యకులు పాల్గొన్నారు. సమాచారం లేకుండానే ర్యాలీ కిందిస్థాయి నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించడంపై కొంత మంది కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ ప్రారంభించిన ఉద్యమానికి మద్దతుగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు నిలబడతాడన్న సంగతి మరిచి ఒంటెద్దు పోకడతో తుతూ మంత్రంగా ర్యాలీ నిర్వహించడం సరికాదన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
మాజీ సర్పంచ్ది ప్రభుత్వ హత్యే
హుస్నాబాద్రూరల్: మండల పరిధిలోని మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని సర్పంచ్ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య ఆరోపించారు. బుధవారం మహ్మదాపూర్లో సంపత్ కుటుంబాన్ని ఓదార్చి పాడే మోసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 31 నెలల నుంచి పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. మాజీ సర్పంచ్ల పై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తోందని అవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యవహించాలన్నారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టా రీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వీరి వెంట గుంటి మధుసూధన్రెడ్డి, నెమలి సుభాష్గౌడ్, విద్యాసాగర్, నర్సింహులు, గద్దల రమేశ్, రాము, కుమార్, దినేష్రెడ్డిలు ఉన్నారు. బిల్లులు చెల్లించకుంటేమంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం సర్పంచ్ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య -
రెవెన్యూ లీలలు!
అక్రమాలకు నిలయంగా తహసీల్ కార్యాలయంఅల్లాదుర్గం(మెదక్): రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. రూ.లక్షల జీతాలు తీసుకుంటూ లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు నిరుపేదల రక్తం తాగుతున్నారు. మాముళ్లు ఇస్తే క్షణాల్లో పట్టా చేస్తున్నారు.. ఇవ్వకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. బా ధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, విచారణ చేయడం లేదు. ఆర్డీఓను వివరణ అడిగితే సమాధానం దాటవేత వేస్తున్నారు. ఇది అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో నిత్యం జరుగుతున్న తంతు.. ● అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లికి చెందిన తలారి శంకరయ్య తన అన్న కొడుకు మొగులయ్యకు 5 గుంటల భూమిని దాన పత్రం కింద ఇచ్చేందుకు స్లాట్ బుక్ చేశాడు. మంగళవారం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. తహసీల్దార్ కార్యాలయానికి వెళితే అన్న కొడుకు కాబట్టి దానపత్రం కింద రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని తహసీల్దార్ తిప్పి పంపారు. ● ఇటీవల ఓ మహిళ తన అల్లుడికి సేల్డీడ్ కింద స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్కు వెళితే దానపత్రం కింద చేసుకోవాలని చెప్పి పంపారు. అలాగే తండ్రి కూతురికి సేల్డీడ్ కింద రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేస్తే చెల్లదని చెబుతున్నారు. ఇలా ఎన్నో సాకులు చెబుతూ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పి పంపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఇదే కార్యాలయంలో బతికున్న వ్యక్తి మృతిచెందినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే మాత్రం వెంటనే రిజిస్ట్రేషన్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల వారిని సముదాయించి రాజీ చేసి తిరిగి బతికున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. తప్పుడు రికార్డులు సృష్టించి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● గడిపెద్దాపూర్లో మహిళ మృతి చెందితే కొడుకులు ఉన్నా, సాదాబైనామాపై ఎవరూ లేకున్నా.. మరొకరి పేరుపై క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సంఘటనలపై బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఆర్డీఓ స్థాయి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడంతో చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ● ఈ విషయంపై తహసీల్దార్ మల్లయ్యను వివరణ కోరగా బూత్ లెవల్ కమిటీ సమావేశం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పడం గమనార్హం. మూముళ్ల్లు ఇస్తే క్షణాల్లో పట్టా.. లేకుంటే అడ్డంకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం -
జొన్నల డబ్బులేవి?
రైతులకు తప్పని ఎదురుచూపులు రాయికోడ్(అందోల్): జొన్నలు విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సాగు పెట్టుబడికి పైసలు లేక సతమతం అవుతున్నారు. అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని వాపోతున్నారు. జిల్లాలోని రాయికోడ్, పెద్దచెల్మెడ, హద్నూర్, కంకోల్ తదితర ప్రాంతాల్లో మార్క్ఫెడ్ 30 కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నల కొనుగోలు చేపట్టారు. పంటను ఇంటికి చేర్చిన రైతులు కొన్ని వారాల నిరీక్షణ అనంతరం మే 20న కేంద్రాలను ప్రారంభించారు. జూన్ 22 వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగింది. క్వింటాల్ జొన్నలను రూ.3,699 మద్దతు ధరతో కొనుగోలు చేశారు. అయితే జొన్నల కొనుగోలు ముగిసినా ఇంకా కేంద్రాల్లోనే నిల్వ ఉన్నాయి. 22 వేల మంది రైతుల నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు సేకరించిన అధికారులు, ఇంకా సుమారు 5 వేల మెట్రిక్ టన్నులు కేంద్రాల్లోనే ఉన్నట్లు తెలిపారు. వీటిని గోదాంలకు తరలించాల్సి ఉంది. లారీలు సకాలంలో రాకపోవడం, కూలీల కొరతతో ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై మార్క్ఫెడ్ డీఎం రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా విక్రయించిన రైతులకు డబ్బులు జమవుతున్నాయని తెలిపారు. వారం పది రోజుల్లో రైతులందరికీ అందజేస్తామన్నారు. కేంద్రాల్లో నిల్వ ఉన్న జొన్నలను గోదాంలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. -
లోతైన చర్చ..
12 అంశాలపై సుదీర్ఘ సమీక్ష సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలును సమీక్షించే దిశ (జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశంలో బుధవారం పలు అంశాలపై లోతైన చర్చ జరిగింది. ప్రజాప్రతినిధులు, దిశ కమిటీ సభ్యులు ఎజెండాలోని సుమారు 11 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దిశ కమిటీ చైర్మన్, జహీరాబాద్ ఎంపీ సురేష్కుమార్ షెట్కార్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కోచైర్మన్, మెదక్ ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్రావు, సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఆయాశాఖల జిల్లా అదికారులు, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ● వ్యవసాయశాఖలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలపై చర్చను ప్రారంభించారు. వ్యవసాయ యాంత్రీకరణ లబ్ధిదారుల ఎంపికలో అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపీ రఘునందన్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీల ప్రమేయం లేకుండా ప్రతిపాదనలు, మంజూరు ఇవ్వడం సరికాదన్నారు. ● నేషనల్ హెల్త్మిషన్ నిధులతో జిన్నారంలో నిర్మించిన ఆస్పత్రి ప్రారంభోత్సవ తీరును రఘునందన్రావు తప్పుబట్టారు. దీనిపై పీఆర్, వైద్యారోగ్య, మున్సిపల్ అధికారులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వద్ద పనిచేస్తున్నారా..? స్థానిక ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్నారా? అని మండిపడ్డారు. ● ముంబై హైవే విస్తరణలో నిబంధనలకు విరుద్ధంగా.. ఎవరి అనుమతులు తీసుకోకుండా పటాన్చెరులో ప్రభుత్వ పాఠశాలల భవనాన్ని, ప్రహరీ కూల్చివేత ఘటనలో తానే స్వయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఈ కేసులో నేషనల్ హైవే అధికారులను రిమాండ్ చేయిస్తానని హెచ్చరించారు. ● ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుందనే వాదనలో వాస్తవం లేదని రఘునందన్రావు పేర్కొన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసి రికార్డులు సమర్పిస్తే కేంద్రం వెంటవెంటనే బిల్లులు మంజూరు చేస్తోందన్నారు. అధికారుల లోపంతోనే అక్కడక్కడ సమస్య తలెత్తుతోందన్నారు. ● అమృత్ పథకం కింద మంజూరైన తాగునీటి పథకాల పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లో ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ● సోలార్ విధ్యుత్ పథకాలు పీఎం కుసుమ్, సూర్యఘర్ వంటి పథకాలపై లోతుగా చర్చించారు. కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ముంబై హైవే విస్తరణపై అధికారులపై మండిపాటు పాఠశాల కూల్చివేతపై రిమాండ్ కేంద్ర పథకాల అమలు తీరును చర్చించిన సభ్యులు వాడీవేడీగా దిశ కమిటీ సమావేశం -
‘విద్యకే తొలి ప్రాధాన్యం’
నారాయణఖేడ్: గ్రామాలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగుతండా జుక్కల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రూ.20 లక్షల పనులకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామాల్లోని యువత అభివృద్ధి బాటలోకి వస్తారన్నారు. అనంతరం పలుగు తండా అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు రజిత, కిషన్నాయక్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: రహదారి విస్తరణలో భాగంగా గురువారం చెట్ల కొమ్మలు తొలగించనుండటంతో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంగారెడ్డి రూరల్ ఏఈ ప్రశాంత్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, శిల్పవెంచర్, ఆదర్శ్నగర్, కాకతీయనగర్, కోతులాపూర్, శ్రీమన్నారాయణ రోడ్డు వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట కేజీబీవీలో గెస్ట్ టీచర్స్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ కృష్ణతేజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంగ్లం, హిందీ, గణితం, భౌతిక, జీవశాస్త్రం సబ్జెక్ట్లకు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీతో పాటు సంబంధిత సబ్జెక్టులో బీఎడ్ పూర్తి చేసి ఉండాలన్నారు. నాన్ టీచింగ్ పోస్టులు అటెండర్–1, నైట్ వాచ్ ఉమెన్–1, డే వాచ్ ఉమెన్–1, హెడ్ కుక్–1, అసిస్టెంట్ కుక్–2, స్వీపర్–1, స్కావెంజర్–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన 18 నుంచి 45 సంవత్సరాలు గల మహిళా అభ్యర్థులు ఈనెల 29 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9666494560 నంబర్లో సంప్రదించాలన్నారు. మెదక్ ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మెదక్జోన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పొందవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ బారినపడిన వారిని బాధితులుగానే చూస్తున్నామని, పునరావాస కేంద్రాల ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకువస్తామన్నారు. అలాంటి వారిని క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రథమ విజేతగా నిలిచిన రాయల్ వారియర్స్ జట్టుకు రూ.5,000 నగదు, ద్వితీయ విజేతగా రాయల్ ఆవుసులపల్లి జట్టుకు రూ.2,500 నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, డ్రగ్స్ విక్రయం, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అంతకుముందు యువతతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ సీఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ పాపన్నపేట(మెదక్): మత్తు పదార్థాల వాడకం జీవితాలను నాశనం చేస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. బుధవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కొంత మంది విద్యార్థులు, యువకులు స్నేహితుల నుంచి మత్తు పదార్థాల వాడకం నేర్చుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పట్టణాల్లో ఉన్న డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడు పల్లెలకు పాకిందన్నారు. కొన్ని పాఠశాలలు, కళాశాలలను సైతం తాకిందన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల ప్రవర్తన సరళిపై దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో యువకులు చైతన్యవంతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణమూర్తి, ఎస్సై శ్రీనివాస్గౌడ్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
7వ జోన్ డీఐజీ చౌహాన్ జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీస్ చెక్పోస్టులను పకడ్బందీగా నిర్వహిస్తూ అక్రమ రవాణాకు వీలు లేకుండా చూడాలని 7వ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన జహీరాబాద్లోని డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణం రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే అధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలన్నారు. నేరాలను నియంత్రించడానికి ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల చేధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, సీఐ శివలింగం, ఆయా పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పనైపోయినట్టే!
జోగిపేట/వట్పల్లి(అందోల్): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ అన్నారు. అందోలు మండలం అల్మాయిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం బీఎల్ఏలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సహకారంతో 2023లో అధికారంలోకి వచ్చి సీఎం రేవెంత్రెడ్డి నాయకత్వంలో 70 శాతం వాగ్దానాలను నెరవేర్చామని చెప్పారు. ఉచిత బస్సు పథకం నుంచి సన్న బియ్యం వరకు హామీలను అమలు చేశామని తెలిపారు. కానీ కేటీఆర్, హరీశ్రావు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన నీళ్లు, భూ దోపిడీలు, అక్రమాలు ప్రజలు మర్చిపోయి మళ్లీ మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే భ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.23 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్టు గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో 70 శాతానికి పైగా కుటుంబాలు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందుతున్నారన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి సి.దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా భర్తీచేసి అందరూ అందజేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వలస కూలీలు, వయో వృద్ధులు, నిరక్షరాస్యులు, రైతుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని, బీఎల్ఏలు ఓట్లు పోకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, రామ్మోహన్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావద్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, పీసీసీ ఉపాధ్యాక్షుడు సంఘమేశ్వర్, మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్లు ఎస్.కృష్ణారెడ్డి, ఎ.చిట్టిబాబు పాల్గొన్నారు. -
నెలలో నిధులు మంజూరు చేస్తా
పటాన్చెరు: బీరంగూడ డివిజన్ పరిధిలోని ఇక్రిసాట్ ఫేజ్ 1 కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా అంతర్గత సీసీ రోడ్లు, నూతన డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లోగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్కుమార్, ఈఈ సురేష్, జలమండలి జీఎం శ్రీనివాస్ రెడ్డి, డీఈ వెంకటరమణ, డీజీఎం శివకుమార్ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
సంగారెడ్డి జోన్: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి డా. క్రిస్టినా జడ్ చోంగ్తు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు, పురోగతిపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు అవసరమా అనే అంశాలపై జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి సేవలను మెరుగుపరచాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రజా పాలనలో వచ్చిన సమస్యలను మూడు విభాగాలుగా వర్గీకరించామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించే అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిన సమస్యల కోసం జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కలిశారు. 18, 21, 22వ వార్డుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన నసీర్, సిఫాలియా, ముర్తుజలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తంజీం, బీఆర్ఎస్ నాయకులు మిథున్రాజ్ పాల్గొన్నారు. పీఏసీఎస్ ఎరువుల వివాదంపై విచారణపుల్కల్(అందోల్): పుల్కల్ వ్యవసాయ సహకార సంఘం డీఏపీ ఎరువుల పంపిణీలో జరిగిన వివాదంపై మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. సొసైటీలో 100 డీఏపీ ఎరువుల బస్తాలు చైర్మన్, అతని అనుయాయులే తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఎరువుల వివాదంపై జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. మంగళవారం దీంతో జోగిపేట వ్యవసాయశాఖ ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయశాఖ అధికారి చైతన్య పీఏసీఎస్ సొసైటీలో విచారణ చేసి రైతుల నుంచి చైర్మన్ అనంతరావు కులకర్ణి నుంచి వివరణ తీసుకున్నారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతామని ఏడీఏ రమాదేవి తెలిపారు. రేపటి నుంచి అమలు వర్గల్(గజ్వేల్): విశేషమైన భక్తజనాదరణ కలిగిన నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో ఆలయ వేళలు మారుతున్నాయి. భక్తులకు నిరీక్షణ లేకుండా ఇక రోజంతా శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. అదేవిధంగా పూజాకార్యక్రమ వేళలోనూ మార్పులు చేశారు. భక్తుల దర్శనం కోసం ఆలయం ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు తెరిచిఉంటుంది. శని, ఆదివారాల్లో ఎలాంటి విరామం లేకుండా ఉదయం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంటుంది. పూజా కార్యక్రమాల్లోనూ మార్పు చేశారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం గురువారం నుంచి నూతన వేళలు అమలులోకి వస్తాయని ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు.. జిల్లా స్థాయిలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు కలిసి సంయుక్త తనిఖీలు.. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు.. క్లస్టర్ స్థాయిలో ఏఈఓలు, మండల స్థాయిలో ఏఓల ప్రత్యక్ష పర్యవేక్షణలు.. ఇవేవీ.. డీఏపీ ఎరువు అధిక ధర దోపిడీ చెక్ పెట్టలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ఈ ఎరువు కొరతను ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు యథేచ్ఛగా అధిక ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ఎమ్మార్పీ కంటే రూ.300 వరకు ఎక్కువగా విక్రయిస్తుండటం గమనార్హం. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి డీఏపీ ఎరువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఎమ్మార్పీకంటే రూ.వంద నుంచి రూ.మూడు వందల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఎరువు ఎమ్మార్పి రూ.1,350 ఉంటే.. ఏకంగా 1,550 వరకు విక్రయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే రైతులకు అసలు స్టాకే లేదని బుకాయిస్తున్నారు. మరికొందరు డీలర్లు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులు ఆయా డీలర్ల వద్దకు వెళితే డీఏపీ స్టాక్ లేదని చెబుతున్నారు. అధిక ధర అయి ఇస్తామని చెబితే మాత్రం ఈ ఎరువును విక్రయిస్తున్నారు. అసలే కొరత ఉన్న నేపథ్యంలో రైతులు బిల్లులు అడిగే పరిస్థితి లేదు. బిల్లులు (ప్రూఫ్) ఉంటేనే చర్యలు తీసుకుంటామని సంబందిత అధికారులు చెబుతున్నారు. బిల్లు అడిగిన రైతులకు ఈ ఎరువు స్టాక్ లేదని డీలర్లు దాటవేస్తుండటం పరిపాటైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలు చెల్లించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. వ్యవసాయశాఖ, పోలీసుశాఖలు సంయుక్తంగా ఎరువుల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు చాలా చోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. అధిక ధరలకు డీఏపీ విక్రయిస్తున్న ఒక్క డీలరుపై ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. అక్కడక్కడ 6 (ఏ) కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించిన కేసు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సాధారణంగా బస్తాపై ఎమ్మార్పీ కంటే రూ.పది, రూ.20 అంటే రైతులు మంచి మనసుతో పోనీలే అనుకుని చెల్లించేస్తారు. కానీ ఏకంగా రూ.వంద నుంచి రూ.మూడు వందల వరకు అధికంగా దోపిడీ జరుగుతుండటంతో జిల్లాలో ఈ వానాకాలం సీజనులో 7.62 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ సీజనుకు సంబందించి 18,395 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం అని వ్యవసాయశాఖ అంచాన వేసింది. రానున్న మూడు నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఏ నెలలో ఎంత అవసరం అనే దానిపై ప్రణాళిక రూపొందించింది. బీఆర్ఎస్లో చేరికలు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది యువకు లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.ఎరువుల విక్రయాల్లో దోపిడీ చర్యలు తీసుకుంటాం డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. ఎక్కువ ధరకు విక్రయించినట్లు ప్రూఫ్ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మా శాఖ ఆధ్వర్యంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు ఎనిమిది మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. కొందరిపై 6(ఏ) కేసులు కూడా పెట్టాం. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సాంకేతికతతో సత్వర న్యాయం
● మల్టీ జోన్ డీఐజీ –7 ఎల్ఎస్ చౌహన్ ● ఎస్పీ కార్యాలయం సందర్శన సంగారెడ్డి జోన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారానే కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయవచ్చని మల్టీజోన్ డీఐజీ 7 ఎల్ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు ’సీసీటీఎన్ఎస్’లో నమోదు చేస్తూ డేటా నాణ్యతను పెంచాలని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీసు సిబ్బంది పిల్లల పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు. స్టేషన్కు వచ్చే వారికి భరోసా కల్పించాలి హత్నూర(సంగారెడ్డి): పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకొని వారికి భరోసా కల్పించేలా పోలీస్ అధికారులు పనిచేయాలని డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ అన్నారు. మంగళవారం హత్నూర పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని సూచించారు. మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తనిఖీల్లో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రమణారెడ్డి ,ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
వర్షాకాలం.. పాముల భయం
హత్నూర (సంగారెడ్డి)/సంగారెడ్డి క్రైమ్: వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం, గ్రామాల్లోని వ్యవసాయ పొలాలతో పాటు దట్టమైన పొదల సమీపంలో పాములు కనిపిస్తుంటాయి. కాగా కొన్ని రోజుల క్రితం హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో విద్యార్థిని పాముకాటుకు గురై చనిపోయింది. ప్రతి ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల సంచారం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొలాల్లో పిచ్చి మొక్కలు పెరుగుతుండడంతో ఎక్కువ ఏ విషపురుగు ఉందో గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. అయితే జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. విష పాముల పట్ల నిర్లక్ష్యం వద్దు.. విషపూరిత పాములు పంట పొలాల్లో సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాములు ఎలుకలను, కప్పలను తినేందుకు బయట తిరుగుతూ చెట్లపొదల్లో ఉంటాయి. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. ముఖ్యంగా పాము కాటు వేసినప్పుడు రెండు లేదా నాలుగు గుర్తులు పడతాయి. అరగంటలోపు పాము విషం శరీరంలో పూర్తిగా పాకిపోతుంది. కళ్లు మూతలు పడటం, చేతులు, కాళ్లకు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రథమ చికిత్స తప్పనిసరి పాము కాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పాము కాటు వేసిన భాగాన్ని ఎక్కువగా కదిలించరాదు. ఆ భాగాన్ని బట్టతో లేదా టవల్తో గట్టిగా కట్టాలి. ఇలా చేయడం వల్ల విషం శరీరంలోకి వ్యాపించదు. సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు విషానికి విరుగుడుగా యాంటీ వీనం ఇస్తారు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.అన్ని పాములు విషం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాగుపాము, కట్లపాము , రక్తపింజర, వంటి పాములు వల్లే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా 50% పైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం పాము కాటుకు గురైతే నాడీ వ్యవస్థపై ప్రభావం జాగ్రత్తలు తీసుకోవాలన్న వైద్యనిపుణులుఅప్రమత్తత అవసరం పాము నుంచి రక్షించుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. పాము కాటుకు గురైతే యాంటీ వీనం మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో పొలం వద్దకు వెళ్లే రైతులు కాళ్లకు చెప్పులు వేసుకొని, భారీ శబ్దాలు చేస్తూ టార్చ్లైట్ వెంట తీసుకెళ్లాలి. – వినోద్, వైద్యుడు, సంగారెడ్డి -
ఓటును రక్షించుకుంటేనే హక్కులు
వట్పల్లి(అందోల్): ఓటు హక్కు కోల్పోయినట్లయితే ఆ వ్యక్తి మానవ హక్కులను కోల్పోయినట్లేనని, పేదవాడు ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని అల్మాయిపేట లక్ష్మిదేవి గార్డెన్లో మంగళవారం నిర్వహించిన ఎస్ఐఆర్ పై బీఎల్ఏలకు అవగాహన,శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని ఆరోపించారు. బెంగాల్లో 30 లక్షల ఓట్లను తొలగించారని, దీని వల్ల మమతా బెనర్జీ ఓటమికి బీజేపీ కారణమైందని విమర్శించారు. ఇప్పుడు ఓటు హక్కు కోల్పోతే ఐదేళ్ల వరకు పొందే అవకాశం లేదన్నారు. తెలంగాణను మరో బెంగాల్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రజలు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎస్ఐఆర్, ప్రక్రియ ద్వారా ఓటు హక్కును తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, ప్రతి ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని, అవసరమైన ఫారాలను నింపించి ఓటర్ల హక్కులను కాపాడాలని కోరారు. -
పట్టణ సమస్యలు పరిష్కరించండి
సంగారెడ్డి: పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వార్డు సభ్యులు మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన 16 అంశాలతో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాను న్న వర్షాకాలాన్ని అంచనా వేసుకొని పట్టణంలోని పలు వార్డులలో బురదమయం కాకుండా రూ.20 లక్షల నిధులు కేటాయించారు. అలాగే డంప్ యార్డ్ అభివృద్ధికి నిధులను కేటాయించి ఆమోదించారు. అలాగే పట్టణంలోని అన్ని సమస్యలను దశలవారీగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షఫీ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రఘు, టీపీఓ విశాల్, ఆర్ఐ స్వాతి, అధికారులు పాల్గొన్నారు. -
కదిలేదేలే..
బదిలీ అయినా వెళ్లనంటున్న తాత్కాలిక ఉద్యోగి ● పటాన్చెరు ఎంఎల్ఎస్ పాయింట్లో అక్రమాలు ● ఆరోపణలపై విచారణ పటాన్చెరు: బదిలీ అయినా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అక్కడే విధులు నిర్వహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా ఆమె అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జులు మాత్రం రెండేళ్లకు ఒకరు మారుతున్నారు. కానీ ఆ ఉద్యోగి మాత్రం నెలవారీ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అందరికీ వాటాలు పంచుతున్నారు. కారణాలేమైనా ఆమెను కదిలించే సాహసం ఎవరూ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆమెకు బదిలీ ఉత్తర్వులు అందినా తాను ఇక్కడి నుంచి కదలనంటుండటంతో రేషన్ డీలర్ల సైతం విస్తుపోతున్నారు. 40 మంది డీలర్లకు బియ్యం సరఫరా ప్రతి నెల పటాన్చెరు (ఎంఎల్ఎస్ పాయింట్) గోదాం నుంచి రేషన్ డీలర్లకు బియ్యం ఇతర సరుకులను సరఫరా చేస్తుంటారు. అయితే అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిలు ఎంత సరుకు వచ్చింది, ఎంత డెలివరీ అయ్యిందనే వివరాలను నమోదు చేస్తుంటారు. పటాన్చెరు పట్టణంలో 17 మంది రేషన్ డీలర్లతో పాటు పటాన్చెరు మండల స్థాయి స్టాక్(ఎంఎల్ఎస్) పాయింట్ నుంచి దాదాపు 40 మంది డీలర్లకు బియ్యం ఇతర సరుకులు సరఫరా చేస్తుంటారు. తరుగు పేరుతో నల్లబజారుకు.. కాగా గోదాంలో వచ్చిన లారీల నుంచి బియ్యం బస్తాలు దించినట్లు లెక్కలు చూపుతారు. కానీ హమాలీకి ఒక్క రూపాయి ఇవ్వకుండానే లారీల్లో వచ్చిన బియ్యం తరలిపోతుంటుంది. ఎలాంటి తూకం లేకుండా సరఫరా జరుగుతుంది. రేషన్ డీలర్లకు ఖాళీ సంచులకు బదులుగా చూపాల్సిన బియ్యం లెక్కలు, తరుగు పేరుతో జరిగే దోపిడీతో సరాసరి ప్రతి నెల దాదాపు పది టన్నులు అంటే ఓ లారీ బియ్యం నల్ల బజారుకు తరలుతుంది. దాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నతాధికారులకు కూడా అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. మొత్తం మీద ఆమె తీరుతో ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు, ఆ డీఓను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గోదాంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ను బదిలీ చేయాలని డీలర్లు ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన స్వయంగా ఓ లేఖ కూడా ఇచ్చారు. ఆమైపె వచ్చిన ఆరోపణలతో బదిలీ చేశారని, అయినా ఆమె ఆ స్థానాన్ని వదలకుండా ఉండేందుకు తాజాగా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. బదిలీ చేశాం పటాన్చెరు ఎంఎల్ఎస్ డాటా ఎంట్రీ ఆపరేటర్పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్నాం. ఇదివరకే చర్యలు తీసుకున్నాం. ఆమెను బదిలీ చేశాం. రెండు రోజుల క్రితమే జిల్లా అదనపు కలెక్టర్ ఆమె బదిలీ ఉత్తర్వులను వెలువరించారు. ఆమె అక్కడి నుంచి బదిలీ అయిన స్థానంలోకి వెళ్లాల్సిందే. కాదని పైరవీలు చేస్తే చూస్తూ ఉపేక్షించేది లేదు. – జయశ్రీ, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ, సంగారెడ్డి -
వాట్సాప్లో పాఠశాల సేవలు
● ప్రతీ సమాచారం ఇక అరచేతిలోనే.. ● సేవలు ప్రారంభించిన విద్యాశాఖ ● త్వరలో పూర్తి స్థాయిలో విస్తరణ నారాయణఖేడ్: సర్టిఫికెట్లు, ఇతర సేవల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు ముగిసిపోయాయి. సాంకేతికతను సామాన్యుడి ముంగిట్లోకి తెస్తూ రాష్ట్ర విద్యాశాఖ డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా సేవలు అందించనున్నారు. విద్యార్థులకు తమకు అవసరమైన సేవలను ఇక ఒక్క క్లిక్తో ఆన్లైన్లోనే పొందనున్నారు. ఈ సౌకర్యంతో వేలాది మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు ఈ విద్యాసంవత్సరం నుంచే సేవలను అమలులోకి తెస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే అమలు చేసింది. నాలుగు రోజుల క్రితం అధికారికంగా ప్రారంభించింది. కేవలం ఒక వాట్సాప్ సందేశంతో విద్యార్థులు తమ విద్యా పురోగతిని తెలుసుకోవడమే కాకుండా అవసరమైన ధ్రువపత్రాలను డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,265 ఉండగా, ఇందులో సుమారు 92 లక్షల మది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 10 మోడల్ స్కూల్స్లో 6,495 మంది, 22 కేజీబీవీల్లో 4,975, 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,596, 4 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 761, 7 గిరిజన సొసైటీ పరిధిలోని గురుకులాల్లో 3,387, 11 బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 5,456, 12 మైనార్టీ గురుకులాల్లో 4,916, 4 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 931 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. అందనున్న సేవలు.. విద్యార్థులకు ప్రస్తుతం కొన్ని రకాల సేవలు తక్షణం అందుతుండగా, మిగిత సేవలను అతి త్వరలో అందుబాటులోకి తసుకురానున్నారు. టెన్త్ మార్కుల మెమోలు, బోనాఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, విద్యార్థులు ప్రొగ్రెస్ కార్డులు, హాల్టికెట్ డౌన్లోడ్, ఫలితాల సమాచారం, మోమోల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు శాతం, ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజనం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహ పాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమ వివరాలు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ వివరాలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సేకరించి ఇప్పటికే యాక్టివేట్ చేశారు. పాలపిట్ట డిజిటల్ మస్కట్ విద్యాశాఖ, మీసేవ సహకారంతో వాట్సాప్ ఆధారిత పాఠశాల సేవలు పొందేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్గా ఎంపిక చేసింది. యానిమేషన్ రూపంలో ఉండే ఈ పాలపిట్ట విద్యార్థులకు సంక్లిష్టమైన సమాచారాన్ని సులభతరమైన వీడియోల ద్వారా వివరించనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ఈ వాట్సాప్ సేవలు వారధిలా పనిచేయనున్నాయి. -
ముంగిట్లోకే విత్తనాలు
వానాకాలం పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం సూచించిన విత్తనాలను వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ప్రభుత్వం సబ్సిడీ అందించనున్న ఏడు ప్రాధాన్యత సన్న రకాల వడ్లు అయిన బీపీటీ–5204, తెలంగాణ సోన, పీఎన్ఆర్–15048, కేఎన్ఎం–1638, జైశ్రీరామ్ సెగ్మెంట్, హెచ్ఎంటీ సోన, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715తో పాటు పప్పుధాన్యాలు కంది, మినుము, పెసరతో పాటు సోయాబీన్, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాల నాణ్యమైన నిల్వలు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా నానో యూరియా, డీఏపీని ప్రదర్శిస్తారు. వాటి గురించి రైతులకు డీలర్లు అవగాహన కల్పిస్తారు.వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న వేళ విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. మంగళవారం నుంచి వారం పాటు జిల్లాలోని 50 రైతు వేదికల్లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎల్నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పంటల మార్పిడిపై రైతులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. – జహీరాబాద్ వారం రోజుల పాటు మేళా నిర్వహించి అవసరమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రైతులు విత్తనాల కోసం పట్టణ కేంద్రాలకు పరుగులు పెట్టకుండా ఉండేందుకు డీలర్లనే గ్రామాలకు పంపించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి మండలంలోని రెండు నుంచి మూడు రైతు వేదికల్లో డీలర్లు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతారు. రైతు వేదిక పరిసర గ్రామాల రైతులు అక్కడికు వెళ్లి తమకు కావాల్సిన విత్తనాలను కొనుగోలు చేసుకునే సౌలభ్యం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా 50 రైతు వేదికల్లో విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యతలను ఏడీఏలకు అప్పగించారు. కార్యక్రమం ప్రారంభం రోజున ప్రజా ప్రతినిధులు, సబంధిత శాఖల అధికారులు, ప్రగతి శీల రైతులను భాగస్వాములను చేస్తారు. విత్తన మేళా ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. రైతుల గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఏఈఓలు రైతులకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, పంట వైవిధ్యం, నాణమైన విత్తనాల లభ్యత, ఎల్నినో ప్రభావం కారణంగా వేసుకోవాల్సిన పంటలపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమం సమయంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతుల వివరాలను ఓఎల్ఎంఎస్ పోర్టర్లో తప్పని సరిగా నమోదు చేయాలి. నేటి నుంచే విత్తన మేళా సద్వినియోగం చేసుకోవాలి రైతుల సౌలభ్యం కోసం వారం రోజులు విత్తన మేళా నిర్వహించనున్నాం. జిల్లాలోని 50 రైతు వేదికల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. డీలర్లు విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అనుమానాలను వ్యవసాయ శాఖ అధికారులు నివృత్తి చేస్తారు. –శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి -
మా పిల్లలు సర్కారు బడిలోనే..
ఆదర్శంగా బూచినెల్లి సర్పంచ్ జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ బడులను బలోపే తం చేసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు విశేష కృషి చేస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తున్నారు. మండలంలోని బూచినెల్లి సర్పంచ్ అలిగే సునీత కూడా గ్రామంలోని సర్కారు బడిలో తన కూతురిని చేర్పించి ఆదర్శంగా నిలిచారు. సోమవారం పాఠశాలలో అక్షరాభాస్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు 15 మంది పిల్లలు పాఠశాలలో చేరారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యఅందుతుందని, అందరూ సర్కారు బడికి పంపాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ మాణయ్య, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొలకెత్తిన పత్తి మునిపల్లి(అందోల్): ఖరీఫ్ సీజన్లో పత్తివిత్తనాలు నాటిన రైతులకు అదపాదడపా కురిసిన వర్షాల వల్ల మొలకెత్తాయి. మరికొందరు రైతులు పత్తి విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సరైన సమయంలో వర్షం పడితెనే పత్తి మొలకెత్తి ఎదుగుదలకు వస్తుందని రైతులు చెప్తున్నారు. సమయానికి వర్షం కురవకపోతే నాటిన విత్తనాలు కూడా మొలకెత్తని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నలు రాయికోడ్(అందోల్): మండలంలోని నల్లంపల్లి, ఇందూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలు ఇంకా కేంద్రాల్లోనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి లారీల కొరత వల్ల సకాలంలో కేంద్రాల నుంచి ప్రభుత్వ గిడ్డంగులకు జొన్నలను పంపడంలో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. నల్లంపల్లి సొసైటీ ద్వారా 8,600 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయగా ఇంకా 2 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. ఇందూర్ సొసైటీ ద్వారా 10 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేయగా 1,200 క్వింటాళ్ల జొన్నలు కేంద్రంలోనే ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో గోడౌన్లకు పంపిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. జొన్నలు విక్రయించిన రైతులు మాత్రం డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొండాపూర్(సంగారెడ్డి): పుట్ట గొడుగుల్లా అక్రమ వెంచర్లు అనే కథనం సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పందించారు. ఈ మేరకు కొండాపూర్ మండలం మల్కాపూర్లో అక్రమంగా వెలిసిన వెంచర్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ సర్వే నంబర్ 158లో వెలిసిన వెంచర్కి ఎలాంటి అనుమతులు లేకున్నా.. ప్లాట్లుగా విభజించారన్నారు. అలాగే ఇళ్లు నిర్మించి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికారులు మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించి తక్కువ ధరకే అంటూ ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వెంచర్కు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. యూరియా పంపిణీ కల్హేర్(నారాయణఖేడ్): బాచేపల్లి పీఏసీఎస్లో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. పర్సన్ ఇన్చార్జి సంగారెడ్డి మాట్లాడు తూ వానకాలం పంటల సాగు కోసం యూరియా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. బీఎల్ఓలకు అవగాహన కల్హేర్(నారాయణఖేడ్): కల్హేర్, సిర్గాపూర్లో సోమవారం బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. తహసీల్దార్లు శివశ్రీనివాస్, కిరణ్కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల పేర్లు మ్యాపింగ్ చేసే విధానంపై సూచనలు చేశారు. -
పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి
పటాన్చెరు: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో ఉన్న పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాల కల్పనలో తొలి ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశ్రమల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సోమ వారం సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ పార్కులో గల ఐలా కార్యాలయంలో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు, ఐలా అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం 120 పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి పరిశ్రమ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రిక్రూట్మెంట్ సమయంలో స్థానికులకు సమాచారం అందించాలని కోరారు. దీంతో పాటు ప్రజా కార్యక్రమాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలన్నారు. జులై మొదటి వారంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సుధాకర్ రెడ్డి, ఐలా కమిషనర్ శ్రీనివాస్, డీఈ సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ సంజయ్, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలి సంగారెడ్డి: సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్న్ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, రైతు సమస్యలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, విద్యా సంస్థలు, గ్రామీణ మౌలిక వసతులు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రూ.5 కోట్లతో నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, నాలుగు మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కంది మండలం ఉత్తర్పల్లి గ్రామ పరిధిలో రోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గిర్మాపూర్ గ్రామంలో త్రిపుల్ ఆర్ భూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో బయోమెట్రిక్ విధానాన్ని సడలించాలని ఎమ్మెల్యే కోరారు. జహీరాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మాణిక్రావు కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.గోదాంలో ‘వే బ్రిడ్జి’ ఏర్పాటు చేయండి సంగారెడ్డి: సివిల్ సప్లై గోదాంలో తక్షణమే వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గోదాంలో వే బ్రిడ్జి లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రేషన్ డీలర్లు ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించారు. టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంతకిషన్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల ప్రతినిధి బృందం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి సివిల్ సప్లై గోదాంలో వే బ్రిడ్జి కావాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో రేషన్ డీలర్ల సంఘం కంది మండల అధ్యక్షుడు శంకర్, ప్రతినిధులు శశికాంత్, యూసుఫ్ తదితరులు ఉన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026ఎస్పీ పరితోష్ పంకజ్సంగారెడ్డి జోన్: జిల్లాలోని యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల వాల్ పోస్టర్ ను సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. యాంటీ డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై కావేరి, తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
నేడు అందోలుకు మీనాక్షి నటరాజన్ రాక
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ప్రత్యేక శిక్షణజోగిపేట(అందోల్): పట్టణ సమీపంలోని లక్ష్మీదేవి గార్డెన్స్లో ఈనెల 23న ఉదయం 11 గంటలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందోల్ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తప్పనిసరిగా పాల్గొని అవగాహన పెంచుకోవాలని మంత్రి కార్యాలయం కోరింది. -
సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మిన్యాల్కల్(జహీరాబాద్): మనం సంపాదించిన దాంట్లో కొంత సొమ్మును సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని చాల్కి ప్రాథమిక పాఠశాలలో సంస్థ అధ్వర్యంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లతో పాటు నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడిచినా ఇప్పటికీ పలు పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం విచాకరమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు తమ సంస్థ కూడా పలు సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తుందని వివరించారు. జిల్లాలోని 22 పాఠశాలల్లో పలు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకొని ఉన్నతా శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సుయోధ్య, ఎంఈఓ మారుతి రాథోడ్, సర్పంచ్ జనార్దన్రెడ్డి, హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రులకు సుస్తీ
జిన్నారం (పటాన్ చెరు): ఉమ్మడి జిన్నారం మండలంలో ప్రభుత్వాస్పత్రులు నిర్మించి మూడేళ్లు గడిచినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పలు పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, స్థానిక ప్రజలు అనారోగ్యం పాలైతే వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. కాగా గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, కాజిపల్లి ప్రాంతాల పారిశ్రామిక వాడలోని పరిశ్రమల్లో ఉపాధి కోసం బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు రసాయన పరిశ్రమల్లో పని చేస్తూ సమీప ప్రాంతాల్లో నివాసముంటారు. కానీ వారికి సుస్తీ చేస్తే వైద్య సేవలు మాత్రం అందని ద్రాక్షగా మారాయి. ఉమ్మడి మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, బస్తీ దవాఖానలు ఉన్నా, గడ్డపోతారం పారిశ్రామికవాడలో అసలు వైద్య సేవలు అందించేందుకు దవాఖానలు ఇప్పటివరకు ఏర్పాటుకు నోచుకోలేదు. ప్రధానంగా పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో క్షతగాత్రులను వైద్యం కోసం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం పారిశ్రామికవాడలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడం శోచనీయం. దగ్గు, జ్వరం, జలుబు వంటివి వస్తే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికుల నెల వేతనంలో సగభాగం వైద్య ఖర్చులకే సరిపోతుంది. మంత్రికి వినతి.. కొంతకాలంగా పారిశ్రామికవాడలో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కార్మిక శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హాజరయ్యారు. ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని మంత్రికి స్థానిక నాయకులు వినతిపత్రం అందజేయగా ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఆస్పత్రుల ప్రారంభమెప్పుడో?కార్మికులకు అందని వైద్య సేవలు అనారోగ్యం బారిన పడితే ప్రైవేటు ఆస్పత్రికే.. జిన్నారం, నల్తూరులో దవాఖానాల నిర్మాణం పూర్తి మూడేళ్లయినా ప్రారంభానికి నోచుకోని దైన్యంజిన్నారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నూతన భవనాన్ని నిర్మించింది. భవన నిర్మాణం పూర్తయి మూడేళ్లకు పైబడినా ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే పట్టణ పరిధిలోని నల్తూరు గ్రామంలో పల్లె దవాఖానను నిర్మించి, ప్రారంభించడం మరిచారు. దీంతో స్థానిక ప్రజలు వైద్య సేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.నల్తూర్లో నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని బస్తీ దవాఖాన -
యువత మత్తు జోలికి వెళ్లొద్దు
తొగుట(దుబ్బాక): యువత మత్తు జోలికి వెళ్లొద్దని సీపీ సాధన రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గుడికందులలో మన పోలీస్–మన ఊరు కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలు, గ్రంథాలయాన్ని సర్పంచ్ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన గంజాయి, మత్తు పదార్థాలు నేడు పట్టణాలకు చేరాయన్నారు. యువత వాటి బారిన పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడలను ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ పర్శరాములు, ఎంఈవో నర్సయ్య, బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి విభీషన్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, అదనపు సీపీలు వెంకట్రెడ్డి, సుభాష్ చంద్రబోస్, కుషాల్కర్, హెచ్ఎం అంజిరెడ్డి, ఐకేపీ ఏపీఎం బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.సీపీ రష్మీ పెరుమాళ్ -
క్రైమ్ కేసులపై ప్రత్యేక దృష్టి
మెదక్జోన్: క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) 2.0పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల సిబ్బందికి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీటీఎన్న్ఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలంటే నిర్దేశిత సమయాన్ని పాటించడంతో పాటు డేటా నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్ఐఆర్లు, కేసు డైరీలు, దర్యాప్తు పురోగతి, చార్జిషీట్లు, తదితర వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని ఆదేశించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అప్డేట్లు, కొత్త ఫీచర్లు, వాటి వినియోగ విధానం, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
మెదక్జోన్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసిన ఘటనలో భర్తకు న్యాయస్థానం సోమవారం జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం... మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు మండలం కమలాపురం గ్రామానికి చెందిన లక్ష్మికి 20 ఏళ్ల క్రితం రేగోడ్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన కూతూరి కేశయ్యతో వివాహం జరిగింది. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కాగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కేశయ్య ఎనిమిదేళ్ల క్రితం ఆమె నుంచి విడిపోయాడు. అనంతరం లక్ష్మి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను పోషించుకుంటూ జీవనం సాగించింది. ఈ నేపథ్యంలో 2023 జనవరి 16న మేనమామను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా, వాగు సమీపంలో కాపుకాసిన కేశయ్య ఆటోను అడ్డగించి, ఆటో డ్రైవర్ను కత్తితో బెదిరించి పంపించాడు. అనంతరం లక్ష్మిపై కత్తితో దాడి చేసి హత్య చేయడంతో పాటు, ఆమె అక్కపై కూడా దాడి చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.జేసీబీకి నిప్పు..చిన్నశంకరంపేట(మెదక్): తన కబ్జాలో ఉన్న భూమిలో వద్దన్నా వినకుండా చదును చేస్తున్నారని ఆగ్రహించిన రైతు జేసీబీకి నిప్పుపెట్టాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట గ్రామశివారులో ఓ రైతు స్వాధీనంలో ఉన్న భూమిని తాను కొనుగోలు చేశానని హైదరాబాద్కు చెందిన వ్యక్తి జేసీబీతో చదును చేసేందుకు పనులు మొదలు పెట్టాడు. రెండు రోజుల క్రితం పనులు నిలిపివేసిన రైతు సర్వే జరిగే వరకు పనులు చేయవద్దని కోరాడు. సోమవారం రైతు తనకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లి వచ్చేలోపు జేసీబీతో పనులు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతు జేసీబీకి నిప్పు పెట్టాడు. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా, మెదక్ ఫైర్సిబ్బంది వచ్చి మంటలార్పారు. -
ఇరుకు గదుల్లో చదువు..ఎండలో భోజనం
సంగారెడ్డి సంజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు సరిపోకపోవటంతో కొత్త భవనానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. దీంతో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు రెండు గదుల్లోనేకూర్చుంటున్నారు. దీంతో అందరికీ ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎక్కడా నిలువనీడ లేకపోవటంతో ఎండలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వర్షాలు పడితే మాత్రం వారింకా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిర్మాణం త్వరగా అయ్యేలా చూడాలని విద్యార్థులుతల్లిదండ్రులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
సినీ ఫక్కీలో వ్యక్తి హత్య
చేగుంట(తూప్రాన్): సినీ ఫక్కీలో వ్యక్తిని ఆటోతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటన మండలంలోని అనంతసాగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్(30) వ్యవసాయంతో పాటు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ప్రభాకర్కు పొలం లేకపోవడంతో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. కాగా వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా ఆటో కిస్తీ డబ్బులు చెల్లించే విషయంలో మనస్పర్దలు ఏర్పడ్డాయి. రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో ఇద్దరు ఒకరినొకరు చంపుకొనే స్థాయిలో గొడవపడ్డారు. గ్రామస్తులు జోక్యం చేసుకొని శాంతింప జేశారు. సోమవారం శ్రీధర్ చేగుంట నుంచి బైకుపై బోనాల రోడ్డు వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనంతసాగర్ శివాజీ విగ్రహం వద్ద శ్రీధర్ బైకుకు ఆటో అడ్డురాగా మరో ఆటో అతడ్ని ఢీకొట్టింది. కాగా ఆటోలో నుంచి దిగిన వ్యక్తులు కిందపడిపోయిన శ్రీధర్ తలపై కొట్టి, చనిపోయాడనుకున్న తరువాత దుండగులు వచ్చిన ఆటోలోనే పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీధర్ను ప్రభు(ప్రభాకర్) హత్య చేశాడని, అతడిని అరెస్టు చేసే వరకు మృతదేహం తరలించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.మృతుడి బంధువుల ఆందోళన -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నారాయణఖేడ్: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని భూమయ్య కాలనీకి చెందిన దుర్గయ్య ఆదివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో సహా అక్కడికి వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండగా ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, 8 తులాల వెండినగలు, రూ.12 వేల నగదు చోరీ అయిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్టీంను రప్పించి ఇంట్లో ఆధారాలను సేకరించారు. స్థానిక సీఐ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. మోటార్ల కేబుల్ వై ర్లు.. కొమురవెల్లి(సిద్దిపేట): వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం మండలంలోని కిష్టంపేట, గౌరాయపల్లి, పోసాన్పల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది రైతుల బోరుబావుల మోటార్ కేబుల్ వైర్లను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. కాగా ఉదయం పొలా లకు వెళ్లిన రైతులు కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. సుమారు కేబుల్ వైరు విలువ రూ.లక్ష ఉంటుందని వాపోయారు. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. జూదం ఆడుతున్న ఐదుగురి అరెస్ట్చిన్నశంకరంపేట(మెదక్): బొమ్మ–బొరుసు ఆడుతున్న ఐదుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్పీ శ్రీనివాస్రావు తెలిపారు. నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామ శివారులో బొమ్మ బొరుసు ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20,769 నగదు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కుమ్మరి లింగం, శ్రీరామ్ సతీశ్, పెంజర్ల రాజేందర్, దేవసోత్ దశరథ్, చాకలి వెంకటేశ్ ఉన్నారు. కాగా నవీన్రెడ్డి, రాజునాయక్ తప్పించుకున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసిద్దిపేటఅర్బన్: విద్యుదాఘాతానికి గురైన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంగ రాంరెడ్డి (65) ఈ నెల 14న రోజు మాదిరిగానే తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం పశువులకు నీళ్లు తాగించి మరో చోటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ తీగ తగలడంతో కరంట్ షాకుకు గురయ్యాడు. గమనించిన పక్క పొలం రైతు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుమారులు కరుణాకర్రెడ్డి, లింగారెడ్డి అక్కడికి చేరుకొని గాయపడిన అతడ్ని 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత తిరిగి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంసిద్దిపేటకమాన్: కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ మురళి కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణం పశువుల అంగడి స్థలంలోని పాడుబడిన గదిలో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం రంగులో ఉన్న ప్యాంటు, షర్ట్ ధరించి, సుమారు 5.6అంగుళాల ఎత్తు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐస్క్రీమ్ తిని యువకులకు వాంతులు
శివ్వంపేట(నర్సాపూర్): ఐస్క్రీమ్ తిని ఇద్దరు యువకులు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... ఎక్సెల్పై ఐస్క్రీమ్ విక్రయించే వ్యక్తి రావడంతో గ్రామానికి చెందిన యువకులు శివ, నాగరాజు కొనుగోలు చేసి తింటుండగా దుర్వాసన వచ్చింది. దీంతో ఐస్క్రీమ్ డబ్బాతో పాటు విక్రయదారుడిని పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి 100కు డయల్ చేశారు. యూపీకి చెందిన ఐస్క్రీమ్ అమ్మకం దారుడు వినోద్ని గ్రామస్తులు ప్రశ్నించగా తాను మియాపూర్లోని హన్స్ డెయిరీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు చెప్పాడు. ఐస్క్రీమ్పై గడువు ముగిసే తేదీ లేదు. కాలం చెల్లిన ఐస్క్రీమ్ తినడం వల్ల వాంతులు చేసుకున్నామని యువకులు శివ, నాగరాజు వాపోయారు. పోలీసులు కల్పించుకొని సంబంధిత పుడ్ ఇన్స్పెక్టర్కు గ్రామస్తులచే ఫిర్యాదు చేయించారు. -
ఫ్లైఓవర్ పైనుంచి బోల్తాపడిన లారీ
జహీరాబాద్: జహీరాబాద్లోని పస్తాపూర్ వద్ద జాతీయ రహదారి ఫ్లైవర్ పైనుంచి అదుపుతప్పిన లారీ సర్వీసు రోడ్డుపై బోల్తా పడింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్ఐ లవకుమార్ కథనం ప్రకారం... మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ లోడ్తో ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్న లారీ ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుంచి పిట్టగోడను ఢీకొట్టి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు కాలు విరిగింది. లారీ బోల్తా పడిన సమయంలో సర్వీసు రోడ్డుపై ఎలాంటి వాహనాలు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా సర్వీసు రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.డ్రైవర్కు గాయాలు తప్పిన ప్రమాదం -
ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి
జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పార్టీ సానుభూతి పరుల ఓట్లు అక్రమంగా తొలగించే అవకాశం ఉందని, ఓటు చోరీ ప్రయత్నాలు జరిగితే ఎన్నికల అధికారుల దృష్టికి తేవాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ సూచించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో సర్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు అయ్యిందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా అక్రమంగా ఓట్లను తొలగించడం, నకిలీ ఓట్లను చేర్చడం లాంటి ప్రయత్నాలు జరిగితే వెంటనే స్పందించాలని చెప్పారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ యూనూస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్ అజ్మత్ ఉల్లా, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ -
కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోండి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నందికంది శివారులోని బ్లూ క్రాఫ్ట్ అగ్రో కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం పరిశ్రమ వద్ద ధర్నా, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, నాయకులు మాట్లాడారు. పరిశ్రమ వదిలిన వ్యర్థాలతో జల, వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలుష్య జలాలతో పశువులు మృతి చెందుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమను తనిఖీలు చేయని పీసీబీ అధికారులపై కూడా చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, శివరాం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ధార్మిక సేవలకు కొండపాక నిలయం
లేఖిని రచయితల సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మికొండపాక(గజ్వేల్): విద్య, వైద్యం, సామాజిక , ధార్మిక సేవలకు కొండపాక నిలయమని హైదరా బాద్కు చెందిన లేఖిని రచయితల సంఘం అధ్యక్షురాలు అత్తులూరి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ఫాదర్స్ డేను పురస్కరించుకొని కొండపాక శివారులోని ఆనంద నిలయం, అష్టాదశ శక్తి పీఠం ఉమామహేశ్వర స్వామి దేవాలయం, బాలసదనం, గోశాలను లేఖిని రచయితల సంఘం సభ్యులు సందర్శించారు. మాజీ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ సలహాదారుడు కేవీ రమణాచారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, కామేశ్వరి, సరస్వతి, నళిని మాట్లాడుతూ.. ఆనంద నిలయం ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వృద్ధులకు ఆశ్రయం కల్పించడం అద్భుతమన్నారు. అష్టాదశ శక్తి పీఠం ఉమామహేశ్వర స్వామి దేవాలయంతో ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింతగా పెంచాయని చెప్పారు. ఆనంద నిలయం మేనేజర్ పార్థసారధి సేవా కార్యక్రమాల నిర్వహణ తీరును వారికి వివరించారు. అనంతరం అనాథలకు బట్టలు, పండ్లు, బిస్కట్లు తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లేఖిని రచయితల సంఘం బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
యువ వికాసమేనా!
● పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష ● నిరుద్యోగుల్లో కదలిక ● ఏ కేటగిరీ వారీగా ఇస్తారోనన్న సందేహాలునారాయణఖేడ్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎంతో ఆర్భాటంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించడం..యువతలో ఆశలు మొగ్గలు తొడగడం..తర్వాతి కాలంలో పథకం మూలన పడిపోయింది. ఏళ్లుగా పథకం గూర్చి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురవుతూ వస్తోంది. కాగా, తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు గౌరవ్, సిక్తా పట్నాయక్ తదితరులతో సమీక్ష నిర్వహిస్తూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించనున్నామని వెల్లడించారు. దీని అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం గూర్చి చర్యలు ప్రారంభం కావడంతో స్వయం ఉపాధి పొందాలన్న ఆశతో ఉన్న యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. పథకానికి జిల్లాలో ఊహించని విధంగా భారీస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 2025 మార్చి 17న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. భారీగా నిరుద్యోగులు స్పందించి 51,657మంది దరఖాస్తులను సమర్పించారు. అత్యధికంగా బీసీ వర్గాల నుంచి 6,546 యూనిట్లకుగాను 23,681 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ విభాగంలో 7,415 యూనిట్లకు 14,480 దరఖాస్తులు, మైనార్టీ విభాగంలో 2,456 యూనిట్లకు 8,378 దరఖాస్తులు, ఎస్టీ విభాగంలో 2,502 యూనిట్లకు 4,232 దరఖాస్తులు, ఈబీసీలో 1,654 యూనిట్లకు 817 దరఖాస్తులను సమర్పించారు. రూ.50వేల లోపు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కేటగిరీ 1లో చేర్చారు. రూ.50వేల నుంచి రూ.1లక్ష మధ్య ఉన్న దరఖాస్తులదారులను కేటగిరీ 2లో, రూ.1లక్ష నుంచి రూ.2లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 3గా, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 4లో చేర్చారు. -
ప్రశాంతంగా నీట్
2,597 మంది అభ్యర్థులు హాజరు ● నిమిషం ఆలస్యంతో విద్యార్థినికి నో ఎంట్రీసంగారెడ్డి ఎడ్యుకేషన్: వైద్య కళాశాలల్లోని పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష రాసేందుకు సమయం 180 నిమిషాలు మాత్రమే ఉంటుండగా ప్రస్తుతం పరీక్ష రాసేందుకు 195 నిమిషాల సమయాన్ని కేటాయించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 నిమిషాల వరకు జరిగింది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందు నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 2,924 మంది అభ్యర్థులకు గాను 2,597 మంది హాజరు కాగా 327 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. తారా కళాశాలలో ఒక విద్యార్థి నిమిషం ఆలస్యం రావడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్, డీఎస్పీ సత్తయ్యగౌడ్ సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. డల్లాస్ నుంచి వచ్చి.. హిమనీష్ వెలువలి అనే విద్యార్థి కుటుంబం అమెరికాలోని డల్లాస్లో స్థిర పడింది. నీట్ రాసేందుకు సంగారెడ్డికి వచ్చాడు. హిమనీష్ బీరంగూడలోని అతడి పెదనాన్న ఇంటికి చేరుకుని అక్కడి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. గత నెలలో జరిగిన పరీక్ష కు సైతం హాజరయ్యాడు. ఒకసారి వస్తే సుమారు రూ.2 లక్షల ఖర్చు అయ్యిందని, రెండు సార్లు పరీక్ష రాసేందుకు రావడంతో రూ.4 లక్షల ఖర్చు అయ్యిందని వాపోయాడు. -
ఆస్పత్రి నుంచి వెళ్లి.. నదిలో శవమై
జోగిపేట(అదోల్)/చిలప్చెడ్ (నర్సాపూర్): మానసిక పరిస్థితి బాగా లేని వ్యక్తి ఆస్పత్రి నుంచి వెళ్లి నదిలో శవమై తేలాడు. ఈ సంఘటన జోగిపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలో నివాసం ఉంటున్న మేకల బసంత్(45) మానసికంగా ఇబ్బందులకు గురి అవుతుండటంతో గురువారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు భార్య టీ తాగించిన అనంతరం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య తుల్జమ్మ జోగిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ఎలాంటి సమాచారం తెలియకపోగా ఆదివారం మధ్యాహ్నం చిలప్చెడ్ మంజీర నదిలో ఒడ్డుకు చేరిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా సర్పంచ్ అనీల్కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జోగిపేట పీఎస్లో మిస్సింగ్ కేసు ఉండటంతో మృతదేహాన్ని జోగిపేటకు తరలించారు. -
శివకుమార్కు హరీశ్రావు పరామర్శ
జహీరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్ను పరామర్శించారు. శివకుమార్ తండ్రి ఈశ్వరయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న హరీశ్రావు ఆదివారం జహీరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న శివకుమార్ను హరీశ్రావు ఓదార్చారు. ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్, ఆయా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, వై.నరోత్తం, ఎం.డి.తన్వీర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, భిక్షపతిలతోపాటు ఆయా పార్టీల నాయకులు శివకుమార్ను పరామర్శించారు. -
‘బెస్ట్ అవైలబుల్’ సమస్యలు పరిష్కరించాలి
గజ్వేల్రూరల్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వివిధ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం గజ్వేల్లో మాల సంఘాల జేఏసీ వైస్చైర్మన్ తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న వారిలో కొంతమంది విద్యార్థుల జాబితా ఆన్లైన్లో నమోదు కాలేదన్నారు. దీంతో సదరు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. చైర్మన్ బక్కి వెంకటయ్య సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ కమిషనర్తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎల్లేశ్, యాదగిరి, శివకుమార్, రాజేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి దుబ్బాకరూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం మండలంలోని హబ్సిపూర్లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి
మంత్రిని కలిసిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ప్రతినిధులుహుస్నాబాద్: సర్ కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటరు జాబితాలో కొనసాగింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధి సుతారి సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మంత్రిని కలిసి చర్చించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటును కొనసాగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
వేపకు ఏమైంది!
● కనిపించని పూత, కాత ● వేప గింజల కొరతజహీరాబాద్ టౌన్: ఆయుర్వేదంలో వేప చెట్టును సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. వేప ఆకు, పూత, కాత ఇలా చెట్టు నుంచి వచ్చే ప్రతిది ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్తో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతూ మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. మొన్నటి వరకు మునుపెన్నడూ లేని విధంగా ఒకటి రెండు కాదు..ఊర్లు, పట్టణాలు, పొలం గట్లపై ఎక్కడ చూసినా ఎండిపోయిన వేపచెట్లు దర్శనమిచ్చాయి. ఉగాది పర్వదినం నాటికి వేప చెట్లు మళ్లీ జీవం పోసుకున్నాయి. పచ్చని ఆకులతో చెట్లకు పూర్వ వైభవం వచ్చింది. కానీ జూన్ నెల వచ్చినా చెట్లకు కనిపించాల్సిన కాత రాలేదు. ఈ సారి వేప పువ్వు లేకుండానే ఉగాది పచ్చడిని చేసిన విషయం తెలిసిందే. వేప గింజల నుంచి కషాయాలు, పిండి, నూనె, సబ్బులు, పేస్టులతో పాటు చర్మ సంబంధిత ఔషధాలను తయారీ చేస్తారు. ఈ సారి చెట్లకు కాత లేకపోవడంతో గింజల కొరత నెలకొంది. -
ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు వేళాయె..
నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం సోమవారం నుంచి ఐదు రోజుల పాటు టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాకు ఒక సెంటర్ చొప్పున సిద్దిపేటలోని రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలకు కౌన్సెలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రస్తుతం హుస్నాబాద్లో కౌన్సెలింగ్ సెంటర్ను ఏర్పాటు చేయించారు. సోమవారం నుంచి స్థానిక శాతవాహన యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 19 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కావడంతో మొదటి రోజు కౌన్సెలింగ్కు రాజగోపాల్పేట కళాశాలకు 428 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా హుస్నాబాద్కు సెంటర్ కేటాయించిన విషయం తెలియకపోవడంతో 42 మంది విద్యార్థులు మాత్రమే స్లాట్బుక్ చేసుకున్నట్లు తెలిసింది.ముందుగా స్లాట్ బుకింగ్.. తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు విద్యార్థుల ఈఏపీసెట్ ర్యాంకుకార్డు, హాల్టికెట్, ఆధార్కార్డు, పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ బోనఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఓసీ విద్యార్థులు 2026లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలి. అలాగే అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీ, ఓటీపీ కోసం మొబైల్ వెంట తీసుకెళ్లాలి.నేటి నుంచి ఐదు రోజులు ధ్రువపత్రాల పరిశీలన -
పుట్టగొడుగుల్లా అక్రమ వెంచరు!్ల
● అక్రమ లే ఔట్లకు అధికారులే అండ ● అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులుకొండాపూర్(సంగారెడ్డి): ప్రస్తుతం రియల్ ఎస్టేట్ తగ్గిపోవడంతో డబ్బులు సంపాదించుకోవడానికి రియల్ వ్యాపారులు మరో కొత్త పంథాను తెరమీదకు తీసుకువస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా వాటిని ప్లాట్లుగా మారుస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి అధికారులతోపాటు అధికారపార్టీకి చెందిన నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామం ప్రస్తుతం హాట్ కేక్లా మారింది. ఈ గ్రామ శివారులో గల సర్వే నం 158లో ఒక ఎకరా 8 గుంటల వ్యవసాయ పట్టా భూమిని కొంతమంది వ్యక్తులు సిండికేట్గా మారి అభివృద్ధి చేస్తామని రైతు వద్ద పర్సెంటీజీలుగా మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు చేయాలంటే తప్పనిసరిగా ఆ భూమిని నాన్అగ్రికల్చర్గా మార్చాలి. కానీ, ఈ నిబంధనలేవీ లేకుండానే వెంచర్కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ భూమిలో ప్లాట్లు ఏర్పాటు చేసి బోర్లను కూడా ఏర్పాటు చేశారు. వెంచర్లో ఇళ్లు నిర్మించి వాటిని తక్కువ ధరలకే అంటూ విక్రయించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాపూర్ శివారులో రూ.30 వేల నుంచి సుమారు రూ.50 వేల వరకు గజం ధర ఉంది. ఒక వంద గజాల స్థలం కొనాలంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవుతుంది. అదే నిర్మించిన ఇల్లును మాత్రం రూ.50 లక్షలకే అంటూ వారిని మోసం చేసి వాటిని విక్రయించి అమాయక ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారు.ప్రభుత్వ ఆదాయానికి గండి గ్రామాల్లో గల వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలి అంటే ముందుగా నాలా కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఆన్లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వెంచర్ ఏర్పాటు చేస్తే నిబంధనలకు అనుగుణంగా 40 ఫీట్ల రహదారితోపాటు అండర్ డ్రైనేజీ వ్యవస్థ, ఆడుకునేందుకు ఆటస్థలంతోపాటు హెచ్ఎండీఏ పర్మిషన్ ఉండాలి. ఇలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. మామూళ్లకు అలవాటు పడి అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.అనుమతుల్లేని వెంచర్లపై చర్యలు కొండాపూర్ మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. ఈ మండలంలో వెంచర్లను ఏర్పాటు చేయాలంటే హెచ్ఎండీఏ పర్మిషన్ తీసుకోవాల్సింది. అక్రమ వెంచర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ముందుగా తక్కువ ధరకే ఇళ్లు అంటే కొని మోసపోవద్దు. – మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సంగారెడ్డి -
రైతుల మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
టీజీటీపీసీ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి వట్పల్లి(అందోల్): వానాకాలం సాగు పంటలు మొదలైనా రైతులకు రైతు భరోసా సాయం అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నోటి మాటలతో కాలం వెళ్లదీస్తూ రైతులను మోసం చేస్తోందని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి మండిపడ్డారు. స్థానిక విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ..నాడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేసేవారన్నారు. ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎరువుల సరఫరా దారుణంగా తయారైందన్నారు. తక్షణమే అర్హులైన రైతులందరికీ ‘రైతు భరోసా’డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలిరాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య సంగారెడ్డి: పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్భవన్లో గల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను త్వరగా విడుదల చేయాలన్నారు. 28వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని చెప్పడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను చదువులకు దూరం చేయడం ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వమే ప్రోత్సహించినట్లు అవుతుందని మండిపడ్డారు. బీసీ సంఘం తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రొఫెసర్ జయశంకర్ బాటలోనే టీఆర్ఎస్సంగారెడ్డి జిల్లా పార్టీ ఇన్చార్జి బాలయ్య జోగిపేట(అందోల్): ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలోనే మాజీ ఎమ్మెల్సీ కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ నడుస్తుందని సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాలయ్య తెలిపారు. ఆదివారం జోగిపేటలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హనుమాన్ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆయన తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. -
అర్హులైన వారు ఓటరుగా నమోదవ్వాలి
జోగిపేట(అందోల్): అర్హులైన ప్రతీ ఒక్క పౌరుడు ఓటరుగా నమోదయ్యేలా బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ఆందోల్, వట్పల్లి, పుల్కల్, చౌటకూరు మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ (బీఎల్ఏ)లతో మంత్రి సంగారెడ్డిలోని తన నివాసంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సవరణలు చేపట్టేందుకు కృషి చేయాలని, అర్హులైన ఓటరు ఓటర్ల జాబితా నుంచి తొలగింపు లేకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమన్నారు. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కుపై అవగాహన పెంపొందించే దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జర్నలిస్ట్ భూమయ్యను పరామర్శించిన మంత్రి సికింద్రాబాద్–బోయినపల్లిలోని హెకా రిహబ్ సెంటర్లో బ్రెయిన్ స్ట్రోక్కు గురై చికిత్స పొందుతున్న ఆందోల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు కనకంటి భూమయ్యను ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భూమయ్యకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.బూత్ లెవెల్ ఏజెంట్లతో మంత్రి దామోదర రాజనర్సింహ -
దూసుకొచ్చిన మృత్యువు..
● రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్ ● అక్కడికక్కడే గృహిణి దుర్మరణంవర్గల్(గజ్వేల్): బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గృహిణిని కబళించింది. ఈ దుర్ఘటన శనివారం రాత్రి మండలంలోని గౌరారం వద్ద రాజీవ్రహదారిపై చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, స్థానికులు కథనం ప్రకారం... గౌరారం గ్రామానికి చెందిన పూదరి వెంకటేశ్గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య మంజుల(37), పద్మాలుగేళ్లలోపు అనీశ్గౌడ్, శ శాంక్గౌడ్ ఇద్దరు కుమారులున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి, నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నది. మామిడ్యాల కమాన్ వద్ద రోడ్డు దాటుతుండగా చేర్యాలకు చెందిన కాత అజయ్ బైక్పై హైదరాబాద్ వైపు నుంచి మితిమీరిన వేగంతో వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటివరకు బంధుగణంతో, కుటుంబీకులతో మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిన మంజుల కొద్ది సేపట్లోనే మృతిచెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు. బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని తొనిగండ్ల గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... దంతేపల్లికి చెందిన దేవరాజు, రాజయ్య స్వగ్రామం నుంచి బైక్పై రామాయంపేట వస్తుండగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఎస్ఐ బాల్రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతన్న వర్షాతిరేకం
● వర్షంతో పంటలకు ప్రాణం ● విత్తనాలు విత్తుకోవడంలో రైతులు బిజీన్యాల్కల్(జహీరాబాద్): కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. సాగుకు సన్నద్ధమవుతున్న రైతులతోపాటు సాగు చేసుకున్న వారు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజులుగా వర్షాలజాడ లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. సాగు చేసుకున్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వేసే పంటలకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. 2.70లక్షలు ఎకరాల్లో పంటల సాగు అకాల వర్షాలతో పాటు జూన్ ప్రారంభంలో కురిసిన కొద్ది పాటి వర్షాలకు కొంత మంది రైతులు విత్తనాలను విత్తుకోగా మరి కొంత మంది రైతులు వేచి చూసే ధోరణిని అవలంబించారు. జిల్లాలో 2.70లక్షలు ఎకరాల్లో పంటలు సాగు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా 1.70 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసుకున్నారు. సాగు చేసుకున్న పంటల్లో కొన్ని మొలకెత్తగా మరి కొన్ని కుళ్లిపోయి మొలకెత్తలేదు. 14 మిల్లీ మీటర్ల వర్షం గత వారం రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా రాత్రి అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 14.1 మి.మీ వర్ష పాతం నమోదైంది. ఝరాసంగంలో 54.3, కొండాపూర్లో 35.2, న్యాల్కల్లో 30.0, కోహీర్లో 22.3, సిర్గాపూర్ మండలాల్లో 20.0 మిల్లీ మీటర్ల అధిక వర్షపాతం నమోదు కాగా నిజాంపేట్, అమీన్పూర్, నారాయణఖేడ్, హత్నూర, ఆర్సీపురం, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాల్లో తక్కువ వర్ష పాతం నమోదైంది. పంటలు సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఒత్తిడిని తగ్గించే ఔషధం ‘యోగా’
సిద్దిపేటకమాన్: నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల ను నిర్వహించే పోలీసు సిబ్బందికి యోగా అద్భుతమైన ఔషధమని సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరు మాళ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీ, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన పోలీస్ బలగమే సురక్షితమైన సమాజానికి పునాది అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ సుభాస్ చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు మహేందర్రెడ్డి, మురళి, లక్ష్మీబాబు, విద్యాసాగర్, వాసుదేవరావు, ముత్యంరాజు, దుర్గ, ఎస్ఐలు కరుణాకర్రెడ్డి, రాజేశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


