Sangareddy
-
అంగన్ వాడీలకు ఒంటిపూట
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు..సంగారెడ్డి జోన్: పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని చిన్నారుల ఆరోగ్య సంరక్షణ చర్యలో భాగంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్ వాడి కేంద్రాలలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. మే నెలలో పూర్తిగా సెలవులు ప్రకటించాయి. ఒంటిపూట తరగతుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. దీంతో ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు వేసవి నుంచి ఉపశమనం కలుగనుంది. కేంద్రాల నిర్వహణలో సమయం మారినప్పటికీ, పిల్లలకు, గర్భిణిలు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారంలో ఎలాంటి మార్పు ఉండదు. నెలరోజుల పాటు సెలవులకు చాన్స్ అంగన్ వాడి కేంద్రాల సంబంధిత సంఘాల సభ్యులు ఒంటిపూట తరగతులతో పాటు వేసవి సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించి అనంతరం నెల రోజులపాటు వేసవి సెలవులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు జిల్లాలోని అంగన్ వాడి కేంద్రాలు కేంద్రాల్లో హాజరయ్యే చిన్నారులువేలకు పైగా.. పెరుగుతున్న వేసవి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం నెల రోజులపాటు సెలవులు టేక్ హోమ్ ద్వారాఇంటికే సరుకులు సెలవుదినాల్లో ఇంటికే పౌష్టికాహారం జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రాజెక్టు పరిధిలో 1504 అంగన్వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాలలో 96 వేలకు పైగా చిన్నారులు ప్రతి రోజు హాజరవుతుంటారు. వేసవి సెలవుల్లో పౌష్టికాహారం పంపిణీ నిలిచిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే టేక్ హోమ్ రేషన్ ద్వారా ఇంటికే పంపించేందుకు రూపకల్పన చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రం నిర్వాహకులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.5150496 -
వసతులపై ఆరా
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఉత్తరాఖండ్ బృందంజిన్నారం (పటాన్చెరు): బొల్లారం డివిజన్ పరిధిలోని బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలను సోమవారం విద్యా పరిశోధన, శిక్షణ మండలి సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ బృందం సందర్శించింది. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న వసతులపై ఆరా తీశారు. ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, విద్యా బోధన, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను తెలుసుకున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ డీఎస్ లింగ్వాల్, శివకుమార్, భరద్వాజ్, హరిశంకర్, కిమోతి, మంతారాన, శివాని తదితరులు పాల్గొన్నారు. బురదలో కూరుకుపోయాయ్జహీరాబాద్ టౌన్: పట్టణం నుంచి అల్లనా వెళ్లే రోడ్డులో రెండు రోజుల నుంచి వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం లోడుతో వెళ్తున్న లారీ బురదలో దిగపడగా.. సోమవారం కారు చిక్కుకుంది. దీంతో ఈ రోడ్డు వెంట ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గతంలో రూ. 33 లక్షలతో ర్అడ్బీ అధికారులు రోడ్డుపై బ్రిడ్జిని నిర్మించారు. కానీ రోడ్డు పనులు పూర్తి చేయలేదని విమర్శలు చేస్తున్నారు. అయితే రోడ్డుపై మొరం పోయడంతో ఇటీవల కురిసిన వర్షానికి బురదగా తయారై వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికై నా ఆర్అండ్బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. తీరు మారకపోతే చర్యలు గజ్వేల్: కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డు లను కలియ తిరిగారు. అటెండెన్స్ రిజిష్టర్ను పరి శీలించారు. అనుమతి లేనిదే ఎవరూ సెలవు తీసు కోవద్దన్నారు. గర్భిణుల్లో మనోధైర్యం నింపు తూ మంచి ఆహారపు నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. -
జోరుగా శనగ పంట కోత పనులు
మండలంలో శనగ పంట కోత పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో పనులు సాగలేదు. దీంతో రెండు రోజుల నుంచి రైతులు శనగ పంట కోత పనులు, రాసులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో సుమారు 5,800 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు శనగలకు ప్రభుత్వం రూ.5,850 మద్దతు ధరను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో రాయికోడ్లో గల శనగల కొనుగోలు కేంద్రంను ప్రారంభించనున్నారు. రాయికోడ్(అందోల్): -
త్వరితగతిన అభివృద్ధి పనులు
కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, యువజన సంక్షేమ– క్రీడాభివద్ధి, విద్యాశాఖ, శిశు సంక్షేమ, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్న్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి, నారాయణఖేడ్ స్టేడియంలలో కొనసాగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. స్టేడియం మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుద్దీకరణ, చిన్నపాటి మరమ్మతులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ లలిత కుమారి, సీపీఓ బాలశౌరి, స్పోర్ట్స్ అథారిటీ అధి కారి అఖిలేష్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ బాలరాజ్, డీఈఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ ఏపీడి సూర్యరావు, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమంతో పాటు ఆర్థికాభివృద్ధి కొరకు నిర్ణయించే లక్ష్య సాధనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్డీఏ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రైతుల ఆదాయం పెంపు, వ్యవ సాయ ఉత్పాదకతలో గణనీయమైన వృద్ధి సాధించేందుకు ఫార్మ్ మెకనైజేషన్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, తేనెటీగల పెంపకం పథకాలను అమలు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటా యించిన ఫార్మ్ మెకనైజేషన్ లక్ష్యాలను వేగంగా సాధించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని, రైతులను యాంత్రీకరణ వైపు మరింతగా ప్రోత్స హించాలని సూచించారు.ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా మినీ ట్రాక్టర్లు, పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ స్ప్రేయర్స్ వంటి యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 97 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రజావాణిలో 49 దరఖాస్తులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్తో పా టు అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హా రతి కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన 49 దరఖాస్తులను స్వీకరించారు. -
గోటి తలంబ్రాలు సిద్ధం
గజ్వేల్రూరల్: భద్రాచలంలోని సీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేశారు. గజ్వేల్కు చెందిన రామకోటి భక్తసమాజం వ్వవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఈ బృహత్కర కార్యానికి శ్రీకారం చుట్టగా గోటి తలంబ్రాల దీక్షలో వేలాది మంది భక్తులు పాల్గొని రామనామ స్మరణతో భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గజ్వేల్–ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భక్తులు గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్నారు. సోమవారం పట్టణంలోని మురళీకృష్ణాలయం నుంచి భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో గోటి తలంబ్రాలను తరలించనున్నారు. ఈమేరకు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాల కలశాలతో అందజేశారు. -
6.50లక్షల టన్నులు
● గణపతి కర్మాగారంలో 4.20 లక్షలు ● ‘గోదావరి గంగా’లో 2.30లక్షల టన్నుల మేర గానుగ ● పెరిగిన రికవరీ శాతం చెరుకు క్రషింగ్ జహీరాబాద్: జిల్లాలోని రెండు చక్కెర కర్మాగారాల్లో చెరుకు క్రషింగ్ను ముగించారు. ఆయా కర్మాగారాలు 6.50లక్షల టన్నుల చెరుకును గానుగాడించాయి. సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారం 2025–26 సీజన్కు గాను 4,20,076 టన్నుల చెరుకును క్రషింగ్ చేయగా.. 4,70,700 క్వింటాళ్ల చక్కెరను ఉత్పత్తి చేసింది. రాయికోడ్ మండలంలోని మాటూర్లో గల గోదావరి గంగా కర్మాగారం 2,29,206 టన్నుల చెరుకును క్రషింగ్ నిర్వహించగా, 2,50,914 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి చేసింది. గణపతి కర్మాగారం గత ఏడాది కంటే 9,909 టన్నుల చెరుకును తక్కువగా గానుగాడించింది. జోన్ పరిధిలో చెరుకు పంట తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గోదావరి గంగా మాత్రం గత ఏడాది కంటే 1,13,702 టన్నులు అధికంగా క్రషింగ్ చేసింది. ఈ కర్మాగారం గత సీజన్లో కొత్తగా ఏర్పాటైంది. దీంతో కర్మాగారం ఆలస్యంగా క్రషింగ్ను మొదలు పెట్టింది. ఈ ఏడాది మాత్రం ఆశించిన మేరకు క్రషింగ్ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం చెరుకు పంటను సమీపంలోని కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్లో గల గాయత్రి కర్మాగారానికి తరలించారు. ఈ కర్మాగారం 3,95,427 టన్నుల చెరుకును గానుగాడించింది. గత ఏడాది గణపతి కర్మాగారం 11.05 శాతం రికవరీ కాగా, ఈ ఏడాది 11.20 శాతం రికవరీ సాధించింది. గోదావరి గంగా గత ఏడాది 10.41 శాతం కాగా ఈ ఏడాది 11 శాతం రికవరీ చేసింది. గాయత్రి గత ఏడాది 10.90 శాతం రికవరీ సాధించగా, ఈ ఏడాది 11 శాతం రికవరీ సాధించింది. ఈ ఏడాది వేసవి ఎండలు ముదరక ముందే క్రషింగ్ను ముగించడంతో రికవరీ శాతం పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గత మూడు సీజన్ల నుంచి మూతపడింది. వచ్చే ఏడాది క్రషింగ్ను చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇటీవల ట్రయల్రన్ను సైతం విజయవంతంగా నిర్వహించింది. -
ప్రజా సంక్షేమానికి అంకితం
లాంఛనంగా పామాయిల్ పరిశ్రమ ప్రారంభంసిద్దిపేటజోన్ / సిద్దిపేట కమాన్ /నంగునూరు(సిద్దిపేట): ప్రజాపాలనలో రైతు మహోత్సవం పేరిట ఆదివారం నంగునూరు మండలం నర్మేటలో నిర్వహించిన సీఎం సభ విజయవంతమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు, సిద్దిపేట జిల్లా మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రూ.300 కోట్లలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం మంత్రులతో కలిసి వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.141 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో యూజీడీ పథకం, రూ.200 కోట్లతో కొండపాక మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.16.62 కోట్లతో మర్కుక్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్స్కూల్కు శంకుస్థాపన చేశారు. రూ.78 కోట్లతో నిర్మించిన జైల్, రూ.15 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆయూష్ ఆస్పత్రి, రూ.3.60 కోట్లతో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్, రూ.1.43 కోట్లతో గట్లమల్యాలలో నిర్మించిన పీహెచ్సీ భవనం, సిద్దిపేటలో రూ.1.43 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాలకు సీఎం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ... రాజకీయాలు ఎన్నికల వరకేనని, అనంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు కూడా సమానంగా కేటాయించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండున్నర గంటల పాటు సాగింది. మొదట హెలిక్యాప్టర్లో సీఎం నర్మేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో వెళ్లి పామాయిల్ పరిశ్రమను ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత పరిశ్రమను పరిశీలించారు. అక్కడే కొనసాగుతున్న రైతు మహోత్సవంలోని స్టాళ్లను సందర్శించి వాటి గురించి తెలుసుకున్నారు. బ్యాటరీ వెహికిల్లో తిరిగారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు వర్చువల్గా ప్రారంభించారు. సాయంత్రం 4.11గంటలకు సభా వేదికకు సీఎం చేరుకున్నారు. రైతు భరోసాను విడుదల చేసి, బహిరంగ సభలో దాదాపు 43 నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి సాయంత్రం 6గంటలకు హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు బయలు దేరారు. సీఎం ప్రసంగాన్ని రాష్ట్రంలోని 1600 రైతుల వేదికల ద్వారా 4లక్షల మంది రైతులు విన్నారు. రూ.750 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన స్టాళ్లను పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎంపీలు సమస్యలపై సీఎంకు ఎంపీ రఘునందన్ వినతి -
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
వెల్దుర్తి(తూప్రాన్): ఉపాధిహామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... ఆరెగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల నాగలక్ష్మి(45) రోజూ మాదిరిగా శనివారం గ్రామ శివారులో నిర్వహించిన ఉపాధి హామీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. వడదెబ్బ కారణంగా నాగలక్ష్మి మృతి చెంది ఉంటుందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. గుండె పోటుతో ఒకరు.. మెదక్జోన్: ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బాల్నగర్ గిరిజన తండాకు చెందిన కాట్రోత్ రాజు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సైకిల్పై మెదక్ పట్టణానికి వస్తూ పిల్లికొటాల్ సమీపంలో కిందపడి మృతి చెందాడు. గమనించిన కొందరు అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య కాంట్రోత్ విజయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భద్రాద్రికి గోటి తలంబ్రాలు
రామకోటి రామరాజుకు అందించిన బాలాజీ ఆలయ బాధ్యులుదుబ్బాక: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కల్యాణానికి దుబ్బాక నుంచి గోటి తలంబ్రాలు అందించారు. ఆదివారం దుబ్బాక బాలాజీ ఆలయంలో శ్రీరామకోటి రామరాజుకు భక్తులు రామ నామస్మరణ చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలను అందజేశారు. దుబ్బాకతో పాటు పలు గ్రామాల నుంచి వచ్చిన తలంబ్రాలకు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.. రామయ్య కల్యాణానికి తెలంగాణ నుంచి ఈ సారి 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలను అందించాలన్న సంకల్ప దీక్షతో చేపట్టి దిగ్విజయంగా చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు భద్రాచలం వెళ్లలేకపోయిన తాము గోటితో ఒలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, అర్చకులు అచ్చి లక్ష్మినర్సింహ ఆచార్య, చింత నాగేందర్, సీబీ శ్రీనివాస్, రాజమౌళి తదితరులు ఉన్నారు. -
మార్కండేయులుకు ఉగాది పురస్కారం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): వివిధ సేవా రంగాల్లో రాణిస్తున్నందుకు చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉగాది సేవా పురస్కారం పొందినట్లు పద్మశాలి సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ, చేనేత ఐక్యవేదిక జిల్లా సలహాదారు గోనె మార్కండేయులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి బాబుమోహన్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ పురస్కారం అందించినట్లు పేర్కొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): శనివారం రాత్రి యువకుడు భూమిపూజ చేసిన స్థలంలో మూత్రవిసర్జన చేయగా, యువకులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నార్సింగి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేసిన స్థలంలో ఆదివారం హిందూ సంఘాల నాయకులు పంచామృతాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అపవిత్రం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ ఉపసర్పంచ్ యోగి, నాయకులు ఆంజనేయులు తదితరులున్నారు. మెదక్జోన్: మెదక్ పట్టణంలో ఎనిమిది రోజుల వ్యవధిలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయని పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. వివరాలు ఇలా... ఈ నెల 14న, పట్టణంలోని చర్చి గేట్ సమీపంలో 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సుగల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొన్ని రోజులుగా మెదక్లో భిక్షాటన చేసినట్లు గుర్తించారు. అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించగా నేటికి అతనికి సంబంధించిన వారు ఎవరు రాలేదని తెలిపారు. అలాగే మరో ఘటనలో ... ఆదివారం పట్టణంలోని జంబికుంట నాగిని చెరువు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉందని, మృతుడు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని చెప్పారు. మృతదేహంపై నల్లరంగు ప్యాంటు, తలపై ఎరుపు రంగు టవల్ ఉంది. శవాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో బద్రపరిచినట్లు చెప్పారు. చేగుంట(తూప్రాన్): మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన మక్క నర్సింహులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య స్రవంతి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 18న ఏడాది వయసున్న చిన్నారిని తీసుకొని ఆమె బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువుల వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. సంగారెడ్డి క్రైమ్: ఈ నెల 21న లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... మృతురాలు సంగారెడ్డి పట్టణంలోని నలంద నగర్కు చెందిన లక్ష్మిగా(45) గుర్తించారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈనెల 20న ఊరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మహబూబ్ సాగర్ చెరువులో మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలించి లక్ష్మిగా గుర్తించారు. -
కేసీఆర్, హరీశ్ కృషి వల్లే పామాయిల్ సాగు
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మాజీమంత్రి హరీశ్రావు కృషి వల్లే జిల్లా పామాయిల్కు హబ్గా మారిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరం వల్లే పామాయిల్ సాగు విస్తరిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సొమ్ము బీఆర్ఎస్దైతే సోకు కాంగ్రెస్ చేస్తున్నదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతు భరోసా సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతులకు రైతు భరోసా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ను ఎక్కడికక్కడా నిలదీస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు కళ్యన్కర్ నర్సింగరావు, కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కోతుల బెడదకు చెక్
● ఎలుగుబంటి వేషధారణతో తరిమిన గ్రామస్తులు మర్కూక్(గజ్వేల్): కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు గ్రామస్తులు వినూత్న ప్రయోగం చేపట్టారు. గ్రామంలో చాలా కోతులు ఇళ్లలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో సర్పంచ్, గ్రామ యువకులు కోతులను తరిమేందుకు శ్రీకారం చుట్టారు. మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఆదివారం సర్పంచ్ కవిత రాంమోహన్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో సుమారు వంద కోతులను యువకులు నగేశ్, గోపిరెడ్డి ఎలుగుబంటి వేషధారణతో కోతులను భయపెట్టి గ్రామం నుంచి తరిమివేశారు. దీంతో గ్రామంలో కోతుల బెడద తగ్గిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు భిక్షపతి, వెంకట్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్వీ నాయకుల నిరసన
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం సరే, మరి సిద్దిపేట నియోజకవర్గానికి రావాల్సిన నిధుల సంగతేంటని వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వం సిద్దిపేటకు కేటాయించిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తే సహించేది లేదని, వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు. -
దుబ్బాకను అభివృద్ధి చేయండి
ఎంపీ రఘునందన్రావు దుబ్బాక ప్రాంతం పూర్తిగా వెనకబడిందని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని.. సీఎంను మెదక్ ఎంపీ రఘునందన్రావు కోరారు. అనంతరం పలు సమస్యలపై ఎంపీ సీఎం రేవంత్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపాక మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలకు తపాస్పల్లి రిజర్వాయిర్ నీరు అందడం లేదని, దుబ్బాక నియోజకవర్గంలో కాల్వల ద్వారా మల్లన్నసాగర్ నీరు లేక రైతులు గోస పడుతున్నారని తెలిపారు. గజ్వేల్ రింగ్రోడ్డును పూర్తి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సందీప్కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సీనియర్ ఐపీఎస్ సౌమ్యామిశ్ర, విద్యా కమిషన్ చైర్మన్ మురళి, ఎంపీలు సుదర్శన్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, సత్యనారాయణ, సంజీవ్రెడ్డి, నవీన్యాదవ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
పాతనేరస్తుడి అరెస్ట్
మెదక్జోన్: పాతనేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సీఐ మహేశ్ కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన పాతనేరస్తుడు వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు గోపాల్ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో రెండు బైకులను దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతడిపై కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోరీ కేసులు ఉన్నాయి. బైకులను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్కు పంపించారు. -
ట్రేడ్ లైసెన్స్ల గందరగోళం! జోగిపేట పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రేడ్ లైసెన్స్ల వ్యవహారం గందరగోళంగా మారింది. వివరాలు 9లో u
ముక్క తగ్గనంటోందిజోగిపేట(అందోల్): మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ఆదివారం కిలో చికెన్ ధర రూ.360కి చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు నాన్వెజ్ తినడమే కష్టంగా మారింది. లైవ్ చికెన్ రూ.230, స్కిన్లెస్ రూ.360, చికెన్ రూ.320 చొప్పున చికెన్ దుకాణాలలో విక్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా ఇంతరేటు పెరగడం గమనార్హం. గతంలో వారానికి ఒకసారైనా చికెన్ కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నాయి. చికెన్ ధరల పెరుగుదలకు పలు కారణాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీఫారాల్లో ఉత్పత్తి తగ్గడం, పక్షుల ఆహార వ్యయం పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల ధరలు పెరిగినట్లు తెలిపారు. అలాగే వేసవి ప్రభావం కారణంగా కోళ్ల మరణాలు కూడా పెరిగి సరఫరా తగ్గిందని పేర్కొన్నారు. ఇక వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇప్పటివరకు కుటుంబంతో కలిసి వారానికి ఒకసారి చికెన్ తినేవాళ్లం. ఇప్పుడు ధరలు ఎక్కువ కావడంతో నెలలో ఒకసారి కూడా కొనలేకపోతున్నాం’’అని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. మటన్ ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా, చికెన్ కూడా అదే దారిలో నడవడం వల్ల నాన్వెజ్ పూర్తిగా దూరమవుతోందని అంటున్నారు. హోటళ్లలో కూడా చికెన్ వంటకాల ధరలు పెరగడంతో కస్టమర్ల రాక తగ్గినట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.చికెన్ కిలో రూ.360 మధ్యతరగతికి మాంసం దూరం -
ఎస్టీపీ వద్దేవద్దు
ఎమ్మెల్యేకు అమీన్పూర్ వాసుల వినతి పటాన్చెరు: అమీన్పూర్లో స్యూవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని స్థానికులు డిమాండ్ చేశారు. అమీన్పూర్లోని పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశం అయ్యారు. కాలనీలకు సమీపంలో మురుగు శుద్ధిని చేసే ప్లాంట్ను ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. సర్వే నంబర్ 993 గుట్టల్లో చక్కని పచ్చదనం ఉందని, అమీన్పూర్ జీవవైవిధ్యమున్న ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో పర్యావరణ అనుమతుల్లేకుండా ఎస్టీపీ నిర్మాణం చేయడం విడ్డూరంగా ఉందని వివిధ కాలనీల సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ తిరుమల్రెడ్డి, మోడీ కాలనీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రమేశ్, ఇతర కాలనీ సంఘాల ప్రతినిధులు అరుణ్, విష్ణు, రవి, జయరామ్, వెంటరెడ్డి, విజయ్ పాల్గొన్నారు. -
సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే మాణిక్రావు ఆదివారం ప్రారంభించారు. మండలంలోని అల్గోల్, హుగ్గెళ్లి తండాలో, రాయిపల్లి(డి)లో, బూచినెల్లిలో రూ.5లక్షల చొప్పున సీసీ రోడ్డు నిర్మాణ పనులతోపాటు గోవింద్పూర్ గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టనున్న మురికి కాలువలు పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దైవచింతనతో మానసిక ప్రశాంతత: సుధారాణిపటాన్చెరు టౌన్: దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి అభిప్రాయపడ్డారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూర్లో ఆదివారం జరిగిన ఎల్లమ్మతల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవంలో సుధారాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు కాటా సుధారాణిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వాస్పత్రిలో అన్నదానం సంగారెడ్డి: జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ పూజారులు నాగరాజు, శివపంతులు ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సీఐటీయూతోనే కార్మికులకు న్యాయంసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ రామచంద్రాపురం(పటాన్చెరు): సీఐటీయూతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.మల్లికార్జున్ పేర్కొన్నారు. తోషిబా పరిశ్రమలో సీఐటీయూ యూనియన్ ఏర్పడి 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పరిశ్రమలోని కార్మికులకు బోనస్లు, పర్మినెంట్ చేయించడంతోపాటు డీఏ సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.రాజయ్య, పాండురంగారెడ్డి, నాయకులు అనంతరావు, శ్రీధర్, బంగారురాజు, నరేందర్, వేంకటేశ్వర్లు, కృష్ణయ్య, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం
సంగారెడ్డి: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం పునరాలోచన చేసి వారికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులను పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుగౌడ్ పాల్గొని మాట్లాడారు. బడ్జెట్లో బీసీలకు కేవలం నాలుగు శాతం నిధులను కేటాయించడం అన్యాయమన్నారు. జనాభాలో 56% పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కల్పించలేదని గుర్తు చేశారు. కనీసం 25 వేల కోట్ల రూపాయలు తక్షణమే కేటాయించాలని లేదంటే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కావేరి ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు చంద్రయ్యస్వామి తదితరులున్నారు.● బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి ● బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ -
భగత్సింగ్ ఆశయసాధనకు కృషి చేయాలి
చుక్కా రాములు పటాన్చెరుటౌన్: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ ...భగత్సింగ్ తన 23 సంవత్సరాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుడని గుర్తు చేశారు. 1907 సంవత్సరంలో జన్మించి, 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజ య్య, మాణిక్యం, సీపీఎం పటాన్చెరు డివిజన్ కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా భవనాల పనులు చకచక
మహిళా సంఘాలకు తీరనున్న సమస్యలు హత్నూర(సంగారెడ్డి): డ్వాక్రా మహిళల సమస్యల పరిష్కారం కోసం సొంత భవనాలను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హత్నూర మండలంలో అందుకు సంబంధించిన పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మండలానికి 29 గ్రామపంచాయతీల్లో డ్వాక్రా మహిళ భవనాల నిర్మాణం కోసం రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు అధికారులు భవన నిర్మాణాల కోసం పనులు ప్రారంభించారు. మండలంలో 23 గ్రామాల్లో డ్వాక్రా భవనాల పనులు చకచకా కొనసాగుతున్నాయి. మహిళ సమాఖ్య సంఘాలు ప్రతీ సమావేశాన్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటు ప్రతీనెల బ్యాంకులోన్ తీసుకున్న వాటిని సైతం ఇందులోనే సమావేశపరచుకుని బ్యాంకు రుణాలను చెల్లించేందుకు వెసులుబాటు కలుగనుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా భవనాల నిర్మాణాల కోసం జిల్లా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనులను వేగిరం చేస్తున్నారు. కాసాల, రొయ్యపల్లి, కొత్తగూడెం, సాధులనగర్, సికిందలాపూర్, ఎల్లమ్మగూడ గ్రామాల్లో మాత్రం నిర్మాణం కోసం స్థలం దొరకకపోవడంతో పనులింకా ప్రారంభం కాలేదు. హత్నూర మండలానికి 29 మంజూరు 23 బిల్డింగ్లకు కొనసాగుతున్న పనులుచురుగ్గా కొనసాగుతున్నాయి మండలంలో 29 గ్రామాల్లో డ్వాక్రా మహిళ భవనాలు మంజూరు కాగా 23 భవనాలు నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేవలం ఆరు గ్రామాల్లో భవన నిర్మాణానికి స్థలం లేక పనులు ఇంకా ప్రారంభించలేదు. మార్చి నెలాఖరునాటికి ఈ ఆరు గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – రాజశేఖర్, ఏపీఎం -
నేడు సిద్దిపేటకు సీఎం రాక
సమీక్షించిన ఐజీ చంద్రశేఖర్రెడ్డి సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారం భోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోస్తు నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఐజీ చంద్రశేఖర్రెడ్డి తోపాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరిమాళ్ తోపాటు భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులతో సమాలోచన చేశారు. -
బురద ఆరక
మురుగు పారక.. పాత మున్సిపల్ పరిధిలోని ఆర్యనగర్, రాంనగర్, గాంధీనగర్, శాంతినగర్, బాగారెడ్డిపల్లి, గడి, వతన్బాగ్, రహమత్నగర్, తమ్మడ్పల్లి, భరత్నగర్, గడిహరిజనవాడ, మాణిక్ ప్రభువీధి, ఫరీద్నగర్, కాంతారెడ్డి నగర్, డ్రైవర్స్ కాలనీలతోపాటు తదితర కాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. పలు వార్డుల్లోని ఆయా కాలనీల్లో ఇప్పటికీ పక్కా డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి బురద మేటలు వేస్తోంది. ఆక్రమణల ద్వారా ఇండ్ల నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో అయితే సమస్యలు ఎక్కడికక్కడే తిష్టవేసినట్లు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. వీటితోపాటు దోమలు కూడా స్వైరవిహారం చేస్తుండటంతో రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం గురించి ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం రోడ్ల సౌకర్యం కూడ లేకపోవడంతో వర్షం పడితే రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి డ్రైనేజీ కాలువలే ఉన్నాయి. వాటికి పక్కా నిర్మాణాలు చేయకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడే స్థంభిస్తోందంటున్నారు. అవసరం మేరకు నిధుల కేటాయింపుల్లేక అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల్లో ఎక్కువ నిధులను మురికివాడల ప్రాంతాలకే కేటాయించాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్న మురికి కాలవల్లో పేరుకుపోయిన చెత్త, మురికిని తొలగించేందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో వారం, పక్షం రోజుల వరకు కూడా కాలువలను శుభ్రం చేయడం లేదని పలువురు వాపోతున్నారు. పక్కా డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం తగిన నిధులు కేటాయించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.జహీరాబాద్ మురికివాడల్లో పారని డ్రైనేజీలు దుర్గంధంతోపాటుదోమల స్వైరవిహారంజహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని మురికివాడలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. జహీరాబాద్: -
బీహెచ్ఈఎల్ నుంచి గోవాకు బస్సు సర్వీసులు
పటాన్చెరు: బీహెచ్ఈఎల్ డిపో నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి, ఉడుపి, మురుడేశ్వర, గోకర్ణ మీదుగా 25వ తేదీన గోవాకు సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీకెండ్లలో గోవాకు ఒక్కరి రూ.6,150 టికెట్ ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక కాలనీలో కనీసం 30మంది విహారయాత్రలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బీఓసీ కింద బస్సులు నడపనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకోసం 9063401072 సంప్రదించాలని సూచించారు. సిరిపురంలో బ్యాంకు ఏర్పాటుకు హామీ హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా బ్యాంకు ఏర్పాటుకు ఎంపీ రఘునందన్రావు సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ తెలిపారు. హత్నూర మండలంలోని పలు గ్రామాల బీజేపీ నాయకులు పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఎంపీ రఘునందన్రావును కలిసినట్లు తెలిపారు. సిరిపురం గ్రామంతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు బ్యాంకు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న విషయం ఎంపీ రఘునందన్రావు దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే బ్యాంకు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడతానని ఎంపీ హామీనిచ్చినట్లు వెల్లడించారు. సంగమేశ్వర బసవేశ్వరకు కేటాయింపులేవి?నియోజకవర్గంలో అధ్వానంగా రోడ్లు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జోగిపేట(అందోల్): బడ్జెట్లో అందోల్ నియోజకవర్గం చెందిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. జోగిపేటలో ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ...గత బీఆర్ఎస్ హాయాంలో సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నాలు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్బో స్కూల్పై చర్యలు తీసుకోవాలిఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ పటాన్చెరుటౌన్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణం లోని శ్రామిక్ భవన్లో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ...అమీన్పూర్ డివిజన్ బీరంగూడ లోని రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్లో యాజమాన్యం అధిక ఫీజులు వసూళ్లు చేయటం దారుణమన్నారు. అధిక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల ఆందోళనే ఇందుకు నిదర్శనమన్నారు. -
పారిశ్రామిక ప్రగతి పరుగులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్కం) పెరుగుదలలో సంగారెడ్డి జిల్లా దూసుకుపోతోంది. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాను సైతం వెనక్కినెట్టి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. తొలి, రెండో స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉండగా, సంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉంది. అలాగే జిల్లా స్థూల వస్తుత్పత్తిలోనూ సంగారెడ్డి రాష్ట్రంలోనే నాలుగోస్థానంలో ఉండటం గమనార్హం. ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో సూచికల్లో తలసరి ఆదాయం ప్రధానమైనది. ఈ తలసరి ఆదాయం పెరుగుదలలో జిల్లా ప్రగతి వైపు పయనించడం శుభసూచికమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సోషియో ఎకనమిక్ అవుట్ నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో ఈ తలసరి ఆదాయంతోపాటు పారిశ్రామిక ప్రగతిలో సంగారెడ్డి జిల్లా దూసుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ఒక్కోవ్యక్తి తలసరి ఆదాయం రూ.3.94 లక్షలుగా ప్రభుత్వం ప్రకటించింది. మొదటి స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా రూ.11.29 లక్షలు ఉండగా, రెండోస్థానంలో ఉన్న హైదరాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం రూ.4.79 లక్షలు, నాలుగోస్థానంలో ఉన్న మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా తలసరి ఆదాయం రూ.3.81 లక్షలు ఉంది. ఫార్మా, రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులే కారణం సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా దూసుకుపోతోంది. ఫార్మా, ఇంజనీరింగ్మ్యాన్ఫ్యాక్చరింగ్, రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లోని ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా ఫార్మా, బల్క్డ్రగ్ ఉత్పత్తులు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ ఎగుమతులు ఏటా పెరుగుతుండటంతో జిల్లా స్థూల ఉత్పత్తి పెరుగుతోంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుదలకు కారణమవుతోందనే అభిప్రాయం ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో ఐటీ, తర్వాత స్థానం ఫార్మా ఉత్పత్తులే ఉంటాయి. ఈ ఫార్మా ఉత్పత్తిల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఉండటంతో తలసరి ఆదాయంలో జిల్లా మూడో స్థానంలో నిలవడానికి కారణమని ఆర్థిక నిపుణులు లెక్కిస్తున్నారు. ఒక ప్రదేశంలో జరిగిన ఉత్పత్తి విలువను ఆ ప్రాంతంలో ఉన్న జనాభాతో భాగించి తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు.2.68 లక్షల మందికి ఉపాధి పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారిలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది. 2025 డిసెంబర్ నాటికి జిల్లాలో ఉన్న 2,187 పరిశ్రమల్లో 2,68,735 మంది ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్న వారు ఉన్నట్లు లెక్కగట్టింది. తొలిస్థానంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఉంది. ఈ జిల్లాలో 4,095 పరిశ్రమలుండగా, 2.96లక్షల మంది ఉద్యోగులు, ఉపాధి పొందుతున్న వారు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తంగా 13.01 లక్షల మంది పరిశ్రమలతో ఉపాధి పొందుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.3వ స్థానంలో తలసరి ఆదాయం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాను వెనక్కినెట్టిన సంగారెడ్డి పరిశ్రమల ఉద్యోగాల్లోజిల్లా రెండో స్థానం జిల్లా స్థూల ఉత్పత్తిలోనూ పురోగతి పారిశ్రామిక ఉత్పత్తులే కారణం -
పోరాటాల ఫలితమే..
సిద్దిపేటజోన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా వత్తిడి చేయడం వల్లే సర్కారు దిగివచ్చిందని, మా పోరాటాల ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400 మద్దతు ధర ఉండగా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700 అమ్మి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 25శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికై నా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్ఫ్లవర్ క్వింటాల్ రూ.7,721 మద్దతు ధర ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో యాసంగికి సాగు ఉండేదని, కాళేశ్వరం పుణ్యమా అని పదింతలు పెరిగి 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. కాళేశ్వరం వచ్చాక కరువు అనే పదం లేదన్నారు. జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చిన ఘనత కాళేశ్వరానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాజీమంత్రి హరీశ్రావు -
బావిలో పడి యువకుడి మృతి
దుబ్బాకటౌన్: మద్యం మత్తులో బావిలో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై కీర్తిరాజు వివరాల ప్రకారం... దుబ్బాక మున్సిపల్ మల్లయ్యపల్లి వార్డుకు చెందిన కోతుల స్వామి (36) కూలి పని చేస్తూ, సోదరుని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. స్వామి ప్రతిరోజు కూలి పని చేస్తూ, వచ్చిన డబ్బులతో విపరీతంగా మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. మద్యం మత్తులో పట్టణ శివారులోని పాతూరి రాంరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. శనివారం ఉదయం మృతదేహం, చెప్పులు, బట్టలు గుర్తించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి, శవ పరీక్ష కోసం దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
గుర్తుతెలియని మహిళ మృతదేహం
సంగారెడ్డి క్రైమ్: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్ సాగర్ చెరువులో ఈ నెల 21వ తేదీన శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ(45) మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద పలు రకాల పాసుపోర్టు సైజ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వాహన దొంగ అరెస్టు
జహీరాబాద్ టౌన్: స్కూటీని అపహరించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ సమీపంలో గల బాబుమోహన్ కాలనీకి చెందిన వినోద్ తన ఫోన్ చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఈ నెల 18న టీజీ 15 ఏ9672 నంబర్ గల స్కూటీపై స్టేషన్కు వెళ్లాడు. పోలీసు స్టేషన్లో సమీపంలో పార్కు చేసి ఫిర్యాదు చేసి వచ్చే లోపు వాహనం మాయమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కదలికను కనిపెట్టారు. శనివారం బీదర్ చౌరస్తాలో స్కూటీపై వెళ్తున్న దొంగను పట్టుకున్నారు. నిందితుడు మండలంలోని సత్వార్కు చెందిన ఏర్పుల శ్రీనివాస్గా గుర్తించారు. అతని వద్ద ఉన్న స్కూటీని స్వాధీనం చేసుకొని కోర్టులో రిమాండ్ చేశారు. వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో డబుల్ లాక్ లేదా అలారం సిస్టంను ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
రెడ్డి సంక్షేమానికి నిధులేవీ?
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వం రెడ్డి సంక్షేమానికి బడ్జెట్లో పైసా నిధులు కేటాయించలేదని రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఊసే లేదని, కనీసం సంక్షేమానికి నిధుల కేటాయింపులు కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలో రెడ్డి జనాభాను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలంలోని కానుకుంట రామ్ రెడ్డి బావి గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సీపీఎం పార్టీ డివిజన్ నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో డివిజన్ పార్టీ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడారు. పథకంలో పని చేస్తున్న కూలీలకు రూ.800 చెల్లించాలని, ప్రతిరోజు రెండు సార్లు ఫొటో క్యాప్చర్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రవీందర్, కూలీలు పాల్గొన్నారు. -
కస్తూర్బా విద్యార్థులకు వరం
జేఈఈ మెయిన్స్, నీట్కు కార్పొరేట్ తరహా కోచింగ్● మెదక్, సంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల ఎంపిక ● ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు ● ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు రెండు జిల్లాల్లో 6 కేజీబీవీల ఎంపికకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో మూడు కేజీబీవీలను శిక్షణకు ఎంపిక చేశారు. మెదక్లోని కేజీబీవీలో ఐఐటీ, జేఈఈ, నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి కేజీబీవీలో నీట్, అల్లాదుర్గ్ మండలం కేంద్రంలోని కేజీబీవీలో న్యాయవిద్య(క్లాట్)లో శిక్షణ ఇవ్వనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేయగా... జిన్నారంలో జెఈఈ, నీట్, సదాశివపేట్లో ఐఐటీ, అందోల్లో క్లాట్లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వనున్నారు. -
విద్యాభివృద్ధికి పెద్దపీట
● రూ.16.62కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాల నిర్మాణం ● పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ మురళి మర్కూక్(గజ్వేల్): విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించాలనే ఏకై క లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం సుమారు రూ.16.62 కోట్లతో భవనాలు నిర్మించి, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ క్వార్టర్స్, పక్కనే ఉన్న 5 ఎకరాల స్థలాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. అనతరం చైర్మన్ మాట్లాడుతూ... పోలీస్ క్వార్టర్స్లో ఉన్న భవనాలను ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు కేటాయించి, పక్కనే ఉన్న ఐదెకరాల్లో మూడెకరాలు 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు భవనాల నిర్మాణం, మిగతా రెండెకరాల్లో క్రీడా స్థలానికి కేటాయించనున్నట్లు తెలిపారు. మర్కూక్ మండల కేంద్రంలోని 603 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఈ పాఠశాలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కస్తూర్భా గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి.. మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీడబ్ల్యూడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ సరిత, మండల విద్యా ధికారి వెంకట్ రాములు, అధికారులు పాల్గొన్నారు. -
కారు ఢీకొట్టడంతో హమాలీ మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామానికి చెందిన నాగం నగేశ్(36) గ్రామ శివారులోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా పని చేస్తున్నాడు. డిపోకు సెలవు దినం కావడంతో పనిపై కౌడిపల్లికి తన బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వెళ్తున్న కారు వెనక నుంచి నగేశ్ బైకును అతివేగంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య పదేళ్లలోపు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ మేసీ్త్ర.. కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మేసీ్త్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అమరేందర్రెడ్డి వివరాల ప్రకారం... ఈనెల 19న కౌడిపల్లిలో జాతీయ రహదారిపై రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుడు అనీల్ స్వగ్రామం సూర్యపేట కాగా కౌడిపల్లిలో మేసీ్త్రగా కూలీపనులు చేస్తున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు. -
భారీ వాహనాల రాకపోకలు మళ్లించాలి
జిన్నారం (పటాన్చెరు): ప్రధాన రోడ్డు నుంచి కాకుండా పట్టణంలో నుంచే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గడ్డపోతారం పట్టణ కేంద్రంలోని శివాజీ చౌరస్తా నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని , పట్టణవాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. పట్టణంలోని రోడ్డును కాకుండా పారిశ్రామిక వాడకు వెళ్లే ఇతర మార్గాల నుంచి భారీ వాహనాలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రింబవళ్లు పట్టణ రోడ్ల నుంచి గృహ సముదాయాల మధ్య నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో శబ్ద, వాయుకాలుష్యంతో పాటు ఆదమరిస్తే ప్రమాదాలు జరిగే అవకా శాలు ఉన్నాయని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు భారీ వాహనాలను పారిశ్రామిక వాడకు సంబంధించిన రోడ్ల నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బడ్జెట్లో దివ్యాంగులకు అన్యాయం
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కవిత పేర్కొన్నారు. శనివారం మెదక్లో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జె ట్లో దివ్యాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో తీవ్రమైన నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం బడ్జెట్లో దివ్యాంగుల కోటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు విస్మరించిందన్నారు. సంక్షేమ రంగాన్ని విస్మరించి ప్రజా పాలన గురించి ప్రభుత్వం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, యాదగిరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆయిల్, కాపర్ చోరీ శివ్వంపేట(నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్ను చోరీ చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని శభాష్పల్లి గ్రామంలోని మంగళి పెంటయ్య వ్యవసాయ పొలం వద్దఉన్న 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్ను ఎత్తుకెళ్లారు. దీంతో బోరుబావులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంటలకు నిత్యం నీరు అందించాల్సిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం కావడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కొండపాక(గజ్వేల్): రైతులు పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. నంగునూర్ మండలంలోని నర్మేటలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న కమ్రంలో దుద్దెడలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఎక్కువ శాతం రైతులు, మొక్కజొన్న, వరి పంటను సాగు చేయటం వల్ల లాభాలు పొందడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించారని తెలిపారు. రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్పు, ఇతర సామగ్రితో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోవిందరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, నాయకులు కనకరాంలు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ిఫిల్టర్లపై దాడులు
వాహనాలు, ఇసుక డంపులు సీజ్తూప్రాన్: అక్రమంగా కొనసాగుతున్న ఇసుక ఫిల్టర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం... అక్రమంగా ఇసుక ఫిల్టర్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కిష్టాపూర్ శివార్లలో 2 ట్రాక్టర్లు, గౌడిగూడెం శివార్లలో ట్రాక్టర్, జేసీబీ యంత్రంను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే ఇసుక డంపులను గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా కృత్రిమ ఇసుక తయారు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నూతన సాగు పద్ధతులకు వేదిక
నంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి శనివారం పది జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జనగాం, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల నుంచి సుమారుగా 10 వేల మంది రైతులు హాజరయ్యారు. మహోత్సవానికి వస్తున్న రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు భోజన వసతి, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలతో పాటు యువ రైతులు వచ్చి అన్ని స్టాళ్లలో తిరుగుతూ విత్తనాలు, తేనె, కూరగాయలు, పండ్లు, పువ్వులతో తయారు చేసిన సబ్బులు, సెంటు, కొనుగోలు చేయడంతో స్టాల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యానవన, ఇరిగేషన్, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. ఆకట్టుకున్న యంత్రాలు స్టాల్లో వివిధ ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యయసాయ యంత్రాలు, మినీ వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు, స్ప్రే చేసే వాహనాలు రైతులను ఆకట్టుకున్నాయి. యంత్రం ద్వారా ఐదు మీటర్ల వరకు పురుగుల మందు పిచికారీ చేసే పని తీరును ఆసక్తిగా గమనించారు. అలాగే డ్రైవర్ లేకుండా కొత్త టెక్నాలజీతో ముందుకు, వెనకకు నడిచే ట్రాక్టర్ను చూస్తూ పని తీరును నిర్వాహకుడు న్యాలకొండ శ్రీనివాస్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నూతన వంగడాలు, కూరగాయల స్టాల్ వద్ద మహిళలు తేనె ఉత్పత్తులను పరిశీలిస్తున్న రైతులు పది జిల్లాల నుంచి 10 వేలకు పైగా హాజరు స్టాల్స్ సందర్శించి వివరాలు తెలుసుకున్న రైతులు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ రైతులను ఆకట్టుకుంది. పువ్వులు, పండ్లు, కూరగాయలతో తయారు చేసిన సబ్బులు, సెంటు, వైన్, జ్యూస్, అగరుబత్తులు, చర్మ వ్యాధులు, నొప్పుల నివారణ మందులు ప్రదర్శించారు. వీటి తయారీ విధానంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరస్వామి అవగాహన కల్పించారు. ఉత్పత్తులకు రైతులు, మహిళల నుంచి మంచి స్పందన రావడంతో కొనుగోలు చేశారు. తేనె ఉత్పత్తిపై అవగాహన అపీస్ కల్చర్ జాతీయ తేనె ఉత్పత్తి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్కు మంచి ఆదరణ లభించింది. కంపెనీ ఆధ్వర్యంలో తేనె టీగల పెంపకం, నాణ్యమైన తేనె ఉత్పత్తి విధానంపై అవగాహన కల్పించారు. రోజ్, గ్రీన్, ఆమ్లా ప్లేవర్లతో తేనె తయారు విధానాన్ని నిర్వాహకులు వివరించారు. దీంతో చాలా మంది రైతులు కొనుగోలు చేశారు. -
కేంద్రీయ విద్యాలయం పిలుస్తోంది
సంగారెడ్డి జోన్: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోటీ ప్రపంచంలో కార్పొరేట్ స్థాయిలో అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ సిలబస్ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ద్వారా అందిస్తుంది. నోటిఫికేషన్ విడుదల కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలతో పాటు రెండు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. 3, 4, 5వ తరగతులకు ఏప్రిల్ 2 వరకు, 2, 6, 7, 8, 9 తరగతులకు వచ్చే నెల 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత విద్యాలయంలో ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకటో తరగతిలో సెక్షన్కు 40 మంది చొప్పున 80 మందికి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. మిగతా తరగతులలో ఆయా తరగతుల ఖాళీల లభ్యత ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యం మొదట కేంద్ర, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు ప్రాధాన్యత కల్పిస్తారు. ఇందులో ఎస్సీ కుటుంబాల పిల్లలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27శాతం, దివ్యాంగులకు మూడు శాతం, ఇతరులకు మిగతా సీట్లు కేటాయిస్తారు. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం, వాటి మార్గదర్శకాలను అనుసరిస్తూ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో రెండు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలోని మాచ్నూర్, ఓడీఎఫ్ ఎద్దు మైలారంలో ఉంది. వీటిలో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో సీట్లకు పోటీ ఉంటుంది. అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ కలిగి ఉండటంతో ప్రాధాన్యత నెలకొంది. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో స్వీకరణ ఏప్రిల్ 2వరకు చివరి గడువు 2 నుంచి 9 తరగతులకు ప్రవేశాలు ఖాళీల ఆధారంగా భర్తీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ జారీ చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. httpr//admirrion.kvr.gov.in, htt pr//jhararanfam.kvr.ac.in వెబ్ సైట్ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల మేరకు ప్రవేశాలు 1వ తరగతితో పాటు మిగితా తరగతులలో ప్రవేశాలకు నోటిఫికేన్ విడుదలైంది. అర్హులైన వారు గడువు తేదీలను గమనించి దరఖాస్తు చేసుకోవాలి. కేవీ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తాం. సద్వినియోగం చేసుకోవాలి. –మహేశ్, కేవీ ప్రిన్సిపాల్, గ్రామం మాచ్నూర్, ఝరాసంగం -
పిచ్చుకలతో పంటలకు రక్షణ
సిద్దిపేటఎడ్యుకేషన్: పట్టణీకరణ, పారిశ్రామీకీకరణ, ఫెస్టిసైడ్స్ వాడకం తదితర పరిస్థితుల మూలంగా ప్రస్తుతం పిచ్చుకలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, వాటిని కాపాడుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. కళాశాల జంతుశాస్త్ర విభాగం, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిచ్చుకలు పంటలకు హాని కలిగించే కీటకాలను ఆహారంగా తీసుకొని, పైరును రక్షిస్తాయన్నారు. పిచ్చుకలను రక్షించుకునేందుకు వాటికి కావాల్సిన నీరు, గూడు, ఆహారాన్ని కల్పించాలని సూచించారు. పిచ్చుకలను, ప్రకృతిని కాపాడేందుకు విద్యార్థులు ముందుకు రావాలని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి కోరారు. అనంతరం కళాశాల అవరణలో చెట్లకు పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏకోక్లబ్ కన్వీనర్ డాక్టర్ మధుసూదన్రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చందంపేట గ్రామసభలో ఉద్రిక్తత
● పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు వద్దు ● గ్రామసభలో చర్చపై గ్రామస్తుల ఆగ్రహం చిన్నశంకరంపేట(మెదక్): నూతన పరిశ్రమకు అనుమతి ఇవ్వొద్దని గ్రామస్తులు తేల్చి చెప్పారు. శుక్రవారం మండలంలోని చందంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రవీణ్కుమార్, గ్రామ కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ ప్యాక్ టెక్ పరిశ్రమ అనుమతి కోసం గ్రామసభలో అభిప్రాయాలు కోరారు. గతంలో పరిశ్రమ వద్దని తీర్మానం చేశామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే పాలకవర్గం డబ్బులు తీసుకున్నదని ఎన్నికల సమయంలో ప్రచారం చేసి, ఆ పరిశ్రమ గూర్చి ఎందుకు చర్చ పెట్టారని మాజీ ఎంపీటీసీ శివకుమార్ నిలదీశాడు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటుకు తాను వందశాతం వ్యతిరేకమన్నారు. తాజాగా పరిశ్రమ యజమాన్యం ఇన్చార్జి మంత్రిని కలిసి వినతిపత్రం అందించారని, దీంతో డీపీఓ జీపీ వివరణ కోరుతూ నోటీసులు పంపించడంతో గ్రామసభలో ప్రజల అభిప్రాయం కోరినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసుకునేందుకు సిద్ధపడగా సముదాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంపై సర్పంచ్, గ్రామ కార్యదర్శి ప్రకటించి గ్రామసభను ముగించారు. -
అరెస్టులు పోరాటాలను ఆపలేవు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని ఆశ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ...సమస్యలు పరిష్కరించమంటే ఆశా వర్కర్లను అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లపై పనిభారం పెంచింది కానీ వేతనాలు మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయాలిః సాయిలు ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని ఆశా వర్కర్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆశాలకు నెలకు రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని, 20 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పీఏ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.యాదగిరి, అధ్యక్షురాలు శశికళ, యశోద, నాయకులు మంజుల, హైమావతి ప్రశాంతి, గంగా, వరలక్ష్మి, వీరమణి, నందమ్మ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సమతుల్యతకు ప్రతిబింబం బడ్జెట్
● డా.మురళీకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ సదాశివపేట (సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ సంక్షేమం అభివృద్ధి సమతుల్యతకు ప్రతిబంబమని సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పి.మురళీ కృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అర్థికాభివృద్థి, సమాన అవకాశాలు, అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా రూపొందించిన సమతుల్య బడ్జెట్ ఇది. రూ 3,24,324కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సంక్షేమం ఆర్థిక పురోగతికి సమాన ప్రాధాన్యం ఇచ్చి సమగ్ర ప్రణాళికగా నిలిచిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరుకోవడం ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధి సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. -
మంజీరాలో చేపల మృత్యువాత
● కాలుష్య జలాలే కారణం ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హత్నూర (సంగారెడ్డి): మంజీరా నదిలోని చేపలు మృత్యువాత పడ్డాయి. వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున మృతి చెందుతున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా... నక్క వాగు నుంచి వస్తున్న కాలుష్య జలాలు మంజీరా నదిలో కలవడం వల్ల నీరు కలుషితమై చేపలు మృతి చెందుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. చుట్టుపక్కల పరిశ్రమలతో పాటు పటాన్చెరు, పాషా మైలారం, ఎగువనున్న ప్రాంతం నుంచి కాలుష్య జలాలు నక్క వాగు ద్వారా రావడంతో నది జలాలు కలుషితమవుతున్నాయి. అలాగే చేపలతోపాటు మూగజీవాలు నీరు తాగి మత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చేపలు మృతి చెంది కొట్టుకుపోవడంతో పాటు ఎక్కడపడితే అక్కడ మంజీరా నదిలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. కాగా పరివాహక ప్రాంతాల ప్రజలు కాలుష్య జలాలతో పంట పొలాలు సైతం పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మంజీరా నదిలో నక్క వాగు కాలుష్య జలాలు కలవకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. -
మల్లన్నసాగర్ కాలువ గండికి మరమ్మతులు
దుబ్బాక: దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ శివారులో మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు పడిన గండికి శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. కాగా మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు భారీ గండి అనే శీర్షికన సాక్షి ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో ఇరిగేషన్ డీఈఈలు శ్రీకాంత్, హరికిషన్ గండి పడిన కాలువకు దగ్గరుండి మరమ్మతులను స్వయంగా పర్యవేక్షించారు. గండిపడిన చోట టిప్పర్లతో మట్టిని తెప్పించి నింపుతున్నారు. ఇసుక, సిమెంట్ బస్తాలతో గండిని శనివారం మధ్యాహ్నంలోపు పటిష్టంగా మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు. భారీ గండి పడటంతో రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంతో పాటు దుబ్బాక మండలంలోని పలు గ్రామాలకు నీటిని అధికారులు నిలిపివేశారు. కాలువకు గండిపడి భారీగా నీరు సమీపంలోని కుందుల చెరువులోకి చేరింది. దీంతో కాలువపై ఆధారపడ్డ రైతులు పంటలకు నీరు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. కాగా కాలువకు యాదృచ్చికంగా గండి పడలేదని, కావాలనే కొంత మంది గండి పెట్టినట్లు అనుమానాలు ఉన్నట్లు డీఈ శ్రీకాంత్ తెలిపారు. గండి పడిన సంఘటనపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటర్ విద్య బలోపేతం
● మధ్యాహ్న భోజనం అమలు నిర్ణయం హర్షణీయం ● జీజేసీపీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం(జీజేసీపీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్ను అందించడం సంతోషించాల్సిన అంశమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎంతో మంది పేద విద్యార్థుల ఆకలి తీరుతుందన్నారు. ఫలితంగా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూచంగారి శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్రెడ్డి, అమరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్స్ జ్యోతి, గంగాధర్, దేవస్వామి, శివకోటి, నాయకులు శశిధర్రెడ్డి, శ్రీనివాస్, దేవయ్య, సదానందం, మధుసూదన్రావుతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగుల్లో నిరాశ
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్ హత్నూర(సంగారెడ్డి): రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27 ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా నిరాశ పరిచిందని ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్ తెలిపారు. హత్నూరలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..గతేడాది బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో 33,043 కోట్లు (11.34%) పెరిగినప్పటికీ, తెలంగాణ ఉద్యోగులు ఎదురుచూసిన పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇతర పెండింగ్ బకాయిలు లేకపోవడం బాధాకరమన్నారు. విద్యారంగానికి రూ.26,674కోట్లు మాత్రమే కేటాయించారని ఇది బడ్జెట్లో కేవలం 8.2% మాత్రమేనని..రేవంత్ సర్కార్ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో ఈ రంగానికి కనీసం 10% నిధులు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
డీహెచ్పీ అమలు దిశగా అడుగులు
● వైద్య సిబ్బందికి శిక్షణ ● హాజరైన కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్/ సంగారెడ్డి ఎడ్యుకేషన్/ సంగారెడ్డి : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (డీహెచ్పీ) అమలుకు శ్రీకారం చుట్టగా, సంబంధిత సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రోగుల పూర్తి వైద్య వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు సంబంధించి డేటాఎంట్రీ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ...సంగారెడ్డి డివిజన్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను ప్రారంభిస్తున్నామని, జీజీహెచ్, జోగిపేట్, పటాన్చెరు ఏరియా ఆస్పత్రులు, సదాశివపేట సీహెచ్సీతోపాటు సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 పీహెచ్సీలలో సోమవారం నుంచి ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వసంతరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డాక్టర్ శశాంక్, స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అధికారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పదోతరగతి పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందు ప్రతీ హాలును క్షుణ్ణంగా పరిశీలించి చూడాలని సూచించారు. -
సింగూరుకు రూ.45.39 కోట్లు
హెచ్ఎండీఏ రేడియల్ రోడ్లకు నిధులు బడ్జెట్ ప్రసంగంలో మహిళా పెట్రోల్బంక్ల ప్రస్తావన సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు రూ.45.39 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి రూ.22 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని ఏకై క మధ్యతరహా ప్రాజెక్టుకు అత్తెసరు కేటాయింపులే దక్కాయి. సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ జంటనగరాలతోపాటు, ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం రూ.60 కోట్లతో కట్టబలోపేతం పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికల మేరకు కట్టబలోపేతం పనులు చేస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులు కూడా సాగుతున్నాయి. రూ.143 కోట్లు ఈ పనులకు మంజూరయ్యాయి. ఈ పనులకు కలిపి 2026–27 సంవత్సరానికి మొత్తం రూ.45.39 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. అలాగే ఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు నిర్వహణ, కాలువల ఆధునీకరణ పనులకు రూ.4.51 కోట్లు కేటాయించినట్లు నీటిపారుదలశాఖవర్గాలు పేర్కొంటున్నాయి. నిమ్జ్ భూసేకరణకు నిధులు జహీరాబాద్ నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, మాన్ఫ్యాక్చరింగ్ జోన్)కు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరపడం గమనార్హం. జాతీయ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఈ నిమ్జ్ భూసేకరణకు ఈ బడ్జెట్లో రూ.96.50 కోట్లు కేటాయించింది. ఈ నిమ్జ్ కోసం మొత్తం 3,245 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విడతలవారీగా భూసేకరణ ప్రక్రియ చేపట్టగా, ఇప్పటికే సుమారు 1,400 ఎకరాల భూమిని సేకరించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఈ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరపడం గమనార్హం. కాగా, గతేడాది 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ నిమ్జ్కు రూ.125.47 కోట్లు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయిలో నిధుల విడుదల జరగలేదని నిమ్జ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పెట్రోల్బంక్ ప్రత్యేక ప్రస్తావన రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా పెట్రోల్బంక్ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళా సాధికారతకు తమ ప్రజాప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన భట్టి సంగారెడ్డి బైపాస్ రోడ్డులో మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్బంక్తోపాటు, నారాయణపేటలో మహిళలు పెట్రోల్బంక్లను విజయవంతంగా నడుపుతున్నారని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు.. ఈ బడ్జెట్లో రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.1,525కోట్లు కేటాయించారు. సంగారెడ్డితోపాటు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నిర్మిస్తున్న ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుకు నిధుల కేటాయింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ పనులకు శ్రీకారం చుడతారా అనేది వేచి చూడాల్సిందే.హెచ్ఎండీకు భారీగా నిధులు ఈ బడ్జెట్లో హెచ్ఎండీఏ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో రూ.43వేల కోట్లు కేటాయించారు. సంగారెడ్డితోపాటు, ఎనిమిది మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కాగా, ఇప్పటికే హెచ్ఎండీఏ నిధులతో సంగారెడ్డి మున్సిపాలిటీలో బైపాస్రోడ్డు విస్తరణ, పట్టణంలో సీసీరోడ్లు వంటి పనులు జరుగుతున్నాయి. అలాగే ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్కు కలుపుతూ సంగారెడ్డి మీదుగా గ్రీన్ఫీల్డ్, రేడియల్రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఈ బడ్జెట్లో భారీ కేటాయింపుల నేపథ్యంలో ఈ పనులకు అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రికార్డులు మార్చేసి స్థలం కబ్జా
న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు సిద్దిపేటఅర్బన్: రికార్డులను తారుమారు చేసి అక్రమంగా తమ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని రంగాధాంపల్లికి చెందిన రైతులు ఆరోపించారు. శుక్రవారం వివాదంలో ఉన్న భూమి వద్ద విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. 65 ఏళ్లుగా తమ కుటుంబమే భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. తమ కుటుంబానికి చెందిన కొంతమంది కొన్నేళ్ల క్రితం భూమిని అమ్ముకొని వెళ్లి, ఇప్పుడు మళ్లీ స్థలం కోసం తమతో గొడవకు దిగుతున్నారని తెలిపారు. సర్వే నం.974, 975, 978, 979, 988, 1005, 1006లో సుమారు 8 ఎకరాల స్థలంలో తమ కుటుంబమే కబ్జాలో ఉందన్నారు. తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. తమ వద్ద స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, ఈ మధ్యకాలంలో తమ పేరుపై ఉన్న భూ రికార్డులను తొలగించారని అన్నారు. కొద్దిరోజుల క్రితం రియల్ ఎస్టేట్ చేస్తున్న కొంతమంది అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని, దీనిపై న్యాయ విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. -
సీఎం సభ ఏర్పాట్లపై సమీక్ష
● భద్రతా ఏర్పాట్లు చేయాలని అదనపు డీజీపీ ఆదేశం ● అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నర్మెటలో ఈనెల 22న సీఎం రేవంత్రెడ్డి ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఐజీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాళ్లను పరిశీలించి బహిరంగ సభా వేదిక, హెలీప్యాడ్, వీఐపీ పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితోపాటు పలువురు అధికారులతో ఆరా తీశారు. సీఎం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల ని అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, టాయిలెట్లు తదితర పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఆయిల్ఫెడ్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అదిరిన రైతు మహోత్సవం
నంగునూరు(సిద్దిపేట): వ్యవసాయ ఆధారిత పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవకు అనూహ్య స్పందన లభించింది. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో నిర్వహించిన రైతు మహోత్సవం ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల రైతులు తరలివచ్చి ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా చూశారు. వ్యయసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, ఇరిగేషన్, మార్కుఫెడ్, మత్స్యశాఖ, యంత్ర పరికరాలు, విత్తనాలు కలిపి మొత్తం 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆయిల్పామ్ పంటలను ఆసక్తిగా గమనిస్తూ పంట సాగు, లాభాలు, తమ ప్రాంతంలో పంట అనుకూలంగా ఉంటుందా అంటూ ఆరా తీశారు. ఆదర్శ రైతుకు సన్మానం నంగునూరు మండలం అక్కేనపల్లిలో మొదట పామాయిల్ పంట సాగు చేసి, మొట్ట మొదట నర్మేట ఫ్యాక్టరీలో అమ్మిన మహిళా రైతు భాగ్యలక్ష్మి, నాగేంద్రం లను మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. తాను ఇప్పటి వరకు రూ.13 లక్షల లాభ గడించానని చెప్పడంతో స్పందించిన తుమ్మల నాగేశ్వర్రావు.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి పంట సాగు చేయాలని చెప్పమనడంతో నవ్వులు విరిశాయి.అనూహ్య స్పందన -
మరుగున పడేశారు!
ప్రజలకు ఉపయోగపడని శౌచాలయాలు జహీరాబాద్ టౌన్: అత్యవసర సమయాల్లో ప్రజలు మల మూత్రవిసర్జనకు వీలుగా ప్రజా మరుగుదొడ్లను నిర్మించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో శౌచాలయాలు నిర్మించి వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. దీంతో పలు చోట్ల నిరుపయోగంగా మారాయి. వినియోగంలో ఉన్న చోట శుభ్రత, వసతులు కరువయ్యాయి. స్వచ్ఛభారత్ పథకం కింద పట్టణంలోని నాలుగేళ్ల క్రితం ప్రజామరుగుదొడ్లను కట్టించారు. వీటి నిర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల సభ్యులకు అప్పగించారు. జనావాసాలకు దూరంగా పట్టణ సమీపంలో బీదర్ చౌరస్తాలో నిర్మించిన మరుగుదొడ్లు వాడుకలో లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో మరుగుదొడ్లు దెబ్బతిని లక్ష్యం నీరుగారింది. దీంతో ప్రజాధనం వృథా అయింది. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న మరుగుదొడ్ల నిర్వహణ కూడా సరిగ్గాలేదు. జన సంచారం తక్కువగా ఉన్నందున మరుగుదొడ్లను ఉపయోగించుకునే వారు కరువయ్యారు. అవసరమున్న చోట అరకొర జహీరాబాద్ పట్టణంలో 1.25 లక్షల జనాభా ఉండగా..పట్టణానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రతీరోజు సుమారు 25 వేలమంది వస్తుంటారు. ప్రధాన రహదారులు, వీధులు ప్రజలతో కిక్కిరిపోతుంది. రోడ్ల ప్రక్కన సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమున్న చోట అరకొర..జన సంచారం లేని ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించారని విమర్శలు వస్తున్నాయి. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని టాయిలెట్లు కట్టాలని కోరుతున్నారు. -
వేప.. కనిపించని పూత
నర్సాపూర్: వేప చెట్లకు చీడ తగ్గినా పూర్తి స్థాయిలో పూత పూయలేదు. సుమారు ఏడాది క్రితం వేప చెట్లకు చీడ పట్టడం మొదలైంది. వేప చెట్లు ఎండిపోవడానికి ఫోమాప్సిస్ అజాడిరక్టె అనే ఫంగస్ కారణమని, దీనిని డైబ్యాక్ వ్యాధి అంటారని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాగా, వేప చెట్టుకు ఆయూర్వేదంలో సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు. అలాగే.. వ్యవసాయంలో పలు రకాల పంటలకు పట్టె చీడను వదిలించేందుకు వేప ఆకులు, గింజలతో తయారు చేసే కషాయం వాడి చీడను వదిలించే అవకాశం ఉండగా.. అలాంటి వేపకు చీడ పట్టడం గమనార్హం. సుమారు ఏడాది క్రితం నుంచి వేప చెట్లకు చీడ పట్టి వాటి ఆకులకు తెల్లటి చుక్కలాంటి మచ్చలు ఏర్పడడంతో పాటు ఆకులు ఎండిపోయి రాలిపోయాయి. ఆకులన్ని రాలిపోవడంతో దశాబ్దాల నాటి వయస్సున్న వేప చెట్లు సైతం ఆకులు రాలి కొమ్మలుగా మారి ఎండుముఖం పట్టాయి. ఇటీవల వేప చెట్లకు చీడ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆకులు చిగురించి చెట్లు నిండుగా కన్పిస్తున్నప్పటికి కొన్ని కొమ్మల ఆకులు ఎండుముఖంతోనే ఉన్నాయి. కాగా, వేప చెట్లకు చీడ పట్టి ఎండిపోయి ఇటీవల చిగురిస్తున్నా. చాలా చెట్లకు పువ్వు పూయ లేదు. -
నాణ్యమైన విత్తనాలు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కూరగాయల పంటలను స్టాల్లో ఏర్పాటు చేశారు. అలాగే వాటి నుంచి సేకరించిన విత్తనాలను తక్కువ ధరకు అమ్మారు. యంత్రాల పనితీరుపై.. స్టాల్లో వివిధ కంపెనీల అందిస్తున్న అధునాతన యంత్రాలు, ట్రాక్టర్లు, రొటోవేటర్లు, పిచికారీ యంత్రాలను ప్రదర్శించారు. డ్రిప్, స్పీంక్లర్ల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో ఆయా కంపెనీల ప్రతినిఽధులు రైతులకు వివరించారు. ఆకట్టుకున్న విదేశీ కోళ్లు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దేశవాళి ఆవులు, గేదెలు, గొర్రెలు, విదేశీ కోళ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. పేడతో జీవామృతం, బీజామృతం, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో వివరించారు. ఆయిల్పామ్ సాగు.. ఆయిల్ఫెడ్ అధికారులు ఆయిల్పామ్ మొక్కలు, గెలలు, గింజలు, వాటి నుంచి వచ్చిన నూనె, పిప్పిని స్టాల్లో ప్రదర్శించారు. తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి క్రూడ్ ఆయిల్ను సేకరించి విజయ బ్రాండ్ పేరిట నూనె ప్యాకెట్లు తయారు చేస్తామని రైతులకు వివరించారు. అలాగే ఆయిల్ తీసిన తరువాత వచ్చిన పిప్పితో ఫ్యాక్టరీకి అవసరమయ్యే విద్యుత్ను ఏలా ఉత్పత్తి చేస్తారో వివరించారు. -
బడ్జెట్లో సింగూరుకు ఎన్ని?
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు పటిష్టతకు మరమ్మతు పనులు ప్రారంభంకావడంతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు ఏ మేరకు కేటాయిస్తారోనని నీటిపారుదల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు జాతీయ భద్రత అధికారుల సూచనమేరకు డ్యామ్ మట్టికట్ట లోపలి భాగంలో రాతికట్ట (రివిట్మెంట్)పనులను చేపట్టారు. తొలుత 800 మీటర్ల మేరకు మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించి రూ.16 కోట్లను కేటాయించారు. ఐతే పనులు చేపట్టడానికి నీరు అడ్డంకిగా మారడంతో నీటిని దిగువకు వదిలిపెట్టారు. తాగునీటికి ఈ వేసవిలో సరిపోను నీరుంచి మిగతా నీటిని వదిలిపెట్టారు. నీటిని దిగువకు వదిలిపెట్టడం, పైగా ప్రాజెక్టు ఆయకట్టుకు పంట విరామం ప్రకటించడంతో డ్యామ్ రాతికట్ట మొత్తం మరమ్మతు చేయాలని నిర్ణయించారు. దీంతో మరమ్మతుల అంచనావ్యయం పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి ప్రత్యేక చొరవ మంత్రి దామోదర నియోజకవర్గంలోనే సింగూరు డ్యామ్ ఉండటంతో ప్రాజెక్టు పనులపై ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 వేల ఎకరాలకు సాగునీటి కాలువలు మంజూరు చేయించారు. దశాబ్దం నుంచి రైతులకు సాగునీరు పారిస్తున్న కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువల్లో పూడిక నుంచి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహ పంటకాలువలకు సిమెంట్ లైనింగ్ చేయించాలని రూ.180 కోట్లను మంజూరు చేయించారు. సిమెంట్ లైనింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. డ్యామ్ రాతికట్ట రివిట్మెంట్ పనులు, పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు ఏకకాలంలో ప్రారంభం కావడంతో ఎక్కువగా నిధులు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖకు పంపించారు. మంత్రుల ప్రత్యేక సమీక్ష సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డ్యామ్ మిషన్ భగీరథ, సాగునీటి అంశాలతో కూడుకున్నది కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.పెద్దారెడ్డిపేట లిఫ్టుకు అంకురార్పణ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నందున ఎగువభాగంలోని ఖాదిరాబాద్, రేగోడ్, వట్పల్లి, టేక్మాల్ ప్రాంతాలలోని రైతులకు సాగునీరు అందిచాలని సంకల్పించి పెద్దారెడ్డిపేట వద్ద లిఫ్టును ఏర్పాటుకు సంకల్పించారు. ఈ లిఫ్టు సర్వే కోసం ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపులుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తారని ఆశిస్తున్నారు. -
పైసా వసూల్!
వికారాబాద్: సీఎం సొంత జిల్లాలో అవినీతి వ్యవస్థీకృతం అయ్యిందనే వాదన వినిపిస్తోంది. కీలక శాఖల్లో విధులు నిర్వహించే మెజార్టీ అధికారులు లంచావతారమెత్తుతున్నారు. తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో కలెక్టరేట్లో విధులు నిర్వహించే ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కి ఆరు నెలలు తిరక్కుండానే అదే రెవెన్యూ శాఖలో చేరి మరోసారి పట్టుబడింది. తాజాగా పెద్దేముల్ ఆర్ఐ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. గతంలో ఎస్పీ కార్యాలయంలో ఓ డీఎస్పీ, తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. పెద్దేముల్ ఆర్ఐ హైదరాబాద్లో ఓ రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. అయితే అధికారుల తీరు దొరికితే దొంగ లేకుంటే దొర అన్న చందంగా తయారైంది. ప్రధానంగా రెవెన్యూ ఖాఖలో ఆర్ఐలు మొదలుకుని డీటీలు, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారుల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ఫైలు కదలాలన్నా..? నివేదిక ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఏదైనా పని పడితే కింది స్థాయి ఉద్యోగులను కూడా వదలడం లేదు. వారి రిపోర్టు ఇవ్వటానికి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, భూ భారతి ఆపరేట్లర్లు, సర్వేయర్లు ఇలా ప్రతి ఒక్కరూ అదే దారిలో నడుస్తున్నారు. నేతల అండదండలు అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి పోస్టింగులు వేయించుకొని ఆయా ప్రాంతాలకు వస్తున్న అధికారులు ఆ తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారు. నేతల అండదండలున్నాయనే ధైర్యంతో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయడం లేదు. కొంతమంది పర్యవేక్షణాధికారులు కింది స్థాయి అధికారుల అవినీతిలో భాగస్వాములు అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు ఏసీబీ అధికారుల నిఘాలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పనికీ డబ్బు డిమాండ్ చేస్తున్న అధికారులు మెజారిటీ శాఖల్లో..ఆరు నెలల క్రితం కలెక్టరేట్లోని ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఎనిమిది నెలల క్రితం పోలీసు శాఖలో పనిచేసే ఎస్ఐ, అతని డ్రైవర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 11 నెలల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులపై కేసులు నమోదయ్యాయి. -
అలరించిన కుస్తీ పోటీలు
ఉగాది ఉత్సవాల నేపథ్యంలో కల్హేర్ మండలం మార్డి, సిర్గాపూర్లో గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలకు చెందిన మల్ల యోధులు తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఎన్నం విజయలక్ష్మి, శ్రీనివాస్రావు, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు, నాయకులు కల్యాణ్రావు పాటీల్, రవీందర్రెడ్డి, జితేందర్రెడ్డి పాల్గొన్నారు. –కల్హేర్(నారాయణఖేడ్) -
చండీ రుద్రయాగానికి పదేళ్లు పూర్తి
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రాఘవాపూర్– హుమ్నాపూర్ గ్రామ శివారులోని పంచవటి క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరకాల చంఢీరుద్ర మహాయాగానికి పదేళ్లు పూర్తయ్యాయి. లోక కల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పంచవటి క్షేత్రం పీఠాధిపతి శ్రీ కాశీనాథ్బాబా పుష్కరకాల శత చండీరుద్ర మహాయాగానికి శ్రీకారం చుట్టారు. లోక కల్యాణార్థం 8 ఏప్రిల్ 2016లో ప్రారంభమైన ఈ మహాయాగం 2028లో పూర్తి కానుంది. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం క్షేత్ర ఆవరణలో నిర్వహించే యాగంలో ఇద్దరు చొప్పున దంపతులు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 7,168 మంది దంపతులు యాగంలో పాల్గొన్నారు. పదేళ్లు పూర్తయిన సందర్భంగా క్షేత్రంలో వెలసిన దేవతలకు గురువారం కాశీనాథ్బాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పంటలు పండక ప్రజలు దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంటే వారి క్షేమం కోసం ఈ యాగాన్ని 36లక్షల సంవత్సరాల క్రితం సాధువులు, శౌనకాది మహా మునులు నిర్వహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయన్నారు. -
ఉగాది పచ్చడి వితరణ
వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు, తీపి ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఆనందోత్సాహాలు, కష్టసుఖాలు కలబోతే జీవితమని వాటన్నింటినీ సమదృష్టితో స్వీకరించేందుకు ప్రతీకగా ఈ ఉగాది పచ్చడిని తాగుతారు. గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పలు ఆలయాల్లో పచ్చడి వితరణ నిర్వహించారు. ఐబీ గెస్ట్ హౌస్ దగ్గర హిందూవాహిని ఆధ్వర్యంలో వాహనదారులకు పచ్చడిని అందించారు. అనంతరం ఒకరికొకరు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్య
కల్హేర్(నారాయణఖేడ్): పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. సిర్గాపూర్ మండలం వాసర్లో రూ.200 కోట్లతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల సముదాయ నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఈ పాఠశాల సముదాయంలో అత్యాధునిక హంగులతో వసతులు, క్రీడా మైదానాలు ఏర్పాటు అవుతన్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఎంఈఓ నాగరం శ్రీనివాస్, నాయకులు రమేశ్ చౌహన్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి -
ఆయురారోగ్యాలతో ఉండాలి
మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి రామచంద్రాపురం (పటాన్చెరు): పరాభవనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని రాష్ట్ర శాసన మండలి మాజీప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి ఆకాంక్షించారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాతరామచంద్రాపురం హనుమాన్ ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా గురువారం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి మాజీప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, బి.పుష్ప, బీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్టినేటర్ వి.ఆదర్శ్రెడ్డి, నాయకులు కుమార్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, దిలీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠాలు పూర్తికాలేదు
జహీరాబాద్ టౌన్: నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన పాఠ్యాంశాలు కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో పూర్తికాలేదు. ఉపాధ్యాయుల కొరత వల్ల సిలబస్ పూర్తికాకపోవడంతో పాఠ్యాంశాల వర్క్షీట్లు అలాగే మిగిలిపోయాయి. దీంతో సగం పూర్తయిన సిలబస్తోనే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. సర్కారు పాఠశాలల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొన్నిచోట్లయితే అసలు రికార్డుల నిర్వహణనే చేపట్టలేదు. కొన్ని బడుల్లోనైతే పిల్లల దాహార్తిని తీర్చేందుకు కనీసం మంచినీటి వసతులు కూడా లేవు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా మధ్యాహ్నా భోజనం పథకం సరిగ్గా అమలు కావడం లేదు. మరికొన్ని చోట్ల అమలవుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతలోపిస్తోంది. కొన్ని పాఠశాలలకు ప్రహారీగోడల్లేక పశువులు లోపలికి వచ్చేస్తున్నాయి. అవును ఇవన్నీ పసిపిల్లల ‘సాక్షి’గా పచ్చినిజాలు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తనిఖీల బృందం ఇచ్చిన నివేదికలో విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. వంద పాఠశాలల్లో తనిఖీ సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న వ్యవస్థకు అదనంగా ప్రత్యేక బృందాలను నియమించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భోజనం, వసతుల కల్పన, ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలను ఈ బృందాల్లోని సభ్యులు పరిశీలించారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలు జిల్లాలోని వంద పాఠశాలలను తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. బృందాల పనితీరు ఇలా.. జిల్లాలో 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యూపీఎస్, ప్రాథమిక పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం బడులకు వేర్వేరుగా బృందాలను నియమించారు. ఒక్కో టీమ్లో ముగ్గురు టీచర్లుండగా ప్రతీ బృందంలో మొదటివ్యక్తి నోడల్ అధికారిగా మిగిలిన ఇద్దరు సభ్యులు కొనసాగారు. టీమ్ సభ్యులు పాఠశాలలను సందర్శించి విద్యా ప్రగతిని అంచనా వేశారు. ప్రతీ మూడు నెలల్లో ఒక్కో టీమ్ ప్రాథమిక, ప్రాథమికోన్నతస్థాయిలో వంద పాఠశాలలు, ఉన్నత పాఠశాలస్థాయిలో 50 స్కూళ్లను తనిఖీ చేశారు. ప్రత్యేక బృందం సభ్యులు ప్రతీరోజు రెండు చొప్పున పాఠశాలలను తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. పాఠశాలలకు బృందం సభ్యులు వంద పాఠశాలల తనిఖీలు విజయవంతంగా పూర్తి చేసినందుకు బృందం సభ్యులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ మేరకు తనిఖీలు పూర్తిచేసి తయారు చేసిన నివేదికలను సభ్యులు మండల విద్యాధికారులకు సమర్పించారు. అయితే తనిఖీకి నియమితులైన టీచర్లు మంగళవారం నుంచి యథావిధిగా పాఠశాల విధులకు హాజరయ్యారు. ● ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులసంఖ్య పెంచి వాటిని బలోపేతం చేయడం ● నిరంతర సమగ్ర మూల్యాంకన సాధన ● ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఎల్ఎన్, ఉన్నత పాఠశాలస్థాయిలో ఎల్ఐపీ ప్రణాళిక అమలు ● విద్యా ప్రమాణాల పెంపుదల, టెక్ట్స్బుక్, వర్క్షాపులతో విద్యార్థులకు అభ్యాసన ● క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి పరిష్కారం ● సలహాలు సూచనలివ్వడం, పాఠశాల రికార్డుల పరిశీలన తాగునీటి వసతులు కరువు బడుల్లో లోపించిన పారిశుద్ధ్యం తనిఖీల నివేదికలో వెల్లడి! ప్రభుత్వానికి అందజేత నోడల్ అధికారి ప్రదీప్ కుమార్, సభ్యుడు వహబోద్దీన్తో కలిసి డిసెంబర్ నుంచి ఇప్పటివరకు వంద పాఠశాలలను తనిఖీ చేశాం. తనిఖీల సందర్భంగా ఉపాధ్యాయులు కూడా పూర్తి సహకారం అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు పూర్తి చేసి మనూర్ మండల విద్యాధికారికి నివేదికలను అందజేశాం. –నిమ్మల కిష్టయ్య, బృందం సభ్యులు -
రూ.10 వేల కోట్లు కేటాయించాలి
సదాశివపేట(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో గురువారం సదాశివపేటలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సింగూర్, మంజీర ప్రాజెక్టులకు నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి కాల్వల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గంగకత్వ, నారింజ, నల్లవాగు, మల్కాపూర్ చెరువులకు నిధులు కేటాయించి కాలుష్యం బారినపడిన నక్కవాగు, మంజీర జలాలను శుద్ధి చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో వందపడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించి, పారిశ్రామికవాడల్లో కనీస మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించడం కోసం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తారా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గుర్తింపు కోసం కృషి చేయాలని, అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని, రాజీవ్ గృహకల్ప పెండింగ్ ఇళ్లను పూర్తి చేయాలని, మున్సిపాలిటీల్లో పార్కులు, ఇండోర్ స్టేడియాలను అభివృద్ధి చేయలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశం, ఎం.నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, నర్సింహులు, కృష్ణ, రమేశ్ పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలి సింగూర్, మంజీర ప్రాజెక్టులకు నిధులివ్వాలి మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీపీఎం -
తెలంగాణ సాహిత్య శిఖరం.. సిధారెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఐదు దశాబ్దాలుగా సాహితీ రంగంలో అలుపెరుగని సేవచేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖగా నిలిచాడని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్కుమార్రెడ్డి అన్నారు. విశ్రాంత అధ్యాపకులు సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సోమవారం కళాశాల తెలుగు విభాగం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిధారెడ్డి సిద్దిపేట గడ్డకు గర్వకారణమన్నారు. సాంస్కృతిక వారసత్వపు బిడ్డగా, కవిగా, రచయితగా, పరిశోధకుడిగా అనేక సేవలను అందించారన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన అనిమేష కవితా సంపుటికి పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. అధ్యాపకులు పిట్లదాసు, నారోజు వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ జీవితాన్ని అక్షరీకరించిన కలానికి దక్కిన గౌరవమని కొనియాడారు. సిధారెడ్డికి అభినందనలు : జిల్లా కవులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం గర్వకారణమని, జిల్లా కవులు సోమవారం పేర్కొన్నారు. అవార్డుకు ఎంపికవ్వడంపై సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్, మంజీర రచయితల సంఘం, శ్రీవాణి సాహిత్య పరిషత్, సుగుణ సాహితీ సమితి, అక్షర సేద్యం ఫౌండేషన్, సిద్దిపేట రచయితల సంఘాలకు చెందిన కవులతో పాటు వివిధ కవులు నందిని సిధారెడ్డికి అభినందనలు తెలిపారు.సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖ -
మందుబాబులకు జరిమాన
సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో తదితర చోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి ఒకరికి రూ.1500, ఆరు మందికి రూ.1000 చొప్పున జరిమాన విధించారు. నిందితుడికి 20 ఏళ్ల జైలుమెదక్ కలెక్టరేట్: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అటెండర్కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని రేగోడ్ మండలంలో ఓ పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న సారా జైపాల్(25) అదే పాఠశాలలో చదువుతున్న చిన్నారిపై 2019 జూన్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు. అప్పుల బాధతోరైతు ఆత్మహత్యదుబ్బాకరూరల్: అప్పులు తీర్చలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్ల దేవిరెడ్డి(70) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నేళ్ల నుంచి దేవిరెడ్డికి అతని సోదరుల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఏడాది క్రితం దేవిరెడ్డి అప్పులు చేసి తన కుమారుడి వివాహం చేశాడు. అయితే అప్పులు తీర్చడానికి భూమిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కాగా భూమి విషయంలో గొడవల కారణంగా వివాదం పరిష్కారం కాలేదు. ఇటు వివాదం పరిష్కారం కాక, చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. -
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెంకటాపూర్(ఆర్) గ్రామంలో వీరవేంకట సత్యనారాయణస్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా గ్రామ పురోహితుడు బాపుశర్మ, మనోజ్శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీకుమార్, ఉపసర్పంచ్ మౌనిక, నాయకులు భాస్కర్రెడ్డి, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి
సిద్దిపేటరూరల్: కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ములుగు మండలం కొక్కొండ గ్రామంలో నాయీబ్రాహ్మణుల బొందల గడ్డను కబ్జా చేస్తూ కులం పేరుతో దూషించారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ ఏఓకు ఆ సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు యాద నరేందర్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణుల బొందలగడ్డను కబ్జాను అడ్డుకుంటే కులంపేరుతో దూషిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మల్లేశ్, రవి, ఆంజనేయులు, నరేశ్, నవీన్, క్రాంతికుమార్, వినోద తదితరులు పాల్గొన్నారు. డీఎల్పీఓ విచారణ శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని గూడూర్ గ్రామ పంచాయతీలో సోమవారం డీఎల్పీఓ యాదయ్య విచారణ చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందిన వార్డు సభ్యుడు గొల్ల యాదయ్యపై ఓడిపోయిన అభ్యర్థి శ్రీకాంత్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. కాగా సివిల్ కాంట్రాక్టర్గా యాదయ్య పోటీ చేయడం ఎన్నికల నిబంధలనకు వ్యతిరేకమన్న ఫిర్యాదు మేరకు సోమవారం డీఎల్పీఓ గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి నివేదిక జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, ఎంపీఓ తిరుపతిరెడ్డి ఉన్నారు. గాలికుంటు టీకాలు వేయించాలిజిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య కౌడిపల్లి(నర్సాపూర్): పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. సోమవారం మండలంలోని తునికిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి తగ్గి రైతులకు ఆర్థికంగా నష్టం వస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, లైవ్స్టాక్ అసిస్టెంట్ రామకృష్ణ, వైద్యసిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. గ్యాస్ కొరతను పరిష్కరించాలి గజ్వేల్రూరల్: యుద్ధం సాకుతో గ్యాస్ ధరలు పెంచవద్దని, ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణ, రాజేశం మాట్లాడుతూ యుద్ధం వల్ల మన దేశంలో ఆయిల్ కొరత ఏర్పడటంతో గ్యాస్కు ఇబ్బంది జరుగుతున్నట్లు ప్రభుత్వమే చెబుతున్నదన్నారు. గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్రమోడీ అమెరికాపై ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీను, చంద్రం, శంకరయ్య, నర్సింలు, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని మహిళకు గాయాలు నిజాంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నార్లాపూర్ గ్రామానికి చెందిన గాళం సంతోషకు కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రాథమిక చికిత్సచేసి అంబులెన్స్లో సిద్దిపేటకు తరలించారు. -
తెలంగాణ మట్టి సాహిత్యానికి పురస్కారం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేషకు కేంద్ర సాహిత్య పురస్కారం వరించడం అంటే తెలంగాణ మట్టి సాహిత్యానికి వరించిన పురస్కారం లాంటిదని, మంజీర రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రంగాచారి, సిద్దంకి యాదగిరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంజీర రచయితల సంఘం సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ‘‘అనిమేష’’ కావ్యం సమకాలీన భావజాలాన్ని ప్రతిబింబిస్తూ మానవ అనుభూతులను లోతుగా ఆవిష్కరించిన ప్రాముఖ్యమైన కృతి అన్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహత్తర సాహితీవేత్త అని పేర్కొన్నారు. సంఘం సభ్యులు తోట అశోక్, భగవాన్ రెడ్డి, పప్పుల రాజిరెడ్డి, పొన్నాల బాలయ్య, పాపయ్య, కొమురవెల్లి అంజయ్య, రాజు, అలాజ్ పూర్ శ్రీనివాస్, తైదల అంజయ్య, తిరుపతిరెడ్డి, బుచ్చి రాజ్యం రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాలో బర్డ్ఫ్లూ లేదు..
పాపన్నపేట(మెదక్): మండలంలో గుర్తు తెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య స్పందించారు. ఈ మేరకు లింగాయపల్లికి తమ సిబ్బంది వెళ్లి విచారణ జరిపినట్లు తెలిపారు. ఒక షెడ్డులో సుమారు వెయ్యి కోళ్లు చనిపోగా ,మిగతా వాటిని కంపెనీ వారు తీసుకెళ్లారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదన్నారు. అయితే చనిపోయిన కోళ్లకు పరీక్షలు జరిపారా? అని ప్రశ్నించగా ఇక్కడ అలాంటి అవకాశం లేదని, వాటి అవశేషాలను బెంగళూర్ పంపాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి పరీక్షలు జరపకుండానే బర్డ్ ఫ్లూ లేదని చెప్పడం అనుమానాలకు దారి తీస్తుంది. ఇతర గ్రామాల్లో కూడా కోళ్లు చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా కొక్కెర వ్యాధితో కోళ్లు చనిపోయి ఉండొచ్చన్నారు. వేసవిలో కోళ్ల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుబ్రత పాటించాలని కోరారు. కొక్కెర వ్యాధితో చనిపోయి ఉండవచ్చు జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య -
దుబ్బాక ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మహిళకు సోమవారం అరుదైన ఆపరేషన్ చేశారు. వివరాలు ఇలా... కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన రత్నగారి లత సంవత్సరం నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తగ్గకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె దుబ్బాక ఆస్పత్రికి వెళ్లింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను సూపరింటెండెంట్, డాక్టర్ హేమరాజ్సింగ్ పరీక్షించి కడుపులో మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. రక్తం తక్కువగా ఉండటంతో 3 యూనిట్ల రక్తం ఎక్కించి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి కడుపులోంచి 7.1కిలోల గడ్డలను తొలగించారు. ప్రస్తుతం లత ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాణాలు కాపాడిన డా.హేమరాజ్ సింగ్, వైద్యులు రాఘవేందర్ ,శ్రేయ, సనందను అభినందించారు. -
పాతాళం
జలం..అడుగంటుతున్న భూగర్భ జలాలు చిన్న శంకరంపేట మండలంలోనిచందాపూర్లో ఓ రైతుబోరు జిల్లాలో సగటున 10.67 మీటర్ల లోతులో గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్లపైనప్రతీనెల మీటరున్నర పడిపోతున్న వైనంనార్సింగి మండలంలో అత్యధికంగా 19 మీటర్ల లోతుకు.. జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. కాగా మెతుకు సీమలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో నూటికి 95 శాతం రైతులు బోరుబావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. ఈ యాసంగిలో 2.75 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 2.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కేవలం 22 వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. కాగా వరి పంటకు నిత్యం నీటి తడులు పెట్టాల్సి ఉంటుంది. దీంతో నిరంతరం బోరుబావులు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజురోజుకు పాతాళానికి పడిపోతున్నాయి. జనవరిలో 9.36 మీటర్ల లోతులో ఉండగా ఫిబ్రవరిలో 10.67 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్కన 1.31 లోతుకు పడిపోయాయి. జిల్లాలోని శివ్వంపేట మండలంలో 7.33 మీటర్లలో ఉండగా పాపన్నపేట మండలంలో 7.87 మీటర్ల లోతులో ఉన్నాయి. కాగా నార్సింగి మండలంలో మాత్రం అత్యధికంగా 19.28 మీటర్లలోతుకు పడిపోయి ప్రమాద స్థాయికి చేరుకుంది. చేగుంట, హవేళిఘనాపూర్ మండలాల్లో 8 మీటర్ల లోతులో ఉండగా మెదక్, టేక్మాల్, వెల్దుర్తి మండలాల్లో మాత్రం 9 మీటర్ల లోతులో నీరు ఉంది. జిల్లాలో భూగర్భజలాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ మున్సిపాలిటీ ప్రాంతంలోని పిల్లికొటాల్ శివారులో కేవలం 3.60 మీటర్ల లోతులోనే ఉండటం గమనార్హం. అలాగే హవేళిఘనాపూర్ మండలం కూచన్పల్లి గ్రామ శివారులో 4.5 మీటర్లలోతులో ఉండగా అత్యధిక లోతులో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో శివారులో ఏకంగా 25.24 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే.. కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడు భూగర్భ జలాలు కాస్త మెరుగనే చెప్పాలి. 2025 ఫిబ్రవరిలో 13.25 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం 10.67 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్ల పైనే భూగర్భజలాలు ఉన్నాయి.మెదక్లో పైన.. తూప్రాన్లో అడుగున!మండుతున్న ఎండలు ఒకవైపు, నిరంతరం బోరు మోటార్లు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోతున్నాయి మరోవైపు. ప్రతి నెల సగటున మీటరున్నర లోతుకు వెళ్తున్నాయి. ఏప్రిల్, మేలో మరింత దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సగటున ఫిబ్రవరికి సంబంధించి 10.67 మీటర్ల లోతులో ఉన్నాయి. కానీ గతేడాదితో పోలిస్తే మాత్రం 2 మీటర్ల పైన ఉన్నటు లెక్కలు చెబుతున్నాయి. మెదక్జోన్: -
అదుపుతప్పి ఆటో బోల్తా
శివ్వంపేట(నర్సాపూర్): అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ సంఘటన తూప్రాన్– నర్సాపూర్ హైవేపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... తూప్రాన్ నుంచి నర్సాపూర్కు ఐస్క్రీమ్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ ఆటో అదుపుతప్పి కుడివైపునకు వెళ్లి రాజన్నవాగు బ్రిడ్జిపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు రాకపోడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రెవర్తో పాటు ఆటోలో మరో వ్యక్తి ఉన్నా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బ్రిడ్జిపై బోల్తాపడటంతో ఇతర వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లెలగడ్డలో పాలవ్యాన్.. హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో సోమవారం పాలవ్యాన్ బోల్తా పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం... సిద్దిపేట నుంచి హుజురాబాద్కు వెళ్తున్న పాల వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అందులో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు కావడంతో వారిని ప్రైవేటు వాహనంలో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
చేర్యాల(సిద్దిపేట): మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శభాష్గూడెంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, కొమురవెల్లి పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఉల్లంపల్లి గణేశ్(29) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన అతడు పని చేయగా వచ్చిన డబ్బులు మొత్తం మద్యానికి ఖర్చు చేస్తుండటంతో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్ సోమవారం బావి వద్ద ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో.. జిన్నారం (పటాన్చెరు): భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... గుమ్మడిదలకు చెందిన పోచగారి రాజిరెడ్డి (43) యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన కవితతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప సంతానం. కాగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తతో గొడవపడిన కవిత సొంతూరుకు వెళ్లింది. మనస్తాపం చెందిన భర్త సంజీవరెడ్డి సోమవారం స్థానిక బావి వద్ద విద్యుత్ హైటెన్షన్ స్తంభానికి చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
బలవంతపు వసూళ్లు చేయొద్దు
పాపన్నపేట(మెదక్): ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ట్రాన్స్జెండర్లు..మండల వాసులతో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్జెండర్లు అంటే అందరికీ సానుభూతి, గౌరవం ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలతో మమేకమై, హుందాగా బతుకాలని పిలుపునిచ్చారు. సీఐ జార్జ్ మాట్లాడుతూ.. శుభకార్యాలకు వచ్చే ట్రాన్స్ జెండర్లు ఇష్టంతో ఇచ్చే డబ్బులను సంతోషంగా స్వీకరించాలని చెప్పారు. అనవసరంగా శాపాలు పెడుతూ, ఇబ్బంది పెట్టొద్దన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో భాగమమేనన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి వివాహాలు చేస్తుంటే, వారి నుంచి బలవంతంగా వసూళ్లు చేయడం తగదన్నారు. ట్రాన్స్జెండర్స్ జిల్లా ప్రతినిధి అంజలి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు కూడా మనుషులేనన్నారు. వారి పట్ల సమాజంలోని కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు బాధగా ఉంటుందన్నారు. తాము కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిందని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ హేమభార్గవి అన్నారు. ట్రాన్స్జెండర్ల వేధింపులపై తమకు తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ట్రాన్స్జెండర్లకు డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచన -
మొగులు.. గుబులు
భయపెడుతున్న అకాల వర్షాలు ● వాతావరణ మార్పులతో రైతుల్లో కలవరం ● పాలు పోసుకునే దశలో వరిచేలుజహీరాబాద్లో..కన్సాన్పల్లిలో కురిసిన వడగళ్లు దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి గాలిదుమారంతో పాటు చిరు జల్లులు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వడగళ్లు పడుతాయన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, బీర్నీస్, కూరగాయ, మామిడి తోటలకు భారీగా నష్టం ఏర్పడింది. ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. అందోల్, జహీరాబాద్లో వడగళ్లు వట్పల్లి(అందోల్)/జహీరాబాద్టౌన్: అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి, రాంసాన్పల్లి, నేరడిగుంట తదితర గ్రామాల్లో జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వడగళ్ల వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ కాచి సాయంత్రానికి వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఇంటి వాకిలిలో పడ్డ వడగండ్లను కొంతమంది ఏరుకుని తిన్నారు. నీళ్లు ఇంకిన బోరుబావులకు, వాడిపోతున్న వరి పంటకు ఈ వర్షం మేలు చేకూర్చగా..ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఇక వడగళ్ల వానకు మామిడి కాత నేలరాలింది. గత 15 రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ఆయా గ్రామాల ప్రజానీకానికి ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఖేడ్లో ఈదురుగాలులతో వర్షం నారాయణఖేడ్:ఖేడ్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. కురిసిన వర్షం మనూరులో 24.2 మి.మీలు, సిర్గాపూర్లో1.8, ఖేడ్, నాగల్గిద్దలో 0.8 మి.మీల చొప్పున, కంగ్జిలో 0.4 మి.మీలుగా నమోదైంది. బలంగా వీచిన ఈదురు గాలులకు సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ తండా పంచాయతీ పరిధి లోని వాలునాయక్ తండాలో శంకర్కు సంబంధించిన రేకుల ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో కుటుంబీకులు నిరాశ్రయులయ్యారు. సర్పంచ్ రుక్మిణిపూల్సింగ్, పంచాయతీ కార్యదర్శి రఫీక్ ఇంటిని సందర్శించారు. నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందించేలా కృషి చేస్తామని సర్పంచ్ హామీనిచ్చారు. గాలులకు ఖేడ్ డివిజన్ పరిధిలోని పలుచోట్ల మామిడి కాయలు రాలిపడటంతో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.పొట్టకొచ్చిన వరి జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో ఈయాసంగిలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇందులో 3.53 లక్షల ఎకరాల్లో వరిని వేశారు. జిల్లాలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు వరి సాగు చేశారు. రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆద్యంతం.. భక్తి పారవశ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు ఈ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు అగ్నిగుండాలను దాటారు. స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7.15 గంటలకు వీరభద్ర ప్రస్థానం, భద్రకాళి పూజ, 9 గంటలకు బియ్యం సుంకు పట్టుట. 12 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం.. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమం శివశంకర శివాచార్య మహాస్వామి సేడం పీఠాధీశుల ఆధ్వర్యంలో కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓలు సుదర్శనం, బుద్ధి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం
రూ.47 కోట్లువసూలైందిరూ.111 కోట్లుసంగారెడ్డి జోన్: జిల్లాలోని మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు మరో 16 రోజులు మాత్రమే గడువు మిగిలిఉంది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 50% మాత్రమే పన్ను వసూలైంది. సమయం తక్కువగా ఉండటంతో ఆ శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూళ్లు వేగిరం చేస్తున్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో అంతలోపు పన్ను వసూళ్లు 100% పూర్తవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాదికిగాను రూ.111.55 కోట్ల మేర వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సోమవారం వరకు జిల్లావ్యాప్తంగా రూ.47.04లక్షలు మాత్రమే వసూలైంది. గడ్డపోతారం మున్సిపాలిటీలో అత్యధికంగా వసూలు కాగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో అతి తక్కువగా పన్ను వసూలైంది. ఐదు మున్సిపాలిటీలలో 50% వసూలు కాగా మిగతా 6 మున్సిపాలిటీలలో సగం కూడా పూర్తి కాలేదు. ఇంటి పన్నుతోపాటు నీటి, వృత్తి వ్యాపార పన్ను వసూళ్లలో వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఇంటింటికి తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను చెల్లించిన వారికి అక్కడే రశీదును అందిస్తున్నారు. ఇక పన్ను చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించాలనుకునేవారికి http://cdma.telanga na.gov.in వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు. వసూలైన పన్ను మొత్తాన్ని ఏరోజుకారోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి వివిధ రకాల నిధులు మంజూరు చేస్తుంటాయి. వీటితోపాటు స్థానిక వనరులతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వివిధ రకాల పేర్లతో వసూలైన పన్నులతో ఆయా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తిరిగి ఖర్చు చేస్తుంటారు. -
ఉద్యమాలను ఆపలేరు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావుపటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా జయప్రదం కోసం వెళ్తున్న సీఐటీయూ నాయకులను, అంగన్వాడీ టీచర్ల హెల్పర్లను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ...అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రశాంతంగా చలో హైదరాబాద్కు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చినా అరెస్టు చేయడం దారుణమన్నారు. బడ్జెట్ సమావేశాలలో ఐసీడీఎస్ పరిరక్షణ కోసం తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, విజయలక్ష్మి, అనిత, రాణి, లక్ష్మి, గాయత్రి, అక్షద, కృష్ణవేణి, స్వరూప, మందాకిణి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని శిశు మందిర్ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయఅవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, ధర ప్రమాణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. వస్తువులో నాణ్యత లోపించినప్పుడు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహగౌడ్, కూనవేణు గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణిలో 57 అర్జీలు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి 57 అర్జీలు వచ్చినట్లు అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి హాజరైన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పాండు ఆదేశించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ ఉమాహారతి తదితరులు పాల్గొన్నారు. ఖేడ్లో ఇఫ్తార్ విందునారాయణఖేడ్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఖేడ్లో ప్రభుత్వపరంగా ముస్లింలకు రెహమాన్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్రెడ్డి, తహశీల్దార్ హసీనాబేగమ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రషీద్, తాహెర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముంతాజ్, నాయకులు వినోద్పాటిల్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజు, సుబూర్, మహేశ్, లక్ష్మణ్, నాయకులు పండరీరెడ్డి, మైనొద్దీన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామాలయ ఉత్సవ కమిటీ నియామకంజిన్నారం(పటాన్చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో రానున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రకటించారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా ఎర్రంతగారి ఆంజనేయులు యాదవ్, సభ్యులుగా చేరికారి గోవర్ధన్రెడ్డి, గోకర్ వెంకటేశంగౌడ్, లక్ష్మీ సంజీవ, అర్చకులు లక్ష్మణాచార్యులు నియామకమయ్యారు. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్ తన నివాసంలో ఉత్సవ కమిటీ నియామక పత్రాన్ని చైర్మన్కు అందజేశారు. నూతన కమిటీని ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, పుట్టా నర్సింగరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాతృమూర్తికి హరీశ్రావు పరామర్శపటాన్చెరు: కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఎమ్మెల్యే గూడెం మహి పాల్రెడ్డి మాతృమూర్తి గూడెం మాణెమ్మని సోమ వారం ఉదయం మాజీమంత్రి హరీశ్రావు పరామర్శించారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హరీశ్రావుతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యేతోపాటు వారి కుటుంబ సభ్యులకు హరీశ్రావు సూచించారు. -
రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామీణ పేద ప్రజల పొట్ట కొట్టే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎంపీడీఓ లక్ష్మికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత 20 ఏళ్లుగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దీంతో కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
అన్నదాతకు భరోసా
● 22 నుంచి పెట్టుబడి సాయం ● మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమా రు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. -
నమ్మించి బంగారు గొలుసు తస్కరణ
చిలప్చెడ్(నర్సాపూర్): వృద్ధులను నమ్మించిన ఓ దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. ఈఘటన మండలంలోని చిట్కుల్ శివారులో జరిగింది. ఎస్ఐ నర్సింహులు కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన గాజం హిమగిరి, భర్త సుధాకర్ దంపతులు దుండిగల్లో వారి కూతురితో కలిసి ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక గుర్తు తెలియని వ్యక్తి వారికి పరిచయమై ఆయన కారులో వారిని మండలంలోని చాముండేశ్వరి ఆలయానికి తీసుకువచ్చాడు. దర్శనం అనంతరం ఎనగండ్ల రహదారి వైపు తీసుకెళ్లి హిమగిరి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని కారుతో పారరయ్యాడు. ఈ విషయమై బాధితులు ఎస్ఐకి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు. -
కూల్.. కూల్
మట్టి కుండ..ఎన్నో ప్రయోజనాలు మట్టి కుండలోని నీరు, ఆహారం శ్రేయస్కరమైనది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి జీవికి ఆహారం అందించేది నేల తల్లి. అలాంటి నేలతల్లి నుంచి సేకరించిన మట్టితో తయారుచేసిన కుండలకు ఆయుష్ను సైతం పెంచే శక్తి ఉంది. ఒకవైపు వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో మట్టికుండలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం వివాహాలు బోనాలు, వ్రతాలు, కార్యాలయాలు, ఆలయాల్లో వాడకం కోసం కుండల వాడకం పెరుగుతుంది. చిన్న కుండ రూ. 200 నుంచి 300, పచ్చడి కుండ రూ. 150 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజు 20 నుంచి 30 కుండలపైగా అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సంగారెడ్డి క్రైమ్/ హత్నుర(సంగారెడ్డి): మట్టి కుండలకు రాను రాను డిమాండ్ పెరుగుతోంది. అనాదిగా మనిషి జీవన విధానంతో ముడిపడిన కుండలను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయడం ఆనాయితీగా వస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చల్లదనం ఇచ్చే కుండను జనం కొనుగోలు చేస్తారు. ఇలా కొనే కుండలను ఉగాది కొత్త కుండ అని పిలుచుకుంటారు. పచ్చడితో పాటు పాలు, పెరుగు పెట్టుకోవడం కోసం ఏడాది మొత్తం ఉపయోగించుకుంటారు. ఇన్నిరకాల వంట పాత్రలు వచ్చినప్పటికీ తిరిగి ప్రాచీన కాలం నాటి మట్టి పాత్రలకే ప్రస్తుతం గిరాకీ పెరిగింది. రోడ్ల పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తయారుచేసిన మట్టి పాత్రను సైతం జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి విక్రయిస్తున్నారు. వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. మట్టి కుండలో నీరు తాగడం మట్టి పాత్రలో వంట చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మట్టి పాత్రలకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోయింది.ఉగాది పచ్చడితో మొదలు.. వేసవి మొత్తం వాడకం పెరుగుతున్న విక్రయాలు -
● రైతుల ‘యాప్’సోపాలు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని రుద్రారంలో ఆదివారం యారియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో యూరియా వచ్చిందని తెలుసుకొని బుక్ చేసుకునే లోపే యాప్ బుకింగ్ క్లోజ్ అయిందని రైతులు వాపోయారు. కళ్లముదు యూరియా ఉన్న ఇతర గ్రామాల వారు వచ్చి తీసుకెళ్తున్నారని, తమకు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుకోవాలని కోరారు. దీంతో పోలీస్లు గ్రామానికి చేరుకుని రైతులను సముదాయించారు. ఏఓ ప్రవీణ్తో మాట్లాడి విషయం వివరించగా.. సోమవారం గ్రామ రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
ఇసుక టిప్పర్ సీజ్
పాపన్నపేట(మెదక్): అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేసి, పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం మెదక్ నుంచి బొడ్మట్పల్లి వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ డ్రైవర్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యంత్రానికి నిర్లక్ష్యపు తుప్పు శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల్లో ఏర్పా టు చేసిన ప్యాడీ క్లీనర్ భద్రపరచకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పు పట్టి పోతుంది. కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు ధాన్యాన్ని జల్లడ పట్టేందుకు దీనిని ఉపయోగిస్తారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన అనంతరం భద్రపరచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యంత్రం పనికిరాకుండా పోతుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ నర్సాపూర్ రూరల్: స్థల వివాదంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడిన సంఘటన మండలంలోని రుస్తుంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సర్పంచ్ వర్ష భర్త సుదీప్కుమార్కు గాయాలైనట్లు తెలిసింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మినీ బస్టాండ్ మంజూరు చేయండి
కొండపాక(గజ్వేల్): మండలంలోని చిన్నకిష్టాపూర్ క్రాస్ వద్ద మినీ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ఎంపీ కోటాలో నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం బీజేపీ నాయకులు ఎంపీ రఘనందన్రావుకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ త్వరలో నిధులు మంజూరు చేసి పనుల ప్రారంభానికి వస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుముల సంపత్రెడ్డి, తన్నీరు యాదగిరి, రెడ్డమైన పర్శ రాములు, సదానందగౌడ్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వేలాది కోళ్లు మృత్యువాత! చుక్కలనంటుతున్న చికెన్ ధరలు పాపన్నపేట(మెదక్): మండలంలో నెల రోజులుగా గుర్తుతెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. దీంతో కోళ్ల ఫాంలు వెలవెలబోతున్నాయి. మండలంలో సుమారు 50 వరకు కోళ్ల ఫాంలు ఉన్నాయి. లింగాయపల్లి శివారులోని ఓ ఫాంలో నెల రోజుల క్రితం వేలాది కోళ్లు మృతి చెందినట్లు తెలిసింది. అలాగే పాపన్నపేటలో కూడా వందల సంఖ్యలో కోడి పిల్లలు మృత్యువాత పడ్డట్లు సమాచారం. దీంతో మండలంలోని కోళ్లఫాం యజమానులు సంబంధిత కంపెనీల నుంచి కోడి పిల్లలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ఇదే సమయంలో రోజు రోజుకు చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. స్కిన్లెస్ కిలోకు రూ. 340, స్కిన్తో కలిపి కిలో రూ.320కి అమ్ముతున్నారు. ఇదే విషయమై జిల్లా పశువైధ్యాధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ల్యాబ్కు పంపడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తామని చెప్పారు. లారీ ఢీకొని యువకుడి మృతి మరొకరి పరిస్థితి విషమం మనోహరాబాద్(తూప్రాన్): ఓవర్టేక్ చేసే క్రమంలో కంటైనర్ వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. తూప్రాన్ మండలం ఇమాంపురానికి చెందిన అల్లా డి నిఖిల్ (20) మండలంలోని లింగారెడ్డిపేట్కు చెందిన మన్నె స్వామి ఇద్దరు స్నేహితులు. ఆదివారం ఉప్పల్లో పరీక్ష రాయడానికి బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో దండుపల్లి వద్దకు రాగానే వెనకాల వేగంగా వచ్చిన కంటైనర్ వీరి ఢీకొట్టింది. ఈఘటనలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మేడ్చల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. రుస్తుంపేట టర్నింగ్ వద్ద..నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై రంజిత్రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బ్యాతోల్ గ్రామానికి చెందిన కొండిగళ్ల జంగయ్య (45) బైక్పై నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం రుస్తుంపేట టర్నింగ్ వద్ద జంగయ్య ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మరొకరు..సంగారెడ్డి టౌన్: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్కు చెందిన చింతల సురేశ్ (25) వెల్నెస్ సెంటర్లో టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టాఫ్ రూమ్లో పడుకున్న సురేశ్ నిద్ర లేవకపోవడంతో సిబ్బంది కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరూ రాకుండానే ఎలా తరలిస్తారని కుటుంబీకులు, ఆందోళన చేపట్టారు. -
నేటి బాలలే రేపటి పౌరులు
రామాయంపేట(మెదక్): శిశు మందిరాలు మన సంస్కృతికి నిలయాలని వీహెచ్పీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యంజీ పేర్కొన్నారు. పట్టణంలోని అశోక్ సింఘాల్ శిశుమందిర్ పాఠశాల నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. విశ్వభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంయేజక్ హరిస్మరణ్రెడ్డి మాట్లాడుతూ.. అమ్మ ఒడి, చదువుల బడి, దేవుని గుడి బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. మన పిల్లలకు చిన్ననాటి నుంచే మంచి సంస్కారాలు నేర్పిస్తే వారిలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందుతుందని అన్నారు. శిశుమందిర్ సంస్థాపకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో లోపం వల్లే దేశంలో నేరాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల నృత్యాలు, దేశభక్తి గేయాల ఆలాపన ఆకట్టుకున్నాయి. వీహెచ్పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నరసింహామూర్తి, జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, పాఠశాల ప్రధానాచార్యులు కవిత, ఇతర ప్రతినిధులు సంగమేశ్వర్, పండరినాధ్, రమణ తదితరులు పాల్గొన్నారు.వీహెచ్పీ తెలంగాణ, ఏపీ కార్యదర్శి సత్యంజీ -
లింగమూర్తికి ఎక్సలెంట్ అవార్డు
చేగుంట(తూప్రాన్): ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించినందుకు గాను చేగుంటకు చెందిన లింగమూర్తి లయన్స్ ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అవార్డు అందుకున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. గజ్వేల్లోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం లయన్స్ సిద్దిపేట రీజియన్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లింగమూర్తికి అవార్డును మెదక్ ఎంపీ రఘునందన్రావుతో పాటు లయన్స్ ప్రతినిధులు సంజయ్గుప్తా, బాబూరావు, అమర్నాథ్రావు, విజయలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. -
మూల్యాంకనంలో తప్పులొద్దు
సిద్దిపేటఎడ్యుకేషన్: తప్పులు లేకుండా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని డీఐఈఓ రవీందర్రెడ్డి అన్నారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఆదివారం ప్రారంభం అయింది. ఈసందర్భంగా ఎగ్జామినర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూల్యాంకన కేంద్రం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, ఇంటర్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అధ్యాపకులు సమయపాలన తప్పని సరిగా పాటించాలని, విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు చీప్ ఎగ్జామినర్ల వద్ద ఉంచాలని, తప్పనిసరి అయితే తప్ప వాడరాదన్నారు. కొత్తగా మూల్యాంకనం చేసేవారు మొహమాట పడకుండా సీనియర్స్ వద్ద అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. బోర్డు అబ్జర్వర్ విజయ్శేఖర్ మాట్లాడుతూ.. ఓవర్, అండర్ వాల్యుయేషన్ లేకుండా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మూల్యాంకనం చేయాలన్నారు. కార్యక్రమంలో క్యాంపు అధికారులు సత్యనారాయణరెడ్డి, చెన్నోజు శ్రీనివాస్, సీసీఓ కూచంగారి శ్రీనివాస్, ఏసీఓలు దేవస్వామి, శివకోటి, లలిత, విషయనిపుణులు శశిధర్రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.డీఐఈఓ రవీందర్రెడ్డి -
కొమురవెల్లి అభివృద్ధికి మాస్టర్ప్లాన్
● త్వరలోనే చర్యలు చేపడతాం ● మంత్రి కొండా సురేఖ వెల్లడికొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం మంత్రి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బండగుట్టపై నిర్మించిన 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. -
నేటి నుంచి ఒంటిపూట బడులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంన్యాల్కల్ (జహీరాబాద్): ఎండల తీవ్రత అధికమవుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో ఫ్యాన్లు పాడైపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి వదిలి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఎండల నుంచి కొంత మేర ఉపశమనం లభించింది. -
బీసీలను ఓటు బ్యాంక్గా చూస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటుందని, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హైదరాబాద్ కోకాపేట్లోని ఆదివారం హరీశ్రావు నివాసంలో పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, పటాన్చెరు మండల ఇన్చార్జ్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ...ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతీగతీలేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారని విమర్శించారు. బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతామని తెలిపా రు. పార్టీలో చేరిన వారిలో మల్లేశ్గౌడ్, ధనుంజయ్గౌడ్, పవన్గౌడ్, చరణ్గౌడ్, నక్క వికాస్గౌడ్, కాసా వినయ్గౌడ్, పట్లోళ్ల తిరుపతిరెడ్డిలున్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ పెద్దపీట జిన్నారం (పటాన్చెరు): మైనార్టీలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత కేసీఆర్దేనని మాజీమంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. బొల్లారం డివిజన్ పరిధిలో మాజీ జెడ్పీటీసీ కొలను బాల్రెడ్డి ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని మైనార్టీలకు మాటలే తప్ప చేసిందేమీ లేదన్నారు. మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా టమ్రేస్ పాఠశాలలు ఏర్పాటుచేసినట్లు గుర్తు చేశారు. అనంతరం మైనార్టీలతో కలిసి ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబిపూర్రాజు, పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జెడ్పీమాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు గడిల శ్రీకాంత్గౌడ్, వెంకటేశంగౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
భళా.. హస్తకళ మేళా
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026సంగారెడ్డిలోని టీటీడీ కల్యాణ మండపంలో కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన చేనేత హస్తకళ మేళాకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేళాలో కొండపల్లి, వేటికొప్పాక బొమ్మలు, నిర్మల్ హైదరాబాద్ మంచి ముత్యాలు, మైసూర్ రోజ్వుడ్, సహారన్ పూర్ ఫుడ్ కార్వింగ్, వరంగల్ చెవర్, జూట్ బ్యాగులు, బంజారా ఎంబ్రాయిడరీ, బెంగాల్ జ్యూరీ బ్యాక్స్లు ప్రదర్శనకు ఉంచారు. వీటితోపాటు పోచంపల్లి, నారాయణపేట, వరంగల్, ఉప్పాడ, కంది, ధర్మవరం, సిద్దిపేట, పొందూరు, వెంకటగిరి, మంగళగిరి చీరలు, చేనేత కాటన్, పట్టువస్త్రాలు, టవల్స్, చేనేత దుప్పట్లు, కర్టెన్లు, ఖాదీ మెటీరియల్స్ కూడా అమ్మకానికి ఉంచారు. –సంగారెడ్డి -
పాలన సదా ‘మామూలే’
● షాపుల ముందు పార్కింగ్ స్థలాలు కరువు ● పట్టణంలో సెట్ బ్యాక్లకు మంగళం ● రోడ్లను అక్రమించి అక్రమ కట్టడాలు వ్యాపారాలు అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. టీఎస్–బీపాస్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే వారికి నోటీసులు జారీ చేస్తాం. –మున్సిపల్ కమిషనర్ శివాజీ అధికారుల తీరుతో టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తంఏళ్లు గడుస్తున్నా సదాశివపేట మున్సిపాలిటీ తీరు మాత్రం మారడం లేదు. ఏళ్లుగా అవినీతి అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ యంత్రాంగం కాసుల వేటలో నిమగ్నమై ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తోంది. అక్రమ కట్టడాలకు అడ్డు లేకుండా పోవడంతోపాటు వాటిని నిర్మిస్తున్న యజమానుల నుంచి మూమూళ్లు కూడా వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో పట్టణంలో భవన నిర్మాణాలు గతంలో ఎన్నడూలేని విధంగా అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇష్టారాజ్యంగా అదనపు అంతస్థులు నిర్మిస్తున్నారు. పలుకుబడి ఉన్న వారి కట్టడాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతులు ఒకదానికి తీసుకుంటూ నిర్మాణాలు మరోవిధంగా చేపడుతున్నారు. చాలామంది పార్కింగ్లకు స్టెల్లార్లను వదిలి వేయకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టి అద్దెలకిస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 14,214 గృహాలు ఉండగా అనధికారికంగా మాత్రం వాటికి రెట్టింపుస్థాయిలో ఉన్నట్లు సమాచారం. ప్రధాన వ్యాపార కూడళ్లు సిద్ధాపూర్గౌని, సుభాష్రోడ్డు, శాసీ్త్రరోడ్డు, బుక్కకేరీ, పిట్టలకేరీ, సిద్దాపూర్రోడ్డు, ఎస్బీఐ బ్యాంకు నుంచి అయ్యప్ప మందిరం వరకు ఇరువైపులారోడ్డు, మురుగునీటి కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో షాపుల ముందు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయడం పరిపాటిగా మారింది. అయినా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఆంతర్యం అంతుచిక్కడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ కళ్లముందే నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన భవన యజమానులు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేసి వ్యాపారాలు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల కూడళ్లలోనే అనేక అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలు సెట్ బ్యాకులకు మంగళం పాడుతూ నిర్మాణాలు జరుగుతున్నాయి. అస్తవ్యస్తంగా టౌన్ప్లానింగ్ మున్సిపల్ అధికారుల తీరుతో టౌన్ప్లానింగ్ అస్తవ్యస్థంగా తయారైంది. దీనింతటికీ ప్రధాన కారణం టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వం అవినీతి అక్రమాలే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులు పొంది నిర్మాణాలు చేసిన భవనాలను పరిశీలిస్తే టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. సెట్బ్యాకుల సమస్యతోపాటు టౌన్లో లే అవుట్లు లేకుండా ఏర్పడిన సిద్దాపూర్ కాలనీ, సుందరయ్యనగర్, గంజీ వెనుక హనుమాన్గర్, సాయినగర్, శ్రీరాంనగర్, కాలనీల్లో అక్రమార్కులు అంతర్గత రోడ్లను సైతం ఆక్రమిస్తున్నారంటే అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. -
జహీరాబాద్ మార్కెట్కు ధనియాలు
జహీరాబాద్ టౌన్: పెద్ద పంటలతో నష్టపోతున్న రైతులకు చిన్న పంటలు ఆసరా అవుతున్నాయి. స్వల్పకాలంలోనే చేతికందుతూ గట్టెక్కిస్తున్నాయి. చిన్న పంటల్లో ప్రధానమైంది సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన ధనియాలు రైతులను ఆదుకుంటుంది. వంద రోజుల పంట అయిన ధనియాల సీజన్ కావడంతో జహీరాబాద్ మార్కెట్కు అమ్మకానికి రైతులు తీసుకొస్తున్నారు. పట్టణంలోని సుభాష్గంజ్ మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రారంభంలో క్వింటాల్కు నాణ్యతను బట్టి రూ.10 వేల పలికింది. మార్కెట్లో ధరలు రోజుకు మారుతుంటాయి. పెద్ద మొత్తంలో పంట రావడంతో ప్రస్తుతం ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధనియాలు సుమారు. రూ.6 వేల క్వింటాల్ పలుకుతుంది. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలిగీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ సంగారెడ్డి టౌన్: గీతకార్మికుల సమస్యలు పరిష్కరించాలని గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ డిమాండ్ చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.5000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్గౌడ్, రవీందర్గౌడ్, మల్లేశంగౌడ్, యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంనారాయణఖేడ్: అన్నివర్గాల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ కలిసి ఆయన ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. అనంతరం జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్లో డివిజన్ పరిధి లోని 228 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మనూరు మండలం మాయికోడ్, రాణాపూర్ గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలు, నాగల్గిద్ద మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనంతోపాటు పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు ఎమ్మె ల్యే శంఖుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమా ల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభు త్వం అన్నిమతాలు, సాంప్రదాయాలను గౌరవి స్తూ అందరికీ సంక్షేమ పథకాలను చేరు వ చేస్తోందన్నారు. మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, డ్వాక్రా రుణాలను సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. వేప పువ్వు గగనమేనా!జహీరాబాద్ టౌన్: తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా తయారు చేసే ఉగాది పచ్చడిలో ఎన్నో ప్రత్యేకతలుంటాయి. షడ్రుచుల సమ్మేళనంగా ఉండే పచ్చడిలో తీపి, ఒగరు, చేదు రుచులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పచ్చడిలో చేదు రుచి రావాలంటే అందులో కచ్చితంగా వేప పువ్వు వాడాల్సిందే. ఉగాది పండుగ ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది పండుగకు వేప పువ్వు కొరత ఏర్పడింది. వేప చెటున్నా పువ్వు మాత్రం కనిపించడం లేదు. ఈ ఏడాది వేపాకులు ఎండి రాలిపోయాయి. రెండు మూడేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండగా ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఫంగస్, తెగుళ్ల వల్ల వేపాకులు ఎండిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఆకులు చిగురించి పూర్వస్థితికి వసుండగా..పూత మాత్రం రావడం లేదు. పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల ఒక్క వేప చెట్టుకు మాత్రం పువ్వు నిండుగా వచ్చింది. -
కొట్టుకున్న డ్వాక్రా మహిళలు
జోగిపేట(అందోల్): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదని డ్వాక్రా సంఘం మహిళలు కొట్టుకున్నారు. వివరాలు ఇలా... జోగిపేటకు చెందిన లక్ష్మినర్సింహ డ్వాక్రా గ్రూపునకు చెందిన మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేర రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మళ్లీశ్వరి కూడా రుణం తీసుకొని ఆమె అత్త వెంకమ్మకు ఇవ్వగా వాడుకొని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్ చేశారు. దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంకమ్మకు గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మళ్లీశ్వరి, అనిత మాత్రమే డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు. వాయిదాలు చెల్లించలేదనే.. -
దేవుడా ఇందుకిలా చేశావు?
కొడుకు శవంపై పడి రోదిస్తున్న యాదమ్మమెదక్జోన్: కొడుకా నిన్నపుట్టిన రోజు జరు పుకొని.. ఇవాలా చనిపోయావా.. దేవుడా ఇందుకిలా చేశావని మహిళ రోదించింది. రోడ్డు ప్రమాదంలో భర్త, కొడుకు, అల్లుడు చనిపోవడంతో.. ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కంట తడిపెట్టించింది. హవేళిఘనాపూర్ మండలం భూర ్గుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి అమృత్గౌడ్(50),యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి కూతురుని ఇదే మండలం బొగుడభూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయాగౌడ్(32)కు ఇచ్చి పెళ్లి చేశారు. రెండో కూతురు బానును కొల్చారం మండలం రంగంపేటకు సాయిరాంగౌడ్కు ఇచ్చి వివాహం చేశారు. మూడో సంతానం రిషివర్ధన్గౌడ్(14)ను గ్రామంలో చదివించుకుంటూ కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండో కూతురు కొడుకు తొట్టెల కార్యక్రమానికి బైక్పై వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో అమృత్గౌడ్(50) తోపాటు తన కొడుకు రిషివర్ధన్గౌడ్(14), అల్లుడు సాయాగౌడ్ దుర్మరణం చెందారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మార్చురీ వద్ద తన కొడుకు మృతదేహంపై పడి యాదమ్మ రోదించిన తీరు అక్కడ ఉన్నవాళ్లను కంటతడి పెట్టించింది. ఈనెల 13న ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజున ప్రమాదంలో దుర్మరణం చెందటంతో ఆమె బోరున విలపించింది. ప్రమాదంలో కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకు, అల్లుడు ముగ్గురు చనిపోగా రెండు కుంటుబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. మృతుడు సాయాగౌడ్కు భార్యతో పాటు 6 ఏళ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు. రోడ్డు ప్రమాదంలోభర్త, కొడుకు, అల్లుడు దుర్మరణం రోదించిన కుటుంబ సభ్యులు మెదక్ జిల్లాలోఘటన -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
గజ్వేల్రూరల్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం గజ్వేల్లో వెలుగుచూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని గిరిపల్లి గ్రామానికి చెందిన నెమటూరి చిన్నమల్లయ్య(41)కు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. చిన్న మల్లయ్య ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన ఆరు నెలల క్రితం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గజ్వేల్ పట్టణంలోని సత్యసాయి నగర్లో ఓ అద్దె ఇంట్లో ఉరివేసుకున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా ఫ్యాన్ కొండికి చున్నీతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబీకులతో గొడవపడి యువకుడు .. హవేళిఘణాపూర్(మెదక్): యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ప్రమోద్(26) హైదరాబాద్లో నివాసముంటున్నాడు. భార్యతో గొడవపడిన ప్రమోద్ శుక్రవారం స్వగ్రామం ముత్తాయికోటకు వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి
పెద్దశంకరంపేట(మెదక్): చేపల వేటకు వెళ్లిన జాలరి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిఽధిలోని జూకల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బేస్త బేతయ్య రెండో కుమారుడు బేస్త లక్ష్మణ్(25) రోజు మాదిరిగానే చేపల వేట కోసం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ పరిధిలోని ఎల్లమ్మరాళ్లపాయ ప్రాంతానికి తెప్పల సహాయంతో శుక్రవారం తన సోదరులు బేస్త సంగమేశ్వర్, బేస్త దత్తులతో కలిసి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఈతగాళ్ల సహాయంతో వెతికినా ఫలితం లేదు. కాగా శనివారం నీటిలో అతడి మృతదేహం లభ్యమైంది. చేపల వేటకు ఉపయోగించే వల అతడికి చిక్కుకోవడంతో ఊపరాడక మృతి చెందినట్లు భావిస్తున్నారు. విద్యుత్లైన్ మరమ్మతులు చేస్తుండగా.. గజ్వేల్రూరల్: విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మర్కూక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన నీరుడి బాబు(35) మీటర్ రీడర్గా పనిచేస్తున్నాడు. శనివారం శ్రీగిరిపల్లిలో విద్యుత్ లైన్కు సంబంధించిన మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురై గాయపడ్డాడు. స్థానికులు ప్రమాదస్థలం నుంచి గాయపడిన బాబును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే గతంలో సైతం ఇలాంటి ఘటనే జరిగిందని స్థానికులు ఆరోపించారు. -
హలీం తయారీ విధానం
హలీం తయారీ చాలా శ్రమతో కూడుకున్నది. హలీమ్ తయారీలో మటన్, చికెన్, పప్పులు, గోధుమలు, నెయ్యి, పిస్తా, బాదం, మిరియాలు, లవంగాలు, యాలకులు, ఎన్నో రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. దాదాపు 10 గంటల నుంచి 12 గంటల పాటు మాంసాన్ని బట్టిలో ఉడికిస్తారు. 20 నుంచి 30 మంది చెఫ్లు హలీం తయా రీలో శ్రమిస్తారు. చెఫ్ల పనిని బట్టి నెలకు రూ.లక్ష నుంచి 2 లక్షలు జీతం అందిస్తారు. ఉపవాస దీక్షలో ఉన్న వారు ఈ వంటకం తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. హలీం సర్వ్ చేస్తున్న సిబ్బంది -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. టిప్పర్ ఢీకొని విద్యార్థి.. పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... హైదరాబాద్ ఎరగ్రడ్డ ఆనందనగర్కు చెందిన సుకేశ్(19) రూట్స్ అకాడమీలో యానిమేషన్ డిప్లొమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఐఐటీ హైదరాబాద్లో జరుగుతున్న ఈ – సమ్మిట్కు తన స్నేహితుడు రజనీకాంత్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రుద్రారం గ్రామ శివారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే టిప్పర్ డ్రైవర్ శ్యామ్ అతివేగంగా నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనం నడుపుతున్న సుకేశ్ కింద పడిపోగా అతని పైనుంచి టిప్పర్ చక్రం ఎక్కింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రజినీకాంత్ కింద పడిపోవడంతో అతని కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైకులు ఢీకొని యువకుడి.. పాపన్నపేట(మెదక్): రెండు బైకులు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నార్సింగి శివారులోని దారిదేవుని గుడి వద్ద శనివారం జరిగింది. బాధిత వర్గాల కథనం ప్రకారం.. మండల పరిధిలోని యూసుఫ్పేటకు చెందిన తుడుం నాని (21), అర్కెల లడ్డు ద్విచక్ర వాహనంపై నార్సింగి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సై శ్రీనివాస్ గౌడ్ను వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. బైక్ అదుపుతప్పి ఒకరు.. మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన మల్లెపూల నాగరాజు (24) నెల రోజుల క్రితం సికింద్రాబాద్, పార్శిగుట్టలో భార్య శిరీషతో కలిసి అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి ఇంట్లో భార్యతో గొడవ జరిగింది. దీంతో ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి బయలు దేరాడు. కాగా మార్గమధ్యలో మనోహరాబాద్ మండలం రామాయపల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి–44పై బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. కాగా మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అక్రమ సిలిండర్లు స్వాధీనం
రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న గృహవసర గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాల్రాజు, మండల ఆర్ఐ గోపి, తమ సిబ్బందితో శనివారం సాయంత్రం హోటళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ రజని తెలిపారు. గృహవసర సిలిండర్లను ఇతర అవసరాలకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానంజిన్నారం (పటాన్చెరు): జిన్నారం పట్టణ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ కవిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2026– 27 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాలకు సంబంధించి మే 3న పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఈనెల 16 నుంచి వచ్చేనెల 15 తేదీ వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.200 ఉంటుందని, ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాజానికి దిశానిర్దేశం చేసేది కవిత్వమేప్రముఖ కవి, రచయిత పవన్కుమార్ సిద్దిపేటకమాన్: సమాజంలో నెలకొన్న అసమానతలు, రుగ్మతలను రూపుమాపి దిశానిర్దేశం చేసేది కవిత్వమేనని ప్రముఖ కవి, రచయిత పవన్కుమార్ అన్నారు. వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సమాజంలో వర్తమాన, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నీ కవుల రచనలో ప్రస్ఫుటించాలని కోరారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో అశోకరాజు, మహిపాల్, మహేందర్, విజయ, ఉమారాణి, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మద్దూరు(హుస్నాబాద్): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎస్ఐ మహ్మద్ అసీఫ్ తెలిపిన వివరాల ప్రకారం... దూల్మిట్ట మండల కేంద్రంలోని మోయతుమ్మెద వాగు నుంచి సుద్దాల బాబు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దాడులు నిర్వహించి ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. జూదరుల అరెస్ట్ పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని పొడిచన్పల్లి తండా శివారులో శనివారం జూదం ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద నుంచి 10 ఫోన్లు, రూ.20,040 స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించగా జూదం ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారులపై కేసు
చిన్నకోడూరు(సిద్దిపేట): కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు కుమారులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ చంద్రమోహన్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి, రామవ్వ వృద్ధ దంపతులకు రాజిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. వృద్ధ దంపతులకు ఉన్న ఏడెకరాల భూమిని కూడా ఇద్దరు కుమారుల పేరున చేయించారు. వయస్సు మీద పడటంతో తమను పట్టించుకోవడం లేదని కుమారులను ప్రశ్నించగా దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్ఐ వారి గ్రామానికి వెళ్లి వృద్ధ దంపతులతో మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు. -
ఉద్యాన సాగుకు ప్రోత్సాహం
● కూరగాయల సాగుపై ప్రభుత్వం దృష్టి ● రైతులకు ఉచితంగా కూరగాయలకిట్ల పంపిణీ ● జిల్లాకు 3,420 కిట్లు మంజూరుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రభుత్వం రైతులను ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించేందుకు కృషి చేస్తోంది. కూరగాయల పంటలు సాగు చేసేందుకు ముందుకొచ్చే అన్నదాతలకు కూరగాయలు, ఆకు కూరల కిట్లను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి కిట్లను పంపిణీ చేస్తోంది. ఉద్యాన పంటలను తక్కువ నీటితో సాగు చేసే అవకాశంతో పాటు కొంత పెట్టుబడి పెడితే నిత్యం లాభాలను ఆర్జించవచ్చు. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉండటంతో మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం జిల్లాలో చాలా రకాల కూరగాయలు సాగవుతుండగా, మరికొన్ని రకాల కోసం ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తీగ జాతి కూరగాయల సాగును పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ఉచితంగా కూరగాయల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉచిత కిట్లలో ప్రాధాన్యం వీటికే.. జిల్లాకు ప్రభుత్వం 3,420 కిట్లను మంజూరు చేసింది. ఉచిత కిట్లలో ప్రధానంగా తోటకూర, పాలకూర, టమాటా, చిక్కుడు, బీరకు చెందిన విత్తనాలు ఉన్నాయి. వీటిని బెంగలూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇవి ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంతో అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంది. పాలకూర, తోటకూర 25, చిక్కుడు, బీర 40 రోజులు, టమాట 50 రోజులకు దిగుబడి రానుంది. రైతులకు ఉపాధి ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుంది. రైతులకు మేలైన కూరగాయలు, ఆకుకూరల విత్తనాల కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. దీంతో రైతులకు ఉపాధి దొరుకుతుంది. – అబ్దుల్ రషీద్, ఉద్యాన రైతు, ఇశ్రితాబాద్ రైతులను ప్రోత్సహించేందుకే... ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత కూరగాయల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించి కిట్లను పంపిణీ చేస్తున్నాం. రైతులకు ఉపాధి కల్పించి, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. – సతీశ్, ఉద్యానవన విస్తరణ అధికారి, సదాశివపేట -
స్తంభాన్ని ఢీకొట్టి..
జహీరాబాద్ టౌన్: బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... కర్నాటక రాష్ట్రంలోని కరకనెల్లి గ్రామానికి చెందిన ఎస్.చంద్రప్ప(47) బైక్పై జహీరాబాద్కు వస్తున్నాడు. వేగంతో వస్తున్న బైక్ అదుపుతప్పి మార్గమధ్యలో మండలంలోని మల్చెల్మ గ్రామంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో తలకు త్రీవంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సంగారెడ్డి టౌన్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం... ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ శివారులోని నక్క వాగులో అనుమానాస్పదంగా వ్యక్తి (30) మృతి చెందాడు. వైట్షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ గుర్తించినట్టయితే రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి అరెస్ట్ చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతికి కారణమైన తమ్మారెడ్డి భూపాల్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నార్సింగి పోలీస్స్టేషన్లో సీఐ వెంటరాజంగౌడ్, ఎస్ఐ సృజనతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న నార్సింగిలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన మేడ్చల్ జిల్లా అత్వెల్లికి చెందిన శ్యామ్ శ్యామ్సుందర్రెడ్డి ఉదయం స్నానం చేసి బట్టలు ఆరబెడుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతని భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. భవనంపై జే వైరుకు అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి వ్యక్తి మృతికి భూపాల్రెడ్డి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో అతడ్ని రిమాండ్కు తరలించారు. -
కొట్టుకున్న డ్వాక్రా మహిళలు
జోగిపేట(అందోల్): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదని డ్వాక్రా సంఘం మహిళలు కొట్టుకున్నారు. వివరాలు ఇలా... జోగిపేటకు చెందిన లక్ష్మినర్సింహ డ్వాక్రా గ్రూపునకు చెందిన మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేర రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మళ్లీశ్వరి కూడా రుణం తీసుకొని ఆమె అత్త వెంకమ్మకు ఇవ్వగా వాడుకొని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్ చేశారు. దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంకమ్మకు గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మళ్లీశ్వరి, అనిత మాత్రమే డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు. -
హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయోచ్
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఆనందంలో మునిగితేలారు. రాత్రి పగలు తేడాలేకుండా రెండేళ్లు కష్టపడి చదివారు. మంచి మార్కులు సాధించటం కోసం నిద్రాహారాలు మాని పరీక్షల కోసం సిద్ధమయ్యారు. శుక్రవారం పరీక్షలు ముగియడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరికి ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంటర్ తర్వాత ఏం చదువుదామని చర్చించుకున్నారు.ఆల్ ది బెస్ట్ అని చెప్పుకుని ఇంటికి వెళ్లిపోయారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
సమస్యలు తీర్చేందుకే భూ రీసర్వే
కల్హేర్(నారాయణఖేడ్): రైతుల సమస్యలు తీర్చేందుకు భూ రీసర్వే నిర్వహిస్తున్నామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. శుక్రవారం సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో గ్రామ సభ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ... భూ సర్వే నిర్వహించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఖాజాపూర్ గ్రామం ఎంపికై ందని తెలిపారు. రైతులకు పొలం గట్లు, హద్దుల సమస్యలు పరిష్కారం చేసేందుకు రీసర్వే ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్రెడ్డి, డీప్యూటీ తహసీల్దార్ హేమంత్కుమార్, సర్పంచ్ రమ్య, ఉపసర్పంచ్ షేక్ హబీబ్ పాల్గొన్నారు.సబ్ కలెక్టర్ ఉమా హారతి -
ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట
పటాన్చెరు: గంగా జమున తెహజీబ్ సంస్కృతికి ప్రతీక తెలంగాణ రాష్ట్రమని, ముస్లింల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేసిన మహోన్నత నేత మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మహమూద్ అలీతో పాటు, శాసనమండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారన్నారు. 27 ఏళ్లుగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే దక్కిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ... ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ముగిసిపోయేలా అల్లాను ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పాల్గొన్నారు.మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ -
అక్రమ సిలిండర్ల స్వాధీనం
నర్సాపూర్: అక్రమంగా వాడుతున్న గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నట్లు విజిలెన్స్ అండ్ సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశం తెలిపారు. శుక్రవారం ఆయన తన బృందంతో పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ పాయింట్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లతో పాటు వంట గ్యాస్ వినియోగించే పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ వంట గ్యాస్ను వ్యాపార సంస్థల్లో వాడటం గుర్తించి 46 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని, 29 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. తాము పట్టుకున్న సిలిండర్లలో 38 హెచ్పీ, భారత్ కంపెనీకి చెందిన 6 , రెండు ఇండెన్కు చెందిన సిలిండర్లు ఉన్నాయన్నారు. తనిఖీల్లో ఇన్స్పెక్టర్ పాండరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు, ఏఎస్ఓ నిస్సార్, డీటీ నాగరాజు, ఆర్ఐ నర్సింహులు పాల్గొన్నారు. పెట్రోల్ బంకు తనిఖీ చిలప్చెడ్(నర్సాపూర్): మండల కేంద్రమైన చిలప్చెడ్, చిట్కుల్ గ్రామాల్లోని పెట్రోల్ బంక్లను ఆర్ఐ సునీల్ చౌహాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చమురు నాణ్యత, స్టాక్ను పరిశీలించారు. స్టాక్ ఎప్పుడు వస్తుంది? ఎంత వస్తుంది? రోజు ఎంత చమురు అమ్ముతారని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు ఎలాంటి లోటు లేకుండా నిల్వ ఉంచుకోవాలన్నారు. అలాగే పెట్రోల్ బంకుల వద్ద వాహనాలకు గాలినింపే యంత్రాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంకుల నిర్వాహకులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మిరుదొడ్డి(దుబ్బాక): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. మిరుదొడ్డి ఎస్ఐ సమత వివరాల ప్రకారం... దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన సున్నపు బుచ్చయ్య (52) ఇటీవల దుబ్బాకలో సొంత పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో సిద్దిపేట నుంచి మెదక్ వైపు వెళ్తున్న కారు ధర్మారం జాతీయ రహదారి మిరుదొడ్డి చౌరస్తా వద్ద బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బుచ్చయ్యను ములుగులోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన.. గజ్వేల్రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(ఎర్రవల్లి)లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పేర్ల గణేశ్(45) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో నెలకొన్న కలహాలతో తీవ్ర మనోవేదనకు గురై మూడ్రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గుర్తుతెలియని మృతదేహం.. జిన్నారం (పటాన్చెరు): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదిగూడెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమంతు వివరాల ప్రకారం... వ్యవసాయ క్షేత్రాల సమీపంలోని ఓ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకి తీసి, కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏఐతో మరిన్ని ఉద్యోగాలు
పటాన్చెరు: కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ స్థానభ్రంశం చేయవచ్చని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ఇస్నాపూర్ పరిధిలోని రుద్రారంలో సీజీసీ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయడం, ప్రధాన రంగాల్లో ఆవిష్కరణలు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఇండస్ట్రీ కాంక్లేవ్ ముగిసింది. ఎన్ఎక్స్ పీ సెమీకండక్టర్స్లో ఇండియా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అధిపతి ప్రీత్ యాదవ్, స్టెల్లాంటిస్లో డెలివరీ లీడ్ సుమన్ గోర్లా ముఖ్య అతిథులుగా హాజరై కీలకోపన్యాసం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.కాంక్లేవ్లో అభిప్రాయపడ్డ పరిశ్రమ నిపుణులు -
వనదుర్గమ్మా.. ప్రసాదం ఎట్లా?
ఏడుపాయలకు తాకిన గ్యాస్ కొరతఒక్క రోజు నిలిచిన లడ్డూ ప్రసాదం ● తప్పని కట్టెల పొయ్యిపాపన్నపేట(మెదక్): పశ్చిమాసియా యుద్ధం మంటలు ఏడుపాయల లడ్డూ ప్రసాదానికి కూడా తాకాయి. గ్యాస్ సిలిండర్లు దొరకక మూడు రోజుల నుంచి పొయ్యి వెలగలేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు గత వారం రోజులుగా దొరకడం లేదు. దీంతో గురువారం భక్తులకు అమ్మవారి ప్రసాదం కరువైంది. చివరకు కట్టెల పొయ్యి రాజేసి శుక్రవారం లడ్డు పులిహోర తయారు చేసి, భక్తులకు అందించారు. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వనదుర్గమ్మ ప్రసాదం లడ్డూ, పులిహోర విక్రయిస్తారు. లడ్డూ రూ.20, పులిహోర రూ.10కి అమ్ముతుంటారు. ప్రతి రోజు ఎంత లేదన్నా రూ.70 నుంచి రూ.80 వేల ప్రసాదం విక్రయిస్తారు. ఆదివారం ప్రసాదం ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఇందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడుతుంటారు. నెలకు 80 నుంచి 100 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. మొదట్లో రూ.2019 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్, యుద్ధం తర్వాత రూ.2133కు చేరింది. ఇప్పుడు అవి కూడా దొరకడం లేదు. దీంతో ఏడుపాయల్లో గత ఆదివారం తయారు చేసిన ప్రసాదం, బుధవారం వరకు అందుబాటులో ఉంది. గురువారం మాత్రం భక్తులకు ప్రసాదం అందలేదు. దీంతో మట్టి పొయ్యి నిర్మించి కట్టెల మంట ద్వారా లడ్డు ప్రసాదం తయారు చేయించి, భక్తులకు అందజేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
మోటారు బయటకు తీస్తుండగా..
దుబ్బాకరూరల్: విద్యుత్ మోటార్ను బయటకు తీస్తుండగా వాగులో పడి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన అక్బర్పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో జరిగింది. హెడ్ కానిస్టెబుల్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పొలానికి నీటి సరఫరా కోసం రైతులు కూడవెల్లి వాగులో విద్యుత్ మోటార్లు వేశారు. వాగు నుంచి మోటార్లు బయటకు తీసేందుకు లక్ష్మణ్, బాలయ్య, కనకయ్య వెళ్లారు. మృతుడు ఎనగుర్తి లక్ష్మణ్(50) మొదటగా కొయ్యాడ స్వామిగౌడ్కు చెందిన మోటారును బయటకు తీశాడు. అదే విధంగా పోసిగారి ప్రభాకర్ మోటారును బయటకు తీయమని కమటం సురేశ్, ఇస్తారు మల్లయ్య అడిగారు. లక్ష్మణ్ మోటారును బయటకు తీస్తున్న క్రమంలో నీటిలో మునిగి చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని భార్య బాలమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనం ఢీకొని.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పెద్దాపూర్లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ వెంకటేశ్ వివరాల మేరకు... ఈనెల 12న రాత్రి 11గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పెద్దాపూర్ శివారులో గల భారత పెట్రోల్ బంకు సమీపంలో కాలి నడకన రహదారిని క్రాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయి. విద్యుదాఘాతంతో కార్మికుడు.. శివ్వంపేట(నర్సాపూర్): విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు.ఈ ఘటన మండల పరిధిలోని గోమారంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నీరుడి రాములు(48) గ్రామ పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం గ్రామంలో నీరుడి రాములు మరో ఇద్దరు కార్మికులతో కలిసి విద్యుత్ సరఫరా నిలిపివేసి స్తంభాలపై వీధిలైట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా అనంతరం చౌరస్తా వద్ద ఓ స్తంభానికి లైటు వెలగకపోవడంతో విద్యుత్ ఉండగానే నిచ్చెన సాయంతో మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి స్తంభం పైనుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుజాత, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వాగులో పడి రైతు మృతి -
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు
శివ్వంపేట(నర్సాపూర్): ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని లీవ్ ఫామ్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ రంగనాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దగొట్టిముక్కల గ్రామంలో రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు గ్రామంలో సాగు చేస్తున్న 2 సంవత్సరాల వయస్సు గల ఆయిల్ పామ్ పంటను పరిశీలించి పలు సూచనలు చేశారు. పంట 4వ సంవత్సరం నుంచి కోతకు వస్తుందన్నారు. ఎకరాకు నెలకు సగటున 7 నుంచి 9 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. మార్కెట్లో టన్ను ధర రూ.22 వేలు ఉందన్నారు. ఎకరాకు నెలకు 15 వేల నుంచి 18 వేల ఆదాయం వస్తుందన్నారు. -
డ్రెస్ కొనేందుకు వెళ్లి..
యువతి అదృశ్యం పటాన్చెరు టౌన్: యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మెదక్ పాపన్నపేటకు చెందిన వికాస్ ఇస్నాపూర్ పరిధిలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తు న్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వికాస్కు వరుసకు చెల్లైలెన సురేఖ మెదక్ నుంచి అతడి ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులు ఉన్నాయని డ్రెస్ కొనేందుకు 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వికాస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వ్యక్తి ఆత్మహత్యమెదక్ కలెక్టరేట్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండు వార్డు అవుసులపల్లికి చెందిన దాసరి సత్యనారాయణ(46) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య మంజులతోపాటు పెలైన ఇద్దరు కొడుకులు ఉన్నారు. నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు గజ్వేల్రూరల్: జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిర్దోషిగా బయటకు వస్తారని జాగృతి లీగల్ సెల్ నేత కొట్టాల యాదగిరి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్లో మాట్లాడుతూ లిక్కర్ కేసులో కవితపై ఎలాంటి ఆధారాలు లేవని, సీబీఐ మోపిన అభియోగాలను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని హైకోర్టు పేరిట నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జాగృతి నాయకులు పాల్గొన్నారు. -
మెడికల్ బిల్లులు సక్రమంగా పంపిస్తలేరు
మెదక్జోన్: మెదక్ ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే సూపరింటెండెంట్ లతీఫ్ఉద్దీన్ ముజాయుద్దీన్, మెడికల్ బిల్లులను సక్రమంగా ఉన్నతాధికారులకు పంపటం లేదని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ బిల్లుల విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవల డీజీపీకి ఫిర్యాదు చేయటంతో శుక్రవారం రికార్డులను తనిఖీ చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారి విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తించామని చెప్పారు. తన సెక్షన్లో 282 బిల్లులను ఉన్నతాధికారులకు పంపకుండా పెండింగ్లో పెట్టాడని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ పేర్కొన్నారు.ఏసీబీ డీఎస్పీ సుదర్శన్రెడ్డి సుదర్శన్రెడ్డి -
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భక్తులు వేసిన కానుకలతో 28రోజుల్లో హుండీ ద్వారా రూ.1,20,29,945 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ఆలయంలోని హుండీలనూ దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, లలిత సేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,20,29,945, మిశ్రమ బంగారం 89 గ్రాములు, మిశ్రమ వెండి 6కిలోల 100 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 34 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగం నర్సింహారెడ్డి, లింగం, ఎల్లయ్య, మల్లేశం, ఆలయ ఏఈఓలు శ్రీనివాస్, ఆర్.సుదర్శన్, ఆలయ ప్రధానార్చకులు మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య, పర్యవేక్షకులు చంద్రశేఖర్, స్వర్ణకారుడు నర్సింహచారి, లలిత సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన పాలనకు దోహదం
గజ్వేల్: మున్సిపాలిటీల్లో మెరుగైన పాలన, వసతుల కల్పనకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ దోహదపడనుందని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వర్రావు అన్నారు. శుక్రవారం ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కాగా పాండవుల చెరువులో చేపట్టిన వ్యర్థాల తొలగింపు, డంప్యార్డు నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మి, మురళి, స్వప్న, రూప తదితరులు పాల్గొన్నారు.సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వర్రావు -
మరో 60 ట్రాన్స్ఫార్మర్లు
నారాయణఖేడ్: విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారంపై విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా 30 ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయని, త్వరలో మరో 60 ట్రాన్స్ఫార్మర్లు రానున్నాయని తెలిపారు. నాగన్పల్లి, ఇస్లాంపూర్., ఇరక్పల్లిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు స్థలాల ఎంపిక జరగగా బోర్గీలో స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉందన్నారు. కడ్పల్లో 132 కేవీ సబ్ స్టేషన్ కోసం స్థలం ఎంపిక జరిగిందన్నారు. 1,000 విద్యుత్ స్తంభాలకు ప్రతిపాదించామని చెప్పారు. ఖేడ్ పట్టణంలో రూ.25 లక్షలతో మరో రెండు ఫీడర్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. 160 కేవీకి సంబంధించి ఐదు ట్రాన్స్ఫార్మర్లు మంజూరుకాగా మూడు విడుదలయ్యాయని పేర్కొన్నారు. 50 ఎల్డీ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, అవసరాల మేరకు ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 200 స్తంభాలు కేబుళ్లతోసహ ప్రతిపాదించామన్నారు. కౌలాస్నాలా ద్వారా కంగ్టి మండలంతోపాటు, జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటిని అందించేందుకు రూ.20 లక్షలతో ప్రతిపాదనలు పంపామని వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమీక్షలో విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సంగారెడ్డి టౌన్: ఉపాధి హామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు డీఆర్డీఏ బాలరాజు అన్నారు. శుక్రవారం మండల ఎంపీడీఓ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 11 గ్రామాల్లో ఏడాది పాటు జరిగిన ఉపాధి హామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సరైన రికార్డులు లేని గ్రామాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా, మండల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 78 మందికి ఆఫర్ లెటర్లుజాబ్ మేళాకు స్పందన సంగారెడ్డి టౌన్: మహేంద్ర కంపెనీ నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్లో 78 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. మరిన్ని కంపెనీలను ముందుకు తీసు కొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. జహీరాబాద్ మహేంద్ర కంపెనీ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ పరీక్షలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 15,765 మంది విద్యార్థులకు గానూ 15,330 మంది విద్యార్థులు హాజరు కాగా 435 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,327 మంది విద్యార్థులకు గానూ 14,029 మంది విద్యార్థులు హాజరు కాగా 298 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1438 మంది విద్యార్థులకు గానూ 1301 మంది విద్యార్థులు హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 97.24గా నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి గోవిందరాం తెలిపారు. సీసీ రోడ్లకు రూ.2 కోట్లు మంజూరు: ఎమ్మెల్యేజహీరాబాద్ టౌన్: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆదివారం నుంచి ప్రారంభిస్తామన్నారు. ఝరాసంగం మండలంలోని 12 గ్రామాలకు గాను రూ.60 లక్షలు, కోహీర్ మండలంలోని మూడు గ్రామాలకు రూ.20 లక్షలు, మొగుడంపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు రూ. 35 లక్షలు, న్యాల్కల్ మండలంలోని 10 గ్రామాలకు గాను రూ. 45 లక్షలు, జహీరాబాద్ మండలంలోని 9 గ్రామాలకు రూ. 40 లక్షల చొప్పన నిధులు మంజూరు అయినట్లు వివరించారు. -
మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు
సంగారెడ్డి జోన్: యువత మాదకద్రవ్యాల రవాణా చేసినా, వినియోగించినా కఠిన శిక్షలు ఉంటాయని అదనపు కలెక్టర్ పాండు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్డీపీఎస్ చట్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కావొద్దని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో నష్టాలు, భవిష్యత్లో ఎదురయ్యే సమస్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, డ్రగ్స్ వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ పాండు -
అవసరమైతే అసెంబ్లీ ముట్టడి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు, స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, స్కీం వర్కర్లు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీ, ఆశా, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఐకేపీ, వీవోఏ, మిషన్ భగీరథ, హాస్పి టల్, మెడికల్, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచుతామని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, వివిధ రంగాల నాయకులు మంగ, మంజుల, నగే ష్, యశోద, దశరథ్, సదానందం, లక్ష్మణ్, జయరాం, రాములు, సుధాకర్ , యేసుమని, సత్తయ్య, ప్రశాంతి, అనిత, గౌరమ్మ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు వేతనాలు పెంచాలని డిమాండ్ -
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
గ్యాస్ గోసపశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా వచ్చిన గ్యాస్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ అడగటం, బుకింగ్ కాకపోవటం, సర్వర్ డౌన్ కారణంగా జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలే ఇప్పుడు పరీక్షల సమయం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని ఏజెన్సీ నిర్వాహకులతో వినియోగదారులు గొడవ పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో హాస్టళ్లు, హోటళ్లు, కర్రీపాయింట్ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. కట్టెల ధర ఎక్కువగా ఉండటం, విపరీతమైన పొగ రావటంతో వంట చేసే వారి బాధలు వర్ణనాతీతం.మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య, చిత్రంలో ఎస్పీ పరితోష్సంగారెడ్డి జోన్: జిల్లాలో గ్యాస్ నిల్వలు చేసి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో గ్యాస్ సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల కొరత ఎక్కడా లేదన్నారు. వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే స్థానిక ఎస్హెచ్ఓ, 100 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా పౌర సరఫరాల అధికారి బాలసరోజ, సహాయ పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, సంక్షేమ శాఖల అధికారులు అఖిలేష్ రెడ్డి, జగదీష్, రాజేశ్వర్ అంబదాస్, లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎల్పి.జి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.కోత్లాపూర్లో సిలిండర్ కోసం క్యూ లైన్లో నిలబడిన జనం కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరిక గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు ప్రాధాన్యత క్రమంలో బుకింగ్ చేసుకోవాలి -
హత్యాయత్నం కేసులో ఒకరు..
సిద్దిపేటకమాన్: హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం..సిద్దిపేట పట్టణంలోని సాజీద్పూరకు చెందిన ఎండి అర్షద్ స్థానికంగా మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. పక్క దుకాణదారుడైన ఎండి షాబుద్దీన్ తన దుకాణం సరిగా నడవకపోవడంతో దానికి కారణం ఎండి అర్షద్, అతడి తమ్ముడు షాహీద్ అని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న షాహిద్ తలపై ఇనుపరాడుతో షాబుద్దీన్ దాడి చేశాడు. అడ్డువచ్చిన అర్షద్ను కొట్డాడు. షాహీద్ను హైదరాబాద్లోని ప్రయివేట్కు తరలించారు. -
ఇక పామాయిల్ మేడ్ ఇన్ సిద్దిపేటగా మారనుంది. ఆయిల్ పామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీయడంతోపాటు రిఫైన్డ్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ రూపంలో బయటకు రానున్నాయి. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల్లో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్ ఫ
సిద్దిపేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ (ఇన్సెట్లో ఆయిల్ స్టోరేజీ ట్యాంకులు)మహర్దశ భారతదేశంలో ఆయిల్ కొరతతో ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. అలాగే ఆ దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి.. ప్రస్తుతం 31 జిల్లాల్లో దాదాపు 70వేల మంది రైతులు 2.90లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో అత్యధికంగా పామాయిల్ను సాగు చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఉండాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో సిద్దిపేటలో పరిశ్రమకు 2023లో శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమలో పనులు పూర్తయి ఇప్పటికే ట్రయల్ రన్ సైతం పూర్తయింది. గంటకు 30 నుంచి 120 టన్నులు అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం నుంచి మొదట ప్రారంభించనున్నారు. ఆయిల్ పామ్ పండ్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ సామర్థ్యంను గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఫ్యాక్టరీ నిర్మాణం కావడం దేశంలోనే తొలి పరిశ్రమ ఇది. వ్యర్థాలతో విద్యుత్ ఆయిల్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ఆవరణలోనే 4 మెగావాట్ల కో జనరేషన్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను ఉడికించి స్టీమ్తో ఆధునిక టర్బైన్లతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక యూనిట్కు రూ.1.5 మాత్రమే ఖర్చుతో ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. కాలుష్య రహిత కాలుష్య రహితంగా ఫ్యాక్టరీని నిర్మించారు. ఇక్కిడి నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి రీయూజ్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. భూగర్భ జలాలు అంతరించిపోకుండా ఉంటాయి. నిరుద్యోగులకు ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ నెల 20 నుంచి 22వరకు రైతు మేళా నిర్వహించనున్నారు. మేళా ముగింపు కార్యక్రమం, ఆయిల్ పరిశ్రమ ప్రారంభానికి సీఎం రాక సందర్భంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నర్మెటలో 62 ఎకరాల్లోరూ.300 కోట్లతో నిర్మాణం వ్యర్థాలతో విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో 2.90లక్షలఎకరాల్లో సాగు ఈ నెల 22న ప్రారంభించనున్న సీఎంఇక్కడే రిఫైన్డ్ -
సర్పంచ్కు జాతీయ అవార్డు
కొండపాక(గజ్వేల్): మండలంలోని జప్తినాచారం సర్పంచ్ లక్కిరెడ్డి పావని ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ (బీకాన్) అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ సమ్మేళన్ కార్యక్రమంలో మహిళా సర్పంచ్ల సామాజిక సంస్కరణల విభాగంలో గుర్తింపును పొందారు. సర్పంచ్గా గెలుపొందిన అనతి కాలంలోనే పావని డ్రగ్స్, మద్యపాన వినియోగం వల్ల ఏర్పడే దుష్పరిణాలు, ఇబ్బందులపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. అవార్డు పొందిన సందర్భంగా సర్పంచ్ను ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు పొందడానికి యువత, గ్రామస్తుల సమష్టి కృషి ఫలమేనన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు శివ్వంపేట(నర్సాపూర్): దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుకర్రెడ్డి వివరాలు ఇలా... మండల పరిధిలోని కొంతన్పల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్పై బుధవారం సాయత్రం బెదిరింపులతో పాటు కొందరు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వెంకట్రామిరెడ్డి, రవీందర్రెడ్డి, వెంకటేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
28న జాతీయ లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, ఎన్ఐ యాక్టు, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్లో క్రిమినల్, కాంపౌండబుల్, సివిల్, చెక్బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు లోక్అదాలత్లో కేసులు రాజీ చేసుకుంటే సమయం వృథా అవదన్నారు. న్యాయవాదులు అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. సెల్ఫోన్లు అప్పగింత సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న సెల్ఫోన్లను నూతన టెక్నాలజీ సాయంతో గుర్తించి బాధితులకు అప్పగించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు కమిషనరేట్ పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్నట్లు బాధితులు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయడంతో పాటు పీఎస్లలో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు నూతన టెక్నాలజీ సాయంతో పోగొట్టుకున్న వాటిని గుర్తించి 109 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, ఏసీపీలు రవీందర్రెడ్డి, నర్సింహులు, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, శ్రీను పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్లకు జరిమాన కోహెడరూరల్(హుస్నాబాద్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమాచారంతో.. మండలంలోని కూరెళ్ల పరిధి శివారులో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తహసీల్దార్ చంద్రశేఖర్ పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టరుకు రూ.15వేల చొప్పున జరిమానా విధించి, ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు రైలు పట్టాల కిందపడి.. కాలు తెగి వ్యక్తికి తీవ్ర గాయాలు మనోహరాబాద్(తూప్రాన్): రైలు ఎక్కుతున్న క్రమంలో పట్టాల మధ్య పడి వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మనోహరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. గురువారం 108 ఈఎన్టీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్–కాచిగూడ రైలులో చేగుంటలో బిహారీలాల్ (58) ఎక్కాడు. కాగా మార్గమధ్యలో మనోహరాబాద్ వద్ద రైలు ఆగడంతో కిందిగి దిగిన అతడు కదులుతున్న ట్రైన్ ఎక్కు తుండగా ప్రమాదవశాత్తు పట్టాల మధ్య పడిపోయాడు. దీంతో అతని కుడి కాలు తేగిపోవడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి ప్రథమ చికిత్స చేసి తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకును వెతికేందుకు వెళ్లి.. కుంటలో పడి తల్లి మృతి తూప్రాన్: వారం రోజులుగా కన్న కొడుకు కనిపించకపోవడంతో వెతకడానికి వెళ్లిన తల్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందింది. ఈ సంఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం... కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి(45)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అనారోగ్యానికి గురైన లక్ష్మి తన రెండో కుమారుడితో బుధవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తుంది. ఈ క్రమంలో మార్గమధ్యలో తన పెద్ద కుమారుడి మాదిరిగా కనిపించిన యువకుడిని చూసి వెనకాల వెళ్లిన ఆమె రహదారి పక్కన ఉన్న నీటికుంటలో పడి మృతి చెందింది. వెంటనే గ్రామస్తుల సహకారంతో బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఇండస్ట్రియల్ టూర్.. నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు
కొండపాక(గజ్వేల్): ఇండస్ట్రియల్ టూర్ ద్వారా టెక్నికల్ స్కిల్స్ పెంపొందుతాయని మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య పేర్కొన్నారు. పీఎంశ్రీ కుకునూరుపల్లి పాఠశాల విద్యార్థులు గురువారం ఇండస్ట్రియల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇండస్ట్రియల్ టూర్ ద్వారా పరిశ్రమల పని విధానం, యంత్రాల వినియోగం, భద్రతా నియమాలు, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల విషయాలను ప్రత్యక్షంగా గుర్తిస్తారన్నారు. పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాలు ప్రాక్టికల్గా చూడటం, తయారు చేయడం వంటి పని విధానం జీవనోపాధికి ఉపయోగపడుతాయన్నారు. కళాశాలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, టైలరింగ్ తదితర కోర్సుల వివరాలను ప్రిన్సిపాల్ వెంకటరమణ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.ఎంఈఓ బచ్చలి సత్తయ్య -
మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలే..
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సందర్శించారు. డార్మెటరీతో పాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వీడాలని అధికారులను మందలించారు. డార్మెటరీలోని నిత్యావసర సరుకులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు రాజులు, భాస్కరాచారి, లింగం, రాజు, బాల్నర్సింహులు, దిలీప్, నితిన్ పాల్గొన్నారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి -
రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం
వర్గల్(గజ్వేల్): భౌగోళిక రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వి. శ్రీలత అన్నారు. వర్గల్ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించిన రెండోరోజు జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల నాయకత్వం, భాగస్వామ్యం ద్వారా సమానత్వం, శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో, శాంతి ప్రక్రియల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు ముందుండాలన్నారు. దక్షిణాసియాలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, సవాళ్లను ఎదుర్కొంటూనే పురోగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అధ్యాపకులు సుమ, విద్య, డాక్టర్ పీ.సుజాత, డీ.సుజాత, వీపీ గోవిందరావు, దేదీప్య, జయలక్ష్మి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పత్రాలు సమర్పించిన వారందరికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద నుంచి ప్రయాణికులతో ఆటో మెద క్ వస్తుంది. ఈ క్రమంలో చంద్రభవన్ కాంప్లెక్స్ సమీపంలో ముందున్న లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆటో ఎదురుగా వచ్చిన కారు, బైక్ లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారితోపాటు బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో టి.మాందాపూర్ తండాకు చెందిన ధరావత్ బాల్య, అతని భార్య పద్మ, షబానా బేగం, తిరుమల శ్రీనివాస్ ఉన్నారు. వీరిని 108లో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చే శారు. -
బ్యాటరీ దొంగల అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): టీ–ఫైబర్కు సంబంధించిన బ్యాటరీలను ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు బ్యాటరీలు, స్విఫ్ట్కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్ఐ మహ్మద్ అసీఫ్ పీఎస్లోకేసు వివరాలు వెల్లండించారు. గత నెల 27న గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి మండలంలోని వల్లంపట్ల గ్రామ పంచాయతీలో ఉన్న 120 ఏహెచ్ సామర్థ్యం గల మూడు బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. టీ–ఫైబర్ కంపెనీకి చెందిన టెక్నీషియన్ చంద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని కమాన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్త్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సైతం 65ఏహెచ్ సామర్థ్యం గల మూడు బ్యాటరీలను ఎత్తుకెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు పంపించారు. మరో ఘటనలో బైక్ దొంగ.. సిద్దిపేట అర్బన్: బైకును అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. చేర్యాలకు చెందిన శశినాథ్రెడ్డి ఫిబ్రవరి 20న నాంచారుపల్లి శివారులోని ఓ దేవాలయం వద్ద తన యూనికాన్ బైకును నిలిపి దర్శనానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి బైకు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుడి ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన తోటకూరి నరేశ్కుమార్గా గుర్తించారు. ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. అలాగే వన్టౌన్ స్టేషన్ పరిధిలో కూడా బైకును చోరీ చేశాడు. నిందితుడి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. -
గుర్తుతెలియని మృతదేహం
సంగారెడ్డి క్రైమ్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... మహబూబ్ సాగర్ చెరువులో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి(30) మృతదేహం బయటకు తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. చాకెట్ల్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి అల్లాదుర్గం(మెదక్): చెట్టు పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో గురువారం చోటుచేస్తుంది. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (27) తన భార్యతో కలిసి అల్లాదుర్గం గ్రామానికి చెందిన అనిల్కుమార్ రెడ్డి మామిడి తోటలో కూలీ పని చేస్తున్నారు. ఈ క్రమంలో హరికృష్ణ చింత చెట్టు ఎక్కి చింతపండు తెంపుతుండగా కాలుజారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అతడ్ని పెద్ద శంకరంపేట ప్రైవేట్ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇదేం పాపం
ఆందోళనకు గురిచేస్తున్న తల్లిదండ్రుల తీరు ● కొందరు మగబిడ్డ పుట్టలేదని.. ● పోషించే స్థోమత లేక.. డబ్బులకోసం ఇంకొందరుమెదక్జోన్: నవ మాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారుముద్దుగా పెంచాల్సిన ‘అమ్మానాన్న’ అనే పదానికే కొందరు మచ్చ తెస్తున్నారు. పేగుబంధాన్ని మరిచి అంగడి సరుకులా కన్నబిడ్డల్ని అమ్మేస్తున్నారు. మగబిడ్డ కోసం ఎదురు చూస్తూ మూడు, నాలుగో కాన్పుల్లోనూ మళ్లీ ఆడపిల్ల పుట్టడం, మరికొందరు పిల్లల్ని పోశించే స్థోమత లేక, ఇంకొందరు డబ్బుల కోసం విక్రయిస్తున్నారు. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 27 మంది శిశువులను విక్రయించిన తల్లిదండ్రుల తీరు ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం హవేళిఘణాపూర్ మండలం లింగసాన్పల్లి తండాలో మొదటి కాన్పులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులనే సాకుతో రూ. 1.50 లక్షలకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. ఇది గమనించిన అంగన్వాడీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. శిశుసంరక్షణలో.. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 27 మంది శిశువులను విక్రయించినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అధికారుల దృష్టికి వచ్చిన వాటిలో కేసులు నమోదు చేసి, విక్రయానికి గురైన శిశువులను రప్పించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, 25 మందిని తిరిగి అప్పగించారు. వారిలో ఇద్దరు దంపతులు మాత్రం చిన్నారులను పోషించలేమని శిశు సంరక్షణ కేంద్రంలోనే వదిలేశారు. పసికందులను విక్రయించిన వారిలో 95 శాతం మంది తల్లిదండ్రులకు చదువు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. నేటి సమాజంలో కూతురు, కొడుకు సమానమనే భావనకు రాకపోవడమే ఇందుకు కారణం. ఆడపిల్లకు కట్నాలు, కానుకలు ఇచ్చి పంపాలనే ఆలోచనతో ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఈ వివక్షను పూర్తిగా రూపుమాపాలంటే ప్రతి ఒక్కరికి చదువుకోవడమే ఏకై క మార్గమని అధికారులు చెబుతున్నారు. శిశు విక్రయాలతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
ప్రహరీ గోడ నిర్మాణం అడ్డగింత
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల ప్రహరీల నిర్మాణంను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా... మండలంలోని మానేపల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. దీంతోపాటు పక్కనే చెరువు, పెద్ద కాలువ ఉండటంతో ప్రహరీ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరు చేసింది. కాగా సంబంధిత గుత్తేదారు పనులను ఇటీవల ప్రారంభించారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణ నుంచి తమ పంట పొలాలకు దారి ఉందని ప్రహరీ నిర్మించడానికి వీలులేదని గ్రామానికి చెందిన కొందరు రైతులు అడ్డుకున్నారు. దీంతో పునాది వరకు చేసిన పనులను గుత్తేదారు నిలిపివేశారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల రక్షణకు ప్రహరి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
విద్యార్థి దశ నుంచే అవగాహన
విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ రమేశ్ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థి దశ నుంచే అన్ని అంశాలపై అవగాహన కల్గి ఉండాలని, జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ ముండ్రాతి రమేశ్ విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ పాఠశాలలో జిల్లా స్థాయి కౌమార విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు పోస్టర్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ కౌమార దశలో బాల బాలికలకు కలిగే శారీరక, మానసిక, ఉద్వేగపరమైన మార్పుల గురించి అవగాహన కల్పించామని తెలిపారు. హెచ్ఐవీ, ఎస్టీఐ సంక్రమిత వ్యాధుల నివారణకు అవసరమైన జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పోస్టర్ మేళాలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం అధికారి డానియల్, అర్బన్ మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఇంటర్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల్లోభాగంగా చివరిరోజైన గురువారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 18,181మంది విద్యార్థులు హాజరు కాగా 730 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 16,749 మంది విద్యార్థులు హాజరు కాగా 492 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 1,432 మంది హాజరుకాగా 238 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హాజరు96.14%గా నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి గోవిందరాం తెలిపారు. డీఐఓ రెండు, డీఈసీ మెంబర్లు 11, హెచ్పీసీ మెంబర్లు 03, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 11, 08 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
సమస్యల్ని పరిష్కరించండి
కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు సంగారెడ్డి: నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో చింత ప్రభాకర్, మాణిక్ రావు కలెక్టర్ను కలసి సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అరుట్ల, రాజంపేట్, సదాశివపేట, పెద్దాపూర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా బోర్వెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. చిమ్నాపూర్ గ్రామంలో పాఠశాల భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భవన నిర్మాణానికి దాతలు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్కు వివరించారు. సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. సంగారెడ్డి బైపాస్లో నిర్మాణంలో ఉన్న 80 అడుగుల రోడ్డు పనులు నాణ్యత లేకుండా నిదానంగా సాగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.44 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీలో రూ.8.50 కోట్లతో అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. బేగంపేట్ గ్రామంలో వాటర్ ట్యాంక్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, స్థానిక సర్పంచ్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్...విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మరో రూ.2 కోట్లు మంజూరు చేయండి సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న మినీ హజ్ హౌస్ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు కోరారు. హనుమాన్ నగర్లో ముస్లిం, క్రిస్టియన్ సమాధుల కోసం కేటాయించిన స్థలంలో సరైన వసతులు లేవని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్ కుమార్కంది(సంగారెడ్డి): భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విక్రేతలు, కొనుగోలుదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్ కుమార్ సూచించారు. మండల కేంద్రమైన కందిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం సందర్శించి భూభారతి ద్వారా జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు విక్రయించే వారు, కొనుగోలుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిజిటల్ సర్వే చేసే విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
డీహెచ్పీఎస్కు జిల్లా ఎంపిక
● మరింత సమర్థవంతంగా వైద్య సేవలు ● మంత్రి దామోదర రాజనర్సింహ కంది(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సమర్థవంతంగా వైద్య సేవలను అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థ (డీహెచ్పీఎస్)ను అమలు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. డీహెచ్పీఎస్ను తొలుత పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కలెక్టరేట్లో డీహెచ్పీఎస్ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లాస్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కందిలో కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్పర్సన్లు, గ్రామ సర్పంచులు కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యచరణ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. తర్వాత సీఎస్ఆర్ నిధులతో మెడికల్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ప్రాజెక్టు అమలులో భాగంగా జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అమలు చేస్తున్నామన్నారు. రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించి, డీహెచ్ కార్డు జారీ చేయడానికి కసరత్తును ప్రారంభించాలని ఆదేశించారు. డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటంతో తక్షణమే సరైన చికిత్స అందించడానికి సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సబ్సిడీపై యంత్రాల పంపిణీ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కొక్కటీ రూ.4.9 లక్షల విలువ చేసే 20 హెచ్పీ కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు మంత్రి దామోదర చెప్పారు. రైతులకు పంటల సాగుపై అవగాహన, విద్యారంగంలో పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందించేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రజల కోసమే ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టిందన్నారు. జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు గ్రామాలు పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్.చొంగ్తూ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, కలెక్టర్ ప్రావీణ్య, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఫహీం, అదనపు కలెక్టర్ పాండు, జెడ్పీసీఈవో జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయిజహీరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. యుద్ధం ఇలాగే కొనసాగితే రంజాన్ మాసంలో ప్రపంచమంతా మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వంటగ్యాస్, నూనెలు, నిత్యావసర సరకుల ధరలు పెరిగి పోయాయన్నారు. యుద్ధం ముగియాలని పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అల్లాను ప్రార్థించా లని కోరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ తోఫాలు అందజేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. గత రెండు బడ్జెట్లలో ముస్లింలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, ఈ బడ్జెట్లో అయినా రూ.4వేల కోట్ల నిధులు కేటాయించాలన్నారు. కల్యాణలక్ష్మి–షాదీముబారక్ కింద ఇచ్చిన మాట ప్రకారం రూ.1.60లక్షలు అందజేయాలని కోరా రు. సమావేశంలో ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కౌన్సిలర్ గౌస్గౌరి వితంతువులకు ప్రతి నెలా రూ.500 వంతున పింఛన్ చెల్లింపులను హరీష్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. -
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశుగృహ,సఖి కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లలను గౌరవించాలని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయపరమైన విషయంలో ఉచితన్యాయ సహాయం కోసం కోర్టును సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం సఖీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవకులుగా ఎదగండిజిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పటాన్చెరు: ఏదైనా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు స్వీయ రక్షణతోపాటు తోటి పౌరులను రక్షించడం కోసం వారం రోజుల శిక్షణ తరగతులను గీతం విద్యార్థులకు అందజేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకుని స్వచ్ఛంద సేవకులుగా ఎదగాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సౌజన్యంతో వారం రోజుల ‘పౌర రక్షణ స్వచ్ఛంద శిక్షణ సామర్థ్య నిర్మాణం’కార్యక్రమాన్ని గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మతో కలిసి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ శిక్షణలో అగ్నిప్రమాదాలు, విమాన, రసాయన, అణు విస్పోటనం, వరదలు, భవన సముదాయాలు కూలిపోవడం, రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా ప్రతిస్పందించాలనే దానిపై విద్యార్థులకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈనెల 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అగ్నిమాపకాధికారి భిక్షపతి, ఎస్టేట్ అధికారులు డీవీఏ మోహన్ ఇతర అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్స్ నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న స్ఫూర్తి డిగ్రీ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్, సతీశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ...జిల్లా కేంద్రంలో ఉన్న స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తరగతులు బోధించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. విద్యార్థులే స్వయంగా యూట్యూబ్లో టాపిక్ సెర్చ్ చేసుకుని క్లాసెస్ వింటున్న పరిస్థితి ఉందన్నారు. వెంటనే కాలేజీ గుర్తింపును రద్దు చేయని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తాం. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రీ సర్వేతో భూసమస్యలు దూరంసబ్ కలెక్టర్ ఉమాహారతి నారాయణఖేడ్: రీ సర్వేతో భూసమస్యలు దూరమవుతాయని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. ఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామంలో భూ భారతి రీసర్వేలో భాగంగా గురువారం గ్రామసభను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ...రీ సర్వేలో భూముల హద్దులు నిర్ధారణ అయ్యి భూసమస్యలకు అవకాశం ఉండదన్నారు. రైతులు, గ్రామస్తులు రీసర్వేకు సహకరించాలని కోరారు. -
సర్వం సిద్ధం
14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● హాజరు కానున్న 24,657 మంది విద్యార్థులు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 24,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా జిల్లా వ్యాప్తంగా 123 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. న్యాల్కల్(జహీరాబాద్)/ సంగారెడ్డి ఎడ్యుకేషన్ జిల్లాలో 11 ప్రభుత్వ, 197 జిల్లా పరిషత్తు, 17 కేజీబీవీలు, 2 ఎయిడెడ్, 10 తెలంగాణ మోడల్ స్కూల్స్, 2 టీజీ రెసిడెన్షియల్, 12 ఎంజేపీటీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్, 11 సోషల్ వెల్ఫేర్, 6 ట్రైబల్, 12 మైనార్టీ రెసిడెన్షియల్, 2 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 201 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి 15,033 మంది విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 9,624 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కానున్నారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు మరో 46 మంది ఇతర విద్యార్థులతో కలిపి మొత్తం 24,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సీసీ కెమెరాలు పరీక్షలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే సీల్ ఓపెన్ చేస్తారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్తోపాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య సిబ్బంది అంటుబాటులో ఉంచారు. ఇతర దుస్తుల్లో హాజరు.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల యూనిఫాంతో కాకుండా ఇతర దుస్తులు ధరించి పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష హాల్లోకి మొబైల్తోపాటు ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరని స్పష్టం చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సంబంధిత మండల విద్యాధికారి, డీఈఓ, ఎంపీడీఓ, తహసీల్దార్ల మొబైల్ నంబర్లను డిస్ప్లే చేయాలని చెప్పారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి విద్యార్థులకు రవాణ సౌకర్యం కల్పించడంతోపాటు విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని ఇదివరకే కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిసిందే. ప్రశాంతంగా పరీక్ష రాయాలి విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. పది పరీక్షలను పకడ్బందీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవడంతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తమ వెంట తీసుకురాకూడదు. ఏదేమైనా పది పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి 123 పరీక్ష కేంద్రాల ఏర్పాటు జిల్లాలో 123 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 12 మంది రూట్ ఆఫీసర్లు, 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 123 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, 65 మంది కస్టోడియన్స్, 6 (బృందాలు) ఫ్లయింగ్ స్క్వాడ్, 123 సిట్టింగ్ స్క్వాడ్, 1,300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు హాల్టికెట్, ప్యాడ్, పెన్నులు తమ వెంట తెచ్చుకోవాలని వారు తెలిపారు. మీసేవ కేంద్రాలతో పాటుగా 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా హాల్టికెట్ పొందవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాలను సులువుగా తెలుసుకునేందుకు హాల్ టికెట్లపై క్యూర్ కోడ్ను కూడా ముద్రించారు. స్వల్ప మార్పులు పది పరీక్షలు నిర్వహణలో స్వల్ప మార్పులు చేశారు. ఒక్కో పరీక్షకు మధ్య మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిని కల్పించారు. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి అవకాశం కల్పించారు. -
రైతులకు మెరుగైన సేవలు
డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల పటాన్చెరు టౌన్: రైతులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు మార్కెట్ సౌకర్యాలను విస్తరిస్తా మని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికై న మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, వైస్ చైర్మన్ మదాస్ రాజశేఖర్లు టీజీఐఐసీ చైర్పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించడం, మార్కెట్ సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. -
సిరుల జొన్న
జహీరాబాద్ టౌన్: ఇటీవల కాలంలో ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు రావడంతో జొన్నలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండే ఇప్పుడు జొన్న రైతులకు సిరులు కురిపిస్తోంది. సాధారణంగా యాసంగిలో రైతులు ఆరుతడి పంట ల సాగుకు ఆసక్తి చూపుతారు. కూరగాయలు, శనగ, మొక్కజొన్న, కుసుమ, గోధుమ, ఉల్లితోపాటు జొన్న పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేతకు ఉపయోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్లో కూడా ధర ఆశాజనకంగా ఉండటంతో జొన్నను రబీలో ఎక్కువస్థాయిలో పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. యాసంగిలో రైతులు జొన్న పంట సాగుకు ఆసక్తి చూపడంతో జిల్లాలో పంట విస్తీర్ణం పెరిగింది. జొన్న పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం. జిల్లాలోని మునిపల్లి, నారాయణఖేడ్, మనూర్, న్యాల్కల్, రాయికోడ్, కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్ తదితర మండలాల్లో జొన్న సాగువుతుంది. రాష్ట్ర సరిహద్దులో గల కర్ణాటకలో కూడా ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నారు. జిల్లాలో గతేడాది జొన్న పంట సుమారు 25 వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది విస్తీర్ణం రెట్టింపు అయింది. సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు పంట పండిస్తున్నారు. పెరుగుతున్న పంట విస్తీర్ణం జొన్నలకు మంచి డిమాండ్ అనువైన రకాలు ఎంపిక చేసుకోవాలి అధిక దిగుబడులను సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చేసుకోవాలి. సాగు విధానంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. జొన్నకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులకు లాభం కలుగుతుందన్నారు. –భిక్షపతి, వ్యవసాయశాఖ ఏడీఏ చిరుధాన్యాల్లో ముఖ్యమైన జొన్నలను ఆరోగ్యం కోసం ఏకమొత్తంగా ఆహారం కోసం తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జొన్న రొట్టెలను ఇష్టంగా తింటుడటంతో జొన్నలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్కు రూ.6 వేల వరకు పలుకుతోంది. ఎకరాకు సగటున 25–30 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. జొన్నకు తెగుళ్ల బెడద ఆశించినంతగా ఉండదు. నెమళ్లు, అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు శ్రమిస్తే చాలు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● లిక్కర్ బాటిల్ క్యూఆర్ కోడ్తోనిందితుల గుర్తింపు ● 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులుమెదక్ అర్బన్: వివాహేతర సంబంధం, వ్యసనాలు ఓ మహిళ హత్యకు దారి తీశాయి. సంఘటనా స్థలిలో లభించిన మద్యం సీసా క్యూఆర్ కోడ్తో వేట కొనసాగించిన పోలీసులు కేసును ఛేదించారు. సులోచన హత్య కేసులో నిందితులైన కొమ్మట రాజు, బానోతు భూలి ఎలియాస్ రేణను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాపన్నపేట మండలంలోని కొడుపాకకు చెందిన బేగరి సులోచన (35) భర్త దుర్గయ్య గత కొంతకాలం క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం ఆమె మెదక్ వెళ్లి కూలీ పనులు చేస్తుండేది. ఈ క్రమంలో నిజాంపేట మండలం నగరం(నస్కల్) గ్రామానికి చెందిన కొమ్మట రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. రాజుకు నగరం తండాకు చెందిన బానోతు బూలి ఎలియాస్ రేణతో కూడా వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల సులోచన నడవడికపై అనుమానం పెంచుకున్న రాజు, తరచుగా ఆమెతో గొడవ పడుతుండే వాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని చెప్పి, రాజు, రేణలు ఈనెల 9న సులోచనను మెదక్ నుంచి ఏడుపాయలలోని చెలిమలకుంట వద్దకు తీసుకెళ్లారు. వెళ్లేటప్పుడు నాగ్సాన్పల్లి కమాన్ వద్ద వైన్స్లో రెండు క్వార్టర్లు, రెండు బీర్లు తీసుకెళ్లి అక్కడ తాగారు. మద్యం మత్తులో మాటా మాటా పెరిగి సులోచనను రాజు కర్రతో బలంగా కొట్టగా, రేణ ఆమె కాళ్లు కదలకుండా పట్టుకుంది. సులోచన చనిపోగానే ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాల తీసుకొని పరారయ్యారు. కాగా విచారణ ప్రారంభించిన పోలీసులు అక్కడ లభించిన మద్యం సీసాల క్యూఆర్ కోడ్ ఆధారంగా నాగ్సాన్పల్లి కమాన్ వైన్స్లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం తరగతి బోధనకే పరిమితం కాకుండా ఆచరణాత్మక, మార్కెట్ ఆధారిత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) కామర్స్ విభాగం బోర్డ్ అఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ పాట్రిక్ ఆంథోని అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో బుధవారం కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాల సుదర్శనం ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రాజెక్టుల నివేదికల తయారీపై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిగ్రీ స్థాయిలో ప్రాజెక్టుల తయారీ ఒక ముఖ్య విషయంగా ఉండటం విద్యార్థుల భవిష్యత్ కార్యచరణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేయడం, సూక్ష్మ పరిశీలన చేయడం, పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకోవడం లాంటి అనేక నైపుణ్యాలు పెంపుందుతాయన్నారు. అనుభవజ్ఞులైన ఆచార్యుల పర్యవేక్షణలో ప్రాజెక్టులు తయారు చేస్తే భవిష్యత్లో నిర్మాణాత్మక పరిశోధనలకు ఉపయోగపడుతాయని చెప్పారు. ప్రాజెక్టు ఆంశాలను ఎంచుకునేప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటయాన్నారు. సమాజంలోని మౌలిక సమస్యలు, జీవన ప్రమాణాలు, ఉత్పాదకతను పెంపొందించే ప్రాజెక్టులు తయారు చేస్తే పారిశ్రామిక రంగంలో మంచి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత విద్యార్థులకు ఉపయుక్తమైన కార్యక్రమాలను నిర్వహించడంలో కామర్స్ విభాగం ముందుంటుందని అభినందించారు. కార్యక్రమ సమన్వయకర్త, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాలసుదర్శనం వర్క్షాప్ ముఖ్య ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, చర్చించే విషయాలు, శాస్త్ర సాంకేతిక మేళవింపు తదితర అంశాలను గూర్చి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఆయా విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఓయూ బోర్డ్ఆఫ్ స్టడీస్చైర్మన్ పాట్రిక్ ఆంథోని డిగ్రీ కళాశాలలో ప్రాజెక్టులనివేదికలపై వర్క్షాప్ -
మరో రెండు పంట విరామాలు!
పుల్కల్(అందోల్): సింగూరు మరమ్మతు పనులు ఈ జూన్ నాటికి పూర్తికావడం కష్టమేనని తెలుస్తోంది. రివిట్మెంట్ పనులు జూన్ నాటికి కూడా పూర్తి కావని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో మరో రెండు పంటలకు విరామం ప్రకటించాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సింగూరు మరమ్మతులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం బుధవారం పర్యటించి పర్యవేక్షించింది. ఈ బృందం డ్యామ్ పటిష్టతపై నివేదిక ఇవ్వనుంది. గతేడాది ఈ బృందం డ్యామ్ లోపలి భాగంలో రాతికట్ట(రివిట్మెంట్) నీటి తొలుకులకు కుంగిందని నివేదిక సమర్పించింది. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం రూ.16 కోట్లను మంజూరు చేసింది. ఈ రివిట్మెంట్ పనులను జరిపించేందుకు కమిటీ సూచనల మేర స్థానికంగా పంట విరామం ప్రకటించింది. డ్యామ్లో మిషన్ భగీరథకోసం 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలారు. మొదట 800 మీటర్లు కుంగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్యామ్ పటిష్టతకోసం లోపలిభాగంలో మొత్తం 8 కిలోమీటర్ల మేర రాతికట్టను నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం కేటాయించిన రూ.16 కోట్లకు అదనంగా నిధులు అవసరమవుతాయని ఇంజినీర్ల బృందం సూచించింది. ఎన్డీఎస్ఏ బృందం డ్యామ్ను పటిష్టతను అంచనా వేశారు. డ్యామ్ మరమ్మతు పనులను పర్యవేక్షించిన బృందంలో కమిటీ చైర్మన్ విజయ్ ట్రింబక్ దేశాయ్ సారధ్యంలో మురళీధర్, సతీశ్కుమార్ రేగొండ, శ్రీకాంత్, రాజు, లక్ష్మణరావు ఉన్నారు. ఈ సీజన్లో పూర్తి కానట్లే... డ్యామ్ రివిట్మెంట్ పనులు జూన్లోగా పూర్తి చేసి వానాకాలం పంటకు సాగునీరు ఇవ్వాలని మంత్రు లు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర నీటిపారుదల శాఖ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. డ్యామ్లో మరో 8 టీఎంసీల నీరు ఉందని ఆనీటిని తాగునీటికి వదులుతూ నీరు తగ్గిన కొద్దీ పనులు జరిపించాలని ఇంజినీర్లు చెబుతున్నారు. దీంతో మరో రెండు పంటల వరకు క్రాఫ్ హాలీడే ప్రకటించాల్సి రావచ్చని తెలిపారు. -
ప్రజాప్రతినిధుల పట్టు
ప్రజాప్రతినిధుల వాదనలిలా.. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన పోరు కొనసాగుతోంది. జిల్లాకు మంజూరైన రూ.41.99 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ పనులను తామే నిర్ణయిస్తామని ఇరుపార్టీల ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పోటాపోటీగా పనుల ప్రతిపాదనల జాబితాలను పంపుతున్నారు. దీంతో ఎవరి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు రూ.52.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, పాఠశాలల్లో టాయిలెట్లు, మహిళా సంఘాల భవనాలు, కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.10.63 కోట్లు ఖర్చయ్యాయి. మిగిలిన రూ.41.99 కోట్లకు సంబంధించిన నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే ఈ నిధుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము సూచించిన పనులనే చేయాలని ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రజల చేత ఎన్నుకున్న తామే ఈ పనులను ప్రతిపాదిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఎవరెవరు ఎన్ని రూ.కోట్ల పనులంటే.. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ.రెండు కోట్లు, కాంగ్రెస్ నేతలకు కూడా రూ.2 కోట్ల నిధుల చొప్పున పనులు కేటాయించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సంగారెడ్డి నియోజకవర్గంలో చింత ప్రభాకర్ రూ.2 కోట్ల అంచనా వ్యయం కలిగిన సీసీ రోడ్లు పనులను ప్రతిపాదిస్తే..టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి కూడా రూ.2 కోట్ల పనులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాణిక్రావుతోపాటు, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి చెరో రూ.2 కోట్ల మేరకు సీసీ రోడ్ల పనులు ప్రతిపాదించారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా ఈ పనుల జాబితాలను పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన ఎంపీ రఘునందన్రావుతోపాటు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా చెరో రూ.2 కోట్ల మేరకు సీసీ రోడ్ల పనులను ప్రాతిపాదించే యోచనలో ఉన్నట్లు సమాచారం. సీసీ రోడ్ల నిధుల కోసం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలన ఆయా ప్రజాప్రతినిధులు పంపిన ప్రతిపాదనలు కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలోని జిల్లా కమిటీ పరిశీలిస్తోంది. డీఆర్డీఏ పీడీ జ్యోతి, పంచాయతీరాజ్ ఈఈ యుగంధర్, డీపీఓ జానకిరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి రెండు రోజుల్లో పనులను మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్లు జారీ చేయనున్నారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు, నేతలు తమ అనుచరుల కోసం ప్రతిపాదిస్తుంటారు. సుమారు రూ.ఐదు లక్షల నుంచి రూ.10లక్షల వరకు అంచనా వ్యయం కలిగిన ఈ పనులను తమ అనుచరులకు ఇప్పించుకోవడం పరిపాటి. అయితే ఈ నిధుల విషయంలో మూడు పార్టీల ప్రజాప్రతినిధులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్న తామే ఈ పనులను ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంటుంటే..తమకే ఈ పనులను ప్రతిపాదించే అధికారం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఈ నిధులు కేంద్రం నుంచి వచ్చాయని తమ ప్రతిపాదనలకే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ప్రజాప్రతినిధులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ పనుల విషయంలో మూడు పార్టీల నేతలు పట్టుబడుతుండటంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.


