breaking news
Sangareddy
-
ట్విస్ట్.. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్, అలాగే బీఆర్ఎస్లో చేరిన ఇండిపెండెంట్ సభ్యుడు పార్టీ బలాన్ని పెంచారు. దీంతో బీఆర్ఎస్ బలం 14కి చేరింది. కాంగ్రెస్ బలం మాత్రం 12 వద్ద నిలిచింది. ఈ సమీకరణలతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. ఫలితంగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు బలపడుతున్నాయి.స్థానికంగా ఈ పరిణామం పెద్ద రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్లను పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రాజ్యాంగబద్ధంగా తమకే అధికారం ఉందని వాదిస్తోంది. -
గర్భిణి మృతి..బంధువుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యమే కారణమా!సిద్దిపేటజోన్: చికిత్స పొందుతూ మహిళ మృతి చెందగా, అందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన ఆదివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... చిన్నకోడూర్ మండలం చౌడారాం గ్రామానికి చెందిన గాడిచర్ల అశ్విని(26) రెండో కాన్పు కోసం ఐదు నెలలుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో వైద్యులు స్కానింగ్ కోసం కరీంనగర్కు రిఫర్ చేశారు. అక్కడ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి బాగాలేదని గుండెలో చిల్లు ఉందని అబార్షన్ చేయాలని సూచించారు. దీంతో శుక్రవారం సిద్దిపేటలోని ఆస్పత్రిలో అబార్షన్ చేశారు. ఈ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడంతో సమీపంలో ఉన్న మరో ఆస్పత్రిలో అశ్విని గర్భసంచిని తొలగించారు. ఈ సమయంలో పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అశ్విని మృతదేహాన్ని తీసుకొచ్చి సిద్దిపేటలో ప్రసవం కోసం చికిత్స పొందిన ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వారికి నచ్చజెప్పారు. -
ఆయిల్పామ్ మొక్కల ధ్వంసం
ఆయిల్ పామ్, మామిడి, ఉసిరి తదితర పంటలు సాగు చేస్తున్నాను. పొలంలోకి వచ్చిన అడవి పందులు 100 ఆయిల్ పామ్ మొక్కలతో పాటు మామిడి, ఉసిరి పంటలను పాడు చేశాయి. వాటి బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ కందకాలు తవ్వించినా ధ్వంసం చేస్తున్నాయి. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – కిష్టన్న, రైతు, న్యాల్కల్ ఫిర్యాదు చేస్తే చర్యలు అడవి జంతువులు పంటలను పాడుచేస్తే మాకు లేదా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. రైతులు చేసిన ఫిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో మా సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పరిశీలించి పంట నష్టం వివరాలు పరిశీలిస్తారు. నివేదికలను ప్రభుత్వానికి పంపి రైతులకు పరిహారం అందేలా చూస్తాం. – అరవిందర్రెడ్డి, జిల్లా ఫారెస్టు అధికారి, సంగారెడ్డి -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటరూరల్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్ వివరాల మేరకు... గ్రామానికి చెందిన బాలగోని సాయికుమార్ (39) నాలుగు రోజుల క్రితం కొత్తగా నిర్మిస్తున్న ఇంటివద్దకు వెళ్తున్నానని తండ్రికి చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన గ్రామస్తులు దుర్వాసన రావడంతో చెట్ల పొదల్లో గమనించగా, చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సాయికుమార్ నూతన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురై ఉరివేసుకున్నాడని తెలిపారు. మృత్యుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
క్యాంపుల్లేవ్.. విందుల్లేవ్
హుస్నాబాద్: పొరుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాల్లో ఎంజాయ్ చేస్తుంటే, హుస్నాబాద్లో గెలిచిన కౌన్సిలర్లు మాత్రం ఇంటి వద్దే శివరాత్రి జాగరణ చేస్తున్నారు. మున్సిపల్ క్యాంపు రాజకీయాలు రంజుగా కొనసాగుతున్నాయి.సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపల్ క్యాంపు రాజకీయాలు విహార యాత్రలు, రిసార్టులకు వేదికగా మారాయి. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కాంగ్రెస్కే జై కొట్టారు. మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 16 స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకోగా, 4 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితాల ప్రకటన ముగియగానే క్యాంపు రాజకీయాలు ఉంటాయని, ఇతర ప్రాంతాల్లో సేద తీరవచ్చని గెలిచిన పలు పార్టీల కౌన్సిలర్లు ఊహల్లో తేలియాడారు. తీరా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు రావడం, బీఆర్ఎస్కు కేవలం 4 స్థానాలకే పరిమితం కావడంతో క్యాంపు రాజకీయాలకు అవకాశం లేకుండాపోయింది. గతంలో రెండు పర్యాయాలు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు అనివార్యమయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు పలు పార్టీలు, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లోని రిసార్టులలో విందు, వినోదాల్లో మునిగిపోయారు. కాగా ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించడం, 16న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, వెంటనే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండటంతో క్యాంపు రాజకీయాలకు పార్టీలు అంతగా ఆసక్తి చూపలేదు. మ్యాజిక్ ఫిగర్కు 2 లేదా మూడు సీట్ల తేడా ఉంటే క్యాంపు రాజకీయాలకు అవకాశం ఉండేది. కాంగ్రెస్ అధిష్టానం 16 మంది కౌన్సిలర్లను క్యాంపుల పేరిట విహార యాత్రకు తీసుకెళ్తారని అందరూ ఊహించారు. ప్రమాణ స్వీకారానికి మధ్య రెండు రోజుల గడువులో ఒక రోజు ఆదివారం శివరాత్రి. చాలా మంది కౌన్సిలర్లు శివాలయాల్లో పూజలు చేయడం, ఉపవాసాలు ఉంటారని క్యాంపులకు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించినట్లుంది. మ్యాజిక్ ఫిగర్కు చాలా దూరంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారి కౌన్సిలర్లను క్యాంపులకు తరలించడం వృఽథా ప్రయాస అని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు వివిధ క్యాంపుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్లు మాత్రం ఇంటి పట్టునే జాగరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.శివరాత్రి జాగరణలో హుస్నాబాద్లో గెలిచిన కౌన్సిలర్లు -
హెల్ప్డెస్క్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజల నుంచి హెల్ప్డెస్క్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. బైకు ఢీకొని మహిళ మృతి కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రమైన కంది–బెంగళూరు బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం... కంది తండాకు చెందిన విస్లావత్ మాలిబాయి (50) ఆదివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా కాశీపూర్ వైపు నుంచి వచ్చిన బైకు మాలిబాయిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతని వివరాలు తెలియరాలేదు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీచర్కు గురుదేవోభవ సేవ పురస్కారం
చేగుంట(తూప్రాన్)/వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు డాక్టర్ స్వప్నశ్రీ ఆదివారం గురుదేవోభవ సేవ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గురుదేవోభవ ట్రస్టు ఆధ్వర్యంలో సేవ పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. టీచర్ స్పప్నశ్రీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ట్రస్టు చైర్మన్ మాజీమంత్రి యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అవార్డు అందజేశారు. ఆమె అవార్డు అందుకోవడంపై సర్పంచు మనోహర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు నిజాంపేట(మెదక్): కారు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులోని ఎన్హెచ్ 765 డిజి రోడ్డులో గతంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కుంగడంతో అధికారులు అక్కడ తాత్కాలిక రోడ్డు వేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి కారు సిద్దిపేట నుంచి మెదక్కు వెళ్తుండగా అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమా దం జరగలేదు. నెలలోనే వరుసగా నాలుగు ప్రమాదాలు జరిగాయని, అధికారులు రోడ్డు ను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పంచాయతీ స్టార్టర్లో మంటలు
మసిరెడ్డి తండాలో ఘటనఅక్కన్నపేట(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు బోరు మోటారు స్టార్టర్లో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటన మండలంలోని మసిరెడ్డితండా గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... ఇంటింటికి తాగునీరు అందించే పంచాయతీ బోరు మోటార్ స్టార్టర్లో విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకి మంట లు వ్యాపించాయి. దీంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇంటి మధ్యలో విద్యుత్ స్తంభానికి ఉన్న మంటల్లో స్టార్టర్ కాలిపోయింది. దీంతో సమీపంలో ఇంట్లో ఉన్న వారందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కాలనీవాసులంతా అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని తండావాసులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
విఠలాపూర్లో పెద్దపులి కలకలం
● ఫారెస్టు అధికారుల గాలింపు ● భయాందోళనలో ప్రజలు చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు మండలం విఠలాపూర్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా చౌడారం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి, తాజాగా విఠలాపూర్ శివారులోకి ప్రవేశించినట్లు ఫారెస్టు అధికారులు ధృవీకరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన చింతకింది దేవయ్య, కొమ్మురాజుల యాదగిరి, దాసరి రాజు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య సిబ్బందితో అక్కడకు చేరుకొని పరిశీలించి, పులి సంచరిస్తుందని నిర్ధారించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు రాత్రి సమయంలో వెళ్లవద్దని సూచించారు. పశువులను కాపాడుకోవాలని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
నర్సాపూర్ రూరల్: యువకుడు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... నర్సాపూర్ పట్టణానికి చెందిన వలేపు నవీన్(22) ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురై జనవరి 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నవీన్ను నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మిరుదొడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి.. మిరుదొడ్డి(దుబ్బాక): మతి స్థిమితం లేని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిరుదొడ్డి ఎస్ఐ సమత కథనం ప్రకారం... మండల పరిధిలోని ధర్మారం శివారులో జనవరి 31న గుర్తు తెలియని వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులతో సహా, గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. -
అడవి పందుల బీభత్సం
పంటలు పాడు చేస్తున్న వైనం ● తీవ్రంగా నష్టపోతున్న రైతులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వినతిజిల్లాలోని న్యాల్కల్, రాయికోడ్, ఝరాసంగం, జహీరాబాద్, మానూర్, నారాయణఖేడ్, కోహీర్ తదితర మండలాల్లో అడవి పందుల సంచారం ఎక్కువగా ఉంది. కర్నాటక సరిహద్దులో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి పందులు ఎక్కువగా ఇక్కడకు వస్తున్నాయి. ప్రస్తుతం చెరకు పంటతో పాటు జొన్న, శనగ, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో అడవి పందుల గుంపు పంటలను తిని, ధ్వంసం చేస్తున్నాయని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. వాటి బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు చేను చుట్టూ పాత చీరలు కట్టడం, పొలాల చుట్టూ ఇనుప తీగలు అమర్చడం, రాత్రి వేళల్లో పటాసులు పేల్చడం లాంటివి చేస్తున్నారు. ఫలితంగా కొంత వరకు రక్షించుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు పంటలకు కాపలా వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రాత్రి ఫూట అడవి పందులు పంటలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలను తిని పాడు చేస్తున్నాయి. వాటి బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లెదుటే పంటలు పాడవడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అడవి పందుల బెడద తీవ్రమైంది. పంటలను రక్షించుకునే క్రమంలో రైతులపై కూడా దాడి చేస్తున్నాయి. –న్యాల్కల్(జహీరాబాద్) -
రగ్బీ పోటీలకు 8 మంది ఎంపిక
చేగుంట(తూప్రాన్): సౌత్జోన్ జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశ్రవికుమార్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా క్రీడాకారులు సబ్జూనియర్ విభాగంలో కల్పన, ఇందిర, అజ్మీరా, ప్రణవి, శ్రీలక్ష్మి, జూనియర్ విభాగంలో నవ్యశ్రీ, సీనియర్ విభాగంలో అనిత, నిఖిత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈనెల 21, 22న చైన్నెలోని నెహ్రూ స్టేడియంలో జరిగే రగ్బీ పోటీల్లో పాల్గొననున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి మల్లీశ్వరీ తెలిపారు. వీరికి టీమ్ కోచ్లుగా మహేశ్, రంగీలా, కావేరి వ్యవహరించనున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఐదుగురు.. వెల్దుర్తి(తూప్రాన్): ఈ నెల 20 నుంచి 23 వరకు గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి సీఎం కప్ అండర్ 14 ఫుట్బాల్ పోటీల్లో మెదక్ జిల్లా బాలుర జట్టుకు మాసాయిపేట గ్రామానికి చెందిన ఐదుగురు ఎంపికై నట్లు పాఠశాల పీడీ శ్యాంసుందర్శర్మ పేర్కొన్నారు. ఈ నెల 14న మెదక్లో జరిగిన జిల్లా జట్టు ఎంపికలో అవినాష్, అభిరామ్, అర్జున్, భాను ప్రసాద్, సాయి చరణ్ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వారితోపాటు కోచ్ శ్రీకాంత్ను సర్పంచ్ కిష్టారెడ్డి అభినందించారు. -
కేతకీ.. శివోహం
● కేతకీలో అంబరాన్నంటినశివరాత్రి వేడుకలు ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 దాటగానే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాల పూజ అనంతరం దర్శనాలు ప్రారంభించారు. క్యూలలో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గత 41 రోజులుగా శివమాల ధరించిన భక్తులు ఇరుముడి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. పూజలు నిర్వహించిన మంత్రి దామోదర కేతకీలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతాపాటిల్, మాజీ ఎంపీపీ హన్మంత్రావుపాటిల్, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సదా పట్టపురాణులే!!
● 2005 నుంచి చైర్పర్సన్లుగామహిళలు ● ఇప్పుడూ మహిళకే రిజర్వు సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపాలిటీలో 2005 నుంచి మహళ కౌన్సిలర్లే చైర్ పర్సన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 2005లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కౌన్సిలర్ కొత్తగొల్ల అనురాధ అనూహ్యంగా చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ అత్యధికంగా తొమ్మిది స్థానాలు కై వసం చేసుకుంది. చైర్పర్సన్ పదవి బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 2005లో టీడీపీ కౌన్సిలర్గా గెలిచినప్పటికీ ఆయన చైర్మన్ కాకూడదని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్, బీజేపీ, కొందరు టీడీపీ కౌన్సిలర్ల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కొత్తగొల్ల అనురాధను ఏకగ్రీవంగా చైర్పర్సన్ చేశారు. కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలుపొందినా.. 2014లో జరిగిన ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుపొందినా చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆ పీఠాన్ని ఆశించే వారు అధికంగా ఉండటంతో పట్నం విజయలక్ష్మి తన మద్దతుదారులతో కలసి టీఆర్ఎస్ పార్టీలో చేరి చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ చైర్పర్సన్ పీఠం బీసీ మహిళకే రిజర్వు అయ్యింది. టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 9, ఎంఐఎం 2, స్వతంత్ర 1 అభ్యర్థులు గెలుపొందారు. ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల సహకారంతో టీఆర్ఎస్ కౌన్సిలర్ పిల్లోడి జయమ్మ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల తర్వాత బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణపాటిల్ చైర్పర్సన్గా ఎన్నికై ఏడాదిపాటు చైర్పర్సన్ పదవి చేపట్టారు. ప్రస్తుతం చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వుకావడంతో 20వ వార్డు నుంచి గెలుపొందిన మునిపల్లి అంజమ్మ పుర పీఠాన్ని చేజిక్కించుకోనున్నారు. -
కౌన్సిలర్గా పీహెచ్డీ అభ్యర్థి
కౌన్సిలర్లలోనే ఉన్నత విద్యావంతురాలు నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికై న కౌన్సిలర్లలోకెల్లా ఉన్నత విద్యావంతురాలు సురేఖ. ఈమె రెండవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 244 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి పీహెచ్డీకి సిద్ధమవుతుండగా ఎన్నికలు వచ్చాయి. అయితే రెండో వార్డు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు రిజర్వు కావడంతో మన్సుపూర్కు చెందిన సురేఖ పోటీ చేశారు. ఘనంగా సంత్ సేవాలాల్ జయంతిన్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని న్యాల్కల్, రుక్మాపూర్, గుంజోటి, ముంగి తదితర తండాల్లో ఆదివారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. న్యాల్కల్ తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయం ఆవరణలో గిరిజనులు యజ్ఞాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆశ్రమం నుంచి ప్రారంభమైన ర్యాలీ ముంగి మీదుగా న్యాల్కల్కు చేరుకుంది. న్యాల్కల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సిద్దిలింగయ్యస్వామి, రుక్మాపూర్ సర్పంచ్ సురేశ్, నాయకులు ప్రవీణ్కుమార్, సక్కులాల్, బస్వరాజ్, యూనూస్ ఖాన్, కాశప్ప, విష్ణు, తదితరులు పాల్గొన్నారు. అలరించిన సంగీత విభావరిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి గంజి మైదానంలో ఆదివారం ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాత్రి నిర్వహించిన సంగీత విభావరి ఆహుతుల్ని ఎంతగానో అలరించింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు పాడిన భక్తి గీతాలు ఆధ్యాత్మిక శోభను నింపాయి. వీణా విద్వాంసురాలు వీణావాణి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. నేపథ్య గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మనో, శ్రీ కృష్ణ, గాయనీమణులు కల్పన, సురేఖదివాకర్ల, మాళవిక తదితరులు పాటలు పాడి అలరించారు. కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం చైర్మన్, వైస్చైర్మన్ల ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న సందర్భంగా ప్రజావాణి నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ ప్రజావాణి దృష్ట్యా ఎవరూ కలెక్టరేట్కు రావొద్దని తెలిపారు. వచ్చే శివరాత్రికి గౌరవెల్లికి గోదారి జలాలు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ రూరల్: మెట్ట ప్రాంతానికి ‘గంగ’ను విడిచి కరువును పారద్రోలాలని పరమశివుడిని ప్రార్థించానని, వచ్చే శివరాత్రి వరకు గౌరవెల్లి ప్రాజెక్టులోకి గోదారి జలాలు తెస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాల్లో పొట్లపల్లి స్వయంభు రాజేశ్వరస్వామికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి శివుడికి పాలాభిషేకం చేశారు. ప్రజలు సంతోషంగా ఉండాలని, వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి తన కృషికి తోడు హరహర మహాదేవుడి అనుగ్రహం ఉంటే గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వలకు గోదావరి నీళ్లు పరుగులు తీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, స్వామివారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. -
కోహీర్ పీఠంపై కౌన్!!
● మ్యాజిక్ ఫిగర్కు ఒకస్థానందూరంలో కాంగ్రెస్ ● స్వతంత్రులు, ఎంఐఎం మద్దతు ఇచ్చేఅవకాశం!జహీరాబాద్: కోహీర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక లాంఛనమే అయినట్లు సమాచారం. సోమవారం నిర్వహించనున్న చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు అభ్యర్థిత్వాలు ఖరారవగా అధికారిక ప్రకటనే మిగిలినట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వు అయింది. మున్సిపాలిటీలో 16 వార్డులకుగాను 8 వార్డులను కాంగ్రెస్, 5 వార్డుల ను బీఆర్ఎస్లు గెలుచుకున్నాయి. ఒక్కోస్థానంలో బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు ఒకస్థానం దూరంలో ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ శిబిరంలో ఉన్నట్లు, ఎంఐఎం కూడా మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అశోక్, శిరీషలు ఆశిస్తూ వచ్చారు. ఎన్నికకు ముందు అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన కోహీర్ పురపీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. -
జహీరా‘బాద్షా’పై సస్పెన్స్
● కాంగ్రెస్, బీఆర్ఎస్లో చైర్మన్ పదవికి నెలకొన్న పోటీ ● పూర్తి మెజార్టీ లేకున్నా చాంతాడంత ఆశావహులుజహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికీ పీటముడి వీడలేదని సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పూర్తి మెజార్టీ లేకున్నా చైర్మన్ పదవి విషయంలో ఆశావాహుల సంఖ్య మాత్రం ఈ రెండు పార్టీల నుంచి చాంతాడంతా ఉంది. కౌన్సిల్లో 37 స్థానాలకుగాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. రెండు స్థానాల్లో ఎంఐఎం, మూడు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు 19 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ తనకు ఉన్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకునే పనిలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులతోపాటు ఎంఐఎం అభ్యర్థులు ఇప్పటికే కాంగ్రెస్కు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం సాగుతోంది. అయినా చైర్మన్ పదవి ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఐదుగురు అభ్యర్థులు చైర్మన్ పదవిని గట్టిగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కౌన్సిలర్లతోపాటు పార్టీ ముఖ్య నాయకులతో అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరమే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు తగినంత కోరమ్ సమకూర్చుకున్నట్లయితే చైర్మన్ అభ్యర్థి ఎంపిక ఒక రోజు ముందుకు జరిగే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్లో సైతం చైర్మన్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. ముగ్గురు వ్యక్తులు చైర్మన్ పదవిని బలంగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి మెజార్టీ లేకపోవడంతో బీజేపీ సభ్యులతోపాటు ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు కూడగట్టి చైర్మన్ పదవిని దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. అందులోభాగంగానే ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ సభ్యులతో ఎక్స్అఫీషియో సభ్యత్వం కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేయించింది. వీరి దరఖాస్తులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒకవైపు చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీల అధిష్టానవర్గాలకు తలనొప్పిగా మారగా, మరోపక్క పదవిని దక్కించుకునేందుకు అవసరమైన బలాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన భారంగా పరిణమించింది. దీంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. చైర్మన్ పదవిని దక్కించుకునే విషయంలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే. -
వనదుర్గమ్మకు వందనం
ఏడుపాయల్లో పోటెత్తిన భక్తజనం ● మార్మోగిన శివ నామస్మరణం పాపన్నపేట(మెదక్): ఎల్లలు దాటి తరలి వచ్చిన భక్తులతో వనదుర్గమ్మ సన్నిధి జన సంద్రంగా మారింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగే జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన ఏడుపాయల జాతరలో ప్రభుత్వం తరఫున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, శివానీ దంపతులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. పూజలు చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ నగేశ్, ఈఓ వీరేశం, ఏపీ చంద్రశేఖర్ అమ్మవా రికి, శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంజీరా నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి పూజలు, గంగమ్మకు హారతినిచ్చి జాతర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఈ జాతర కనులపండువగా నిర్వహిస్తామన్నారు. ఇందు కోసం మూడు వేల మంది సిబ్బందితో ఏర్పాట్లు చేశామని చెప్పారు. జాతరకు భారీ ఏర్పాట్లు ఉదయం నుంచి మొదలైన భక్తుల రాక సాయంత్రానికి జోరందుకుంది. ఏడుపాయలకు తరలి వచ్చిన భక్తులు శివాలయంలో శివదీక్షలు చేపట్టి సాయంత్రానికి పండ్లతో ఉవవాసాన్ని విడిచారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పార్కింగ్ స్థలం నుంచి జాతర వరకు ఉచిత బస్సులు నడిపారు. వీటిని కలెక్టర్ రాహుల్రాజ్ ప్రారంభించారు. ట్రాఫిక్ ఇబ్బంది, ధర్శన ఇక్కట్లు లేకుండా ఎస్సీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిరంతర తాగునీరు, విద్యుత్ను అధికారులు అందించారు. డాక్టర్ దీక్ష ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సేవలు అందించారు. -
కారు బోల్తాపడి ఒకరు మృతి
ముగ్గురికి స్వల్ప గాయాలు పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రేశం మున్సిపాలిటీకి చెందిన ముజీబుద్దీన్ (29) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున స్నేహితులు షేక్ అస్లాం, చంద్రశేఖర్, నిత్యానంద్తో కలిసి ఇంద్రేశం నుంచి ఇస్నాపూ ర్కు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో పోచారం సమీపంలోని నక్క వాగు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముజీబుద్దీన్ తీవ్రంగా గాయపడగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ముజీబుద్దీన్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేశారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు 15 మంది ఎంపిక
ముగిసిన జిల్లా స్థాయి యోగాసన పోటీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): యోగాసన పోటీల్లో పలువురు రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్ తెలిపారు. జిల్లా యువజన క్రీడా శాఖ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయ ఆవరణలో సీఎం కప్ యోగా సెలక్షన్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ఎవరైతే యోగా సాధనకు దగ్గరుంటారో వారు ఆరోగ్యంగా ఉంటారని, చదువుల్లో, అన్ని రంగాల్లో వికసిస్తారన్నారు. కాగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 15 మంది ఎంపికయ్యారుని తెలిపారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ప్రముఖ యోగా శిక్షకురాలు సంధ్య, న్యాయ నిర్ణీతలుగా రాజ్కుమార్, శ్రీనివాస్ , సంధ్య, కిషన్, శ్రీ ప్రసన్న, వ్యాయామ ఉపాధ్యాయులు, సభ్యులు పాల్గొన్నారు. -
జహీరాబాద్ పీఠం ఎవరికో?
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ 11వ కౌన్సిల్ చైర్మన్ పదవి ఎవరిని వరించనుందో వేచి చూడాలి. ఇప్పటి వరకు 8 మంది వ్యక్తులు చైర్మన్ పదవులు చేపట్టారు. వీరిలో బండమీది చంద్రయ్య, మంకాల్ సుభాష్ రెండేసి పర్యాయాలు చైర్మన్గా కొనసాగారు. ప్రస్తుతం చైర్మన్ పదవి బీసీ జనరల్ కేటగిరి కింద రిజర్వు అయింది. ఎన్నికల్లో గెలిచి వచ్చిన అనంతరమే చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయమై నిర్ణయిస్తారని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిష్టానవర్గాలు ఎన్నికల ముందు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగియగా హంగ్ ఏర్పడింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. హంగ్తో ఉత్కంఠ మున్సిపల్ పరిధిలో 37 వార్డులు ఉండగా చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే.. 19 వార్డు కౌన్సిలర్ల మద్దతును కూడగట్టుకోవాల్సి ఉంది. చైర్మన్ పదవికి ఈనెల 16న ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 37 స్థానాలున్న కౌన్సిల్లో బీఆర్ఎస్ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, ఎంఐఎం రెండు స్థానాల్లో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. 2014లో చైర్మన్ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవికి అవసరమైన మెజారిటీ ఉన్నా అనూహ్యంగా బీఆర్ఎస్ దక్కించుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో.. తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి చైర్మన్ పదవి తన ఖాతాలో వేసుకుంది. చైర్మన్ పదవికి బీఆర్ఎస్కు చెందిన ముత్యాల లావణ్య, తెలుగుదేశం పార్టీకి చెందిన షబానాబేగం తీవ్రంగా పోటీపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చి చెరి సగం కాలం పాటు చైర్మన్ పదవిలో కొనసాగేందుకు నిర్ణయించారు. దీంతో ఇద్దరు రెండున్నర సంవత్సరాల పాటు పదవిని చేపట్టారు. అనంతరం కోర్టులో కేసు ఉన్న కారణంగా అప్పటి నుంచి జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ హంగ్ ఏర్పడి చైర్మన్ పదవి ఎంపిక విషయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కొత్త చైర్మన్పై ఉత్కంఠ -
అవమానం భరించలేక భర్త ఆత్మహత్య
నారాయణఖేడ్: భార్య, ఆమె సోదరులు కలిసి దాడి చేయడంతో అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... ఖేడ్ మండలం పీర్లతండాకు చెందిన వంక్లోత్ రమేశ్(36)కు 11ఏళ్ల కింద వివాహమైంది. ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. కొంత కాలంగా ఖేడ్ పట్టణంలోని ఏఎస్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొద్ది రోజులుగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదని అనుమానించి ప్రశ్నించాడు. దీంతో అతడి భార్య తన సోదరులను పిలిపించి శుక్రవారం రాత్రి భర్త రమేశ్పై దాడి చేశారు. మనస్తాపానికి గురైన రమేశ్ అద్దె ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి సంతుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రమేశ్ను అతడి భార్య, ఆమె సోదరులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి సోదరులు, కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. కూలిన స్వాగత తోరణం కూలీలకు గాయాలు చేర్యాల(సిద్దిపేట): స్వాగత తోరణం కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తదొమ్మాట గ్రామశివారులో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ స్వాగత తోరణ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కర్రలు కూలడంతో అక్కడ పనులు చేస్తున్న నలుగురు కూలీలు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
కేతకీకి శివరాత్రి శోభ
● విద్యుత్ కాంతులీనుతున్న ఆలయం ● తరలిరానున్న నాలుగు రాష్ట్రాల భక్తులు ● ఆలయం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ● భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి వేడుకలకు ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని భక్తులు తరలి రానున్నారు. ప్రతీ ఏటా తొమ్మిది రోజులపాటు జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, స్వామి వారి విమాన రథోత్సవం ఉంటాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. ప్రధాన చౌరస్తాలో భారీ కమాన్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు మొత్తం విద్యుత్ దీపాలతో వెలుగులీనుతోంది. దివ్యాంగులకు ప్రత్యేక క్యూ విగ్రహాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. ధర్మ, ప్రత్యేక, వీఐపీ లైన్లతో స్వామివారికి దర్శించుకునే సదుపాయం కల్పించారు. శివదీక్ష భక్తులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, చలువ పందిర్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం హెల్త్ క్యాంపులు, పోలీస్ చెక్ పోస్టులు, సహాయ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఆధ్వర్యంలో జహీరాబాద్ నుంచి కేతకీ ఆలయం వరకు ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం ఆదివారం సెలవు రావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుమారు 5 లక్షలకు పైగా రావచ్చని అంచనా వేస్తున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ,రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు హాజరుకానున్నారు. -
శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా
ఒత్తిడిని దూరం చేసేందుకు చర్యలుశతశాతం కోసమే ప్రతీ సబ్జెక్టుపై అవగాహన విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలి. ప్రణాళికతో చదివితే సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించవచ్చు. గణితంలో మంచి మార్కులు సాధించాలంటే సూత్రాలపై ఉచితంగా పట్టు అవసరం. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతీ రోజు ఒక్కో సబ్జెక్టుపై ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు,పరీక్షలు నిర్వహిస్తున్నాం. – శోభారాణి, ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ సంగారెడ్డిప్రాక్టీస్ టెస్టులు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు వరుసగా ప్రాక్టీస్ టెస్టుల నిర్వహణ మార్చి 14 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు పదో తరగతి విద్యార్థులు మొట్టమొదటి పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొంటున్న సమయంలో కాస్త భయంతో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల్లో ఒత్తిడి భయం పోగొట్టేలా మానసిక వైద్యులు కౌన్సిలింగ్ కల్పిస్తున్నారు. ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 522 పాఠశాలల్లో 27816 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయన్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ నుంచే ప్రత్యేక తరగతులు -
భర్త మృతి తట్టుకోలేక..
భార్య ఆత్మహత్య నర్సాపూర్ రూరల్: చెరువులో దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నర్సాపూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని చిన్న చింతకుంట గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి (58) భర్త శివరాములు నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనస్తాపానికి గురై బాధపడుతుంది. శుక్రవారం నర్సాపూర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి రాయరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికారు. రాయరావు చెరువు వద్ద లక్ష్మి చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో శనివారం తిరిగి గాలింపు చేపట్టగా లక్ష్మి మృతదేహం చెరువులో లభించింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధ తాళలేక మెకానిక్... సిద్దిపేటఅర్బన్: అప్పుల బాధ తాళలేక మెకానిక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. త్రీటౌన్ ఎస్ఐ వెంకటేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఇర్రి సంతోష్రెడ్డి (33) రంగధాంపల్లిలో కొంత కాలంగా కారు మెకానిక్ షెడ్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తల్లిదండ్రులు మాధవరెడ్డి, అరుణ, భార్య తేజశ్రీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎప్పటిలాగే మెకానిక్ షెడ్డుకు పనికి వచ్చిన సంతోష్రెడ్డికి రాత్రి 10 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు ఫోన్ చేయగా ఇంటికి వస్తున్నానని చెప్పాడు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో షెడ్డుకి వచ్చి చూడగా అక్కడే ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. -
కుట్రదారులెవరు..?
జోగిపేట(అందోల్): మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలపై అభ్యర్థులు బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తమకు చెయ్యిచ్చిందెవరు? చేయూతనిచ్చిందెవరు? అన్న విషయంలో ఆరా తీస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రతీ మున్సిపాలిటీలో కూడా ఈ విషయమై చర్చ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జిల్లా మొత్తంలో బీజేపీ 16 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోగా, ఎంఐఎం పార్టీ సంగారెడ్డి, జహీరాబాద్లలో మూడు స్థానాలను గెలుచుకుంది. విజయం సాధించిన వారు గెలుపు సంబరాల్లో ఉండగా, ఓటమిపాలైన వారు మాత్రం అందుకుగల కారణాలను పోస్టుమార్టం చేస్తున్నారు. ఏ కులాలు, మతాల వారు తమకు ఓటు వేయలేదు. ఓటర్లను అన్ని విధాలా ప్రభావితం చేయగలిగినా ఎందుకు మనకు ఓటు వేయలేకపోయారు? పార్టీ విధానాలు, నాయకుల పట్ల అసంతృప్తే కారణమా? అన్న కోణంలో కారణాలను విశదీకరించుకుంటున్నారు. అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినా ముఖ్య నాయకుల ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు. సొంత పార్టీలోనే కుట్రలు చాలాచోట్ల సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు తమ అభ్యర్థుల ఓటమికి కారకులయ్యారన్న ఆరోపణలున్నాయి. ఎదుటి పార్టీ ప్రలోభాలకు లొంగడమే కాకుండా, తమకు టికెట్టు దక్కకపోవడంతో దక్కిన వారిని ఓటమి చెందేలా కుట్రలు చేశారు. జోగిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్టీలోని ముఖ్య నాయకులు పనిచేయకుండా రెబల్గా పోటీ చేసిన అభ్యర్థికి పూర్తిస్థాయిలో అండగా నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారకులయ్యారు. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి ఒక ముఖ్య నాయకుడి సోదరుడు మైనార్టీ నాయకుడితో కలిసి కుట్రలు చేసి వందకుపైగా ఓట్లను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చేలా చేశారు. అయినా ఆ వార్డులో తట్టుకుని 200కుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నాయకులే కారకులయ్యారు. 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు బహిరంగంగానే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసినా ఓట్ల శాతం తగ్గినా గెలుపొందారు. 11వ వార్డుకు చెందిన నాయకుడు 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 19వ వార్డులో ముఖ్య నాయకుడు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని గెలుపొందిన అభ్యర్థి ఆరోపించడం విశేషం. 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయి ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి కారకులయ్యారు. 3వ వార్డులో ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించినట్లు ఆరోపణలున్నాయి.చెయ్యిచ్చింది.. చేయూతనిచ్చింది? మున్సిపల్ ఫలితాల విశ్లేషణలోబీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు సొంత పార్టీల్లోనే బయటపడ్డ లుకలుకలు -
ఖేడ్లో అగ్నిప్రమాదం
రూ.2 లక్షల ఆస్తి నష్టం నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని శ్రీ సృష్టి ట్రేడర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. బాల సాహితీవేత్తల సేవలు భేష్ప్రశాంత్నగర్(సిద్దిపేట): సాహిత్య అభివృద్ధిలో విశేష సేవలు అందిస్తున్న సిద్దిపేట బాల సాహితీవేత్తల కృషి గొప్పదని, తెలంగాణ సారస్వత పరిషత్ శాశ్వత సభ్యులు గరిపల్లి అశోక్ అన్నారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన బాలసాహితీవేత్తల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ... సిద్ధిపేట బాలసాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన బాలల ప్రపంచం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలసాహితీవేత్తలు ఉండ్రాళ్ల రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, బైతి దుర్గయ్య, వరుకోలు లక్ష్మయ్య, అనిశెట్టి సతీశ్, లింగేశ్వరశర్మ, శ్రీనివాస్ రెడ్డి, నిర్మల, సత్యలక్ష్మి పాల్గొన్నారు. వానరానికి అంత్యక్రియలు న్యాల్కల్(జహీరాబాద్): మండల కేంద్రంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి హనుమాన్ ఆలయం వద్ద కోతి పిల్ల ఇళ్లపై ఇటు అటూ దూకుతుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై మృతి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ యువకులు మృతి చెందిన కోతికి హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో దిలీప్కుమార్, ఈరన్న, తదితరులు పాల్గొన్నారు. ట్రాలీ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం చిన్నశంకరంపేట(మెదక్): ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రంలో ఓ ఇంటి నిర్మాణానికి చేగుంట నుంచి స్టీల్ తీసుకువస్తుండగా సూరారం చౌరస్తాలో ఆటో బోల్తాపడింది. స్పీడ్ బ్రేకర్ వద్ద రోడ్డు అంచునకు వచ్చిన ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆటో ముందు భాగం అద్దాలు పగిలాయి. స్థానికుల సహాయంతో స్టీల్ను ఆటోలో నుంచి బయటకు తీసి ఆటోను లేపారు. గంజాయి పట్టివేత రాయికోడ్(అందోల్): ఎండు గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్రెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని నల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సాగు చేస్తున్న పంట పొలం, అతని ఇంటిపై దాడులు నిర్వహించారు. నిందితుడి వద్దనుంచి 850 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు రమేశ్, మురళి, శాంతి, హెచ్సీ యాదయ్య, శంశోద్దీన్, సిబ్బంది ఉన్నారు. సెల్టవర్ ఎక్కి యువకుడి హల్చల్ జోగిపేట(అందోల్): తన డబ్బులు దొంగిలించారని తీవ్ర మనస్తాపం చెందిన వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. వివరాలు.. జోగిపేటకు చెందిన మార్కల అశోక్ శుక్రవారం రాత్రి బాగా మద్యం తాగి పడుకున్నాడు. తెల్లవారే సరికి అతడి జేబులో ఉన్న రూ.4,500 కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. ఈ క్రమంలో అతడు దగ్గరలోని సెల్టవర్ ఎక్కాడు. ఆ పరిసర ప్రాంతంలోనే పనిచేస్తున్న అశోక్ చిన్నమ్మ, విషయం తెలుసుకున్న అతడి సోదరుడు, స్థానికులు, వచ్చి నీ డబ్బులు మేం ఇస్తామని నచ్చజెప్పగా గంట తరువాత కిందకు దిగాడు. ఎవరిపై అనుమానం ఉందో చెబితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అతడిని శాంతింపజేశారు. -
ఈజీగా డబ్బు సంపాదించాలని..
● చోరీలు, దారి దోపిడీలు.. దొంగల అరెస్టు ● కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ సదానందం మద్దూరు(హుస్నాబాద్): వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం చేర్యాల పోలీస్ స్టేషన్లో హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన గుండెల్లి రమేశ్, లింగాపూర్కు చెందిన మాసంపల్లి రాములు సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నర్సయపల్లిలో బెల్ట్షాప్ నిర్వాహకులు ఏల్లా కవితతో పాటు ఆమె భర్త వెంకటేశంను బెదిరించి ఆమె మెడలోని 3తులాల బంగారు పుస్తెలతాడు, 2తులాల నల్లపూసల తాడు, రూ.53వేలు ఎత్తుకెళ్లారు. బైరాన్పల్లి గ్రామంలో చామంతుల కల్పన మెడలో నుంచి బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అలాగే జాలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 10తులాల పట్టాగొలుసులు, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లారు. కూటిగల్ సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళుతున్న ఖాతాకు చెందిన కొలిపాక లింగంను మార్గమధ్యలో కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న గొర్రెపిల్ల,సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. చోరీ డబ్బులతో రమేశ్, రాములు క్రికెట్ బెట్టింగ్లు, గోవా క్యాసినోతో పాటు ఇతరత్ర జూదాల్లో పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం లింగాపూర్ గ్రామ శివారులో బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలు, బైక్ ,కత్తితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చేర్యాల సీఐ రమేశ్, మద్దూరు ఎస్ఐ మహ్మద్ అసీఫ్ ఉన్నారు. -
క్రికెట్ చాంపియన్ కరీంనగర్
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ కేంద్రంగా వారం రోజులపాటు నిర్వహించిన అండర్–19 క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జట్టు చాంపియన్గా నిలిచింది. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో శనివారం ఫైనల్ పోటీలు నిర్వహించారు. కరీంనగర్ , మెదక్ జట్ల మధ్య నిర్వహించిన పోరులో.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ నిర్ణీత 50 ఓవర్లకు 39.5 ఓవర్లు ఎదుర్కొని 260 పరుగులు సాధించింది. కరీంనగర్ జట్టులో బ్యాట్స్మెన్ తక్షిల్ 104 బంతులు ఎదుర్కొని 145 పరుగులు సాధించగా, మెదక్ బౌలర్ హిషాంత్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన మెదక్ జట్టు 29.5 ఓవర్లు ఎదుర్కొని 153 పరుగులు సాధించి అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో కరీంనగర్ జట్టు 108 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెదక్ బ్యాట్స్మెన్ విఘ్నేశ్ 36 పరుగులతో రాణించాడు. కాగా వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి సీనియర్ క్రీడాకారుడు శరత్చంద్ర ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ ప్రతినిధి మనోహర్రావు, మెదక్ కార్యదర్శి రాజేంద్రరెడ్డి, మార్నేని ఉదయభానురావు, కుమార్, బండారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
శుచి, శుభ్రత పాటించాల్సిందే
ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్ ఝరాసంగం(జహీరాబాద్): జాతరలో భాగంగా కొనుగోలుదారులకు అమ్మే తినుబండారాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్ దుకాణదారులకు సూచించారు. శనివారం ఝరాసంగంలోని ఆలయంలో లడ్డూ తయారీతోపాటు పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుకాణాల పరిసరాలలో తప్పనిసరిగా శుచి, శుభ్రతను పాటించాల్సిందేనన్నారు. కల్తీ పదార్థాలు వాడకూడదని, తిను బండారాలపై తప్పనిసరిగా కవర్లు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతోపాటు సిబ్బంది రవి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ విప్ కాపీ అందజేతజిన్నారం (పటాన్చెరు): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీమంత్రి పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తరఫున నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి మున్సిపల్ కమిషనర్ తిరుపతిని శనివారం ఆయన కార్యాలయంలో కలిసి విప్ అందజేశారు. సోమవారం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో విప్ జారీ చేయడం విశేషం. గులాబీ గూటికి ఇద్దరు స్వతంత్రులుపార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పటాన్చెరు: ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఇద్దరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ ఎల్లకొండ రాహుల్రెడ్డి, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కౌన్సిలర్ సార లావణ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఎమ్మెల్యే తెలిపారు. జిన్నారంలో కూడా... జిన్నారం మున్సిపల్ ఎన్నికల్లో 9 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీలత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు కూడా పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. పేట మున్సిపాలిటీలో మహిళల హవామొత్తం 26వార్డుల్లో 17 మంది మహిళలే సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపాలిటీలో 26 వార్డులుండగా 17 స్థానాల్లో మహిళలు గెలుపొందారు. చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేయగా మహిళలు రిజర్వేషన్తోపాటు జనరల్స్థానాల్లోను పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 3వ వార్డు రేణుక, 5వ వార్డు ఫాతిమా, 7వ వార్డు పాతదొడ్డి అనిత,11వ వార్డు గౌరీప్రియాంక, 12వ వార్డు పులిమామిడి మమత, 15వ వార్డు గౌసియాబేగం, 16వ వార్డు కొత్తగొల్ల లావణ్య ,18వ వార్డు బిట్ల నిఖిత, 19వ వార్డు రోజా పట్లూరి 20వ వార్డు మునిపల్లి అంజమ్మ, 23వ వార్డు లక్ష్మిప్రియా గెలుపొందగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి 6వ వార్డు నాగులమాణెమ్మ, 13వ వార్డు ఎర్ర విశాలి, 24వ వార్డు శభణమ్, 26వ వార్డు అపర్ణపాటిల్, బీజేపీ నుంచి 14వ వార్డు ఉల్లిగడ్డ ఉమారాణి, 22వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గారెల గౌరీదేవిలు ఎన్నికయ్యారు. -
తేడా 4.90
శాతమేసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్ల శాతంలో తేడా స్వల్పంగానే ఉంది. జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలను కై వసం చేసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్ల తేడా కేవలం 4.90% ఉంది. ఈ ఎన్నికల్లో 11 మున్సిపాలిటీల్లో కలిపి అధికార కాంగ్రెస్కు 37.98%ఓట్లు రాగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు 33.08% ఓట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీ 11.07% ఓట్లు సాధించింది. జిల్లాలో మొత్తం 3,18,118 ఓట్లు ఉండగా, ఇందులో 2,42,104 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్కు 91,956 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ 80,112 ఓట్లు సాధించింది. బీజేపీకి 26,809 ఓట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు.. రెండు.. మొత్తం 11 మున్సిపాలిటీలు ఉండగా కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీలు సంగారెడ్డి, సదాశివపేట, అందోల్–జోగిపేట, నారాయణఖేడ్లలో స్పష్టమైన మెజారీటీ సాధించి చైర్మన్ పీఠాలను కై వసం చేసుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపా లిటీల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. హంగ్ ఫలితాలు వచ్చిన ఇద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. కోహీర్లో మాత్రం హస్తం పార్టీనే పైచేయి సాధించింది. ఎందుకు ఓడిపోయాం? బల్దియా ఎన్నికలపై ఆయా పార్టీలు పోస్టుమార్టం చేసుకుంటున్నాయి. తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. ఆయా పార్టీలు ఓటమి పాలు కావడానికి ఏయే అంశాలు ప్రతికూలంగా మారాయనే అంశంపై లోతైన పరిశీలన చేసుకుంటున్నాయి. తిరుగుబాటు(రెబెల్స్) అభ్యర్థులే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీనే ఉదాహరణగా తీసుకుంటే రెబెల్ అభ్యర్థులు గులాబీ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఓటమి పాలైన మున్సిపాలిటీల్లో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనిపించింది. బీజేపీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చడంలో ఆపార్టీ ముఖ్యనాయకత్వం ఆశించిన మేర చొరవ చూపలేదనే అభిప్రాయం కమలం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగితే.. సంగారెడ్డి జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్లు ఫలితాలపై పార్టీల పంచనామా -
తమ్ముడి దశ దినకర్మ రోజే..
అన్నకు గుండెపోటు.. మృతి శివ్వంపేట(నర్సాపూర్): తమ్ముడి దశ దినకర్మ రోజే అన్న మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వికలాంగుడైన ఇసుగారి లక్ష్మయ్య పది రోజుల క్రితం బాత్రూంలో జారిపడి బ్రెయిన్డెడ్తో మృతి చెందాడు. శనివారం లక్ష్మయ్య దశ దినకర్మ ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు, బంధువులు నిమగ్నమయ్యారు. ఇంతలోనే లక్ష్మయ్య సోదరుడు భిక్షపతి ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. పది రోజుల వ్యవధిలోనే తమ్ముడు, అన్న మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దశ దినకర్మకు వచ్చిన బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. -
రెండోసారి ఆ కుటుంబానిదే విజయం
నర్సాపూర్: మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో పట్టణంలోని 15వ వార్డు నుంచి రెండు కుటుంబాల మధ్య పోటీ జరగగా, ఒకే కుటుంబాన్ని రెండు సార్లు విజయం వరించింది. మొదటి సారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పంబల్ల లలిత, కాంగ్రెస్ నుంచి వంకమల్ల ఊర్మిళ పోటీ పడగా లలిత గెలుపొందారు. కాగా ప్రస్తుతం ఆ రెండు కుటుంబాల నుంచి ఇద్దరు మహిళలు రంగంలో నిలిచినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మారారు. గతంలో కాంగ్రెస్ నుంచి వంకమల్ల ఊర్మిళ పోటీ చేయగా ఈసారి ఆమెకు బదులుగా ఆమె కోడలు జ్యోతి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచింది. బీఆర్ఎస్ నుంచి లలిత పోటీ చేశారు. కాగా వారిద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీయగా మళ్లీ లలితను విజయం వరించింది. -
చిరుధాన్యాల సాగుకు బోనస్
ఝరాసంగం(జహీరాబాద్): చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం బోనస్ కల్పించి ప్రోత్సహించేలా కృషి చేస్తామని, కమిషన్ తరఫున ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. నెల రోజులుగా డెక్కన్ డెవలప్మెంటు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ పాత పంటల జాతర ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం మండల పరిధిలోని మాచ్నూర్ గ్రామ శివారులోని పచ్చసాలెలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు నర్సింహారెడ్డి, రామ్రెడ్డి గోపాల్రెడ్డి, రాములు నాయక్, గోపాల్, ఏడీఏ ఽసంధ్యారాణి తదితరులు హాజరయ్యారు. ముందుగా చిరుధాన్యాలతో అలంకరించిన ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి చైర్మన్, సభ్యులు నృత్యం చేశారు. అనంతరం జీవవైవిధ్య సంరక్షకులను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ డీడీఎస్ ప్రయోగశాల లాంటిదని, శాస్త్రవేత్తలు సైతం వచ్చి సాగువిధానంపై అధ్యయనం చేయాలన్నారు. పాత పంటల సాగుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. నాబార్డు అధికారులతో మాట్లాడి కోతులు, అడవి పందులు, జింకల బెడద నుంచి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషన్ సభ్యులు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంతో భూసారం నాశనం అవుతుందన్నారు. అదే విధంగా వాటితో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకోవటం ద్వారా వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి చిరుధాన్యాలు సాగు చేస్తున్న తమకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డీడీఎస్ డైరెక్టర్ దివ్య, రైతులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పాత పంటలు సాగు చేస్తున్నప్పటికీ తమకు గుర్తింపు లేదని వాపోయారు. రేషన్ దుకాణాలలో చిరుధాన్యాలు అందించాలని, అదే విధంగా కనీస మద్దతుధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధవి, డెరెక్టర్ సెంటర్ ఫర్ అగ్రో ఎకాలజీ ప్రొఫెసర్, ఏపీ వికాస కేంద్ర డైరెక్టర్ కిరణ్, జహీరాబాద్ ఏడీఓ భిక్షపతి పాల్గొన్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి పాత పంటల జాతర ముగింపు జీవవైవిద్య సంరక్షకులకు సన్మానం -
మ్యాజిక్ ‘ఫికర్’
● కారుకు రెండు.. చేతికి నాలుగు అవసరం ● ఇస్నాపూర్ కౌంటింగ్కేంద్రం వద్ద ఉద్రిక్తత పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ బల్దియాలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొనడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10 వార్డుల్లో విజయం సాధించాయి. మిగిలిన నాలుగు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్ పదవికి మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే బీఆర్ఎస్కు ఇద్దరు సభ్యులు...కాంగ్రెస్కు అయితే నలుగురు సభ్యుల మద్దతు అవసరమైంది. దీంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నించాయి. దీంతో ఇరుపార్టీల నేతలు అభ్యర్థులను తీసుకెళ్తున్నారంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను నచ్చజెప్పి ఇళ్లకు పంపించారు. -
ఖేడ్లో కాంగ్రెస్ దౌడ్
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది. మొత్తం 15 వార్డుల్లో 11 వార్డులను ఆ పార్టీ కై వసం చేసుకుంది. 2020లో ఖేడ్ మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో 15 వార్డులకు గాను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 8 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందాక బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. ఖేడ్లో జోష్తో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నాయి. గెలుపొందిన 11 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో బస్సులో క్యాంపునకు తరలివెళ్లారు. గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు కౌంటింగ్ కేంద్రంనుంచి వాహనాల్లో నేరుగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. వారిని ఎమ్మెల్యే సన్మానించారు. -
భార్య కాపురానికి రావడంలేదని..
భర్త ఆత్మహత్య కొండపాక(గజ్వేల్): భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపంలో భర్త ఆత్మ హత్య చేసుకున్నాడు. త్రీ టౌన్ సీఐ లక్ష్మిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన మరియాల అశోక్(43)తో బూర్గుపల్లికి చెందిన సంజనకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్ని నెలలుగా సంసారం విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు నెలల కిందట సంజన ఇద్దరు పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లి తిరిగి రావడం లేదు. దీంతో అశోక్ తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి వీరమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్ టేక్మాల్(మెదక్): దారిదోపిడీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మండల పోలీస్స్టేషన్లో ఎస్ఐ అరవింద్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని తంప్లూర్ గ్రామానికి చెందిన ఇటిక్యాల శ్యామల వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించి మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పారిపోతుండగా శ్యామల కేకలు వేసింది. అక్కడే పనులు చేస్తున్న రైతులు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడ్ని విచారించగా కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మిర్జాపూర్కు చెందిన కడమంచి పాపయ్య, అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన తూర్పాటి పోచయ్య దొంగతనం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. దీంతో ఆ ఇద్దరిని రిమాండ్కు పంపించారు. -
ముచ్చటగా మూడోసారి..
హ్యాట్రిక్ సాధించిన మహిళా కౌన్సిలర్లుహుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మహిళా కౌన్సిలర్లుగా గెలిపొంది తమ విజయఢంకా మోగించారు. 7వ వార్డులో గెలిపొందిన కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మ మూడో సారిగా కౌన్సిలర్గా గెలిచారు. అలాగే 18వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి వాల సుప్రజ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మహిళా కౌన్సిలర్లు వరుస విజయాలు సాధించి రికార్డును సృష్టించారు. పాలనలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయా వార్డు ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. -
హంగ్.. ఎవరు కింగ్..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చిన ఏడు బల్దియాల్లో రాజకీయం రంజుగా మారింది. ఆయా మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలతో ఆ బల్దియాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ● నర్సాపూర్లో 15 స్థానాల్లో ఐదు స్థానాలను సాధించిన బీఆర్ఎస్ మ్యాజిక్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతోపాటు, ఆ పార్టీ ఎమ్మెల్సీల ఎక్స్అఫీషియో ఓట్లతో ఈ చైర్మన్ పీఠాన్ని సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు సీట్లున్న బీజేపీ కీలకంగా మారింది. ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ, ఎక్స్ అఫీషియో సభ్యుల బలం లేక పోవడం కాంగ్రెస్కు మైనస్గా మారింది. ● మెదక్లో 32 స్థానాలకు బీఆర్ఎస్ 15 గెలుచుకోగా..14 స్థానాలను కాంగ్రెస్ సాధించింది. బీఎస్పీ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఈ రెండు పార్టీల బలం సమానంగా అయ్యాయి. ఇక్కడ బీజేపీ రెండు స్థానాలతోపాటు, ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. ● జహీరాబాద్లో బీఆర్ఎస్కు 15 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు ఇంకా నాలుగు కౌన్సిలర్ల స్థానాలు అవసరం ఉన్నాయి. కాంగ్రెస్కు 14 గెలుపొందగా, ఐదు కౌన్సిలర్లు అవసరం అవుతాయి. ఇక్కడ బీజేపీ మూడు, ఎంఐఎం రెండు, స్వతంత్రులు ముగ్గురు కీలకంగా మారారు. వీరి మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు వారి వారి స్థాయిల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ● కోహీర్లో 16 స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్కు రాగా, ఐదు బీఆర్ఎస్కు వచ్చాయి. ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లలో ఒకరి మద్దతు కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ● ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారంలో హంగ్ రావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్లు చైర్మన్ స్థానాల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎమ్మె ల్యే మహిపాల్రెడ్డి స్వతంత్రుల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇస్నాపూర్లో స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్, బీఆర్ఎస్లు క్యాంపునకు తరలించే ప్రయత్నాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. -
భోజనమైనా పెట్టరా?
మున్సిపల్ అధికారుల తీరుపైకౌంటింగ్ సిబ్బంది ఆగ్రహంజోగిపేట(అందోల్): జోగిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో పాల్గొన్న సిబ్బందికి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భోజనం ఏర్పాటు చేయకపోవడంతో కౌంటింగ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందోల్లోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 50మంది వరకు ఎన్నికల కౌంటింగ్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం కోసం మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అదేసమయంలో పోలీస్ శాఖకు మాత్రం హోటల్ నుంచి తెప్పించారు. కౌంటింగ్ సిబ్బంది కొందరు అక్కడికి వెళ్లగా మీకు ఇక్కడ భోజనం రాలేదంటూ వెనక్కి పంపించేశారు. ఉదయం కనీసం టిఫిన్లను కూడా ఏర్పాటు చేయలేదని, బీపీ, షుగర్ పేషంట్లు చాలామంది ఉన్నారని, ఇలాంటి ఎన్నికల ఏర్పాట్లు ఎక్కడా చూడలేదంటూ మున్సిపల్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. -
నేడు జెమ్కేర్ ఆస్పత్రిలో ఉచిత వెద్య శిబిరం
మెదక్జోన్: మెదక్ పట్టణంలోని ప్రముఖ కార్పొరేట్ జెమ్కేర్ ఆస్పత్రిలో శనివారం ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్యాంపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతోంది. జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మొనాలజీ, నెఫ్రాలజీ, యురాలజీ, రుమటాలజీ, విభాగాల వైద్యుల కన్సల్టేషన్ల వద్ద పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపింది. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు అందించనున్నారు. ఒకవేళ అదనపు పరీక్షలు అవసరం ఉంటే 50 శాతం రాయితీపై అందించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలకు 98497 60818 నంబర్లో సంప్రదించగలరని పేర్కొన్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికఅల్లాదుర్గం(మెదక్): మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలకు చెందిన ఇద్దరు, బాలికల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి అండర్ 18 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. గురువారం మెదక్లో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. దీంతో విద్యార్థినులు సనా అంజు, అఫ్రిన్, మౌనిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ వేద ప్రకాశ్రెడ్డి, సర్పంచ్ సౌమ్య, హెచ్ఎంలు స్వప్న, నాగరాజు, ఉప సర్పంచ్ పాండు, నాయకులు అభినందించారు. క్రీడాకారులకు మంచి భవిష్యత్తు: డీవైఎస్ఓ రమేశ్కౌడిపల్లి(నర్సాపూర్): సీఎం కప్ క్రీడలతో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని డీవైఎస్ఓ రమేశ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు పాఠశాల పీడీ పూర్ణచందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన అండర్ 15, అండర్ 18 విభాగంలో బాల, బాలికలు 70 మంది పాల్గొన్నారు. బాలికల విభాగంలో ఆరాధ్య, సహస్ర, శ్రీనిధి, మీనాక్షి, వర్షిత, నెహశ్రీ, బాలుర విభాగంలో అరుణ్, గణేశ్, సాయిఈశ్వర్, యశ్వంత్, కిరణ్ ప్రతిభ కనబర్చారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 24వరకు గచ్చిబౌలిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సరోజ తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనుల్లో అవకతవకలు రికవరీకి ఆదేశం -
ఓటమి నుంచి విజయం
నర్సాపూర్: ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను నిజం చేశారు మున్సిపాలిటీ పరిధిలోని ఆ రెండు కుటుంబాలు. గత ఎన్నికల్లో ఓటమి చెందగా, ఈసారి జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి విజయఢంకా మోగించారు. పట్టణంలోని 12వ వార్డు నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎండీ. మహమూదాబేగం పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి కుమ్మరి లక్ష్మి చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మహమూదాబేగం కోడలు సమీనా బేగం అదే వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తాజా మాజీ కౌన్సిలర్ లక్ష్మిపై గెలుపొందారు. కాగా గత ఎన్నికల్లో అత్తపై లక్ష్మి గెలుపొందగా, ఆమెను ఈసారి కోడలు ఓడించింది. -
మారిన ప్రచార పంథా..
చెట్టు కింద రచ్చబండ..సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీల్లో 11 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కంటే ఆధిక్యం సాధించడంలో హరీశ్ కీలకంగా వ్యవహరించారు. పూర్తి మెజారిటీతో ఆరు మున్సిపాలిటీలను కై వసం చేసుకున్న గులాబీ పార్టీ.. హంగ్ ఫలితాలు వచ్చిన మరో ఐదు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఎక్స్ అఫీషియో ఓట్ల (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల) ఓట్లతో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి హరీశ్రావు తన ఎన్నికల ప్రచార పంథాను మార్చారు. ఆయా మున్సిపాలిటీలకు వెళ్లి చెట్ల రచ్చబండ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో మహిళలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సాధారణ మహిళా ఓటర్లకు అర్థమయ్యేలా తనదైన శైలిలో వివరించారు. మహిళా ఓటర్లను పేరు పెట్టి పిలుస్తూ వారికి మరింత దగ్గరవడంతో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయంలో మహిళా ఓటింగ్ దోహదం చేసింది.పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహాలను అమలు చేసిన హరీశ్రావు ఈ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. ఆయా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు. రెబల్స్గా బరిలోకి దిగిన ఆ పార్టీ నాయకులతో మాట్లాడి వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. మొత్తంగా మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పకడ్బందీ వ్యూహాలను అమలు చేసి హరీశ్రావు గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ పార్టీ పట్టు నిలుపుకున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
మున్సిపల్ పదనిసలు
మొదటిసారి బీజేపీ బోణీనారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీగా అవతరించిన ఇన్నేళ్లలో తొలిసారి పురపోరులో బీజేపీ బోణీ కొట్టింది. మొదటి వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి పత్రి లలిత 142 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈమెకు 531 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మేటి సంగొండ మాధవి 389 ఓట్లు పొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి 238 ఓట్లు, సీపీఐ అభ్యర్థి బసాపురం లక్ష్మి 11, స్వతంత్ర అభ్యర్థి చాప్టా నిఖిత 59ఓట్లు పొందారు. కాగా బీజేపీ తొలిసారి ఖేడ్లో గెలుపొంది కౌన్సిలర్గా అడుగుపెట్టనున్నారు. -
వివాహిత ఆత్మహత్య
శివ్వంపేట(నర్సాపూర్): ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల పంచాయతీ సామ్య తండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం.. ఇదే మండలం బోజ్య పంచాయతీ హరిదాస్ తండాకు చెందిన బానోత్ దుర్గ్య పెద్ద కూతురు మౌనిక(19)ను ఏడాది క్రితం సామ్య తండాకు చెందిన పాత్లోత్ అజయ్తో వివాహం జరిగింది. గురువారం కుటుంబ సభ్యులు కూతురు దగ్గరికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం అర్ధరాత్రి సామ్య తండాకు చేరుకున్నారు. మౌనిక మృతికి అత్తింటివారే కారణం అంటూ ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులు భారీగా తండాకు చేరుకుని ఆందోళనకారులను అదుపుచేశారు. తన కూతురు కడుపునొప్పి బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని మృతిరాలు తండ్రి దుర్గ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. అత్తింటివారే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం ఇంట్లోని సామగ్రి ధ్వంసం -
ఏఐ కన్నా వ్యవసాయానికే భవిష్యత్తు
కౌడిపల్లి(నర్సాపూర్): ఆర్టిఫియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) కన్నా వ్యవసాయానికే ఎక్కువ భవిష్యత్ ఉంటుందని విజ్ఞానజ్యోతి విద్యసంస్థల అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత డి సురేష్బాబు తెలిపారు. గురువారం మండలంలోని తునికివద్దగల రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ, వ్యవసాయ కళాశాలలో ఆరునెలల వ్యవసాయ శిక్షణ పూర్తి చేసుకున్న 30మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేశారు. అలాగే.. వ్యవసాయ కళాశాల విద్యార్థుల వార్షికోత్సవ కార్యక్రమానికి సురేష్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. జనానికి మంచి ఆహారం అందించేందుకుం ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలన్నారు. డ్రోన్, రోబో టెక్నాలజీ సైతం వ్యవసాయంలో వినియోగం పెరుగుతుందన్నారు. మంచి పంట లు పండించాలన్న ఆలోచనలో ఉండన్నారు. విద్యార్థులకు విజ్ఞానజ్యోతి అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా 20మంది విద్యార్థులకు ఫ్యూరోనేచురల్ సంస్థ సీఎఫ్ఓ సామ్యుల్రాజ్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ ప్రతినిధి శ్రీనివాస్, హెచ్ఎం క్లాస్ ప్రతినిఽధులు గొగాయి, చేతన్కుమార్, విజ్ఞానజ్యోతి చైర్మన్ అచ్యుతరాంప్రసాద్, సీఈఓ అనురాధ, డీఎన్ రావ్, గౌతంరెడ్డి, గోపాలరావ్, డైరెక్టర్ దేవెందర్రెడ్డి, పీల్డ్ సూపర్వైజర్ జగదీష్ పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే
● శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం ● గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు గుర్తింపు ● సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతిసిద్దిపేటజోన్: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమేనని, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేయడమే సీఎం కప్ ఉద్దేశ్యమన్నారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వ్యాయమ ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు తప్పనిసరి ఎదో ఒక క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. సిద్దిపేట జిల్లా క్రీడల్లో ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చూపాలన్నారు. వచ్చే ఏడాది వ్యాయమ విద్యకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకుముందు జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య మాట్లాడారు. జిల్లాలో 17వేల మంది క్రీడాకారులు పాల్గొనేలా టార్చ్ ర్యాలీ జనవరిలో నిర్వహించి రిజిస్ట్రేషన్ చేసినట్టు పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టర్ హైమావతి శాంతి కపోతాలు ఎగురవేసి, జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ క్రీడ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ రమేష్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ రవి నాయక్, వ్యాయమ ఉపాద్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టణమెవరికో..!
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేటితో వీడనుంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీలే తప్ప భారీ ఆధిక్యతలు ఉండవని పోలింగ్ సరళితోనే అర్థమవుతుందంటున్నారు సెఫాలజిస్టులు. పెరిగిన ఓటింగ్ శాతం తమకంటే తమకేనని అన్ని రాజకీయపార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మున్సిపల్ పోరులో బుధవారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే వార్ వన్సైడ్ అన్నట్లుగా కనిపించలేదు. అత్యధిక సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య నువ్వా..నేనా..అన్నట్లుగా ఓటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వెలువడే ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించే వారిలో అత్యధిక అభ్యర్థులకు స్వల్ప మెజారిటీలే వస్తాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 10, 20, 30లోపు ఓట్ల మెజారిటీతో గెలిచే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రానున్నాయి. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లోని 256 కౌన్సిలర్ స్థానాలకు జరిగిన పోలింగ్కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 11 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి..వెయ్యి ఓట్లకు ఒక టేబుల్ చొప్పున కౌంటింగ్ చేపట్టనున్నారు. దీంతో మధ్యాహ్నమే ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం? జిల్లాలో పోలింగ్శాతం పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం చేస్తుందనే దానిపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే మూడో అత్యధిక పోలింగ్ శాతం జిన్నారంలో నమోదైంది. గడ్డపోతారంలోనూ భారీగానే పోలింగ్ శాతం రికార్డు అయ్యింది. పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకే ప్రయోజనం చేకూరుతుందని ప్రధాన పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. అలాగే మహిళా ఓటింగ్ శాతం కూడా పెరగడంపై రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. అభ్యర్థులు తమకు ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయని లెక్కలు వేసుకున్నారు. గెలుపుపై అన్ని పార్టీల ధీమా ఈ ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అభివృద్ధిని చూసి మాకే ఓటేస్తారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తుండగా, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీలు పక్కా వ్యూహాలతో ఈ ఎన్నికల్లో తలపడిన విషయం విదితమే. ఈ రెండు పార్టీలకు రెబెల్స్ కొంత ఇబ్బందులకు గురి చేశారు. ఇటు బీజేపీ, ఎంఐఎం కూడా మెరుగైన స్థానాలను దక్కించుకోబోతున్నామనే ధీమాతో ఉన్నాయి. కొన్ని కౌన్సిలర్ స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందే అవకాశాలూ కనిపిస్తున్నాయి.రహస్య ప్రాంతాలకు అభ్యర్థులు..? క్యాంపు రాజకీయాలు షురూవయ్యాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గురువారం రాత్రి క్యాంపునకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. చైర్మన్, వైస్చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క కౌన్సిలర్ ఓటు కూడా ఎంతో కీలకం కానుంది. దీంతో ఈ రెండు పార్టీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. క్యాంపునకు తరలించి చైర్మన్ ఎన్నిక జరిగే రోజు వీరిని నేరుగా ఆయా మున్సిపల్ కౌన్సిల్ హాలులోకి తీసుకువచ్చేలా ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇప్పటికే వారిని రిసార్టులకు తరలించారు. మధ్యలో శివరాత్రి ఉండటంతో వీరిని ప్రసిద్ధ శైవక్షేత్రాలకు తరలించే అవకాశాలున్నట్లు ఆయా పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. -
నిధులు రాక..నిర్వహణ లేక
జిల్లాలోని వ్యవసాయాధికారులు (ఏఈఓ)లకు రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. రైతు వేదికలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మూడేళ్లుగా రాకపోవడంతో వాటి నిర్వహణ నిలిచిపోయింది. కొన్నిచోట్ల ఏఈఓలే తమ సొంత డబ్బులతో వాటి నిర్వహణను కొనసాగిస్తున్నారు. వట్పల్లి(అందోల్): రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. 2022 సెప్టెంబర్ నుంచి రైతు వేదికల నిర్వహణకు నిధులు రావడం లేదు. దీంతో రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు భారంగా మారింది. కొంతవరకు నిర్వహణకు సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారు. 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించిన ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతువేదికల నుంచి కార్యకలాపాలు సాగించాలని సంకల్పించింది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వ్యవసాయ విస్తరణాధికారులు రైతువేదికలో రైతులకు అందుబాటులో ఉంటూ, మిగతా సమయంలో క్షేత్రాలను సందర్శించి వారికి సలహాలివ్వాలని ఆదేశాలిచ్చింది. మంచినీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి నిర్వహణ ఖర్చులకు ప్రతీ నెలా రూ.9 వేలు అందిస్తామని ప్రకటించింది. కానీ 2022 సెప్టెంబరు నుంచి వీటిని విడుదల చేయకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 116 రైతు వేదికలకు సుమారుగా రూ.4.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. సొంతంగానే భరిస్తున్న ఏఈవోలు.. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల వేదికల్లో ఉంటూ ప్రతీ రోజూ రైతులకు సందేహాల నివృతితో పాటు సేవలను అందిస్తున్నారు. వ్యవసాయ విస్తరణతోపాటు అధికారులు కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు, మైక్సెట్ వంటి సామగ్రిని ఏర్పాటు చేశారు. ప్రజోపయోగ కార్యక్రమాలు వివిధ శాఖల సమావేశాలకు వీటిని వాడుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. సమావేశం తర్వాత రైతు వేదికను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ విస్తరణ అధికారిపై పడుతోంది. ఒక కూలీని పెట్టి డబ్బులు ఇచ్చి శుభ్రం చేయిస్తున్నారు. దీంతో వీటి నిర్వహణ ఏఈవోలకు భారంగా మారుతోంది. మరోవైపు మురుగుదొడ్లు శుభ్రం చేయడానికి నిధులు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వానికి నివేదించాం రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రతీ నెల నిధులు రావాల్సి ఉంది. కొంత కాలంగా నిధులు విడుదల చేయకపోవడంతో రైతు వేదికల నిర్వహణలో ఏర్పడుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారిరైతు వేదికలకు మూడేళ్లకుపైగానిధులివ్వని ప్రభుత్వం -
ఉడకని అన్నం.. నీళ్ల చారు
నాణ్యమైన భోజనం లేదని విద్యార్థుల ఆందోళన నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ గురువారం ఆశ్రమ పాఠశాల ఎదుట రహదారిపై భోజనం పారబోసి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉడికీ ఉడకని అన్నం నీళ్లచారు పెడుతుండగా తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు విషయం తెలుసుకుని అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆందోళన నేపథ్యంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమకుమారి, ఇన్చార్జి డీడీ చందన, స్థానిక తహసీల్దారు షబానా బేగం, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి ఆశ్రమ పాఠశాలను సందర్శించి అల్పాహారం జీరా రైస్, సాంబారును స్వయంగా రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డెన్తోపాటు ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులైన ముగ్గురు ఉపాధ్యాయులు, ఏఎన్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
భవిష్యత్తరాలకు వనరులు రక్షించాలి
● డీఆర్డీఎల్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణమోహన్ ● ఏరిస్–2026 జాతీయ సదస్సు ప్రారంభం నర్సాపూర్: భవిష్యత్తరాల కోసం సహజ వనరులను సంరక్షించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ డీఆర్డీఎల్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్. కృష్ణమోహన్ చెప్పారు. గురువారం స్థానిక బీవీ రాజు ఇంజనీరీంగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏరిస్–2026 జాతీయ సదస్సు ప్రారంభో త్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో జరుగుతున్న అసాధారణ మార్పుల కారణాలను శాసీ్త్రయంగా అధ్యయ నం చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించా రు. దేశీయ, గ్లోబల్ ప్రయోజనాల రక్షణకు బలమైన వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కృష్ణ మోహన్ పిలుపునిచ్చారు. శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ వైస్ చైర్మన్ రాజగోపాల్ మాట్లాడుతూ ఏరిస్–2026ను స్లార్ కన్సార్టియంగా అభివర్ణంచి సంయుక్త పరిశోధనలకు ఒక విలువైన వేదిక కాగలదని చెప్పారు. ఎలాన్మస్క్ స్టార్ లింక్ లాంటి గ్లోబల్ ఆవిష్కరణలను ఆయన ఉదహరిస్తూ స్పష్టమైన సమస్యలను నిర్వహించడం, లోతైన పఠన అలవాట్లు, మేథో జి/్ఞాసను పెంపొందించుకోవడం అవసరాన్ని ఆయన వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంజ య్దూబె మాట్లాడుతూ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. సదస్సులో డీఆర్డీఎల్, ఎన్ఏఆర్ఎల్, ఎన్ఆర్ఎస్సీ, ఎస్పీఎల్, ఐఎండీ, ఐఐసీటీ, ఐఎన్సీఓఐఎస్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు భూశాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, ఆయా రంగాల నిపుణులు పాల్గొంటారని ఆయన చెప్పారు. డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, ఇతర ప్రతినిధు లు మృణాళిని, మేనేజర్ బాపిరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రాత్రి వేళల్లోనే సంచారం
పులి పగలు దట్టమైన పొదల్లో విశ్రాంతి తీసుకుంటూ రాత్రి సమయంలో తన ప్రయాణాన్ని సాగిస్తోంది. దాదాపు ఇప్పటి వరకు 10 పశువులను తిని ఉండవచ్చని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలో ఐదు పశువులపై దాడి చేయగా మూడు పశువులను పూర్తిగా తిన్నది. మిగతా వాటిని వదిలేసి వెళ్లడంతో వాటిని అటవీ అధికారులు పూడ్చివేశారు. పశువులను బయటకు వదలవద్దని, గుట్టల ప్రాంతాల్లో సంచరించవద్దని గుండారెడ్డిపల్లి గ్రామస్తులకు డప్పు చాటింపు వేసి సూచించారు. అలాగే పులి సురక్షితంగా పట్టుకునేందుకు ఒక బోన్ను ఏర్పాటు, డ్రోన్కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, హైదరాబాద్ జూ నుంచి నిపుణులు వచ్చారు. రిస్క్యూ టీం సైతం పరిశీలిస్తున్నారు. -
టెక్నాలజీ అందుబాటులో ఉన్నా..
ప్రస్తుత కాలంలో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికి మన అటవీ అధికారులు పాదముద్రలు, విసర్జితాలు వంటి వాటిపై మాత్రమే ఆధారపడుతున్నారు. అది దాని స్థావరాలను మార్చుకుంటూ తిరుగుతోంది. ఇప్పటి వరకు పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించలేకపోయారు. ఇప్పటికై నా అటవీ అధికారులు పులిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని ప్రజలు, వన్యప్రాణి నిపుణులు కోరుతున్నారు. పులి సంచరించిన ప్రాంతాలను, దాని పాద ముద్రలను గురువారం సీపీ రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. డీఎఫ్ఓ పద్మజ రాణిని వివరాలు అడిగితెలుసుకున్నారు. -
కదం తొక్కిన కార్మికలోకం
సంగారెడ్డి ఎడ్యుకేషన్/జహీరాబాద్ టౌన్/వట్పల్లి(అందోల్): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన లేబర్ కోడ్లపై కార్మికలోకం కదం తొక్కింది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు గురువారం సంపూర్ణబంద్ను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ గళాన్ని వినిపించారు. సీఐటీయూతోపాటు అన్ని రంగాల కార్మికుల ఆధ్వర్యంలో సంగారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు మాట్లాడారు. హైర్ అండ్ ఫైర్తో శ్రమ దోపిడీకి చట్టబద్ధత కల్పించడమేనని నూతన కార్మిక చట్టాలను అభివర్ణించారు. ఇప్పటివరకు ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులను మరింతగా దోచుకునే విధంగా లేబర్ కోడ్లను రూపొందించారన్నారు. రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేసి, కార్మికుల విద్య, వైద్యం, వివాహ, ప్రసూతి సహాయాలను నిలిపివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వట్పల్లిలో కార్మికులు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ జిల్లా నాయకులు ఎర్రొళ్ల మహేశ్ హాజరై కార్మికులకు మరణ శాసనంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జహీరాబాద్లో నాయకుల అరెస్టు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా జహీరాబాద్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తమైంది. బస్టాండ్ వద్ద రాస్తా రోకో నిర్వహించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. కార్మికులు పరిశ్రమల గేట్ల ముందు బైఠాయించి ధర్నాలు నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాశ్రావు, సీఐటీయూ నాయకులు బీరం మల్లేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
టిక్టిక్.. టిక్టిక్
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటింగ్ పూర్తయిన రోజే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీల వారీగా స్ట్రాంగ్ రూములకు తరలించారు. 1000 ఓట్లకు ఒక టేబుల్ ప్రతీ 1000 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 350 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతీ కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ పర్యవేక్షకాధికారి, ఇద్దరు అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లు ఉంటారు. వీరు మొత్తంగా 420 కౌంటింగ్ పర్యవేక్షకాధికారులు, 840 అసిస్టెంట్ సూపర్ వైజర్లను నియమించారు. అదేవిధంగా ప్రతీ మూడు టేబుళ్లకు ఒక రిటర్నింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చొప్పున 186 మందిని నియమించారు. వీరితోపాటు సామగ్రి సరఫరా చేసేందుకు అవసరం మేరకు సిబ్బందిని నియమించారు. అభ్యర్థి లేదా ఆయన తరుఫున ఎలక్షన్ ఏజెంట్తోపాటు ప్రతీ టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంట్ను లోపలికి అనుమతిస్తారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం పోలింగ్ ఓట్లు లెక్కిస్తారు. నేడే కౌంటింగ్ -
ఐదింట్లో గులాబీ జెండా!
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్కు బహుమతిగా అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో..నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కౌంటింగ్ జరిగే సమయంలో ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అధిష్టానం సూచనలకు అనుగుణంగా గెలిచిన అభ్యర్థులందరూ ప్రత్యేకంగా క్యాంపులకు చేరుకోవాలని కోరారు. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న ఐదురోజుల ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న నూతన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని ఐలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు
సంగారెడ్డి: ఎన్నికల సంఘం ఆదేశాలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని నిన్న(బుధవారం) రాత్రి 9గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి వినయ్ కుమార్. జగ్గారెడ్డిపై బీఎన్ఎస్ 223,351,352,132,329,191(2) సెక్షన్లతో పాటు 215(1)(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. FIR లో A1గా జగ్గారెడ్డి, A2గా అడ్డు అలియాస్ హమీద్లను చేర్చారు. దీనిపై సీఐ శివకుమార్ వివరణ ఇచ్చారు. అడ్డు అలియాస్ హామీద్ అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ తీసుకుని తరచుగా వస్తుండటంతో రావొద్దని చెప్పామని సీఐ శివకుమార్ స్పష్టం చేశారు. అయినా మాట వినకుండా ఎన్నికల సిబ్బందిని బెదిరించి ప్రశాంత వాతావరణానికి ఇబ్బంది కలిగించారని, గేటు వద్ద కూడా పోలీసులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడన్నారు. విధి నిర్వహణలో ఉన్న సీఐ శివకుమార్ అతన్ని వారించడంతో తాను జగ్గారెడ్డి మనిషినని చెప్పాడని, తననే ఆపుతావా.. ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తానని బెదిరించాడన్నారు. విషయం జగ్గారెడ్డికి తెలియడంతో ఆయన తన అనుచరులతో ఇంద్రానగర్ పోలింగ్ కేంద్రానికి వచ్చారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ విషయాన్ని పెద్దది చేశారన్నారు. అంతటితో ఆగకుండా తనపై దాడి చేసేందుకు యత్నించారని సీఐ శివకుమార్ తెలిపారు.ఇంకా జగ్గారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదుజగ్గారెడ్డిని పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. నిన్న జగ్గారెడ్డితో ఉన్నది గోల్కొండ రౌడీ షీటర్లేనని, కౌంటింగ్ సందర్భంగా తమపై దాడులు జరిగే ప్రమాదముందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు రక్షణ కల్పించలని డీజీపీని కోరామన్నారు. -
ప్రైవేట్ స్కూలులో అగ్నిప్రమాదం
సంగారెడ్డి టౌన్ : ప్రైవేట్ పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రద్ధా స్కూలులో ఉదయం మంటలు చెలరేగి భవనం మొత్తానికి వ్యాపించాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూలుకు సెలవు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. మంటలతో స్కూలులోని ఆఫీస్ రూమ్, విద్యార్థుల తరగతి గదులు, ఫర్నిచర్, పుస్తకాలు, ముఖ్యమైన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. గంటకు పైగా వారు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ గోదాంలో... పటాన్చెరు టౌన్: ప్లాస్టిక్ తుక్కు గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు వివరాల ప్రకారం... పట్టణంలోని ప్లాస్టిక్ గోదాంలో బుధవారం మధ్యాహ్నం ప్లాస్టిక్ వ్యర్థాలు తగలబడుతుండటంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కనిపించాయి. స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని జిల్లా ఫైర్ ఆఫీసర్ తెలిపారు. -
బాధ్యతెరిగి.. ఓటేసి..
వైజాగ్ నుంచి వచ్చి.. దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కాల్వ ప్రణిత విశాఖపట్నం నుంచి వచ్చి తొలిసారి ఓటు హక్కును వినియో గించుకున్నారు. పట్టణానికి చెందిన కాల్వ శ్రీనివాస్ కూతురు ప్రణిత వైజాగ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. అక్కడి నుంచి వచ్చి బుధవారం 18వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. తొలిసారిగా ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని, మొదటిసారి ఓటు వృథా కావొద్దనే ఉద్దేశంతో వచ్చానని పేర్కొన్నారు. బెంగుళూరు నుంచి.. జోగిపేట(అందోల్): బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మహ్మద్ ఆరీఫ్ మున్సిపల్ ఎన్నికలకు జోగి పేటకు వచ్చి ఓటు వేశారు. ఫ్లైట్లో మంగళవారం జోగిపేటకు చేరుకొని బుధవారం సీపీఎస్ పోలింగ్ కేంద్రంలోని 15వ వార్డులో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు విలువ చాలా గొప్పదని చాటేందుకే తాను బెంగుళూరు నుంచి వచ్చి ఓటు వేశానని తెలిపారు. విజయవాడ నుంచి కుటుంబ సమేతంగా... మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయవాడ నుంచి వచ్చారు. పట్టణంలోని 7వ వార్డుకు చెందిన బస్వరాజ్ కూతురు మానస సరోవరి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. దీంతో కుటుంబమంతా అక్కడే ఉంటున్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు బస్వరాజ్ అతని కుటుంబం మెదక్కు చేరుకొని ఓటువేశారు. కాగా పట్టణంలోని 19వ వార్డులో 90 ఏళ్ల వృద్ధురాలు శివ్వ కిష్టమ్మ తన ఓటు హక్కునువినియోగించుకున్నారు. -
విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర
జహీరాబాద్ టౌన్: విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర ప్రారంభించినట్లు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్ అన్నారు. శాంతి కోసం కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర మండలంలోని బూచినెల్లి గ్రామానికి చేరుకోగా మంగళవారం రాత్రి అక్కడే బసచేశారు. బుధవారం ఉదయం గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హుగ్గెల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా గగన్ మాలిక్ మాట్లాడుతూ విశ్వశాంతితో పాటు ప్రజలంతా సోదర భావంతో ఉండాలన్నదే దమ్మ పాదయాత్ర లక్ష్యమన్నారు. దమ్మ పాదయాత్ర మార్చి 3 తేదీన నాగార్జున సాగర్కు చేరుకుంటుందన్నారు. పాదయాత్రలో సంఘం ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంగఫాక్ కోవిడో, థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు, రాజామూర్తి, సిద్ధోజీ శ్యాంసుందర్, కిశోర్ పాల్గొన్నారు. -
వాగ్వాదం.. తోపులాట
● ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు ● ఓటేసిన మంత్రులు, ప్రముఖులు ● చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని 21వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపించివేశారు. స్థానిక శిశుమందిర్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రామాయంపేట మున్సిపాలిటీలోని ఏడో వార్డు గోలిపర్తి వద్ద బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య, వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నర్సాపూర్లోని 8వ వార్డు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇదే పట్టణంలోని 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు. పలువురి చొక్కాలు చిరిగాయి. పోలింగ్ ఏజెంట్కు ఫిట్స్ మెదక్ మున్సిపాలిటీలో ఒకటో వార్డు పోలింగ్ కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. బీజేపీ పోలింగ్ ఏజెంట్ క్రాంతికుమార్కు ఫిట్స్ రావడంతో అతన్ని పోలీసులు మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 19 మున్సిపాలిటీల్లో పోలింగ్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ, హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలోని పాతజైలు సమీపంలో ఉన్న పోలింగ్ బూత్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిపై కానిస్టేబుల్ దాడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు పటాన్చెరు టౌన్: ఓ పార్టీ అభ్యర్థిపై కానిస్టేబుల్ దాడి చేయడంతో ఆయన వర్గీయులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరంబండ వీకర్ సెక్షన్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఐలాపురం నాగరాజు.. మంగళవారం రాత్రి పోలింగ్ బూత్కు సమీపంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది గుంపుగా ఉండటంతో అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులను కోరాడు. అనంతరం అక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి కొట్టాడని, తాను అభ్యర్థినని చెబుతున్నా వినిపించుకోలేదని నాగరాజు చెప్పాడు. వెంటనే అతడ్ని పటాన్చెరులోని అమేధా ఆస్పత్రికి తరలించారు. బీఆర్ఎస్ అభ్యర్థి తనపై దాడి చేయించాడని ఆయన ఆరోపించారు. కాగా నాగరాజు వర్గీయులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు రామేశ్వరంబండ 6వ వార్డు వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. బుధవారం పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాన్ని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పోలింగ్పై ఆరా తీశారు. -
ఓటెత్తారు
మున్సిపల్ ఎన్నికల్లో కీలక అంకానికి తెరపడింది. బుధవారం జరిగిన పోలింగ్కు పుర ఓటర్లు పోటెత్తారు. తోపులాటలు..పరస్పర వాగ్వాదాలు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.. పోలీసు రంగప్రవేశాలు..చెదురు మదురు ఘటనల నడుమ మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డితో పాటు, జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతల మధ్య ఓటింగ్ జరిగింది. జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో పుర ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు. మొత్తం 541 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా యువత, మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఓట్లు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఉదయం 9.30 గంటల వరకు మందకొడిగా సాగింది. పది గంటల తర్వాత నుంచి పోలింగ్ ఊపందుకుంది. 12 గంటల ప్రాంతంలో పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కాస్త మందగించిన ఓటింగ్ మళ్లీ ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి మున్సిపాలిటీతోపాటు, పలు పట్టణాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పర్యవేక్షించారు. జిన్నారంలో అత్యధికం.. జిన్నారం మున్సిపాలిటీలో అత్యధికంగా 91% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో 70.06% పోలింగ్ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిన్నారం మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనమైన విషయం విదితమే. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంతో జిన్నారంలో అత్యధికంగా 90.09% నమోదైనట్లు తెలుస్తోంది. రేపే అభ్యర్థుల భవితవ్యం తేలేది.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. వీరి భవితవ్యం శుక్రవారం తేలనుంది. బ్యాలెట్ బాక్సులను అధికారులు పోలీసు బందోబస్తు నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట్ మున్సిపాలిటీలోని మార్కెట్యార్డు పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సదాశివపేటలోని 10వ వార్డు పోలింగ్ కేంద్రంలో చింతా ప్రభాకర్, సంగారెడ్డిలోని పాతజైలు వద్ద ఉన్న పోలింగ్బూత్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఒకే కేంద్రంలో తల్లీ కూతుళ్లు నారాయణఖేడ్: రేణుకూరు పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్న మాసాని పద్మ, సిర్గాపూర్ మండలం జీవులాతండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మాసాని స్నేహ ఇద్దరూ తల్లీ కూతుళ్లు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వీరద్దరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు పడ్డాయి. శాసీ్త్రనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 7వ వార్డుకు సంబంధించిన 13వ నంబరు పోలింగ్ కేంద్రంలో లోపల స్నేహ, బయట ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తల్లి పద్మ బుధవారం ఎన్నికలు విధులు నిర్వర్తించారు. కదల్లేని స్థితిలో కదిలించే చైతన్యంఅంబులెన్స్లో వెళ్లి మరీ ఓటేసి జహీరాబాద్: అనారోగ్యం కారణంగా శరీరం సహకరించక లేవలేని స్థితిలో ఉన్న ఓ మహిళ బుధవారం పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన ప్రేమలమ్మ కొద్దికాలంగా కదల్లేని స్థితిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాలని ప్రేమలమ్మ కోరడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్లో ఆమెను అక్కడకు తీసుకెళ్లారు. పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లలేని పరిస్థితిని గమనించిన అధికారులు ఆమె అంబులెన్స్లోనే ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో ఉన్నా ఓటు హక్కును వినియోగించుకుని ఓటు విలువను చాటిచెప్పిన ప్రేమలమ్మను ఆర్డీఓ దేవుజా అభినందించారు.76.01 శాతం పోలింగ్ నమోదు -
కేంద్రాలను సందర్శించి.. పోలింగ్ను పరిశీలించి
పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలపై కలెక్టర్ ప్రావీణ్య సంతృప్తిసంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31వ వార్డు పరిధిలో విద్యానగర్లోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా ఓటర్ జాబితా, ఓటర్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ కేంద్రం లోపల, బయట భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పదకొండు మున్సిపాలిటీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగిందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ను నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. -
బాక్సుల్లో భవితవ్యం
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ బుధవారం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు శుక్రవారం తెరపడనుంది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలు తలపడ్డాయి. ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. రెండు, మూడు మున్సిపాలిటీలు మినహా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఒకటీ రెండు సీట్ల తేడాతో సరిసమానంగా వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు ఏమాత్రం తీసిపోని విధంగా గట్టి పోటీనిచ్చినట్లు పోలింగ్ సరళిని బట్టి నిపుణులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు చెరో రెండు చొప్పున మున్సిపాలిటీలను కై వసం చేసుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీలు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రెండు బల్దియాల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ కంటే కౌన్సిలర్ స్థానాలు కాస్త తగ్గే అవకాశాలున్నాయి. ఇక పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో మూడు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కొన్ని స్థానాల్లో సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో ఎంఐఎంకు కొన్ని స్థానాలు కై వసం చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశాలూ లేకపోలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ ఫలితాలపై ఉత్కంఠ -
జోగిపేటలో కాంగ్రెస్కే మొగ్గు!
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి దామోదర ● బలమైన అభ్యర్థులను పెట్టడంలో బీఆర్ఎస్, బీజేపీ విఫలం! జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అధికార పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్డుల రిజర్వేషన్ల తారుమారుతో కాంగ్రెస్లో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడ్డా చివరి నాలుగు రోజులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ జోగిపేటలోనే మకాం వేసి వ్యూహరచన చేయడం పార్టీకి కలిసి వచ్చిందనే విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థులను పోటీలో నిలపలేదన్న ఆరోపణలున్నాయి. బీజేపీ 14 వార్డుల్లో పోటీ చేస్తున్నా కేవలం నాలుగు వార్డుల్లోనే పోటీనిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 14 నుంచి 15 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందోలు పరిధిలోని ఐదు వార్డుల్లో నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలున్నాయి. జోగిపేటలోని 11, 13,19,14,10 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నిక జరిగిందని చెబుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో సగం!పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు మున్సిపాలిటీలో రెండిట్లో మాత్రమే స్పష్టంగా ఫలితాలు ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇస్నాపూర్లో కాంగ్రెస్కు ఆధిపత్యం కనిపించగా గడ్డపోతారంలో బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంద్రేశం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కు సగం సగం స్థానాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జిన్నారంలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించడం లేదు. స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల బీజేపీ కౌన్సిలర్లు మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ జిన్నారంలో స్పష్టమైన ఆధిపత్యం ఉందని మొదటి నుంచి అనుకుంటున్నప్పటికీ పోలింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశం లేదని అంచనాలు వేస్తున్నారు. నారాయణఖేడ్లో హోరాహోరీనారాయణఖేడ్: నారాయణఖేడ్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు పలు వార్డుల్లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యేఅవకాశాలున్నట్లు పోలింగ్ సరళి బట్టి తెలుస్తోంది. ఖేడ్లో మొత్తం 15 వార్డులకుగాను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డుల్లోనూ పోటీకి నిలపగా...కొన్ని వార్డుల్లో ఆయా పార్టీల నుంచి రెబెల్స్ పోటీ చేశారు. వీరి ఓట్ల చీలికపై ప్రధాన పార్టీల గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని వార్డులను బీఆర్ఎస్ కై వసం చేసుకోనుంది. తొలిసారి ఖేడ్లో బీజేపీ బోణీ కొట్టే అవకాశముందని చెబుతున్నారు. -
ఎన్నికల కమిషన్ నిర్ణయం.. జగ్గారెడ్డి రియాక్షన్
సాక్షి, సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కేసు నమోదు చేసి.. రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఎస్ఈసీ ఆదేశించింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఇప్పుడే తానూ మీడియాలో చూశానని సంగారెడ్డిలో జరిగిన గొడవపై ఎన్నికల కమిషన్ స్పందించిందన్నారు.‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్కో వార్డులో 300లకు పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేర్చారు. అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివ కుమార్ పట్టుకున్నారు.. దీంతో నేను అక్కడికి వెళ్ళాను.. గొడవ జరిగింది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా?. ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారులు విఫలమై.. దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి.. రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఎస్ఈసీ ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎస్ఈసీ మండిపడింది. ఈసీ ఆదేశాలు.. జగ్గారెడ్డి రియాక్షన్.. ఈసీ ఆదేశాలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా? అంటూ ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని.. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివకుమార్ పట్టుకున్నారు. దీంతో నేను అక్కడికి వెళ్లాను.. గొడవ జరిగింది’’ అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు?. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా?. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారుల విఫలమయ్యారంటూ జగ్గారెడ్డి ఆరోపించారు.సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో ఇవాళ జగ్గారెడ్డి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. సీఐ.. కాంగ్రెస్ కార్యకర్త చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలంటూ పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలింగ్ ఆపేస్తా.. బూత్లోకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. తన కాలర్ పట్టుకున్నారంటూ సీఐపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకుంటున్నారు.సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్కు పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులకు కూడా దిగారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేయి చేసుకున్నారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు డబ్బుల పంపిణీ చేస్తున్నారంటూ.. స్థానికుల సమాచారంతో పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సంగారెడ్డి స్కూలులో అగ్నిప్రమాదం
సాక్షి సంగారెడ్డి: పోతిరెడ్డి పల్లిలో శ్రద్ధ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని స్కూలు బిల్డింగులో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నాయి. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్కూట్ అయ్యిుండచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ రోజు మున్సిఫల్ ఎన్నికలు కావడంలతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థిులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని కృష్ణాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం సుధాకర్ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన సీఎం కప్ కబడ్డీ పోటీల్లో పాఠశాలకు చెందిన 10వ తర గతి విద్యార్థి జన్ముల వర్ష, 9వ తరగతి విద్యార్థి డి.ముస్కాన్ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. 9వ తరగతి విద్యార్థినులు చాకలి హరిత, చాకలి సౌమ్య ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. పీఈటీ రాములు, విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న శ్రీవైష్ణవి జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2వ సీజన్ సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో అందోల్ గ్రామానికి చెందిన పూజారి శ్రీ వైష్ణవి ఉష్షు మార్షల్ ఆర్ట్స్ క్రీడలో బంగారు పతకం సాధించింది. దీంతో ఈనెల 20 నుంచి 24 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొననున్నట్లు మాస్టర్ మురళి తెలిపారు. బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థినిని జిల్లా స్సోర్ట్స్ ఆఫీసర్ అఖిలేశ్ రెడ్డి, ఉష్షు క్రీడా ఉమ్మడి మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీ పోచయ్య అభినందించారు. కిక్ బాక్సింగ్లో ఆకాంక్ష, హర్షిని వెండి పతకాలు సాధించారు. మందుబాబుకు జైలు శిక్ష సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన మందుబాబుకు సిద్దిపేట కోర్టు జైలు శిక్ష విధించింది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో తిరుపతిరెడ్డి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో అతడిని కోర్టులో హాజరుపర్చగా మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి అతడికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. చందాపూర్ వాగులో అస్థిపంజరంచిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధి చందాపూర్ గ్రామ శివారు వాగులో మంగళవారం గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం గుర్తించినట్లు పోలీస్లు తెలిపారు. చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ కథనం ప్రకారం.. అస్తిపంజరం గుర్తించిన గ్రామస్తులు పోలీస్లకు సమాచారం అందించారు. పక్కనే చీర, జాకెట్తో పాటు పుస్తె లభించినట్లు చెప్పారు. గత ఏడాది ఆగస్టులో చందాపూర్కు వచ్చి తప్పిపోయిన మనోహరబాద్ మండలం పరికిబండకి చెందిన కవితగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి గజ్వేల్రూరల్: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో చోటు చేసుకుంది. కప్ప రాంచంద్రం(42)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆర్థిక సమస్యలతో దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రాంచంద్రం మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెందిన రాంచంద్రం ఈ నెల 6న సాయంత్రం వేళ ఇంటివద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీలలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 26 వార్డులకు 60 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు. ఇస్నాపూర్లో మొత్తం 35,911 మంది తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఇంద్రే శం మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులకుగాను 19 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా..13,085 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
పురపోరుకు పటిష్ట భద్రత
సైబరాబాద్ సీపీ రమేశ్పటాన్చెరు టౌన్: ఇంద్రేశం–ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ తెలిపారు. ఇస్నాపూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఎన్నికల నిర్వహణకు మొత్తం 314 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 9 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలు విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో శేరి లింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, పటాన్చెరు సీఐ వినాయక్రెడ్డి, ఎస్ఐ మహేశ్వర్రెడ్డితోపాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమంపై సానుకూలం
నారాయణఖేడ్: రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఖేడ్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకులు గజ్జెలకాంతం, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. విలేకరులతో మంగళవారం వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మున్సిపల్ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఖేడ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.100 కోట్లయినా ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారని గజ్జెలకాంతం తెలిపారు. ప్రజల్లో మంచి స్పందన ఉందని, రాష్ట్రంలో 85%పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, నాయకులు నగేశ్ షెట్కార్, రషీద్, తాహెర్ అలీ పాల్గొన్నారు. -
ఈసారీ ఇరుకే
● పోలింగ్ కేంద్రాలుగా చిన్న చిన్న గదులు ● ఒక్కో పోలింగ్ స్టేషన్లో 700కు పైగా ఓటర్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా నేర్వని గుణపాఠం జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సి పాలిటీకి బుధవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరుకై న గదిలో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసి మహిళలు, పురుషులు కలిపి ఒకే చిన్నగదిలో 700కు పైగా ఓటర్లతో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులు ఒకే దారి గుండా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. స్థానికంగా 20 వార్డులకుగాను 32 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మొత్తం 16,450 మంది ఓటర్లుండగా, 8,564 మంది మహిళలు, 7,886 మంది పురుషులున్నారు. 5వ వార్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 7వ పోలింగ్ స్టేషన్లో 779 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే జోగిపేటలోని ఏఎంసీ బిల్డింగ్లో 13వ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయగా అందులో 793 మంది, అందోలులోని 6వ పోలింగ్ బూత్లో 766 మంది, జోగిపేటలోని ఐకేపీ భవనంలోని 3వ పోలింగ్ స్టేషన్లో 2వ వార్డుకు సంబంధించి 725 మంది ఓటర్లు, జోగిపేటలోని కేంద్ర ప్రాథమిక భవనంలోని ఒక చిన్న గదిలో 24వ పోలింగ్ స్టేషన్లోని 15వ వార్డుకు చెందిన 772 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందోలులోని ఇరుకై న పోలింగ్ కేంద్రంలో స్టేషన్ ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఎండలో బారులు తీరి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మళ్లీ అట్టలతోనే బూత్ల ఏర్పాటు ఎప్పటిలాగే పోలింగ్ బూత్లలో ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాటుగా ఉండేందుకు అట్టముక్కలతో ఏర్పాటు చేశారు. దానిపైనే పోలింగ్ స్టేషన్, బూత్ నంబరును ఉంచారు. ఏళ్ల తరబడి ఎన్నికల కమిషన్ పోలింగ్ కంపార్ట్మెంట్లను అట్టలతోనే ఏర్పాటు చేస్తున్నారు. -
పారదర్శకంగా పురపోరు
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ శ్రీదేవి సంగారెడ్డి జోన్/పటాన్చెరు: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా ప్రతీ ఒక్కరు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ శ్రీదేవి పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణపై పట్టణంలోని ఐబీ గెస్ట్హౌస్లో కలెక్టర్ ప్రావీణ్యతో బుధవారం సమీక్షించారు. అనంతరం పటాన్చెరులోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. అధికారులు నిర్వహించాల్సిన విధులు, చేయాల్సిన ఏర్పాట్ల వంటి అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..విధుల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరు సమన్వయంతో, బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
గంగ్వార్లో నాలుగిళ్లలో చోరీ
బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గంగ్వార్ గ్రామంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. నాలుగిళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చామల వీరారెడ్డి, వెంకట్రెడ్డి రెండు కుటుంబాలకు చెందిన వారు ఇళ్లకు తాళాలు వేసి హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఇళ్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వీరారెడ్డి ఇంట్లో 5మాసాల నల్ల పూసలతాడు, 4 మాసాల చేతి ఉంగరం, రూ.14,500 నగదు, వెంకట్రెడ్డి ఇంట్లో 7 మాసాల చెవుల కమ్మలు, రూ.15వేల నగదును ఎత్తుకెళ్లారు. అలాగే మాలవె వెంకట్, బోయిన లక్ష్మి ఇళ్లలో సైతం చోరీకి పాల్పడ్డారు. ఎలాంటి వస్తువులు ఎత్తుకెళ్లలేదని పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ జెక్కుల హన్మంతు పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బందితో ఆధారాలు సేకరించారు. -
కేతకీ దర్శనం.. సర్వపాపహరణం
నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుఝరాసంగం(జహీరాబాద్): తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలలో శ్రీ కేతకీ సంగమేశ్వరుడిని ఇంటి దైవంగా కొలుస్తారు. శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో ఉన్న అమృతగుండంలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల అంచంచల విశ్వాసం. ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించనున్న శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతీ ఏటా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. బుధవారం నుంచి తొమ్మిది రోజులపాటు నిర్వహించే వేడుకలతో ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది. మొదటి రోజు శిఖర పూజతో ప్రారంభమై బిళ్వార్చనతో ముగుస్తుంది. బుధవారం శిఖర పూజ, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఆలయానికి 5 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముమ్మరంగా ఏర్పాట్లు జాతర సమీపిస్తుండటంతో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే రహదారుల మరమ్మతుల పనులు పూర్తికావస్తున్నాయి. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల మరమ్మతులు, ఆలయానికి రంగులు వేయటం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. జహీరాబాద్ నుంచి ఆలయం వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు. -
‘బ్యాట్’.. గుండెల్లో పరుగే!
ప్రధాన పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు సదాశివపేట(సంగారెడ్డి): స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి బ్యాట్ గుర్తు లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యాట్ గుర్తు సదాశివపేటలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి దక్కకపోవడంతో చాలామంది రెబల్స్గా బరిలోకి దిగి గట్టిపోటీనిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం రూపొందించిన గుర్తుల జాబితా నుంచి మూడు గుర్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులు ఉన్నవాటిల్లో చాలామంది బ్యాట్ గుర్తును మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. అందువల్ల 3,7,22,25,26 వార్డుల్లో బ్యాట్, 17,18వార్డుల్లో కప్ సాసర్ గుర్తులపై పోటీ చేస్తున్నా ప్రధానంగా బ్యాట్ గుర్తే ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. ఓటుకు రూ.5 వేలు! మంగళవారం తెల్లవారుజామునుంచి ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ప్రధాన అనుచరులు ఓటర్లకు మద్యం సీసాలు, నగదు పంపిణీలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అందజేసినట్లు సమాచారం. సదాశివపేట పట్టణంలో చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న వార్డుల్లో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు, మిగతా వార్డుల్లో రూ.1000 నుంచి రూ.2000 వరకు నగదు పంపిణీ చేసినట్లు సమాచారం. బలహీనవర్గాలు, నిరుపేదలు, దినసరి కూలీ చేసుకునే ఓటర్లపై అభ్యర్థులు దృష్టిసారించి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఓటర్లకు ముందే డబ్బులు పంపిణీ చేసిన వారు వార్డుల్లో ఇతరులెవరూ డబ్బులు పంపిణీ చేయకుండా కాపు కాసినట్లు తెలిసింది. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
గజ్వేల్రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని బెజుగామలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎంకమొల్ల భిక్షపతి(56) వ్యవసాయం చేసుకుంటూ, గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో తమ గొర్లదొడ్డి వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గొర్లదొడ్డి వద్దకు వెళ్ళి చూడగా ఉరివేసుకొని ఉండటం గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పరిశ్రమల స్థాపనకు ఆర్థికసాయంజహీరాబాద్ టౌన్: నాన్ ఫార్మా రంగంలో చిన్న తరహా పరిశ్రమల స్థాపనం కోసం మహిళా సంఘాలకు రుణం సహాయం అందిస్తామని సెర్ప్ రాష్ట్ర (నాన్ఫార్మ్) డైరెక్టర్ జాన్సన్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం చెక్క బొమ్మలను తయారుచేసే మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయేతర రంగంలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి భారీ రుణ సాయం అందిస్తున్నట్లు చెప్పారు. చెక్క బొమ్మలను తయారుచేసే వారు సంఘంగా ఏర్పడి పరిశ్రమ స్థాపనం కోసం ముందుకు వస్తే రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ నిధులతో షెడ్డు, మెషీనరీలు తదితర పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో అధికారులు నాగరాజు, సునీల్, డీపీఎం రమేష్, ఏపీఎం విశేశ్వర్గౌడ్ మహిళలు పాల్గొన్నారు. -
మూగబోయిన మైకులు
ముగిసిన మున్సిపల్ ప్రచారం ● మూతపడిన మద్యం దుకాణాలు ● డబ్బుల పంపిణీలో నిమగ్నమైన అభ్యర్థులు సంగారెడ్డి: మున్సిపల్ ప్రచారానికి తెరపడింది. ఇక ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు అభ్యర్థులు.గత వారం పది రోజులుగా మైకులు, డీజేలు ప్రచార రథాలు, మీటింగులు, ర్యాలీలు, కార్నర్ మీటింగులు, రోడ్ షోలతో ఎవరి బలబలాలు వారు ప్రదర్శించారు. ఎవరి స్థాయికి వారు ప్రచారం చేసి తమ నాయకుల మెప్పు పొందారు. భారీ జనాలతో తమ అధినాయకత్వం మెప్పునైతే పొందారు కానీ.. ఓటర్ల మెప్పును పొందుతారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లు వాడవాడలా తమ గుర్తింపును ప్రదర్శించారు. ఇక ఈ 48 గంటల్లోనే వారి ప్రతిఫలం బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం కానుంది. వారం పది రోజులుగా ప్రచారంలో పాల్గొని తమకు అండగా నిలిచి ఉన్న వారందరూ తమకు ఓటును వేస్తారా? లేదా అనే విషయం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. అభ్యర్థులు ఈ నలభై ఎనిమిది గంటలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు, మద్యం, అభిమానం పంచేందుకు సిద్ధమయ్యారు. ఓటర్లు మాత్రం చివరికి ఎవరికి పట్టం కడతారో 13వ తేదీన బట్టబయలు కానుంది. అయితే ప్రతి అభ్యర్థి ఎంతో కొంత ఖర్చు చేసి గెలవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. -
బీజేపీతోనే దేశ భవిష్యత్తు
మాజీ ఎంపీ నవనీత్కౌర్జహీరాబాద్: బీజేపీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని, దీన్ని గుర్తించి ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి మద్దతుగా నిలవాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ నాయకురాలు నవనీత్కౌర్ పిలుపునిచ్చారు. సోమవారం జహీరాబాద్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశ సంక్షేమం, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించినట్లయితే.. కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి జహీరాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలుపులేక పోయారన్నారు. 20 హామీలు ఇచ్చారని, హామీల సంఖ్యనే మోసం అని చెబుతోందన్నారు. ఇలాంటి పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ ఎన్నికల ఇంచార్జి పైడి ఎల్లారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్రెడ్డి, నాయకులు సుభాష్రెడ్డి, భాస్కర్, జగన్, జనార్దన్రెడ్డి, సంతోష్, అరుణ, మంజుల, అర్చన సారడా, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంపై నిరసన
రోడ్డుపై బైఠాయించిన రైతులు నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో సోమవారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... కాగా ఆదివారం రైతు ఒజ్జ పర్శరాములు తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా షాక్ తగలడంతో రెండు చేతులు, కాళ్లు కాలిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేయాలని అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోలేదని రోడ్డుపై నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. అధికారులకు ఎల్సీ ఇవ్వాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు. చెరకు లారీ బోల్తా నారాయణఖేడ్: జాతీయ రహదారిపై చెరుకు లారీ బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం మండలంలోని జూకల్ శివారులోని డబుల్బెడ్రూం ఇళ్ల సముదాయం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మనూరు మండలం నుంచి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగీ చక్కర కర్మాగారానికి చెరకు లోడ్తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. అందులో ఉన్న ఇద్దరు కిందకు దూకారు. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇవ్వడానికి లారీ డ్రైవర్ రోడ్డు పక్కన నిలపడానికి యత్నిస్తుండగా తిరగబడింది. వాలీబాల్ పోటీల్లో ‘తాడ్వాయి’ సత్తా మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రంలోని మంజీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడలు ఆదివారం రాత్రి ముగిసాయి. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తాడ్వాయి క్రీడా జట్టు ట్రోఫీతో పాటు, రూ.15 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన తీగుల్ జట్టుకు బహుమతితోపాటు, రూ.10 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వడియారం జట్టుకు బహుమతితో పాటు, రూ. 5 వేల నగదు పురస్కారం అందించారు. విజేతలకు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట కమలాకర్రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ చైన్నె భూపాల్ గౌడ్, మంజీర యూత్ అధ్యక్షుడు భైరయ్య, గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, టీపీటీఎఫ్ జిల్లా నాయకుడు మల్లేశం, రామచంద్రం, కుమార్, మంజీర యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. మందుబాబులకు జరిమానా సిద్దిపేటఅర్బన్ / సిద్దిపేటకమాన్ / పటాన్న్చెరు టౌన్: మందుబాబులకు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు కథనం ప్రకారం... పట్టణంలోని పొన్నాల వై జంక్షన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా ఒకరికి రెండు రోజుల శిక్షతోపాటు మరో నలుగురికి రూ. 10 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. అలాగే వన్టౌన్ పరిధిలో మద్యం తాగి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 12 మందికి కోర్టు రూ.1,17,500 జరిమాన, ఒకరికి మూడ్రోజుల జైలు శిక్ష విధించినట్లు సిద్దిపేట వన్టౌన్ సీఐ వాసుదేవరావు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. పటాన్్చెరులో పట్టుబడిన 18 మందిని సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా 10 మందికి రూ. వెయ్యి జరిమాన, మరో ఇద్దరికి రూ.1500, ఆరుగురికి రూ.2 వేల చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ పేర్కొన్నారు. -
మంట ఆరక.. ఊపిరాడక
● అమీన్పూర్ డంప్యార్డులో ఆరని మంటలు ● పొగతో స్థానికులకు ఇబ్బందులు ● అధికారుల అలసత్వమే కారణమా !పటాన్చెరు: అమీన్పూర్ డంప్ యార్డులో చెత్త తగలబడుతుంది. వారం రోజులుగా అక్కడ మంటలు అదుపులోకి రావడం లేదు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా స్వచ్ఛమైన గాలికి నోచుకోక పౌరులు ఇబ్బందుల పాలవుతున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో సర్వే నం.993లో గార్భేజ్ కలెక్షన్స్ సెంటర్ పేరిట చెత్త డంప్యార్డు నిర్వహిస్తున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను ప్రతిరోజు హైదరాబాద్లోని జవహర్ నగర్కు తరలించాలి. కానీ గత ఏడాది నుంచి చెత్తను జవహర్ నగర్కు తరలించడం లేదు. కాగా గార్భేజ్ కలెక్షన్ సెంటర్కు కేటాయించిన ఐదెకరాల విస్తీర్ణంలో 20 మీటర్ల ఎత్తు చెత్త డంపు పేరుకుపోయింది. తాజాగా అందులో విష వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఆ గ్యాస్ కారణంగా మంటలు వ్యాపిస్తున్నాయి. అయితే కావాలనే అధికారులు మంటలను అదుపు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచనలతో అధికారులు రెండు రోజులుగా చెత్తను జవహర్ నగర్కు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ డంప్ యార్డులో మంటలను మాత్రం నేటికీ అదుపులోకి తేలేదు. దీంతో పరిసర కాలనీల్లో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి తీసుకోవడం కూడా ప్రజలకు కష్టంగా మారింది. ఈ పరిస్థితి గత వారం రోజులుగా కొనసాగుతుంది. పొగ, మంటలను అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
డంప్యార్డును తరలించాలి
పట్టణంలో కాలనీల మధ్య చెత్త నిల్వ కేంద్రాన్ని నిర్వహించవద్దు. దాన్ని తొలగించేంత వరకు పోరాటం కొనసాగుతుంది. అధికారులు , పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమీన్పూర్ డంపింగ్ యార్డులో మంటలు వ్యాప్తి చెందాయి. వాటిని వెంటనే అదుపులోకి తేవాలి. – ఆకుల తిరుపాల్ రెడ్డి, ప్రెసిడెంట్, పీపుల్స్ అసోసియేషన్, అమీన్పూర్ నరక యాతన ఇది అత్యంత దారుణం. చెత్త తగలబెట్టడం చట్ట రీత్యా నేరం. కొన్ని రోజులుగా డంపుయార్డులో చెత్త తగుల బడుతున్నప్పటికీ అధికారులు, పాలకులు స్పందించడం లేదు. స్వచ్ఛమైన గాలి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైగా చూపుతుంది. – రమేశ్, మోడీ కాలనీ, అమీన్పూర్ -
స్వేచ్ఛగా ఓటేయండి: డీఎస్పీ
సంగారెడ్డి క్రైమ్: ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సోమవారం డీఎస్పీ ఆధ్యర్యంలో 5 మంది సీఐలు, 10 మంది ఎస్సైలు, 100 మంది ఏఆర్ కానిస్టేబుళ్లతో కలిసి పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి శివాజీనగర్, నాల్సాబ్గడ్డ, శాంతినగర్, కొత్త బస్టాండ్, ఐబీ వరకు కవాతు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ ప్రజలు, స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్ట ణంలో ఎన్నికలకు ఆటంకం కల్గించిన , ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రామునాయుడు, ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన వృద్ధురాలి అప్పగింత
సిద్దిపేటఅర్బన్: తప్పిపోయిన వృద్ధురాలిని పోలీసులు ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు కథనం ప్రకారం... టీహెచ్ఆర్ నగర్కు చెందిన సలేంద్ర హనుమవ్వ (80) ఈ నెల 5న ఉదయం 7 గంటలకు తన కూతురు మామిండ్ల కనకవ్వ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. కూతురు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో 7వ తేదీన కూతురు కనకవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, వృద్ధురాలు ఆటోలో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. కాగా మాజీ ఆర్మీ జవాన్ నాగప్రసాద్ వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పించారు. పోలీసులు వృద్ధురాలిని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చురుగ్గా వ్యవహరించిన పోలీసులు, కమాండ్ కంట్రోల్ రూం సిబ్బందిని సీపీ అభినందించారు. -
వాణిజ్య ఒప్పందాలు బయటపెట్టాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములుగజ్వేల్రూరల్: కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను పార్లమెంట్లో బయటపెట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. సీఐటీయూ రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం గజ్వేల్ పట్టణంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల దిగుమతుల సుంకం తొలగించిందనడంతో ఆపిల్ రైతులకు మార్కెట్లో ధర లేదన్నారు. పత్తి కొనుగోళ్లు కూడా ఆన్లైన్ చేయడంతో ధర తగ్గించారని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగం దివాలా తీస్తుండగా, కార్మిక రైతాంగాన్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతాంగం పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు రంగారెడ్డి, స్వామి, నాగరాజు, మల్లేశ్, రాజు, సంజీవులు, ప్రవీణ్ పాల్గొన్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
సిద్దిపేట జిల్లాలో ఘటనసిద్దిపేటరూరల్: ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డిపల్లి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన మాదన్నగారి యాదగిరి కుమారుడు శ్రావణ్ (21), పెద్దకోడూరు గ్రామానికి చెందిన బోనాల లింగం రెండో కూతురు నవ్య (17) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబీకులకు తెలియడంతో ఒప్పుకొని, అమ్మాయి మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని అనుకున్నారు. ఇదిలా ఉండగా.. నవ్య రోజులాగే కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. శ్రావణ్ కొత్త బట్టలు కొంటానని తల్లికి చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెంది రైతు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న క్రమంలో పక్కనే చెట్టుకు ఉరివేసుకుని ఉన్న ఇద్దరిని గమనించి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరించి కుటుంబీకులకు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రేమికులు ఇద్దరు వరుసకు మేనబావ, మరదలు. కాగా యువతి బ్యాగులో చీర, పుస్తకాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు విచారణలో తెలుస్తాయని తెలిపారు. -
సూపర్వైజర్ల సెక్టార్ల మార్పు
నర్సాపూర్: ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం(ఐసీడీఎస్) నర్సాపూర్ ప్రాజెక్టులోని సెక్టార్లలో పని చేస్తున్న సూపర్వైజర్లను ఇతర సెక్టార్లకు మార్పు చేస్తూ స్థానిక సీడీపీఓ హేమభార్గవి ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులోని 11 మంది సూపర్వైజర్లను ఒకేసారి మార్పు చేయడం గమనార్హం. ప్రాజెక్టులోని నర్సా పూర్, తూప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్చెడ్ మండలాల పరిధిలో 11 సెక్టార్లు ఉన్నాయి. 11 సెక్టార్లలో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లను ఒక సెక్టారు నుంచి మరో సెక్టారుకు మార్పు చేస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై స్థానిక సీడీపీఓ హేమభార్గవిని వివరణ కోరగా.. చాలా కాలం పాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లను ప్రాజెక్టులోని మరో సెక్టారుకు మార్చాలన్న నిబంధనల మేరకు వారిని మార్చినట్లు ఆమె తెలిపారు. సీఏలను వేధిస్తున్న ఏపీఎం అల్లాదుర్గం(మెదక్): గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఐకేపీ సీఏలను ఏపీఎం వేధింపులకు గురి చేస్తున్నారని ముస్లా పూర్ సీఏలు లలిత, దుర్గమణి ఆరోపించారు. ఈ మేరకు వారు సోమవారం అల్లాదుర్గం కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా.. సమావేశాలకు రావాలని, వస్తే సమావేశంలో కూర్చోనివ్వకుండా బయటకు పంపిస్తున్నారని తెలిపారు. నా ముందు మీరు ఉండొద్దు , ఎప్పుడు పిలిస్తే అప్పుడు కార్యాలయానికి రావాలని ఏపీఎం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. తాము ఏమి తప్పు చేశామో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఏలందరిని ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. వృద్ధుడు అదృశ్యంసంగారెడ్డి క్రైమ్: వృద్ధుడు అదృశ్యమయ్యా డు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామనాయుడు వివరాల ప్రకారం... సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మీరుడి మల్లయ్య(62), తన భార్య దుర్గమ్మతో కలిసి సోమవారం ఉదయం కళ్ల చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మందుల కోసం ఆస్పత్రి లోపలికి వెళ్లిన మల్లయ్య బయటకు రాలేదు. చుట్టుపక్కల, తెలిసిన బంధు వుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేపలవేటకు వెళ్లి యువకుడు మృతి చిన్నశంకరంపేట(మెదక్): చేపలవేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ సృజన కథనం మేరకు... గ్రామానికి చెందిన బైకరి రమేశ్ (26) సోమవారం ఉదయం చేపలవేటకు వెళ్లాడు. స్థానిక మైసన్చెరువులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగాడు. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చైర్మన్ గిరి.. నేతల గురి
సదాశివపేట(సంగారెడ్డి): ప్రముఖ వ్యాపార కేంద్రమైన సదాశివపేట పట్టణానికి 73 ఏళ్ల చరిత్ర ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1953లో తొలి మున్సిపాలిటీగా 15 వార్డులతో ఏర్పాటైంది. ఈ మున్సిపాలిటీ ప్రస్తుతం 26 వార్డులకు పెరిగింది. మున్సిపాలిటీలో సిద్ధాపూర్ గ్రామ పంచాయతీని విలీనం చేశారు. ప్రస్తుతం 36,982 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 18,151, మహిళలు 18,829, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్లుగా పలువురు పనిచేశారు. కొందరికి అనూహ్యంగా దక్కగా మరికొందరికి నాయకుల అండదండలతో చైర్మన్ పదవి వరించింది. మహిళలకు మాత్రం మూడు సార్లు అవకాశం దక్కింది. సదాశివపేట మున్సిపల్ చైర్మన్లుగా 14 మంది పనిచేయగా ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 8 పర్యాయాలు చైర్మన్లుగా కొనసాగారు. టీడీపీ నుంచి రెండు సార్లు అధికారం చేజిక్కించుకోగా, కాంగ్రెస్, బీజేపీ బలపర్చడంతో ఒక్కసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థి కొత్తగొల్ల అనురాధ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని పట్నం విజయలక్ష్మిని వరించింది. జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రం చైర్మన్ పదవిని దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అన్ని పార్టీల మహిళలకు చైర్మన్ పదవిపై ఆసక్తి పెరిగింది. ఈ సారి చైర్మన్గిరి ఎవరిని వరిస్తుందోనని చర్చలు జరుగుతున్నాయి. సదాశివపేటకు 73 ఏళ్ల చరిత్ర మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారు వీరే.. -
నిధుల వరద.. కాసుల వేట
దుర్గమ్మ చెంత అవినీతి దందా ● ఫర్మ్ల పేరు.. నాయకుల జోరు ● మట్టి చల్లు.. నీళ్లు పట్టు.. లక్షలు కొట్టు ● పర్సంటేజీల ఆశలో అధికారులుపాపన్నపేట(మెదక్): ‘పంచాయతీరాజ్ శాఖ ద్వారా గత ఏడుపాయల జాతరకు సంబంధించి రూ. 22.30 లక్షల పనులు చేస్తే, చెక్ నంబర్ 649125తో రూ. 20 లక్షలు ఎమర్జింగ్ టెక్నో సర్వీసెస్’ అనే ఒక ఫర్మ్కు చెల్లించారు. అది కూడా ఓ స్థానిక నాయకుడికి చెక్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి జాతర పనులు టెండర్లు నిర్వహించకుండా, నాయకులు సూచించిన ఫర్మ్ (సంస్థ)లకే అప్పజెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతర వచ్చిందంటే పండగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం దారి తప్పుతోంది. లక్షలాది భక్తుల ఆనందం కోసం సంబరంగా నిర్వహించాలనుకున్న మహా జాతర.. కాంట్రాక్టర్లకు.. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2024– 25 శివరాత్రి జాతరకు రూ. 2 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు కాగా, ఏడుపాయల ఈఓ ద్వారా రూ. 93,04,139 ఖర్చయ్యాయి. ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా రూ.1,06,95,861 ఖర్చు చేశారు. జాతరలో సుమారు 33 శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ శాఖ, ఫిషరీస్, పోలీస్, ఆర్అండ్బీ శాఖల ద్వారా రూ. 90.80,254 ఖర్చు చేశారు. ఇందులో కూడా సింహభాగం తాత్కాలిక పనులే. ఏజెన్సీల పేరిట స్థానిక నాయకులే పని చేసి, అధికారులకు, ఏజెన్సీలకు ఎవరి వాటాలు వారికి ముట్ట జెప్పారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా రూ. 5 లక్షలు దాటితే టెండర్ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకే ఏజెన్సీకి రూ. 20 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం.జరిగిన తంతు ఇలా.. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా కేవలం జంక్షన్ల వద్ద సైన్ బోర్డులు, బుష్ కట్టింగ్, మట్టి వేసి చదును చేసేందుకు రూ. 24,14,200 చెల్లించారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. భగీరథ ద్వారా టాయిలెట్ల నిర్వహణ, వాటికి బ్యానర్ డోర్స్, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, తాగు నీటి ట్యాప్ల మరమ్మతులు, స్కావెంజర్ల భృతికి రూ. 22,54,660 ఖర్చు చేశారు. ట్యాంకర్ల చెల్లింపు, ఫ్లెక్సీ బ్యానర్ డోర్లు, షవర్ల ఏర్పాటులో అవినీతి ఆరోపణలున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా రూ.15.25 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో సేఫ్టీ గ్లౌవ్స్, క్యాప్స్, టీషర్ట్లు, బ్లాక్ కవర్స్, బ్లీచింగ్ ఫౌడర్, ఫ్లెక్సీ బోర్డులు కొనుగోలు చేశారు. ఇందులో బిల్లులు ఎక్కువగా చూపినట్లు విమర్శలున్నాయి. కాగా మల్టీ పర్పస్ వర్కర్స్ టీఏలకు రూ. 2,28,500, అకామిడేషన్ హాల్కు రూ.48 వేలు, రోజు వారి సపాయి కార్మికులకు రూ. 5,82 లక్షలు చెల్లించినట్లు చూపారు. ఫిషరీస్ కార్యాలయం నుంచి రూ.10,53,282 ఖర్చు చేశారు. గజ ఈతగాళ్లకు, టీషర్ట్లు, క్యాప్లకు, బోట్ కిరాయిలు, భోజనాలకు చెల్లించారు. అయితే ఆలయం నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు భోజన వసతి కల్పించినప్పటికీ, వీరు భోజన ఖర్చులకు గాను హోటల్ ద్వారా రూ. 2.50 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడం గమనార్హం. ఆర్అండ్బీ శాఖ వారు రూ. 10.25 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. పార్కింగ్, చెక్డ్యాం, స్నానఘాట్లు, క్యూలైన్ల వద్ద బారికేడ్ల ఏర్పాటుకు ఈ ఖర్చును చూపారు. పోలీస్శాఖకు ఆలయం నుంచి ఆవాస, భోజన సౌకర్యాలు కల్పించినప్పటికీ ఖర్చుల పేరిట రూ.9,92,312 చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి చెల్లింపులు లేక పోయినప్పటికీ, రెండేళ్ల నుంచి ఎస్డీఎఫ్ నుంచి ఖర్చులు చెల్లిస్తున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 10 శాతం కమీషన్ తీసుకొని, జాతర పనులను అడ్డగోలుగా రికార్డు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తా
జోగిపేట ప్రచారంలో మంత్రి దామోదర జోగిపేట(అందోల్): అందోల్ – జోగిపేట మున్సిపాలిటీని విద్య, వైద్య కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 2,3,20, 10వ వార్డుల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్సీడీ క్లినిక్, ట్రామా సెంటర్, క్యాన్సర్ పరీక్షల కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఏఎంసీ చైర్మన్ జగన్ మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, పార్టీ పరిశీలకులు కైలాశ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు అదనపు కలెక్టర్ పాండు సంగారెడ్డి: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్ వాహనంతో తరలించాలని తెలిపారు. జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అందరూ సమష్టిగా కృషి చేసి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, డీఆర్డీఓ అదనపు పీడీ బాలరాజ్, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణపై కార్మిక లోకం పోరాడాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య అన్నారు. సోమవారం బెల్ కాలనీలో ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మె సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నేతలతో సమ్మె సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లేబర్ కోడ్ రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కార్మిక లోకం కన్నెర్ర చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ సమ్మెలో కార్మికుల ఐక్యతను చూపించాలన్నారు. ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటామని ఆయన తెలిపారు. కార్మిక చట్టాల రక్షణకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నేతలు మహిపాల్ రెడ్డి, శ్రీను, శ్రీనివాస్, రాజయ్య, సురేందర్, మధు, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్లు ఇక్కడ.. ఓటు అక్కడ సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని పలు వార్డుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొంతమంది వ్యక్తులకు ఇతర వార్డుల్లో ఓటరుగా పేరు నమోదైంది. దీంతో అభ్యర్థులు ఓటర్లను గుర్తించేందుకు అదనపు కసరత్తు చేయాల్సి వస్తోంది. వార్డు జాబితాల ఆధారంగా ఓటర్ల చిరునామా ఫోన్ నంబర్లు సేకరించి వారిని చేరుకునే పనిలో అభ్యర్థులు దృష్టిపెట్టారు. కొంతమంది ఓటర్లు నివాస ప్రాంతంలో లభించకపోవడంతో పక్క వార్డులు, కాలనీల వరకు వెతుకుతూ ప్రచారం నిర్వహించారు. పోటీ తీవ్రంగా ఉండడం.. ఒక్క ఓటు కూడ కీలకంగా మారడంతో అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం
రేపు ఉదయం 7 నుంచి పోలింగ్ ● ముగిసిన ప్రచార కార్యక్రమాలు ● 256 వార్డులకు ఎన్నికల నిర్వహణ ● ఓటు వేయనున్న 3,41,806 మంది ఓటర్లుసంగారెడ్డిజోన్: మున్సిపల్ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. 11న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డులకు ఎన్నికలు జరగతున్నాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 256 వార్డులు, 541 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో 256 కౌన్సిలర్ పదవులకు జరిగే పోలింగ్ కోసం 541 కేంద్రాలను ఏర్పాలు చేశారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పో లింగ్ జరగనుంది. 3,41,806 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 13న ఓట్ల లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఇప్పటికే విడతలవారీగా శిక్షణ అందించారు. పోలింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన విధులపై ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా కౌంటింగ్కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 93 మంది రిటర్నింగ్ అధికారులు, 1,298 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 11 వందల మంది పోలీసు అధికారులను నియమించారు. నేడు పంపిణీ పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని మంగళవారం మున్సిపాలిటీ కేంద్రాలలో సంబంధిత అధికారులకు పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, స్టేషనరీతో పాటు అధికారుల కేటాయింపు జరగనుంది. సాయంత్రానికి వారంతా తమ కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్తారు. మూగబోయిన మైకులు వారం రోజులుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జోరుగాసాగాయి. ఎన్నికల సంఘం నిబంధన మేరకు సోమవారం సాయంత్రం 5 నుంచి ప్రచారాలు బంద్ అయ్యాయి. మైకులు మూగబోయాయి. పోలింగ్కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదు. మద్యం దుకాణాలు సైతం మూతపడ్డాయి.ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లునారాయణఖేడ్: మున్సిపల్ పోలింగ్ పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో డిస్ట్రిబూషన్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బాక్సులు అక్కడ సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పీఓ, ఏపీఓ, సిబ్బంది సామగ్రి తీసుకెళ్లేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఇక్కడే స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పరిశీలించారు. ఖేడ్ మున్సిపలిటీలో 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే
మంత్రి అజారుద్దీన్నారాయణఖేడ్: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం రాజీవ్చౌక్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికి తన మంత్రిత్వ శాఖ ద్వారా కృషి చేయడంతో పాటు సీఎం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ వారే ఉండటంతో అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, సభ్యులు శ్రీనివాస్, శంకరయ్యస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీ ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేశ్ షెట్కార్, ముఖ్యనాయకులు రశీద్, తాహెర్అలీ, ముంతాజ్, అభ్యర్థులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం జహీరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో వెనుకకు వెళ్లిందని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి అజారుద్దీన్ అన్నారు. సోమవారం జహీరాబాద్లో నిర్వహించిన ఎన్నికల కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని, అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. -
దావత్ల జోరు
చైర్మన్ గిరి..నేతల గురి సదాశివపేట చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆసక్తి పెరిగింది. వివరాలు 8లో uప్రలోభాల హోరు..మున్సిపల్ పోరు క్లైమాక్స్కు చేరింది. ఎన్నికల ప్రచారానికి గడువు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటుకు కనీసం రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా నగర శివారుల్లో ఉన్న మున్సిపాలిటీలు ఇస్నాపూర్, ఇంద్రేశం వంటి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓటుకు రూ.పది వేల వరకు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వారి కుటుంబసభ్యులను అభ్యర్థులుగా బరిలోకి దింపారు. దీంతో ఈ మున్సిపాలిటీల్లో పెద్ద మొత్తంలో ధన ప్రవాహానికి తెరలేపారనేది బహిరంగ రహస్యంగా మారింది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డిఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లోనూ పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీకి అభ్యర్థులు సిద్ధమయ్యారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, కోహీర్ వంటి మున్సిపాలిటీల్లోనూ డబ్బులు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, కొన్ని చోట్ల స్వతంత్రులుగా బరిలోకి దిగిన వారు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా తాయిలాలు పంపిణీ చేసేందుకు సై అంటున్నారు. గంప గుత్తా ఓట్ల కోసం ప్రయత్నాలు మద్యం పంపిణీ జోరందుకుంది. నాలుగైదు రోజులుగా అభ్యర్థులు తమ వార్డుల్లో మద్యం పంపిణీ చేస్తూనే ఉన్నారు. వారం రోజులుగా మద్యంతో దావత్లు కొనసాగుతున్నాయి. అయితే శివారు మున్సిపాలిటీల్లో మద్యం విందులు ఆసక్తికరంగా మారాయి. సాధారణ బ్రాండ్లు మద్యాన్ని ఓటర్లు తాగడం లేదు. ఖరీదైన బ్రాండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరి రోజుల మద్యం ప్రవాహం మరింత ఉధృతమవుతోంది. కొందరు అభ్యర్థులు ఆదివారం రోజు వార్డుల్లోని ఇంటింటికి మాంసం కూడా పంపిణీ చేశారు. మహిళా ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందు కు చీరలు, ఇతర గృహోపకరణాలను కూడా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు గల్లీల్లో ఉండే యువ ఓటర్లను కూడా విందుల్లో ముంచెత్తున్నారు. ముగిసిన ప్రచారం.. అభ్యర్థులు పది రోజులుగా వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మైకుల్లో అభ్యర్థుల పాటలు హోరెత్తాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసున్న ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే హరీశ్రావు, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రఘునందన్రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింతప్రభాకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి వంటి నాయకులు ఆయా మున్సిపాలిటీలో రోడ్షోలు, కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్నారు. మొత్తానికి బల్దియా ఎన్నికల ప్రక్రియలో చివరి కీలక ప్రచార ఘట్టం ముగిసింది. ఓటుకు రూ.ఐదు వేల నుంచిరూ.పది వేలు! -
జహీరాబాద్లో కింగ్మేకర్ కావాలి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపాలిటీలో ఎంఐఎం కింగ్ మేకర్ కావాలని, మెజార్టీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా వద్ద ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నాయని కష్టకాలంలో ముస్లింలకు ఎంఐఎం మాత్రమే అండగా ఉంటుందని వివరించారు. ముస్లింలు రాజకీయ నాయకత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెజార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే కింగ్ మేకర్ అవుతామని, తాము అనుకున్న వ్యక్తి చైర్మన్ అవుతారని పేర్కొన్నారు. జహీరాబాద్లోని ఐడీఎస్ఎంటీ కాలనీ సమస్యను కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టించుకోలేదని తమ పార్టీ లబ్ధిదారులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. ముస్లిం షాదీఖానా నిర్మాణ పనులతోపాటు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి కై సర్, జహీరాబాద్ అధ్యక్షుడు అక్తర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.మజ్లీస్ అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ -
రైతులకు శుభవార్త
కౌడిపల్లి(నర్సాపూర్): ఇప్పటి వరకు విద్యార్థులకు వసతి గృహాలు చూసాం.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రైవేటు హాస్టల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కేవీకేలో రైతుల కోసం ఓ వసతి గృహం సిద్ధం కాగా త్వరలో ప్రారంభం కానుంది. మండలంలోని తునికి కేవీకేలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలు జిల్లాలోని పలు గ్రామాల్లో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సేంద్రియ పంటల సాగు విధానాన్ని కేవీకేలో సాగు చేస్తూ ఎప్పటికప్పుడు రైతులకు కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. కాగా ఒక్కోసారి రైతులు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్తోపాటు ఇతర రైతులకు పంటసాగు, సస్యరక్షణ, నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువుల తయారీ వాటి వినియోగం, చీడపీడల నివారణ కోసం వివిధ రకాల కషాయాల తయారుచేసి వాడే విధానంపె శిక్షణనిస్తారు. దీంతో రైతులు వరుసగా ఐదు రోజులకుపైగా శిక్షణ ఇచ్చేవారు. దీంతో ప్రతిరోజు రైతులకు దూర ప్రాంతంలోని ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం శిక్షణకు వచ్చేవారు. కాగా ఈ సమస్య ఇక తీరనుంది. కేవీకేలో ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్) ఆధ్వర్యంలో గత ఏడాది వసతి గృహం నిర్మాణానికి రూ. 84 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో వసతి గృహం నిర్మించినట్లు కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ తెలిపారు. వసతి గృహంలో 6 గదులు, టాయిలెట్స్ నిర్మించారు. 24 మంది రైతులు వసతి గృహంలో ఉండేందుకు వీలుంది. ఇక శిక్షణ సమయంలో రైతులు ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో శిక్షణను సద్వినియోగం చేసుకోనున్నారు. శిక్షణ స్థాయిని బట్టి శిక్షణ కాలంలో వసతి గృహంలో ఉండే రైతులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వసతి గృహాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. -
పెంటకుప్పలో పసికందు
చిలప్చెడ్(నర్సాపూర్): ఏ తల్లి కన్నబిడ్డో.. ఆ తల్లికి చెప్పుకోలేని కష్టమో.. లేక పెంచలేని పరిస్థిలో ఉందో తెలియదు కాని నవమాసాలు మోసిన కన్నబిడ్డను పుట్టిన కొద్ది గడియలకే పేగుబంధం తెంపుకుంది. నవజాత శిశువును పొలం పక్కన పెంటకుప్పలో విడిచిపెట్టి వెళ్లింది. పసికందును గమనించిన అంగన్వాడీ టీచర్ పోలీసులు, అధికారుల సహాయంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం భద్రియతండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... భద్రియతండా సమీపంలో ఆదివారం ఉదయం తండాకు చెందిన మహిళ పొలంలో నీళ్లు తెచ్చేందుకు వెళ్లగా పక్కన పెంటకుప్పలో పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో దగ్గరికెళ్లి చూసేసరికి గుర్తుతెలియని మగ శిశువు కనిపించింది. దీంతో విషయం అంగన్వాడీ టీచర్ అనిత, సర్పంచ్ కున్యకు చెప్పడంతో వారు పోలీసులకు, సీడీపీఓకు సమాచారం ఇచ్చారు. అనంతరం అధికారుల సూచనలతో పోలీస్ వాహనంలో శిశువును మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ శిశువుకు వైద్యులు చికిత్స చేశారు. మగశిశువు 1.96కిలోగ్రాములు బరువు ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని చెప్పారు. పుట్టిన గంట, రెండు గంటలలోపు శిశువును అక్కడ వదిలి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంక బొడ్డు కూడా కోయలేదని చెప్పారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బందితోపాటు మెదక్ బాలసదన్ అధికారుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు పేర్కొన్నారు. అయ్యో పాపం.. ఏ తల్లి కన్నబిడ్డో.. -
కానిస్టేబుల్పై వేటు
కొమురవెల్లి(సిద్దిపేట): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కొమురవెల్లి పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ కె.రమేశ్ను సస్పెండ్ చేస్తూ ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, విఽధులకు గైర్హాజరయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రమేశ్ భార్య చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమెకు మద్దతుగా రమేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో సహా నిరూపితమైందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ వ్యవస్థలో ఉంటూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నియమావళి ప్రకారం నేరం, అనైతికమని తెలిపారు. కానిస్టేబుల్ భార్య నిరసన.. చేర్యాల(సిద్దిపేట): పోలీస్ ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించాడని కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమేశ్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులిచ్చారు. ఈ విషయంపై కానిస్టేబుల్ భార్య, స్థానిక 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గీతాంజలి స్పందిస్తూ తన భర్త సస్పెన్షన్ కక్షపూరిత చర్యగా వర్ణించారు. ఇదే విషయమై ఆమె ఆదివారం కుటుంబ సభ్యులు, తన మద్దతుదారులతో కలిసి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. -
కోహెడలో పెద్దపులి కలకలం
● పులి దాడిలో నాలుగు లేగదూడలు, రెండు ఆవులు మృతి ● రైతులు, గ్రామస్తుల్లో భయాందోళనకోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మండలంలోని బస్వాపూర్, కూరెళ్ల గ్రామాల శివారులో ఆదివారం పెద్దపులి పశువులపై దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు లేగదూడలు, రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆరేపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండాకు చెందిన మాలోతు రమేశ్ నాయక్కు చెందిన లేగ దూడలు, ఆవులను పెద్దపులి చంపినట్లు తెలిపాడు. పులి సంచారం కారణంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధింత గ్రామాల సర్పంచ్లు బందెల సుజాత, పిల్లి బాబు, లింగంపల్లి లక్ష్మయ్య, సామాజిక మాధ్యమాల్లో మెసేజ్, దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని తహసీల్దార్ చంద్రశేఖర్, పోలీసులు గ్రామస్తులకు సూచించారు. ఎస్ఐ అభిలాష్, అటవీశాఖ అధికారులతో కలిసి సింగరాయ గుట్టలలో గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. పులి సంచారం విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. పులి దాడిలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నుంచి త్వరలోనే నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కేసీఆర్ పాలనలోనే సంగారెడ్డి అభివృద్ధి
సదాశివపేట(సంగారెడ్డి)/సంగారెడ్డి/జహీరాబాద్/పటాన్చెరు టౌన్: సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కేసీఆర్ హాయాంలోనే జరిగిందని, రూ.34 కోట్లతో ఇంటింటికి మంచినీళ్లు, సంగారెడ్డి పట్టణంలో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఇలా అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, గడ్డపోతారం తదితర చోట్ల కార్నర్మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ...ఆనాడు చింతా ప్రభాకర్ ఓటమి పాలైనప్పటికీ..సంగారెడ్డికి మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీని కేసీఆరే మంజూరు చేశారని గుర్తు చేశారు. టీయూఎఫ్ఐడీసీ కింద రూ.50 కోట్లు, ఎస్డీఎఫ్ కింద రూ.25 కోట్లతో సంగారెడ్డిని అబివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా పట్టణంలో పైసా పనిచేసింది లేదని విమర్శించారు. ఎన్నికల కోసం మంజూరీలు, టెండర్లు లేకుండా కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రెండేళ్లలో రూ.8 రూపాయలు కూడా ఇవ్వని కాంగ్రెస్ నాయకులు వార్డుకు రూ.8 కోట్లు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. జగ్గారెడ్డిలాగా అడ్రస్ లేకుండా పోయే రకం కాదు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిత్యం క్యాంప్ ఆఫీస్లో ప్రజలకు అందుబాటులో ఉంటారని, జగ్గారెడ్డి మాదిరిగా అడ్రస్ లేకుండా పోయే రకం కాదని హరీశ్రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి, సదాశివపేట, కోహీర్, జహీరాబాద్, నర్సాపూర్, మెదక్ ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందన్నారు. రెండేళ్లలో వచ్చే కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ , మంత్రిగా నేను బ్యాధత తీసుకుని పట్టణాభివృద్ధికి గ్యారెంటీ తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అర్థంపర్థం లేని నిర్ణయాలతోనే రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయి ధరలు పతనంకావడంతోనే అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్రావు -
నేడు అప్రెంటిస్షిప్ జాబ్ మేళా
సంగారెడ్డి క్రైమ్: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ శిక్షణ అప్రెంటిస్షిప్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో వివిధ రంగాలకు చెందిన 10 ఇండస్ట్రియల్ టెక్నికల్ ట్రేడ్లు, ప్రొడక్షన్ తదితర వాటిలో అప్రెంటిస్ షిప్నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, సంబంధిత టెక్నికిల్ను విద్యా అర్హతగా నిర్ణయించా రు. ఆసక్తిగల నిరుద్యోగులు ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లు, ఆధార్, ధ్రువపత్రాలతో ఐటీఐ కళాశాల కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94930 14844 నంబర్ను సంప్రదించాలన్నారు. రాష్ట్ర స్థాయికి విద్యార్థులు ఎంపిక సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి మండల పరిధిలోని హనుమాన్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులపాటు టెక్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జానకి దేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తడ్కపల్లి వాసికి ఉత్తమ అవార్డు సిద్దిపేటఅర్బన్: మండలంలోని తడ్కపల్లి గ్రామానికి చెందిన దుబ్బాక నవీన్గౌడ్ 2026 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామిక అవార్డును అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చ ర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి కాన్ఫరెన్స్లో నవీన్ గౌడ్ ఈ అవార్డును అందుకున్నారు. ఆయన ‘మగధ’బ్రాండ్తో స్టార్టప్ సంస్థను ప్రారంభించి ఆర్గానిక్ తేనే, ఆయిల్ను ఉత్పత్తి చేస్తున్నాడు. వినూత్న విధానాలు అవలంభించడం, నాణ్యమైన ఉత్పత్తులు ఉత్పత్తి చేయడంతో పాటు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చేసిన విశేష కృషికి తనకు ఈ అవార్డు వచ్చిందని నవీన్గౌడ్ పేర్కొన్నారు. గ్రామాని కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు కొల్చారం(నర్సాపూర్): కారు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు మెదక్ నర్సాపూర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కొంగోడు గ్రామాని కి చెందిన మేకల అజయ్, మంగలి అనిల్ ఆటోలో మెదక్కు వెళ్తున్నారు. ఇదే సమయంలో మెదక్ వైపు నుంచి వస్తున్న కారు రహదారి పాత బ్రిడ్జి వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న అజయ్, అనిల్కు గాయాలయ్యాయి. ఇరువురిని చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
గసగసాల పొడి సీజ్.. వ్యక్తి అరెస్ట్
నారాయణఖేడ్: మాదక ద్రవ్యాలకు సంబంధించిన రూ.22 వేల విలువచేసే 300 గ్రాముల గసగసాల పొడిని ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకొని, వ్యక్తిని అరెస్టు చేశారు. ఖేడ్ ఎకై ్సజ్ సీఐ రఘునాథ్ రెడ్డి వివరాల ప్రకారం... రాజస్థాన్కు చెందిన భగీరథ స్థానికంగా హెచ్పీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎకై ్సజ్ అధికారులు నిజాంపేటలో దాడిచేసి భగీరథ నుంచి 300 గ్రాముల గసగసాల (ఓపీఎం పొడి) మొక్కలకు చెందిన ఎండబెట్టిన కాయల పొడిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన పొడిని రసాయన పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఖేడ్ డివిజన్ పరిధిలో ఇలాంటి కేసు నమోదవ్వడం ఇదే మొదటిసారి. కాగా ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి పొడిని సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు. గసగసాల పొడిని స్థానికంగా విక్రయం కోసం తెచ్చాడా? లేక ఇతర ప్రాంతాలకు తరలించే ఉద్దేశంతో తెచ్చాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తోపులాట
తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఆదివారం పట్టణ కేంద్రంలో తోపులాట చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న 1, 15వ వార్డుల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ పార్టీ మైనార్టీ హెచ్వైసీ నాయకుడు సల్మాన్ఖాన్తో ప్రచారం చేపట్టారు. దీంతో స్థానికంగా కాంగ్రెస్ నుంచి మైనార్టీలమే పోటీలో ఉండగా తమకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టి సల్మాన్ఖాన్ను అక్కడి నుంచి పంపించారు. దీంతో సమస్య సద్దుమనిగింది. కాంగ్రెస్, జనసేన వర్గాల మధ్య ఘర్షణ జిన్నారం (పటాన్చెరు): మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్, జనసేన వర్గాల మధ్య ప్రచారం ఘర్షణకు దారితీసింది. ఆదివారం గడ్డపోతారం మున్సిపాలి టీ 4వ వార్డులో జనసేన అభ్యర్థి ఓటర్లను కలిసి డబ్బులు పింపిణీ చేస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు వారితో గొడవకు దిగారు. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నియమాలు ఉల్లంఘించొద్దని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు. -
వలస ఓటర్లకు గాలం
● రాను పోను రవాణ చార్జీలు చెల్లిస్తామంటున్న అభ్యర్థులుసంగారెడ్డి టౌన్/సదాశివపేట(సంగారెడ్డి) : మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్లను గాలం వేసేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం 11 మున్సిపాలిటీల్లో అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వెతుకులాట సాగిస్తున్నారు. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లోని మొత్తం ఓటర్లు 3,42,659. ఇందులో మహిళలు 1,72,521, పురుషులు 1,70,102 మంది ఉండగా 256 వార్డుల్లో 10,450 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా, ఈ అభ్యర్థులందరూ వలస ఓటర్ల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలా లు, ఫోన్ నంబర్లను అభ్యర్థులు సేకరిస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డు ల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్ల కోసం బంధువుల ద్వారా ఫోన్లు చేయించి ఓట్లు వేసేందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే రవాణ చార్జీలు చెల్లిస్తాం ఓటు వేసి వెళ్లాలని వేడుకుంటున్నారు. వలస ఓటర్లకు ప్రయాణ ఖర్చులతోపాటు ఓటరుకు కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరికొందరు అభ్యర్థులైతే వలస ఓటర్ల కోసం బంధువుల ద్వారా ఫోన్లు చేయించి ఓట్లు వేసేందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వద్దకు తమ తమ నాయకులను పంపించి హామీలు ఇస్తూ డబ్బులు సైతం పంపిణీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మహిళలే కీ రోల్
ఓట్లు.. సీట్లు వారివే ● ప్రచారంలోనూ అతివలే.. ● మెదక్లో 113 మంది అభ్యర్థులు ● బరిలో 60 మంది మహిళలు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా... మహిళలదే హవా కనిపిస్తోంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాత మార్చేది కూడా వారి ఓట్లే. మెదక్ మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో 113 మంది పురపోరు బరిలో నిలిచారు. అందులో ఆయా పార్టీలు బలపర్చిన వారితోపాటు స్వతంత్రులు కలిపి మొత్తం 60 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ చైర్మన్ స్థానాలు వారికే కేటాయించారు. ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తుండగా, అందులో ఏ వార్డులో చూసినా ప్రచారంలో మహిళలే కనిపిస్తున్నారు. 4 మున్సిపాలిటీలు.. 87,185 మంది ఓటర్లు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 87,185 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు 45,168 మంది, 42,015 మంది పురుష ఓటర్లు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. 4 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ స్థానాలు మహిళలకే కేటాయించారు. ప్రచారంలోనూ వారే.. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులు ఉండగా ఇందులో 16 వార్డులు మహిళలకు కేటాయించారు. 32 వార్డుల్లో 113మంది బరిలో ఉండగా వారిలో స్వతంత్రులతోపాటు మొత్తం 60 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 32వ వార్డు మహిళా అభ్యర్థి ఏకగ్రీవం కాగా 15 వార్డుల్లో మొత్తం 59 మంది బరిలో ఉన్నారు. వార్డుల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలోనూ మహిళలే అత్యధికంగా ఉంటున్నారు. అభ్యర్థులు కూడా మహిళా ఓటరును ప్రసన్నం చేసుకుంటే ఓట్లన్నీ మనకే పడతాయన్న ఆలోచనతో వారినే ప్రచారానికి ఎక్కువగా పిలుస్తున్నట్లు సమాచారం. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
పర్యటించిన సీపీ రష్మీ పెరుమాళ్హుస్నాబాద్: పట్టణంలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. అనంతరం ఆమె ఎన్నికలు ప్రశాంతంగా, నిషృక్ష పాతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించారు. అలాగే వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్లకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా సందర్శించారు. ఎన్నికల కోడ్ అమలును పటిష్టంగా పర్యవేక్షించాలని, మద్యం, నగదు పంపిణీ వంటి అక్రమాలను అడ్డుకోవడానికి తనిఖీలు ముమ్మరంగా చేయాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతుకు గాయాలు నిజాంపేట(మెదక్): విద్యుత్ షాక్ తగిలి రైతుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... ఆదివారం గ్రామానికి చెందిన ఒజ్జే పర్శరాములు వ్యవసాయ పనుల నిమిత్తం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పీజ్ వైర్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే కుటుంబీకులు గమనించి అంబులెన్స్లో సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే
పటాన్చెరు టౌన్: బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కార్మిక శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్లతో కలసి మంత్రి వివేక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ అకౌంట్లో రూ.వెయ్యి కోట్ల డిపాజిట్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి కమిషన్లను దండుకుని పార్టీ పేరు మీదకు డబ్బులు మళ్లించారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో కవితది రాజకీయ గొడవ కాదని, పదేళ్ల పాలనలో లక్షల కోట్లు దండుకుని డబ్బుల పంపకంలో వచ్చిన గొడవలతోనే విడిపోయారని తెలిపారు. కవితకు 50% వాటా అడిగితే ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి చూపించి రాబోయే రోజుల్లో రూ.2,500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పాశమైలారంతో తనకు మంచి అనుబంధం ఉందని ఇటీవలే మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శ్రీ శైలం,కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.కార్మిక శాఖ మంత్రి వివేక్ -
ఏకగ్రీవమాయే.. ఓట్లు లేకపాయే!
● మధన పడుతున్న 32వ వార్డు ఓటర్లు ● ప్రచార సందడి కరువు ● పట్టణంలో ఈ వార్డు పైనే చర్చ..మెదక్జోన్: మున్సిపాలిటీలో ఉన్నాం.. కానీ మనకు ఓట్లు లేకపాయే.. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పుతుండ్రు, ప్రచారం చేస్తే కూలీ ఇస్తుండ్రు. కానీ మనల్ని పలకరించే వారు లేకుండా పోయారని పట్టణంలోని 32వ వార్డు ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. కాగా వార్డు నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన గోదల మానస నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ నుంచి మాజీ కౌన్సిలర్ గోదల జ్యోతి కృష్ణ నామినేషన్ వేశారు. ఈ నెల 1న జ్యోతి తన నామినేషన్ను విత్డ్రా చేసుకోవటంతో ఆ వార్డు కౌన్సిలర్గా గోదల మానస ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం తెలిసిందే. అయితే ఆ వార్డుకు ఎన్నికలు లేకపోవటంతో ఎలక్షన్లు లేవని ప్రజలు మదన పడుతున్నారు. గతంలోనూ ఇలాగే... గత మున్సిపల్ ఎన్నికల్లోనూ గోదల మానస, గోదల జ్యోతి నామినేషన్లు వేశారు. జ్యోతి విత్డ్రా చేసుకోవటంతో మానస ఏకగ్రీవంగా కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాకుంటే అప్పట్లో మానస బీఆర్ఎస్ నుంచి, గోదల జ్యోతి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పట్టణం అంతా వార్డుపైనే చర్చ! ఇప్పటికి రెండు సార్లు ఎన్నికలు జరుగకుండా కౌన్సిలర్గా ఏకగ్రీవం కావటంతో పట్టణం అంతా ఈ వార్డు గురించే చర్చ జరుగుతుంది. వారి మధ్య ఏరకమైనా ఒప్పందం జరిగిందేమో కానీ భవిష్యత్తులో వారు నామినేషన్ వేసే వార్డుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన పార్టీల నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ముఖ్యంగా గోదల జ్యోతి కృష్ణ వరుసక్రమంగా నామినేషన్లు వేయటం, విత్డ్రా చేసుకోవటంపై అంతా చర్చించుకుంటున్నారు. -
కాంగ్రెస్ చేసిందేమీ లేదు
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జిన్నారం(పటాన్చెరు): కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమి లేదని మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. గడ్డపోతారం పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. రేవంత్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులను బీఆర్ఎస్ కై వశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి, మాజీ జెడ్పిటీసీ బాల్రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రకాష్ చారి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పురపోరులో కాంగ్రెస్ సత్తా చాటాలి: గజ్జెల కాంతం నారాయణఖేడ్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటి మెజార్టీ మున్సిపాలిటీలను కై వశం చేసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తెలిపారు. ఖేడ్ మున్సిపల్ ఎన్నికల పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిపట్ల ప్రజలు అనుకూల ఫలితాలను ఇవ్వనున్నారని అన్నారు. చైర్మన్ల ఎన్నికను కౌన్సిలర్లను గెలుపొందిన తర్వాతే పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. సంఘంపై అసత్య ప్రచారం తగదుటీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు జావీద్ అలీ సంగారెడ్డి : ఉద్యోగుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేసే టీఎన్జీఓ సంఘంపై అసత్య ఆరోపణలు సరికాదని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జావీద్ అలీ, రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 610 జీవోను సాధించి అంతిమంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి తెలంగాణను సాధించిన సంఘంగా చరిత్రలో గుర్తింపు ఉదన్నారు. కొంతమంది ఉద్యోగ సంఘం ముసుగులో టీఎన్జీవోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి తగిన గుణపాఠం ఉద్యోగులే చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యంటెమ్రిస్ చైర్మన్ ఫహీం ఖురేషీ జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని టెమ్రిస్ చైర్మన్ ఫహీం ఖురేషీ పేర్కొన్నారు. రంజోల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినట్లయితే ఆశించిన మేరకు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అభివృద్ధి సంక్షేమాలే బీజేపీ లక్ష్యంఎంపీ రఘనందన్రావు ప్రచారం జిన్నారం (పటాన్చెరు): అభివృద్ధి సంక్షేమమే బీజేపీ లక్ష్యమని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ఆదివారం ఆయన విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీతోనే మున్సిపాలిటీలో అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి పార్టీని ఆదరించాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత హామీలతో జనాలను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులు ప్రజలు పాల్గొన్నారు. -
నేటితో ప్రచారం బంద్
హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సోమవారంతో బంద్ కానున్నాయి. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. గత వారం రోజులుగా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఓట్ల కోసం ప్రజలను అభ్యర్థించారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో తమ మద్దతుదారులతో కలిసి రాత్రి, పగలు తేడా లేకుండా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. హోరాహోరీగా ప్రచారాలు అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు ప్రచారాలు పాల్గొన్నారు. భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. నేరుగా ఓటర్లను కలవడంతోపాటు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో తమ గుర్తులతో పాటు హామీలను ప్రజలకు చేర్చారు. తమ పరిధిలోని ఓటర్లకు ఐవీఆర్ఎస్ సిస్టం ద్వారా మెసేజ్, ఫోన్ కాల్స్ ద్వారా మద్దతు కోరుతున్నారు. డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్ జిల్లాలో 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డులున్నాయి. కౌన్సిలర్ల పదవికి ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు 1,045 మంది బరిలో ఉన్నారు. తాము గెలిస్తే చేసే అభివృద్ధి పనుల మేనిఫెస్టోను రూపొందించి ఓటర్ల ముందు ఉంచారు. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో గెలుపోటముల టెన్షన్ మొదలైంది.11న పోలింగ్.. 13న ఫలితాలు ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 256 వార్డులకు 541 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎక్కడైనా అవసరమైతే 12 న రీ–పోలింగ్ జరుపుతారు. 13న ఉదయం 8:00 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. బరిలో 1,045 మంది అభ్యర్థులు -
వడ్డెరులందరికీ ఇళ్ల పట్టాలు
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీ ఫరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.అందోల్–జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వడ్డెరులతో సమావేశమై 56 మందికి ఇంటి పట్టాలు, కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానికంగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో తృతీయ స్థానంజిన్నారం (పటాన్చెరు): బొల్లారం డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి దీక్షిత రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి సత్తా చాటింది. గణిత శాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. విద్యార్థిని ప్రతిభను కొనియాడుతూ నిర్వాహకులు షీల్డ్తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థిని దీక్షితను కరస్పాండెంట్ లోకనాథం, ప్రిన్సిపాల్ హైమావతి అభినందించారు. -
మీవోడు గెలుస్తాడా? ఓడిపోతాడా?
సదాశివపేట(సంగారెడ్డి): హలో...మీ వార్డులో ఆ అభ్యర్థి పరిస్థితి ఏంటి? గెలుస్తాడా? ఓడిపోతాడా? ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? అన్ని పార్టీలకంటే స్వంతత్ర అభ్యర్థే విజయం సాధిస్తాడా? ఇలా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడళ్లు, హోటల్, టీ దుకాణాల్లో అభ్యర్థుల గెలుపోటములపై స్థానికులు చర్చోపచర్చలు కొనసాగిస్తున్నారు. ప్రచారం అయితే అందరూ బాగానే చేస్తున్నారు. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లోని 256 వార్డుల్లో కూడళ్లు చాయ్ దుకాణాలు, మద్యం, కల్లు దుకాణాల్లోని సిట్టింగ్ రూముల్లో ఎక్కడ ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. ఎవరికివారే రాజకీయ విశ్లేషకులు.. ఎవరికి వారు వార్డుల వారీగా పరిస్థితిని అంచనా వేస్తూ ఫలానా అభ్యర్థికే గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసేస్తున్నారు. అభివృద్ధి మాకేందుకు ఓటుకు డబ్బులిస్తేనే ఓటు వేస్తామని మెజార్టీ ఓటర్లు అంటుంటే మరికొందరు మాకు డబ్బులు వద్దు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవారికి ఓటు వేస్తామంటున్నారు. ఈసారి డబ్బు ప్రభావం చాలా పనిచేస్తుందని డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారే గెలుస్తారని, ఇప్పటికే ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చేశారని తేల్చేస్తుండటం గమనార్హం. ఫలానా మతం ఓటర్లు ఎక్కువగా ఉన్నందువల్ల వారు ఎటువైపు మొగ్గుచూపితే వారికే విజయ అవకాశాలున్నాయని మరికొందరు తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే అన్ని చోట్లా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తోపాటు బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తుండటంతో గెలుపోటములపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఒక్కొక్కరినీ కలుస్తూ.. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. వార్డులు వదిలి స్థానికంగానే మరోవార్డులో ఉంటున్న వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో గత అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ పీసీసీవర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, వారి కుమార్తె జయారెడ్డి వేర్వేరుగా ప్రతీరోజు వార్డుల్లో ముఖ్యులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అభ్యర్థుల్లో గెలిచేదెవరో.. కూడళ్లు, టీ దుకాణాల్లో చర్చోపచర్చలు -
కాంగ్రెస్ పాలనలో అన్నీ స్కామ్లే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పట్టణాల్లో వీధిదీపాలను కూడా వెలిగించలేని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. తన భాషతో వీధి రౌడీలా తయారయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పట్టణాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే, రేవంత్రెడ్డి మాత్రం కండ్లకు గంతలు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదని.. కేవలం ఫ్రాడింగ్ మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్కీములు బంద్ అయ్యాయని, స్కామ్లు మాత్రం జోరందుకున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, గడ్డపోతారం తదితర ప్రాంతాల్లో 15 కార్నర్మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. తన తండ్రి వయసు ఉన్న కేసీఆర్ను పట్టుకుని కనీస గౌరవం లేకుండా, అతినీచమైన భాషను మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ను దూషిస్తే నిరుపేదల కడుపులు నిండవని, సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే పేదల కడుపులు నిండుతాయని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్న కేసీఆర్ను జైలులో పెడతామని కాంగ్రెస్ అంటోందని హరీశ్రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేస్తామని రేవంత్రెడ్డి రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో కొత్త పథకాలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను బంద్ చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు అన్నం పెట్టిన కేసీఆర్కు ఓటేస్తారా?, హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్రెడ్డికి ఓటేస్తారో?.. ప్రజలు ఆలోచన చేయాలని హరీశ్రావు అన్నారు. అసలు ఎవరో.. నకిలీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూపాలపల్లిలో చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన రేవంత్రెడ్డినే నకిలీ అని అన్నారు. -
దుబ్బాక ప్రగతే.. మా అజెండా
దుబ్బాకలో సమస్యలు తిష్ట వేశాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. విద్య, వైద్యం, రోడ్లు, చెరువులు, స్టేడియాలు మొదలుకొని ఇంకా అభివృద్ధిలో వెనుకబడిందని శనివారం నిర్వహించిన సాక్షి డిబేట్లో పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి అభివృద్ధి, సమస్యలు, సమాజంపై అవగాహన ఉన్న నాయకులనే ఎన్నుకుంటామని, ఇదే మా అజెండా అని గళమెత్తడంపై ఈ వారం కథనం. – దుబ్బాక విప్లవోద్యమాల పుట్టినిల్లు..పోరాటాల పురిటిగడ్డ..రాజకీయ చైతన్యానికి రాష్ట్రంలోనే ప్రసిద్ధి దుబ్బాక. ఎందరో మేథావులను.. అతిరథ మహారథులను దేశానికి అందించిన దుబ్బాక ఇంకా చాలా రంగాల్లో వెనుకబడి ఉండటంపై ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఈ గడ్డపైనే పుట్టి పెరిగి.. విద్యాబుద్ధులు నేర్చిన పలువురు ప్రముఖులు దేశ, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కీలక స్థానాల్లో ఉన్నారు. కానీ ఏళ్ల నుంచి దుబ్బాక పట్టణంలో రోడ్ల విస్తరణ కాకపోవడంతో ఇరుకురోడ్లతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. దశాబ్దంన్నర కాలంగా రెవెన్యూ డివిజన్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నా ఇంత వరకు ఏ రాజకీయపార్టీ అధికారంలోకి వచ్చినా నెరవేర్చలేదంటూ అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం దుబ్బాక పట్టణంలోని శివాజీ చౌరస్తాలో సాక్షి ఆధ్వర్యంలో ప్రజల అజెండాపై డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిబేట్లో పట్టణంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల నేతలు, వాకర్లు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమాజంపై అవగాహన ఉన్న వారినే కౌన్సిలర్లుగా గెలిపించుకోవాలన్నారు. గెలిచిన కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధితో పాటు రెవెన్యూ డివిజన్, విద్య, వైద్యం, రోడ్లు అభివృద్ధితో పాటు ప్రజల మౌళిక సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. డిబేట్లో పాల్గొన్న పలువురి అభిప్రాయాలు ఇలా... దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలి. 15 ఏళ్లుగా డివిజన్ ఏర్పాటు చేస్తామంటూ హామీలివ్వడమే తప్పా ఇంత వరకు నెరవేర్చలేదు. ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం తర్వాత మర్చిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా డివిజన్పై స్పష్టమైన హామీ ఇవ్వాలని దుబ్బాక ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. డివిజన్ కోసం ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రజల చిరకాల వాంఛను తీర్చకపోవడం చాలా బాధాకరం. –మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు -
సెల్ఫోన్ దొంగల అరెస్ట్
ములుగు(గజ్వేల్): సెల్ఫోన్లను అపహరించి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ములుగు ఎస్ఐ రఘుపతి కేసు వివరాలు వెల్లడించారు. శివ్వంపేట మండలం బిక్యా తాండాకు చెందిన దేవసోత్ చరణ్నాయక్, మాలోత్ సంతోష్ నాయక్, గుగులోత్ శ్రీధర్ గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా 54 సెల్ఫోన్లు దొంగిలించారు. అందులో నుంచి కొన్ని ఫోన్లు ఇతర రాష్ట్రాల వారికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. ఇంకా మిగిలివున్న 27 సెల్ఫోన్లను వారు నివాసముంటున్న మేడ్చల్లోని ఒక గదిలో బద్రపరిచారు. అందులో నుంచి ఒకటి చొప్పున విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు శనివారం 3 సెల్ఫోన్లను విక్రయించేందుకు మండలంలోని బండమైలారం గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రఘుపతి సిబ్బందితో కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి రూ.1లక్ష 23 వేలు విలువ చేసే 23 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. -
పుస్తకాలు రాయడం గొప్ప అలవాటు
ఎమ్మెల్యే హరీశ్ రావుసిద్దిపేటజోన్: విద్యార్థి దశలోనే పుస్తకాలు రాయటం అనేది చాలా గొప్ప అలవాటని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాల విద్యార్థి పొట్టి వెంకటేశ్ స్వయంగా రచించిన ఆధునిక కంప్యూటర్ వ్యవస్థలో వస్తున్న మార్పులకు సంబంధించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఒకప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్లను చాలా గొప్పగా చూసే వాళ్లని, కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే మాత్రమే సరిపోదని అందులో మంచి జ్ఞానాన్ని సంపాదించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను మన భారతీయులే ముందుండి నడిపించడం మన మన దేశానికే గర్వకారణమన్నారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ పుస్తక రచనలో ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్య ప్రకాశ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అప్పుల బాధతో తాపీ మేసీ్త్ర ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): అప్పుల బాధతో తాపీ మేసీ్త్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ లక్ష్మిబాబు వివరాల ప్రకారం... మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దశరథం కొన్నేళ్ల కింద మేసీ్త్ర పనులు చేస్తుండగా కింద పడటంతో నడుము విరిగింది. అప్పటినుంచి మేసీ్త్ర పనులు చేయలేకపోతున్నాడు. దీంతో కుటుంబ పోషణ కోసం వడ్డీ వ్యాపారుల వద్ద, ప్రైవేటు బ్యాంకులో రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో వారు ఒత్తిడి చేస్తున్నారు. దీనికి తోడు తన తండ్రి మృతి చెందడంతో కార్యక్రమాల నిర్వహణ కోసం మరిన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి గదిలోకి వెళ్లి తలుపులు తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోంచి చూడగా పైకప్పు కొక్కేనికి చీరతో ఉరివేసుకున్నాడు. భార్య తేజస్విని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై గృహిణి.. దుబ్బాకటౌన్: మద్యానికి బానిసై గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన మాడుగుల శేఖర్ కూలి పనులు చేస్తూ, భార్య మాడుగుల శారద (42), ఇద్దరు కుమారులతో జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా భార్య శారద మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుంది. గమనించిన కుమారులు తండ్రికి, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు పట్టాలపై వ్యక్తి.. తూప్రాన్: రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ సమీపంలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేటు సమీపంలో శనివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసుల వివరాల ప్రకారం... బ్రాహ్మణపల్లికి చెందిన శివపొట్టి రమేశ్(40) రైలు పట్టాలపై సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో.. పులి
లద్నూరులో పులి దాడిలో లేగదూడ మృతి మద్దూరు(హుస్నాబాద్): మద్దూరు, దూల్మిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు హుస్నాబాద్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థరెడ్డి, చేర్యాల డీఆర్వో లింగమూర్తి , ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాయుడు శనివారం మండలంలోని లద్నూరు, వంగపల్లి, ఉప్పరోనిగడ్డ, వల్లంపట్ల గ్రామాల్లో సందర్శించి పులి పాదముద్రలను పరిశీలించారు. లద్నూరులో పుట్ట అనంతరెడ్డి వ్యవసాయ బావి వద్ద పులి దాడిలో లేగదూడ మృతి చెందింది. సంఘటన స్థలంలో అధికారులు కెమెరాలు ఏర్పాటు చేశారు. వల్లంపట్ల, కూటిగల్, బైరాన్పల్లి, బెక్కల్ గ్రామాల మధ్య జెనిగల వాగులో అధికారుల డ్రోన్ కెమెరాలతో పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫారెస్టు అధికారులు మాట్లాడుతూ జనగామ జిల్లాల్లోని నర్మెట మండలంలోని వెల్డండ, అమ్మాపురం గ్రామాల్లో పశువులపై దాడి చేసిన పులి అమ్మాపురం గ్రామం నుంచి లద్నూరుకు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ బావుల వద్ద ఉండే పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కాగా, కూటిగల్, బైరాన్పల్లి, బెక్క ల్ గ్రామాల పరిధిలో జిల్లా ఫారెస్టు ఆఫీసర్ పద్మ డ్రోన్ ద్వారా పులి ఉందని గుర్తించారు. ఈ మేరకు పులిని పట్టుకోవడానికి బోన్లను తెప్పించారు. -
బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
● కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఒరిగేదేమీలేదు ● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ● గజ్వేల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంగజ్వేల్: బీజేపీకి ఓటేసి గెలిపించుకోవడం ద్వారా మున్సిపాలిటీలను బాగు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా సీఎం రేవంత్రెడ్డి పాలనపై పట్టు సాధించలేక పోతున్నారని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుండబద్ధలు కొట్టిన ఆయన రాష్ట్రాన్ని ఎలా ప్రగతి పథంలో పెడతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తనకు ఆర్థిక పరిస్థితి తెలుసునని చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహ రించడం వల్లే బీఆర్ఎస్ను ప్రజలు గద్దె దించారని గుర్తు చేశారు. నేటికీ ఆ పార్టీ నేతల తీరు మారటం లేదని చెప్పారు. ఇలాంటి సందర్భంలో బీజేపీకి ఓటు వేయడం ద్వారా పట్టణాల అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉన్నదని పిలుపునిచ్చారు. సర్పంచ్, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రద్దవుతాయనే భయంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
డిపో పునరుద్ధరణ
దుబ్బాక బస్సు డిపోను పూర్తిస్థాయి డిపోగా పునరుద్ధరించాలి. ఇప్పుడు ఏదో వంతుగా కొన్ని బస్సులతో కొన్ని రూట్లలోనే నడుపుతుండ్రు. దుబ్బాక డిపోపై ప్రభుత్వం వివక్ష సరికాదు. 60 బస్సులు, డీఎం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలతో పాటు కొత్త రూట్లలో బస్సులు వేయాలి. హుస్నాబాద్కు న్యాయం చేసి దుబ్బాక డిపోపై వివక్ష చూపడం చాలా బాధగా ఉంది. –రాజేశ్ మురుగునీటి శుద్ధి పట్టణంలోని చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరుతుండటంతో నీరంతా కాలుష్యంగా మారుతుంది. మురుగునీరు చేరకుండా ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్)లు ఏర్పాటు చేయాలి. చెరువుల సుందరీకరణ చేపట్టి ఆహ్లాదం అందించే విధంగా తీర్చిదిద్దాలి. డ్రైనేజీలను సైతం మెరుగుపర్చాలి. రామసముద్రం చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు కట్టపై జిమ్ను పునరుద్ధరించాలి. –కృష్ణ -
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
ఉమ్మడి జిల్లాలో 1,229 మంది హాజరు వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయలో 2026–27కు గాను 9వ, 11వ తరగతుల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు గజ్వేల్, ప్రజ్ఞాపూర్, వర్గల్లో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 1,229 మంది హాజరయ్యారు. 11వ తరగతి ప్రవేశపరీక్షకు మొత్తం 1008 మంది అభ్యర్థులకు 727 (72.12శాతం)మంది హాజరైనట్లు నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. అలాగే 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 853 మందికి 502 (58.85 శాతం)మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను ఆయనతోపాటు మండల విద్యాధికారులు సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులపై దృష్టి సారించాలి మిరుదొడ్డి(దుబ్బాక): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ముడ్రాతి రమేశ్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని అందె ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. మిడ్లైన్ ఎఫ్ఏ –3 పరీక్షా పేపర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు, గణిత భావాలను పెంపొందించాలన్నారు. ఈ నెలలో జాతీయ విద్యా సదస్సు జరుగుతుందని, ప్రతి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఏడుపాయలలో శాశ్వత బస్ స్టేషన్ కొల్చారం(నర్సాపూర్): ఏడుపాయల ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం త్వరలోనే శాశ్వత బస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా హైదరాబాద్ జూన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుశ్రుశాఖాన్ పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏడుపాయల వనదుర్గాదేవి జాతరలో భాగంగా, పోతంశెట్టిపల్లి శివారులోని టీ జంక్షన్ టేకుల గడ్డ వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న బస్ స్టేషన్ ఏర్పాటు పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు బస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బస్ స్టేషన్ నుంచి ఆలయం వరకు ఉచిత బస్సులను నడపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట మెదక్ రీజినల్ మేనేజర్ విజయ భాస్కర్, రీజినల్ డిప్యూటీ ఆర్ఎం కష్ణమూర్తి, డిప్యూటీ రీజినల్ ఎండీ శ్రీనివాసరావు, మెదక్ డిపో మేనేజర్ సురేఖ, డిపో సిబ్బంది పాల్గొన్నారు. -
విధులపై అవగాహన కలిగి ఉండాలి
అదనపు కలెక్టర్ పాండు సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ పాండు స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్తో శనివారం రెండవ విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ తరగతులకు 1,298 మంది పీఓలు, ఏపీఓలు హాజరైనట్లు ఎన్నికల శిక్షణ తరగతుల నోడల్ అధికారి రామాచారి తెలిపారు. -
తగ్గిన యాసంగి సాగు
యాసంగి నాట్లు వేస్తున్న కూలీలుపుల్కల్ (అందోల్): సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా పంట విరామం (క్రాప్ హాలీడే) ప్రకటించడంతో జిల్లాలో యాసంగి సాగు తగ్గింది. కేవలం బోరు బావులున్న రైతులే వరినాట్లు వేస్తున్నారు. పదేళ్లుగా సింగూరు సాగునీటితో ఏటా రెండు పంటలు పండించిన రైతులు ఈ యాసంగిలో మరమ్మతుల వల్ల నీటి పారుదల శాఖ అధికారులు క్రాప్ హాలీడే ప్రకటించడంతో బోరు బావులు, చెరువు ఆదేరువు, మంజీరానది పరీవాహకంలో ఉన్న రైతులు మాత్రమే వరి సాగు వేస్తున్నారు. దీంతో సగానికి పైగా పంట విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు చెబుతున్నారు. వేసవి కావడంతో నీటి ఆదేరువు, విద్యుత్ సరఫరాలో జరిగే అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు విస్తీర్ణం తగ్గించామని రైతులు తెలిపారు. కొందరు రైతులు ఆరుతడి పంటలు వేసిన ఎక్కువమంది రైతులు వరి పంటకే మొగ్గు చూపారు. బీళ్లుగా మారిన కాలువ ఆయకట్టు సింగూరు మరమ్మతుల దృష్ట్యా క్రాప్ హాలీడే ప్రకటించడంతో ఆయకట్టు అంత బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. గత పదేళ్లుగా 40 వేల ఎకరాల వరకు రెండు పంటలతో కళకళలాడిన నేల నేడు బీళ్లుగా దర్శనమివ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులు రెండేళ్లపాటు సాగుతుండటంతో అంతవరకు మా భూములు బీళ్లుగానే మారుతాయని రైతులు తెలిపారు. -
ఎల్ఐసీలో విదేశీపెట్టుబడులు ప్రమాదకరం
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ఎల్ఐసీలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ప్రమాదకరమైన నిర్ణయమని రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్ పేర్కొన్నారు. ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బెల్ కాలనీలోని ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికార కార్మిక సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో... బెల్ కాలనీలో సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీఐటీయూ కమిటీ సభ్యలు రాజయ్య పాల్గొని దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
జనరలైనా తగ్గేదేలే!
జనరల్ స్థానాల్లో పది మంది మహిళల పోటీ సదాశివపేట(సంగారెడ్డి): మహిళా రిజర్వేషన్కే ఆ వనితలు పరిమితం కాలేదు. అన్ రిజర్వుడ్ జనరల్ అంటే పురుషులకు మాత్రమే కేటాయించినట్లు కాదంటూ తాము కూడా ఎన్నికల బరిలోకి దిగి పోటీకి సై అంటున్నారు. సదాశివపేట మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ఎస్టీ జనరల్ అయినా ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రమీల(బీఆర్ఎస్),ఎరుకల అనూష(స్వతంత్ర), 3వ వార్డు ఎస్సీ జనరల్కు కేటాయించినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుక పోటీ చేస్తున్నారు. ఇక 7వ వార్డు అన్రిజర్వుడుకు కేటాయించినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పాతదొడ్డి అనిత పోటీ పడుతున్నారు. 8వ వార్డు బీసీ జనరల్కే అయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీహెచ్ రేణుక, 9వ వార్డు ఎస్సీ జనరల్కే రిజర్వు అయినా నీలిమా (బీఆర్ఎస్), దాసాయిలక్ష్మి (బీజేపీ)జ్యోతిసుజాత (స్వతంత్ర), 16వ వార్డు బీసీ జనరల్ రిజర్వు అయినా అక్కడ కొత్తగొల్ల లావణ్య (కాంగ్రెస్), దోడ్ల విజయలక్ష్మి(స్వతంత్ర) అభ్యర్థులుగా పురుషులతో పోటీ పడుతుండటం విశేషం. -
కొత్తగా నాలుగు పరిశ్రమలు: మంత్రి దామోదర
● కాంగ్రెస్ను గెలిపించండి ● జోగిపేటలో జోరుగా ఎన్నికల ప్రచారంజోగిపేట(అందోల్): మహిళలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అందోలు మండలం పరిధిలోని సంగుపేట, మాసానిపల్లి ప్రాంతాల్లో నాలుగు కంపెనీలను ఏర్పాటు చేయిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీనిచ్చారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీలలో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ..మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు, మహిళలు స్వయంగా ఉపాధి పొందేందుకు కుట్టు మెషీన్లు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. రజకులకు స్వయం ఉపాధి కోసం డ్రైక్లీనింగ్ సెంటర్ ఏర్పాటుకు రూ.6 లక్షలు ఇస్తానని ప్రకటించారు. నేపాల్ నుంచి వచ్చి ఇక్కడే పనిచేసుకుని జీవిస్తున్న కుటుంబాలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. జోగిపేటలో మైనార్టీల కోసం రూ.3 కోట్లతో బహద్దూర్ఖాన్ ఫంక్షన్ హాలు నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. రాజరాజేశ్వర దేవాలయం మీదుగా బైపాస్రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల వైపు చూడకుండా గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన సేవలను పొందాలని సూచించారు. అందోల్–జోగిపేట మున్సిపాటీ పరిధిలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జి.మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మాజీ కౌన్సిలర్లు ఆకుల చిట్టిబాబు ముదిరాజ్, సురేందర్గౌడ్, సురేశ్, డి.శంకర్లతోపాటు పలువురు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్వినియోగించుకోండి
నారాయణఖేడ్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కోరారు. ఖేడ్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసి గెజిటెడ్ ఆఫీసర్ను సైతం అందుబాటులో ఉంచామన్నారు. శుక్రవారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఓటర్లున్న ప్రతీ ఇంటికీ పోల్ చీటీలు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందులో ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రం వివరాలు రాయడంలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రాజుపటేల్, బీఎల్వోలు పాల్గొన్నారు. ఆవు లాంటోడిని.. కాపాడుకోండి: జగ్గారెడ్డి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తాను రోజూ పాలిచ్చే ఆవు లాంటోడినని..తనను కాపాడుకోవాలని సంగారెడ్డి ప్రజలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి గంజి మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ నియోజకవర్గం ప్రజల పనులు చేస్తున్నానని, ఇక ముందు కూడా చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే సర్టిఫికెట్లు జారీ చేసిన వారికి 80 గజాల చొప్పున అలియాబాద్లో ఇంటి స్థలం కేటాయించేందుకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటితో మాట్లాడానని చెప్పారు. ఒక్కో వార్డుకు రూ.8 కోట్ల చొప్పున సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.300 కోట్లు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని కాంగ్రెస్ అభ్యర్థులందరిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్తోనేఅభివృద్ధి, సంక్షేమం: అజారుద్దీన్ తూప్రాన్: కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మైనార్టీశాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. శనివారం తూప్రాన్లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకుల అధికార దాహాం తీరక కాంగ్రెస్పై బురద జల్లుతున్నారని విమర్శించారు. వారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. కేసీఆర్ సొంత కూతురే బీఆర్ఎస్లో జరిగిన అవినీతిని బయటపెట్టారని, అయినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి హరీశ్రావు సిద్ధిపేట ఎమ్మెల్యే అని, ఆయనకు గజ్వేల్ నియోజకవర్గంలో ఏం పని అని ప్రశ్నించారు. అనంతరం 1వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్ రవీందర్గుప్త, నాయకులు మామిళ్ల కృష్ణ, భాస్కర్రెడ్డి, ఎలక్షన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు మల్లన్న నాల్గొవ వారంకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాల్గొవ ఆదివారం భక్తులు భారీగా తరలిరానున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే సత్తేటి వారాల్లో నాల్గవ ఆదివారం కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం భక్తులు మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఓడి బియ్యం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
కరెంట్ కోతలు ఎక్కడా లేవు
● జిల్లాలో నిరంతరం విద్యుత్ సరఫరా ● విద్యుత్శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుధీర్కుమార్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో కరెంట్ కోతలు లేవని విద్యుత్శాఖ ఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ సుధీర్కుమార్, డివిజనల్ ఇంజనీర్ నెహ్రునాయక్ స్పష్టం చేశారు. పరిశ్రమలకే కాదు, గృహ, ఇతర అన్ని రకాల కనెక్షన్లకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. హెచ్.టి కేటగిరీ కింద వచ్చే పరిశ్రమలకు, గృహ విద్యుత్ కనెక్షన్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. లోడ్ రిలీఫ్లు ఎక్కడా అమలు కావడం లేదని చెప్పారు. కొన్నేళ్లుగా జిల్లాలో లోడ్ రిలీఫ్ అనే ప్రసక్తే రాలేదని తెలిపారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగనుందని, ఈ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వివరించారు. రూ.157 కోట్లతో సమ్మర్యాక్షన్లో పలుచోట్ల 33/11కేవీ సబ్ స్టేషన్ల్లు ఏర్పాటు చేశామని, నాలుగు ప్రత్యామ్నాయ ఫీడర్లను సిద్ధం చేశామని చెప్పారు. -
కేసీఆర్ది ఉద్యమ చరిత్ర.. రేవంత్ది ద్రోహ చరిత్ర
జిన్నారం (పటాన్చెరు)/గజ్వేల్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ది ఉద్యమ చరిత్ర అయితే, ముఖ్యమంత్రి రేవంత్ది ద్రోహ చరిత్రని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎంగా ఉంటూ.. ఆంధ్రప్రదేశ్కు మన నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహి అని విమర్శించారు.చంద్రబాబుతో దోస్తీ కట్టి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఘర్షణసిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పోటీగా నినాదాలు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో హరీశ్రావు ఆర్అండ్ఆర్ కాలనీకి రాకుండానే తూప్రాన్కు వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు ఇక్కడికి చేరుకొని సభను కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా... కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం చెప్పులు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డిలోని గడ్డ పోతారం ఔటర్ రింగ్ రోడ్డుపై ఓవర్ స్పీడ్తో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓఆర్ఆర్పై అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపై కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు, దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. నెహ్రు జూపార్ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. -
రేవంత్ పాలనలో అన్నీ బంద్
పటాన్చెరు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని పథకాలను బంద్ చేసి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆయన పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇస్నాపూర్లోని బీఆర్ఎస్ నాయకుడు గడీల శ్రీకాంత్గౌడ్ ఇంట్లో ఓ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ... బతుకమ్మ చీరలు, క్రిస్టియన్–ముస్లింలకు ఇచ్చే కానుకలు, రైతుబంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ..ఇలా కేసీఆర్ ఇచ్చినవన్నీ ఈ ముఖ్యమంత్రి బంద్ పెట్టి బంద్ల బాబుగా రేవంత్ మారిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇస్నాపూర్లో పవర్ హాలిడేస్ ఉండేవని కేసీఆర్ సీఎం అయ్యాక ఇరవైనాలుగు గంటల కరెంట్ ఇవ్వడంతో ఇక్కడ పరిశ్రమల్లో కార్మికులకు ఓటీలు దొరికి నాలుగు రూపాయలు సంపాదించుకునేవారు. కానీ ఇప్పుడు మళ్లీ కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్తును బాగా చూసుకునే వాళ్లకు ఓటువేయాలని వి జ్ఞప్తి చేశారు. ఇస్నాపూర్ అభివృద్ధి కొనసాగాలన్నా, పేదల సంక్షేమ పథకాలు మళ్లీ రావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో గడీల శ్రీకాంత్గౌడ్, వెన్నవరం ఆదర్శరెడ్డి, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు. రాళ్లకత్వలో హరీశ్రావు ప్రచారంజిన్నారం(పటాన్చెరు): జిన్నారం పట్టణ పరిధిలోని రాళ్లకత్వలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున హరీశ్రావు ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కోరారు. అనంతరం జిన్నారం పట్టణ కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి పాల సాయిరాం, నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, రాష్ట్ర యువత నాయకులు వెంకటేశంగౌడ్, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలప్రచారంలో మాజీ మంత్రి హరీశ్రావు -
ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా
జోగిపేట(అందోల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీకి సంబంధించిన సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రమేశ్, కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.పండరీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఈనెల 17 నుంచి మార్చి 10వ తేది వరకు జరుగుతాయని పేర్కొన్నారు. 17వ తేదీన మూడవ సెమిస్టర్, 24న రెండవ సెమిస్టర్, మార్చి 4న మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యార్థులు మారిన పరీక్షల తేదీలను గమనించాలని కోరారు.గురుకులాల్లో నాణ్యమైన విద్యజహీరాబాద్ టౌన్: తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాల, కళాశాలల్లో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని ఉమ్మడి మెదక్ జిల్లాల విజిలెన్స్ ఆఫీసర్లు గౌస్పాష, జగదీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని శేఖాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశాల కోసం పచ్రార కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గురుకులాల్లో 5 నుంచి ఇంటర్ వరకు తరగతుల నిర్వహణ కొనసాగుతుందన్నారు. నాణ్యమైన విద్యా బోధనతోపాటు పోటీపరీక్షల కోచింగ్, ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో గురుకులాల ప్రిన్సిపాల్ ఎస్.కె.జమీల్, షహనాజ్ బేగం, రుబీనబేగం సర్పంచ్ చస్మోద్దీన్లు పాల్గొన్నారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగుల అరెస్టు
దుబ్బాకటౌన్: రామ్సాగర్ గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తొగుట సీఐ షేక్ లతీఫ్ తెలిపారు. శుక్రవారం రాయపోల్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 3న రాత్రి వేళ రాంసాగర్ గ్రామస్తులైన శ్రీరాం సురేశ్, రాగి రాము కలిసి ప్రధాన కూడలిలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. శుక్రవారం రాయపోల్ ఎస్ఐ కుంచం మానస వారిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో వారిని రిమాండ్కు తరలించామన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): గ్రామీణ ప్రాంతాల ప్రజలు తపాలశాఖ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి డివిజన్ తపాలాశాఖ సూపరింటెండెంట్ శ్రీహరి సూచించారు. పెద్దశంకరంపేట, నిజాంపేట్, రేగోడు మండలాల బీపీఎంతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీపీఎంలు లకా్ష్య్యలను సాధించాలన్నారు. తపాలాశాఖ అందిస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ, ఎస్బీ, ఆర్డీ, ఇన్సూరెన్స్ పథకాలను సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాల గురించి వివరించాలని, నూతన పాలసీలు చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ బాషా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకమాన్: ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. సిద్దిపేట అంబేడ్కర్నగర్, నాసర్పూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా అర్హులైన పిల్లలకు వంద శాతం టీకాలు అందించాలన్నారు. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్యాదవ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): పట్టణ శివారులో జాతీయ రహదారిపై అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం లారీని శుక్రవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు పటాన్చెరువు నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు నిర్వహించగా, రేషన్ బియ్యం అని తేలింది. ఈమేరకు లారీలో ఉన్న 320 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొల్చారం(నర్సాపూర్): పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈసంఘటన మండలంలోని రాంపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. రాంపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఎస్పీ ఆదేశాలతో మెదక్ టాస్క్ఫోర్స్ సీఐ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.18,600 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కొల్చారం పోలీస్స్టేషన్కు తరలించి అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిలో బోలా శేఖర్, కథ శ్రీనివాస్, మస్కరి శ్రీశైలం, గుమ్మడి సురేష్, మ్యాకల యాదగిరి ఉన్నారు. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
నాడు తల్లి.. నేడు తండ్రి మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): సరిగ్గా ఏడాదిన్నర క్రితం తల్లి.. అనారోగ్యంతో శుక్రవారం తండ్రి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలైన ఘటన పంతులు తండాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కరంటోతు రాజు(45) అనే వ్యక్తి భార్య మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై మృతిచెందాడు. ఏడాదిన్నర క్రితం అక్కన్నపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో తల్లి మృతి చెందారు. ఇద్దరూ మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ లావుడియా రాజు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. అనాథలైన పిల్లలు -
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే
జహీరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని జహీరాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్షోలో మాట్లాడుతూ..అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను విశ్వసించడం లేదని ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్, బీజేపీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. అంతకుముందు పట్టణంలోని మజీద్లను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, ట్రెమీస్ చైర్మన్ ఫయూమ్, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.రోడ్షోలో మంత్రి అజహరుద్దీన్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా ఎల్లపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనాయపల్లికి చెందిన గుంటి నవీన్(35) తన బంధువులు చనిపోవడంతో శుక్రవారం అంత్యక్రియలకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో మండలంలోని కాళ్లకల్ శివారులో మైకో పరిశ్రమ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతునికి భార్య ధనలక్ష్మి, పిల్లలు రిషికుమార్, ప్రణవి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
దుబ్బాకటౌన్: పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించినట్లు ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా ఫాతిమా అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పోలీసులతో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ రాజేశ్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
పులి సంచారంపై పుకార్లు
మద్దూరు(హుస్నాబాద్): మండలంలో పులి సంచరిస్తున్నట్లు పుకార్లు వ్యాప్తి చెందడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని సలాఖపూర్ గ్రామ శివారు వ్యవసాయ భూములలో శుక్రవారం ఉదయం పెద్దపులి సంచరిస్తున్నట్టు గ్రామస్తుడు వేణు తెలిపాడు. అలాగే మద్దూరు–ముస్త్యాల గ్రామాల మధ్య పాత నర్సరీ ప్రాంతంలో పులిని చూసినట్టు ఓ మహిళల పోలీసులకు ఫోన్చేసి సమాచారం అందించింది. అలాగే లక్కపల్లిలో పులి సంచరించినట్టు ప్రజలు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో చేర్యాల సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆసిఫ్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాయుడు కలిసి సలాఖపూర్లో పులి పాదముద్రలను పరిశీలించారు. అయితే అవి పులి పాదముద్రలు కావని, హైనా పాదముద్రలుగా రాయుడు చెప్పారు. మండలంలో తిరుగుతున్నది పులి కాదని, ప్రజలు భయందోళనకు గురికావద్దని ఆయన కోరారు. -
తెల్లాపూర్లో ఉద్రిక్తత
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని గద్దర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొందరు తొలగించేందకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం తెల్లాపూర్ గ్రామస్తులు మహారాజ్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఆ విగ్రహం పక్కనే గ్రామస్తులు జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో కొందరు పూలే విగ్రహాన్ని నెట్టే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘటన స్థలానికి చేరుకున్న సైబరాబాద్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని కొల్లూరు పోలీస్స్టేషన్కు తరలించారు. నర్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో గద్దర్ సర్కిల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మైనర్ల డ్రైవింగ్పై నజర్
● డ్రంకెన్ డ్రైవ్, మైనర్డ్రైవింగ్పై ప్రత్యేక తనిఖీలు ● డిసెంబర్ నుంచి 817 మంది పట్టివేత సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. మైనర్లు, డ్రంకెన్ డ్రైవ్పై నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. వారిని కోర్టులో హాజరుపర్చగా జరిమానాలు విధిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 86 మందిని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 817 మందితో పాటు మొత్తం 903 పెట్టి కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.5వేల చొప్పున మొత్తం రూ.45.15లక్షల జరిమాన విధించారు. నంబర్ ప్లేట్ వాయిలేషన్ 1,153, డ్రంకెన్ డ్రైవ్ కేసులు 1,185, త్రిబుల్ డ్రైవింగ్ 453కేసులు నమోదు చేశారు. మొక్కలు నాటేలా శిక్ష వారం రోజుల క్రితం మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 39 మందిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. స్థానిక కోమటి చెరువు పరిసరాల్లో మొక్కలు నాటాలని న్యాయమూర్తి తీర్పునివ్వడంతో ట్రాఫిక్ పోలీసులు వారి చేత ఆ పని చేయించారు. వారి తల్లిదండ్రులకు ఐదు వేల చొప్పున జరిమాన విధించారు. మైనర్ డ్రైవింగ్ చేయకూడదు మైనర్లు డ్రైవింగ్ చేయకూడదు. వారికి వాహనాలు ఇస్తే బాధ్యులైన వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం. మద్యం తాగి వాహనాలు నడిపినా, మైనర్, త్రిబుల్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా చర్యలు తప్పవు. – సుమన్కుమార్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ -
ప్రలోభాలకు లొంగవద్దు
ఎంపీ రఘునందన్రావుబహిరంగసభలో మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్రావు సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ రఘునందన్రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీల మోసపూరిత వాగ్దానాలు మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సదాశివపేట పట్టణం గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందో ప్రజలు నిలదీయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చే వేయి, రెండు వేలకు ఓటర్లు లొంగిపోకుండా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. సిద్దిపేటలో కోట్ల నిధులతో అండర్గ్రౌండ్ డ్రైయినేజీ, కోమటిచెరువు అభివృద్ధి చేసిన హరీశ్రావు సంగారెడ్డి, సదాశివపేటలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు పనిచేస్తున్నారా? పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు పనిచేస్తున్నారా? ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్లపాలనలో తాగుబోతుల తెలంగాణ మార్చారన్నారు. రేషన్ బియ్యంలో రాళ్లున్నాయని అడిగితే చెంపచెళ్లుమనిపించిన జగ్గారెడ్డి అప్పుడప్పుడూ వచ్చి చాయ్, నిమ్మరసం దుకాణంలో రూ.లక్ష పంచితే అభివృద్ధి అయినట్లా అని ప్రశ్నించారు. సదాశివపేటలో పార్కు, స్టేడియం లేదని ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ముస్లింలను బతిమిలాడి ఓట్లు వేయించుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయశ్రీ, కోవూరి సంగమేశ్వర్, చంద్రశేఖర్, మాణిక్రావు, రాజేశ్వరీ 21 వార్డుల బీజేపీ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
బగలాముఖీ శక్తిపీఠం సంకల్పం గొప్పది
బగలాముఖీ అమ్మవారు, భక్తులకు సందేశం ఇస్తున్న విద్యా శంకర భారతీస్వామి శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలోని బగలాముఖీ శక్తిపీఠం సంకల్పం చాలా గొప్పదని పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతీస్వామి పేర్కొన్నారు. శుక్రవారం శక్తిపీఠం తృతీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భగవంతుని నామస్మరణతో ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బగలాముఖీ అమ్మవారికి గణపతిపూజ, పుణ్యహవాచనం, అగ్నిప్రతిష్ట, పల్లకిసేవ, తదితర పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆలయ భూదాత పబ్బ స్వరూప రమేశ్గుప్తా, హైదరాబాదుకు చెందిన వెంకట్రెడ్డి భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు పురుషోత్తమశర్మ, దేవదాత్తశర్మ, వామనశర్మ, మాజీ జడ్పీటీసీ మహేశ్గుప్తా, సర్పంచ్ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు ఉన్నారు. పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతీస్వామి -
కేసీఆర్, కేటీఆర్, హరీశ్పై చర్యలేవీ?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గజ్వేల్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో లూటీ చేసిన రూ. 2లక్షల కోట్ల ధనంలో వాటా పొందడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. శుక్రవారం రాత్రి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును బీఆర్ఎస్ మాదిరిగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం దోచుకుతింటున్నారని మండిపడ్డారు. ఈ–కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు చేతులెత్తేశారని మండిపడ్డారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీకే సాధ్యమని చెప్పారు. -
జెండా పట్టుకో..!
పాంచ్సౌ పుచ్చుకో..● కూలీ చెల్లించి మరీ ప్రచారానికి జనం ● దూరంగా ఉన్న ఓటర్లకు ఫోన్కాల్ ● రాత్రి పెద్ద ఎత్తున విందులు జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 256 వార్డుల్లో 1045 మంది పోటీ చేస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో 1,72,521 మహిళలు, 1,70,102 పురుష ఓటర్లు మొత్తం 3,42,659 ఓటర్లు ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం చేస్తున్నారు. ప్రచార సమయంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక వార్డు మహిళలతో పాటు మిగతా వార్డుల్లోని మహిళలను రప్పించి రోజుకు రూ.500 కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తిప్పుతున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థుల వెంట ఉంటూ ప్రచారం చేస్తున్నారు. పోటీలో మహిళలు ఉంటే మన అక్కకే ఓటేయాలి, అక్క గెలుపుతోనే వార్డు అభివృద్ధి అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రచారానికి వచ్చే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు పోస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్లకు గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు చికెన్, మటన్, బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని హోటళ్ల నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థుల పాట్లు ప్రచారంలో అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చాయ్ అమ్మడం, కూరగాయలు అమ్మడం లాంటి వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఉదయం, రాత్రి ఫోన్ చేసి రానుపోను ఖర్చులు చెల్లిస్తానని.. ఈనెల 11న వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని చాలా మందికి పుష్కలంగా ఉపాధి లభిస్తుంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం పలువురు అభ్యర్థుల వెంట ప్రచారానికి వెళ్తున్నారు. వారికి రోజుకు రూ.500 కూలీ చెల్లిస్తున్నారు. అభ్యర్థి పార్టీ జెండా పట్టుకొని పోటీలో మహిళలు ఉంటే అక్కకే ఓటేయాలని, ఆమె గెలుపుతోనే వార్డు అభివృద్ధి అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. –సదాశివపేట(సంగారెడ్డి)ప్రచారంలో జోరు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో అభ్యర్థులు ర్యాలీలు, నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి అధిక సంఖ్యలో ప్రజలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వచ్చే వారికి ప్రతి రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం చికెన్, మటన్, ఎగ్స్తో భోజనంతోపాటు రూ .500 ఇస్తున్నారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున విందులు ఇస్తున్నారు. తమతోపాటు ప్రచారానికి వస్తున్న పురుషులకు మందు అలవాటు ఉన్నవారికి మందు ఇస్తున్నారు. -
బీజేపీతోనే అభివృద్ధి
ఎంపీ రఘునందన్రావు సంగారెడ్డి: సంగారెడ్డి అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం బీజేపీ గెలవాలని ఆ పార్టీ అభ్యర్థే చైర్మన్ కావాలని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మూడు చోట్ల కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి చైర్మన్ పదవి కట్టబెట్టాలని కోరారు. సంగారెడ్డి వెనుకబాటుకు జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్ కారణమన్నారు. పక్క వ్యక్తి జేబులో నుంచి డబ్బులు తీసుకుని తానే సాయం చేసినట్లుగా జగ్గారెడ్డి మీడియాలో రాయించుకుంటారని ఎద్దేవా చేశారు. దసరా పండుగ వస్తే సంగారెడ్డికి రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి వచ్చినట్లుగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ రాదన్నారు. కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేస్తే హరీశ్రావు తన మామ మెప్పు కోసం గజ్వేల్ తీసుకువెళ్లారని తెలిపారు.సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతకానితనంతో సంగారెడ్డి ప్రజలు నష్టపోతున్నారన్నారని విమర్శించారు. మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలందరూ ఆచితూచి మంచి మనసుతో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.5 వేల కోట్లు కేటాయించాలి
సంగారెడ్డి టౌన్: తెలంగాణలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో శుక్రవారం నిర్వహించిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేశ్గౌడ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 17న ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న నిరాహారదీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రసాద్గౌడ్ జిల్లా నాయకులు, ప్రతాప్గౌడ్, శ్రీనివాస్గౌడ్, యాదగౌడ్, రవి, హరీశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ -
ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి
తీవ్ర గాయాలు పటాన్చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. శుక్రవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఆర్.కే నగర్ కాలనీకి చెందిన ఐదేళ్ల బాలుడు శివ స్థానికంగా ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా ఐదు కుక్కలు అతడిని చుట్టుముట్టి దాడి చేశాయి. స్థానికులు వెంటనే కుక్కలను తరిమివేయడంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇంద్రేశంలో వీధి కుక్కల సంఖ్య అధికంగా పెరిగిపోయిందని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రాహ్మణపల్లిలో ఐదుగురికి గాయాలు వట్పల్లి(అందోల్): అందోల్ మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం పిచ్చికుక్క వీరవిహారం చేసి ఐదుగురిని గాయపరిచింది. శుక్రవారం సాయంత్రం వేళ ఇళ్ల ముందు కూర్చున్న పెద్దగొల్ల విఠల్, పెద్దగొల్ల మల్లేశం, సామల రాములు, సామల రవి, మొగులయ్యలను పిచ్చికుక్క కరిచింది. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పిచ్చికుక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. గాయపడిన వారందరూ వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
న్యాల్కల్ రూపురేఖలు మారిపోతాయి
న్యాల్కల్(జహీరాబాద్): నిమ్జ్లో భాగంగా పరిశ్రమల ఏర్పాటు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వచ్చే పదేళ్లలోపు న్యాల్కల్ రూపురేఖలు మారిపోతాయని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో రూ.16లక్షల సీఎస్ఆర్ నిధులతో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటైతే ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పీహెచ్సీని ముప్పై పడకల ఆస్పత్రిగా మార్చాలని, పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని, 108 వాహనం కూడా మంజూరు చేయాలని స్థానిక నాయకులు సిద్దిలింగయ్యస్వామి, ప్రవీణ్కుమార్ ఎంపీని కోరారు. అందుకు స్పందించిన ఆయన ముప్పై పడకల ఆస్పత్రి ప్రతిపాదనలో ఉందని, పోలీస్ స్టేషన్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. 108 వాహనాన్ని ఇంతకుపూర్వమే న్యాల్కల్కు మంజూరు చేయించానని అదెక్కడున్నా వెంటనే దానిని ఇక్కడకు పంపించాలని డీఎంహెచ్ఓకు సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించిన సీఐఈ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వసంతరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు మనోహార్రెడ్డి, శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సీఐఈ ప్రతినిధులు అమోల్ సెవ్లే, ప్రశాంత్ శర్మ, వైద్యుడు అమృత్రాజ్, సిబ్బంది పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ఎంపీ సురేశ్ షెట్కార్ -
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి
అదనపు కలెక్టర్ పాండు జిన్నారం (పటాన్చెరు): ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. జిన్నారం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు సంబంధిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. ఘనంగా సమ్మక్క, సారలమ్మల కల్యాణంవట్పల్లి(అందోల్): మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో శుక్రవారం సమ్మక్క సారలమ్మల కల్యాణం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా మొదటగా పంగా చెంద్రరెడ్డి ఇంటి నుంచి పడిగిద్ద రాజును, పెద్దపుల్ల నారాయణగౌడ్ ఇంటి నుంచి గోవిందరాజును డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా గద్దెల మీదకు తీసుకువచ్చారు. అనంతరం మేడారం నుంచి వచ్చిన ఒగ్గు కళాకారుల ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మలకు పడిగిద్దరాజు, గోవిందరాజులతో కల్యాణాన్ని జరిపించారు. ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని బంగారం(బెల్లం) తూకం వేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.పాతపంటలు.. భూసారానికి మేలుగ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ అంజయ్య రాయికోడ్ (అందోల్): పాత పంటల సాగు..భూసారానికి మేలని గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ జి.అంజయ్య పేర్కొన్నారు. మండలంలోని నాగ్వార్ గ్రామంలో డీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం 26వ పాత పంటల జాతర నిర్వహించగా..వివిధ ధాన్యాలతో కూడిన ఎడ్ల బండ్ల ఊరేగింపు ఆయన ప్రారంభించారు. డప్పు చప్పుళ్లు, పాత పంటల ప్రాముఖ్యతను వివరిస్తూ గ్రామంలోని వివిధ వాడల్లో ఎడ్ల బండ్ల ఊరేగింపు కొనసాగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అంజయ్య మాట్లాడుతూ..రసాయనాలు లేకుండా సహజ ఎరువులతో సాగు చేసే పాత పంటలు మానవ ఆరోగ్యభద్రతకు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. రైతులు రసాయనాల వినియోగం తగ్గించి,పప్పు ధాన్యాలు, సంప్రదాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ట్రెల్లిస్ విధానంతో అధిక దిగుబడి: శాస్త్రవేత్త నిర్మలహత్నూర(సంగారెడ్డి): ట్రెల్లిస్ విధానం వల్ల టమాటా పంటలో అధిక దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాస్త్రవేత్త డా.ఏ.నిర్మల పేర్కొన్నారు. హత్నూర మండలం బడంపేట గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగారెడ్డి శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో టమాటా పంటపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన శుక్రవారం కల్పించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ...ట్రెల్లిస్ విధానంలో టమాటాను సాగు చేయడం వల్ల మొక్కకు మంచిగాలి, సూర్యరశ్మి తగిలి తెగుళ్లు సోకవన్నారు. పండ్లు నేలకు తగలకుండా శుభ్రంగా, నాణ్యతగా, ఎక్కువ బరువుతో పెరుగుతాయని చెప్పారు. ఈ విధానం వల్ల రైతు బుచ్చిరెడ్డి తనకు లాభం వచ్చిందని తెలిపారు. -
కాంగ్రెస్కు ఓటమి భయం
నర్సాపూర్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ పార్టీ నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్సాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం పన్నులు పెంచి అభివృద్ధిని మరిచిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కోతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు దశాబ్దాలు గడుస్తున్నా, పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుతి లేని సంసారం వంటిదని ఎద్దేవా చేశారు. నర్సాపూర్ పచ్చని అడవిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకుండా నిలువరించింది గుర్తు చేశారు. కేంద్ర నిధుల ద్వారా జరిగిన అభివృద్ధిని గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్యాదవ్, జిల్లా ఇన్చార్జి నరసింహారెడ్డి, మున్సిపల్ ఎన్నికల ప్రభారి పాపయ్య గౌడ్ పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు


