Sangareddy
-
ఏఐతో భారత్కే అధిక లాభం
బీసీ గురుకుల సంస్థల జాయింట్ సెక్రటరీ శ్యామ్ప్రసాద్లాల్ వర్గల్(గజ్వేల్): ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో అధిక లాభం పొందేది భారతదేశమేనని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల సంస్థల జాయింట్ సెక్రటరీ శ్యామ్ప్రసాద్లాల్ అన్నారు. వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ విభాగం అధికారులు ‘మర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏఐ వల్ల కలిగే లాభనష్టాలను వివరించారు. సదస్సులల్లో విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. సదస్సులో చైన్నె విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ, ఘట్కేసర్ శ్రీనిధి యూనివర్సిటీ, గవర్నమెంట్ సిటీ కాలేజీ, అరోరా కాలేజీ, సోషల్ వెల్ఫేర్ కాలేజీలు, నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, హైద్రాబాద్ జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల రీసెర్చ్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించారు. వీటి సారాంశాన్ని సావెనీర్గా రూపొందించారు. సదస్సులో శ్రీనిధి యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మ, రాధిక, సాహెలీ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు, వైస్ప్రిన్సిపాల్ గోవిందరావు, ఏటీపీ ఉమామహేశ్వరి, డాక్టర్ నిఖిత, డాక్టర్ రాధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషన్ పేరుతో ఫేక్ కాల్స్ ట్రేడ్ లైసెస్స్ ఫీజులు చెల్లించాలని వ్యాపారులకు ఫోన్ సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఉమా పేరుతో సైబర్ కేటుగాళ్లు ఫేక్ కాల్స్ చేయడం కలకలం రేపింది. ట్రేడ్ లైసెస్స్ ఫీజులు చెల్లించాలని రెన్యూవల్ చేసుకోవాలని, మిషన్ భగీరథ బిల్లులు చెల్లించాలని శుక్రవారం ఉదయం నుంచి వ్యాపారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేయడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. అనుమానం రావడంతో విషయాన్ని వ్యాపారులు కమిషనర్కు చెప్పారు. మున్సిపల్ బిల్ కలెక్టర్లకు గాని మున్సిపల్ అధికారిక ఖాతాలో మాత్రమే బిల్లులు చెల్లించాలని ఇలాంటి ఫేక్ కాల్స్ నమ్మొద్దని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఉమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ మహేశ్గౌడ్ తెలిపారు. -
అప్పులు భారమై.. మద్యానికి బానిసై
వర్గల్(గజ్వేల్): చేసిన అప్పు లు భారమై, మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం మేరకు.. వర్గల్కు చెందిన కిస్టనోళ్ల నర్సింలు(58) హమాలీ. భార్య అండాలు, కూతురు, కుమారుడు ఉన్నారు. రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఏడాదిన్నర కిందట కూతురి వివాహం చేశాడు. కాలికి గాయం కావడంతో నాలుగు నెలల నుంచి ఏ పని చేయకుండా ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన భర్తను రోజు తాగి వస్తే అప్పు ఎలా తీరుతుందని భార్య మందలించింది. దీంతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కౌలుకు తీసుకున్న పొలంలో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి.. శివ్వంపేట (నర్సాపూర్): ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధి గూడూరు గ్రామానికి చెందిన బోయిని మల్లేశ్ యాదవ్ (45) ఆర్థిక ఇబ్బందులతోపాటు మద్యానికి బానిసయ్యాడు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం -
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే..
దుబ్బాక : సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతామని కలెక్టర్ మనుచౌదరి, జిల్లా జడ్జి సాయిరమాదేవి అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో కోర్టు భవనం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కమిటీ మేర కు కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 4 ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. జిల్లా న్యాయ, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ ఇతర అధికారులందరూ కలిసి దుబ్బాకలో కోర్టు నిర్మాణానికి 1.32 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు పూర్తి ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. త్వరలోనే స్థల సేకరణ పూర్తిచేసి భవన నిర్మాణం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ సంజీవ్కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు. పలు కార్యాలయాల సందర్శన పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ మనుచౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని పరిశీలించారు. ఖాళీగా ఉన్న గదులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించేందుకు సంబంధిత అధికారులతో చర్చించాలని తహసీల్దార్ సంజీవ్కు సూచించారు. దుబ్బాక పట్టణంలో కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణం స్థల పరిశీలనలో కలెక్టర్ మనుచౌదరి, జిల్లా జడ్జి సాయి రమాదేవి -
ప్రాణం తీసిన ఈత సరదా
చెరువులో మునిగి విద్యార్థి మృతి రామాయంపేట(మెదక్): చెరువులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాల గ్రామంలో చోటు చేసకుంది. పోలీసుల కథనం మేరకు.. కాట్రియాల గ్రామానికి చెందిన కాస రాజు కుమారుడు రిస్విత్(12), బాబాయి కుమారుడు రేవంత్, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి గ్రామ శివారులోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి రిస్విత్ మృతి చెందాడు. మృతుని తండ్రి కాస రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రిస్విత్ ఏడవ తరగతి చదువుతుండగా ఒంటి పూట బడులు కావడంతో విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. అంగడి వేలం రెండోసారి వాయిదా హుస్నాబాద్: వారాంతపు సంత బహిరంగ వేలం పాట శుక్రవారం మరోసారి వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే.. 17న మొదటి సారి బహిరంగ వేలం పాట నిర్వహించారు. గతేడాది అంగడి వేలం రూ. కోటి 20 లక్షల 26 వేలు పలికింది. దీనికి అదనంగా 5 శాతం కలిపి రూ. కోటి 26 లక్షల 27 వేల 300కు సర్కార్ పాటను ప్రారంభించారు. వేలం పాటను తగ్గించాలని గుత్తేదారులు ఎవరూ పాట పాడకపోవడంతో వేలం వాయిదా వేశారు. ఈ విషయాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దృష్టికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తీసుకెళ్లారు. వేలంను తగ్గించేది లేదని నిబంధనల ప్రకారం అంగడి వేలం పాటను నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మరోసారి నిర్వహించారు. గుత్తే దారులు మెట్టు దిగకుండా వేలం పాటను తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించిన తర్వాతే వేలంలో పాల్గొంటామని వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో రెండోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
‘ఐలా’ ఎన్నికలు రసవత్తరం
● ఏకగ్రీవానికి ఎత్తుకు పైఎత్తులు ● 27న పాలకవర్గ ఎన్నికలు పటాన్చెరువు: పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) పాలకవర్గం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను స్క్రూట్నీ దశలోనే పోటీ నుంచి తొలగించాలనే కుట్రలు ఓ వైపు, అలా చేస్తే తాము కోర్టుకై నా వెళ్తామని ఆశావహులు మరోవైపు పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల రాజకీయాలు మరింత రసకందాయకంలో పడ్డాయి. ఐలా పాలకవర్గానికి మొత్తం 17 పదవులున్నాయి. చైర్మన్, వైస్చైర్మన్ పదవులతోపాటు ఇతర సభ్య స్థానాలకు పోటీ జరుగనుంది. ఇందుకు నోటిఫికేషన్ ఈ నెల 5న వెలువడింది. ఈ నెల 19కే నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. స్క్రూట్నీ అభ్యర్థుల ప్రక్రియ శనివారం నాటికి తేలనుంది. ఇంతలోనే కొందరు వ్యక్తులు చక్రం తిప్పి ఐలా పాలక వర్గాన్ని తమ గుప్పిట్లోనే పెట్టుకోవాలని చేస్తున్న రాజకీయాలపై కొందరు పారిశ్రామికవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. నేడు పేర్లు ఖరారు శనివారం నాటికి బరిలో నిలిచే వ్యక్తుల పేర్లు ఖరారు కానున్నాయి. ఒక వర్గం తమ అనుచరులు లేదా ప్యానెల్కు చెందిన వారే చైర్మన్గా ఇతర అన్ని పదవులకు పోటీ చేయాలని ఎన్నికలు ఏకగ్రీవం కావాలని చేస్తున్న ప్రయత్నాలు సాధారణ ఎన్నికల రాజకీయాలకు మించి తలపిస్తున్నాయి. ఇక రెండో వర్గం వారు కూడా కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి నెలకొంది. సభ్యత్వాల నమోదు కూడా లోపభూయిష్టంగా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఓటర్ల జాబితా తయారీలో కూడా తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట సభ్యత్వాలు ముందుగానే తీసుకున్నారని తెలుస్తోంది. దాదాపు ఇందుకోసం ఓ వర్గం రూ.1.40లక్షలు సొంత సొమ్మును కట్టి సభ్యుల పేరిట సభ్యత్వాల రశీదులను ఈ నెల 13,14 తేదీల్లో తీసుకున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఒకరు ఆయనతోపాటు మరికొందరు ఒక కోటరీగా ఏర్పడి సభ్యత్వాల నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఒక పారిశ్రామికవేత్త ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆయనను తప్పించేందుకు ఆయనపై లేనిపోని విమర్శలు చేసి అనర్హుడిగా ప్రకటించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటాన్చెరు ఐలా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రాజకీయాలు ఎప్పుడూ జరగలేదని పారిశ్రామికవేత్తలు చర్చించుకుంటున్నారు.చైర్మన్ పదవి రేసులో ప్రముఖులు చైర్మన్ పదవి రేసులో బాసిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, సుధీర్రెడ్డి, ఆనంద్రెడ్డి లాంటి ప్రముఖులున్నారు. అయితే అన్ని పదవులకు పోటీ గట్టిగానే ఉంది. ప్రధానంగా అన్ని స్థానాలు ఏకగ్రీవంగా జరగాలని ఒక వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఐలా పరిధిలో దాదాపు 450 ఇండస్ట్రియల్ ప్లాంట్లు ఉండగా అందులో మొత్తం 379 పారిశ్రామికవేత్తలు తమ పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు లేదా అర్హులైన సభ్యులు ఉన్నారు. -
వైద్యం జాడలేదు
నిలువ నీడ లేదు..ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కానరాని వసతులువడదెబ్బతో మహిళా కూలీ మృతి నారాయణఖేడ్: వడదెబ్బతో ఉపాధి హామీ మహిళా కూలీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఖేడ్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. తోటి కూలీల కథనం మేరకు.. ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామ శివారులో ఉపాధి హామీ కింద కొద్ది రోజులుగా కాల్వ తవ్వకం పనులు జరుగుతున్నాయి. రోజూలాగే శుక్రవారం గ్రామానికి చెందిన బోయిని లచ్చవ్వ (52) పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై స్పృహతప్పి కిందపడిపోయింది. తోటి కూలీలు ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త బోయిని భూమయ్య రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. గ్రామాల్లో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించాలన్నది ఉపాధి హామీ లక్ష్యం. ఈ క్రమంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రతీ ఏటా గ్రామాల్లో ఉపాధి పనులు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో విస్తృతంగా పనులు కల్పిస్తున్నప్పటికీ అదే రీతిలో తగిన వసతులు కల్పించడం లేదు. ఉపాధి కూలీలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు టెంట్లు, తాగునీటి వసతి, అత్యవసర సమయాలకు ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ సదుపాయాలు జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. – సంగారెడ్డి జోన్/నారాయణఖేడ్ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే వారికి పదేళ్ల క్రితం పనిముట్లు, టెంట్లు పంపిణీ చేశారు. గ్రూపులో ఉన్న నలుగురు సభ్యులకు కలిపి నాలుగు గుంతలు తవ్వేందుకు గడ్డపారలను అందించారు. అప్పటినుంచీ ఇప్పటివరకు తిరిగి ఎలాంటి పనిముట్లు అందించలేదు. దీంతో కూలీలే తాము కొనుగోలు సొంత పనిముట్లు తీసుకువచ్చి పనులు ముగిస్తున్నారు. పనిముట్లకు సంబంధించి ఎలాంటి భత్యం చెల్లించడం లేదని తెలుపుతున్నారు. కనిపించని మెడికల్ కిట్లు పనులు చేసే సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించేందుకుగాను మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ, ఎక్కడ చూసినా పని ప్రదేశాల్లో మెడికల్ కిట్లు కనిపించడం లేదు. పలుమార్లు ఉపాధి కూలీలకు గాయాలైతే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదని కూలీలు తెలిపారు. గొలుసుటెంట్లు లేక.. చెట్ల కింద సేద రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రతీ ఒక్కరు జంకుతున్నారు. ప్రతీరోజు ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు పనులు చేస్తున్నారు. పనులు ముగిసిన తర్వాత ఆన్లైన్ విధానంలో కూలీల హాజరు వేస్తుంటారు. ఆ సమయంలో పనులు చేసిన పరిసరాల్లో చెట్లు ఉంటే సేద తీరుతున్నారు. వేడిగా తాగునీరు వేసవిలో ఎక్కువగా నీరు తాగాలని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. పనులకు వెళ్లిన సమయంలో కూలీలు తమ ఇంటి నుంచి నీటిని బాటిళ్లలో తీసుకు వెళ్తున్నారు. పెరుగుతున్న ఎండలకు ఇంటి నుంచి తీసుకువెళ్లిన తాగునీరు పూర్తిగా వేడిగా మారుతున్నాయని తాగలేకపోతున్నామని ఉపాధి హామీ కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న కూలీల సంఖ్య ఉపాధి హామీ పథకంలో రోజురోజుకీ కూలీల సంఖ్య పెరుగుతుంది. జాబ్ కార్డు కలిగి ఉండి అర్హులైన ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 1,32,000 మందికి జాబ్ కార్డులు ఉండగా రెండు లక్షల 25 వేల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 35 వేలకు పైగా మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. కానీ, కూలీలకు వసతులు కల్పి ంచడంలో అధికారులు విఫలం అవుతున్నారు.జిల్లాలో యాక్టీవ్ జాబ్ కార్డులు 1,32,000 రోజూ హాజరయ్యే కూలీలు 35,000లకు పైగా ఏళ్లుగా అందని పరికరాలు అత్యవసర మెడికల్ కిట్లు, టెంట్లు కరువు గాయాలైతే ఆరోగ్య కేంద్రానికి పరుగులు చెట్ల కిందే సేద తీరుతున్న కూలీలు తాగు నీటి వసతి అంతంతే వడదెబ్బకు నారాయణఖేడ్ మండలం ర్యాకల్లో ఒకరు మృతి నాలుగేళ్లుగా అదనపు భత్యం బంద్ ఉపాధి కూలీలు వేసవిలో చేసే పని ప్రదేశాల్లో భూమి వేడిమి వల్ల గట్టిగా ఉండడం, పొద్ద స్తమానం పని చేయలేని పరిస్థితి ఉండటంతో అదనపు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మార్చిలో 20 శాతం, ఏప్రిల్లో 25 శాతం, మేలో 30 శాతం అదనపు కూలి చెల్లించేవారు. కానీ నాలుగేళ్లుగా ఈ అదనపు కూలి చెల్లించడం లేదు. గతంలో రాగాస్ సాఫ్ట్వేర్ ద్వారా నమోదు చేసే సందర్భాల్లో అదనపు చెల్లింపులు నమోదుకు అవకాశం ఉండే. ప్రస్తుతం ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) సాఫ్ట్వేర్ వాడుతుండడం, కేంద్రం నేరుగా ఈ సాఫ్ట్వేర్ రూపొందించి వినియోగిస్తుండడంతో అదనపు కూలి చెల్లింపుల నమోదుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో డైవర్షన్ డ్రైన్, రాకళ్ల కట్టలు, ఫీడర్ ఛానెల్, ఎంఐ ట్యాంక్, పశువులు, గొర్ల షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణం, చెక్డ్యాం, ఫామ్ ఫండ్, ఫార్మేషన్ రోడ్డు పనులు సాగుతున్నాయి. ఈ పనులన్నీ దాదాపు ఎండపట్టునే చేయాల్సి ఉటుంది. -
జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం
నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పక్షం రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అకాల వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో శనగ, జొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇక మామిడి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లిలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయియింది. న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ చౌరస్తా వద్ద వర్షపునీరు నిలవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నారాయణఖేడ్/న్యాల్కల్ (జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్/మునిపల్లి : -
హరీశ్ను కలిసిన ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ టౌన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి హరీశ్రావుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేయడంతో ఎమ్మె ల్యే మాణిక్రావు, జహీరాబాద్ నాయకులు ఆయనను కలిశారు.హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డితో కలసి హరీశ్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్, ఝరాసంగం మండలాల అధ్యక్షులు తట్టునారాయణ, సంజీవ్రెడ్డి, నర్సింలు, వెంకటేశం, నాయకులు మిథిన్రాజ్ తదితరులున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే గూడెం రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉండే పేదల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హామీనిచ్చారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్నగర్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు మరింత మెరుగైన ేవైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని వివరించారు. ఇక్కడి ప్రజలకు త్వరలో మరింత మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని అందుకు తగిన నిధులను కూడా కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయిత్రీదేవి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి పాల్గొన్నారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కొల్చారం(నర్సాపూర్): ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రం సమీపంలో మెదక్–నర్సాపూర్ జాతీయ రహదారి లోతు వాగు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పిల్లి మల్లేశం(38) హైదరాబాద్లో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం మెదక్కు కారులో వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మండల శివారులోని జాతీయ రహదారి లోతు వాగు మలుపు వద్దకు రాగానే సికింద్రాబాద్ వైపు నుంచి మెదక్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తినడంతోపా టు డ్రైవర్ మల్లేశంకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ప్రమాదంలో మహిళ రాయికోడ్ (అందోల్ ): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సింగితం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ కథనం మేరకు.. రేగోడ్ మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మణెమ్మ (53) రాయికోడ్ మండలం హస్నాబాద్లో బంధువుల శుభకార్యానికి గురువారం బొలెరో వాహనంలో కులస్తులతో హాజరయ్యారు. సాయంత్రం తిరుగు ప్రయాణం కాగా సింగితం గ్రామానికి చేరుకోగానే బొలెరో వాహనం అదుపుతప్పింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై మణెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహన డ్రైవర్ రాములుపై మృతురాలి భర్త నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ అదుపుతప్పి కూలీ.. దుబ్బాకటౌన్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి కూలీ మృతి చెందిన ఘటన రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామ పరిధిలోని గుర్రాలసోఫా వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం రాయపోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం కసాన్ పల్లి గ్రామానికి చెందిన లింగ రమేశ్ (39) వ్యవసాయం, సెంట్రింగ్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ప్రతిరోజూ గజ్వేల్ పట్టణానికి సెంట్రింగ్ కూలి పనికి బైక్పై వెళ్తుంటాడు. గురువారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో వడ్డేపల్లి గ్రామ పరిధిలోని గుర్రాలసోఫా సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ రఘుపతి తెలిపారు. ఆటో బోల్తా పడి మహిళ.. కొమురవెల్లి(సిద్దిపేట): ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం మేరకు.. వరంగల్ కాశీబుగ్గకు చెందిన సబిత(55) కుటుంబంతో కలిసి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో వేచరేణి కి చెందిన ఆటోలో బయలు దేరారు. మండల కేంద్రంలోని పద్మశ్రీ గార్డెన్ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సబిత మృతి చెందగా, పలువురి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఒకరు మృతి -
ఇఫ్తార్ విందుకు షబ్బీర్ అలీ
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి చంద్రశేఖర్, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, సురేశ్ షెట్కార్లు మాట్లాడుతూ...ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్, గిరిధర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు వారాలకే కాత
బీర పంటతో అధిక లాభాలు జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ అక్కన్నపేట(హుస్నాబాద్): విత్తన ప్రక్రియ ఆరంభమైన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత అని జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో రైతు స్వామిరెడ్డి సాగు చేసిన బీర తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి అన్నారు. అలాగే అధిక డిమాండ్ కల్గి ఉండి తొందరగా చేతికందు పంట బీర అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత పాల్గొన్నారు. నిందితుడి రిమాండ్ ములుగు(గజ్వేల్): ములుగు మండలం బహి లంపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పెంటమీది స్వామిని శుక్రవారం అదుపులోకి తీసు కొని గజ్వేల్ కోర్టుకు రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. అత్యాచారా నికి గురైన బాలికకు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ సిద్దిపేటఅర్బన్: పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు.. వెల్కటూరు శివారులో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట వెలికట్టకు చెందిన పెరుగు కిష్టయ్య, పొన్నాలకు చెందిన లెంకల కనకయ్య, మర్పడగకు చెందిన వల్లపు కనకయ్య, దుద్దెడకు చెందిన మహ్మద్ నహీం పట్టుబడ్డారు. నాంచారుపల్లికి చెందిన రాము, వెల్కటూరుకు చెందిన కిషన్, సిద్దిపేటకు చెందిన చారి పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 9480 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీలో బస్తాలను లోడ్ చేస్తూ.. ప్రమాదవశాత్తు కిందపడి హమాలీ మృతి వర్గల్(గజ్వేల్): వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి హమాలీ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వర్గల్ మండలం శాకారంలో చోటు చేసుకుంది. గౌరా రం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం మేరకు.. ఒరిస్సా రాష్ట్రం పార్లకేముండి గ్రామానికి చెందిన బీరా ప్రకాశ్(43) ఉపాధి నిమిత్తం ఆరు నెలల కిందట వచ్చి భార్య, కుమారుడితో కలి సి మేడ్చల్ సమీప ఎల్లంపేట గ్రామంలో ఉంటున్నాడు. శుక్రవారం బీరా ప్రకాశ్ తదితరులు వర్గల్ మండలం శాకారంలోని శ్రీసాయి బిన్నీ మోడ్రన్ రైస్మిల్లో వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేసేందుకొచ్చారు. లోడ్ చేస్తుండగా లారీ బస్తాల పైన ఉన్న బీరా ప్రకాశ్ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు బీరా హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. మిరుదొడ్డి(దుబ్బాక: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కాసులాబాద్లో శుక్రవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్ఐ బోయిని పరుశరామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బిట్ల రాములు (75) వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. 2012లో భార్య చనిపోగా ముగ్గురు ఆడపిల్లల వివాహాలు చేశాడు. గురువారం సాయంత్రం రాములు వ్యవసాయ పొలం సమీపంలో చింత చెట్టు ఎక్కి కాయలు తెంపుతున్నాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి అన్న మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎర్రరాయి వాహనాలు సీజ్ న్యాల్కల్(జహీరాబాద్):అక్రమంగా ఎర్రరా యి తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నట్లు హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలో న్యామతాబాద్, రేజింతల్, గణేశ్పూర్ గ్రామ శివారులోంచి లారీ, ట్రాక్టర్లలో ఎర్రరాయి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. హుస్సెళ్లి సరిహద్దు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఎర్రరాయిని తరలిస్తున్న లారీ, ట్రాక్టర్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 15వ తేదీన గణేశ్పూర్ గ్రామ శివారులో ఒక వాహనాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. -
ఉగాదికే సన్నబియ్యం
● అదే రోజు పథకంప్రారంభించనున్న ప్రభుత్వం ● ఏప్రిల్ 1నుంచి అమలు ● జిల్లాలో 3.78 లక్షలకార్డుదారులకు మేలునారాయణఖేడ్: పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యంను ఉగాది నుంచి సరఫరా చేసేందకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా గతంలోనే సన్న బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినా సన్న బియ్యం లేని కారణంగా వాయిదా వేసి ఉగాది నుంచి అందజేస్తామని ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించి ఏప్రిల్ 1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యంను అందజేస్తారు. పథకం ద్వారా జిల్లాలో 3.78లక్షల రేషన్ కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 846 రేషన్ దుకాణాల ద్వారా 3.78లక్షల మంది కార్డుదారులకు కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున 8వేల మెట్రిక్ టన్నుల బియ్యంను అందిస్తున్నారు. జిల్లాలోని కార్డుదారులందరికీ సన్న బియ్యం ద్వారా మేలు చేకూరనుంది. సీఎం చేతుల మీదుగా.. ఉగాది పర్వదినం రోజైన ఈనెల 30న సన్న బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిల్లో పథకాన్ని ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తూ రైతులను సన్నాల సాగువైపు మళ్లించాలని సైతం ప్రభుత్వం యోచిస్తోంది. సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ చెల్లించే పథకాాన్ని సైతం అమలు చేస్తోంది. ధాన్యం కనీస మద్దతు ధరపై అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తూ సన్నాల సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని, ఇందుకు 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం అని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో ఇదివరకు సేకరించిన సన్నవడ్ల ద్వారా మరాడించగా 8లక్షల టన్నులు వచ్చిన సన్న బియ్యం ఆయా పౌరసరఫరాల గోడౌన్లలో నిల్వ ఉంచారు. మిల్లుల్లో ప్రస్తుతం మరాడిస్తున్న సన్న బియ్యం వచ్చే నాలుగు నెలల వరకు సరిపోగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సన్న బియ్యం కోసం ఎదురుచూస్తున్న పేదలకు పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది.రీసైక్లింగ్ నిరోధానికే.. పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న దొడ్డుబియ్యం చాలామంది భోజనానికి ఉపయోగించడంలేదని, దళారులు కిలోకు రూ.10 నుంచి రూ.20లోపు వీరి వద్ద కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని ఇస్తేనే రీసైక్లింగ్ అక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సన్నబియ్యం సాగుచేసి విక్రయించిన రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ కూడా చెల్లిస్తుంది. ఇలా వచ్చిన సన్నవడ్లను మర ఆడించిన సన్నబియ్యంను ఆయా పౌరసరఫరాల గోడౌన్లకు సరఫరా చేసి అక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారుకు అందించనున్నారు. -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
నీడ లేదు.. వైద్యం జాడలేదు ఉపాధి కూలీలకు నిలువ నీడ కరువైంది. ప్రథమ చికిత్స కిట్లు కానరావడం లేదు. వివరాలు 8లో u పరీక్షా సమయంఉద్వేగం.. ఉద్విగ్నంపదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్షల తొలిరోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. స్నేహితులు ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ కేంద్రంలోపలికి వెళ్లారు. కొంతమంది తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రాల వద్దే నిరీక్షించారు. ఈ ఘటనలన్నింటికీ నిలువెత్తు దృశ్యాలివి. సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
పత్తి తూకంలో వ్యాపారి మోసాలు
● ఇసుక సంచులు, బాట్లు వేసి ఖాళీ వాహనాన్ని తూకం ● రైతుల అప్రమత్తతతో వెలుగులోకి..వట్పల్లి(అందోల్): రైతులనే బోల్తా కొట్టించబోయిన ఓ దొంగ వ్యాపారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మండల పరిధిలోని దరఖాస్తుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రైతుల కథనం మేరకు.. వట్పల్లికి చెందిన అసన్ అనే ఓ వ్యాపారి దరఖాస్తుపల్లి గ్రామంలో పత్తిని తూకం వేసేందుకు వచ్చాడు. ముందుగా తన ఖాళీ వాహనాన్ని తూకం వేసే సమయంలో రెండు ఇసుక సంచులతోపాటు ఆరు బాట్లను వాహనంలోనే ఉంచి తూకం వేశాడు. దరఖాస్తుపల్లి గ్రామంలో పత్తి తూకం వేసే సమయంలో వాహనంలో ఇసుక బస్తాలను చూసి అవాక్కయ్యారు. వాహనంలో ఇసుక బస్తాలు, బాట్లు వేసి తూకం వేశావని నిలదీశారు. సుమారుగా 4 క్వింటాళ్ల వరకు ఉన్న వాటితో అంతే మొత్తంలో పత్తిని నష్టపోయేవారమని వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వట్పల్లి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో మరికొందరు రైతులు ఇదివరకు ఇదే వ్యాపారికి మమ్మల్ని ఇలానే మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వాహనంతోపాటు ఇసుక బస్తాలు, తూకపు బాట్లను స్టేషన్కు తరలించారు. దీంతో వ్యాపారి దిగొచ్చి తన మోసాన్ని ఒప్పుకొని ఓ రైతుకు రూ. 50 వేలు చెల్లించడంతోపాటు మిగితా రైతులకు క్షమాణలు చెప్పడంతో పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. -
నష్టాలపాలు
● రైతుల నుంచి పాలు కొనుగోలు చేయని హాట్సన్ కంపెనీ ● తక్కువ ధర ఇస్తున్న విజయ డెయిరీ ● గిట్టుబాటుకాక పాడి రైతుల ఆందోళన ● భారంగా మారిన పశుపోషణ ● నేడు జహీరాబాద్లో ధర్నా జహీరాబాద్ టౌన్: వ్యవసాయ రంగమే కాదు.. పా డి రైతులు కూడా నష్టాలు పాలవుతున్నారు. పశుపోషణ మోయలేని భారంగా తయారవుతుంది. పాలకు గిట్టుబాటు ధర రాక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు చేయూత అందించడం లేదు. స్థానికంగా ఉన్న హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ కంపెనీ వారు పాలను తీసుకోవడం లేదు. విజయ డెయిరీ పాలలో నాణ్యత లోపం చూపుతున్నారు. వేల రూపాయ లు పెట్టుబడి పెట్టి పాలు ఉత్పత్తి చేస్తూ నష్టపోతున్నామని పాడి రైతులు వాపోతున్నారు. న్యాయం చేయాలన్న డిమాండ్లతో జహీరాబాద్ ప్రాంతంలోని పోరాటం చేయాలని నిర్ణయించారు. నాణ్యత పేరుతో తక్కువ ధర జహీరాబాద్ ప్రాంతంలో సుమారు వంద వరకు డెయిరీ ఫామ్లు ఉన్నాయి. పాలు సేకరిస్తున్న డెయిరీలు, ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ, హాట్సన్ ఆగ్రో కంపెనీపై పాడి రైతులు ఆధారపడ్డారు. కానీ హాట్సన్ కంపెనీ వారు జహీరాబాద్ రైతుల నుంచి లీటర్ పాలను కూడా కొనడం లేదు. విజయ డెయిరీ నాణ్యత పేరుతో తక్కువ ధర చెల్లిస్తుంది. ప్రైవేట్ డెయిరీల నిర్వాహకులు తక్కువ ధరకే పాలను కొంటున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. పశువుల ధరలు, పశుగ్రాసం సాగు, దాణా, గేదెల పోషణ, వైద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలు అమ్మినా గిట్టుబాటుకాక ఆందోళన చెందుతున్నారు. పోషణ భారం మోయలేక పశువులను విక్రయిస్తున్నారు. నేడు పట్టణంలో ధర్నా పలు కారణాలతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు (గురువారం) పట్టణంలో ధర్నా చేపడుతున్నట్లు పాడి రైతు విష్ణు తెలిపారు. జహీరాబాద్ సమీపంలోని హాట్సన్ ఆగ్రో కంపెనీ వారు నిబంధనలు పాటించడంలేదని, డెయిరీలు పాలను సేకరించడంలేదన్నారు. హాట్సన్ కంపెనీకి మహారాష్ట్ర, కర్నాటక నుంచి లక్ష లీటర్ వరకు పాలు వస్తున్నాయన్నారు. కానీ స్థానిక పాడి రైతుల నుంచి కొనుగోలు చేయడంలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు. -
చిరుత ఆచూకీ కోసం ట్రాప్ కెమెరాలు
దుబ్బాకటౌన్: చిరుత సంచార ప్రాంతాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ కుమార్ అన్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామ శివారులో గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆచూకీ కోసం బుధవారం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు అనుమానిత ప్రాంతాలను సందర్శించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సందీప్ కుమార్ మాట్లాడుతూ.. చిరుత పులి సంచరిస్తూ.. రైతులకు కనిపించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కాలి ముద్రలు సేకరించి చిరుత పులివేనని నిర్ధారించామన్నారు. చిరుత పులి ఎప్పుడు ఒకే చో ట నివాసం ఉండదని తరచూ తిరుగుతుంటుందని సూచించారు. రైతులు గొర్రెలు, మేకలు, పశువులను పొలాల వద్ద ఉంచొద్దన్నారు. చిరుత పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులెవరూ పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాట్లు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో రాయపోల్ ఏఎస్ఐ దేవయ్య, సెక్షన్ ఆఫీసర్లు హైమద్ హుస్సేన్, బీట్ ఆఫీసర్లు జహంగీర్, వేణు, కానిస్టేబుల్ స్వామి, సిబ్బంది తదితరులున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ఏర్పాటు కాలి ముద్రలు సేకరణ రైతులు అప్రమత్తంగా ఉండాలి ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ కుమార్ -
చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యం
● సంగారెడ్డిలో జిల్లా వాసులు మృతి ● 17న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యంసంగారెడ్డి క్రైమ్: మహబూబ్ సాగర్ చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పట్టణ సీఐ రమేశ్.. మెదక్ జిల్లాలోని బ్రాహ్మణవీధికి చెందిన ముద్దుల సత్యనారాయణ ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య విజయలక్ష్మి (54), కూతురు మణిదీపిక (27), కుమారుడు మణి దీప్ ఉన్నారు. 17న సోమవారం విజయలక్ష్మి, మణిదీపిక ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు సాయంత్రం మెదక్ టౌన్ పోలీస్స్టేషన్లో భర్త ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం సంగా రెడ్డిలోని మహబూబ్సాగర్ చెరువులో తల్లీకూతురు మృతదేహాలై కనిపించారు. చెరువులో గుర్రపుడెక్క తొలగించే ఇన్చార్జి సురేందర్ గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీసి వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు, బస్సు టిక్కెట్ల ఆధారంగా మృతులు మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బియ్యం పట్టివేత నారాయణఖేడ్: అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కల్హేర్ పోలీసులు పట్టుకొ ని ఖేడ్ సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని పోరుబందర్కు చెందిన లారీ డ్రైవర్ కిషోర్ కాంత్ విజయవాడలో నరేశ్ అనే వ్యక్తి వద్ద పీడీఎస్ బియ్యం కొనుగోలు చేశాడు. 300 క్వింటాళ్లు గుజరాత్కు లారీలో తరలిస్తుండగా మాసాన్పల్లి వద్ద పట్టుకున్నాం. మంగళవారం మూడు లారీలు పట్టుకోగా రెండు లారీలపై కేసు నమోదు చేశారు. మరో లారీపై బుధవారం కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్, బియ్యం అమ్మిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కల్హేర్ పోలీసులు వివరించారు. -
కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలి
సిద్దిపేటరూరల్: రాష్ట్రంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించి, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. బుధవారం ఆశాల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గోపాల్ స్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు మర్చిపోయిందన్నారు. సమస్యలు పరిష్కారించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు ఆశాలు అనేక వినతిపత్రాలు అందించారన్నారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేసినా ఎలాంటి స్పందనలేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5లక్షలు, చనిపోతే రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల నర్సయ్య, కొంపల్లి భాస్కర్, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలమని, ప్రవీణ చల్లారపు నీరజ, కవిత, భాగ్యలక్ష్మీ, స్వప్న, వరలక్ష్మీ, విజయ, లక్ష్మీ, పద్మ, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
జయం మీదే
భయం వీడితే..5 నిమిషాల నిబంధన అమలులో.. పరీక్ష కేంద్రాలల్లోకి వెళ్లేందుకు విద్యార్థులకు పరీక్ష సమయం కంటే 30 నిమిషాలు ముందుగానే అనుమతి ఉంటుంది. అందువలన విద్యార్థులు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకొని హాల్లో కూర్చునే అవకాశం ఉంది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. 5 నిమిషాల నియమం అమలులో ఉన్నందున పరీక్ష కేంద్రానికి త్వరగా చేరుకోవాలి. హడావిడిగా తీరా సమయానికి పరీక్షకు బయలు దేరితే కేంద్రానికి చేరుకోవడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు గాను విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పది పరీక్షలు విద్యార్థుల జీవితాల్లో తొలిమెట్టుగా భావిస్తారు. పరీక్షలు అనగానే విద్యార్థులు హడావిడి, భయం, ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. ఇవన్నీ దూరంగా పెట్టుకుంటేనే ప్రశాంతంగా పరీక్షలు రాయగలుగుతామని, అనుకున్న విజయాన్ని సాధిస్తామని పలురంగాల నిపుణులు విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) జిల్లాలోని ప్రభుత్వ, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 14,124 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితో పాటుగా 1,763 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకోసం జిల్లాలో 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం 79 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 79 చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులు, నలుగురు ఫ్లయింగ్ స్వ్కాడ్లు, ఏడుగురు రూట్ ఆఫీసర్స్లు, 50 మంది స్టోరేజీ పాయింట్ కస్టోడియన్, 707 మంది ఇ న్విజిలెటర్లు పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే పదవ తరగతి పరీక్ష పేపర్లను జిల్లాలోని 25 స్టోరేజ్ పాయింట్లలో భద్ర పరిచారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. టోల్ఫ్రీ నంబర్లు పదవ తరగతి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి వారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు 98664 15124, 99088 73455 నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉండ నున్నాయి. ప్రశాంతంగా పది పరీక్షలు రాద్దాం ముందు వచ్చినవి.. తర్వాత రానివి రాయాలి హడావిడి లేకుండా పరీక్ష కేంద్రానికి చేరుదాం జంక్ ఫుడ్ వద్దు.. ద్రవరూప ఆహారమే ముద్దు.. విద్యార్థులకు పలు రంగాల నిపుణులు సూచన పరీక్షలు రానున్న 14,124 మంది163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమలులో ఉంటాయని సిద్దిపేట సీపీ అనురాధ బుధవారం తెలిపారు. 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నందున ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పై నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడి ఉండకూడదని, సమీపంలోని అన్ని జీరా క్స్ సెంటర్లను మూసివేసి ఉంచాలని పేర్కొన్నారు. పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సీపీ ఆదేశించారు. -
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
పురుగు మందు తాగి.. నర్సాపూర్ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్ఐ లింగం కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండ పోచయ్య (50) కుటుంబ కలహాలతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కిందపడ్డ వ్యక్తి.. మునిపల్లి(అందోల్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు చెందాడు. బుధవారం ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన సతీష కుమార్ (28) ఈ నెల 18న బుదేరా పెట్రోల్ పంపులో షెడ్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి గాయాల పాలయ్యాడు. వెంటనే క్షతగాత్రుడిని సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
లారీ, వ్యాన్ ఢీ: డ్రైవర్ మృతి
నారాయణఖేడ్: ఎదురెదురుగా వ్యాన్, లారీ ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజాంపేట్–ఖేడ్–బీదర్ 161బి జాతీయ రహదారిపై ర్యాలమడుగు గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వాజీద్ (35) మినీ వ్యాన్లో ఖేడ్లో మందులు సరఫరా చేసి తిరిగి వెళ్తున్నాడు. ర్యాలమడుగు సమీపంలోకి రాగానే నిజాంపేట్ వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజీద్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ వాహనంతో పరారు కాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కను తప్పించబోయి .. స్కూటీపై నుంచి పడి యువకుడు మృతి తూప్రాన్: స్కూటీ నుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై లింగరెడ్డిపేట చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన చాకలి బొంతపల్లి కృష్ణ (32) యువకుడు అనారోగ్యంతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి స్కూటీపై వచ్చాడు. తిరుగు ప్రయాణంలో లింగారెడ్డిపేట చౌరస్తా వద్ద రహదారిపై అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడి గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి నర్సాపూర్ రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నర్సాపూర్ – మెదక్ రహదారిలో రెడ్డిపల్లి గేటు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్ఐ లింగం కథనం మేరకు.. మేడ్చల్ జిల్లా దుండిగల్ గ్రామానికి చెందిన గడ్డమీది మహేశ్(33) రెడ్డిపల్లి గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్పై వెళ్తూ వ్యక్తి.. జగదేవ్పూర్(గజ్వేల్): బైక్పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మునిగడప గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రమోహన్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన నరేశ్(40) ఉపాధి నిమిత్తం హైదరాబాద్లోని వినాయకనగర్లో భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. బుధవారం స్వగ్రామం రామన్నపేట నుంచి బైక్పై బియ్యం బస్తా వేసుకొని బయలుదేరాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మునిగడప గ్రామానికి రాగానే బైక్పై నుంచి కిందపడి ప్రాణాలు వదిలాడు. గుండెపోటు లేదా వడదెబ్బతో మృతి చెంది ఉన్నట్లు పోలీ సులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఐదు రోజుల వ్యవధిలో అన్నాదమ్ముళ్లు హుస్నాబాద్రూరల్: ఐదు రోజుల వ్యవధిలో అన్మాదమ్ముళ్లు మృతి చెందిన ఘటన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పొన్నాల లచ్చవ్వ లింగయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా అందరికీ పెళ్లీలు అయ్యాయి. అనారోగ్యంతో 14న పొన్నాల ప్రభాకర్ మృతి చెందగా, బుధవారం పొన్నాల రవీందర్ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు కుమారుల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. రవీందర్ గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేస్తుండగా, ప్రభాకర్ హుస్నాబాద్ పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత పోలీసుల అదుపులో ఇద్దరు హత్నూర( సంగారెడ్డి): ఓ ఇంటిపై ఎకై ్సజ్ ఇన్ఫోర్స్మెంట్ పోలీస్ అధికారులు దాడి చేసి నిషేధిత ఆల్ఫాజోలం పట్టుకున్నారు. ఈ ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్ బస్టాండ్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మెదక్ డివిజన్ ఏఈ ఎస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన రాజా గౌడ్, సిద్దిపేట ప్రాంతానికి చెందిన చిత్తాపూర్ గ్రామానికి చెందిన నర్సాగౌడ్ ఇద్దరూ నిషేధిత ఆల్ఫాజోలం 503 గ్రాములు, డయజోఫామ్ 17 గ్రాములు ఇంట్లో నిల్వ చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి సుమారు రూ.5 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు పట్టుకున్నాం. ఇద్దరిని అదుపులోకి తీసుకొని అందోల్ ఎకై ్సజ్ సీఐకి అప్పగించినట్లు తెలిపారు. -
అర్థరాత్రి వరకు చదవొద్దు
ఆన్సర్ బుక్లెట్ పైన ఎలాంటి పేరు గాని, ఇతర వివరాలు రాయరాదు. ఇన్విజిలేటర్లు చేప్పే ప్రతీ సూచన తప్పకుండా పాటించాలి. ఆన్సర్షీట్లో కొట్టివేతలు లేకుండా నీట్గా జవాబులు రాయాలి. తెలిసిన ప్రశ్నలకు జవాబుల నుంచి తెలియని ప్రశ్నలకు జవాబులు రాయడం ద్వారా సమయం ఆదా అవుతుంది. రాత్రి 10 గంటల వరకే చదవాలి, ఉదయం 4.30 గంటలకు నిద్ర లేచి చదవడం మంచిది. అర్థరాత్రి వరకు చదవడం వలన పరీక్ష హాల్లో నిద్ర రావడం, ఇబ్బందికరంగా మారుతుంది. ఘన రూప ఆహారం కాకుండా, ద్రవరూప ఆహారాన్ని తీసుకోవడం మంచిది. –రాధారి నాగరాజు, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ కోచ్, సిద్దిపేట -
విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాభినందనలు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. కొన్నేళ్లుగా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది.. ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించండి. జిల్లా కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేయాలి. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 జీపీఏలు అధికంగా సాధించే విధంగా పరీక్షలు రాయండి. తల్లిదండ్రుల, గురువుల, పాఠశాలల పేరును నిలబెట్టండి. –శ్రీనివాస్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
జిల్లాకు ఐదు పీహెచ్సీలు మంజూరు
● మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: డీఎంహెచ్ఓ ● నేరడిగుంట పీహెచ్సీ తాత్కాలిక భవనం ప్రారంభం వట్పల్లి(అందోల్): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గాయత్రిదేవి అన్నారు. బుధవారం అందోలు మండలం నేరడిగుంటలో పీహెచ్సీ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో 30 వేలు, గిరిజన ప్రాంతాల్లో 20వేల జనాభా ప్రాతిపదికన పీహెచ్సీని ఏర్పాటు చేయాలన్న నిబంధనల మేరకు జిల్లాలో కంకోల్, సింగీతం, బర్దిపూర్, నేరడిగుంట, సుల్తాన్పూర్ గ్రామాల్లో నూతనంగా ఐదు పిహెచ్సీలు మంజూరయ్యాయని తెలిపారు. నేరడిగుంట పీహెచ్సీ ఫరిదిలో 40వేల మంది జనాభ ఉందని, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి 11 సబ్సెంటర్లు, 25 గ్రామాలు వస్తాయన్నారు. నేరడిగుంట ఆసుపత్రికి వైద్యాధికారిగా డాక్టర్ శంకర్తో పాటు సిబ్బందిని డిప్యుటేషన్పై నియమించామని పేర్కొన్నారు. పీహెచ్సీ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.46 కోట్లు కేటాయించిందని, అయితే.. కేటాయించిన స్థలం సరిపోదని మరో 20 గుంటలు అవసరమన్నారు. స్థలాన్ని కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బి.శివరాజ్, ఎంపీఓ సోంనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, పాల్గొన్నారు. -
ఉపాధిలో జల సంరక్షణకు ప్రాధాన్యం
● అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వర్షపు నీరు వృథా కాకుండా చర్యలు సంగారెడ్డి జోన్: వర్షపు నీరు వృథా పోకుండా సంరక్షించుకునేందుకు ప్రభుత్వం చర్యటు చేపట్టింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టేందుకు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలను నిర్వహించి వివిధ రకాల పనులను గుర్తించారు. కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు చేపట్టారు. గ్రామ సభల్లో జల సంరక్షణ పనులపై అవగాహన కల్పించారు. గతంలో జల శక్తి అభియాన్, వాటర్ షెడ్తో పాటు పథకాలను ప్రవేశపెట్టి పలు రకాల పనులు చేపట్టారు. జల సంరక్షణలో చేపట్టే పనులు జల సంరక్షణలో భాగంగా చేపట్టే పనుల్లో ముఖ్యంగా వ్యవసాయ పంట పొలాల వద్ద నీరు నిలిచి ఉండే విధంగా పనులు చేపట్టనున్నారు. వాగులు, వంకలలో పూడికతీత, బోరు బావులు, చేతి పంపులు, ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఇంటి పై భాగంలో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలు, కందకాలు తవ్వటం, నీటి కుంటల నిర్మాణాలు, నీటి నిలువ కుంటలు, పర్క్యులేషన్ ట్యాంకులు, పొలాల మధ్య కాల్వలు తదితర పనులు చేపడుతారు. 2 లక్షల జాబ్ కార్డులు.. 4 లక్షల మంది ఉపాధి కూలీలు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించడమే లక్ష్యంగా తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 19వేల మందికి జాబ్ కార్డులు మంజూరు చేయగా.. 4 లక్షల 3 వేల మంది కూలీలుగా నమోదు అయ్యారు. అందులో 1,32,000 జాబ్ కార్డులు యాక్టివ్ ఉండగా.. రెండు లక్షల 25 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. -
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా: ఎస్పీ
నారాయణఖేడ్: సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టంగా ఉండాలని ఎస్పీ పంకజ్ పారితోష్ సూచించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి మనూరు, నాగల్గిద్ద పోలీస్ స్టేషన్లను ఎస్పీ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్స్టేషన్లలో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. లాకప్ గదులను పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అయినందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిరోధంపై కఠినంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకట్రెడ్డి, నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో కోరారు. స్వయం ఉపాధి పథకానికి ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. పథకం ద్వారా గరిష్టంగా రూ.4 లక్షల వరకు రుణం అందించినట్లు తెలిపారు. తీసుకున్న రుణంలో 60 నుంచి 80శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు ఆధార్ కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఏదో ఒక అంశాలలో ఎన్నుకొని స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రైతు రిజిస్ట్రీ అమలు పైలెట్ ప్రాజెక్టు కింద మొగుడంపల్లి ఎంపిక జహీరాబాద్ టౌన్: రైతు రిజిస్ట్రీ అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద మొగుడంపల్లి మండలాన్ని ఎంపిక చేసినట్లు వ్యవసాయశాఖ ఏడీఏ భిక్షపతి అన్నారు. మొగుడంపల్లి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగా ప్రతీ రైతుకు 11 నంబర్లతో యూనిక్కోడ్ (యూసీ)కేటాయించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమన్యా వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తామని, దీని ద్వారా ఈ ఫార్మర్ ఐడీని కేటాయిస్తామన్నారు. రైతులు వ్యవసాయ విస్తీరణ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు. హ్యాట్రిక్ కొట్టాడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాయికిరణ్రెడ్డి జహీరాబాద్/న్యాల్కల్(జహీరాబాద్): ప్రస్తు తం ఆధునిక పోటీ ప్రపంచంలో ఒక ప్రైవేట్ ఉద్యోగం సాధించడం అంత సులువైంది కాదు. అందులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అహర్నిశలు కష్టపడి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరి ఓపెన్ కాంపిటేషన్లో ఉద్యోగం సాధించాలంటే ఎంత శ్రమకోర్చి చదవాలో అది కష్టపడే వారికే తెలుస్తుంది. కానీ న్యాల్కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన యువకుడు నాగారం సాయికిరణ్రెడ్డి(25) ఓపెన్ కాంపిటేషన్లో పోటీపడి ఏడాది కాలంలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షలో జిల్లాలో మూడవ ర్యాంకు సాధించగా, ఆయనకు మొదటగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం ఆయన సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అదే విధంగా ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ల కోసం ప్రభుత్వ పోటీ పరీక్షలు నిర్వహించగా అందులో రాష్ట్రంలో 14వ ర్యాంకు రాగా మెరిట్ కోటాలో ఉద్యోగం సంపాదించాడు. అలాగే గ్రూప్–2 పరీక్షలో రాష్ట్రంలో 75వ ర్యాంకు రాగా, మెరిట్ కోటాలో ఉద్యోగం సాధించి సాయికిరణ్రెడ్డి తన సత్తాను చాటాడు. ఏడాది కాలంలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తి నింపుతున్నాడు. -
పట్టణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రూ.4,500 కోట్లు కేటాయించింది. జిల్లాలో కొత్తగా మూడు మున్సిపాలిటీలు ఏర్పడిన విషయం విదితమే. చుట్టు పక్కల గ్రామాలను విలీనం చేస్తూ ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదలను మున్సిపాలిటీలుగా చేసింది. అలాగే కొహీర్ను కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ కొత్త మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కలిసొచ్చే అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడ)ను కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయినప్పటికీ.. దాని ఫంక్షనింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ సంస్థ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊసేలేని సంగమేశ్వర, బసవేశ్వరలు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ఊసు బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. కానీ పనులు ప్రారంభ దశలోనే ఉండి పోయాయి. ఈసారి కేటాయింపులో ఈ రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు కేటాయింపులు లేవు. ఆరు గ్యారెంటీలతో.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రూ.56 వేల కోట్లు కేటాయించింది. ఈ భారీ కేటాయింపులతో ఆయా పథకాల లబ్ధిదారులకు మేలు జరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహాలక్ష్మి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు 1.73 లక్షల మంది ఉన్నారు. అలాగే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి లబ్ధిదారులు 2.16 లక్షల మంది ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇప్పటి వరకు 1.82 మంది మహిళలు ఉపయోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సూత్రప్రాయంగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 2,170 మందికి మొదటి ఆరు నెలలకు రూ.ఆరు వేల చొప్పున చెల్లించారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు రూ.56 వేల కోట్లు కేటాయింపులతో ఈ పథకాల లబ్ధి కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లో రూ.14.62 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో కేటాయింపులు రూ.44.85 కోట్లకు పెరిగింది. సింగూరు కాల్వల ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టిన విషయం విదితమే. ప్రధాన కాల్వతో పాటు, డిస్ట్రిబ్యూటరీల సిమెంట్ లైనింగ్ పనులకు రూ.143 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే సుమారు రూ.29 కోట్లు కేటాయింపులు పెరగాయని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సింగూరు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా ఇచ్చే కేటాయింపుల్లో మాత్రం కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 కోట్లు కేటాయించగా, ఈసారి ఈ నిధులు కేవలం రూ.పది లక్షలతో సరిపెట్టింది. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు కూడా కేటాయింపులు తగ్గాయి. గత ఏడాది రూ.9.01 కోట్లు ఉండగా, ఈసారి రూ.5.05 కోట్లకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.4,500 కోట్లు బల్దియాలుగా మారిన కొహీర్, ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డపోతారం సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన కేటాయింపులు ఊసేలేని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు నల్లవాగుకు తగ్గిన కేటాయింపులు -
పదికి పకడ్బందీ ఏర్పాట్లు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈ నెల 21వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో రాసేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఐదు నిమిషాల సడలింపు అమలులో ఉంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రతి పరీక్ష కేంద్రం అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. తాగు నీటి సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 22,423 మంది విద్యార్థులు జిల్లాలో 22,423 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలలో రెగ్యులర్ విద్యార్థులు 22,411 కాగా ప్రైవేట్ విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు) 12 మంది ఉన్నారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకై ఏదైనా సమాచారం, సందేహాలపై జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే 08455–276255, 8979677495ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. దీంతో పాటు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సంబంధిత మండల విద్యాదికారి, జిల్లా విద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల వైద్యశాఖ అధికారి మొబైల్ నంబర్లు డిస్ప్లే చేయాలని సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లతో పాటు ఇతర ఏ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించరు. ● విద్యార్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ● హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, రైటింగ్ప్యాడ్ను వెంట తీసుకొని రావాలి ● హాల్ టికెట్ అందని, పోగొట్టుకున్న విద్యార్థులు www.bre.teanfana.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ● పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు తమ పాఠశాల యూనిఫాంలో కాకుండా ఇతర దుస్తువులో హాజరు కావాలి. రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం సమయం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు.. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి పరీక్షలు రాసేందుకు సంసిద్ధమవుతున్న విద్యార్థులకు ముందుగా బెస్ట్ ఆఫ్ లక్. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎటువంటి మాస్ కాపీయింగ్కు పాల్పడే అవకాశం లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారితో పాటు సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి -
ఓటరు జాబితా సవరణ
అక్రమ ఇటుక బట్టీల ధ్వంసంజహీరాబాద్ టౌన్: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని ట్రైనీ కలెక్టర్ మనోజ్ కోరారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా ఉండాలన్నారు. బీఎల్ఓలు 18 సంవత్సరాలు పైబడిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు, జాబితాలో సవరణలు చేయడం వంటివి చేపడుతామన్నారు. 6,7,8ల ఫారాల నిర్వహణ పకడ్బందీగా ఈ నెల 23వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుపై వచ్చే దరఖాస్తును ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాంరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జహీరాబాద్: ‘సాక్షి’ కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు బుధవారం అక్రమంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలపై కొరడా ఝళిపించారు. ఈనెల 16వ తేదీన ‘సాక్షి’లో ‘పంట పొలాల్లో ఇట్టుక బట్టీలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బుధవారం జేసీబీ సహాయంతో జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ గ్రామ శివారులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను ధ్వంసం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల వివరాలను సేకరించారు. ఇప్పటి వరకు 15 వరకు అక్రమ ఇటుక బట్టీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చిన్న హైదరాబాద్లో ఒకటి, హోతి(బి)లో 7, శేఖాపూర్, కొత్తూర్(బి)లో రెండు, ఆనెగుంట గ్రామాల్లో ఒకటి, హోతి(కె)లో 2, జహీరాబాద్లో ఒకటి వంతున అక్రమ ఇటుక బట్టీలు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని అక్రమ ఇటుక బట్టీల వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇటుక బట్టీలకు అనుమతులు పొందాలని, లేనట్లయితే చట్ట పరంగా చర్యలు చేపడుతామని రెవెన్యూ అధికారులు యజమానులను హెచ్చరించారు. స్పందన రాజకీయ పార్టీలు సహకరించాలి ట్రైనీ కలెక్టర్ మనోజ్ -
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయొద్దు
పీఎం శ్రీతోపాటు మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి సిద్దిపేటరూరల్: ఐసీడీఎస్లను రద్దు చేయాలని తెచ్చిన పీఎం శ్రీపథకంతోపాటు మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయా లని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ టీచర్లు పెద్ద ఎత్తున సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ.. దేశంతోపాటు రాష్ట్రంలో ఐసీడీఎస్ ప్రారంభమై 50 ఏళ్లు అవుతుందన్నారు. ఐసీడీఎస్ను, సేవలను సంస్థాగతం చేయాలని, ఇందులో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్స్, ఆయాలను, మినీ టీచర్లను పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు ఆదేశాలిచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అమలు చేయాలని చూడటం అన్యాయమన్నారు. మొబైల్ అంగన్ వాడీ సేవల పేరుతో కొత్త విధానాన్ని తెచ్చి ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయొద్దన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా కోశాధికారి జీ.భాస్కర్, సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీ, పద్మ, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆలయం వద్ద మంగళవారం స్నానం చేయడానికి వెళ్లి నీటి మునిగి భక్తుడు మృతి చెందాడు. ఏఎస్ఐ సంగన్న కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరాస్తాకు చెందిన బీరప్ప (45) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఏడుపాయల వచ్చాడు. ఉదయం స్నానం చేయడానికి అక్కడి సమీపంలో ఉన్న నాగ్సాన్పల్లి ఫతేనగర్ కాల్వలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బీరప్ప నీట మునిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ.. జహీరాబాద్ టౌన్: విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని ఆర్ఎల్ఆర్ స్కూల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని దిడ్గి గ్రామానికి చెందిన దేవరంపల్లి నర్సింలు(30) సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. పట్టణంలోని ఆర్ఎల్ఆర్ స్కూల్ వెనుకాల భవన నిర్మాణం పనులు జరుగుతుండగా సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. ఇనుప రాడ్లను భవనం పైకి తీసుకెళ్తున్న క్రమంలో పైనుంచి వెళ్లిన 11 కేవీ కరెంట్ లైన్కు తాకింది. దీంతో కరెంట్ షాక్ తగిలి కింద పడ్డాడు. వెంటనే జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో సంగారెడ్డి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు వట్పల్లి(అందోల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన అందోలు మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ పాండు కథనం మేరకు.. జోగిపేట పట్టణానికి చెందిన పెద్దబోయిన సాయి(25) బైక్పై మంగళవారం రాత్రి చింతకుంట నుంచి జోగిపేటకు వస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం బైక్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
500 క్వింటాళ్లు మహారాష్ట్రకు తరలింపు కల్హేర్(నారాయణఖేడ్): అక్రమంగా మహారాష్ట్రకు పక్కదారి పట్టిస్తున్న భారీ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కల్హేర్ ఎస్ఐ వెంకటేశం కథనం మేరకు.. సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవే మీదుగా లారీల్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందింది. కల్హేర్ మండలం మాసాన్పల్లి చౌరస్తా సమీపంలో తనిఖీలు నిర్వహించి రెండు లారీల్లో బియ్య గుర్తించాం. మహారాష్ట్రలోని నాందేడ్కు బియ్యం తీసుకెళ్తున్నట్టు డైవర్లు తెలిపారు. కంగ్టీ సీఐ చంద్రశేఖర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందించడంతో సివిల్ సప్లయ్ డీటీ విజయలక్ష్మి, మహేశ్, ఆర్ఐ మల్లేశం వచ్చి బియ్యాన్ని పరిశీలించారు. రెండు లారీలు, బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం నారాయణఖేడ్ ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. కల్హేర్ తహసీల్దార్ శివ శ్రీనివాస్ బియ్యం తూకం పరిశీలించారు. సివిల్ సప్లయ్ అధికారుల ఫిర్యాదు మేరకు లారీ యజమానులు అయూబ్ అలీ, మీర్జా, డ్రైవర్లు ఖాజమియా, జుల్ఫీఖర్పై కేసు నమోదు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశం తెలిపారు. కూచారం శివారులో 300 క్వింటాళ్లు మనోహరాబాద్(తూప్రాన్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం మేరకు.. 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను లారీలో శ్రీశైలం రోడ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు మనోహరాబాద్ మండలం కూచారం శివారులో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నాం. రెవెన్యూ ఆర్ఐ దీక్షిత్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ షేక్ షోయబ్, లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి లారీని తూప్రాన్లోని గోదాముకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఓ ఇంట్లో 25.70 క్వింటాళ్లు నిల్వ చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలో గల శ్రీనివాస్ నివాస గృహంలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పండరినాథ్ ఆధ్వర్యంలో దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన 25.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం ఎస్ఐ నారాయణగౌడ్కు సమాచారం అందించి బియ్యం వ్యాపారి శ్రీనివాస్పై ఫిర్యాదు చేశారు. బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగింత లారీ యజమానులు, డ్రైవర్లపై కేసు -
చిరుతపులి సంచారం కలకలం
దుబ్బాక : రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామాల మధ్యనున్న గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందన్న సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామాల రైతులకు మంగళవారం గల్వనిచెరువు ప్రాంతంలో చిరుత పులి కనిపించింది. చిరుతపులి తిరుగుతున్న ఫొటోలను పలువురు రైతులు దూరం నుంచి సెల్ఫోన్లో తీసి పలు గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రఘుపతి వెంటనే అక్కడికి చేరుకొని ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుంది చిరుతనా..? లేక మరో జంతువా.. అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుతపులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చిరుతపులి సంచారం వార్త రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల్లో తీవ్ర కలకలం లేపింది. ఆ ప్రాంతంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి శివారులో చూసిన రైతులు భయాందోళనకు గురవుతున్న ప్రజలు -
గొర్రెలు అమ్మేశారని మనస్తాపంతో..
సిద్దిపేటకమాన్: బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. స్థానిక నర్సాపూర్లో నివాసం ఉంటున్న బండారి పోశవ్వ (60) తమకు ఉన్న గొర్రెలను పెద్దవాగు వైపు ప్రతి రోజూ తీసుకెళ్లి మేపేది. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో గొర్రెలను అమ్మేయడంతో నిత్యం బాధపడుతుండేది. 16న భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం నర్సయ్య వ్యవసాయ బావిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. గొర్రెలు అమ్మడంతో మనస్తాపానికి గురై తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో వ్యక్తి దుబ్బాకటౌన్ : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం స్థానిక పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గూని ఎల్లం (40) వ్యవసాయం, కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసై భార్య నవనీతతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేసి నిద్రించిన తర్వాత అర్థరాత్రి సమయంలో ఎల్లం ఇంట్లో నుంచి వెళ్లి పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు. ఉరేసుకొని యువకుడు నిజాంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గర్గుల రాజు, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గర్గుల భాను(17) పదవ తరగతి పూర్తి అయిన తర్వాత గ్రామంలోనే కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు వేరే గ్రామానికి వెళ్లగా భాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలో నుంచి శబ్ధం రాకపోవడంతో పక్క ఇంట్లో ఉన్న స్నేహితుడు వెళ్లి చూశాడు. తాడుకు వేలాడుతున్న మిత్రుడిని చూసి ఇంటి తలుపులు పగులగొట్టి 108లో దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.బావిలో దూకి వృద్ధురాలు బలవన్మరణం -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
సంగారెడ్డి టౌన్ : మంజీరా గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ కథనం మేరకు.. అందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన మ్యాదరి నరేశ్ (30) కొద్దిరోజులుగా భార్య దుర్గతో కలిసి ఇస్నాపూర్లో డ్రైవింగ్ పనిచేస్తూ అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఆదివారం తమ్ముడు నరేందర్, స్నేహితులతో కలిసి మంజీరా డ్యాంలో సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ నరేశ్ ఆవలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులకు యువకుడి మృతదేహం దొరికింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లోకి బాలుడు
కౌడిపల్లి(నర్సాపూర్): ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో మూడున్నరేళ్ల ధ్రువకరణ్ రెడ్డి చోటు సంపాదించాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు చెందిన ఉపాధ్యాయుడు తోట కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం కౌడిపల్లి నివాసం ఉంటూ మండలం పీర్యతండా ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. కరుణాకర్రెడ్డి, ప్రియాంక దంపతులకు కుమారుడు ధ్రువకరణ్ రెడ్డి(మూడున్నరేళ్లు), కూతురు ప్రవస్థ (2) ఉన్నారు. ధ్రువకరణ్ రెడ్డికి తల్లిదండ్రులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటి రాజధానులు, వివిధ దేశాల జాతీయ జెండాలు, నాయకుల పేర్లు, ఫ్లాష్ కార్డులు గుర్తింపులో ప్రత్యేక శిక్షణ ఇవ్వగా బొమ్మలు చూపగానే టక్కున గుర్తిస్తున్నాడు. గత నెలలో ధ్రువకరణ్ రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాలు, వాటి రాజధానులను 46.58 సెకన్లలో గుర్తించగా వీడియో రికార్డు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు. పరిశీలించిన ప్రతినిధులు అతడి వయసు, సమయం ఆధారంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు కల్పించి సర్టిఫికెట్ పంపిణీ చేశారు. మెడల్, సర్టిఫికెట్ మంగళవారం అందించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనుమానాస్పద స్థితిలో నెమలి మృతి తొగుట(దుబ్బాక): అనుమానాస్పద స్థితిలో నెమలి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీటాఫీసర్ నరేశ్ కథనం మేరకు.. తొగుట పెట్రోల్ పంపు సమీపంలో నెమలి మృతి చెంది ఉందని గ్రామస్తుల ద్వారా సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి నెమలిని పరిశీలించగా మరణించింది. స్థానిక పశు వైద్యాలయానికి తీసుకెళ్లగా పశువైద్యాధికారి రమేశ్ పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి నిర్ధారణ, ఆధారాల కోసం ఎఫ్వైఎస్ఎల్కు పంపించామని అధికారి తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం నిజాంపేట(మెదక్): చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేట మండలానికి చెందిన దండు చంద్రవ్వ కుమారుడు పదేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం నిజాంపేటకు చెందిన ఘడీం చెరువులో ఆత్మహత్యాయత్నం చేసింది. అటుగా వెళ్తున్న కుమార్ అనే వ్యక్తి గమనించి ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే 108కి సమాచారం అందించి రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. రంగనాయక సాగర్ వద్ద అగ్ని ప్రమాదం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద గల ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయం సమీపంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండుగంట పాటు శ్రమించి మంటలార్పారు. -
ప్రత్యేక గుర్తింపు
దివ్యాంగులకుసదరం సర్టిఫికెట్ స్థానంలో యూడీఐడీ కార్డులు జిల్లాలో పెన్షనర్ల వివరాలు దివ్యాంగులు – 13,793 వృద్ధులు – 59,242 వితంతువులు – 55,060 గీత కార్మికులు – 2,942 చేనేత – 2,206 హెచ్ఐవీ –1,034 ఫైలేరియా – 2,441 డయాలసిస్ – 103 ఒంటరి మహిళలు – 3,417 బీడీ కార్మికులు – 45,473 బీడీ టైకేదార్లు – 2,078 మొత్తం పెన్షనర్లు – 1,86,000 ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లు ఏడు కేటగిరీల్లో మాత్రమే అందించడం జరిగింది. మరో 14 కేటగిరీలను కలుపుకొని మార్చి నెల నుంచి యూనిక్ డిసెబిలిటీ గుర్తింపు కార్డులు 21 కేటగిరీల వారీగా అందించనున్నారు. యూడీఐడీ కార్డు కోసం ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే క్యాంపునకు హాజరు కావాలి. గతంలో మాదిరిగానే మీసేవా కేంద్రంలో గాని, ఫోన్లో గాని స్లాట్ బుక్ చేసుకొని క్యాంపునకు వెళ్లాలి. అనంతరం నిపుణులైన వైద్యులు పరీక్షల అనంతరం ఆన్లైన్లో దివ్యాంగుల వివరాలు నమోదు చేస్తారు. దరఖాస్తు వివరాలు, వైకల్యశాతం, వైద్యుల లాగిన్కు చేరుతుంది. అక్కడ వివరాలు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారి సంతకంతో కూడిన కార్డు మంజూరవుతుంది. 3 రంగుల్లో కార్డులు.. ప్రభుత్వం ప్రతీ శనివారం ఏర్పాటు చేయనున్న సదరం క్యాంపుల్లో వైకల్యం సంబంధించి వైద్యులు పరీక్షిస్తారు. అనంతరం పరీక్షల వివరాలు, లోపాలను ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు, లోపాలను బట్టి వైకల్య శాతం జనరేట్ అవుతుంది. ఈ శాతాన్ని మార్చడానికి వైద్యులకు ఎలాంటి అవకాశం ఉండదు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ రూపొందించడం ద్వారా ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఈ శాతాన్ని అనుసరించి యూ డీఐడీ కార్డులు మూడు రంగుల్లో ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉన్న ధ్రువపత్రం ఉపయోగం సదరం క్యాంపులో భాగంగా వైక్యలం గుర్తించబడి శాశ్వతంగా పెన్షన్ మంజూరీకి ధ్రువపత్రాన్ని పొందిన వారు కూడా ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకొని పర్మినెంట్ యూడీఐడీ కార్డును పొందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ధ్రువపత్రం అన్ని రకాలుగా వినియోగించుకునేందుకు వీలుంది. పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి దివ్యాంగులు యూడీఐడీ పోర్టల్ www. swavlambancard.gov.inలో సంబంధిత వివరాలతో ఆన్లైన్లో గాని, మొబైల్ ఫోన్లో గాని దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్ ప్రకారం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో ఆటోమెటిక్గా వైకల్య శాతం జనరేట్ చేసి గుర్తింపు కార్డులు అందించడం జరుగుతుంది. చిరునామా వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా యూడీఐడీ కార్డు పంపించడం జరుగుతుంది. ప్రతీ వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడూ ఫోన్కు సమాచారం అందించడం జరుగుతుంది. ఒక్కసారి కార్డు మంజూరైతే శాశ్వతంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ కార్డు పని చేస్తుందని, రైళ్లు, బస్సుల్లో సైతం ప్రాధాన్యంతోపాటుగా పలు రకాల సౌకర్యాలను కూడా పొందవచ్చు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.అర్హులైన దివ్యాంగులను వైకల్య శాతాన్ని బట్టి ఇప్పటివరకు జారీ చేస్తున్న సదరం ధ్రువపత్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. వీటి స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అంగవైకల్య యూడీఐడీ (యూనిక్ డిసెబుల్ ఐడెంటిటీ కార్డు) ను జారీ చేయనుంది. ఈ కార్డులను ఈ నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దివ్యాంగులు యూడీఐడీ పోర్టల్లో దరఖాస్తు చేస్తున్న వివరాలతోపాటుగా వైద్యులువైకల్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో ఎలాంటి తప్పులు జరిగేందుకు వీలు లేకుండా ఉంటుంది. 21 రకాల వైకల్యం కలిగి ఉన్న అర్హులైన దివ్యాంగులకు ఈ కార్డులను అందించనున్నారు. ఒకే దేశం ఒకే కార్డు విధానంలో ఈ కార్డు దేశం అంతటా పనిచేసేందుకు వీలు ఉండనుంది. – సిద్దిపేటరూరల్ 3 రంగుల్లో అందించనున్న ప్రభుత్వం 21 రకాల వైకల్యం కలిగిన దివ్యాంగులు అర్హులు ఈ నెల నుంచి అమల్లోకి.. పోర్టల్ ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం జిల్లా వ్యాప్తంగా 1,86,000 మంది -
మంజీరా నదిలో కుళ్లిన కోళ్లు
పాపన్నపేట(మెదక్): మంజీరా జలాలు కుళ్లిన కోళ్ల మృతదేహాలతో కలుషితమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి కింది నుంచి ప్రవహించే మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తులు భారీ సంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశారు. అవి కాస్త కుళ్లిపోయి జలాలు కలుషితమవుతున్నాయి. ఇటీవలె విస్తరిస్తున్న బర్డ్ఫ్లూ వ్యాధి వల్లే కోళ్లు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ నీటిని దిగువన మెదక్ పట్టణానికి తాగునీరుగా సరఫరా చేస్తారు. ఇలా కలుషితం చేస్తే ప్రజలు రోగాల బారిన పడుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్యారానగర్ డంప్యార్డు అనుమతులు రద్దు చేయాలి
ఎంపీ రఘునందన్ వినతి నర్సాపూర్: ప్యారానగర్ డంప్యార్డుకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సుశీల్కుమార్ అవస్తిని కలసి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో నిర్మిస్తున్న డంప్యార్డు అనుమతులను రద్దు చేయాలని ఎంపీ కోరారు. డంప్యార్డ్కు సంబంధించిన పలు అంశాలను రఘునందన్ వివరించారు. ఎంపీ వెంట నర్సాపూర్ జేఏసీ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, గుమ్మడిదల మండలానికి చెందిన జేఏసీ నాయకులు గోవర్ధన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, బాల్రెడ్డి, ఉదయ్కుమార్ తదితరులున్నారు. సంగారెడ్డి వరకు మెట్రోను పొడిగించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు పటాన్చెరు టౌన్: మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్చెరు పట్టణంలోని శ్రామికభవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లో మెట్రో రైలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డినుంచి హైదరాబాద్కు నిత్యం వేలాదిమంది ప్రయాణం చేస్తున్నారని ఈ ప్రాంతానికి మెట్రో తప్పనిసరిగా కేటాయించాలని కోరారు. ప్రభుత్వ హామీలు అమలుకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య, ఏరియా కార్యదర్శి నాగేశ్వరావు, పాండు రంగారెడ్డి, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి సంగారెడ్డి ఎడ్యుకేషన్: దళితులనే వివక్షతో గ్రామపంచాయతీ కార్మికులను ఇష్టానుసారంగా విధుల నుంచి తొలగిస్తున్నారని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కులవివక్షపోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేవీపీఎస్ నాయకులు సంగారెడ్డిలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఏవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ...కొన్నేళ్ల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, వాటర్, ఎలక్ట్రిషన్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. కంగ్టి మండలంలో కంగ్టి, దేగుల్వాడి,భీంమ్రా తదితర గ్రామాలలో కార్మికులను తొలగించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో తొలగించిన జీపీ కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని లేదా వారి స్థానంలో కుటుంబ సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, సహాయ కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు. అక్రమ ఇసుక తరలిస్తున్న వాహనాలు స్వాధీనం సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి మండలంలో అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని హనుమాన్నగర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక, మట్టిని రవాణా చేస్తున్నారన్న సమాచారంతో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తున్న ఆరు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై రవీందర్ మాట్లాడుతూ...ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నిమ్జ్తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సంగారెడ్డిజోన్: నిమ్జ్ ఏర్పాటుతో అక్కడి ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, అందుకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, రెవెన్యూ అధికారులతో నిమ్జ్ భూసేకరణపై కలెక్టర్ క్రాంతి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో గ్రామాల వారీగా చేసిన భూసేకరణ వివరాలు, ఇంకా ఎంత సేకరణ చేయాల్సి ఉంది అన్న వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు మ్యాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వం చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయన్నారు. భూములిచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులను ఈనెల 24లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జహీరాబాద్ ఆర్డీవో రామ్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి రెవెన్యూ, నిమ్జ్ అధికారులతో భూసేకరణపై సమీక్ష -
భరోసా పనితీరు భేష్
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్సంగారెడ్డి జోన్: భరోసా కేంద్రంలోని సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు. విధుల్లోగానీ, వ్యక్తిగతంగా గానీ ఎలాంటి సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చని స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని భరోసా కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు అందించిన సేవలను, నిర్వహించిన కౌన్సిలింగ్, భరోసా సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో కౌన్సిలింగ్ రూమ్, మెడికల్ రూమ్, లీగల్ సపోర్టింగ్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్ లలో కలియతిరిగారు. అనంతరం కార్యాలయం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...భరోసా కేంద్రం సిబ్బంది బాధిత మహిళలకు వెన్నంటి ఉండి వారికి అసరమైన మెడికో లీగల్ సేవలు సత్వరమే అందించాలన్నారు. అవసరమైన కేసులలో భరోసా సిబ్బంది బాధిత మహిళల ఇళ్లను సందర్శించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. మహిళా సంబంధిత నేరాల గురించి వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్, భరోసా కో–ఆర్డినేటర్ దేవలక్ష్మి, భరోసా సిబ్బంది తదితరులున్నారు. -
పన్ను వసూళ్లు 86శాతం పూర్తి
న్యాల్కల్ (జహీరాబాద్): జిల్లాలో ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు వసూలు చేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నెలాఖారు వరకు వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. గతంలో వసూలు చేసిన మాదిరిగా పన్నులను నిర్ణీత సమయానికంటే ముందే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పన్నులు వసూలు చేసేందుకు ఇంటి బాట పట్టారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పన్నులు తప్పకుండా వసూలు చేసేందుకు కార్యదర్శులు ఇళ్లన్నీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 27మండలాలు, 633 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.23,54,92,355 పన్నులు వసూలు చేయవలసి ఉండగా ఇప్పటివరకు జిల్లాలో రూ.20,45,71,746 (86.87%) పన్నులు వసూలు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 27 మండలాలు ఉండగా అందులో ఏ ఒక్క మండలంలో కూడా వంద శాతం పన్నులు వసూలు కాలేదు. అందోల్, మనూర్, నాగిల్గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, అత్నూర, పటాన్చెరువు, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్కల్, జహీరాబాద్ మండలాల్లో 90 శాతానికి పైగా పన్నులు వసూలు అయ్యాయి. వట్పల్లి, అమీన్పూర్, జిన్నారం, సంగారెడ్డి మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా వంద శాతం పన్నులు వసూలు చేయలేదు. జిల్లాలో 99.62% పన్నులు వసూలు చేసిన నాగిల్గిద్ద మండలం మొదటి స్థానంలో ఉండగా, 65.56% పన్నులు వసూలు చేసిన కంగ్టి మండలం చివరి స్థానంలో నిలిచింది. గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ వసూలు చేసిన పన్నులను పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రజలంతా ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు తప్పకుండా కట్టాలని, పన్నులు కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేస్తున్నారు. ఇళ్లన్నీ తిరిగి వసూలు చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు బ్యాంక్ల ద్వారా పంచాయతీల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. వసూలు చేసిన పన్నులతో ఆయా గ్రామాల్లో మంచి నీటి ట్యాంక్లు, మురికి కాల్వలను శుభ్రం చేయించడం, పగిలిన పైప్లైన్లకు, లీకేజీల మరమ్మతులు చేయించడం, వీధి దీపాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వాటిని వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పన్నుల వసూలుకు ఇంకా 13 రోజుల సమయం మాత్రమే మిలిగి ఉంది. ఈలోగా పన్నులు వంద శాతం వసూలు అవుతాయా? లేదా వేచి చూడవలసిందే. జిల్లాలో 633 పంచాయతీలు 287 జీపీల్లో పూర్తయిన పన్ను వసూళ్ల ప్రక్రియ నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని లక్ష్యం -
ఈ–పంచాయతీ చెల్లింపులు ఎలా?
రాజస్థాన్ ప్రజాప్రతినిధుల ఆరాకొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని తొగర్పల్లిలో మంగళవారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు పర్యటించారు. తొగర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు ఈ పంచాయతీ ద్వారా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయంపై పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని అలియాబాద్ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో పంచాయతీ, ఉపాధి హామీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీలతోపాటు యాదాద్రి మోడల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ప్రజాప్రతినిధులు గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీపనులతోపాటు పల్లె ప్రకృతి వనం నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్థాన్లో కూడా గ్రామాలలో ఎలాంటి పథకాలు అమలు చేయాలనే విషయంపై తెలంగాణలో పర్యటిస్తున్నట్లు వారు తెలిపారు. -
మున్సిపాలిటీలవైపే మొగ్గు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పలు గ్రామాలను ప్రభుత్వం ఇటీవల సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. మరికొన్ని గ్రామాలతో కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇలా విలీనమైన గ్రామాలు, కొత్త మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఇకపై మున్సిపాలిటీ శాఖలో పనిచేస్తారా..? లేదా పంచాయతీరాజ్ శాఖలో కొనసాగుతారా? అనే దానిపై నిర్ణయం తెలపాలని మున్సిపల్శాఖ ఆప్షన్లు కోరింది. దీంతో ఎక్కువమంది పంచాయతీ కార్యదర్శులు మున్సిపాలిటీల్లో పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. రెండు విడతలుగా నిర్ణయం.. జిల్లాలో మొదటి విడతలో పటాన్చెరు మండలంలోని ఐదు గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసింది. అలాగే అమీన్పూర్ మండలంలోని ఆరు గ్రామాలను అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిపింది. ఇలా మొత్తం 11 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆరు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డపోతారం గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చుతూ జనవరి మొదటి వారంలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 14 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. మరోవైపు కొహీర్ గ్రామ పంచాయతీ కూడా మున్సిపాలిటీగా మారింది. ఇలా మొత్తం 26 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. అయితే ఈ 25 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు ఇకపై పంచాయతీరాజ్శాఖలోనే కొనసాగుతారా..? మున్సిపాలిటీల్లో ఉంటారా? అనే అంశంపై మున్సిపల్శాఖ ఇటీవల ఆప్షన్లను అడిగింది. నలుగురైదుగురు మినహా మిగిలిన వారంతా మున్సిపల్ శాఖ వైపే మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.అర్బన్ ఏరియాల్లో పనిచేసే అవకాశం కోసం.. మున్సిపల్శాఖలోకి వెళితే అర్బన్ ఏరియాలో పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది మున్సిపాలిటీల్లో ఆప్షన్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్శాఖలోకి వెళితే సీనియారిటీ అంశం అటుంచితే కాస్త తొందరగా పదోన్నతులు వచ్చే అవకాశాలున్నాయి. గ్రేడ్–1 కార్యదర్శి మున్సిపాలిటీలో మేనేజర్ క్యాడర్ పోస్టు వస్తుంది. ఇది కూడా ఎక్కువ మంది మున్సిపాలిటీ వైపు వెళ్లేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తక్షణ పదోన్నతుల జాబితాలో ఉన్న అతి కొద్దిమంది మాత్రమే పంచాయతీరాజ్శాఖలో కొనసాగాలని భావిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలా మంది విలీన గ్రామ పంచాయతీల్లో డిప్యూటేషన్లపై కొనసాగుతున్నారు. ఇలా డిప్యూటేషన్లపై కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. విలీన పంచాయతీల కార్యదర్శులకు ఆప్షన్లు అడిగిన మున్సిపల్ శాఖ బల్దియాల్లో పనిచేసేందుకే ఎక్కువమంది ఆసక్తి జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లోకి... -
నేతన్నల స్థితిగతులపై అధ్యయనం
23న హన్మంత్రావుపేట్లో పద్మశాలీ సంఘం నేతల పర్యటననారాయణఖేడ్: నాడు వెలుగు వెలిగి నేడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నారాయణఖేడ్ మండలం హన్మంత్రావుపేట్ పద్మశాలీల జీవన స్థితిపై ‘సాక్షి’దినపత్రికలో ‘సిరుల దారం...నిరాధారం, ఆదుకున్న ఊరు ఆగమైంది’శీర్షికన ప్రచురితమైన కథనానికి పద్మశాలీ సంఘం, యువజన సంఘం సభ్యులు స్పందించారు. వారి స్థితిగతులపై అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నడుంకట్టారు. నారాయణఖేడ్లో పద్మశాలీ సంఘం బాధ్యులు, యువకులు మంగళవారం సమావేశమయ్యారు. గ్రామానికి ఈ నెల 23న వెళ్లి గ్రామం పరిస్థితి, నాటి వైభవం, నేటి దీన జీవనం, స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా నేత కార్మికుల జీవన ప్రమాణాలు పెరగకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సేకరించిన సమాచారం మేర స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని, గ్రామం పునరుజ్జీవం అయ్యేలా కృషి చేస్తామని ప్రకటించారు. గ్రామ పద్మశాలీల జీవన ప్రగతి మార్పుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా పద్మశాలీల జీవన స్థితిగతులపై ‘సాక్షి’లో వచ్చిన కథనం క్లిప్పింగ్ పద్మశాలీ రాష్ట్ర, జిల్లా స్థాయి సంఘాలు, స్థానిక వాట్సప్స్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చాలామంది క్లిప్పింగ్ను వాట్సప్ స్టేటస్గా పెట్టుకున్నారు. ఎఫెక్ట్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ
వట్పల్లి(అందోల్): తాళం వేసిన ఇంట్లో దొంగ చోరీకి పాల్పడిన ఘటన అందోలు మండల పరిధిలోని ఎర్రారం గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. జోగిపేట సీఐ అనిల్కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన శేషారెడ్డి ఫిబ్రవరి 7న కూతురికి ఆరోగ్యం బాగా లేదని కుటుంబంతో కలిసి ఇంద్రేశంకు వెళ్లి బంధువుల వద్ద ఉండి వారం రోజుల తర్వాత 14న రాత్రి ఎర్రారం గ్రామానికి చేరుకున్నాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.60 లక్షల నగదు కనిపించలేదు. ఇంట్లో దొంగలు పడ్డారని జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. శేషారెడ్డి ఇంటి సమీపంలో ఉండే బాయికాడి శ్రీశైలం దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. అతడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకోగా, నగదు బెట్టింగ్లు, జల్సాలకు ఖర్చయినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. కేసు విచారణలో కానిస్టేబుళ్లు సంజీవ్, అరవింద్, నర్సింహ గౌడ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కేసుకు కారకుడయ్యాడని చంపేశారు
పాపన్నపేట(మెదక్): డ్రంకై న్ డ్రైవ్ కేసుకు కారకుడయ్యాడన్న కోపంతో తోటి మిత్రులే యువకుడిని కొట్టి హత్య చేశారని మెదక్ రూరల్ సీఐ జీ.రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 10న ఏడుపాయల వద్ద వెలుగు చూసిన హత్యకేసును పోలీసులు ఛేదించి సోమవారం వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన వడ్ల నవీన్ సంగారెడ్డి లోని ఓ బేవరేజ్ కంపెనీలో పని చేసే సమయంలో తొగర్పల్లికి చెందిన వినోద్ రెడ్డి, సంగారెడ్డికి చెందిన బేగరి రాములు, కుమ్మరి రమణాచారి స్నేహితులయ్యారు. సంగారెడ్డిలో గత నెల 18న నలుగు రు స్నేహితులు మద్యం సేవించి వెళ్తూ పోలీసుల డ్రంకై న్ డ్రైవ్ టెస్టులో దొరికారు. నవీన్ పోలీసులను బతిమాలుతుండగా, వినోద్ రెడ్డి వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసు లు కేసు నమోదు చేశారు. కోర్టు జరిమానా, ఇతర ఖర్చులను నవీన్ భరించాడు. అప్పటి నుంచి వినోద్ రెడ్డి పై మిత్రులు కక్ష పెంచుకున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఈనెల 8న ముగ్గురూ కలిసి వినోద్ రెడ్డిని తీసుకొని ఏడుపాయల్లో దావత్ చేసుకుందామని తీసుకెళ్లారు. ఏడుపాయల్లో మందు కొనుగోలు చేసి మునిపుట్ట వద్ద తాగారు. అప్పటికే కోపంతో ఉన్న నవీన్ కట్టెతో వినోద్ రెడ్డిపై దాడి చేశాడు. అతడితోపాటు బేగరి రాములు, కమ్మరి రమణాచారి విచక్షణారహితంగా కొట్టడంతో చనిపోయాడు. అనంతరం నిందితులు నవీన్ ఇంటికొచ్చి డబ్బులు తీసుకొని పారిపోయారు. మృతుడి సోదరుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 8న సంగారెడ్డిలో నలుగురూ కలిసి ఉన్న విషయాన్ని తెలుసుకున్నారు. కొంత మంది సాక్షు లు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎస్సీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్ పోలీసులను అభినందించారు. వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ ముగ్గురు నిందితుల రిమాండ్ -
భర్త కళ్లెదుటే భార్య మృతి
పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన మింటు గిరి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి బైక్పై భార్య రంభా దేవి, కుమారుడు యూష్ (8) ముగ్గురూ బైక్పై ముత్తంగి వచ్చి తిరిగి ఇస్నాపూర్ వెళ్తున్నారు. మార్గమధ్యలో ఓల్డ్ మంజీరా బ్యాంక్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రంభా దేవి కిందపడగా టిప్పర్ మీది నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న గిరి, అతడి కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని వ్యక్తి.. ఝరాసంగం(జహీరాబాద్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని కప్పాడ్ గ్రామానికి చెందిన పట్లోళ్ల రాచన్న(41) ఆదివారం రాత్రి భోజనం చేసి గ్రామం నుంచి సంగీతం వైపు స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రాయికోడ్ మండల పరిధిలోని కప్పాడ్ గ్రామానికి చెందిన అంజిరెడ్డి సింగితం వైపు నుంచి బైక్పై అతివేగంగా వచ్చి రాచన్నను ఢీకొట్టాడు. వెంటనే చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాచన్న కొన్నేళ్లుగా బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఘటన విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తంతో పాటు పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొని యువకుడు చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నార్సింగి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం మేరకు.. నార్సింగి వడ్డేర కాలనీకి చెందిన బోసు అశోక్ తన సోదరుడు నర్సింహులు కుమారుడు బోస్ ప్రభాస్(18)ని ట్రాక్టర్పై కూర్చోపెట్టుకొని నార్సింగి వైపు వస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి యూపీకి చెందిన కంటైనర్ వేగంగా వచ్చి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభాస్ ఎగిరి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుమారుడికి స్వల్ప గాయాలు బైక్ను ఢీకొట్టిన టిప్పర్ -
వేర్వేరు చోట్ల ఏడుగురు బలవన్మరణం
అనారోగ్య సమస్యలతో విద్యార్థి బెజ్జంకి(సిద్దిపేట): అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ క్రిష్ణారెడ్డి కథనం మేరకు.. నర్సింహులపల్లె గ్రామానికి చెందిన కుసుంబ రవి పద్మలకు ఇద్దరు కుమారులు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు సాయి(22) కరీంనగర్లోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నాలుగేళ్లుగా దగ్గు, దమ్ము, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చూయించుకున్నా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెంది వ్యవసాయం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సాయిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకారం గ్రామంలో రైతు దుబ్బాకరూరల్: అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజ్ కథనం మేరకు.. దుద్దెడ లక్ష్మయ్య(52)గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆరు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల పెద్ద ప్రేగుకు శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై తెల్లవారు జామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకొని వ్యక్తి.. చిలప్చెడ్(నర్సాపూర్): అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలప్చెడ్ మండలం చండూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. చండూర్ గ్రామానికి చెందిన దూదేకుల ఇమామ్ (38) హైదరాబాద్లోని హఫీజ్పేట్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల కిందట కట్టిన ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతో మనస్తాపం చెందిన ఇమామ్ 15న హాపీజ్పేట్ నుంచి చండూర్ గ్రామానికి వచ్చాడు. 16న ఉదయం భార్య ఫాతిమాబేగం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బావ అయిన షాదుల్లాకు విషయం చెప్పింది. అతడు వెళ్లి చూసేసరికి ఇంట్లో ఇమామ్ ఉరేసుకొని కనిపించాడు. మృతుడి భార్య ఫాతిమా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు కట్నం వేధింపులకు వివాహిత కంగ్టి(నారాయణఖేడ్): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంగ్టి మండలం భీంరా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నాగన్పల్లి గ్రామానికి చెందిన పోగుల రవీందర్ రెడ్డి, సుజాత రెండవ కుమార్తె మహేశ్వరి(22)కి భీంరా గ్రామానికి చెందిన బోండ్ల పండరిరెడ్డితో 2022లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అత్తారింట్లో భర్త, మామ, బావ అదనపు కట్నం తేవాలని మహేశ్వరిని వేధించ సాగారు. ఈ విషయంలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సముదాయించారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో సోమవారం తెల్లవారు జామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి రవీందర్రెడ్డి ఫిర్యాదు మేరకు భర్త బోండ్ల పండిరిరెడ్డి, బావ బసిరెడ్డి, మామ గంగారెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. చెరువులో దూకి యువకుడు కంది(సంగారెడ్డి): చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంది మండలంలోని చిమ్నాపూర్ తండా లో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ కథనం మేరకు.. చిమ్నాపూర్ తండాకు చెందిన భానోత్ అంబర్ సింగ్(25) ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తండాకు సమీపంలో ఉన్న ధర్మసాగర్ చెరువుకట్టపై అంబర్ సింగ్ చెప్పులు ఉన్నట్లు తండా వాసులు గుర్తించారు. పోలీసుల సహకారంతో చెరువులో ఆచూకీ కోసం గాలించగా అంబర్ సింగ్ మృతదేహం లభించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో ఇద్దరు రైతులు రామాయంపేట(మెదక్): ఆర్థిక సమస్యలతో మండల పరిధిలోని ప్రగతి ధర్మారంలో ఒకరు, ఆర్. వెంకటాపూర్ గ్రామంలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ బాల్ రాజ్ కథనం మేరకు.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన రైతు మాసాయిపేట పురుషోత్తం (34) కొంతకాలంగా అప్పుల బాధతో సతమతమవుతున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పొలానికి నీరు పెట్టి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బోరు వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. అప్పుల బాధతోనే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య భాగ్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు పుర్ర రాములు (36) ఆర్థిక సమస్యలతో రెండు రోజుల కిందట ఇంటిలోనే క్రిమి సంహారక మందు తాగాడు. అతడిని చికిత్స నిమిత్తం రామాయంపేట నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అగ్ని ప్రమాదాలు.. కష్టం బూడిద పాలు
కలప మిల్లులో షార్ట్ సర్క్యూట్ జహీరాబాద్ టౌన్: ఓ కలప మిల్లులో అగ్ని ప్రమా దం జరిగిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని రాచన్నపేటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాచన్నపేటలో గల గురుకృష సామిల్(కలప మిల్లు)లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. తొలుత సామిల్కు మంటలు అంటుకొని ముందున్న మారుతీ కార్పెంట్ షాపునకు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న స్థానికులు మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వచ్చి మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో కలపతోపాటు కార్పెంట్ దుకాణంలో ఉన్న మిషన్లు, బైక్ దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వంటగదిలో మంటలు వెల్దుర్తి(తూప్రాన్) : అగ్ని ప్రమాదంలో వంటగది దగ్ధమైన ఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మర్కంటి రుక్కమ్మకు చెందిన వంటగది ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలి బూడిదయ్యింది. ప్రమాదంలో వంట సామగ్రి, బట్టలు, ఇతర నిత్యావసర సరుకులు కాలిపోయాయి. ఘటనా స్థలాన్ని గిర్దావర్ నర్సింగ్ యాదవ్ సందర్శించి పంచనామా నిర్వహించారు.అగ్నిప్రమాదంలో సుమారు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాలిబూడిదైన గడ్డివాము శివ్వంపేట(నర్సాపూర్) : గడ్డివాము దగ్ధమైన ఘట న మండల పరిధి ఎదుల్లాపూర్ గ్రామంలో సోమ వారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బురెడ్డి అంజిరెడ్డి వ్యవసాయం పొలం వద్ద నిల్వ ఉంచిన ఎండు గడ్డివాముకు నిప్పంటుకుంది. సుమారు 800 గడ్డి మోపులు దగ్ధమయ్యాయి. నర్సాపూర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పినప్పటికీ పూర్తిగా తగులబడిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టినట్లు బాధిత రైతు అంజిరెడ్డి వాపోయారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని కోరారు. ఒక్క రోజే నాలుగు ఘటనలు భారీస్థాయిలో ఆస్తి నష్టం లబోదిబోమంటున్న బాధితులు చెరకు తోట, డ్రిప్ పైపులు దగ్ధం జహీరాబాద్ టౌన్: అగ్నిప్రమాదంలో చెరకు తోటతోపాటు డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రమైన మొగుడంపల్లి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని భవానమ్మపల్లికి చెందిన రైతు గొల్ల రాచన్నకు మొగుడంపల్లి వద్ద 11 ఎకరాల చెరకు తోట ఉంది. పంటను ఇటీవలె కర్మాగారానికి సరఫరా చేయగా ప్రస్తుతం మొడెం తోట(రెండవ పంట) ఉంది. రోడ్డు పక్కన తోట ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు సిగరేట్ తాగి పారవేయడంతో తోటకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో తోటతోపాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. -
అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలి
డీఐఈఓ రవీందర్రెడ్డి సిద్దిపేట ఎడ్యుకేషన్ అగ్నివీర్ నియామకాలకు జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్మెన్ తదితర విభాగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. జనరల్ విభాగానికి 10వ తరగతి 45 శాతం మార్కులతో, టెక్నికల్కు ఇంటర్ ఎంపీసీ 50 శాతం మార్కులతో, క్లర్క్ విభాగానికి ఇంటర్మీడయట్ 60 శాతం మార్కులతో, ట్రేడ్మెన్కు 10వ తరగతి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండి అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించారు. నియామక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని మొదటిది 200ల మార్కులకు కామన్ ఎంట్రెన్స్ పరీక్ష, రెండవ దశలో రన్నింగ్, శారీరక దృఢత్వ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రూ.250 పరీక్ష రుసుఒం చెల్లించి సంబంధిత అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష జూన్ నెలలో ఉంటుందన్నారు. నియామకాలు పూర్తిగా మెరిట్పైనే ఆధారపడి ఉంటాయన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ల జోలికి వెళ్లొద్దు సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లకూడదని, గేమింగ్కి అలవాటు పడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బెట్టింగ్లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్లను ప్రమోట్ చేసే వారి సమాచారం అందించాలన్నారు. మోసపూరిత ప్రకటనలు, మేసేజ్లకు వ్యక్తిగత, ఓటీపీ వివరాలు పంపకూడదన్నారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు తెలపాలన్నారు. రేషన్ బియ్యం పట్టివేత అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గోవర్థనగిరి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం రెవె న్యూ, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఆర్ఐ యాదగిరి కథనం మేరకు.. నమ్మదగిన సమాచారం మేరకు చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన బత్తుల అంకూష్ వద్ద దాదాపు 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీ నం చేసుకున్నాం. గ్రామంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఓ ప్రైవేట్ ఇంట్లో నిల్వ ఉంచారు. రేషన్ బియ్యాన్ని పట్టుకొని సివిల్ సప్లయ్ గోదాముకు తరలించాం. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్భాస్కర్ తెలిపారు. హత్య కేసులో నిందితురాలి అరెస్ట్ సంగారెడ్డి క్రైమ్ : యువకుడి హత్య కేసులో నిందితురాలైన గడ్డం మరియమ్మను పోలీసుల ఆదివారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ రమేశ్ కథనం మేరకు.. 15న మన్నే వినోద్ (21) అనే యువకుడితో డబ్బుల విషయంలో గొడవ జరుగగా ఆగ్రహించిన మరియమ్మ రాయితో కొట్టి దారుణంగా హత్య చేసింది. ఈ కేసు భాగంగా నిందితురాలిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇసుక ఫిల్టర్పై పోలీసుల దాడి కృత్రిమ ఇసుక తయారీ యంత్రాలు సీజ్ నిర్వాహకుడిపై కేసు నమోదు తూప్రాన్: మట్టితో కృత్రిమ ఇసుక తయారీ చేస్తున్న ఇసుక ఫిల్టర్పై పోలీసులు సోమ వారం రాత్రి దాడి చేశారు. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మండలంలోని గౌడిగుడెం శివారులో విష్ణువర్ధన్రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా తవ్వకాలు జరిపి కృత్రిమ ఇసుక తయారు చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి జేసీబీ, హిటాచీ, ఇసుకతో కూడిన రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో మహామృత్యుంజయ యజ్ఞం
ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ప్రకృతి నిలయం, ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోన్న బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో వార్షిక అమర తిథి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బెల్లాపూర్ గ్రామం నుంచి బర్దీపూర్ ఆశ్రమం వరకు చేపట్టిన పాదయాత్ర, పల్లకీసేవ శనివారం రాత్రి చేరుకుంది. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ108వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, డా.సిద్దేశ్వర స్వామి ఆధ్వర్యంలో గణపతి పూజ, గోపూజ, పుణ్యహవచనం, మహామృత్యుంజయ లక్షజప యజ్ఞం చేశారు. ప్రత్యేకపూజల్లో కేశవరావు దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్పై ప్రత్యేక నిఘా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జోన్: ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్ కట్టడికి జిల్లా పోలీసుశాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామ ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినా, గేమ్స్ ఆడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్వేర్ ఉందని, ఫేక్లింక్స్తో వ్యక్తిగత సమాచారం, అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని, గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీకి వెళ్లిన బీమా ఏజెంట్లు నారాయణఖేడ్: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 19న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖేడ్ ప్రాంత బీమా ఏజెంట్లు ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బీమా పాలసీలపై విధిస్తోన్న జీఎస్టీని రద్దుచేయాలని, బోనస్ పెంచాలని, 70 ఏళ్లుగా పనిచేస్తున్న ఏజెంట్లకు తగ్గించిన కమిషన్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మేరకు డిమాండ్లతో కూడిన కరపత్రాలను ప్రదర్శించారు. గురుకుల ప్రవేశపరీక్షకు దరఖాస్తుల స్వీకరణజహీరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6,7,8,9వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఝరాసంగం, దిగ్వాల్ బాలుర గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీశ్వర్రెడ్డి కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషిపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ కల్హేర్(నారాయణఖేడ్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో పీఆర్టీయూ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్ ప్రమాణం చేశారు. కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన గుండు లక్ష్మణ్ మార్డి ఉన్నత పాఠశాలలో పీజీ హెచ్ఎంగా పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీపాల్రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన స్థానంలో గుండు లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
డంపింగ్యార్డ్ రద్దుకు సంతకాల సేకరణ
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ వద్ద డంపింగ్యార్డ్ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తామని ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ రాజయ్య హెచ్చరించారు. ఆదివారం రద్దు ప్రక్రియకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాల పోరాట వేదిక తరఫున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని కానుకుంట, అనంతారం, గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, అన్నారం, మంబాపూర్ గ్రామాలలో పర్యటించి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...డంపింగ్యార్డ్ రద్దు చేయాలని నేటికీ 40 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు. -
కార్మికుల కోసం నిరంతర పోరాటం
పటాన్చెరు: గత 40 ఏళ్లుగా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ నిరంతర పోరాటం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అనుబంధంగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పోచారం గ్రామ పరిధిలో కార్మికులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన చుక్కా రాములు మాట్లాడుతూ... 40 ఏళ్లపాటు ఒకే నాయకత్వంలో కార్మికుల ఐక్యతతో అనేక విజయాలు సాధించడం హర్షణీయమన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు -
బీఆర్ఎస్పై వెల్లువెత్తిన నిరసనలు
సంగారెడ్డి జోన్/సదాశివపేట(సంగారెడ్డి)/నారాయణఖేడ్: దళితుల పట్ల, స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసింది. ఆందోళనలో భాగంగా సంగారెడ్డి, నారాయణఖేడ్, సదాశివపేటల్లో ప్రధాన రహదారులపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనల ర్యాలీలు చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...స్పీకర్ గడ్డం ప్రసాద్పై మాజీమంత్రి జగదీశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, దళితుడు స్పీకర్గా ఉండటం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. గతంలో కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మూడు ఎకరాలు ఇస్తానని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్, నాగల్గిద్ద, మనూరు మండలాల్లోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, తోపాజి అనంత కిషన్, సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు కై న సంతోష్, మండల అధ్యక్షులు మోతీలాల్ నాయక్, నాయకులు సిద్దన్న, బుచ్చి, రాములు తదితరులు పాల్గొన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తీరుపై ఆగ్రహం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కేటీఆర్, జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం -
హామీలను విస్మరించడం సరికాదు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎన్నికల ముందు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలిచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని తపస్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో తపస్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి శ్రీనాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ నర్సిరెడ్డిలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు త్రిశంకు స్వర్గాన్ని చూపించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే వంకతో మొండిచేయి చూపడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై మాట్లాడిన తీరు మంచిగా లేదన్నారు. హామీలు అమలు చేయకుంటే తపస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, లింగమూర్తి, శ్రీనివాస్రెడ్డి, దేవదాస్, జైపాల్, శ్రీకాంత్ పాల్గొన్నారు. తపస్ రాష్ట్ర నాయకుడు -
మరో ఇండస్ట్రియల్ పార్క్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొత్తగా మరో ఇండిస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుమ్మడిదల మండల కేంద్రం పరిధిలో టీజీఐఐసీ (తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) ఈ పార్కును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 166 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ పార్కులో ఫార్మా పరిశ్రమలు కాకుండా ఆరెంజ్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమల కోసమే ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఐఐసీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పార్కులో ప్రత్యేకంగా ఒకే రకమైన పరిశ్రమల కోసం ఏర్పాటు చేయడం లేదని, జనరల్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పరిశ్రమల భూములు కేటాయిస్తామని ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయి...భూములు అప్పగిస్తే లేఅవుట్ చేసి పరిశ్రమలకు కేటాయిస్తామని అంటున్నారు. ఇప్పటికే గుమ్మడిదల మండలంలో ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడలున్నాయి. ఇందులో ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమలే అధికంగా ఉన్నాయి. ఈ పరిశ్రమలతో ఈ ప్రాంతమంతా పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. వాయుకాలుష్యంతోపాటు, భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులో ఫార్మా పరిశ్రమలకు కేటాయింపులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ప్యారానగర్ డంప్యార్డు ఆందోళన గుమ్మడిదల మండలంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న డంప్యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరూతూ నిత్యం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే మండలంలో మరో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణకు ప్రభుత్వ సమయాత్తమవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఆందోళనలో రైతులు.. ఈ అసైన్డ్భూముల్లో దళిత, గిరిజన రైతులవే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిరుపేద రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ భూములతో తమ జీవనాధారమని వాటిని ప్రభుత్వం లాక్కుంటే మా పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ భూసేకరణకు సంబంధించిన రైతులతో రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా మాట్లాడారు.అసైన్డ్ భూములే అధికం... కొత్త ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించనున్న భూముల్లో అసైన్డ్భూములే అధికంగా ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సాగుకు యోగ్యంగా లేని భూములే చాలామట్టుకు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ భూములోంచి నిత్యం అక్రమంగా మట్టితవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. గుమ్మడిదలలో ఏర్పాటుకు టీజీఐఐసీ నిర్ణయం భూసేకరణ ప్రక్రియ షురూ చేసిన రెవెన్యూ అధికారులు 166 ఎకరాల భూములు సేకరణకు ఆందోళనకు గురవుతున్న భూములు కోల్పోతున్న రైతులు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వస్తాయంటున్న టీజీఐఐసీనోటిఫికేషన్ ఇచ్చాం గుమ్మడిదల మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశాం. ఈ భూములు కోల్పోతున్న రైతులతో చర్చిస్తాం. ఇందుకోసం త్వరలో గ్రామసభ నిర్వహిస్తాం. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటైతే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – రవీందర్రెడ్డి, భూసేకరణ అధికారి, సంగారెడ్డి ఆర్డీవో -
ఇచ్చిన హామీలను అమలు చేయాలి
గజ్వేల్రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో గద్దె దిగాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. పట్టణంలోని భగవాన్ శ్రీసత్యసాయి మందిరంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ మానవ హక్కుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కప్పర ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటంపై ప్రజలు ఆలోచించాలన్నారు. కార్యక్రమం బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
అంగన్వాడీలకూ ఒంటిపూట
నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం ఈ ఏడాది ఒంటిపూట బడులు మార్చి 15 నుంచే నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలకు వచ్చేది ఐదేళ్లలోపు చిన్నారులు అయినా వారికి ప్రతీ ఏడు వేసవి ఎండలు మండుతున్నా ప్రభుత్వాలు, సంబంధిత శాఖ ఒంటిపూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలకు మార్చి 15 నుంచి అమలు చేస్తున్నా అంగన్వాడీలకు మే మొదటి వారంలో ఒంటిపూట బడుల నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేవారు. దీంతో అంగన్వాడీకి వచ్చే చిన్నారులు, టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడేవారు. కాగా, ఈసారి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు అంగన్వాడీలకు సైతం ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతినిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మే 31వరకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతాయి. ఆలోపే అంగన్వాడీలకు వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడం, ప్రీస్కూల్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. 12.30గంటల తర్వాత సంబంధిత వార్షిక సర్వే, గృహాల సందర్శన, ప్రీ–స్కూల్లో పిల్లల నమోదు, డ్రాప్ అవుట్లను అంగన్వాడీల్లో తిరిగి చేర్చుకోవడంలాంటి తదితర పనులను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలలో అంగన్వాడీ చిన్నారులకు వేసవి ఇబ్బందులు తీరనున్నాయి. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట్, సదాశివపేట్, పటాన్చెరుల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,504అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులు 1,04,106మంది కేంద్రాలకు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలూ ఒంటిపూట ప్రభుత్వ పాఠశాలలకు ప్రతీ ఏడాది తరహాలోనే ఈసారి కూడా ప్రభుత్వం ఈనెల 15 నుంచి ఒంటిపూట బడుల నిర్వహణకు ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతన్న 1,17,184మంది విద్యార్థులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యా హ్నం 12.30గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. ఈనెల 21 నుంచి టెన్త్ పరీక్షలు కొనసాగనున్న కేంద్రాల్లో మాత్రం తరగతులను మధ్యా హ్నం నిర్వహిస్తారు. వార్షిక పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ప్రభుత్వ పాఠశాలలతో సమంగానే ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12:30 గంటలవరకు నిర్వహణ చిన్నారులకు వేసవిలో ఉపశమనం -
పశువుల వ్యాపారానికి అడ్డా ..
శుక్రవారం వచ్చిందంటే పశువుల సంతకు భలే గిరాకీ ఉంటుంది. పశువుల వ్యాపారానికి అడ్డాగా హుస్నాబాద్ నిలుస్తోంది. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు క్రయ, విక్రయాలు జరుపుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తుంటారు. వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి పశువులను కొనుగోలు చేసి వాహనాల్లో హైదరాబాద్ లాంటి పట్టణాలకు తరలిస్తారు. వార సంతలో అమ్మే పశువు ఒక్కింటికీ రూ.250 చొప్పున అమ్మిన వారి నుంచి, కొన్నవారి నుంచి రుసుం వసూలు చేస్తారు. గొర్రెలు, మేకలకు రూ.200 చొప్పున తీసుకుంటారు. ఒక్క రోజే లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. కోట్లల్లో వ్యాపారం జరుగుతున్న అంగడిలో కనీస వసతులు మాత్రం ఉండవు. అలాగే లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఎలాంటి రక్షణ లేదు. అధికారులు నామమాత్రపు షెడ్లు వేసి చేతులు దులుపుకొంటున్నారు. -
తల్లి దశ దిన కర్మ రోజే కొడుకు మృతి
కొండపాక(గజ్వేల్): తల్లి దశ దిన కర్మ రోజున కొడుకు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండలంలోని మంగోల్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన కొండ సత్తవ్వ దశ దిన కర్మను కుటుంబీకులు కుల సంఘం భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పనుల్లో నిమగ్నమైన కొడుకు కొండ కృష్ణ (27) కుల సంఘం భవనానికి ఎదురుగా ఉన్న ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నాడు. దీంతో విద్యుత్తు షాక్ తగిలి కిందపడటంతో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడు తిప్పారం గ్రామ శివారులోని కోళ్లఫాంలో కూలీ పనులు చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే వాడు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
చేపల కోసం చెరువులోకి దిగి..
కౌడిపల్లి(నర్సాపూర్): చేపల కోసం చెరువులోకి దిగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మహమ్మద్నగర్ పెద్ద చెరువు వద్ద ఆదివారం జరిగింది. ఎస్ఐ రంజిత్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్త చెరువు తండా పంచాయతీ పరిధిలోని గూగ్లోత్ తండాకు చెందిన గూగ్లోత్ లక్ష్మణ్(32) కట్టెకోత కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన సురేందర్రెడ్డి వద్ద కూలీపనులు చేశాడు. ఆదివారం లక్ష్మణ్ మహమ్మద్నగర్ చెరువు వద్దకు వచ్చాడు. అక్కడ సురేందర్రెడ్డి కూలీలతో చేపలు పట్టిస్తున్నాడు. తనకు చేపలు కావాలని అతడు చెరువులోకి దిగి ఈదుకుంటూ వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు విషయం చెప్పారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ అధికారులతో కలిసి చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చేగుంట చెరువులో..చేగుంట(తూప్రాన్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్య కుమార్రెడ్డి కథనం ప్రకారం... ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన అమర్సింగ్(31) స్థానిక ఉన్న ఓ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం చేగుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది. మద్యం మత్తులో కిందపడి.. వెల్దూర్తి(తూప్రాన్): మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వెల్దుర్తి ఎస్ఐ రాజు కథనం ప్రకారం... కొప్పులపల్లి గ్రామానికి చెందిన మల్గా సురేశ్(44) శనివారం కూలీ పనులకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వచ్చి కిందపడిపోయి నిద్రపోయాడు. ఆదివారం కుటుంబీకులు లేచి చూడగా అతడి నోట్లోంచి నురగలు వచ్చిన విషయం గమనించి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్: ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం ప్రకారం... తుజాల్పూర్ గ్రామా నికి చెందిన గాలి నర్సింహులు (44) శనివా రం కిష్టయ్యపల్లికి వెళ్తున్న క్రమంలో మధ్యాహ్నం నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం భార్య మంజులకు ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. ఆమె బంధువుల సహాయంతో నర్సాపూర్ అటవీ ప్రాంతానికి చేరుకొని అతడిని చికిత్స కోసం హైదరాబాద్ సూరారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేబుల్ దొంగతనానికి వెళ్లి..
జోగిపేట(అందోల్): బోరు మోటరు కేబుల్ వైర్లను దొంగిలించడానికి వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన అందోలు శివారులోని వ్యవసాయ పొలం వద్ద శనివారం రాత్రి జరిగింది. సీఐ అనీల్కుమార్ కథనం ప్రకారం... కొక్కొండ జగదీశ్ అనే రైతు కౌలుకు తీసుకున్న భూమిలో వరి పొలానికి నీరు పారబెట్టడానికి ఆదివారం ఉదయం పొలం వద్దకు రాగా బోరు వద్ద కరెంటు సరఫరా లేకపోవడం, కేబుల్ను ఎవరో ఎత్తుకెళ్లారని గుర్తించి వెళ్తుండగా అక్కడే పడి ఉన్న యువకుడి మృతదేహన్ని చూసి పోలలీలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కూలీ పనిచేసుకొని జీవించే జోగిపేట పట్టణానికి చెందిన చిత్తారి సంగమేశ్ (30)గా గుర్తించారు. బోరు వద్ద గల ప్యానెల్ బోర్డు స్విచ్ తీసేసి కేబుల్ వైరును కటింగ్ ప్లేర్తో కట్ చేసే క్రమంలో అతడి మెడకు ఉన్న గొలుసుకు విద్యుదాఘాతం తగిలి తల కొద్ది భాగం తెగిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాబాల్లో మద్యం సరఫరా చేస్తే చర్యలు సిద్దిపేట ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ సిద్దిపేట కమాన్: దాబాల్లో మద్యం సరఫరా చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్దిపేట ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పలు దాబాల్లో ఆదివారం ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్ఎస్, గాయత్రి, మయూరి, చాముండి, సాయిరామ్, గ్రీన్, దుర్గా దాబాలపై తనిఖీలు నిర్వహించి చట్టవిరుద్ధంగా మద్యం సేవిస్తున్న 9మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సరఫరా చేస్తున్న దాబా నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యుదాఘాతంతో ఆవు మృతి చేర్యాల(సిద్దిపేట): విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగపురి శివారు గండికుంటలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పడాల చంద్రయ్యకు చెందిన పాడి ఆవు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దీంతో రూ.80 వేల వరకు నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కొండపాక(గజ్వేల్): ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... కొమురవెళ్లి గ్రామానికి చెందిన సార్ల గణేశ్, బావమరిది చిక్కుడు సత్తయ్య కలిసి ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై విశ్వనాథపల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథపల్లికి టర్న్ అవుతుండగా హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను అంబులెన్స్లో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ శేఖర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ స్టేషన్కు తరలింపు చేర్యాల(సిద్దిపేట): పట్టణ శివారులోని గుర్జకుంట వాగు నుంచి కొందరు వ్యక్తులు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసు కను తరలిస్తుండగా ఆదివారం చేర్యాల పోలీసులు అడ్డుకొని ఇసుక లోడ్తో ఉన్న ట్రాక్టర్ను స్టేషన్కు తరలించినట్లు ఆర్ఐ రాజేందర్రెడ్డి తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తు న్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించగా నిజమేనని తెలవడంతో చర్యలు తీసుకున్నారని పేర్కొ న్నారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బీమా కుటుంబానికి ధీమా
మెదక్ కలెక్టరేట్: ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో కనీసం ఒక ద్విచక్ర వాహనం, కార్లు ఉన్నాయి. ఏ చిన్న అవసరం పడినా బైక్ పైనే పరుగులు పెడుతున్నారు. డ్రైవింగ్పై అవగాహన లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు పోవడమే అత్యధికంగా జరుగుతోంది. అప్పుడప్పుడు మాత్రం అంగవైకల్యంతో బయట పడుతున్నారు. అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే విద్యుత్ మోటర్ల వద్ద పొలానికి నీళ్లు పారిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఎంతో మంది రైతులు మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో 2023లో 562 రోడ్డు ప్రమాద ఘటనల్లో 223 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 2024లో 568 రోడ్డు ప్రమాదాల్లో 302 మంది చనిపోగా, మరో 459 మంది గాయాలపాలయ్యారు. అకాల మరణాలతో వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. ఆదుకునే వారు లేక, ఆర్థికంగా ఎదగలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అతి తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో బీమా అందిస్తోంది. ఏడు ప్రైవేట్ కంపెనీలతో... కేంద్ర ప్రభుత్వం పలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కలిసి అతి తక్కువ మొత్తానికే తపాలా ప్రమాద బీమా అందిస్తోంది. ఆపద సమయంలో అభాగ్యులకు అండగా ఉండేందుకు తీసుకొచ్చిన ఈ పాలసీతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో టాటా ఏఐజీ, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్, నివోభూపా, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం, ఆదిత్య బిర్లా కంపెనీలు పనిచేస్తున్నాయి. రూ.549లతో రూ.10 లక్షలు, రూ.749తో రూ.15 లక్షలు పాలసీదారులు కేవలం రూ.549 లేదా 555లు చెల్లిస్తే రూ.10లక్షల బీమా లభిస్తుంది. అలాగే రూ.749 లేదా 755లతో రూ.15లక్షల బీమా అందిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు పాలసీలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రమాదవశాత్తు పాలసీదారు మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యం, పక్షవాతం బారిన పడినప్పుడు అతడి కుటుంబానికి బీమా డబ్బులు అందజేస్తారు. అయితే పాలసీదారులు రూ.18 నుంచి 66 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 3 లేదా 4నెలల్లో క్లయిమ్.. పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే మూడు లేదా నాలుగు నెలల్లోనే క్లయిమ్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. దీంతో ఆ కుటుంబానికి ఆర్థికంగా కొండంత అండ లభిస్తోంది. అలాగే బీమా చేసిన వ్యక్తికి చదువుకునే పిల్లలిద్దరు ఉంటే వారి చదువు ఖర్చులు పదిశాతం లేదా రూ.ఒక లక్ష ఇలా ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. విదేశాల్లో ఉన్నా... పాలసీదారుడు విదేశాల్లో మరణిస్తే స్వదేశం తేవడానికి రూ.5వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు అందజేస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు దూర ప్రాంతాల్లో ఉంటే అంత్యక్రియలకు రూ.25వేలు ఇస్తారు. ప్రమాదంలో పాలసీదారుడు తీవ్రంగా గాయపడితే చికిత్స కోసం రూ.లక్ష, కోమాలోకి వెళితే రూ.లక్ష, ప్రమాదం జరిగిన వ్యక్తి రెండు రోజులకు మించి ఆస్పత్రిలో ఉంటే పదిరోజుల వరకు రోజుకు రూ.1000ల చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో రూ.1.40 కోట్లు ఆపదలో అండగా కేంద్ర ప్రభుత్వ తపాలా బీమా అవగాహన లేక తీసుకోలేక పోతున్న ప్రజలు జిల్లాలో 10, 200 మంది పాలసీదారులు ప్రజలకు అందుబాటులో తక్కువ ప్రీమియంలుజిల్లాలో మొత్తం 10,200 మంది పాలసీదారులు ఉన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన పాలసీదారుల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.1.40కోట్ల బీమా డబ్బులు అందజేశాం. సబ్ పోస్ట్ మాస్టర్లు, పోస్ట్ మాస్టర్ల ద్వారా తపాలా బీమాపై ప్రజలకు సమాచారం అందిస్తున్నాం. జిల్లాలోని ప్రజలందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఆపద సమయంలో కుటుంబాలను ఆదుకుంటాయి. –శ్రీనివాస్, పోస్టల్ ఇన్సూరెన్స్ అధికారి, మెదక్ -
ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం
కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోనే అతి పెద్ద అంగడి ● రోడ్ల పైనే వ్యాపారం ● పరదాలు కప్పుకొని కాలం వెల్లదీస్తున్న వ్యాపారులు ● కనీస సౌకర్యాలు కల్పించని మున్సిపాలిటీ అధికారులు ● గత ఏడాది వారాంతపు సంత వేలం రూ.1.20 కోట్లు ● నేడు అంగడి బహిరంగ వేలంహుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీకి వారాంతపు సంత ఆదాయం వెన్నుదన్నుగా నిలుస్తోంది. గుండు పిన్ను మొదలుకొని ఇంటికి కావాల్సిన వస్తువులు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లు ఇతరత్రా వస్తువులు అంగడిలోనే లభిస్తాయి. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోనే అతి పెద్ద సంత. మున్సిపాలిటీకి ఇంటి పన్నులు, వాణిజ్య పరంగా వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా అంగడి ద్వారానే సమకూరుతోంది. కానీ సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ప్రతి శుక్రవారం వార సంత జరుగుతోంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ నుంచి వ్యాపారులు వస్తుంటారు. ప్రతి వారం జరిగే అంగడిలో కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. రోడ్ల పైనే వ్యాపారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి మొదలుకొని ఎల్లమ్మ చెరువు కట్ట వరకు అంగడి కొనసాగుతోంది. వారాంతపు సంతలో అన్ని రకాల తాజా కూరగాయలు లభిస్తాయి. వివిధ మండలాల నుంచి రైతులు కూడా వచ్చి పండించిన పంటలను ఇక్కడ అమ్ముకుంటారు. పట్టణవాసులు వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తారు. అలాగే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఎండు మిర్చి, బట్టలు, వ్యవసాయ పనిముట్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. అంగడికి ప్రత్యేక స్థలం లేక అన్ని వ్యాపారాలు రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. వ్యాపారులు ప్లాస్టిక్ పరదాలు వేసుకొని ఎండకు ఎండుతూ వానకు నానుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. అంగడి నిర్వాహకులు వారి నుంచి రూ.50 నుంచి మొదలు కొని రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీకి లక్షల్లో ఆదాయం వస్తున్నా.. సౌకర్యాలు కల్పించాలని వారు అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదు. తాగడానికి నీరు, ఉండటానికి నిలువ నీడ కూడా ఉండదు. ప్రతి శుక్రవారం ఈ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం జరుగుతోంది. నేడు అంగడి బహిరంగ వేలం మున్సిపల్ కార్యాలయంలో వారాంతపు సంత నిర్వహణ కోసం సోమవారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఒక్కో గుత్తేదారుడు రూ.10 లక్షల ధరావత్తు సొమ్ము తో పాటు రూ.5 వేల దరఖాస్తు ఫీజు చెల్లించి వేలంలో పాల్గొంటారు. వేలం దక్కించుకోవడానికి హుస్నాబాద్, సిద్దిపేట, పరకాల, జమ్మికుంట, నల్లగొండ, కరీంనగర్ నుంచి గుత్తేదారులు పోటీ పడ తారు. వేలంలో పాల్గొనడానికి 11 మంది దరఖాస్తు చేసుకున్నా రు. గత ఏడాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన రుద్రాక్ష శ్రీనివాస్ రూ.కోటీ 20 లక్షల 26వేలకు సంత ను దక్కించుకున్నాడు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో రైతు బజార్కు పంపిస్తాం కొత్తగా రైతు బజార్ను నిర్మించాం. టాయిలెట్స్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే రోడ్ల పై కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారులను అక్కడికి తరలిస్తాం. రోడ్ల పై అమ్మకుండా చర్యలు తీసుకుంటాం. అంగడికి వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం. – మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్ -
ప్రారంభమైన ‘వాటర్ బెల్’
‘సాక్షి’ కథనంతో పలు బడుల్లో అమలుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఎండలు మొదలయ్యాయి. వాతావారణం వేడెక్కుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు ‘నీటి గంట మొగిద్దాం’అనే కథనాన్ని ‘సాక్షి’శనివారం ప్రచురించింది. దీనికి స్పందించిన పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటర్ బెల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు వాటర్ బెల్ మోగగానే నీళ్లు తాగారు. ఈ సందర్భంగా వాటర్ బెల్ కార్యక్రమాన్ని అమ లు చేస్తున్న నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం రామకృష్ణను ‘సాక్షి’ పలకరించగా.. సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల పిల్లలు అనేక రుగ్మతలకు దూరం అవుతారని పేర్కొన్నారు. -
దారులన్నీ దుర్గంధం
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025పడకేసిన పారిశుద్ధ్యంఅస్తవ్యస్థంగా సంగారెడ్డి మున్సిపాలిటీ ● ఎక్కడ చూసినా చెత్తకుప్పలు..మురుగు కాల్వలే ● రోడ్ల వెంబడి డ్రైనేజీ దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ● వెలగని వీధి దీపాలు...గుర్రపుడెక్కతో నిండిన చెరువులు ● నిరుపయోగంగా నిర్వహణకోసం తెచ్చిన వాహనాలు ● పౌరసేవల్లోనూ అంతే జాప్యం ● పాలనను గాలికొదిలేసినమున్సిపల్ అధికారులు పట్టణంలోని వార్డులో పేరుకుపోయిన చెత్తాచెదారంపాలక మండళ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చిన సంగారెడ్డి మున్సిపాలిటీ మొత్తంగా పాలనకే దూరమైంది. మౌలిక సదుపాయాల కల్పన వాటి నిర్వహణ వంటి అంశాలను విస్మరించి పాలనను గాలికొదిలేయడంతో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమివ్వడంతోపాటుగా చెత్తాచెదారంతో ప్రవహించని డ్రైనేజీలు రోడ్ల వెంట దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీనికితోడు పార్కుల నిర్వహణలోపం, పౌరసేవల్లో జాప్యం, రాత్రిళ్లు దోమలు స్వైరవిహారం, వెలగని వీధిదీపాలు వంటి సమస్యలు మున్సిపాలిటీని వేధిస్తున్నాయి. సంగారెడ్డిజోన్...●జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్థంగా మారింది. ప్రత్యేకపాలనలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో 38 వార్డులు ఉండగా ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో అపరిశుభ్రంగా మారిన పరిసరాలు దర్శనమిస్తున్నాయి. రాజంపేట, కలెక్టరేట్ ఎదుట, జిల్లా పరిషత్ కార్యాలయం, నాల్సాబ్ గడ్డ, గంజిమైదాన్, శాంతినగర్, కల్వకుంట రోడ్డు, 16వ వార్డు డీఎస్పీ ఆఫీసు వెనుకాల, వీరభద్రనగర్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి చెరువు కట్ట తదితర వార్డుల్లో రోజులు గడుస్తున్నా చెత్తకుప్పలను మాత్రం తొలగించడం లేదు. మురుగుకాల్వల్లో చెత్తాచెదారం పట్టణంలోని ఇళ్లతోపాటు వ్యాపార సంస్థల నుంచి వచ్చే వ్యర్థ జలాలు సాఫీగా ప్రవహించేందుకు మురుగు కాల్వలను నిర్మించారు. గల్లీలో ఉండే చిన్న కాలువలతో పాటు రహదారుల పక్కన ఉన్న పెద్ద కాలువల్లో చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ప్రవహించక దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. జిల్లా పరిషత్తు కార్యాలయం ముందు ఉన్న మురుగు కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి ఉండటంతో మురుగునీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. పాతబస్టాండ్ ఎదుట ఉన్న మురికి కాలువ దాని ఆనవాళ్లు కనిపించకుండా మట్టి దిబ్బలతో నిండిపోయింది. కనీసం 10 రోజులకొకసారి మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయాల్సి ఉన్నా నెలలు గడుస్తున్నా కార్మికసిబ్బంది వాటి జోలికే పోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దోమల స్వైరవిహారం ఇళ్ల మధ్యలో మురుగునీరు నిండిపోయి ఉండటంతో సాయంత్రం కాగానే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మిక సిబ్బంది దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫాగింగ్ చేసినప్పటికీ నామమాత్రంగానే చేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా చెత్త సేకరణ... డంపింగ్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణతోపాటు డంపింగ్ చేయటం పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఇంటి నుంచి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలి. కానీ అందుకు విరుద్ధంగా తడి పొడి చెత్తను ఒకే దగ్గర సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించకుండా రోడ్డు పక్కన వేస్తున్నారు. కొన్నిసార్లు రోడ్డు పక్కనే నిప్పు పెడుతున్నారు. దీంతో వాహనదారులకు రాకపోకలు సాగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. నిరుపయోగంగా వాహనాలు మున్సిపల్ అధికారులు మున్సిపల్ నిర్వహణ కోసం రూ.లక్షలు వెచ్చించి ఖరీదైన వాహనాలను తీసుకొచ్చారు. గత కొన్ని నెలలుగా వాటి నిర్వహణ చేపట్టకపోవటంతో అవి నేడు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రజాధనం వృథాగా పోతుంది. మార్కెట్ యార్డులో కనిపించని పరిశుభ్రత సంగారెడ్డి పట్టణంలోని మార్కెట్ యార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవటంతో పరిశుభ్రత కనిపించటం లేదు. మార్కెట్ యార్డు పూర్తిగా కుళ్లిన కూరగాయలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. కుండీల్లో కనిపించని మొక్కలు జాతీయ ప్రధాన రహదారితోపాటు పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపుల మొక్కలు నాటేందుకు కుండీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో మొక్కలు నాటినా వాటి నిర్వహణ చేపట్టకపోవటంతో మొక్కలు ఎండిపోయాయి. పలుచోట్ల కుండీలు పగిలిపోయాయి. ఇక కుండీల్లో నాటిన మొక్కలు నిర్వహణ లేక ఎండిపోగా...మరికొన్ని ఏపుగా పెరిగి దారిని కమ్ముకుంటున్నాయి. ఇక పాతబస్టాండ్ ఎదురుగా ఉన్న డివైడర్ పగుళ్లు ఏర్పడి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆహ్లాదాన్ని పంచని పార్కు పట్టణ ప్రజల సౌకర్యార్థం మానసిక ఉల్లాసం, వ్యాయామం చేసేందుకు పట్టణంలో రాజీవ్ పార్కును ఏర్పాటు చేశారు. అధికారులు సరైన విధంగా నిర్వహణ చేపట్టకపోవటంతో పాడైపోయిన పరికరాలు దర్శనమిస్తున్నాయి. ఆట వస్తువులన్నీ నిరుపయోగంగా మారాయి. పట్టణ ప్రాంత ప్రజలు పార్కులకు వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు. గుర్రపుడెక్కతో నిండిన చెరువు పట్టణంలోని మహబూబ్సాగర్ చెరువుతోపాటు నీటి కుంటలు చెత్తాచెదారంతో పాటు గుర్రపుడెక్కతో నిండిపోయింది. చెరువుతోపాటు ఇళ్ల మధ్యలో ఉన్న నీటి కుంటలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. వెలగని వీధి దీపాలు... మున్సిపాలిటీలోని పలు కాలనీలలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదు. దీంతో రాత్రివేళల్లో కాలినడకన వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని కాలనీల ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పౌరసేవల్లోనూ అధికారుల అలసత్వం మున్సిపల్ పరిధిలో కొత్తగా మురికి కాలువలు నిర్మించాలని కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్మించలేకపోతున్నారు. తాగునీటి సమస్య తలెత్తితే సమస్య పరిష్కరించేందుకు అధికారులు శ్రద్ధ వహించడం లేదని, కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే గాని సమస్య పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వారికి వారం రోజుల్లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ వివరాలు పట్టణంలోని వార్డులు: 38 జనాభా: 85,385 (2011 ప్రకారం) వార్డులలోని విద్యుత్ దీపాలు: 12,604 ప్రతి రోజు పని చేసే కార్మికులు: 224 చెత్త సేకరణకు వాహనాలు : 50 వార్డు అధికారులు: 38 పట్టణంలో ఉన్న బోర్లు : 241 మిషన్ భగీరథ ట్యాంకులు: 14 మినీ ట్యాంకులు: 6 రోజుకు అవసరమయ్యే నీరు : 13.5 ఎంఎల్డీ8లోన్యూస్రీల్ -
మాటలే తప్ప చేతలు శూన్యం
● సీఎం రేవంత్రెడ్డిపై మాజీమంత్రి హరీశ్రావు ధ్వజం ● ఇఫ్తార్ విందుకు హాజరు రామచంద్రాపురం(పటాన్చెరు): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు శూన్యమని మండిపడ్డారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తెల్లాపూర్ ప్రజల అవసరాల కోసం రూ.500 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో కోట్లాది రూపాయలతో ఫంక్షన్ హాల్ను నిర్మించామని అయితే ఇప్పటికీ అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా వెజ్ నాన్వెజ్ మార్కెట్ కోసం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను వెనక్కి తీసుకుందని విమర్శించారు. అంతకుముందు తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని నిర్మించిన ఫంక్షన్ హాల్, అసంపూర్తిగా ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, రసమయి బాలకిషన్, గువ్వల బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బీపీ మాత్రల్లేవు.. బయట తెచ్చుకోండి
● ప్రభుత్వాస్పత్రిలో రోగులకుసూచిస్తున్న ఫార్మాసిస్ట్ ● అతడి నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్ పటాన్చెరుటౌన్: ప్రభుత్వాస్పత్రిలో టెల్ మా–40 బీపీ మాత్రల్లేవని, బయట నుంచి తెచ్చుకోవాలని గత మూడురోజులుగా వస్తున్న రోగులకు ఆస్పత్రి ఫార్మాసిస్ట్ వెంకటరెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని శనివారం చాలామంది రోగులు ‘సాక్షి’దృష్టి తీసుకురాగా వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరింది. ప్రస్తుతం టెల్ మా–40 బీపీ మాత్రల కొరత ఉందని, బీపీకి సంబంధించిన ఇతర కాంబినేషన్ ట్యాబ్లెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోగులకు బీపీ మాత్రలు లేవని బయట తెచ్చుకోవాలని పంపుతున్న ఫార్మాసిస్ట్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ మాత్రల విషయంపై రోగులతో మాట్లాడగా...టెల్ మా–40 మాత్రలు ముందునుంచి వాడుతున్నామని, ఇతర కాంబినేషన్ (టెల్ మా–40తోపాటు అమోలడిఫిన్) మాత్రలు వేసుకుంటే ఇబ్బంది అవుతోందని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బీపీ మాత్రలు అందుబాటులోకి తీసుకురావాలని ఆస్పత్రికి వచ్చే రోగులు కోరుతున్నారు. -
ఏఐ వినియోగంతో బోధన సులువు
కలెక్టర్ వల్లూరు క్రాంతి పటాన్చెరు టౌన్: అభ్యాసన ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంతో బోధన సులువవుతుందని విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి ముత్తంగిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఏఐ ఆధారిత బోధన, అభ్యాసన ప్రక్రియను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ... బోధన, అభ్యాసన ప్రక్రియలో నూతన పద్ధతుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ముత్తంగి ప్రాథమిక పాఠశాలతోపాటు జిల్లాలో 33 పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనను ప్రారంభించామన్నారు. ఈ పథకం అమలు చేయనున్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం అందించామని వెల్లడించారు. తల్లిదండ్రులను పూర్తిస్థాయిలో పాఠశాల, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలను వినియోగించుకుని తమ పిల్లలు మరింత ఉన్నతస్థాయికి ఎదిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షల కేంద్రం తనిఖీ పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ క్రాంతి సందర్శించారు. అనంతరం కలెక్టర్ పాఠశాలల్లోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కిచెన్ షెడ్డును, డైనింగ్ హాల్ను, స్టోర్ రూమ్ను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి పటాన్చెరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో నిర్మిస్తోన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...స్వయం సహాయక సంఘాల ద్వారా శిక్షణ పొందిన మహిళా మేసీ్త్రలు ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
మౌలిక సదుపాయాలు కల్పించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన పోస్టల్ సేవలను అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతానికి పోస్టాఫీస్ కావాలని అడిగారని, తాను గెలిచిన వెంటనే అధికారులతో మాట్లాడి తెల్లాపూర్కు పోస్టాఫీస్ మంజూరు చేయించానని వివరించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పోస్టాఫీస్కు భవనం కేటాయించారని చెప్పారు. రేడియల్ రోడ్డు నంబర్ 7నుంచి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ పై నుంచి విద్యుత్నగర్ కాలనీ వరకు పెద్ద వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజు, తెల్లాపూర్ సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, బీజేపీ తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, తెల్లాపూర్ నైబర్హుడ్ అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ పాల్గొన్నారు.నూతన పోస్టాఫీస్ను ప్రారంభించిన ఎంపీ ఎం.రఘునందన్ రావు -
మీకేం కాదని..
మేమున్నామని...పుట్టినిల్లు తరహాలో యోగక్షేమాలు ● దేవుడిచ్చిన అమ్మ పాత్రలో మహిళా అధికారులు, ప్రముఖుల భార్యలు ● పండుగ, పబ్బాలు చిన్నారుల సమక్షంలో ● పిల్లలతో కాలక్షేపం చేస్తూ ధైర్యాన్ని నింపుతారు ● సిద్దిపేట బాలసదనంపై సాక్షి సండే స్పెషల్ పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న హరీశ్ రావు సతీమణి శ్రీనిత -
ఎనిమిది మంది వేటగాళ్ల అరెస్టు
మూడు నాటు తుపాకులు స్వాధీనం నర్సాపూర్: అడవి జంతువులను వేటాడేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఎఫ్ఆర్ఓ అరవింద్ కథనం ప్రకారం... అటవీ శాఖ నర్సాపూర్ రేంజ్ పరిధిలోని నత్నాయిపల్లి అడవి శివారులో వన్య ప్రాణులను వేటాడేందుకు తుపాకులతో కొంతమంది సంచరిస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వారి కోసం గాలించారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లికి చెందిన యాసిన్, నత్నాయిపల్లికి చెందిన శ్రీకాంత్, శంకరయ్య, శ్రీకాంత్, వీరస్వామి, పోచయ్య, విజయ్, భానుప్రసాద్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వారి వద్ద మూడు నాటు తుపాకులు, ఒక కత్తి, గన్పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఆర్ఓ అరవింద్ వెంట ఆయన వెంట సెక్షన్ ఆఫీసర్ సాయిరాం తదితరులు ఉన్నారు. 150 టన్నుల అక్రమ ఇసుక పట్టివేత బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లి శివారులో అక్రమంగా డంప్ చేసిన 150 టన్నుల ఇసుకను శనివారం సిద్దిపేట టాస్క్ఫోర్స్, బెజ్జంకి పోలీసులు పట్టుకొని సీజ్ చేసినట్లు సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెజ్జంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి రిమాండ్ పటాన్చెరు టౌన్: గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పటాన్చెరు ఎకై ్సజ్ పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఎకై ్సజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ కథనం ప్రకారం... మెదక్ డివిజన్ ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ముత్తంగిలోని ఓ ఇంటి పై దాడులు చేశారు. బిహార్కు చెందిన నితీశ్ కుమార్ దగ్గర నుంచి 84 గంజాయి చాక్లెట్ల (మొత్తం 465 గ్రాములు)ను స్వాధీనం చేసుకొని పటాన్చెరు ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎకై ్సజ్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితుడు బిహార్లో గంజాయి చాక్లెట్స్ కొని ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. -
● కలెక్టర్లు, డాక్టర్ల వంటి ప్రముఖుల తాకిడి..
సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పని చేసిన వెంకట్రామిరెడ్డి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి పూర్తి బాధ్యతలు స్వీకరించారు. వారిలో పెద్ద అమ్మాయి ఎంబీఏ వరకు చదివేలా సాయం అందించారు. అదేవిధంగా ఎమ్మెల్యే హరీశ్ రావు సతీమణి శ్రీనిత గంటల కొద్ది బాలసదనంలో ఉండి వారితో కలిసి భోజనం చేశారు. అదే విధంగా జిల్లా పోలీసు కమిషనర్గా పనిచేసిన జోయల్ డేవిస్ సతీమణి డాక్టర్ ప్రతిప పలుమార్లు సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా పోలీసు కమిషనర్గా పని చేసిన శ్వేత, గతంలో కలెక్టర్గా పనిచేసిన ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రస్తుత కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లుగా పని చేస్తున్న చంద్రశేఖర్, ముమామ్మిల్ ఖాన్, గరిమా అగ్రవాల్లు పలుమార్లు బాలసదనం సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రస్తుత పోలీసు కమిషనర్ అనురాధ సైతం పిల్లల బాగోగులు చూస్తూ వారికి అవసరమైన బుక్స్, బట్టలు అందిస్తున్నారు. వీరితోపాటు పట్టణానికి చెందిన ప్రముఖ మహిళా వైద్యులు, మహిళా ప్రజాప్రతినిధులు ఎందరో బాలసదనం సందర్శించి పిల్లలతో పండుగలు జరుపుకున్నారు. -
బావిలో యువకుడి మృతదేహం లభ్యం
న్యాల్కల్(జహీరాబాద్): బావిలో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందిన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు హద్నూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మండల పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన శివకుమార్ శుక్రవారం తోటి స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. బావిలో నీరు అధికంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెరువులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
మిరుదొడ్డి(దుబ్బాక): అనారోగ్య సమస్యలు భరించలేక చెరువులో దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, మిరుదొడ్డి పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మద్దెల నర్సవ్వ (80) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఒక్కగానొక్క కొడుకు వద్ద కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవడంతో తాళలేక పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో నర్సవ్వ కుటుంబ సభ్యులు బంధు మిత్రుల వద్ద, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం తెల్లవారు జామున మిరుదొడ్డిలోని పెద్ద చెరువులో నర్సవ్వ శవమై కనిపించింది. మృతురాలి కుమారుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బోయిని పర్శరాములు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పదస్థితిలో యువకుడు.. మెదక్ మున్సిపాలిటీ: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పట్టణంలోని బారాహీమాం వీధిలో నివాసం ఉండే అమిన్పూర్(మోచి) యాదగిరి కుమారుడు అరవింద్(24) ఆర్టీసీ డిపోలో రెగ్జిన్ వర్క్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అరవింద్ తన తల్లి శాంతమ్మకు అనారోగ్యం కారణంగా రూ.3లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కోసం నిత్యం బాధపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇప్పుడే వస్తానంటూ అరవింద్ ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం వెతకగా ఇంటి పక్కన ఉన్న ఓ చెట్టుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. అప్పుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి..
మునిపల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం అందోల్ మండల పరిధిలో చోటు చేసుకుంది. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం ప్రకారం... మండల పరిధిలోని చిన్న చల్మెడ గ్రామానికి చెందిన దుదేకుల అనిరోద్దీన్, తక్కడపల్లి గ్రామానికి చెందిన సద్దాం అహ్మద్ కలిసి సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో చేపలు పట్టడానికి విద్యుత్ యంత్రాలతో వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో దుదేకుల అనిరోద్ధిన్(30) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై వ్యక్తి మృతిసదాశివపేట రూరల్(సంగారెడ్డి): మద్యానికి బానిసై అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని సూరారం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం పక్రారం... మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన హాకీమ్ పోశెట్టి(52) భిక్షాటన చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యానికి గురి కావడంతో అతడి అన్న రాములు ఈనెల 8న ఆసుపత్రిలో వైద్యం చేయించి సదాశివపేట పట్టణంలోని దర్గా దగ్గర వదిలి వెళ్లాడు. సూరారం గ్రామ శివారులోని ఓ మామిడి తోట వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మృతుడి అన్న రాములు ఘటనా స్థలానికి వెళ్లి చూశాడు. అనారోగ్యం కారణంగా, ఆహారం లేక, వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి అన్న రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.కోనాయిపల్లిలో బంగారం, నగదు చోరీ కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నుంచి బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లిన ఘటన కుకునూరుపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కోనాయిపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ కుటుంబీకులతో కలిసి యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న కొడువటూర్ గుట్ట దేవాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి తులంన్నర బంగారు నగలు, రూ. 20వేలను ఎత్తుకెళ్లారు. దర్శనం ముగించుకొని ఇంటికి వచ్చాక నగలు అపహరణకు గురైన విషయాన్ని గమనించి జహంగీర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వర్గీకరణ బిల్లుకు స్వాగతం
మెదక్జోన్: అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఎస్సీ వర్గీకరణ బిల్లును స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ మాదిగ అన్నారు. శనివారం పట్టణంలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల పాటు అనేక ఉద్యమాలు చేశామన్నారు. గతంలో నక్సలైట్లు ఎమ్మార్పీస్ నేతలను పోలీస్ ఇన్ఫార్మర్లు అనే నెపంతో కాల్చి చంపిన ఘటనలు సైతం ఉన్నాయని అలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వర్గీకరణ పోరాటాన్ని సాగించామమని గుర్తు చేశారు. 2023లో హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్షలాది మంది మాదిగలతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై వర్గీకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సైతం సీఎం రేవంత్రెడ్డి వర్గీకరణ కోసం కృషి చేసిన తీరు అభినందనీయమన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య మాట్లాడుతూ ఈనెల 17న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతున్న క్రమంలో గ్రామ గ్రామాన మాదిగలు డప్పు చప్పుళ్లతో దండోరా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామచంద్రం, కృష్ణయ్య, స్వామీదాస్, సుమన్, ఏసు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ -
కట్టుకున్నోడే కడతేర్చాడు
సిద్దిపేట కమాన్: అనుమానాస్పదంగా కుళ్లిన స్థితిలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళ కేసును టెక్నాలజీ ఉపయోగించి సిద్దిపేట టూటౌన్ పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్తే నిందితుడని పోలీసులు తేల్చారు. సిద్దిపేట ఏసీపీ మధు, టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం, తల్వార్బంధ గ్రామానికి చెందిన బోలరాం హరిజన్ అలియాస్ సోను (20) అదే రాష్ట్రానికి చెందిన మైనర్ బాలిక(17)ను కొద్ది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా బిహార్ నుంచి సిద్దిపేటకు ఆరు నెలల క్రితం వచ్చి దక్కల కాలనీ మేర సంఘం భవనం సమీపంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బోలరాం హరిజన్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హరిజన్ మద్యానికి బానిసై ప్రతిరోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. గత నెల 14న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి తన భార్యతో గొడవపడ్డాడు. కోపంలో హరిజన్ తన భార్య తలను గోడకు బాది, గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఏమి చేయాలో తెలియక మృతదేహాన్ని పక్కనే ఉన్న మేర సంఘం భవనం నీటి సంపులో పడేసి నిందితుడు బిహార్కు పారిపోయాడు. సుమారు పదిహేను రోజుల తర్వాత ఈ నెల 1న మేర సంఘ భవనం సంపులో కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై సంఘం భవనం అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీ సాయంతో పోలీసులు నిందితుడిని గుర్తించి కేసును ఛేదించారు. నిందితుడు బలరాం హరిజన్ సిద్దిపేటలోని అద్దె గదిలో ఉన్న తన సామగ్రి తీసుకెళ్లడానికి బిహార్ నుంచి సిద్దిపేటకు శనివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న సీఐ ఉపేందర్, ఏఎస్ఐ యాసిన్మియా, క్రైం కానిస్టేబుళ్లు కనకరాజు, సుధాకర్రెడ్డి, యాదగిరి, ప్రశాంత్లతో కలిసి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో తన భార్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన క్రైం పార్టీ సిబ్బందిని ఏసీపీ అభినందించి, త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు. భార్య హత్య కేసులో భర్త అరెస్టు మృతురాలు బిహార్కు చెందిన మైనర్ అనుమానాస్పద స్థితిలో మృతదేహం గుర్తింపు కేసును ఛేదించిన టూటౌన్ పోలీసులు -
పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యతో గొడవపడి భర్త.. పటాన్చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్లో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అంబరాన్నంటిన హోలీ వేడుకలు
పాల్గొన్న కలెక్టర్, ఎస్పీసంగారెడ్డి జోన్: రంగుల పండగ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, కుటుంబ సభ్యులు, అధికారులతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. తన కార్యాలయం ఆవరణలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ సంజీవరావు అధికారులతో కలసి వేడుకలు జరుపుకొన్నారు.108 కిలోల గుండు ఎత్తుకుని ప్రదక్షిణలు నారాయణఖేడ్: ఖేడ్ మండలం తుర్కాపల్లిలో హోలీ పండుగ సందర్భంగా బండరాళ్ల గుండ్లు ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామానికి చెందిన యువకుడు సాతిని జ్ఞానేశ్వర్ 108 కిలోల బరువున్న బండరాయి గుండును అవలీలగా ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ అయిదు ప్రదక్షణలు చేసి ఔరా అనిపించాడు. గ్రామ పెద్దలు కరతాళధ్వనులతో అతడిని ఉత్సాహపరిచారు. అనంతరం రంగులు చల్లుకుంటూ హోలీ పండును నిర్వహించుకున్నారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక నారాయణఖేడ్: ఖేడ్ మండలం జుజాల్పూర్ శివారులోని ఈ–తక్షిల పాఠశాలకు చెందిన విద్యార్థులు సాయిస్ఫూర్తి, రాధప్రియ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్ఈఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్బాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈమేరకు పాఠశాల కరస్పాండెంట్ శరత్కుమార్, ప్రిన్సిపాల్ అవిక తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 16 వరకు వనపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి సంగారెడ్డిజోన్: పోలీసు అధికారులు తమ విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేసిన బందోబస్తును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్లను పరిశీలించి, ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రంకెన్ డ్రైవ్లు నిర్వహించాలన్నారు. వాహనదారులపై రంగులు వేయడం లాంటివి చేయకూడదని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కదలికలను గమనించాలని తెలియజేశారు. -
తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎక్కడ చూసినా ఇదే తంతు..వినియోగదారులు నిత్యం నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు తూకాల్లోనే కాదు. వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నాయి. ఇక్కడ లీటరంటే..950 ఎం.ఎల్..కిలో అంటే 900 గ్రాములే. నిబంధలను తుంగలో తొక్కి రకరకాల జిమ్మిక్కులతో వినియోగదారులను నిండా ముంచుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిత్యం తనిఖీలు చేస్తూ కఠినమైన కేసులు నమోదు చేసి...అనుమతులు రద్దు చేయాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో వదిలేయడం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పత్తి రైతుల నిలువు దోపిడీ.. పత్తి రైతులు తమ పత్తిని జిన్నింగ్ మిల్లుల్లో కాంటాలు వేస్తుంటారు. సీజను ప్రారంభానికి ముందు ఈ కాంటాలను అధికారులు తనిఖీలు చేయాలి. ఆకస్మిక తనిఖీలు కూడా జరపాలి. ఏటా ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా...ఈ కాంటాల జోలికి అధికారులు వెళ్లకపోవడంతో పత్తి రైతులు తూకాల మోసాలకు గురవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు మోసాలకు పాల్పడే మిల్లులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి.సదాశివపేట పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం మీటర్లో జిమ్మిక్కులు చేసింది. మీటర్ రీడింగ్ జీరో నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, రూ.2.50ల నుంచి ప్రారంభమయ్యేలా మార్పు చేసి వినియోగదారులను రోజుకు రూ.వేలల్లో దోపిడీకి గురి చేసింది. దర్జాగా ఈ దోపిడీ ఏళ్ల తరబడి సాగినా... తూనికల కొలతలు అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. వినియోగదారులు ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా కేవలం రూ.35 వేలు జరిమానా వేసి వదిలేశారు.ఇక్కడ లీటరంటే..950 ఎం.ఎల్..కిలో అంటే 900 గ్రాములే! మీటర్ల ట్యాంపరింగ్లు..ప్యాకింగ్ల్లో మోసాలు నిలువునా దోపిడీకి గురవుతున్న వినియోగదారులు ఆకస్మిక తనిఖీలకు మంగళం పాడిన అధికారులు ఆధారాలతో ఫిర్యాదులు చేసినా నామమాత్ర జరిమానాలతో సరి చిరు వ్యాపారులపైనే ప్రతాపం...బడా సంస్థల జోలికెళ్లని అధికారులు విమర్శలకు దారితీస్తున్న తూనికల కొలతల శాఖ పనితీరు80% కేసులు చిరు వ్యాపారులపైనే..తూనికల కొలతల అధికారులు ఎప్పటికప్పుడు వ్యాపార, వాణిజ్య సంస్థలను తనిఖీలు చేయాలి. కేవలం తూకాల్లో మోసాలే కాదు. ప్యాకింగ్లో ఉన్న సరుకుల బరువులను పరిశీలించాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము ఇన్చార్జి బాధ్యతల్లో బిజీగా ఉన్నామంటూ దాటవేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. సొంతంగా దాడులు నిర్వహించిన కేసులు నమోదు చేసిన ఘటనలు కూడా తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిలో 102 కేసులు నమోదు చేసినట్లు చెప్పుకొస్తున్న అధికారులు ఇందులో 80 శాతానికి పైగా కేసులు చిరువ్యాపారులపైనే నమోదు చేయడం గమనార్హం. రకరకాల జిమ్మిక్కులతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్న బడా వ్యాపార సంస్థల జోలికి వెళ్లకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వస్తే కేసులు ఫిర్యాదులు వస్తే వెళ్లి కేసులు నమోదు చేస్తున్నాం. ఏడాదిలో 102 కేసులు పెట్టాం. ఇందులో చిన్న చిన్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా తూనికలు, కొలతల్లో తేడాలు ఉన్నట్లు గమనిస్తే మాకు ఫిర్యాదు చేస్తే వెళ్లి తనిఖీలు చేస్తాం. నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తాం. – అనిల్కుమార్, జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్, సంగారెడ్డిసంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రముఖ రిటైల్ మాల్లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ ప్యాకెట్పై రూ.20 డిస్కౌంట్ పేరుతో స్టిక్కరింగ్ వేసి... బిల్లు మాత్రం పూర్తిస్థాయిలో వేసి వినియోగదారులను మభ్య పెట్టారు. ఇలా మాల్కు నిత్యం వచ్చే వేలాదిమంది వినియోగదారులను మోసం చేస్తోంది. ఫిర్యాదు చేస్తేనే తూనికల కొలతల అధికారులు గుట్టు చప్పుడు కాకుండా నామమాత్రంగా జరిమానాతో చేతులు దులుపుకున్నారు. -
సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం
పటాన్చెరుటౌన్/పటాన్చెరు: తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని శుక్రవారం కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ...తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఏళ్లుగా తనకు అలవాటని అందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ జన్మదినం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు -
వేగంగా ఖేడ్–బీదర్ హైవే పనులు
నారాయణఖేడ్: జాతీయ రహదారికి 15కిలోమీటర్ల దూరంగా మారుమూలగా ఉన్న నారాయణఖేడ్ పట్టణానికే జాతీయ రహదారి వచ్చి చేరింది. జాతీయ రహదారితోనే అభివృద్ధి సాధ్యమని ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రాంత వాసుల కల నెరవేరబోతుంది. వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్యం, రవాణా తదితర రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించనుంది. కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్– నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారిని కలుపుతూ నారాయణఖేడ్ పట్టణం మీదుగా 161బీగా జాతీయ రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ఎంపీగా ఉన్న సురేశ్షెట్కార్ నిజాంపేట్– నారాయణఖేడ్– బీదర్ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అప్పట్లో ఎన్హెచ్ 50గా నిర్ధారించారు. అకోలా–నాందేడ్ 161 జాతీయ రహదారిగా ఉండటంతో ఈ రహదారికి అనుసంధానంగా నిర్మాణం జరుగుతుండటంతో 161బీగా మార్చారు. వేగంగా పనులు జాతీయ రహదారి సర్వే, భూసేకరణ తదితర పనులకు మూడు నాలుగేళ్లు పట్టింది. కానీ,రహదారి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాక జోరుగా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.518కోట్లు విడుదల చేసింది. సంగారెడ్డి– నాందేడ్– అకోలా జాతీయ రహదారి అనుసంధానంగా నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. నిజాంపేట్ నుంచి బీదర్కు 60 కిలోమీటర్ల దూరం. రహదారి చాలాచోట్ల మూలమలుపులుగా ఉండటంతో దూరాభారం పెరిగింది. అయితే ఈ జాతీయ రహదారిలో మూలమలుపులను తగ్గిస్తూ రెండు లైన్లుగా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత దూరం 46కిలోమీటర్ల దూరమే అవుతుంది. ఖేడ్ నుంచి 40కిలోమీటర్ల దూరం ఉన్న రహదారి మూలమలుపు తగ్గించడం వల్ల ఖేడ్ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరమే అవుతుంది. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్, మనూరు, న్యాల్కల్, డప్పూర్ మీదుగా బీదర్ వరకు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం బీదర్కు ఖేడ్ నుంచి గతుకుల రోడ్డుపై ప్రయాణించేందుకు గంటన్నర సమయం పడుతుండగా జాతీయ రహదారి నిర్మాణం వల్ల అరగంటలోపు బీదర్కు వెళ్లిపోవచ్చు. రహదారి వెట్మిక్స్, జీఎస్బీ, బిట్మిన్ ప్రైమింగ్ పనులను సైతం పూర్తయ్యాయి. బీటి (తారు) నిర్మాణం పనులు జోరందుకోనున్నాయి. జాతీయ రహదారి నిర్మాణం 20శాతం పనులు పూర్తి చేశారు. ఈ ఏడాదిలోపు జాతీయ రహదారి రవాణాకు అందుబాటులోకి వస్తుంది. అభివృద్ధికి దోహదం.. ఖేడ్ పట్టణానికి సంగారెడ్డి 80 కిలోమీటర్లు, హైదరాబాద్ 150కిలోమీటర్ల దూరం. దగ్గరగా ఉన్న పట్టణం బీదర్. రహదారి పనులు పూర్తయితే వ్యాపార, వాణిజ్య, వైద్యం, విద్య, ఇతరత్రా పనులకు బీదర్కు వెళ్లేందుకు, అక్కడివారు ఇక్కడికి వచ్చేందుకు ఆస్కారం ఉంది. చాలా అవసరాల నిమిత్తం ఇప్పటికే జనాలు బీదర్కు వెళ్తుంటారు. రోడ్డు పూర్తయితే మరింత అనువుగా మారనుంది. నెరవేరనున్న ఏళ్లనాటి కల వ్యాపార, వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి! రవాణా సదుపాయం మెరుగుమరింత అభివృద్ధి చెందుతుంది ఖేడ్ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేందుకు తాను మొదటిసారి ఎంపీగా ఉండగా తన కోరికమేరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట్– ఖేడ్– బీదర్ జాతీయ రహదారిని మంజూరు చేసింది. భూసర్వే, పరిహారం తదితర అంశాలవల్ల ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరగా రహదారి అందుబాటులోకి వస్తే ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. – సురేశ్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్ నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం నిజాంపేట్– ఖేడ్– బీదర్ 161బీ జాతీయ రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వెట్మిక్స్, జీఎస్బీ, బిట్మిన్ ప్రైమింగ్ పనులు పూర్తయ్యాయి. బీటీ పనులు చురుగ్గా జరిగేలా చూస్తాం. పనులు పూర్తి నాణ్యతతో జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – రామకృష్ణ, జాతీయ రహదారుల డిప్యూటీ ఈఈ -
మోసపోతే.. న్యాయం ఇలా..
నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం సంగారెడ్డి జోన్: మోసపోయిన వారి నుంచి జరిగే అన్యాయాలపై వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక పోరాటం చేస్తోంది. మోసపోయిన వినియోగదారులకు తమ హక్కులను కల్పిస్తూ న్యాయం అందజేస్తోంది. వివిధ రకాల వస్తువుల కొనుగోలులో మోసపోయిన సమయంలో ఫిర్యాదు చేసేందుకు 1915 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. రూ.50లక్షల లోపు ఉంటే జిల్లా కమిషన్, రూ.2 కోట్ల లోపు ఉంటే రాష్ట్రస్థాయిలో, ఆపైన ఉంటే జాతీయస్థాయిలో ఫిర్యాదు చేసుకోవచ్చు. రూ.ఐదు లక్షల లోపు ఉంటే తెల్ల కాగితంపై కొనుగోలు చేసిన వస్తువు వివరాలతో పాటు మోసపోయిన వివరాలు రాసి, సంబంధిత రశీదును జతపరచి ఫిర్యాదు చేయవచ్చు. రూ.10లక్షల లోపు ఉంటే రూ.200, రూ. 20లక్షల లోపు ఉంటే రూ.400, రూ.50లక్షల లోపు ఉంటే రూ.1000, రూ. ఒక కోటి లోపు ఉంటే రూ. 2000, రూ. 2కోట్ల లోపు ఉంటే రూ. 2500, రూ.4కోట్ల లోపు ఉంటే రూ.3వేలు, రూ.6కోట్ల లోపు ఉంటే రూ.4వేలు, రూ.8కోట్ల లోపు ఉంటే రూ.5వేలు, రూ.10కోట్ల లోపు ఉంటే రూ.6వేలు, రూ.10కోట్ల పైన ఉంటే రూ.7,500 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా వినియోగదారులకు మరింతగా సేవలు అందించేందుకు ఆన్లైన్ విధానంలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం e-jagriti.gov.in పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రశీదు తప్పనిసరి వినియోగదారులు ఏ వస్తువు కొనుగోలు చేసిన ఆ వస్తువుకు సంబంధించి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. నాణ్యత వస్తువులను గుర్తించేందుకు ఎకై ్స్పరీ డేట్ తో పాటు ఇతర వివరాలను పరిశీలించాలి. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో నమోదైన వివిధ రకాల కేసులు 3నెలల నుంచి ఐదు నెలల లోపు సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు కమిషన్ సభ్యులు తెలిపారు. -
అదృశ్యమైన వ్యక్తి చెరువులో మృతదేహమై లభ్యం
సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి పట్టణంలోని మార్చ్నగర్ చె రువులో మృతదేహ మై లభ్యమయ్యాడు. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. సంగారెడ్డి పట్టణంలోని మార్చ్నగర్ కాలనీకి చెందిన షేక్ మహబూబ్(40) ట్రాక్టర్ డ్రెవర్గా పని చేస్తున్నాడు. 12న తన యజమాని కల్వకుంటకు చెందిన అక్బర్ ఇంట్లో ఫంక్షన్కు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం కల్వకుంట నుంచి చిమ్నాపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో గల ఎర్రకుంట చెరువు ఒడ్డున మహబూబ్కు చెందిన దుస్తులు, చెప్పులు కనిపించాయి. కుటుంబ సభ్యులు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహం కోసం గాలించినా దొరకలేదు. పక్కనే దీనికి అనుకొని ఉన్న మరో చెరువు మార్చ్నగర్ చెరువులో శుక్రవారం ఉదయం పోలీసులు మున్సిపాలిటీ సిబ్బందితో గాలిస్తుండగా మృతదేహం లభ్యమైంది. కుటుంబీకులకు సమాచారం ఇచ్చి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నీటి గంట మోగిద్దాం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): వేసవికాలం నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వాటర్ బెల్ మోగాల్సిన అవసరం ఉంది. ఎండాకాలం వచ్చిదంటే చాలు నాలుక తడారిపోతుంది. గుక్కెడు నీరు తాగితే బాగుండు అనిపిస్తుంది. ఒక్కోసారి సమయానికి తాగునీరు దొరకదు. పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే పిల్లలు చాలా మంది ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకోరు. ఒక వేళ తెచ్చుకున్నా.. తాగడానికి సమయం దొరక్కపోవడం, కంటిన్యూగా తరగతులు జరిగినప్పుడు మధ్యలో వెళ్లి తాగలేని పరిస్థితి ఉంటుంది. దీంతో డీ హైడ్రేషన్కు గురవుతారు. రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో వాటర్ బెల్ మోగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఐదేళ్లుగా మరిచారు జిల్లాలో 2019 నవంబరులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని అమలు చేశారు. కొవిడ్ తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ చాలా రోజులు, భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత వంటి నియమాలతో దృష్టి పెట్టలేదు. కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకొని అమలు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రతీ రోజు మూడు సార్లు.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో రోజూ మూడు సార్లు వాటర్ బెల్ మోగించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బెల్ కొట్టినప్పుడు ప్రతీ విద్యార్థి నీరు తాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించేవారు. మినరల్ వాటర్ లేని పాఠశాలల్లో ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించారు. నిర్ణీత రోజుల్లో ట్యాంకులు శుభ్రం చేయడం, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అనుమానం వస్తే నీటి పరీక్షలు నిర్వహించడం వంటివి గతంలో జరిపారు. ప్రస్తుతం పాఠశాలల్లో వాటర్ బెల్ మోగించడంపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవికాలం నేపథ్యంలో ఇప్పటికై నా పాఠశాలల్లో వాటర్ బెల్ మోగించడానికి అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. ఆరోగ్యంగా ఉండడానికి తగినంత నీరు అవసరం వేసవి నేపథ్యంలో విద్యార్థులకు తప్పనిసరి పాఠశాలల్లో అమలు చేయాలి వైద్యులు, విద్యావేత్తల సూచన జిల్లాలో విద్యనభ్యసిస్తున్న 1.30 లక్షల మంది విద్యార్థులు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లయితే పక్కాగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఖచ్చితంగా అమలు చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఈఓ సంగారెడ్డి నీరు తక్కువైతే అనారోగ్యం పిల్లలు ఆటలో పడి నీళ్లు తక్కువ తాగితే దుష్పలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాఠశాల సమయంలో 1.5 లీటర్ల మేర నీరు తీసుకుంటే మేలు. ఎక్కువ సార్లు మూత్రశాలకు వెళ్లాల్సి వస్తోందన్న కారణంతో తాగడం లేదు.సరైన మోతాదులో నీరు తాగకపోవడం వల్ల జ్వరంమూత్రపిండాల్లో రాళ్లు, మూత్రంలో ఇన్ఫెక్షన్, కాలేయం, చర్మ, జీర్ణ సంబంధిత సమస్యలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. సరిపడా మంచినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. – శ్రీనివాస్ రెడ్డి, పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
మల్లన్న ఆలయ హుండీలపై పర్యవేక్షణ కరువు
నగదు చోరీకి యత్నించిన వ్యక్తి కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలు, ఒడి బియ్యం హుండీలపై ఆలయ అధికారుల పర్యవేక్షణ కరువైంది. సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ ఆలయ అధికారుల డొల్లతనం మరోమారు బయటపడింది. స్వామి వారి అర్ధమండపం, ముఖమండపంలోని పలు హుండీలు సిబ్బంది కనుసన్నల్లో ఉండగా, గంగిరేణు చెట్టు ప్రాంగణంలో ఉన్న పలు హుండీలను ఎవరూ పట్టించుకోక పోవడం వివాదాస్పదమవుతుంది. సీసీ కెమెరాలు ఉన్నా పరిశీలించే వారు కరువయ్యారు. ఇటీవలె గుర్తుతెలియని వ్యక్తి దర్జాగా గంగిరేణు చెట్టు ప్రాంగణంలో వీవీఐపీ క్యూలైన్ సమీపంలో ఉన్న ఓ హుండీలో కనిపిస్తున్న నగదును ఇనుప చువ్వతో అపహరించేందుకు యత్నించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.ఈ ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మహిళను కాపాడిన పోలీసులు చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం జిన్నారం (పటాన్చెరు): చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన గుమ్మడిదల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన బక్క రేణుక (35) శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఎర్ర చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా బందోబస్తు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అద్వైత రెడ్డి గమనించి ఎస్ఐకి సమాచారం అందించారు. ఎస్ఐ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది కిషోర్ సాయి వర్ధన్కు చెప్పి వెళ్లి మహిళను కాపాడాలని సూచించారు. కానిస్టేబుళ్లు ఇద్దరూ చెరువులోకి వెళ్తున్న మహిళను ఆపి నచ్చజెప్పి ఇంటి వద్దకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కల్లు గీస్తుండగా చెట్టుపై నుంచి పడి గాయాలు నంగునూరు(సిద్దిపేట): తాడిచెట్టుపై నుంచి పడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం కొండంరాజ్పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నల్లూరి మోహన్గౌడ్ కల్లు గీసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కల్లుగీతపై ఆధారపడి జీవిస్తున్న మోహన్గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అక్రమంగా షెడ్డు నిర్మాణం జిన్నారం(పటాన్చెరు): మండలంలోని గడ్డపోతారం మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా షెడ్డు నిర్మాణం కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు వరుసగా వార్తా పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. కళ్లెదుటే షెడ్డు నిర్మాణం కొనసాగుతున్నా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేపడుతుంటే పట్టించుకోకపోవడం సరికాదంటున్నారు. ఇప్పటికై నా స్పందించి అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. -
టీ తాగడానికి వెళ్తుండగా బైక్ ఢీకొని వ్యక్తి మృతి
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిమ్మారెడ్డిపల్లి మధిర సార్లవాడకు చెందిన ఎంకు చంద్రయ్య(60) వ్యవసాయం చేస్తుంటాడు. శుక్రవారం సార్లవాడ నుంచి సమీపంలోని కొమురవెల్లి కమాన్ వద్ద ఉన్న హోటల్కి టీ తాగడానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు చంద్రయ్యను ఢీకొట్టి వెళ్లాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు బ్రిడ్జి పై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిది వడియారం గ్రామ శివారులోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. చేగుంటకు చెందిన పులబోయిన శేఖర్(26) గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. శుక్రవారం వడియారం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శేఖర్ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ పంచనామా నిర్వహించారు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి.. న్యాల్కల్(జహీరాబాద్): చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని హద్నూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. న్యాల్కల్కు చెందిన వడ్డె వెంకట్(32) ఈనెల 12న ఉదయం ఇంట్లో చెప్పి చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో 13న తల్లి పూలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఉదయం హద్నూర్ గ్రామ శివారులోని చెరువులో మృతదేహం తేలినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందినట్లు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ చెట్టును ఢీకొని యువకుడు తొగుట(దుబ్బాక): బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వెంకట్రావుపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బెజ్జరమైన ప్రశాంత్ (28) ఉదయం మిరుదొడ్డికి వెళ్లాడు. సాయంత్రం తిరిగొస్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రశాంత్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య వర్షిణి, కూతురు శన్విక, కుమారుడు శశాంక్ ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి గజ్వేల్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
పండుగ పూట విషాదం
స్నానానికి వెళ్లి బావిలో మునిగి యువకుడి మృతి న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని వడ్డి గ్రామంలో హోలీ పండుగ రోజున విషాదం అలుముకుంది. బావిలో స్నానానికి వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందాడు. హద్నూర్ ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. వడ్డి గ్రామానికి చెందిన శివకుమార్(19) శుక్రవారం మిత్రులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం ఐదుగురు మిత్రులతో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. శివకుమార్తోపాటు ఆనంద్కు ఈత రాకపోవడంతో స్నానానికి వెళ్లొద్దని తోటి మిత్రులు సూచించారు. అయినా వినకుండా తాడు సాయంతో బావిలోకి దిగడంతో నీట మునిగి మృతి చెందాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో శివకుమార్ మృతదేహం లభ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. వారి మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
అమరుల త్యాగాలు మరువలేనివి
హుస్నాబాద్రూరల్: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి పేదలను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేయడంలో అసువులుబాసిన అమరవీరుల త్యాగాలు మరువ లేనివని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్ గుట్టల్లో అనభేరి ప్రభాకర్రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి 77వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ పేదలను దొరలు, భూస్వాములు దోపిడీ చేస్తుంటే అనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. కరీంనగర్ ప్రాంతం నుంచి అనభేరి ప్రభాకర్, సింగిరెడ్డి భూపతిరెడ్డిల ఆధ్వర్యంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసుకొని పోరాటం చేశారని కొనియాడారు. మహ్మదాపూర్లో అనభేరి, సింగిరెడ్డిల సాయుధ దళాలు షెల్టర్ తీసుకున్న సమాచారంను రజాకార్లు తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ఊరిని చుట్టుముట్టి దాడి చేయడంతో 13 మంది అమరులయ్యారన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వలేదని, సీఎం రేవంత్రెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. అనంతరం అమరుల సమాధుల వద్ద వెంకటరెడ్డి నివాళులర్పించారు. అనంతరం చాడ సమక్షంలో గజ్వేల్ నియోజకవర్గం బీఎస్పీ నాయకుడు కానుగుల రమనాకర్ సీపీఐలో చేరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, గడిపె మల్లేశ్, వనేష్, కొమ్ముల భాస్కర్, సంజీవరెడ్డి, కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గల్(గజ్వేల్): తాను పుట్టిన ఊరు, రాజకీయ జన్మనిచ్చిన వర్గల్కు జీవితాంతం రుణపడి ఉంటానని, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం వర్గల్ ఎస్సీ వాడలో రూ. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు అధిగమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అద్భుత పాలన కొనసాగిస్తున్నారని, అడిగిన వెంటనే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయించారన్నారు. మరోవైపు వివిధ పనుల ద్వారా గజ్వేల్ అభివృద్ధికి రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. రైతులకు అండగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి పంటలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాన్న హమాలీ.. కూతురు లెక్చరర్
సదాశివపేటరూరల్ (సంగారెడ్డి): మండలంలోని ఇశ్రితాబాద్ గ్రామానికి చెందిన బాబుమియా సివిల్ సప్లై గోదాంలో హమాలీ పని చేస్తూ కూతుర్ని ఉన్నత చదువులు చదివించాడు. బాబుమియా కూతురు తస్లీమ్ ఫాతిమా చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ఆమె చదువు పట్ల చూపుతున్న ఆసక్తిని గమనించిన తండ్రి బాబుమియా హమాలీ పని చేస్తూ కూతురిని ఎంఎస్సీ జువాలజీ (ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్) వరకు చదివించాడు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో తన ప్రతిభను చాటి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును సాధించింది. దీంతో ఈ నెల 12న బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్(జువాలజీ)గా ఎంపికై హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకుంది. సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్గా ఫాతిమా గురువారం ఉద్యోగంలో చేరారు. తండ్రి పడ్డ కష్టానికి కూతురు తగిన ఫలితం సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. గ్రామస్తులు, మాజీ సర్పంచ్ రాములు, నాయకులు శ్రీనివాస్, బంధువులు,స్నేహితులు ఆమెను అభినందించారు. -
విద్యతోపాటు ప్రకృతిని కాపాడాలి
కౌడిపల్లి(నర్సాపూర్): భవితరాల భవిష్యత్ కోసం విద్యతోపాటు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డబ్ల్యూఈఓ (ప్రపంచ పర్యావరణ సంస్థ) వ్యవస్థాపక అధ్యక్షుడు భద్ర తెలిపారు. మండలంలోని దేవులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గదుల సమస్య ఉండటంతో హెచ్అండ్ఆర్ బ్లాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూఈఓ ఆధ్వర్యంలో రూ.1.50 లక్షలతో వరండాలో గోడలు నిర్మించి గ్రిల్స్ ఏర్పాటు చేసి గురువారం అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్ నినాదంతో ప్రకృతిని కాపాడాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. హెచ్అండ్ఆర్ టీమ్ లీడర్ హరీశ్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి కోసం తమవంతు కృషి చేశామని తెలిపారు. అనంతరం అధికారులు, సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, హెచ్ఎం క్రిష్ణమూర్తి, సంస్థ ప్రతినిధులు రామక్రిష్ణ, శిల్పిక, రిజ్వాన్, మిథిలేష్, అనంత్సారధి, యుగేందర్, ఉపాధ్యాయులు చైతన్య, వీనారాయ్, సందీప్, నరేందర్, నాయకులు సత్తయ్య, శివరాజ్, మహబూబ్, తదితరులు పాల్గొన్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
సీసీ కెమెరాల ఆధారంగా దొంగ గుర్తింపు పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేటకు చెందిన విగ్రాం శ్రీనివాస్గౌడ్ నివాసంలో రెండు రోజుల కిందట బంగారం, నగదు చోరీకి గురైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం దొంగను గుర్తించి పట్టుకొని సొత్తులు స్వాధీనం చేసుకున్నారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్గౌడ్ మంగళవారం ఇంటికి తాళం వేసి కర్ణాటకలోని గాన్గాపూర్కు వెళ్లాడు. బుధవారం ఇంటి తాళం పగులగొట్టి ఉండగా పని మనిషి గుర్తించింది. వెంటనే శ్రీనివాస్ గౌడ్ ఇంటి పక్కనే ఉంటున్న అతడి తమ్ముడికి సమాచారం ఇచ్చింది. ఇంట్లో బంగారం, నగదు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మండల కేంద్రానికి చెందిన ఎర్ర నాగరాజుగౌడ్ పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి శ్రీ వేంకటేశ్వర దేవాలయానికి సంబంధించి ఆరు తులాల బంగారం, వెండి, రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. దేవాలయాన్ని సొంతంగా శ్రీనివాస్గౌడ్ కట్టించగా ఆభరణాలు ఇంట్లో దాచి పెట్టారు. -
పిల్లల సంక్షేమానికి కృషి చేయాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్రసంగారెడ్డి టౌన్: పిల్లల సంక్షేమం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టులో జువైనల్ జస్టిస్ చట్టం, పోక్సో చట్టాలపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లలకు బాలల హక్కుల మీద ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. బాల్యవివాహాల చట్టాల మీద అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పంకజ్, జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డుమ్మా టీచర్లపై చర్యలు
జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లునారాయణఖేడ్: పాఠశాల సమయాల్లో విధుల్లో ఉండకుండా డుమ్మాకొట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ అంశంపై విచారణకు ఖేడ్ ఎంఈవోను ఆదేశించారు. కాగా టీచర్లపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు స్థానిక అధికారులు సహకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్ కేంద్రమైన నారాయణఖేడ్ పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉన్న జూకల్ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇద్దరు టీచర్లు బాబురావు, కవిత డుమ్మాకొట్టి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు ఆరుబయట ఆడుతూ కన్పించారు. టీచర్ల డుమ్మాపై ‘సాక్షి’ దినపత్రికలో ‘పాఠశాలలో టీచర్ల డుమ్మా’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. -
మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్కరూ మంచి నీరు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు ధరిచేరవని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి తెలిపారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి డయాలసిస్ సెంటర్లో జనరల్ మెడిసిన్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ మదన్తో కలిసి డాక్టర్ శాంతి గురువారం కేక్ కట్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. 15 పడకలతో డయాలసిస్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవాలన్నారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. అనారోగ్య సమ స్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్య క్రమంలో జనరల్ మెడిసిన్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ మదన్, ఆర్ఎంఓలు జ్యోతి, సదానందం, శ్రావణి, డయాలసిస్ సెంటర్ ఇన్చార్జి రాజు, సిబ్బంది నరేశ్, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి జీజీహెచ్లో వరల్డ్ కిడ్నీ డే వేడుకలు -
జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక
మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి యూనివర్సిటీ క్రీడా పోటీలకు మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన క్రీడాకారులు మద్దెల ప్రణయ్, అందె చేతన్, వేముల యువతేజ్ ఎంపికయ్యారు. 5,6 తేదీల్లో జరిగిన యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చడంతో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ జట్లకు వీరు ఎంపికయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నార్త్ యూనివర్సిటీలో 14 నుండి 17 వరకు జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారుల ఎంపికపై ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీ గొట్టం భైరయ్య, మంజీరా యూత్ సభ్యులు అందె రామచంద్రం, తోట వెంకట్రెడ్డి, చైన్నె భూపాల్గౌడ్, బోయిని శ్రీనుతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్ 1, 2లో సత్తాచాటిన సోదరులు బెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెలువరించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించి మండలంలోని గుగ్గిల్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతుల కుమారులు వెంకటేశ్, హరికృష్ణ సత్తా చాటారు. గ్రూప్ 1లో పెద్ద కుమారుడు వెంకటేశ్ 466వ మార్కులు సాధించాడు. ఇతడు ప్రస్తుతం కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో స్టేషన్లో ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమా రుడు హరికృష్ణ సివిల్స్ ప్రిపేరవుతూ గ్రూప్ 2లో 184వ ర్యాంకు సాధించాడు. ఇద్దరు సోదరులను గ్రామస్తులు అభినందించారు. ‘రాజు పవార్’ పాంచ్ పటాకా టేక్మాల్(మెదక్): మండలంలోని షాబాద్ తండాకు చెందిన రాజు పవార్ పోటీ పరీక్షల్లో సత్తా చాటి ఐదు ఉద్యోగాలు సాధించాడు. 2008 డీఎస్సీలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ సాధించి టేక్మాల్తో పాటు కల్హేర్, హవేళిఘనాపూర్, చాప్ట– కె, హనుమంతరావుపేట ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. గతేడాది జూనియర్ లెక్చరర్ కొలువు సాధించి కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్– 2లో 353 మార్కులను సాధించి రాజన్న సిరిసిల్ల జోన్ ఎస్టీ విభాగంలో రెండో ర్యాంకు సాధించాడు. అలాగే గ్రూప్–1లో 456 మార్కులు సాధించి సత్తా చాటాడు. ఈసందర్భంగా రాజు పవార్ను మండల ప్రజలు, తోటి మిత్రులు అభినందించారు. టోల్ బూత్ను ఢీకొట్టిన కారుచిన్నశంకరంపేట(మెదక్): కారు అదుపుతప్పి టోల్ బూత్ను ఢీకొట్టిన ఘటన నార్సింగి జాతీయ రహదారిపై వల్లభాపూర్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గురువారం సాయంత్రం నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న టోల్ బూత్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు దుబ్బాకటౌన్: రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బైండ్ల సత్తయ్య గురువారం వ్యవసాయ పొలానికి ట్రాక్టర్ పై వెళ్తుండగా అదుపు తప్పడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
భవానీ మాత ఆలయంలో చోరీ
జహీరాబాద్: జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలో గల పురాతన భవానీమాత ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం రాత్రి గు ర్తుతెలియని దుండగులు ఆలయం ప్రధాన ద్వారం తాళం పగుల గొట్టి భవానీమాత విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు, వెండి కాలిమెట్టలు, కిరీటాన్ని ఎత్తుకెళ్లినట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి జాతీయ రహదారిపై పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. హిందూ సంఘాల ధర్నా భవానీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. గురువారం రాత్రి మండలంలోని రంజోల్ గ్రామంలో ర్యాలీ అనంతరం 65వ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివలింగం ఆందోళన కారులతో మాట్లాడి 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించినట్లు హిందూ సంఘాల నాయకులు పేర్కొన్నారు. పట్టపగలే ఇంటో..అక్కన్నపేట(హుస్నాబాద్): పట్టపగలే ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాయికుంట రాజమొగలి ఇంట్లో గురువార మధ్యా హ్నం గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగులగొట్టి తులం బంగారం అపహరించారు. ఇంటి తలుపులు దగ్గర వేసి బయటకు వెళ్లిన భార్య తిరిగి ఇంటికొచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ విజయ్భాస్కర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పంటల మార్పిడిపై అవగాహన తప్పనిసరి
చేగుంట(తూప్రాన్): మహిళా రైతులు పంటల మార్పిడిపై అవగాహన పెంచుకోవాలని ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్త మహేందర్ కుమార్ అన్నారు. మండలంలోని వడియారంలోని ఓ ఫంక్షన్హాల్లో సెహగల్ ఫౌండేషన్ హైటెక్ సీడ్ల ఆధ్వర్యంలో మహిళా రైతుల మినీ కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ కుమార్ మాట్లాడుతూ.. మహిళా రైతులు పంటల మార్పిడి, నీటి ఎద్దడి తట్టుకునే పంటలను ఎంచుకోవడం, ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. సంవత్సర కాలంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు వ్యవసాయంపై అందిస్తున్న ప్రోత్సాహం గురించి సెహగల్ ఫౌండేషన్ లీడ్ వాణి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఏడీఎ రాజ్నారాయణ, ఏఓ హరిప్రసాద్, డాక్టర్ రవికుమార్, మొహినొద్దీన్, విభ, గాయత్రీ, బిందు, ఫీల్డ్ అసిస్టెంట్లు విజయ్, శ్రవణ్, మహిళా రైతులు పాల్గొన్నారు. -
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఏఓ రెహమన్కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ.. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ నేడు విద్యారంగంపై సవతితల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. గత సంవత్సరం బడ్జెట్లో కేవలం 7 శాతం నిధులే కేటాయించి, వాటిని కూడా విడుదల చేయలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించి, బకాయిలను అందించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీపతి, నగర ఉపాధ్యక్షుడు రాకేశ్, సర్ధార్ వల్లాబాయి పటేల్ జోన్ ఇన్చార్జి సాయిశంకర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతి -
చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేటజోన్: మహిళలకు అన్ని రకాల చట్టాలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి సూచించారు. గురువారం స్థానిక టీటీసీ భవన్లో స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మహిళలు, పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో సమానంగా పనిచేస్తున్నారన్నారు. న్యాయ సలహాలు, సూచనల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయమూర్తి స్వాతిరెడ్డి -
కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య
జగదేవ్పూర్(గజ్వేల్): ఉరేసుకొని బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని మునిగడపలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మీ దంపతులకు కుమారుడు, కూతురు ప్రవళిక(13) ఉన్నారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్న ప్రవళిక రెండ్రోజుల కిందట బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లి గురువారం ఇంటికొచ్చింది. తల్లి బట్టలు ఉతుకుతుండగా కడుపులో నొప్పి వస్తుందని చెప్పి ఇంట్లోకి వెళ్లింది. బయట నుంచి తల్లి నాగలక్ష్మీ పిలిచినా రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. కూతురు మృతితో నాగలక్ష్మీ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పురుగు మందు తాగి వివాహిత కోహెడరూరల్(హుస్నాబాద్): పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని తీగలగుట్టపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అభిలాష్ కథనం మేరకు.. వేల్పుల విమల (40) కొద్ది రోజులుగా గర్భాశయ సమస్యతో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తరుచూ కడుపునొప్పి వస్తుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతుంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి భర్త కొమురయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాగా చదవాలి.. ఉన్నతస్థాయికి ఎదగాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్సిద్దిపేటరూరల్: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యార్థులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని రాఘవాపూర్ కస్తూర్బా గురకుల పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. పాఠశాల అవరణ అంతటా తిరుగుతూ వంటగది, స్టోర్రూం, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, టెన్త్ ఉత్తీర్ణత పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీసీఈఓ రమేశ్, ఎంపీడీఓ మురళీధర్శర్మ, మెడికల్ ఆఫీసర్ బాబు, ఎంఈఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.18న జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు తూప్రాన్: జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు ఈనెల 18న పట్టణంలోని దేవి గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి సోమయాజుల రవీంద్రశర్మ, సహాయ ఎన్నికల అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025– 28 కాలపరిమితికి గాను ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. సంఘంలో సభ్యత్వం ఉన్నవారు ఎవరైన పోటీ చేయవచ్చు అని సూచించారు. కూడవెల్లి వాగులోకి నీరు విడుదల గజ్వేల్రూరల్: మల్లన్నసాగర్ కాలువ నుంచి కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. మండల పరిధిలోని కొడకండ్ల వద్ద గురువారం కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్ కాలువ నుంచి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను వదిలారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ వైస్చైర్మన్ సర్ధార్ఖాన్, నాయకులు గుంటుకు శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి ఎదుట ముగ్గు వేస్తుండగా..
వృద్ధురాలి మెడలోంచి గొలుసు చోరీ తూప్రాన్: వృద్ధురాలి మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటన పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ కామాన్ వద్ద గురువారం చోటు చేసుకుంది. సీఐ రంగాకృష్ణ కథనం మేరకు.. ఎల్లమ్మ కమాన్ వద్ద నివాసం ఉంటున్న రంగమ్మ అనే వృద్ధురాలు ఇంటి ఎదుట ముగ్గు వేస్తుంది. ఓ అపరిచిత యువకుడు వృద్ధురాలితో కిరాణం దుకాణం ఎక్కడ ఉందనిని అడిగాడు. అండ్రస్ చెప్పేలోపు ఆమె మెడలోంచి ఆరు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంబడించారు. దొంగ వెంట తెచ్చుకున్న బైక్ను వదిలేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ రంగాకృష్ణ బాధితురాలిని విచారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
మెదక్ కలెక్టరేట్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఐడీఓసీని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా శానిటేషన్ సిబ్బందిని, మహిళా పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, బహుమతులు అందజేశారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. గెలుపొందిన వారికి కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, డీడబ్ల్యూ హైమావతి, అదనపు డీఆర్డీఓ సరస్వతీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మీ, ఎస్సీ సంక్షేమ అధికారిని శశికళ, గిరిజన సంక్షేమ అధికారిని నీలిమ , మెప్మా పీడీ ఇందిరా, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, సీడీపీఓలు స్వరూప, హేమ భార్గవి, వెంకటరమణ, పద్మలత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకమాన్: మహిళల సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో సీపీ బుధవారం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు చదువు చాలా ముఖ్యమన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలన్నారు. జిల్లాలో మహిళలు, పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పోలీస్ సిబ్బందికి నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారిని సీపీ అభినందించారు. అనంతరం మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, సీఐలు విద్యాసాగర్, విష్ణు ప్రసాద్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దుర్గ, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం సిద్దిపేట సీపీ అనురాధ పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో మహిళా దినోత్సవం -
భార్యా బిడ్డలకు దూరమై.. జీవితమే భారమై
బంగారం శుద్ధి చేసే విషం తాగి స్వర్ణకారుడు ఆత్మహత్య పాపన్నపేట(మెదక్): మిల మిల మెరిసే బంగారు ఆభరణాలు తయారు చేసే అతడి కుటుంబ జీవితంలో చీకటి కోణాలు దాగి ఉన్నాయి. తాత్కాలిక ఆవేశాలతో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కొంప ముంచింది. రోజు వారి వేధింపులు భరించలేక ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. మీరు లేని జీవితం నాకొద్దంటూ ఆ స్వర్ణకారుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అవుసుల రాములు మేడ్చల్లో కుల వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య సరళ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ విషయంలో భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. సరళ కొద్ధి రోజుల కిందట పిల్లలను తీసుకొని పుట్టినిల్లు ఎల్లారెడ్డికి వెళ్లి పోయింది. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన రాములు స్వగ్రామమైన కొత్తపల్లికి వచ్చి బంగారం శుద్ధి చేసే విషం తాగాడు. బుధవారం గ్రామ శివారులోని మెయిన్ రోడ్డు పక్కన శవమై కనిపించాడు. మృతుడి తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలోని బజాజ్ షోరూం ఎదురుగా పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ పాండు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి నిర్వహించగా గోపాల్, శ్రీశైలం, నాగరాజు, మల్లేశం, వెంకటేశం పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఐఐటీహెచ్ సత్తా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే క్యూఎస్ ర్యాంకింగ్స్లో సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ సత్తా చాటింది. బై సబ్జెక్ట్ 2025 లో ఐఐటీ హైదరాబాద్ ఆరు విభాగాలలో గ్లోబల్ గుర్తింపు సాధించింది. విస్తృతమైన విద్యా విభాగంలో, మొదటిసారిగా 501–510 శ్రేణిలో ర్యాంక్ పొందింది. మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రికల్ – ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మెకానికల్, ఏరోనాటికల్ – మానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ – ఆస్ట్రోనమీ, కంప్యూటర్ సైన్స్ – ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి వాటిల్లో ర్యాంక్ లు వచ్చాయని ఐఐటీ వర్గాలు తెలిపాయి. 2008లో స్థాపించబడిన రెండవ తరం ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ ఒకటి. పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, స్టార్టప్లలో ఈ ఉన్నత విద్యా సంస్థ దేశంలోనే ముందు వరుసలో ఉంటుంది. జాతీయస్థాయిలో ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ –2024 ర్యాంకింగ్లో ఐఐటీ హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. అలాగే ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో 8వ స్థానంలో ఉంది. సుమారు 5,400 మంది యూజీ, పీజీ, పీహెచ్డీ స్కాలర్లు ఇందులో చదువుకుంటున్నారు. గతేడాది సుమారు 210 పేటెంట్లు సాధించిన ఈ విద్యా సంస్థలో సుమారు 260 స్టార్టప్లు ఆవిర్భవించాయి. తాజాగా ప్రపంచస్థాయి ర్యాకింగ్లోనూ ఈ ఉన్నత విద్యాసంస్థ తన సత్తాను చాటింది. -
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు వివాహపత్రిక అందజేత
పటాన్చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన సోదరుడి కుమారుడు సంతోష్రెడ్డి వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మహిపాల్రెడ్డి వెంట సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, సందీప్రెడ్డి పాల్గొన్నారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంపై ఉచిత శిక్షణ ● 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ● టీజీబీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ దయాసాగర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంపై నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టీజీబీసీ స్టడీ సర్కిల్ సిద్దిపేట డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ బుధవారం తెలిపారు. ఈ శిక్షణ హైద్రాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తయి, 26 ఏళ్లు లోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు 15 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 12 నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీజీబీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లేఖా రచన పోటీల్లో ప్రతిభ జాతీయస్థాయిలో ఉపాధ్యాయుడికి బహుమతి తూప్రాన్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన ఉత్తరాల రచన పోటీల్లో వజ్జ రాజేశ్వర్కు జాతీయ స్థాయి (తెలంగాణ సర్కిల్) తృతీయ బహుమతి దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తపాలా శాఖ అధికారులు బుధవారం తెలిపారన్నారు. ‘డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత’ అనే అంశంపై తపాలా శాఖ లేఖా రచన పోటీ నిర్వహించినట్లు తెలిపారు. బహుమతి కింది రూ.5,000 నగదుతోపాటు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ధ్రువపత్రం అందజేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వర్ పట్టణంలోని గీతా స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పీ.రామాంజనేయులు, చైర్ పర్సన్ ఉష, ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. వ్యక్తి అదృశ్యం జిన్నారం (పటాన్చెరు): మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం మేరకు.. మాదారం గ్రామంలో నివాసముండే దూదేకుల మొగులం సాబ్ (69) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. 9న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొడకంచి వైపుగా వెళ్లినట్లు స్థానికులు కుటుంబీకులకు తెలిపారు. కొడకంచి పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మొగులం కుమారుడు దావుద్ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి సంగారెడ్డి రూరల్: బెస్ట్ అవైల్డ్ ఏబుల్ స్కూల్స్లో పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి, పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారి పరమేష్, డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన బెస్ట్ అవైల్డ్ ఏబుల్ స్కూల్స్లకు ప్రభుత్వం నుంచి గత కొన్ని నెలలుగా రావాల్సిన పెండింగ్ బిల్లుల రాకపోవటంతో సంబంధించిన స్కూల్ల యాజమాన్యలు, విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు, దుస్తులు, మెనూ ప్రకారం, ఆహారం అందిచడం లేదని దీని వల్ల విద్యార్థులకు మెరుగైన సౌకర్యలు అందటం లేదని విద్యార్థుల తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం బెస్ట్ అవైల్డ్ ఏబుల్ స్కూల్స్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు రాజు, ఫోరమ్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్కుమార్, సహకార్యదర్శి పాండు రంగం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విదేశాలకు ఎగుమతితో మంచి లాభాలు
కౌడిపల్లి(నర్సాపూర్): మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఏపీఈడీఏ (అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు సూచించారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఏపీఈడీఏ ఆధ్వర్యంలో మామిడి సాగు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన మామిడి పంటను ఉత్పత్తి చేస్తే విదేశాలకు ఎగుమతి చేయొచ్చన్నారు. దీంతో అధిక లాభాలు వస్తాయన్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ లైసెన్స్ అవసరం ఉంటుందన్నారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి పంట పిందె దశలో ఉన్నాయని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పూత పిందె రాలితే శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. మామిడి తోటను ప్రతి రోజూ గమనించి తెగులు, చీడపీడలు సోకకుండా చర్యలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, నర్సాపూర్ డివిజన్ హర్టికల్చర్ అధికారి సంతోష్, ఆయిల్ఫామ్ మేనేజర్ క్రిష్ణ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు కేవీకేలో మామిడి రైతులకు అవగాహన సదస్సు -
అగ్నికి ఆహుతి.. నష్టాన్ని మిగిల్చి
మక్క చేను దగ్ధం మిరుదొడ్డి(దుబ్బాక): ప్రమాదవశాత్తు మక్క చేను దగ్ధమైన ఘటన మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత రైతు మంతూరి కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కరెంటు తీగలు ఒకదానికొకటి రాపిడై నిప్పు రవ్వలు ఎగసి పడటంతో మక్క చేను కాలి బూడిదైపోయింది. ఇందులో మక్క పంటతోపాటు, ఎకరంలో వేసిన డ్రిప్ పైపులు, గేట్ వాళ్లు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు తనకు నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరాడు. చిన్నకోడూరులో మామిడి తోట చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మామిడి తోట దగ్ధమైన ఘటన మండల పరిధిలోని రామంచ శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎడ్ల బాల్రెడ్డికి 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ తోటను సిద్దిపేటకు చెందిన రామోజీ లీజ్కు తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలార్పినప్పటికీ తోట పూర్తిగా దగ్ధమైంది. తోటలో ఉన్న డ్రిప్ పైపులు కాలిపోయాయి. సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. -
ఛాయాచిత్రకళలో వాస్తవాన్వేషణ
ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ జాన్ పటాన్చెరు: ‘ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం’అనేది నానుడి. దానిని మరింత విస్తృతపరుస్తూ, ఛాయా చిత్రకళలో ‘నిజాన్ని వెతుక్కుంటూ..’అనే శీర్షికన ఐఐటీ హైదరాబాద్కు చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ఛాయా చిత్రకళపై లోతైన అవగాహనను ఏర్పరిచేలా సాగిన ఈ కార్యక్రమంలో ఫొటోగ్రఫీ చారిత్రక పరిణామం వంటి అంశాలను వివరించారు. కుండల తయారీపై అవగాహన... గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్సైన్సెస్ (జీఎస్హెచ్ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం కుండల తయారీపై ఒక రోజు వర్క్ షాప్ను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారికి, మట్టితో పనిచేయ డం వల్ల కలిగే సృజనాత్మక, చికిత్స ప్రయోజనాలను తెలియజేశారు. కుండలు మాన సిక దృష్టి, ఏకాగ్రతను ఎలా పెంచుతాయో, ప్రశాంతతను, సద్భుద్ధిని ఎలా పెంపొందిస్తాయో ఈ వర్క్షాప్లో వివరించారు. -
కూలీలకు ఉపాధి కల్పించాలి
కంగ్టి/కల్హేర్ (నారాయణఖేడ్): కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పించాలని, ఆ పనులకు కూలీలు గరిష్ట వేతనం పొందేటట్లు అధికారులు చొరవ చూపాలని జిల్లా అదనపు డీఆర్డీవో బాలరాజు సూచించారు. కంగ్టిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఉపాధిపనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. చాప్టా(కే), కంగ్టి గ్రామాల శివారులో కూలీలకు పనులపై అవగాహన కల్పించారు. ఉపాధి హాజరు పరిశీలించేందుకు మస్టర్ రోల్ ప్రకారం కూలీలకు హాజరు తీసుకున్నారు. చాప్టా(కే)లో 80మంది, కంగ్టిలో 220 మంది కూలీలు పనులు చేశారు. అదేవిధంగా కల్హేర్లో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామి సిబ్బందితో బాలరాజు సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పనుల గురించి చర్చించారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ...అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి నాగేశ్వర్రావు, ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్, ఎంపీటీఓ సత్తయ్య, ఏపీఓ నర్సింలు, టీఏలు ఉపాధి సిబ్బంది, కూలీలు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.అదనపు డీఆర్డీవో బాలరాజు -
ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం
అధికారులకు కలెక్టర్ క్రాంతి ఆదేశంకంది(సంగారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారు లను ఆదేశించారు. మండల పరిధిలోని చేర్యాలలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చేర్యాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే నిర్మాణపు పనుల్లో నాణ్యత, నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రతీ ఇల్లు 400ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలన్నారు. గ్రామంలో 65ఇళ్లు మంజూరు కాగా 12ఇళ్లు బేస్మెంట్స్థాయిలో ఉన్నాయని హౌసింగ్ పీడీ చలపతిరావు తెలిపారు. అనంతరం కందిలో నిర్మిస్తోన్న ఇందిరమ్మ మోడల్ హౌస్ను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ సరఫరా, మంచి నీరు,మురుగు కాలువల ఏర్పాటు వంటి మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ మాధవరెడ్డి, ఎంపీవో మహేందర్రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు తోడ్పాటు హర్షణీయంసంగారెడ్డి జోన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావడం అభినందనీయమని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో కెరియర్ టెక్నాలజీ సంస్థ సిబ్బంది పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక వసతులకల్పన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ క్రాంతి హాజరయ్యారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్, తాగునీటి ట్యాంకును, కుళాయిలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రైవేట్ సంస్థల యాజమాన్యం సిబ్బంది కృషి చేయడం హర్షించదగ్గ పరిణామమన్నారు. రూ.50 లక్షలతో తరగతి గదుల ఆధునీకరణ, క్రీడా పరికరాలు, సైన్స్ మెటీరియల్ను, మౌలిక సదుపాయాలు, కెరియర్ అవగాహన చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కెరియర్ టెక్నాలజీ సంస్థ నిర్మాణ అధినేత నందా లక్కిరాజు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాఠశాలలో టీచర్ల డుమ్మా
నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఇష్టానుసారంగా విధులకు ఎగనామం పెడుతుండటంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఏదో ఓ చోట ప్రభుత్వ పాఠశాలలపై ఆరోపణలు వస్తున్నా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. నారాయణఖేడ్ పట్టణానికి కిలోమీటరు దూరంలో..ఎంపీడీవో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న జూకల్ తండా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు బాబురావు, కవిత బుధవారం పైఅధికారులకు చెప్పా పెట్టకుండా బడి నుంచి వెళ్లిపోయారు. ఈ పాఠశాలలో 30మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులూ పాఠశాలలో లేరు. దీంతో విద్యార్థులు ఆరుబయట, రోడ్డు వెంట ఆడుతూ కన్పించారు. తమకు తలనొప్పి వస్తోందని, తనను పాఠశాలను చూస్తుండమని పక్కనే ఉన్న అంగన్వాడీ టీచర్ సాంకీబాయికి చెప్పి టీచర్లు ఇద్దరూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉపాధ్యాయులూ ఒకేసారి విధులకు డుమ్మా కొట్టి వెళ్లిపోవడంతో పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డీఈవో వెంకటేశ్వర్లు వద్ద టీచర్ల డుమ్మా విషయాన్ని ప్రస్తావించగా ఎంఈవోను పంపించి విచారణ చేయిస్తానని సమాధానం ఇచ్చారు. తరగతి గదులు వదిలి ఆరుబయటే ఆడుకున్న విద్యార్థులు రోడ్డు పక్క పాఠశాల కావడంతో స్థానికుల ఆందోళన -
శారీరక దారుఢ్యం కీలకం
జోగిపేట(అందోల్): పోలీసు శాఖలో శారీరక దారుఢ్యం చాలా కీలకమని ప్రతీరోజు వ్యాయామం చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జోగిపేటలోని పోలీస్స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల పరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. సైబర్ నేరాలు, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా పోలీసు స్టేషన్, సర్కిల్ కార్యాలయ ఆవరణను పరిశీలించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాల తనిఖీ, నాకాబందీ, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి అనుమానిత వ్యక్తులను, వాహనాలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండాలని, కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వహించాలన్నారు. జోగిపేట పోలీస్స్టేషన్ పరిశీలనలో సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, జోగిపేట స్ఐ పాండు, సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎస్పీ సంగారెడ్డి జోన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ ఆంథోని పాఠశాల పరీక్ష కేంద్రాలను బుధవారం ఎస్పీ పరితోష్ పంకజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఈ నెల 6 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద (144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు గుంపులుగా సంచరించేందుకు వీలులేదన్నారు. 100 మీటర్ల దూరం వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జోగిపేట పోలీస్స్టేషన్ ఆకస్మిక తనిఖీ -
నిమ్జ్ గ్రామసభలో స్వల్ప ఉద్రిక్తత
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని మామిడ్గి గ్రామంలో నిర్వహించిన (నిమ్జ్) గ్రామ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్జ్ భూసేకరణకు సంబంధించి బుధవారం ఉదయం గ్రామ సమీపంలో గల రైతు వేదికలో పోలీస్ బందోబస్తు మధ్య గ్రామసభ నిర్వహించారు. సభకు నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజు, న్యాల్కల్ తహసీల్దార్ భూపాల్ హాజరయ్యారు. భూసేకరణకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్ రాజు మాట్లాడుతూ...నిమ్జ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు కలుగజేసుకుని మావి సారవంతమైన మూడు పంటలు పండే భూములని, ప్రభుత్వం ఇచ్చే పరి హారం ఎంతమాత్రం సరిపోదని, మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఒకరిద్దరు రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిమధ్య మాటా మాటా పెరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ నుంచి బయటకు వచ్చిన కొందరు రైతులు నిమ్జ్కు భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వర్గాలకు సర్దిచెప్పారు. భూమికి భూమి లేదా తగిన పరిహారం ఇవ్వాలని కోరిన రైతులు మామిడ్గి గ్రామంలో ఘటన నచ్చజెప్పిన పోలీసులు -
వివాదాస్పద భూమిని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గుంజోటి గ్రామంలో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ భూములను బుధవారం ట్రైనీ కలెక్టర్ మనోజ్, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి పరిశీలించారు. 112 సర్వే నంబర్లో సుమారు 59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో గ్రామానికి చెందిన కొందరు గతంలో పట్టాలు పొందారు. ఐతే పట్టాలు లేకున్నా తాతల నుంచి వచ్చిన భూమని సాగు చేసుకుంటున్నామని కొందరు, ప్రభుత్వం తమకు భూమి ఇచ్చిందని ఇది తమకే చెందుతుందని మరికొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వివాదస్పదంగా మారిన భూములను బుధవారం ట్రైనీ కలెక్టర్ మనోజ్, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి పరిశీలించి వివరాలను అక్కడి రైతులనుంచి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ భూపాల్ తదితరులు ఉన్నారు. వీఆర్ఏల ముందస్తు అరెస్టునారాయణఖేడ్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనసభను ముట్టడించేందుకు వీఆర్ఏలు యత్నిస్తున్నారనే సమాచారంతో బుధవారం ఉదయం నారాయణఖేడ్లో పోలీసులు ముందస్తుగా పలువురు వీఆర్ఏలను అరెస్టు చేశారు. వీఆర్ఏల సంఘం నాయకులు శంకర్, యాదయ్య, అల్లంరాజు, తుకారం, చోటుమియాలను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ... తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, అరెస్టులతో తమ ఉద్యమాలను ఆపలేరన్నారు. పోలీసుల అదుపులో మాజీ సర్పంచ్లు జహీరాబాద్ టౌన్: పెండింగ్ బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్లతో కలసి వెళ్తున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ కూడా జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి చేశామని, బకాయి బిల్లులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలుసంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలలో భాగంగా బుధవారం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థులకు బోటనీ, ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్–2, సీఈసీ విద్యార్థులకు సివిక్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 16,727మంది విద్యార్థులకు గానూ 16,375 మంది విద్యార్థులు హాజరు కాగా 352మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విభాగంలో 15,188మందికి గానూ 14,925మంది విద్యార్థులు హాజరు కాగా 263మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,539 మంది విద్యార్థులకు 1,450మంది హాజరు కాగా 89మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విగ్రహాలకు ముసుగు తొలగింపుసంగారెడ్డి క్రైమ్: గ్రాడ్యుయేట్ ఎమ్మెస్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణంలో ‘విగ్రహాలకు ధరించిన ముసుగు తొలగించరా’అంటూ ఈనెల 11న ప్రచురితమైన ‘సాక్షి’కథ నానికి స్పందించిన పట్టణ మున్సిపల్ అధికారులు స్పందించారు. విగ్రహాలకు వేసిన ముసుగును బుధవారం తొలగించారు. -
అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామం మాది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మా ప్రాంతంలో అవగాహన అంతంతే. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ (Telangana) ఉద్యమంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలపై కొంత అవగాహన వచ్చింది.. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) సాధించొచ్చనే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆరు ఉద్యోగాలు సాధించాను. పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించొచ్చు’ అని అంటున్నారు ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో మూడో ర్యాంక్ (Third Rank) సాధించిన బీర్దార్ మనోహర్రావు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పండరినాథ్ కీర్తనకారుడు. పండరిపూర్ విఠలేశ్వరుని కీర్తనలు, ప్రవచనాలు బోధిస్తారు. మా ఉజ్జంపహాడ్ గ్రామం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉటుంది. నా భార్య మనీష గృహిణి. కూతురు మనస్విని 3వ తరగతి, కొడుకు మహేశ్వర్ ఒకటో తరగతి చదువుతున్నారు. కుటుంబమంతా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. నేను నిత్యం హనుమాన్చాలీసా చదువుతాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కుల్చారం మండలం అంసాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేశాను. ఒక దాని తర్వాత మరోటి ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ కొలువులు ఆరు వచ్చాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించి పీజీటీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు (State First Rank) వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లో రెండో ర్యాంకు, 2016 గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో చేరా. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో ఆ ఉద్యోగం మానేశా. తిరిగి స్కూల్ అసిస్టెంట్గా విధుల్లో చేరా. జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, తాజా గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు వచ్చింది. బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్గా ఉద్యోగంలో చేరాను.డిప్యూటీ కలెక్టర్ కావాలని ఉంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో అత్యున్నతమైనది గ్రూప్–1. డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించడమే నా ముందున్న లక్ష్యం. గ్రూప్–1 పరీక్షలు కూడా రాశాను. 430 మార్కులు వచ్చాయి. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడితే గ్రూప్–1 ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: గ్రూప్– 2 టాపర్ హరవర్ధన్రెడ్డిసిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితముండదు నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే కష్టం. సంబంధిత సబ్జెక్టు మరిచిపోకుండా కనీసం రెండు గంటలైనా చదవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సిలబస్పై పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితం ఉండదు. పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమయం వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత సమయం కలిసొస్తుంది. కనీసం 8 గంటలు చదవాలి. -
మహిళల్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్దే
ఎమ్మెల్యే సునీతారెడ్డి పటాన్చెరు టౌన్: అధికారంలోకి వస్తే మహిళలకు రూ. పది లక్షలు, పావలా వడ్డీ రుణం ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిలువును మోసం చేసిన ఘనత కాంగ్రెస్పార్టీదేనని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మహిళల తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, తెలంగాణ రాష్ట్ర మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమిత్ర ఆనంద్, సంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ శాసనమండలి చైర్మన్ సతీమణి గీత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం
జహీరాబాద్: మహిళలను అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో నాబార్డు(జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) బ్యాంకు పలు కార్యక్రమాలను చేపట్టిందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల డీడీఎస్–కేవీకేలో మంగళవారం నిర్వహించిన మహిళా వారోత్సవాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.20లక్షల మహిళా సంఘాలు, ఐకేపీ, డ్వాక్రా సంఘాలున్నాయని ఈ సంఘాల అభివృద్ధిలో నాబార్డు పాత్ర విస్మరించలేనిదన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా రూ.57వేల కోట్లను రుణాల రూపంలో ఇచ్చామని తెలిపారు. నాబార్డు ద్వారా మహిళ, రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్ రంగాల్లో జీవనోపాధి కోసం 30 రోజుల శిక్షణ, ఎల్ఈడీపీ 90 రోజుల శిక్షణ ఇప్పించి యంత్రాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్కు నాబార్డు పోత్సహిస్తోందని చెప్పారు. సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, నాబార్డు డీజీఎం స్వాతి తివారి, డీడీఎంలు కృష్ణతేజ, నిఖిల్రెడ్డి, సఖి అధికారి కల్పన, శాస్త్రవేత్త సి.వరప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయా రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు.నాబార్డు జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ -
చదువుతోనే గుర్తింపు
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సదాశివపేట(సంగారెడ్డి): చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని విద్యార్థులందరు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మంగళవారం నిర్వహించిన ముఖముఖి కార్యక్రమంలో అమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డిని విద్యార్థులు వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. బాల్యం నుంచి రాజకీయ జీవితం, వారి వైవాహిక జీవితం, ఇతర విషయాల గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ భారతి మాట్లాడుతూ ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో ఇంటర్వ్యూ స్కిల్స్ ఎట్లా పెంపొందించుకోవాలి వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు. -
గ్రాట్యూటీ ప్రకారం డబ్బులు చెల్లించాలి
సంగారెడ్డి జోన్: కాంట్రాక్టు కార్మికులుగా 10 ఏళ్లకు పైగా పనిచేసిన ట్రైనీ కార్మికులకు గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు గ్రాట్యూటీ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీ యాజమాన్యం, ఆ సంస్థలో పనిచేస్తున్న ట్రైనీ కార్మికుల మధ్య వివాదం తలెత్తటంతో సోమవారం కలెక్టర్, పరిశ్రమ యజమాన్యం, కార్మికులు, అధికారులతో చర్చలు జరిపారు. ట్రైనీ కార్మికులు తమ ఇష్టపూర్వకంగా కంపెనీలో పనిచేయదలుచుకుంటే వారిని కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకోవడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని పరిశ్రమ కార్మికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల పనితీరు అర్హతలను బట్టి వారికి వేతనం రూ.18 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధూరి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, అదనపు ఎస్పీ సంజీవరావు, ఉప కార్మిక కమిషనర్ రవీందర్రెడ్డి , కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతీ మండలంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల కొరకు ప్రతీ మండల కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయాలని కలెక్టర్ క్రాంతి టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కార్యాలయాలకు వచ్చి చెల్లించేవారికి సిబ్బంది సహాయసహకారాలు అందించాలన్నారు. ఈ నెల 31 లోపు పూర్తిస్థాయి ఎల్.ఆర్.ఎస్ ఫీజుతో పాటు ప్రో–రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు వర్తింపజేస్తోందని ప్రచారం చేయాలని చెప్పారు. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 76 మంది, రూరల్ ఏరియాలో 116 ఎల్ఆర్ఎస్, ఈ పేమెంట్స్ జరిగాయని వెల్లడించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు రిబేటును మినహాయిస్తూ, వెంటవెంటనే ల్యాండ్ రెగ్యులరైజెషన్కు సంబంధించిన ప్రొసీడింగ్లు జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు.మార్చి 31లోగా పెట్రోల్ బంకు ప్రారంభించేలా చర్యలుకలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: జిల్లా మహిళా సమాఖ్య ద్వారా చేపడుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకు మార్చి 31లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య కమర్షియల్ కాంప్లెక్స్ లో షాపుల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మార్చి 18వ తేదీ లోగా 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అదనపు పీడీలు జంగారెడ్డి, బాలరాజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల అధికారులు, పీడీ హౌసింగ్ రవాణా శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశం ఎంఆర్ఎఫ్ యాజమాన్యం, కార్మికులతో చర్చలు -
జ్యోతిషం పేరుతో మోసం
రూ.లక్ష కాజేసిన దొంగ బాబా మద్దూరు(హుస్నాబాద్): జ్యోతిషం పేరుతో మోసం చేసి రూ.లక్ష కాజేసిన దొంగ బాబాను మద్దూరు పోలీస్లు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ శ్రీను కథనం మేరకు.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దక్షిణపు శివయ్య అనే బాబా ఇటీవల చేర్యాల మండలం కమాలయపల్లి గ్రామానికి చెందిన ధర్మోజీ నారాయణచారి జీ టీవీలో జ్యోతిషం చెప్పబడును అని ఒక ఫోన్ నంబర్ను చూశాడు. ఆ నంబర్ ద్వారా బాబాకు ఫోన్ చేసి తన ఇంటిలో ఇబ్బందులు ఉన్నాయని, మనశ్శాంతి దొరకడం లేదని చెప్పాడు. పూజ చేస్తే మంచి జరుగుతుందని బాధితుడిని బాబా నమ్మించాడు. రెండు విడుతల్లో రూ.లక్ష తీసుకున్నాడు. మళ్లీ కొద్ది రోజులకు మరిన్ని డబ్బులు కావాలని అడుగడంతో నారాయణచారికి అనుమానం వచ్చి పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. పోలీస్లు సాంకేతి పరిజ్ఞానం ఉపయోగించి దొంగ బాబాను పట్టుకున్నారు. అతడి ఫోన్ సీజ్ చేసి లక్ష రూపాయలను బాధితుడికి అందించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట మద్దూరు ఎస్ఐ షేక్ మహబుబ్, పోలీసులు, తదితరులు ఉన్నారు. -
గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్కుమార్
● 385 మార్కులతో 168వ ర్యాంకు ● ప్రస్తుతం వాణిజ్యపన్నుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు.. నారాయణఖేడ్: ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో నారాయణఖేడ్ జంట గ్రామం మంగల్పేట్కు చెందిన రాజ్కుమార్ 600 మార్కులకు 385 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఓపెన్ కేటగిరీలో 168వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. రాజ్కుమార్ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, ప్రాథమికస్థాయి నుంచి నవోదయలో విద్యాభ్యాసం చేశారు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సీటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ పూర్తి చేసి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆలోచనతో ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో గత నవంబర్లో గ్రూప్–4 ఫలితాలు విడుదల చేయడంతో అందులో సత్తా చాటి వాణిజ్య పన్నుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం దక్కించుకున్నారు. ఇంకా మెరుగైన ఉద్యోగం కోసం గ్రూప్–2 పరీక్షలు రాశారు. గ్రూప్ 2లో రాజ్కుమార్ విజయం పట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు. సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలిసంగారెడ్డి జోన్: మహిళల సమానత్వం ముందు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని జిల్లా పరిషత్తు సీఈఓ జానకిరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్తు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు సన్మానం చేసి, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఆడపిల్లలను, మగ పిల్లలను సమానంగా చూస్తూ చదివించాలన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యస్.సూర్యకాంత్, కార్యదర్శి రఘు, ఆర్.స్వప్న మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. డంప్యార్డ్ను రద్దు చేయాలిరామచంద్రాపురం (పటాన్చెరు): కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు వెంటనే నల్లవల్లి, ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ కె.రాజయ్య డిమాండ్ చేశారు. రామచంద్రాపురంలోని పీసీబీ జోనల్ కార్యాలయం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డంప్యార్డ్ వల్ల కాలుష్యం ఉండదని ప్రజల మధ్యలోకి వచ్చి అధికారులు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో వాయు, జల కాలుష్యం ఉంటుందని ప్రజలు చెప్తుంటే అధికారులు మాత్రం అనుమతులు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఖేడ్ నుంచి బయల్దేరిన పాదయాత్రనారాయణఖేడ్: దత్తగిరి మహారాజ్ 46వ అమరతిథి సందర్భంగా కొనసాగుతున్న పాదయాత్ర, పల్లకీసేవ (రథయాత్ర) మంగళవారం రాయిపల్లి మార్గంలో బయల్దేరింది. సోమవారం మనూరు మండలం బెల్లాపూర్ దత్తగిరి ఆశ్రమం నుంచి ఈ యాత్ర బయల్దేరి రాత్రి ఖేడ్కు చేరుకుంది. రాత్రి పాదయాత్రికులు ఖేడ్లోని దత్తగిరి ఆశ్రమంలో బసచేశారు. మంగళవారం తెల్లవారు జామున యాత్ర రాయిపల్లి మార్గంలో బయల్దేరింది. ఈ నెల 15న బర్దీపూర్ ఆశ్రమానికి చేరుకోనుంది. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఖేడ్ దత్తగిరి ఆశ్రమాన్ని సందర్శించగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు. -
ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి
జిల్లా వ్యవసాయాధికారి రాధిక కొండపాక(గజ్వేల్): యాసంగిలో నీటి అవసరాలు తక్కువగా ఉండే పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి టీ.రాధిక పేర్కొన్నారు. కొండపాకలో కూరగాయలు, పొద్దు తిరుగుడు, వరి పంటలు సందర్శన చేశారు. భూగర్భజలాలు విపరీతంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయన్న విషయాన్ని రైతులు వ్యవసాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతూ ట్యాంకర్ల ద్వారా నీటి తడులను అందించుకుంటూ కాపాడుకుంటున్నామంటూ కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. యాసంగిలో తక్కువ పెట్టుబడులతో సాగు చేసే ఆరుతడి పంటలను సాగు చేసుకుంటూ లాభపడాలన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు నీరు విడుదల చేసేలా వ్వయసాయ శాఖ కృషి చేస్తుందన్నా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణ, జిల్లా రైతు కమిటీ కార్యదర్శి దొమ్మాట మహిపాల్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు బైండోవర్ శివ్వంపేట(నర్సాపూర్) : జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని తహసీల్దార్ ఎదుట పోలీసులు మంగళవారం బైండోవర్ చేశారు. మండల పరిధి చండీ గ్రామానికి చెందిన ఆంజనేయులు ట్రాక్టర్ను ఇంటి ఎదుట పార్కింగ్ చేశాడు. సోమవారం అర్థరాత్రి గ్రామానికి చెందిన మియ్యడి రాములు, మియ్యడి శేఖర్, సందిగాని వినయ్ ట్రాక్టర్ డాబర్ పట్టీలు చోరీ చేస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ముగ్గురూ మద్యం మత్తులో చిల్లర దొంగతనాలకు అలవాటు పడటంతో మొదటిసారిగా కౌన్సిలింగ్ ఇచ్చి తహసీల్దార్ కమలాద్రి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్ టెక్నికల్ మేనేజర్ సునీల్ గజ్వేల్రూరల్: సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా వికాట్ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్ నిలిచిందని, అంతేకాక ఆల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ను తెలంగాణాలో విడుదల చేసినట్టు ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ తెలిపారు. శ్రీమాత ట్రేడర్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికాట్ గ్రూప్ కంపెనీలు 13 దేశాలలో విస్తరించి ఉన్నాయన్నారు. ఈ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవడంతో పాటు నిర్మాణం ధృడంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలతో పాటు రహదారులకు సరైన ఎంపిక అని, నిపుణులైన ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ సతీశ్కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి తిరుపతి, టెక్నికల్ అధికారి శ్రీకాంత్, శ్రీమాత ట్రేడర్స్ డీలర్ బాలన్రావు, గణేశ్, రమేశ్తో పాటు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
అలసత్వం.. సమన్వయలోపం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్ బి.మహేష్కుమార్గౌడ్తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. గూడెం మహిపాల్రెడ్డి గైర్హాజరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరు కాగా., ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పార్టీ నేతలు ఆవుల రాజిరెడ్డి, పూజల హరికృష్ణ, తూంకుంట నర్సారెడ్డి, నీలం మధు, కాటాశ్రీనివాస్గౌడ్, ఏ.చంద్రశేఖర్, ఎన్.గిరిధర్రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు.పాత బిల్లులు క్లియర్ చేయండి నరేందర్రెడ్డి ఓటమిపై సుదీర్ఘ చర్చ స్థానిక నేతలతో సమన్వయం చేసుకోలేదు ఉమ్మడి మెదక్లోనే అతి తక్కువ ఓట్లు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులుత్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. -
20 రోజులు.. రూ.61కోట్లు
సంగారెడ్డి జోన్: మున్సిపాలిటీల్లో పన్ను వసూలు లక్ష్యం దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పన్ను వసూళ్లపై సమీక్షలు చేపట్టి వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 31 లోపు పన్ను వసూళ్లు చేయాలని లక్ష్యం ఉన్నప్పటికీ, గడువులోపు పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటివరకు జిల్లాలో సగానికి మాత్రమే పన్ను వసూళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా ఆయా మున్సిపాలిటీలలో ఆస్తులపై పన్ను వసూలు చేసి నిర్వహణతోపాటు అభివృద్ధికి నిధులు సమకూర్చనున్నారు. పన్ను వసూళ్ల లక్ష్యం రూ.122 కోట్లు జిల్లాలోని ఉన్న పాత మున్సిపాలిటీలలో రూ.122,82,70,230లు పన్ను వసూలు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఈనెల 10 వరకు జిల్లావ్యాప్తంగా రూ. 61,72,24,609ల మేర పన్ను వసూలు అయినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలలో అత్యధికంగా నారాయణఖేడ్ పట్టణం మున్సిపాలిటీలో పన్ను వసూలు కాగా అతి తక్కువగా సదాశివపేట మున్సిపాలిటీలో వసూలు అయ్యాయి. ఈ మేర జిల్లావ్యాప్తంగా 50.25% పన్ను వసూలు నమోదు అయింది. సవాలుగా మారిన పన్ను వసూళ్లు 2024–2025ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆయా మున్సిపాలిటీలలో రూ.61,10,45,621లు పన్ను వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులకు పన్నువసూలు పెద్ద సవాల్గా మారింది. ఇదిలాఉండగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఆన్లైన్ విధానంలోకి మార్చకపోవడంతో ఇంకా వసూలు ప్రారంభించలేదు.(ఈ నెల 10 వరకు)(రూ. లలో)ఆన్లైన్ విధానంలో చెల్లింపులు మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లు మాన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ప్రత్యేక ఆన్లైన్ మిషన్ ద్వారా పన్ను వసూలు చేసి వెంటనే వారికి రసీదును అందిస్తున్నారు. వసూలు అయిన పన్ను పక్కదారి పట్టకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలే... మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లపై అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. త్వరిగతిన పూర్తి చేయాలని అధికారుల ఆదేశాలు బేఖతార్ చేస్తున్నారు. వసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల పన్నువసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ 17మంది అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.మున్సిపల్లో వసూలు 50%మాత్రమే వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు గడువులోపు పన్ను లక్ష్యం నెరవేరేనా?జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్ను వసూళ్ల వివరాలు మున్సిపాలిటీ వసూలు చేయాల్సింది వసూలు చేసిందిఅమీన్పూర్ 31,93,63,300 19,40,65,553 అందోల్ 1,31,98,056 92,12,905 బొల్లారం 15,97,84,799 11,32,13,985 ఇస్నాపూర్ 2,42,39,557 ––– నారాయణఖేడ్ 2,42,67,285 1,78,06,664 సదాశివపేట 11,17,59,118 3,06,97,841 సంగారెడ్డి 16,30,04,008 7,40,95,113 తెల్లాపూర్ 25,04,61,107 12,81,62,506 జహీరాబాద్ 16,21,93,000 4,99,70,042 -
సర్వీసులు ఫుల్.. సౌకర్యాలు నిల్
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి చౌరస్తాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలో కనీస వసతులు కరువయ్యాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగినా సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం నిత్యం బస్సులు రద్దీతో దర్శనమిస్తూ బస్టాప్ కిటకిటలాడుతుంది. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలోని అంతర్ సర్వీసులతోపాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలుస్తాయి. లింగంపల్లి చౌరస్తా నుంచి జహీరాబాద్ వరకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బుదేరా, కంకోల్, సదాశివపేట, కోహీర్ ప్రధానంగా దూర ప్రాంతాల సర్వీసులతోపాటు అంతర్రాష్ట్ర సర్వీసులను బస్టాండ్లలో నిలుపుతారు. వేసవికాలం సమీపించడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. చౌరస్తా బస్టాండ్లో తాగునీరు, నీడలో కూర్చునేందుకు గూడారాల ఏర్పాట్లు, కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్లో వసతుల్లేక ప్రయాణికుల ఇబ్బందులు అవస్థలు పడుతున్నా పట్టించుకోని అధికారులుఇబ్బందులు పడుతున్నాం నిత్యం ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాదుకు వెళ్తుంటాం. వందలాదిమంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటున్న పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఏ విధమైన ఏర్పాట్లు లేవు. తాగునీరు, మూత్రశాలలు లేక చాలా కష్టాలు పడుతున్నాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. –మాధవి, ప్రయాణికురాలు గుడారాలను ఏర్పాటు చేయాలి ఎండాకాలం సమీపించడంతో బస్టాండ్ వద్ద బస్సుల కోసం ఎక్కువ సేపు ఎండలో ఉండలేకపోతున్నాం. తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేయాలి. మహిళలు, వృద్ధులకు, చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. –రామస్వామి, ప్రయాణికుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను.. సంగారెడ్డి చౌరస్తా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో సౌకర్యాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. రోడ్డు పనులు నడవటంతో బస్స్టాప్కు ఇబ్బందిగా ఉంది. – ఉపేందర్,ఆర్టీసీ డిపో మేనేజర్ -
మద్యం మాన్పించారని ఆత్మహత్య
దుబ్బాకటౌన్: ఉరేసుకొని హమాలీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రఘుపతి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన బ్యాగరి శ్రీను (45) వ్యవసాయం చేస్తూనే హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిస కాగా కుటుంబ సభ్యులు మందలించి మద్యం మాన్పించారు. సోమవారం భార్య చంద్రకళతో తనకు డబ్బులు ఇవ్వాలని గొడవపడగా ఆమె ఇవ్వలేదు. మద్యం మా న్పించారని మనస్తాపం చెంది, జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో భర్త చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం మేరకు.. నార్సింగి గ్రామానికి చెందిన వట్టెపు స్వామి(32)కి మూడేళ్ల కిందట వడియారం గ్రామానికి చెందిన శిరీషతో వివాహమైంది. పిల్లలు కావడం లేదని తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో 9 నెలల కిందట శిరీష పుట్టింటికి వెళ్లింది. పెద్దల పంచాయితీ పెట్టగా ఇరువురికి నచ్చజెప్పారు. కాపురానికి వచ్చిన భార్య 20 రోజుల కిందట మళ్లీ గొడవపడి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన స్వామి మంగళవారం ఉదయం సోదరుడు శ్రీకాంత్కు ఫోన్ చేసి వల్లూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి చేరుకొని స్వామిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఆగమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై వ్యక్తి చేగుంట(తూప్రాన్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చేపూరి ప్రశాంత్(31) గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై భార్య సుకన్యను ఇబ్బందులకు గురి చేయడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మాజీ ఉప సర్పంచ్ కల్హేర్(నారాయణఖేడ్): ఉరేసుకొని మాజీ ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కృష్ణాపూర్ మాజీ ఉపసర్పంచ్ మల్దోడ్డి ఈశ్వర్(48) వ్యవసాయం చేస్తుండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఈశ్వర్ మంగళవారం గ్రామ శివారులోని పురాతన గడిలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఈశ్వర్ కుటుంబీకులను పరామర్శించారు. ఈశ్వర్ మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్
మెదక్ మున్సిపాలిటీ: ఏసీబీ అధికారులకు ఓ మున్సిపల్ ఆర్ఐ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణానికి చెందిన ధర్మగల్ల శివ కుమార్ తన సోదరి శైలజకు సంబంధించిన సర్వే నంబర్ 505/1/1/2 లోని 605 గజాల ఖాళీ స్థలాన్ని మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై సదరు అధికారి పని చేయకుండా పలుమార్లు తిప్పుకొని రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు గత నెల 24న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు బృందం పక్కా ప్రణాళికతో వలపన్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బాధితుడిద నుంచి మున్సిపల్ ఆర్ఐ జానయ్య రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంతోపాటు సూర్యాపేటలోని ఆర్ఐ ఇంట్లోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 8 గంటల పాటు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు సేకరించారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ సోదాలో సీఐలు వెంకటేశ్వర్లు, రమేశ్తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థ్థలం మ్యుటేషన్ కోసం రూ. 20 వేలు డిమాండ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి ఏకకాలంలో రెండు చోట్ల ఏసీబీ సోదాలు అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలింపు -
ర్యాంక్లు కొలమానం కాదు
కోహెడరూరల్(హుస్నాబాద్): విద్యార్థులకు ర్యాంక్లు, మార్కులు కొలమానం కాకుండా సబ్జెక్ట్ల వారీగా విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్పినేటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేయగా కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తుందని గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో తాగునీరు, రెండు తరగతి గదులు, స్పోర్ట్స్ మెటీరియల్ అవసరం ఉందని విద్యార్థులు అడగగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్రెడ్డి, డీపీవో దే వకీ, ఆర్డీవో రామ్మూర్తి, ఎంఈవో పద్మాయ్య, ఇన్పినేటివ్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అక్కన్నపేట(హుస్నాబాద్): గతంలో పెద్దవారికే కంటి అద్దాలు వచ్చేవి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత కంటి క్యాంపులో 304 మందికి స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. 129 మందికి ఆపరేషన్ అవసరం కాగా 72 మంది సెలెక్ట్ అయ్యారన్నారు. 52 మందికి ఈరోజు, వచ్చే వారం మిగిలిన వారిని ఆపరేషన్కు తీసుకెళ్తామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, జిల్లా గంథ్రాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీఎంహెచ్వో పల్వాన్, ఆర్డీఓ రామ్మూర్తి పాల్గొన్నారు. సబ్జెక్ట్ల వారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన బస్వాపూర్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం -
బొట్టు బొట్టు ఒడిసి పట్టి..
ఆలోచనకు పదును పెట్టి..డ్రిప్ పద్ధతిలో వరి సాగు ● మదిర గ్రామం ఆరెపల్లికి చెందిన రైతు రాజేందర్ వినూత్న ఆలోచన ● 24 గంటలపాటు నీటి తడులు ● మండు వేసవిలోనూ పైరు పచ్చగా.. ● సమయం, పెట్టుబడి ఖర్చులు ఆదా ● తప్పనున్న కూలీల బెడద రోజురోజుకూ ఎండ ప్రచండంగా మారుతున్న పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. వరికి సాగుకు నీరందక చేలన్నీ ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇక చేసేది లేక రైతులు ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయాలని మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ మదిర గ్రామం ఆరెపల్లికి చెందిన లకిడి రాజేందర్ తన ఆలోచనకు పదును పెట్టాడు. బొట్టు బొట్టునూ ఒడిసి పట్టి డ్రిప్తో ఎకరంలో వరి సాగుకు శ్రీకారం చుట్టాడు. మండు వేసవిలో నీటిని ఒసిడి పడుతూ డ్రిప్ ద్వారా పంటకు నీటి తడిని అందిస్తున్నాడు. దీంతో వరి పచ్చగా ఎదుగుతూ దర్శనమిస్తుంది. – మిరుదొడ్డి(దుబ్బాక) సాఽదారణంగా వరి సాగు చేయాలంటే నీటి అవసరం చాలా ఉంటుంది. వరి సాగుకు పొలం నిండా నీరు ఉంటేనే దిగుబడులు వస్తాయి. డ్రిప్ ద్వారా వరి మొక్కలకు బొట్టు బొట్టుతో నీటిని అందిస్తే సరిపోతుంది. అలాగే ఖర్చులు కూడా తగ్గుతాయి . వరి సాగుకు సంబంధించి బురద పొలాన్ని నాగలితో లేదా ట్రాక్టర్తో దున్నడం, గొర్రుతో చదును చేయడం, వరి నారు పోయడం, నారు పీకడం, నాట్లేయడం, కలుపు తీయడం వంటి పనులతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. పొలాన్ని దున్ని నాటు వేసే వరకు పెట్టుబడులు తలకు మించిన భారంగా మారుతాయి. అదే డ్రిప్ సాగులో ఒకే సారి దుక్కి దున్ని, పొలాన్ని చదును చేసి సీడర్తో విత్తనాలు పెట్టుకొని డ్రిప్ ద్వారా నీటి తడిని అందిస్తే తక్కువ ఖర్చుతో గట్టెక్కవచ్చు. కూలీల కొరత తప్పుతుంది డ్రిప్ సాయంతో సాగు చేస్తున్న వరికి కూలీల కొరత తప్పుతుంది. నేరుగా విత్తుకున్న పొలంలో ఎక్కువగా కలుపు రాదు. దీంతో కూలీల అవసరం కూడా ఉండదు. కలుపు నివారణకు అందుబాటులో ఉన్న గడ్డి నివారణ మందును పిచికారీ చేసుకునే వీలు కలుగుతుంది. అలాగే యూరియా, పొటాష్ వంటి రసాయన ఎరువులను చల్లడం వల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అదే డ్రిప్ సాగులో లిక్విడ్ యూరియాను పైపుల ద్వారా వరి దుబ్బలకు నేరుగా అందిస్తే మంచి పోషకాలు అందుతాయి. మోతాదు కంటే ఎక్కువగా వాడే రసాయన ఎరువుల ఖర్చు సైతం తగ్గుతుంది. ఎండను తట్టుకునేలా.. సాగు నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్న నేపథ్యంలో 24 గంటల పాటు డ్రిప్ ద్వారా బొట్టు బొట్టుగా నీటి తడి నిరంతరం అందుతుండటంతో వరి దుబ్బులు పచ్చగా కళకళలాడుతూ ఎండను తట్టుకుంటున్నాయి. డ్రిప్ సాయంతో సాగవుతున్న వరికి పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా సమయాన్ని, సాగు నీటిని ఆదా చేసుకునే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తుంపర సేద్యం మేలు చిన్నకోడూరు(సిద్దిపేట): ఎండలు మొదలు కావడంతో ఉన్న కొద్దిపాటి నీటితో తుంపర పరికరాల ద్వారా రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. తద్వారా రైతుకు శ్రమ తగ్గడంతో పాటు నీరు కూడా తక్కువ అవసరం ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయొచ్చు. దీంతో రైతులు తుంపర సేద్యం ద్వారా ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. -
జొన్న.. లాభాలు మిన్న
జహీరాబాద్ టౌన్: చిరు ధాన్యాల పంటల్లో అత్యధికంగా పండించే పంటల్లో జొన్న ఒకటి. కార్బొహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న ప్రజాధరణ పొందింది. ఒకప్పుడు పల్లెల్లో విరివిగా కాసిన జొన్న పంట కాలక్రమంలో తగ్గిపోయింది. ప్రజలు జొన్న రొట్టెలు తినడం ప్రారంభించడంతో మళ్లీ డిమాండ్ పెరిగింది. (తెల్ల) జొన్న ఆహారపు అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తెల్ల జొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. గిట్టుబాటు ధర కూడా లభిస్తుండడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు జొన్న పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గంలో రబీలో జొన్న అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. జిల్లాకు సరిహద్దులో ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో కూడా ఈ పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. జొన్న సాగుకు నల్లరేగడి నేలలు లేదా తేలిక పాటి ఎర్ర చల్క నేలలను శ్రేయస్కరం. రబీలో పండించే జొన్న వర్షాధారిత పంట కాదు. గాలిలోని తేమ ద్వారానే పంట పండుతుంది. జొన్నకు తెగుళ్ల బెడద తక్కువే. ఇతర పంటల మాదిరిగా ఆశించినంతగా ఉండదు. నెమళ్లు, అడవి పందుల బెడద ఉంటుంది. వాటి నుంచి రక్షించుకునేందుకు కష్టపడితే చాలు. జిల్లాలో గతేడాది జొన్న పంట సుమారు 35 వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది సుమారు 42 వేల ఎకరాల్లో రైతులు పంట పండిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. క్వింటాల్కు రూ. 6 వేల వరకు పలుకుతుంది. ఎకరాలకు సగటున 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. కొనుగోళ్ల కేంద్రాల ద్వారా ప్రభుత్వం పంటను కొనడం వల్ల రైతులకు పంట అమ్మడానికి ఇబ్బందులు ఉండవు. పెరిగిన సాగు విస్తీర్ణం జిల్లా వ్యాప్తంగా సుమారు 42 వేల ఎకరాల్లో సాగు మార్కెట్లో మంచి డిమాండ్ క్వింటాల్కు రూ.6 వేలు -
అధిక దిగుబడులు వస్తాయి
రైతులు జొన్న పంట సాగు ఆసక్తి చూపడం మంచిదే. రెండు, మూడేళ్ల నుంచి పంట సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అనువైన రకాలు ఎంపిక చేసుకొని సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. జొన్నకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులకు లాభం కలుగుతుంది. – భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్ ఆశాజనకంగా ఉంది జొన్న పంటకు డిమాండ్ ఉండడంతో ఈసారి ఎకరం పొలంలో జొన్న పంట వేశా. ఇప్పటికై తే పంట చాలా మంచిగానే ఉంది. ప్రస్తుతం కోతకు వచ్చింది. కోసిన తర్వాత దిగుబడి రేటు చూస్తే తెలుస్తుంది. లాభం వస్తే వచ్చే సంవత్సరం కూడా రబీలో జొన్న పంట వేస్తా. –సీ.నాగన్న, రైతు, హద్నూర్ -
వరికి బదులు మొక్కజొన్న వేసుకోవాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): వరితో పోల్చుకుంటే మొక్కజొన్న పంట కాలం తక్కువ, నికర ఆదాయం అధికమని వ్యవసాయ పరిశోధన కేంద్రం డాక్టర్ శ్రావణి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి అన్నారు. అక్కన్నపేట మండలం చౌటకుంట తండాలో మంగళవారం ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధన తోర్నాల ఆధ్వర్యంలో మొక్కజొన్న చిరుసంచులైన కేఎన్ఎంహెచ్–4191 హైబ్రిడ్ రకంను రైతుల పొలంలో క్షేత్ర ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ రకం మొక్కజొన్న హైబ్రీడ్ నీటి ఎద్దడిని, ఎండు తెగులను తట్టుకోవడమే గాక యాసంగి కాలానికి అనుకూలమైనవని అన్నారు. అదే విధంగా మార్చి ఏప్రిల్ మాసాల్లో పడే వడగండ్ల నుంచి కూడా రైతులు పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. చీడపీడలను తట్టుకొని, వర్షాభావ పరిస్థితుల్లో కూడా రైతులకి మంచి దిగుబడులను అందజేస్తాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తాన, వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత, రైతులు పాల్గొన్నారు. -
సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు
సంగారెడ్డి జోన్: పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యను ఓపిగ్గా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సివిల్ తగాదాలలో తల దూర్చకూడదని, చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురాలన్నారు. సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని,, నిర్ణీత సమయంలో అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని సూచించారు. శాంతి భద్రతల రక్షణలో రాజీపడొద్దని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బాధ్యతల స్వీకరణ జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ చెన్నూరి రూపేష్, అదనపు ఎస్పీ సంజీవరావు స్వాగతం పలికారు. అలాగే.. పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ వల్లూరు క్రాంతితో పాటు జడ్జి భవానీ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. గణనాథుని సన్నిధిలో..పటాన్చెరు టౌన్: రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో నూతన ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ఉన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎస్పీకి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఎస్పీ వెంట పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వినాయక్ రెడ్డి ఉన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి కొత్త ఎస్పీ పరితోష్ పంకజ్ -
31 వరకు రాయితీ గడువు
సంగారెడ్డి జోన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాలోని వివిధ ఽశాఖల అధికారులు, లేఅవుట్ డెవలపర్లతో ఎల్ఆర్ఎస్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని చెప్పారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కూడా నిర్ణీత కాలంలో డబ్బులు చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తులు చేసిన వారికి రాయితీ గురించి వివరించాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్లాట్లు ,లేఔట్లలో ఉన్న దరఖాస్తుదారులకు నూతన విధానంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి, డీపీవో సాయిబాబా, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. 102 మంది పిల్లలకు వీల్చైర్ల పంపిణీ పట్టణంలోని సంజీవ్నగర్ కాలనీ భవిత సెంటర్లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకం, అలిమ్కో సంస్థ ఆధ్వర్యంలో 102 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు కలెక్టర్ క్రాంతి ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. సాధారణ పిల్లలతో పాటు విద్యను అభ్యసించేలా అనేక రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తేనే ఈ అవకాశం కలెక్టర్ వల్లూరు క్రాంతి -
అరకొర సౌకర్యాలతో అవస్థలు
సంగారెడ్డి జోన్: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిగా కుర్చీలు లేకపోవడంతో క్యూలైన్లలో గంటల తరబడి నిలవాల్సి వచ్చింది. అసలే వేసవి కాలం.. పైగా దివ్యాంగులు, వృద్ధులు. వారికి సరైన సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో వారు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా, ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఇతర అధికారులు అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో 57 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ ఓ పద్మజరాణి, తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు
పటాన్చెరు టౌన్: నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగాలు సాధించవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎన్ఐఐటీ ఎన్జీఓ మైక్రోసాఫ్ట్ కంపెనీ వారి సౌజన్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్ అనే అంశాలపై మూడు నెలల శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రిన్సిపాల్ సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... శిక్షణలో 120 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 116 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. శిక్షణ శిబిరం కళాశాల టాస్క్ సమన్వయకర్తగా వ్యవహరించిన అధ్యాపకురాలు ప్రవీణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలోనే కాకుండా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సెల్ప్స్టడీ చేసి శిక్షణ నిర్వహించి, విద్యార్థులను పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ పూణమ్ కుమారి, కరుణ కుమారి, వెంకటేశం, మల్లిక, సంతోష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ -
చెక్ డ్యాం నిర్మాణాల పరిశీలన
నారాయణఖేడ్: యునైటెడ్ వే ఆఫ్ ముంబై సంస్థ ప్రిన్స్పైప్స్ సహకారంతో ‘జలసంజీవని విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’లో భాగంగా ఖేడ్ మండలం గైరాన్తండా, సీతారాం తండా శివారులో రెండు చెక్ డ్యాంలు, చాప్టా(కె) శివారులో మరో చెక్ డ్యాంను నిర్మించారు. సోమవారం సంస్థ జిల్లా మేనేజర్ శివరాజ్నాయక్, ఇన్చార్జి అజీజ్ టొంబాలి, ఇంజనీర్ కృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు శ్రీకాంత్, ప్రియాంక సందర్శించి పరిశీలించారు. తమ సంస్థ ద్వారా భూగర్భజలాల పెంపు, వాననీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడంలో భాగంగా మల్టిలేయర్ ఫార్మింగ్, ఆగ్రో హర్టికల్చర్, నర్సరీలు, ఫాంపాండ్ నిర్మాణం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే, చాప్టా(కె), అబ్బెంద ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించినట్లు వివరించారు. డంపింగ్ యార్డుపై ఫిర్యాదుజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు 34వ రోజుకు చేరుకున్నాయి. ఈ సమస్యను జేఏసీ సభ్యులు ప్రాంతవాసులతో కలిసి జిల్లా కలెక్టర్ వద్ద మొర పెట్టుకున్నారు. గతంలో గ్రామపంచాయతీ తీర్మానాల పత్రాలను కలెక్టర్కు వివరించారు. శాంతియుతంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులను రాంకీ పరిశ్రమ తప్పుదోవ పట్టిస్తుందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2021 నాటి లేఖను కలెక్టర్కు జతపరిచి వివరించారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని డంపింగ్యార్డ్ ఏర్పాటును రద్దుచేయాలని కలెక్టర్కు జేఏసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జేఏసీకి విరాళం అందజేత ప్యారానగర్ డంపింగ్యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ పిలుపు మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు రోజురోజుకు స్థానికుల నుంచి మద్దతు పెరుగుతతోంది. ఉమ్మడి జిన్నారం మండలాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమవారం జేఏసీ కమిటీ సభ్యులను కలిసి రూ.10 వేల విరాళాన్ని అందజేశారు. టీచర్లను మానసిక ఒత్తిడికి గురిచేయొద్దుయూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సాయిలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేజీబీవీ, యుఆర్ఎస్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడంలో, టైం యాప్ ద్వారా ఉదయం సాయంత్రం అసెంబ్లీ రికార్డు చేసి పంపమనడంతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవతున్నారని పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల బాగోగులు బోధన పైన ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అరకొర జీతాలతో పనిచేస్తున్న వారికి 28 రోజుల జీతం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమ్మె కాలపు జీతాన్ని ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూటీఎఫ్ కేజీబీవీ శాఖ జిల్లా ఇన్చార్జి రాజేశ్వరి, గీత తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఎఫ్ కార్మికుల ఆందోళనసంగారెడ్డి జోన్: ఎంఆర్ఎఫ్ పరిశ్రమ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే.. కలెక్టర్ను కలిసేందుకు వారు ప్రయత్నించగా..గేటు వద్ద పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో గంటల తరబడి కలెక్టరేట్ ఎదుట నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలో పర్మినెంట్ చేయాలని కోరితే మొత్తానికి తీసేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 350 మంది జీవితాలను రోడ్డున పడేశారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
విల్లాసవంతం ఏదీ..?
రామచంద్రాపురం (పటాన్చెరు): గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం, తాగునీరు, ట్రాఫిక్ తదితర సమస్యలకు దూరంగా.. ప్రశాంత జీవితం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసిన ఉద్యోగులు, వ్యాపారాస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. విల్లాలు కొన్నామన్న సంతృప్తి, సంతోషం లేక విలవిల్లాడి పోతున్నారు. వారికి ప్రశాంత జీవనం కరువైంది. తాము ప్రభుత్వానికి వేల రూపాయల పన్ను చెల్లిస్తున్నా కనీస సదుపాయాలు కల్పించడం లేదని, సమస్య పరిష్కారం కోసం ప్రతిసారి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారు వాపోతున్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సుమారు 50పైగా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు ఉన్నాయి. అందులో అధికారిక లెక్కల ప్రకారం 60 వేలకు పైగా జనాభా ఉండగా.. అనధికార లెక్కల ప్రకారం సుమారు 2లక్షపై జనాభా ఉంది. అయితే.. జనాభాకు సరిపడా మౌలిక సదుపాయలు కల్పించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలం చెందారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేక ఇబ్బందులే.. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డు నుంచి తెల్లాపూర్ మీదగా గోపనపల్లి వరకు రేడియల్ నిర్మించి పదేళ్లు పూర్తి కావస్తున్నా.. నేటికి ఆ రోడ్డు అసంపూర్తిగానే ఉంది. దీనితో పాటు అన్ని ఇంటర్నల్ రోడ్లను అభివృద్ధి చేయాలని స్థానికులు పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులను కేటాయించామని ఆధికారులు చెబుతున్నారే తప్ప అమలు చేయడం లేదు. నిత్యం రోడ్లపై భారీ వాహనాల రాకపోకలతో రోడ్లపై దుమ్ము, ధూళితో వాయుకాలుష్యానికి దారి తీస్తుంది. అలాగే.. జనాభాకు సరిపడా ప్రభుత్వాస్పత్రి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు పెరుగుతున్నా వాటికి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చెరువులోకి డ్రైనేజీ నీరు చేరుతుంది. తప్పని తాగునీటి సమస్య కాలనీలకు తాగునీటి అందించడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందారు. రిజర్వాయర్ నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం లేదు. తాగునీటి సరఫరా కోసం డెవలప్మెంట్ పేరిట లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలను గాలికొదిలేసిన అధికారులు పార్కులపై దృష్టి సారించారని స్థానికులు విమర్శిస్తున్నారు.పట్టించుకోవడంలేదు ప్రత్యేక అధికారుల పాలనలో సైతం ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదు. అధికారులు వారి సొంత లాభాలపైనే దృష్టి పెడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలు ఉండగా.. కోట్లాది రూపాయలతో పార్కుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా సమాధానం ఇవ్వడంలేదు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కనీసం విజిలెన్స్ అధికారులు విచారణ జరపాలి. – ఈశ్వరిగారి రమణ, తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలను పట్టించుకోవడం లేదు. వెంటనే సమస్యలను పరిష్కరించాలి. – కొల్లూరి భరత్, మాజీ కౌన్సిలర్ రూ.కోట్లు వెచ్చించి విల్లాలు కొన్నా.. తప్పని ఇబ్బందులు మౌలిక సదుపాయాలు లేక సతమతం వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా అభివృద్ధి పట్టదా..? గేటెడ్ కమ్యూనిటీవాసుల ఆవేదన -
తమ పొలాలకు వెళ్లకుండా..
తమ భూముల్లో పంటలు పండించుకునేందుకు వెళ్లేందుకు వీలులేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డుగోడలు కట్టారని, దీంతో తాము వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంది మండలం చెర్లగూడెంకు చెందిన సుమారు 35 మంది రైతులు కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రం అందజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల్లోకి వెళ్లనీయకుండా ఎక్కడికక్కడ పలకలతో గోడలు కట్టడంతో తమ పంటను ఇంటికి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని గోపాల్రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
100 మార్కులు సాధించవచ్చు
ప్రతీ అధ్యాయంలో చివర ఇచ్చిన ముఖ్య అంశాల్లోని సూత్రాలను, నిర్వచనాలను అధ్యయనం చేయాలి. సమస్యల సాధన, కారణాలను తెలపడం నిరూపించడం లాంటి నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలి. నిరూపక రేఖ గణితం, రేఖా గణితం, సంభావ్యత, సంఖ్యాశాస్త్రం, బీజీయా సమాసాలపై సాధన చేయాలి. గ్రాఫ్ ఆధారిత సమస్యలపై సాధన అవసరం. నిర్మాణాత్మక సమస్య సాధనపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓజీవ్ గ్రాఫ్, త్రికోణమితిలో పటాలను గీయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే పాఠ్యాంశాల్లోని కీలక భావనలపై దృష్టిని సారించాలి. – త్రినాథరావు, గణితశాస్త్రం -
బల్దియా బడ్జెట్ ఢమాల్
● గతేడాదితో పోల్చితే రూ.25 కోట్లు తగ్గుదల ● అంచనా బడ్జెట్ రూ.75.19 కోట్లు ● ఆదాయ, వ్యయ అంచనాల్లో స్వల్ప తేడా ● సిద్దిపేట మున్సిపాలిటీ బడ్జెట్కుఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం సిద్దిపేటజోన్: జిల్లాలోని ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట పెద్ద పద్దు(బడ్జెట్)ను సోమవారం ప్రవేశపెట్టారు. గతేడాది బడ్జెట్ రూ.104 కోట్లతో పోల్చితే సారి రూ.25 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాల్లో తగ్గుదల కనిపించింది. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సమక్షంలో 2025–26 అంచనా బడ్జెట్, 2024–25 సవరణ అంచనా బడ్జెట్లను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025–26 అంచనా బడ్జెట్లో వివిధ రూపాల్లో మున్సిపాలిటీకి రూ. 75.19 కోట్ల ఆదాయం చూపించగా, వివిధ ఖర్చుల కింద రూ.75.14 కోట్ల అంచనాతో రూపకల్పన చేశారు. 2024–25 సవరణ బడ్జెట్ మిగులు నిల్వతో కలిపి 2025–26కు గాను రూ. 2 కోట్ల 12 లక్షల ముగింపు నిల్వగా బడ్జెట్ పొందుపరిచారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ బడ్జెట్ ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2025–26 ఆదాయ, వ్యయ బడ్జెట్ పరిశీలిస్తే కేవలం రూ.4లక్షల స్వల్ప తేడా కన్పించింది. -
జిల్లాతో అనుబంధం మర్చిపోలేనిది
ఎస్పీని పరేడ్ గ్రౌండ్కు తీసుకువస్తున్న పోలీసులు సంగారెడ్డి జోన్: ఎస్పీగా నా మొదటి పోస్టింగ్ సంగారెడ్డి అని.. జిల్లాతో నాకున్న అనుబంధం ఎప్పటికీ మరచిపోలేనని ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో బదిలీ అయిన ఎస్పీ రూపేష్కు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో విధాయి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ.. జిల్లాలో మెరుగైన సేవలు అందించడంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతగానో ఉందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్ఛంతో అలంకరించిన పోలీసు వాహనంలో ఎస్పీ, వారి కుటుంబ సభ్యులను పరేడ్ గ్రౌండ్ నుంచి కార్యాలయ ఆవరణ వరకు తాడు సహాయంతో తీసుకువచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ చెస్నూరి రూపేష్ -
పరీక్షలకు సన్నద్ధం ఇలా..
జోగిపేట(అందోల్): పదవ తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమవుతుంది. 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పది రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థులు ఒత్తిడి గురికానున్నారు. పరీక్షల్లో విజయవంతం సాధించాలంటే ఆందోళనకు గురి కాకుండా ఒత్తిని జయించాలి. ఈ పది రోజుల్లో ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఎలా అధ్యయనం చేయాలి? అనే అంశాలపై పదవ తరగతి సబ్జెక్టులు బోధించే జోగిపేటలోని జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థులకు వారు పలు సూచనలు చేశారు. సబ్జెక్ట్ టీచర్ల చిట్కాలు ● ఒత్తిడిని జయించి..ప్రణాళిక ప్రకారం చదవాలి ● ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకొని రాయాలి ● పాఠ్యాంశాల్లోని కీలక భావాలపై దృష్టి సారించండి ● రివిజన్ చాలా ముఖ్యం -
46 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్
ఖేడ్ పట్టణంలో 30 నారాయణఖేడ్: పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఖేడ్ పట్టణంలో నిల్వ ఉంచిన గోదాంపై సోమవారం విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశం ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. డీఎస్పీ వెంకటేశం కథనం మేరకు.. పట్టణంలోని రాయిపల్లి రోడ్డులో శివరామ్ అనే బియ్యం వ్యాపారి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తన దుకాణం వెనుక గోదాంలో నిల్వ చేసినట్లు సమాచారం అందింది. దీంతో సీఐ పండరి, ఎస్ఐ వెంకటేశం, తహసీల్దార్ ప్రభాకర్తో కలిసి దాడి చేశాం. 60 బస్తాల్లో నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకొని ఆర్ఐ మాధవరెడ్డి పంచనామా చేసిన అనంతరం పౌరసరఫరాల గోదాముకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. శివ్వంపేటలో 16 శివ్వంపేట(నర్సాపూర్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి కొత్తపేట చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఆటో ట్రాలీలో రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించారు. అనంతరం సివిల్ సప్లయ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సివిల్ సప్లయ్ జూనియర్ అసిస్టెంట్ సాయికుమార్ వచ్చి 16 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. రాయగిరి అనే వ్యక్తి యశ్వంత్రావుపేట్ నుంచి వెల్దుర్తికి బియ్యం తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.