Sangareddy
-
చస్తే కానీ.. ధాన్యం అన్లోడింగ్ చేయరా!
కొల్చారం(నర్సాపూర్): ధాన్యాన్ని అన్లోడింగ్ చేయాలని రైతులు పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సంగాయిపేట గ్రామానికి చెందిన 8 మంది రైతులకు సంబంధించి 665 బస్తాల ధాన్యాన్ని మే 26న తూకం వేసి, కౌడిపల్లికి చెందిన శ్రీనివాస పారా బాయిల్డ్ రైస్మిల్ పేరుతో మండలంలోని వరిగుంతం శివారులోని గోదాంకు తరలించారు. ధాన్యం రంగు మారిందని సదరు రైస్ మిల్ యజమాని అన్లోడింగ్ చేసేందుకు నిరాకరించాడు. అక్కడి నుంచి రైతులు ధాన్యాన్ని నర్సాపూర్లోని మరో రైస్ మిల్లుకు తీసుకెళ్లారు. అక్కడ సైతం ధాన్యం అన్లోడింగ్ చేసుకోలేదు. తూకం వేసి అప్పటికే 15 రోజులు అవుతున్న అన్లోడింగ్ కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ శ్రీనివాస్ చారి దృష్టికి తీసుకెళ్లి తమ గోడును విన్నవించినా అన్లోడింగ్ కానీ పరిస్థితి. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పెట్రోల్ బాటిళ్లను చేతబట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామానికి చెందిన ఎఫ్ఈఓ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తహసీల్దార్కు, అటు రైతులకు నచ్చజెప్పారు. బుధవారం సాయంత్రంలోపు అన్లోడింగ్ చేయిస్తానని తహసీల్దార్ రైతులకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓ రైతు ఆవేదన.. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి. ధాన్యం తూకం పెట్టి రైస్ మిల్లుకు తరలించి 15 రోజులవుతుంది. ధాన్యం రంగు మారిందంటూ ఒక రైస్ మిల్ నుంచి మరో రైస్ మిల్లుకు తిప్పుతూ అన్లోడింగ్ చేయడం లేదు. డబ్బులు సకాలంలో రాకుంటే బిడ్డ పెళ్లి ఎలా చేసేది అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ, నెత్తి నోరు మొత్తుకున్న పట్టించుకోవడం లేదని వాపోయాడు. ధాన్యం కాంటా వేయడం లేదని.. కొల్చారం(నర్సాపూర్): రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడం లేదని రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. పైతర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగంపేట సహకార సంఘం ఏర్పాటు చేసింది. ధాన్యం సకాలంలో కాంటాలు వేయకపోవడం, తూకం వేసిన బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదు. గ్రామానికి చెందిన రైతు ఎర్ర మోష నెల క్రితం ధాన్యం తీసుకొచ్చాడు. అప్పటి నుంచి తూకం వేయలేదు. మధ్యాహ్నం సహకార సంఘం ఆవరణలో మోష ధాన్యాన్ని తూకం వేస్తారా ? లేదా? అని సంఘం సిబ్బందిని నిలదీశాడు. అనంతరం పెట్రోల్ పోసుకున్నాడు. కార్యాలయంలో రైతులతో మాట్లాడుతున్న సంఘం చైర్మన్ రమేశ్ కుమార్ వెంటనే బయటకు వచ్చి మోషను వారించాడు. దీంతో అక్కడే ఉన్న పలువురు ఒంటిపై ఉన్న పెట్రోల్ను కడిగారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. -
రాజీపడే కేసులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి
జహీరాబాద్ టౌన్: రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి.కవితా దేవి సూచించారు. ఈ నెల 20న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని పోలీసు అధికారులు, న్యాయవాదులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. రాజీ పడదగిన కేసులను ముందుగా గుర్తించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని, లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. చిన్న చిన్న కేసులతో కక్ష పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులను వృథా చేసుకోవద్దని కక్షిదారులకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి ఎండీ అబ్దుల్ ఖలీల్, డీఎస్పీ సైదానాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ.హన్మంత్, ఎస్ఐలు లవకుమార్, కాశీనాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఏజీపీ దత్తాత్రేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ రిమాండ్
పటాన్చెరు టౌన్: చైన్ స్నాచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, క్రైమ్ సీఐ రాజు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 1న రుద్రారం అభయాంజనేయ స్వామి దేవాలయంలో పనిచేస్తున్న అంజమ్మ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రుద్రారంలో గొలుసు దొంగతనం తానే చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. చందానగర్లో వాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ దుకాణంలో బంగారం కరిగించి రూ.1.03 లక్షలకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు 8.07 గ్రాముల బంగారం, దొంగతనానికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నారు. కాగా నిందితుడి స్వస్థలం రాయి కోడ్ మండలంలోని హుస్నాబాద్ గ్రామం కాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి వెంకట్రావునగర్లో ఉంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
డీఎస్పీ సైదానాయక్జహీరాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడాలని డీఎస్పీ సైదానాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీషారెడ్డి అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఎస్వీ ఫంక్షన్హాలులో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కోల్ ఇండియా కంపెనీ ఆర్థిక సహాయంతో జహీరాబాద్, న్యాల్కల్ మండలాలకు చెందిన 120 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా సహాయంతో అందజేసిన కుట్టుమిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటి వద్దే ఉండి బట్టలు కుట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. గత ఏడాది నిర్వహించిన మొదటి విడతలో 800 మందికి ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారని తెలిపారు. ఈ ఏడాది 700 మందికి ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శుక్లవర్ధన్రెడ్డి, కో–ఆర్డినేటర్ సురేందర్రెడ్డి, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రాంచంద్రారెడ్డి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి పాల్గొన్నారు. -
పాముకాటుతో వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): పాము కాటుతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎలకుర్తి మల్లేశం(39) తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సోమవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి కుడి చేయి ఉంగరం వేలుకు పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మల్లేశంను మొదట జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా మారడంతో సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మితో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. అన్నదాన సత్రం అద్ధం మీదపడి యాచకురాలు.. చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు అద్దం మీదపడి తీవ్ర గాయాలై యాచకురాలు మృతి చెందింది. ఈ సంఘటన కర్నాల్పల్లి సాయిబాబా ఆలయ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటకు చెందిన కళవ్వ(70) భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. ఈ క్రమంలో కర్నాల్పల్లి సాయిబాబా ఆలయ సమీపంలోని అన్నదాన సత్రం అద్దం పగిలి పైఅంతస్తు నుంచి సేద తీరుతున్న కళవ్వపై పడింది. దీంతో ఆమె మెడ, చేతి భాగం తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించండి
సంగారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.25 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈ నెల 18న తలపెట్టిన ‘ఛలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని శివ ఫంక్షన్హాల్లో మంగళవారం ‘ఛలో హైదరాబాద్’కు సంబంధించిన నిర్వహించిన సమావేశానికి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ‘ఛలో హైదరాబాద్’కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ...మూడేళ్లుగా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లు లు చెల్లించకపోవడంతో అనేకమంది అప్పుల పాలై వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారన్నారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు పాల్పడుతుండగా మరికొందరు ఒత్తిడి కారణంగా గుండెనొప్పితో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులకు టెండర్లు వేయాలంటేనే కాంట్రాక్టర్లు జంకుతున్నారని వ్యాఖ్యానించారు. బిల్లులు సకాలంలో అందక కాంట్రాకర్ల వద్ద డబ్బులు లేక అనేక పను లు అర్థాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. ఓ వైపు కార్పొరేట్ కాంట్రాక్ట్ కంపెనీలు రాకతో చిన్న కాంట్రాక్టర్లు రోడ్డున పడుతుంటే పెండింగ్ బిల్లులు రాక అప్పుల భారంతో మరింత కుదేలవుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ముఖ్య సలహాదారులు పి.భాస్కర్ రెడ్డి, సుధాకర్, సత్యమయ్య, రాములుగౌడ్, చీల మల్లన్న, విష్ణువర్ధన్రెడ్డి, జిన్న శ్రీధర్రెడ్డి, మనోజ్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి సమస్యలపై ఈనెల 18నచలో హైదరాబాద్ సంగారెడ్డి సమావేశానికి హాజరైనమూడు జిల్లాల కాంట్రాక్టర్లు -
విజ్ఞానజ్యోతి డైరెక్టర్కు సైన్స్ డిగ్రీ ప్రదానం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ, వ్యవసాయ కళాశాల డైరెక్టర్ ఎం.దేవేందర్రెడ్డికి వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఫౌండర్, ఛాన్స్లర్ వరదారెడ్డి డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మంగళవారం ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. 40 ఏళ్లుగా ఆయన వ్యవసాయ శాస్త్రం, జలవనరుల నిర్వాహణ, సుస్థిర వ్యవసాయం, అభివృద్ధి, రైతు సంక్షేమం, నవీన ఆవిష్కరణల్లో ఆయన చేస్తున్న సేవలకు సెన్స్ డిగ్రీని అందజేశారు. కార్యక్రమంలో ఢిల్లీ ఐఐటీ వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ వి.రాంగోపాలరావు, జాతీయ సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ అవార్డు గ్రహిత దీపికరెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ దీపక్ పాల్గొన్నారు. -
వ్యాపారాలకు విస్తరణ దెబ్బ
ఖేడ్లో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లకు నంబర్లు నారాయణఖేడ్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న రీతిలో ఖేడ్లో రహదారి విస్తరణ పనులు కాస్తా స్థానిక వ్యాపారులకు, రోడ్డు పక్కనివాసితులకు కష్టాల్ని తీసుకొచ్చాయి. ఖేడ్లో రహదారి విస్తరణకుగాను కేంద్రం నుంచి రూ.46కోట్ల పైచిలుకు నిధులు విడుదల జరగగా టెండర్ల దశలో ఉంది. రహదారి విస్తరణ పేరుతో రోడ్డుకిరువైపులా ఉండే వ్యాపార దుకాణాలు, నివాసాలను పాక్షికంగా కూల్చివేతలు జరుగుతాయనే ప్రచారం స్థానికుల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రచారానికి తగ్గట్లుగానే జాతీయ రోడ్లు ప్రాధికారిక సంస్థకు చెందిన సిబ్బంది ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్లకు 50 అడుగుల చొప్పున మార్కింగ్తోపాటు సీరియల్ నంబర్లను వేశారు. దీంతో గతానికి భిన్నంగా రహదారులను విస్తరించి కూల్చివేతలు జరుగుతాయన్న ప్రచారంతో ఖేడ్ పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 30 అడుగులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పట్టణ వాసులతో సమావేశమై మెజార్టీ ప్రజలకు నష్టం వాటిల్లకుండా రోడ్డుకు ఇరువైపులా ప్రజల కోరిక మేరకు 30 ఫీట్ల వరకు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించారు. మెజార్టీ నష్టం జరిగే వారికి ప్రత్యామ్నాయంగా పాట్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు నివాసాల వారు అంగీకరించారు. అదే సమయంలో రాజీవ్చౌక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు డివైడర్లను నిర్మించారు. అనంతరం ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేదు. కొత్తగా 50 ఫీట్ల ప్రచారం కాగా, ప్రస్తుతం 50 ఫీట్ల మేర విస్తరిస్తామని ప్రచారం జరగడం, మార్కింగ్ వేయడంతో వ్యాపారులు, నివాసితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిజాంపేట్–నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు 161బీ జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. పట్టణం నుంచి రహదారి నిర్మిస్తే భారీ నష్టం వాటిల్లుతుందని భావించి పట్టణ సమీపం నుంచి నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు ఖేడ్ పట్టణానికి రెండు బైపాస్ రోడ్లున్నాయి. నూతనంగా రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. ఇన్ని రహదారులు ఉండగా పాత రహదారి విస్తరణ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలు చేపడితే వందల భవనాలకు నష్టం వాటిల్లుతుంది. వ్యాపార, నివాసాల వారికి కోట్లలో నష్టం జరిగి, చాలామంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. 30 ఫీట్లలోపే విస్తరించాలి కాగా, పట్టణ వ్యాపారులు, నివాసాల వారు ఇటీవల సమావేశం నిర్వహించి 30 ఫీట్ల వరకే విస్తరించి వ్యాపార, నివాస సముదాయాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్ణయించారు. అంతకుమించి కూల్చివేతలు చేపడితే భారీగా నష్టం వాటిల్లడంతోపాటు మార్కెట్ కోలుకోలేని దెబ్బతింటుందని పేర్కొన్నారు. 161బీ జాతీయ రహదారి, రెండు బైపాస్, రింగ్ రోడ్డుల నిర్మాణం జరగడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ భారీగా తగ్గిపోగలదని పేర్కొంటున్నారు. 50 ఫీట్ల విస్తరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డివైడర్ల వల్ల ఇప్పటికే వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. గతానికి భిన్నంగా మార్కింగ్లు వ్యాపారులు, నివాసితుల ఆందోళన గతంలో 30 ఫీట్లు.. ప్రస్తుతం 50 ఫీట్లు అంటూ హడావుడి -
‘మాస్టర్ యువర్ మైండ్’ పుస్తకావిష్కరణ
పెద్దశంకరంపేట(మెదక్): మండల ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత బృంగి ప్రసన్నకుమార్ రచించిన మాస్టర్ యువర్ మైండ్ పుస్తకాన్ని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించి అనంతరం ఆమె మాట్లాడారు. మనిషి ప్రవర్తనలో ప్రత్యేకతలను సరిగ్గా విశ్లేషి ంచడం కష్టమైన పని అన్నారు. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థులు, జీవన, వైవాహిక స్థిరత్వా న్ని ఎదుర్కొనే యువతకు, కుటుంబం గురించి ఆలోచించి ఆందోళన పడే పెద్దలకు ఈ పుస్తకం మార్గదర్శిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రచయిత ప్రసన్నకుమార్ను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, రాజు, ఎస్ఓ నవీన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ స్వాధీనం చేర్యాల(సిద్దిపేట): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ జి.అపూర్వరెడ్డి వివరాల ప్రకారం.. పట్టణ శివారు అకునూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా మట్టిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న టిప్పర్ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. వృద్ధుడు అదృశ్యం చిన్నశంకరంపేట(మెదక్): వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నార్సింగి మండలంలోని చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ సృజన కథనం ప్రకారం... సంకాపూర్ దర్గాతండాకు చెందిన పాల్త్యా లింబ్యా(60) పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. వృద్ధుడి భార్య కమల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు కొల్చారం(నర్సాపూర్): పేకాట ఆడుతున్న వారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ వివరాల ప్రకారం... మండలంలోని ఎనగండ్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పట్టుపడ్డారు. వారి వద్ద నుంచి రూ.15,100 నగదు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం కంది(సంగారెడ్డి): గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. ఈ సంఘటన మండల కేంద్రం కంది శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. కంది సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కింద వ్యక్తి శవం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే మృతుని వివరాలు తెలియలేదని, శవం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో రెండు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొత్త కల్వర్టు నిర్మాణం
జహీరాబాద్ టౌన్: ‘ప్రమాదకరంగా కల్వర్టు’శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జహీరాబాద్ పట్టణంలోని తహసీల్దార్ రోడ్డులో దెబ్బతిన్న కల్వర్టుకు స్థానంలో కొత్త నిర్మాణానికి పనులు ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మధ్యలో మురికి కాలువపై వేసిన కల్వర్టు స్లాబ్ ధ్వంసమై గుంతలు పడటంతో ప్రమాదకరంగా తయారైంది. ఇనుప కడ్డీలు పైకి తేలి వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్న కల్వర్టు స్థానంలో కొత్తది నిర్మిస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించాలివ్య.కా.సం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ జహీరాబాద్ టౌన్: వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల విలువలను నిర్ణయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ ప్రభుత్వాన్ని కోరారు. నిమ్జ్ పరిధిలోని రైతులతో మంగళవారం పట్టణంలోని శ్రామిక్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిమ్జ్ ప్రాజెక్టు పరిధిలోని భూములు ప్రస్తుతం ఎకరానికి రూ.60 నుంచి రూ.80 లక్షల వరకు మార్కెట్ ధర పలుకుతుందన్నారు. ప్రభుత్వం భూమి విలువ కేవలం రూ.4.50 లక్షలు నిర్ణయించడం వల్ల భూ బాధితులు నష్టపోతారన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను తీసుకున్న తర్వాతే భూముల విలువలను సవరించాలని కోరారు. బుల్లెట్ రైల్ జహీరాబాద్ మీదుగా మళ్లించాలిమాజీ ఎంపీ బీబీ పాటిల్కు కౌన్సిలర్ వినతి జహీరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబైకు మంజూరైన బుల్లెట్ రైల్ను జహీరాబాద్ మీదుగా మళ్లించాలని కోరుతూ జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్కు కౌన్సిలర్ వినతిపత్రం అందజేశారు. 27వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నామ స్రవంతి మంగళవారం బీబీ పాటిల్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, నిమ్జ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో బీబీ పాటిల్ ఎంపీగా ఉన్న సమయంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జహీరాబాద్స్టేషన్ను చేర్చారని అయితే తాజా డీపీఆర్లో ఆ మార్గాన్ని వికారాబాద్ మీదుగా మళ్లించారని అది సరికాదని వివరించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ స్పందిస్తూ కేంద్ర రైల్వేమంత్రిని, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి డీపీఆర్లో తగిన మార్పులు చేయించి జహీరాబాద్ మీదుగా వెళ్లేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలిబీజేపీ నేత ప్రభుకుమార్గౌడ్ సంగారెడ్డి: నాలుగేళ్ల క్రితం చౌటకూర్ గ్రామ పరిధిలోని ఎంపీ డిస్టలరీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన దమ్మి కిష్టయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు పల్లె ప్రభుకుమార్గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతీక్జైన్కు వినతిపత్రం సమర్పించారు. ప్రమాదంలో మృతి చెందిన దమ్మి కిష్టయ్య కుటుంబానికి ఆ సమయంలో కంపెనీ యాజమాన్యం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల సమక్షంలో ఆయన కుమారుడు దమ్మి హేమంత్కు శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చిందని తెలిపారు. అయితే నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయం
● 15న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం ● త్వరగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి ● రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్మర్కూక్(గజ్వేల్): సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ సముదాయాలను నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్స్ సేకరించాలన్నారు. ఈ నెల 15న స్కూల్ను ప్రారంభించి నూతన అధ్యయనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, క్రీడామైదానాలు, ఇండోర్ స్పోర్ట్స్ సదుపాయాలు, ప్రీ ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు సమగ్ర విద్యావ్యవస్థ, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఇద్దరు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయు లు, ఎడుగురు ఎస్జీటీలు, ఎడుగురు స్కూల్ అసిస్టెంట్లు, ఒక పీఈటీ, ఒక పీడీని నియమించాలని జిల్లా విద్యాధికారి శాసీ్త్రకి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు రవాణా సదుపాయాలతో పాటు ఈ నెల 15 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ షఫీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, విద్యాశాఖ జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి, తహసీల్దార్ సరిత, మండల విద్యాధికారులు ఉదయ్ భాస్కర్ రెడ్డి, సైదులు, డీఈ నాగరాజు, ఏఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు -
దండిగా దరఖాస్తులు
బెస్ట్ అవైలబుల్ పథకంపై పేద విద్యార్థుల ఆసక్తి● మొత్తం ఖాళీలు 120 ● వచ్చిన దరఖాస్తులు 176 ● జిల్లాలో 5 పాఠశాలలు మెదక్ కలెక్టరేట్: నిరుపేద విద్యార్థుల నుంచి బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఈ పథకం కింద కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే జిల్లాలో ప్రస్తుతం 474 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి యేడాది ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులు 10వ తరగతి వరకు ఉచితంగా చదువుకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో 5 పాఠశాలలు జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకంలో 5 పాఠశాలలు ఉన్నాయి. మెదక్లో సిద్ధార్థ్ విద్యాసంస్థలు, గీతా హైస్కూల్, రామాయంపేటలో మంజీరా విద్యాసంస్థలు, వివేకానంద ఆవాస విద్యాలయం, తూప్రాన్న్లో గీతా స్కూల్ ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో పథకం కింద 474 మంది విద్యార్థులు చదువుతున్నారు. రూ.1.05 కోట్లు చెల్లింపు బెస్ట్ అవైలబుల్ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రతి ఏడాది ట్యూషన్ ఫీజు చెల్లిస్తుంది. జిల్లాలో మూడేళ్లుగా ట్యూషన్ ఫీజు మొత్తం రూ.1.70 కోట్లు పెండింగ్లో ఉంది. దీంతో గత ఏడాది విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన అప్పటి కలెక్టర్ రాహుల్రాజ్, డీఈఓ, షెడ్యూల్డ్ కులాల అధికారి విద్యాసంస్థలతో మాట్లాడి సర్ది చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది రూ.1.05 కోట్లు మంజూరు చేయడంతో వారికి అందజేశారు. ఇంకా 40 శాతం అంటే రూ.65లక్షలు చెల్లించాల్సి ఉంది. దరఖాస్తుల వెల్లువ జిల్లాలో ఖాళీగా ఉన్న 120 సీట్ల భర్తీకి ప్రభుత్వం మే 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 8 వరకు 176 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1వ తరగతిలో 59 సీట్లు ఖాళీగా ఉండగా 83 దరఖాస్తులు, 5వ తరగతిలో 61 సీట్లు ఖాళీగా ఉండగా 93 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారులు, తల్లిదండ్రుల సమక్షంలో కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎస్సీ వర్గీకరణ నూతన రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.విద్యాసంస్థలతో చర్చించాం ఈ ఏడాది బెస్ట్ అవైలబుల్ కింద విద్యార్థులను చేర్పించేందుకు ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించాం. పెండింగ్ బిల్లుల గురించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని, బిల్లులు రాగానే చెల్లిస్తామని యజమాన్యాలకు కలెక్టర్ సూచించారు. వారు కూడా ఇందుకు సమ్మతించారు. విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయి పరిశీలన జరుగుతుంది. త్వరలోనే కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక చేస్తారు. – సింధూ, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి, మెదక్. -
ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండి
సంగారెడ్డి /పటాన్చెరు టౌన్ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోఎస్ మంత్రి వివేక్కు విజ్ఞప్తి చేసింది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్ను టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావీద్అలీ, కార్యదర్శి వేల్పూరు రవి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సేవా సంబంధిత అంశాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో నాయకులు సమర్పించిన వినతులను మంత్రి విని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీనిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇస్నాపూర్కు ప్రత్యేక నిధులివ్వండి ఇస్నాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మంత్రి వివేక్ను కోరారు. సంగారెడ్డిలో జరిగిన సమీక్షకు హాజరైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ను ఇస్నాపూర్ చౌరస్తాలో కలిసి ఘనస్వాగతం పలికి నిధులు, పలు సమస్యలపై ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సమర్పించారు. నేషనల్ హైవే నుంచి లక్డారం– బ్యాతోల్ – రుద్రారం – ఏర్థనూర్ వరకు రోడ్డు, ఇరు వైపులా ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.మంత్రిని కలిసిన టీఎన్జీఓ నేతలు -
ధర్నాలు చేస్తేనే జొన్నలు కొంటారా..?
తడ్కల్ కేంద్రం వద్ద రైతుల రాస్తారోకో కంగ్టి(నారాయణఖేడ్): రైతులు ధర్నాలు చేస్తేనే జొన్నలు కొనుగోలు చేస్తారా అంటూ రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఎదుట కంగ్టి, తడ్కల్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాదాపు గంట సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి జొన్నలు తడిసి మొలకెత్తుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎస్సై దుర్గారెడ్డి సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించడంతో శాంతించారు. అనంతరం మధ్యాహ్నం నాలుగు లారీలు పంపి జొన్నలు తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణాలు సీజ్
హుస్నాబాద్రూరల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని ఏఓ పూజ, ఎస్సై లక్ష్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘రైతులపై సీడ్ పంజా’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. హుస్నాబాద్ పట్టణంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఎరువులు, విత్తనాలనే రైతులకు విక్రయించాలని, లాభాల కోసం అనుమతి లేని కొత్త రకం క్రిమిసంహారక మందులు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆమోదిత వరి సన్న రకాలను విక్రయించాలని సూచించారు. దిగుబడులు వస్తాయని రైతులకు ఆశ చూపి సీడ్ కంపెనీల ఏజెట్ల దగ్గర విత్తనాలు తీసుకొని అమ్మితే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అమ్మిన ప్రతి వస్తువుకూ రైతులకు రసీదు ఇవ్వాలన్నారు. ఎరువులు, విత్తనాల వివరాలను దుకాణం ఎదుట స్టాక్ బోర్డులో పెట్టాలని ఆదేశించారు. -
ఏఈడీపీ కోర్సులతో అవకాశాలు పుష్కలం
వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డిసిద్దిపేటఎడ్యుకేషన్: ఉపాధి శిక్షణతో కూడిన డిగ్రీ కోర్సులు(ఏఈడీపీ)తో విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏఈడీపీ నూతన కోర్సులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలను జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అయోధ్యరెడ్డి మాట్లాడుతూ... ఏఈడీపీలో భాగంగా బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ కోర్సును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ కోర్సుతో విద్యార్థులు సాధారణ డిగ్రీతో పాటు చేపల పెంపకం, ఆక్వా కల్చర్ నిర్వహణ, చెరువుల అభివృద్ధి, చేపల ఉత్పత్తి సాంకేతికతలు వంటి అంశాల్లో ప్రయోగాత్మక శిక్షణ పొందుతారన్నారు. ఇంటర్మీడియెట్లో బైపీసీ, లేదా ఎంఎల్టీ ఒకేషన్ కోర్సును బ్రిడ్జి కోర్సుతో పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశ్వనాథం, మధుసూదన్రెడ్డి, అధ్యాపకుడు వైకుంఠం, జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, కనకచంద్రం, వేంకటరమణ, రఘురాజ్, గంగాధర్, నరేందర్రెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు. -
నిలదీతలు..!
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026వాగ్వాదాలు..సమగ్రాభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి : మంత్రులు జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా వెలుగొందుతున్న జిల్లాలను అభివృద్ధి మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. రైతులు పంటల మార్పిడి, ఆయిల్పామ్ సాగు దిశగా ప్రోత్సహించాలన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతులను నర్సింగ్ విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య మౌలిక వసతులు కల్పించాలన్నారు.ధాన్యం, జొన్నల కొనుగోళ్లలో వైఫల్యాలను ప్రస్తావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష వాగ్వాదాలు..నిలదీతల మధ్య సాగింది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాల అమలును వివరించగా..రైతుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ధాన్యం సేకరణలో సర్కారు నిర్లక్ష్యం..జొన్నల కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మాణిక్రావు, సునీతారెడ్డి ప్రస్తావించారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా కూడా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దీంతో అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలు రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తమాషాలు చేస్తోందని వివేక్ వ్యాఖ్యానించడం పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. తక్షణం ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన వైఫల్యాలను మంత్రి వివేక్తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గుర్తు చేశారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల నిలదీతలు..వాగ్వాదాలతో సమావేశంలో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యేల కోటా కోసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్టు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యేల కోటా అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశంలో లేవనెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న మాదిరిగానే తమకు కూడా ఇళ్ల కోటాను కేటాయించాలని, తాము కూడా ప్రజల ఆశీర్వాదం ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగానే ఈ ఇళ్లను తమకు కూడా కోటా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జొన్నల నిల్వలు గోదాముల్లో పేరుకుపోవడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని, దీంతో ఇటు జొన్నల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. మీడియాను అనుమతించని అధికారులు చాలా నెలల తర్వాత జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇతర జిల్లాలకు భిన్నంగా ఇక్కడ మీడియా అనుమతి లేకుండా ఈ సమావేశాన్ని నిర్వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. విశాలమైన జిల్లా పరిషత్ సమావేశ హాలు ఉన్నప్పటికీ..ఈ సమావేశాన్ని అంతంత మాత్రంగా ఉన్న వీడియోకాన్ఫరెన్స్ హాలులోనే నిర్వహించడంతో ఇటు అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు సగానికిపైగా శాఖల జిల్లా ఉన్నతాధికారులు ఈ సమావేశం జరుగుతున్న సేపు హాలు బయట పడిగాపులు కాయడం గమనార్హం. సమీక్షలో ఎంపీలు సురేశ్షెట్కార్, రఘునందన్రావు, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ పరితోశ్పంకజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న మంత్రి వివేక్ వాడీవేడిగా జిల్లా సమీక్ష -
పంట మార్పిడితో ప్రయోజనాలు
● జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ● ‘సాక్షి’ఫోన్ ఇన్కు విశేష స్పందన ● డీఏఓతో నేరుగా మాట్లాడిన రైతులు ● వానాకాలం పంటల సాగుపై సూచనలు, సలహాలుప్రశ్న: వర్షాభావ ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోమని చెబుతున్నారు. పంట పూత దశలో అధిక వర్షం, తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరి పంట సాగు చేసుకోవచ్చా? – భీమ్ రావు, గ్రా.బాన్సువాడ, మం. కంగ్టి శివప్రసాద్: జూన్, జూలైలో సాధారణం, ఆగస్టు, సెప్టెంబర్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అతి తక్కువ కాలంలో పంట చేతికొచ్చే వైరెటీలు సాగు చేసుకోవాలి. వర్షాలను తట్టుకుని చేతికొచ్చే పంట రకం వరిని సాగు చేసుకోవాలి. వర్షాలు తక్కువగా ఉన్నందున తెగుళ్లు తక్కువగా వస్తాయి. సంగారెడ్డి జోన్/ సంగారెడ్డి ఎడ్యుకేషన్: రైతులు తమ పొలాల్లో ఒకే రకమైన పంటను కాకుండా కాలానికనుగుణంగా పంటలను మార్పిడి చేస్తూ సాగు చేయడంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ వెల్లడించారు. మంగళవారం ‘సాక్షి’ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రైతులు నేరుగా ఆయనతో మాట్లాడి తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ..ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉండటంతో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే రకాలను విత్తుకోవాలని సూచించారు. ప్రశ్న: పత్తిలో అంతర పంటగా సోయా పంటను సాగు చేయాలంటే ఏ రకమైన విత్తనాలు విత్తు కోవాలి? గోపాల్ రెడ్డి, గ్రా.కక్కర్ వాడ,మం. ఝరాసంగం శివప్రసాద్: పత్తిలో అంతర పంటగా జేఎస్ 335 రకం సోయాను సాగు చేసుకోవచ్చు. ఆగస్టులో వర్షపాతం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పత్తిలో కంది పంటను సాగు చేసుకోవడం చాలా మంచిది. నీటి సౌకర్యం ఉంటే మక్క పంటను కూడా సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: 5 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఏ రకమైన పత్తి విత్తనాలు విత్తు కోవాలి? – మల్లేశం యాదవ్, వినోద్ సింగ్ ఠాకూర్, గ్రా. మం. ఝరాసంగం శివ ప్రసాద్: పత్తిలో అనేక రకాలు మార్కెట్లో ఉన్నాయి. 120 నుంచి 135 రోజుల కాలం ఉన్న పంటలను సాగు చేసుకోవడం మంచిది. ఆగస్టులో వర్షపాతం చాలా తక్కువగా ఉన్నందున త్వరగా పంట చేతికి వచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ప్రశ్న: ఈ ఏడాది కూడా వరి సాగు చేయవచ్చా? – ప్రవీణ్, గ్రా.ఫసల్ వాది, మం.సంగారెడ్డి శివ ప్రసాద్: తక్కువ కాలం ఉన్న కేఎన్ఏం 1638 అనే వైరెటీని సాగు చేసుకోవాలి. నీటి సౌకర్యం ఉంటే వరి సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 32 క్వింటాలు దిగుబడి వస్తుంది. ప్రశ్న: పత్తి విత్తనాలు ఎప్పుడూ విత్తుకోవచ్చు. యూరియా అందుబాటులో ఉందా? – మల్లేశం, గ్రా. ఇసిరాబాద్ మం.సదాశివ పేట శివప్రసాద్: రెండు వానలు బాగా కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకుంటే మంచిది. యూరియా కొరత లేదు. యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలి. ప్రశ్న: ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారు? కొనుగోలు చేసిన వాటికి బిల్లులు కూడా ఇవ్వటం లేదు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? – నరసింహారెడ్డి, గ్రా. ముంగి, మం. న్యాల్కల్ శివప్రసాద్: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినట్లు రుజువైతే షాప్ను సీజ్ చేస్తాం. కేసులు నమోదు చేస్తాం. కొనుగోలు చేసిన ఎరువులకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. ప్రశ్న: పత్తి పంటలో అంతర పంటగా ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి? తెగుళ్లు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? – దుర్గేష్, గ్రా. కన్ సాంన్ పల్లి, మం.అందోల్ శివప్రసాద్: మూడు వరుసల పత్తి, ఒక వరుస అంతర పంటగా కంది, సోయాబీన్తో పాటు నీటి సౌకర్యం ఉంటే ఇతర పంటలు వేసుకోవచ్చు. ప్రశ్న: వరి పంట సాగుకు ఏ రకమైన వైరెటీ సాగు చేసుకోవచ్చు? తెగుళ్లు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? – విష్ణువర్ధన్ రెడ్డి, గ్రా. మం. గుమ్మడిదల శివ ప్రసాద్: వరిలో సన్నరకం సాగు చేసుకోవాలి. కొత్తగా వచ్చిన కేఎన్ఎం 16:38 రకం బాగుంటుంది. ఒక ఎకరాకు 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వర్షాభావ పరిస్థితులను బట్టి తెగుళ్లు సోకే అవకాశం ఉంటుంది. అధికారుల సూచనలు మేరకు నివారణ చర్యలు చేపట్టాలి. ప్రశ్న: పత్తి పంటలో దిగుబడి తగ్గకుండా ఎలాంటా చర్యలు తీసుకోవాలి? ఆయిల్ పామ్ పంటలో అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చా? ఎలాంటి పంటలు వేసుకోవాలి? – కిషన్, గ్రా.అంకెన్ పల్లి, మం.సదాశివపేట. శివప్రసాద్: వర్షాలు అధికంగా కురవడంతో తెగుళ్లు సోకి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. పంట మార్పిడి చేయడంతో ప్రయోజనాలుంటాయి. పంట సాగులో సేంద్రీయ ఎరువులు వినియోగించాలి. పత్తి పంట సాగు చేసినప్పటికీ మేలు రకం విత్తనాలు వాడాలి. ఆయిల్పామ్ పంటలో అంతర పంటగా సోయాబీన్, పెసరతోపాటు ఇతర పంటలు సాగు చేసుకోవచ్చు. -
జల్సాలకు అలవాటై చోరీలు
జహీరాబాద్ టౌన్: జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని జహీరాబాద్ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే మూడు తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ లవకుమార్తో కలిసి డీఎస్పీ సైదానాయక్ కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా చించోళి తాలుకా గరగపల్లి గ్రామానికి చెందిన అమ్రేశ్(22) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. పగలు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి విగ్రహం వద్ద ఎస్ఐ.లవకుమార్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వారిని చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించారు. పట్టణంలోని పలు ఇళ్లలో చోరీలు చేశానని నేరం అంగీకరించాడు. దీంతో అతడ్ని కోర్టులో రిమాండ్ చేశారు. కేసు ఛేదించిన ఎస్ఐ లవకుమార్, పోలీసు సిబ్బంది నర్సింహులు, పృథ్వీ, హరినేత్రలను డీఎస్పీ అభినందించారు. నిందితుడి అరెస్టు బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం -
అగ్ని ప్రమాదంలో ట్రాక్టర్, గడ్డి దగ్ధం
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ట్రాక్టర్, గడ్డి వాము దగ్ధం కాగా, లేగదూడ కూడా మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన గుడికందుల మధు తన పొలం వద్ద వరి గడ్డి కట్టలు కట్టి పెట్టాడు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి తన పొలంలోని గడ్డి కట్టలు, పక్కనే ఉన్న ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. అక్కడే కట్టేసిన ఏడాది లేగదూడ సైతం మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. గమనించిన సమీప రైతులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పినప్పటికీ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. లేగదూడ మృతి -
వడదెబ్బతో కూలీ మృతి
శివ్వంపేట(నర్సాపూర్): అనారోగ్యం, వడదెబ్బతో కూలీ మృతి చెందాడు ఈ ఘటన మండల పరిధిలోని దొంతిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన బణుపురం వెంకటేశ్(37) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి స్థానిక కల్లు దుకాణం వద్ద అపస్మారక స్థితిలో మృతి చెందాడు. అనారోగ్యం, వడదెబ్బ మూలంగా మృతి చెందాడని మృతుడి భార్య మంజుల పీఎస్లో ఫిర్యాదు చేసింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుకర్రెడ్డి తెలిపారు. -
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
నర్సాపూర్ రూరల్: మండలంలోని గొల్లపల్లిలో వెలసిన రేణుక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో లందా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రేణుక పరమేశ్వరి అమ్మవారి విగ్రహ దాత బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు కలిసి పూజాలో పాల్గొన్నారు. అలాగే ఎస్సీ వాడలో గతేడాదిలో నిర్మించిన రేణుక పరమేశ్వరి అమ్మవారి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఊరేగింపులో యువకులు, పోతరాజులు, శివ సత్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
డబుల్.. ట్రబుల్
జహీరాబాద్: స్థానిక మున్సిపల్ పరిధిలోని హోతి(కె) శివారుతో పాటు పస్తాపూర్లోని జర్నలిస్టు కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రక్షణ కరువైంది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోతి(కె)లో 660 ఇళ్లు, పస్తాపూర్ జర్నలిస్టు కాలనీలో 40 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. అయితే, ఈ కాలనీల చుట్టూ ప్రహరీ, ప్రధాన గేట్లు నిర్మించలేదు. కాలనీల పరిసరాల్లో వ్యవసాయ భూములు ఉండడంతో తరచూ ఇండ్లలోకి పాములు వస్తూ నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మరోవైపు భద్రత లేకపోవడంతో కాలనీల్లోకి బయటి వ్యక్తుల సంచారం పెరిగింది. ప్రహరీ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దుండగులు దొంగలు పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలంటేనే కాలనీవాసులు వణికిపోతున్నారు. రహమత్నగర్ కాలనీ తరహాలోనే తమ కాలనీలకు కూడా ప్రహరీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రహరీలకు నోచుకోని డబుల్ బెడ్రూం ఇళ్లు పాముల సంచారంతో ఇబ్బందులు సమస్యలు పరిష్కరించాలని నివాసితుల వేడుకోలు -
ఉద్యోగులకు బదిలీలు సహజమే
చిన్నశంకరంపేట(మెదక్): ఉద్యోగులకు బదిలీలు సహజమేనని, అయినా చేసిన పనులే గుర్తింపునిస్తాయని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. ఆదివారం స్థానిక డివిజన్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ ప్రదీప్రెడ్డి బదిలీవ్వగా.. సిబ్బంది అత్మీయ వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన వారు చేసిన సేవలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వాసుదేవ్, సిబ్బంది పాల్గొన్నారు. టీఎన్జీఓ నరేందర్ -
వైభవంగా నగర సంకీర్తన
జహీరాబాద్: పట్టణంలోని ఎస్బీహెచ్ కాలనీలో ఆదివారం 210వ నగర సంకీర్తన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శోభాయాత్ర చేపట్టారు. అనంతరం హనుమాన్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కంది హరేకృష్ణ మందిరం బాధ్యులు విభీషణ్దాస్ మహారాజ్ మాట్లాడారు. సర్వ జగత్ రక్షకుడైన శ్రీమహా విష్ణువే ప్రజాపతి అన్నారు. హరినామ సంకీర్తన చేయడంతో యజ్ఞ ఫలాలు అందుతాయన్నారు. జూలై 18వ తేదీన జగన్నాథ్ రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నహాలు ప్రారంభించాలని సూచించారు. ఇదిలా ఉండగా, హుగ్గెల్లిలో 175 నగర సంకీర్తనను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
తూప్రాన్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ సంఘటన పట్టణంలోని గీతా మందిరం సమీపంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. సీఐ వెంకటరాజాగౌడ్ వివరాల ప్రకారం... విద్యుత్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళి తన కుటుంబ సభ్యులతో గత నెల 29న పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి చెరుకొని చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు, బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు, ల్యాప్ట్యాప్ను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే విలువైన వస్తువులు ఇంట్లో పెట్టవద్దని సూచించారు. పోలీసులకు సమాచారం ఇస్తే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణ -
దేవాలయాల అభివృద్ధికి సహకారం
పటాన్చెరు టౌన్: దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇస్నాపూర్లోని పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులను గమనించిన స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని మధు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన షెడ్డు నిర్మాణ పనులకు సొంత నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చాలా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి మధు -
భౌబోయ్..
వీధి కుక్కల వీర విహారంసంగారెడ్డి జోన్: జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులను వెంబడిస్తూ గాయాలపాలు చేస్తున్నాయి. ఎక్కడినుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వీధి కుక్కల స్వైర విహారం ప్రజల ప్రాణాలకు ప్రాణాంతకంగా మారాయి. ప్రజల్లో భయాందోళన మనుషులపై కుక్కలు క్రూరంగా దాడులకు పాల్పడుతున్నాయి. తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడడంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరిగా చిన్నపిల్లల్ని బయటికి పంపించేందుకు జంకుతున్నారు. జిల్లాలో 13,486 శునకాలు 20వ పశుగణన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 13,486 కుక్కలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 20 వేలకు పైగా చేరినట్లు సమాచారం. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, అందోల్లోని పలు మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని రహదారుల పక్కనే మాంసపు వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలను యథేచ్ఛగా పారవేస్తున్నారు. దీంతో ఆయా ప్రదేశాల్లో వాటిని తిని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. అటుగా వెళ్లే వారిపై కరువడంతో గాయాలతోపాటు మృత్యువాత పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. నియంత్రణలో విఫలం.. కుక్కల పెరుగుదలను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏనిమల్ బర్త్ కంట్రోల్ చేసేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి, కాశీపూర్ గ్రామంలో నియంత్రణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు కుక్కలను నియంత్రణ కేంద్రాలకు తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసి, రేబిస్ టీకా వేసి ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలివేయాల్సి ఉంటుంది. కానీ మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ కార్యాచరణ కాస్తా ముందుకు సాగటం లేదు. ఫలితంగా వీటి బెడద రోజురోజుకూ అధికమవుతుంది. పట్టించుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర స్థాయిలో గాయాలు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. లెక్కలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.జిల్లాలో కొన్ని ఘటనలు.. ఈనెల 6న కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు సంచరిస్తూ చిన్నారులతోపాటు మహిళలపై దాడి చేశాయి. కాలు, చేతికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈనెల 7న ఝరాసంగం మండలంలోని పూరి నాయక్ తండాకు చెందిన విశాల్ను పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అదే రోజు తుమ్మన్పల్లి గ్రామానికి చెందిన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ముక్కుకు కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఆదివారం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన ముగ్గురిపై పిచ్చికుక్క దాడి చేయడంతో పెదవులు, చెంపలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. గాయాల పాలవుతున్న చిన్నారులు, వృద్ధులు వాహనదారులను వెంబడిస్తున్న శునకాలు భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు నియంత్రణలో అధికారులు విఫలం -
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
పటాన్చెరు: నియోజకవర్గ పరిధిలోని వీరభద్రీయుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఇస్నాపూర్ వీరభద్రియుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముత్తంగి డివిజన్ పరిధిలో గల భవన నిర్మాణ స్థలంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇస్నాపూర్ వీరభద్రియుల సంక్షేమానికి ఇప్పటికే సొంత నిధులతో 200 గజాల స్థలం అందించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు భిక్షపతి, కుమార్ గౌడ్, ప్రభాకర్, మేరాజ్ ఖాన్, సందీప్, రామకృష్ణ, సంఘం అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.. పటాన్చెరు టౌన్: స్థానిక డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం మాజీ ప్రజా ప్రతినిధులు, బల్దియా అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్వరలో వర్షపు నీరు తరలించేందుకు ప్రత్యేక డ్రైన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగం డీఈ కృష్ణవేణికి ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నర్ర భిక్షపతి, పృథ్వీరాజ్, శ్రీరాములు, బలవంత్, వెంకటేష్, కాలనీ అధ్యక్షులు అమరేందర్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
నల్లనిమట్టే పారాణి.. గడ్డిపరకలే బాసింగం
చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధిహామీ పనుల వద్ద ఓ జంటకు ఉత్తుత్తి పెళ్లి నిర్వహించి కూలీలు సందడి చేశారు. ఈ ఆసక్తికర ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని కొర్విపల్లి గ్రామంలో ఉపాధి పనుల వద్ద వధువు, వరుడికి గడ్డిపరకలతో చేసిన బాసింగం కట్టారు. కాళ్లకు నల్లనిమట్టినే పారాణిగా పెట్టారు. గడ్డిపరకతో తయారు చేసిన మంగళసూత్రం వధువు మెడలో వరుడు కట్టాడు. ఉపాధి పనులకు తీసుకువచ్చిన తట్టనే డప్పుగా చేసుకొని పెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా యువతులు నృత్యాలు చేసి అలరించారు. ఇదంతా పనులు ముగిశాక రెండో ఫొటో క్యాప్చర్ కోసం వేచి చూసే సమయంలో ఉపాధి కూలీలకు వేదికగా నిలిచింది.ఉపాధి పనుల వద్ద ఉత్తుత్తి పెళ్లి సందడి -
ఓటర్ మ్యాపింగ్ తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సోమవారంతో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ ముగియనుందని, అర్హులైన ఓటర్లంతా తప్పనిసరిగా ఓటరు మ్యాపింగ్ చేసుకోవాలని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు సూచించారు. ఆదివారం పట్టణంలోని జంబికుంట వీధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బీఎల్ఓలు ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. అధికారులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవాలన్నారు. లేదంటే ఓట్లు తొలగింపబడతాయని తెలిపారు. ఈనెల 10వ తేదీ అనంతరం ఇంకా మ్యాపింగ్ చేసుకోని ఓటర్లకు నమోదు పత్రాలు ఇస్తామని, వాటి ద్వారా సరి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
టమాటా.. ధరల మంట!
జహీరాబాద్ టౌన్: టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకు కిలో రూ. 20 పలికిన ధర ప్రస్తుతం జహీరాబాద్ మార్కెట్లో కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతుంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ధరలు పెరగడంతో టమాటా కొనడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వేసవిలో టమాటా సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సరఫరా లేక ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వారాంతపు సంతలో కూడా టమాటా ధరలు అధికంగా ఉన్నాయి. జహీరాబాద్ కూరగాయల మార్కెట్లో కొన్ని రోజులకు ముందు రూ.400 పలికిన టమాటా బాక్స్ ప్రస్తుతం రూ. 1,200 వరకు పలుకుతుంది. -
రగ్బీలో మెదక్కు మూడో స్థానం
చేగుంట(తూప్రాన్): రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు కోచ్ కరణం గణేశ్ రవికుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా బుదేరా మండలం ఆక్సిజన్ యూనివర్సిటీలో రెండురోజుల పాటు అండర్ 18 బాలబాలికల రగ్బీ పోటీలు జరిగాయి. బాలికల విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన నవ్యశ్రీ , రోజా, అంజలి, సోనా, అఖిల, షరీబా, గాయత్రి, దివ్య, వర్షశ్రీ, రాణి, సుప్రియ, వందన పాల్గొన్నారు. వీరు ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మల్లీశ్వరీ, పీడీలు, వారద, రంగీల, జయశీల తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
లారీల కోసం రోడ్డెక్కిన అధికారులు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ధాన్యం బస్తాలను తరలించేందుకు అవసరమైన లారీల కోసం అధికారులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలో తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం చేగుంట–మెదక్ రోడ్డుపై పద్మనాభస్వామి గుట్ట వద్ద పరిశ్రమల వద్దకు వచ్చిన లారీలను ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. సోమవారం వరకు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సెలవు రోజైనా కూడా అధికారులు విధులకు హాజరయ్యారు. కాగా లారీ డ్రైవర్లతో మాట్లాడి మండలంలోని పలు గ్రామాలకు పంపించారు. -
కల్కి భగవాన్ ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు
సంగారెడ్డి: పట్టణంలో పీఎస్ఆర్ గార్డెన్లో కల్కి భగవాన్ భక్త బందం ఆధ్వర్యంలో కల్కి భగవాన్ మూర్తులకు కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు కల్కి భగవాన్ దంపతుల విగ్రహమూర్తులకు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి భగవాన్ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలని ఆకాక్షించారు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా కల్యాణం నిర్వహిస్తున్న కల్కి భగవాన్ భక్త బందాన్ని ఆయన అభినందించారు.కల్కి భగవాన్ ఆలయం కోసం స్థలాన్ని సేకరించామని, ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. అనంతరం ఆలయ నిర్మాణం కోసం తన పూర్తి సహకారాన్ని అందిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కల్కి భక్త బంద సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం బస్తాల ట్రాక్టర్ బోల్తా
మద్దూరు(హుస్నాబాద్): వేర్వేరు చోట్ల ధాన్యం లోడ్తో వెళ్తున్న రెండు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. వివరాలు ఇలా... మండలంలోని వల్లంపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఆదివారం గ్రామంలోని రైస్మిల్లుకు ట్రాక్టర్ ధాన్యం లోడ్తో వెళ్తుండగా బోల్తాపడింది. అలాగే రేబర్తి–వల్లంపట్ల గ్రామాల మధ్యలో మరో ధాన్యం ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల ట్రాక్టర్ ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్న క్రమంలో అవి బోల్తా పడుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సరిపడా లారీలను అందుబాటులో ఉంచి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
మార్క్ఫెడ్లో జొన్నలు అమ్ముకోవాలి
మునిపల్లి(అందోల్): మార్క్ఫెడ్లో రైతులు జొన్నలను అమ్ముకోవాలని మాజీ ఎంపీపీ రాంరెడ్డి రైతులను కోరారు. ఆదివారం మండలంలోని బుదేరా రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎకరాకు 10 క్వింటాళ్ల జొన్నలను మార్క్ ఫెడ్లో తీసుకోనున్నట్లు తెలిపారు. క్వింటాళ్ల జొన్నలను ధర రూ.3,669ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, కంకోల్ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా తిరు కల్యాణం రామచంద్రాపురం(పటాన్చెరు): స్థానిక డివిజన్ పరిధిలోని కాకతీయనగర్ కాలనీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆంజయ్య, పుష్ప, నాయకులు ఐలేష్, పరమేష్ పాల్గొన్నారు. నూతన బోరు ప్రారంభం నారాయణఖేడ్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పేట్ 3వ వార్డులో కౌన్సిలర్ స్వప్న తనను ఎన్నికల్లో గెలిపిస్తే బోరువేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయం సాధించడంతో ఇచ్చిన హామీమేరకు వార్డులో బోరును ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం మోటా రు బిగించి పూజ చేసి వార్డు పెద్దలు, కాలనీవాసులతో కలిసి బోరును ప్రారంభించారు. దీంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. భగవద్గీత గ్రంథాల పంపిణీ జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని వాబిలాలలో ఆదివారం నగరానికి చెందిన త్రైత సిద్ధాంత ప్రబోధా సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామస్తులకు భగవద్గీత గ్రంథాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు సీహెచ్ గిరి ఇంటింటికి వెళ్లి త్రైత సిద్ధాంత జ్ఞాన గ్రంథాలపై ప్రచారం చేశారు. దైవ జ్ఞానం ప్రకారం కులాలు, మతాలు నిషిద్ధమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. భగవద్గీతలోని సారాన్ని కర్మయోగంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కుమార్, నరసింహాచారి, శ్రీనివాస్, నరసింహారావు ప్రదం అశోక్, అంజి, వీరన్న, చంద్రకళ, నాగమణి, లక్ష్మీ, పద్మ, స్వప్న పాల్గొన్నారు. కార్యదర్శికి సన్మానం రామాయంపేట(మెదక్): గ్రామాభివృద్ధిలో ప్రగతి ధర్మారం కార్యదర్శి మహేందర్ ఎనలేని కృషి చేసి అందరి మన్ననలు పొందారు. ఇటీవల ఆయన బదిలీ కాగా ఆదివారం ఆయనను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
స్కౌట్ మాస్టర్ల పోస్టులకు దరఖాస్తులు
ది స్కౌట్–గైడ్స్ ఆర్గనైజేషన్ జిల్లా కమిషనర్ రూయల్ రాజ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని మండలాల వారీగా స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట్ జిల్లా కమిషనర్ ఇస్సారపు రూయల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్కౌట్ మాస్టర్లకు నెలసరి వేతనం రూ.15వేలు ఉంటుందన్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కల్గిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ నెల 10న సాయంత్రం 5గంటల వరకు స్వీకరించనున్నారు. వివరాలకు జిల్లా కార్యాలయం ఫోన్ నెం. 77949 30047లో సంప్రదించాలని సూచించారు. సైక్లింగ్తో శారీరక దృఢత్వంజిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి సిద్దిపేటజోన్: పర్యావరణ హితంగా సైక్లింగ్ సాధన చేయాలని, విద్యార్థులు సైక్లింగ్పై ఆసక్తి చూపాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి సూచించారు. ఆదివారం స్టేడియంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎస్వైఓ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యంతోపాటు శారీరక దృఢత్వం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖేల్ ఇండియా సైక్లింగ్ కోచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. చేపలు పట్టడానికి వెళ్లి వృద్ధుడు మృతిదుబ్బాకటౌన్: చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు వివరాల ప్రకారం... దుబ్బాక పట్టణానికి చెందిన పర్వతం మల్లయ్య(70) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. గతంలో సైతం మద్యం మత్తులో పలుమార్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చాడు. కానీ ఈ సారి మద్యం మత్తులో చేపలు పట్టడానికి బోడినికుంటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. దుర్వాసన వస్తుండడంతో గేదెల కాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మల్లయ్యగా నిర్ధారించారు. మల్లయ్య కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వృద్ధురాలు అదృశ్యం సంగారెడ్డి క్రైమ్: వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... పట్టణంలోని హనుమాన్ నగర్ (కింది బజార్)కు చెందిన బుక్క పెంటమ్మ(58) గృహిణి. తన కుమారుడు కుటుంబంతో కలిసి కొన్ని నెలలుగా సంగారెడ్డిలో జీవిస్తుంది. మతిస్థిమితం సరిగాలేని పెంటమ్మ ఈ నెల 6న అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మట్టి తవ్వకాలపై కేసు నమోదుశివ్వంపేట(నర్సాపూర్): అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మధుకర్రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని దొంతి కుందలమ్మ చెరువులో నుంచి రాత్రి వేళల్లో జేసీబీతో మట్టి తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా మట్టి తవ్వకాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు
● త్వరలోనే షెడ్యూల్ ● ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకంనారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలైంది. మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ కార్మిక నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వంలో విలీనం తదితర ప్రధాన డిమాండ్లతో కార్మికులు ఇటీవల పెద్దఎత్తున ఆందోళన చేపట్టగా..కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల అనంతరం సమ్మె విరమించిన విషయం విదితమే. ఇచ్చిన హామీమేరకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో రిటర్నింగ్ అధికారిగా జంట నగరాల కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్దాస్ను నియమించింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, పోలింగ్ తేదీలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. రీజియన్లో కదలిక.. ఎన్నికల్లో గెలుపొందిన సంఘంతో ప్రభుత్వం, కమిటీ చర్చలు జరిపిన తర్వాతనే ఆర్టీసీ విలీన ప్రక్రియ జరగనుంది. తమను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు చేస్తున్న పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగిరావడం, విలీన ప్రక్రియకు ఎన్నికల నగారాకు ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. కాగా, మెదక్ రీజియన్ పరిధిలో సైతం కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రీజియన్లో తెలంగాణ మజ్దూర్ యూనియర్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన యూనియన్లుగా ఉండగా వీటితోపాటు మరికొన్ని యూనియన్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రధాన యూనియన్లలోనే సభ్యత్వ నమోదు గతంలో అధికంగా జరిగేది. 1,950 మంది కార్మికులకు ప్రయోజనం మెదక్ రీజియన్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, దుబ్బాక, నర్సాపూర్, గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలున్నాయి. వీటి పరిధిలో రెగ్యులర్ కండక్టర్లు 1,014, డ్రైవర్లు 508, మెకానిక్లు, ఏడీసీ, సూపర్వైజర్లు, డీఎం ఆఫీస్స్టాఫ్ తదితరులు కలిపి 428 మందిగా మొత్తం రెగ్యులర్ కార్మికులు 1,950 మంది కొనసాగుతున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ జరిగాక ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని గుర్తించనున్నారు. -
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
ఎస్పీ పరితోశ్ పంకజ్ కొండాపూర్(సంగారెడ్డి): సైబర్ నేరగాళ్లు వేసే వలలో ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు వహించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మండల పరిధిలోని గొల్లపల్లి లో నిర్వహించిన గ్రామసభలో జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సైబర్ మోసగాళ్లు మొదట కొంత డబ్బు వచ్చినట్లు చూపించి, అనంతరం భారీ మొత్తాలు పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి మోసా లకు పాల్పడుతున్నారని వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆన్లైన్్లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని, తెలియ ని లింకులు లేదా ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేసి మోసపోవద్దన్నారు. సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో విద్యావంతులే అధికంగా ఉన్నారని, వీటిపై అవగాహన పెంచుకుని గ్రామస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న వివిధరకాల నేరాలు, పోక్సో, అత్యాచార కేసుల్లో భరోసా కేంద్రం పనితీరు, మహిళల రక్షణ కోసం షీ–టీమ్స్ అందిస్తున్న సేవలు, సైబర్ నేరాల నివారణ చర్యలు, అత్యవసర సేవల వినియోగం తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి సంగారెడ్డి జోన్: విద్యార్థులు పోటీ పరీక్షలకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని ఎస్పీ పరితోశ్పంకజ్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పార్క్ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వారి పిల్లలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రతీ ఒక్కరు కృషి, పట్టుదలతో ఉన్నతలక్ష్యాలను అధిరోహించాలన్నారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. ఉన్నత ఉద్యోగాల సాధనకు కృషి, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత పదవులను సాధించిన డిప్యూటీ కలెక్టర్ మురళి మాధినేని, ట్రైనీ డీఎస్పీ సుజాత, ఎంబీబీఎస్ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తూ ఐఆర్ఎస్ సాధించిన ప్రత్యూష తమ విజయాల తీరును వివరించారు. -
చిరుధాన్యాల విక్రయ కేంద్రానికి సహకారం
కలెక్టర్ ప్రతీక్జైన్ జహీరాబాద్ టౌన్: చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల విక్రయ కేంద్రం (రిటైల్ యూనిట్)సంగారెడ్డిలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని కలెక్టర్ ప్రతీక్జైన్ హామీనిచ్చారు. డీడీఎస్ మహిళా రైతులు సేంద్రియ ఎరువులతో సిరిధాన్యాలు పండించడం అభినందనీయమన్నారు. యూఎన్డీపీ–బయోఫిన్ సంయుక్తంగా జహీరాబాద్ పట్టణ సమీపంలోని డీడీఎస్, కేవీకేలో శనివారం నిర్వహించిన అగ్రోబయోడైవర్సిటీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. ఎరువుల కొరత సమస్య నుంచి కూడా బయటపడతామని వివరించారు. అంతకుముందు కలెక్టర్ డీడీఎస్–కేవీకే ప్రదర్శించిన చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలే
జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ జహీరాబాద్ టౌన్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ డీలర్లను సూచించారు. రైతువేదికలో శనివారం నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడానికి డీలర్లు చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను రైతులు యాప్ ద్వారా పొందాలని చెప్పారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులను చైతన్య పరచాలన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నర్సాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనులు వేగవంతం చేసి ఈ నెల 10లోపు కేంద్రాలను మూసి వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. ఆయన శనివారం స్థానికంగా మూతపడిన షుగర్ కంపెనీలోని గోదాంను పరిశీలించి మాట్లాడారు. మండలంలోని అన్ని కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్కు సూచించారు. తూకం వేసిన ధాన్యంను కేంద్రాల నుంచి గోదాంలకు తరలించాలని, లారీలు సరిపోకపోతే ప్రైవేటు వాహనాలు సమకూర్చుకొని వడ్ల బస్తాలు తరలించాలని అవసరమైతే హమాలీలను పెంచుకోవాలన్నారు. కాగా మండలంలో చేపడుతున్న కొనుగోలు వివరాలను ఆర్డీఓ, తహసీల్దార్ ఆయనకు వివరించారు. -
కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ హత్నూర(సంగారెడ్డి): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. హత్నూర మండలం బోరుపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు రైస్మిల్లును శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లుకు వెళ్లిన ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేసి కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఉందన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే మాత్రం అధికారులతోపాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆయనతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలసరోజ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజింగ్ డైరెక్టర్ జైశ్రీలాల్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, డీటీ కర్ణాకర్రావు, సీఓ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
చేపల పంచాయితీ
పెద్ద చెరువువద్ద హైటెన్షన్వట్పల్లి(అందోల్)/అల్లాదుర్గం (మెదక్): అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి, అల్లాదుర్గ్ మండల పరిధిలోని గడిపెద్దాపూర్ గ్రామాల మధ్య విస్తరించి ఉన్న పెద్దచెరువు వద్ద శనివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాలు ఇలా... చెరువులో చేపలు పట్టే హక్కు గడిపెద్దాపూర్ గ్రామానికి ఉండటంతో, తమకు దక్కాల్సిన వాటా ప్రకారం సభ్యత్వం కల్పించాలని కన్సాన్పల్లి మత్స్యకారులు గతంలో అధికారులను ఆశ్రయించారు. కాగా 33 మందికి పెద్దాపూర్ మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం ఇవ్వాలని గతేడాది అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వారిని సంఘంలో చేర్చుకునే విషయమై పెద్దాపూర్ మత్స్యకారులు వ్యతిరేకించారు. సంఘంలో చేర్చుకోకుంటే వాళ్లు కూడా చేపలు పట్టేది లేదని అధికారులకు కన్సాన్పల్లి మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపూర్ మత్య్సకారుల నుంచి అధికారులు చెరువు పన్ను తీసుకోలేదు. అధికారుల తీరును తప్పుబడుతూ వారు హైకోర్టును ఆశ్రయించి చేపలు పట్టేందుకు అనుమతి తీసుకున్నారు. చెరువు వద్ద హైడ్రామా.. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకే చేపలు పట్టే హక్కు ఉందని పెద్దాపూర్ మత్స్యకారులు శనివారం పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు కన్సాన్పల్లి మత్స్యకారులు కూడా చెరువు వద్దకు వచ్చారు. విషయం తెలిసిన జోగిపేట సీఐ అనీల్కుమార్, అల్లాదుర్గ్ సీఐ రేణుక ఆధ్వర్యంలో పుల్కల్, వట్పల్లి, జోగిపేట పోలీస్స్టేషన్ బల గాలు చెరువు వద్ద మోహరించాయి. వీరితో పాటు మత్స్యశాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఇరు గ్రామాల మత్స్యకారులను పిలిపించి మాట్లాడారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమకే చేపలు పట్టేహక్కు ఉందని పెద్దాపూర్ పట్టుబట్టగా, అధికారిక ఉత్తర్వుల ప్రకారం తమకు సంఘంలో సభ్యత్వ వాటా ఇస్తేనే చేపలు పట్టనిస్తామని కన్సాన్పల్లి మత్స్యకారులు అనడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు కలుగజేసుకొని ఇరు గ్రామాల మత్స్యకారులతో గంటపాటు చర్చలు జరిపారు. రెండు రోజుల సమ యం తీసుకొని, మాట్లాడుకొని సామరస్య ధోరణితో ముందుకెళ్లాలని సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జోగిపేట, పుల్కల్, వట్పల్లి ఎస్ఐలు పాండు,విశ్వజన్, శ్రీహరి, ఏఎస్ఐలు అంజయ్య, గౌస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులేమన్నారంటే..
ఈ మట్టి తవ్వకాలకు అక్రమ అనుమతుల జారీ విషయమై నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ను ‘సాక్షి’ప్రతినిధి ఫొన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఆర్డీఓ రామకృష్ణను వివరణ కోరగా..అనుమతుల మంజూరుకు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తామన్నారు. పూర్తి వివరాలు కావాలంటే నీటిపారుదలశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీతను సంప్రదించగా తాను బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అంతకుముందు ఇచ్చి ఉండవచ్చని, ఫైల్ తెప్పించుకుని వివరాలు తెలుసుకుంటానన్నారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మంతూరు పోచంపెద్ద చెరువులో పది వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు స్థానిక అధికారులు అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టారు. వాల్టా చట్టాన్ని, పర్యావరణ నిబంధనలను చెరువులోనే తొక్కేసి ఇచ్చిన ఈ అనుమతుల జారీ వెనుక ఆయా శాఖల అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయనేది బహిరంగ రహస్యం. ఈ అడ్డదారిలో పొందిన అనుమతులను ఆసరాగా చేసుకుని ఇక్కడ విచ్చలవిడిగా మట్టి దందా సాగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ కెపాసిటీ కలిగిన జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. ఎన్ని క్యూబిక్మీటర్లు తరలిస్తున్నారనేది లెక్కపెట్టే నాథుడే లేకుండా నిత్యం వందలాది భారీ టిప్పర్లలో విలువైన సహజ సంపదను తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పెద్ద చెరువులోనూ 50 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ అయ్యాయి. ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో పెద్ద చెరువు గర్భాన్ని తొలిచేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మట్టి అక్రమ దందా మూడు జేసీబీలు..ఆరు టిప్పర్లు అన్నట్లు సాగుతోంది. దొడ్డిదారిన తీసుకున్న నామమాత్ర అనుమతుల పేరుతో రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రీ పగలు తేడా లేకుండా చెరువులను తొలిచేస్తున్నారు. హై కెపాసిటీ కలిగిన జేసీబీలు, ప్రొక్లయినర్లను దించి చెరువులను తొలిచేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో మట్టిని నింపి తరలిస్తున్నారు. అడ్డదారిలో తరలిస్తున్న ఈ మట్టి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా.ఇటుక బట్టీలకు తరలింపు.. నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి (సిల్ట్) తవ్వుకోవాలంటే రైతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ మట్టిని పొలాల్లో వేసుకుని ఎరువులాగ వాడుకుంటారు. రైతులకు మినహా ఇటు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవాలంటే తప్పనిసరిగా భూగర్భ గనుల శాఖ నుంచి క్వారీ అనుమతులు మంజూరు చేయించుకోవాలి. అక్కడి నుంచి తరలించే ప్రతీ మట్టి టిప్పర్కు సీనరేజీ చెల్లించి వేబిల్లులతో మట్టిని రవాణా చేయాలి. కానీ గనుల శాఖ నుంచి క్వారీ లీజు మంజూరు లేకుండానే తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీఎంఎఫ్టీకి నామమాత్రంగా డబ్బులు చెల్లించి రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ మట్టి అక్రమ దందాకు నీటిపారుదల శాఖ అధికారులతోపాటు, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు ప్రత్యక్షంగానే సహకరిస్తుండటం వెనుక రూ.లక్షల్లో ముడుపులే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యథేచ్ఛగా మట్టి దందా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం అల్వ చెరువును కూడా లూఠీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ 60 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునే అనుమతులు కట్టబెట్టేందుకు అధికారులు పావులు కదుపుతున్నా రు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏకమై తెరలేపిన ఈ మట్టి దందా కోసం పాత తేదీల్లో వేలం పాట నిర్వ హించినట్లు రికార్డులు సృష్టించారు. రూ.లక్షల్లో మట్టి ముడుపుల పంపకాలు బయటకుపొక్కడంతో ఈ రెండు పార్టీల్లోని ఒక ప్రత్యర్థివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు గ్రామస్తులు ఈ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్లో ఫిర్యాదులు చేశారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిగితే అడ్డుకున్నారు. అధికార యంత్రాంగం ఇప్పుడు అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. -
ఈసీ మార్గదర్శకాలు పాటించాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డిసంగారెడ్డి జోన్: ఈవీఎంలు, ఇతర ఎన్నికల పరికరాల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఈవీఎం గోడౌన్ను శనివారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి కలెక్టరేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ..సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈవీఎం గోడౌన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, మాస, త్రైమాసిక తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సామగ్రి భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంగీత, ఆర్డీఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జైరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్సీ ప్రారంభించాలని మంత్రికి విజ్ఞప్తి
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లిలో నూతనంగా నిర్మించిన సీహెచ్సీ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని శనివారం హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనరసింహాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా సర్పంచ్ల పోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ కలిసి విజ్ఞప్తి చేశారు. సీహెచ్సీ నిర్మాణం పూర్తయిందని, ప్రారంభించి వినియోగంలోనికి తెస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. దీంతోపాటు కౌడిపల్లి గ్రామానికి సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గుప్త, నాయకులు పుండరీకంగౌడ్, మల్లికార్జున్గౌడ్, భూమయ్యపటేల్, వెంకటేశం, దేవెందర్, రమేశ్, ఆరిఫ్, కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు నిజాంపేటలో చేపప్రసాదం పంపిణీ
నారాయణఖేడ్: ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు మృగశిర కార్తె పురస్కరించుకుని నిజాంపేట్ మండల కేంద్రంలో ఈనెల 8న ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు లింగాగౌడ్, పర్వాగౌడ్, నాగరాజుగౌడ్, శంకర్గౌడ్, వెంకటేశ్గౌడ్, సాయిబాబాగౌడ్ పేర్కొన్నారు. గత 81 ఏళ్లుగా తమ కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నామన్నారు. ఏటా ప్రసాదం కోసం తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి సైతం పెద్దసంఖ్యలో వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలిఝరాసంగం(జహీరాబాద్): గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చిలకపల్లిలో శనివారం నిర్వహించిన గ్రామసభలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఇష్టానుసారంగా పారేయరాదని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు సహకరించాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఆదాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, తహసీల్దార్ భాస్కర్, గ్రామ సర్పంచ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఖేడ్ను ఐటీడీఏగా గుర్తించాలినారాయణఖేడ్: జిల్లాలోకెల్ల అత్యధిక గిరిజన జనాభా ఉండి అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ప్రాంతమైన ఖేడ్ను ఐటీడీఏగా గుర్తించాలని ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేశ్సింగ్ డిమాండ్ చేశారు. ఖేడ్ నియోజకవర్గంలోని పలు గిరిజన తండాల్లో శనివారం గిరిజనులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..ఉపాధి కరువై ఇక్కడి గిరిజనులు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. ఐటీడీఏగా ఏర్పాటుచేసి ఇక్కడి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. పలువురు ఫోరం బాధ్యులు పాల్గొన్నారు. డాక్టర్ పుట్టరాజుకు ఫ్రెండ్ ఆఫ్ కర్ణాటక అవార్డురామచంద్రాపురం(పటాన్చెరు): బీహెచ్ఈఎల్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ ఆర్.పుట్టరాజుకు ఫ్రెండ్ ఆఫ్ కర్ణాటక అవార్డు లభించింది. బెంగళూరులో శుక్రవారం కళాగ్రామంలో కన్నడ సామాజిక, సాంస్కృతిక శాఖ సహకారంతో కన్నడ మీడియా క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో నటుడు చేతన్అహింస చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం భెల్ కాలనీలో ఆయనను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో పుట్టరాజు మాట్లాడుతూ..అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. మద్యం అమ్మకాలపై నిషేధం చేగుంట(తూప్రాన్): మద్య నిషేధంపై మండలంలోని బీ.కొండాపూర్ గ్రామ సభలో తీర్మానం చేశారు. మండలంలోని ఆరు గ్రామా ల్లో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా, బీ.కొండాపూర్లో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్యర్యంలో మద్య నిషేధంపై తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే వడియారంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ పాల్గొని ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. -
అందమైన అడవోయి.. ఆహ్లాదం అందెనోయి
208 ఎకరాల్లో అర్బన్ పార్కు నిర్మాణం ● రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు మంజూరు ● త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంత ప్రజలు ఆహ్లాదం పొందేందుకుగాను అర్బన్ పార్క్ సిద్ధమైంది. దీంతో పర్యాటకులు ప్రకృతి ఒడిలో సేదతీరనున్నారు. ఈ పార్కు మున్సిపాలిటీ వాసులతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనుంది. త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఫారెస్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65వ జాతీయ రహదారి పక్కనే 208 ఎకరాల భారీ విస్తీర్ణంలో పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఆరేళ్లకు మోక్షం జహీరాబాద్ పట్టణ శివారులో 65వ జాతీయ రహదారి పక్కన గల మహీంద్ర కర్మాగారం సమీపంలో ఉన్న రిజర్వు ఫారెస్టు భూమిలో ఎకోపార్కు (అర్బన్ పార్కు) రూపొందించేందుకు ఆరేళ్ల క్రితం రూ.4 కోట్లను మంజూరు చేసింది. అయితే నిధుల విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను రూ.2కోట్ల నిధులను విడుదల చేసింది. 208 ఎకరాల భారీ విస్తీర్ణంలో లంగ్ స్పేస్(పచ్చని ఊపిరితిత్తులు)గా మార్చాలని సంకల్పించారు. నిధులు సరిపోని కారణంగా పనుల్లో స్తబ్దత ఏర్పడటంతో అటవీశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో పనుల్లో కదలిక వచ్చింది. కాంపన్సేటరీ అఫ్పారెష్ట్రేషన్ (సీఏఎంపీఏ) నిధుల నుంచి రూ.55 లక్షలు కేటాయించడంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యాయి. ప్రజలకు హెల్త్ హబ్గా... ప్రజలకు ఆహ్లాదం పొందేందుకు వీలుగా రూపుదిద్దుకున్న అర్బన్ పార్కు హెల్త్ హబ్గా మారనుంది. ఉదయం పూట వాకింగ్ చేసే వారి కోసం ప్రశాంతమైన నడకదారులు, మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేకంగా యోగా కేంద్రం, పిల్లలు ఉత్సాహం–ఉల్లాసంగా గడిపేందుకు ప్లే ఏరియాలను రూపొందించారు. పర్యావరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రదర్శనలు, సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. పార్కులో చేపట్టిన నిర్మాణాలు.. అర్బన్ పార్కు సందర్శనకు వచ్చే వారికి పలు సౌకర్యాలను కల్పించారు. రూ.22 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మించారు. రూ.15లక్షలతో వాచ్ టవర్, రూ.90 లక్షలతో మూడు కిలోమీటర్ల ఇనుప కంచె నిర్మాణం, రూ.6.70 లక్షలతో ప్రధాన ముఖద్వారం, వాచ్మెన్ గది, రూ.9.24లక్షలతో మోగా షెడ్డు, రూ.3.50 లక్షలతో సోలార్ బోరు, రూ.14 లక్షలతో పిల్లల ఆటస్థలం, రూ.2లక్షలతో నాలుగు రచ్చబండల ప్లాట్ఫాంలను ఏర్పాటు చేశారు. అందాలను ఆస్వాదించేలా.. రిజర్వు ఫారెస్టులోని అందాలను ఆస్వాదించేందుకు వీలుగా అర్బన్ పార్కును తీర్చిదిద్దాము. ఇది జహీరాబాద్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా కృషి చేస్తాం. ఉన్న నిధులతో సౌకర్యాలను కల్పించాం. అందుబాటులోకి తెచ్చేందుకు అంతా సిద్ధం చేశాం. –శ్యాంసుందర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్–జహీరాబాద్ -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం హద్నూర్ పోలీస్ స్టేషన్లో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, రూరల్ సీఐ హన్మంతు, ఎస్ఐ సుజిత్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న మండల పరిధిలోని తేజమ్మ పొలం వద్ద పనులు చేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు బెదిరించి మెడలో ఉన్న తులంన్నర బంగారం, చెవుల కమ్మలు, సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. అనంతరం బసంత్పూర్లో పొలం వద్ద పనులు చేస్తున్న హిందూమతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం గంగ్వార్ చౌరస్తా వద్ద హద్నూర్ ఎస్ఐ సుజిత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బీదర్ వైపు నుంచి పల్సర్పై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండా వెంబడించి పట్టుకున్నారు. నిందితులను విచారించగా ముంగి, బసంత్పూర్ గ్రామ శివారులో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితులు బీదర్ జిల్లా చొండి తండాకు చెందిన అశోక్ ట్రాక్టర్ డ్రైవర్ కాగా, సురేశ్ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా సంపాదించే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడంతో చోరీల బాటపట్టారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి తులంన్నర బంగారం, రూ.15వేలు నగదు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు పలు చోరీ కేసుల్లో సైతం జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. బంగారం, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన జహీరాబాద్ డీఎస్పీ -
కొత్త వెర్షన్లో ఎరువుల బుకింగ్ యాప్
జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎరువుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వెర్షన్లో ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్ను రూ పొందించినట్లు, జిల్లా వ్యవసాయశాఖ అధి కారి స్వరూపరాణి శనివారం తెలిపారు. ప్రస్తు త వానాకాలం పంట సీజన్న్ను పురస్కరించుకొని రైతులందరికీ యూరియా, ఇతర రసాయన ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ వెర్షన్ యాప్ను అందుబాటులో తీసుకువచ్చిందన్నారు. అందువల్ల రైతులు గతంలో డౌన్లోడ్ చేసుకున్న యాప్ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు నూతనంగా మంజూరైన 86 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయు రాలు, ఆయాలుగా విధులు నిర్వహించడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. బోధకులకు గౌరవ వేతనం రూ.8 వేలు, ఆయాలకు రూ.6వేల వేతనం అందించనున్నారు. అర్హత కల్గిన మహి ళా అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 12న సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులను మండల విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. స్కాలర్షిప్కు ఏడుగురు విద్యార్థులు ఎంపిక చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ వాణికుమారి తెలిపారు. మోడల్ స్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థులు గౌతమ్, బిస్వంత్, భగవత్, దీక్షిత్, పావణి, మాధవి ఎంపికై నట్లు తెలిపారు. వీరికి నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ అందనుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆమె అభినందించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిజిల్లా వైద్యాధికారి డాక్టర్.లలితా దేవి రామచంద్రాపురం(పటాన్చెరు): సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్.లలితా దేవి అన్నారు. శనివారం రామచంద్రాపురం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రికార్డులు, నమోదు పుస్తకాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డా.కల్పన తదితరులున్నారు. యువకుడికి దేహశుద్ధి శివ్వంపేట(నర్సాపూర్): వివాహిత స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో వీడియో తీసిన వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహితను మూడు నెలల నుంచి ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు సాదు సురేశ్ వేధి స్తున్నాడు. శుక్రవారం ఆ మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా సురేశ్ సెల్ఫోన్లో వీడియో తీయడంతో గమనించిన ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో సురేశ్ కోసం వెతికారు. కాగా రాత్రి 10 గంటలకు ఇంటికి రావడంతో ప్రశ్నించగా నేను తీయలేదని చెప్పా డు. దీంతో సెల్ఫోన్ చెక్ చేయగా వీడియో ఉండటంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్రెడ్డి తెలిపారు. -
విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్
● కుమారుడికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కోసం డిమాండ్ ● పోలీసుల చొరవతో కిందకు.. చేగుంట(తూప్రాన్): ఇందిరమ్మ ఇల్లు మంజూరీ చేసి , తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు ఇలా... మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మారబోయిన నర్సింహులుకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు అనీల్ మృతి చెందాడు. చిన్న కుమారుడు అరుణ్ చదువుకున్నా ఉపాధి కోసం కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడికి ఉపాధి కల్పించాలని అధికారులను కోరుతూ వస్తున్నాడు. శనివారం గ్రామ శివారులో విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సాయంత్రం వరకు టవర్ దిగకపోవడంతో రామాయంపేట సీఐ సైదా, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి గ్రామానికి చేరుకొని నర్సింలుకు నచ్చజెప్పినా వినలేదు. ఎంపీడీఓతో మాట్లాడి రెండో విడతలో నర్సింలుకు ఇల్లు మంజూరీ చేయాలని కోరారు. గ్రామ సమీపంలోని ఓ ఫార్మా పరిశ్రమలో అరుణ్కు ఉపాధి కల్పించాలని పరిశ్రమ నిర్వాహకులతో సీఐ మాట్లాడారు. దీంతో శాంతించిన అతడు టవర్పై నుంచి కిందికి దిగాడు. గ్రామస్తులు పోలీసులు ఊపిరి పీల్చుకుని నర్సింహులును ఇంటికి పంపించారు.సెల్ టవర్ ఎక్కిన నర్సింహులు -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
తొగుట(దుబ్బాక): అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని లింగాపూర్లో శణివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తొంట నర్సింహులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారికున్న ఎకరం వ్యవసాయ భూమిని సాగు చేస్తూ, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఏడాది బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేసి పెద్ద కూతురు వివాహం చేశారు. అలాగే ఇళ్లు నిర్మించుకున్నారు. కూతురు వివాహానికి, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు వడ్డీలతో కలిపి సుమారు రూ.10లక్షలు అయ్యాయి. ఈ క్రమంలో అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని వేధించడంతో తీర్చేమార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లివస్తానని ఇంట్లో చెప్పివెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే కుటుంబీకులు 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు. -
విధులు ముగించుకొని వస్తుండగా..
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కోమటిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మహిపాల్ శివంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని రాత్రి బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ శివారులో సీడ్ కంపెనీ నుంచి రోడ్డుపైకి వస్తున్న లారీ ఒక్కసారిగా దూసుకొచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిపాల్ లారీ కింద ఇరుక్కుపోయి గంటసేపు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ఐదేళ్ల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం కోమటిపల్లిలో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మృతుని కుటుంబానికి అంత్యక్రియలు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఎస్ఐ బాలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొట్టడంతో మహిళ.. నంగునూరు(సిద్దిపేట): ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ పైనుంచి కారు దూసుకెళ్లడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బడే లక్ష్మి (54) వేసవి కావడంతో రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంటి ముందు పడుకుంది. ఈ క్రమంలో మద్దూర్కు చెందిన సలాది హరికృష్ణ కారులో వేగంగా వెళ్తూ ఆరుబయట నిద్రిస్తున్న లక్ష్మిపై నుంచి వెళ్లాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అల్లుడు అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పదంగా బాలుడు.. చిలప్చెడ్(నర్సాపూర్): అనుమానాస్పదంగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ రాములు వివరాల ప్రకారం... కౌడిపల్లి మండలం, పీర్ల తండాకు చెందిన దలావత్ వినోద్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే తండాకు చెందిన దలావత్ సిద్ధార్థకు చిలప్చెడ్ గ్రామంలో బైక్ మెకానిక్ షాపు ఉంది. సెలవులు కావడంతో సిద్ధార్థతో కలిసి, వినోద్ చిలప్చెడ్ మెకానిక్ షాపునకు వచ్చాడు. ద్విచక్ర వాహనాలను కడిగే పైపు సహాయంతో వినోద్, తన బట్టలు ఉతుక్కునే క్రమంలో అకస్మాత్తుగా కిందపడ్డాడు. గమనించిన సిద్ధార్థ చుట్టు పక్కల వారి సహాయంతో వినోద్ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కాగా వినోద్ తండ్రి మదన్, సిద్ధార్థను ఆరా తీయగా ఫిట్స్ వచ్చి కిందపడ్డాడని తెలిపాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి -
రాయరావు చెరువుకు మహర్దశ
నర్సాపూర్: స్థానిక రాయరావు చెరువులో బోటింగ్తో పాటు చెరువును సుందరీకరణ చేసి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యాటకంగా మరో అడుగు పడనుంది. ఇప్పటికే అటవీ శాఖ స్థానిక అడవుల్లో అర్బన్ పార్కు ఏర్పాటు చేయగా, సందర్శకుల తాకిడితో సందడిగా మారింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నర్సాపూర్ 50 కిలోమీటర్ల చేరువలో ఉంది. నర్సాపూర్, హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న శివారులోని అడవుల్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన అర్బన్ పార్కుకు మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ పార్కు సమీపంలోని అడవులను ఆనుకుని రాయరావు చెరువు ఉంటుంది. చెరువుకు ఒక వైపు రెండు పెద్ద గుట్టలు ఉంటాయి. అవి ఎప్పుడు పచ్చని చెట్లతో దర్శనమిస్తున్నాయి. చెరువులో బోటింగ్ వసతి ఏర్పాటు చేస్తే చెరువును ఆనుకుని ఉన్న గుట్టలు పర్యాటకులను మరింత కనువిందు చేయనున్నాయి.నర్సాపూర్ రాయరావు చెరువు పర్యాటకంగా అభివృద్ధి బోటింగ్, సుందరీకరణకు నిధులు మంజూరు సుందరీకరణకు నిధులు.. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి కృషితో ప్రభుత్వం చెరువులో బోటింగ్ ఇతర సదుపాయాలు కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. కాగా చెరువులో బోటింగ్ సదుపాయం, చెరువు సుందరీకరణ, కట్టపై వాకింగ్ ట్రాక్, మొక్కలు పెంచడం, లైటింగ్ సదుపాయం, పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సదుపాయాలు కల్పించాలని పర్యాటక శాఖ సూచించింది. -
18 మందికి రూ.63లక్షల జరిమానా
సంగారెడ్డి: నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపుల నుంచి తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల నమూనాలు సేకరించారు. వివిధ రకాల 18 మంది వ్యాపారులకు రూ. 63 లక్షల తొమ్మిది వేల జరిమానాను జిల్లా అదనపు కలెక్టర్ సంగీత విధించారు. తాము నిర్వహించిన తనిఖీల్లో నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపితే టెస్టింగులో నాణ్యత ప్రమాణాలు లోపించాయని పేర్కొన్నారు. దీంతో బాధ్యులకు పెనాల్టీ విధించారని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేశ్ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టునర్సాపూర్: గంజాయి అమ్మడానికి యత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం... నర్సాపూర్లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన నరేశ్గౌడ్, మండలంలోని రెడ్డిపల్లికి చెందిన నరేశ్ ఇతర ప్రాంతం నుంచి తెచ్చిన గంజాయిని స్థానిక పిల్లల పార్కు ఏరియాలో శనివారం అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని రిమాండుకు పంపించారు. వారి నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఓఆర్ఆర్పై కారు దగ్ధంజిన్నారం (పటాన్చెరు): ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటన బొల్లారం పరిధిలోని ఓఆర్ఆర్పై చోటు చేసుకుంది. గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్కు చెందిన స్కార్పియో కారు మేడ్చల్ నుంచి సుల్తాన్పూర్ వస్తుండగా కారు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి
సిద్దిపేటకమాన్: మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ మురళి వివరాల ప్రకారం... పట్టణంలోని బోయిగల్లికి చెందిన రాములుగౌడ్ (52) స్థానికంగా లాల్కమాన్ ప్రాంతంలో పానీపురి దుకాణం నిర్వహిస్తున్నాడు. రాములుగౌడ్ శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు కూడా తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు శనివారం వేములవాడ కమాన్కు సమీపంలో ఉన్న ఓ వైన్షాప్ పర్మిట్ రూమ్ సమీపంలో మురుగునీటి కాల్వలో రాములుగౌడ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో మురుగు కాలువలో పడి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు భానుప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వంటగ్యాస్ కోసం తోపులాట
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో భారత్ గ్యాస్ కార్యాలయం వద్ద గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారుల మధ్య శనివారం తోపులాట చోటు చేసుకుంది. కొద్ది నెలలుగా వంట గ్యాస్ కొరత ఏర్పడటంతో ఆన్లైన్ బుకింగ్తోపాటు వినియోగదారులకు ఓటీపీ విధానంతో గ్యాస్ను సరఫరా చేస్తున్నారు. అయినా సింగిల్ సిలిండర్ ఉన్న వారు గ్యాస్ అయిపోగానే వంటగ్యాస్ తక్షణం అవసరం ఉండటంతో సిలిండర్ బుక్ చేసుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ సిలిండర్ ఉన్నవారికి 35 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులకే బుక్ అవుతుందని పేర్కొంటున్నా.. 45 రోజుల తర్వాతనే బుక్ అవుతుందని వినియోగదారులు వాపోయారు. కాగా వంటగ్యాస్ కోసం భారత్గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన ప్రజలు సిలిండర్ల బుకింగ్ కోసం కార్యాలయం వద్ద తోపులాటకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్ మహిపాల్రెడ్డి వద్ద ప్రస్తావించగా.. ఖేడ్లో 35వేల కనెక్షన్లు ఉన్నాయని, నిత్యం 342 సిలిండర్లు సరఫరా జరుగుతుందన్నారు. ప్రస్తుతం 1,500 మంది బుక్ చేసుకున్న వారు వెయిటింగ్లో ఉన్నారని తెలిపారు. -
గిన్నిస్ రికార్డు కోసం పరుగు
తూప్రాన్: గిన్నిస్ రికార్డు కోసం ఓ మహిళ 5 వేల కిలోమీటర్ల పరుగు ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన సూఫీ సోఫియా కన్యాకుమారి నుంచి కరంకోరం వరకు చేపట్టిన ‘రన్ ఫర్ డ్రీమ్స్’ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్కు శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా గజ్వేల్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వేల కిలోమీటర్లను 80 రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 26 రోజులు పూర్తయినట్లు తెలిపారు. రోజుకు 50 నుంచి 70 కిలోమీటర్లు పరుగెత్తుతున్నట్లు వివరించారు. స్వాగతం పలికిన వారిలో గజ్వేల్ రన్నర్స్ రమేశ్ గౌడ్, మధుసూదన్, నరేశ్, కిరణ్ ఉన్నారు. -
ఉద్రిక్తతల మధ్య పాన్డబ్బాకు తాళం
నర్సాపూర్: ఉద్రిక్తతల మధ్య ఆక్రమించి నిర్మించిన పాన్షాపు, షెడ్డుకు రెవెన్యూ శాఖ, పోలీసుల సహాయంతో ఆర్టీసీ అధికారులు శుక్రవారం తాళం వేశారు. వివరాలిలా.. స్థానిక ఆర్టీసీ బస్టాండు ఇన్ గేట్ను ఆనుకుని నిర్మించిన షెడ్డును స్వాధీనం చేసుకోవాలని ఇటీవల జిల్లా కోర్టు ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా శుక్రవారం మెదక్ ఆర్టీసీ డిపో ఆఫీస్ సూపర్వైజర్ రాధాకృష్ణ, స్థానిక డిపో ఇన్చార్జి లక్ష్మణ్ మండల ఆర్ఐ ప్రభాకర్, పోలీసుల సహాయంతో షెడ్డు, పాన్డబ్బాలకు తాళం వేయడానికి వెళ్లగా యజమాని షర్పోద్దీన్ అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు. స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పగా షర్పోద్దీన్ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కాగా అక్కడే ఉన్న పోలీసులు ఇతర అధికారులు అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం షెడ్డు, పాన్డబ్బాలకు తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఆర్టీసీ ఉద్యోగులు జీవీగౌడ్, శ్రీనివాస్, రాథోడ్ తదితరులు ఉన్నారు. -
అయ్యో పాపం
దుబ్బాక: తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయస్సులో మాయదారి రోగం బారిన పడి ఆరేండ్ల చిన్నారి ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తిపాస్తులు అమ్మి ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. దీంతో చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవ్వడంతో ఆ తల్లిదండ్రులు సాయం చేయాలని దాతలను వేడుకుంటున్నారు. దినదిన గండంగా చిన్నారి.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన శివాంది లింగం, లాస్య దంపతులకు కొడుకు, కూతురు రియాన్షిక(6) ఉన్నారు. లింగం ప్రైవేట్ ఉద్యోగి. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబం. ఈ క్రమంలో రియాన్షిక పుట్టిన నెల రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు పరీక్షించి అరుదైన వ్యాధి తలసేమియాగా గుర్తించారు. దీంతో అప్పటి నుంచి ఆరేళ్లుగా ఆ చిన్నారి దినదిన గండంగా మంచానికి పరిమితమై ప్రాణాపాయ స్థితిలో కాలం గడుపుతోంది. బిడ్డను కాపాడుకునేందుకు చిన్నారి తల్లిదండ్రులు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం ఉన్న ఆస్తిని అమ్మి, అప్పులు చేసి రూ.34 లక్షలకు పైగా ఆస్పత్రుల్లో ఖర్చు చేశారు. చికిత్సకు మరో రూ.30 లక్షల వరకు కావాలని వైద్యులు ఎస్టిమేషన్ వేశారు. మానవతావాదులు, దాతలు ఆర్థికంగా చేయూత నందించాలని రియాన్షిక తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారి హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తలసేమియాతో బాధపడుతున్నఆరేళ్ల రియాన్షిక ఇప్పటికే ట్రీట్మెంట్కు రూ.34 లక్షలు ఖర్చు దాతల సాయం కోసం ఎదురుచూపులు -
పింఛను అక్రమాలకు కళ్లెం
● ఆగస్టు నుంచి లబ్ధిదారుల ఖాతాకే పింఛను డబ్బులు ● నగదు చెల్లింపులు బంద్ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందజేస్తున్న పింఛను పంపిణీల్లో అక్రమాలకు ఇక కళ్లెం పడనుంది. ఆగస్టు నుంచి ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛను జమ చేయనుంది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,51,955మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది. నారాయణఖేడ్: వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రతీ నెల రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016ల చొప్పున పింఛను అందజేస్తున్నారు. చాలామంది పింఛనుదారులకు గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు నగదు రూపంలో చెల్లిస్తున్నారు. గ్రామాల్లోని పోస్టాఫీసుల వద్ద లైన్లో వేచి ఉండి పింఛను డబ్బులు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పింఛను డబ్బులు చెల్లింపులో పైచిలుకు వచ్చే రూ.16లు చెల్లించడంలేదని, రౌండ్ ఫిగర్ డబ్బులు మాత్రమే అందజేసి పంపిస్తూ చిల్లర లేవంటూ దాట వేస్తున్నారు. ఇలా ప్రతీ నెల చెల్లింపుల్లో వేలాది రూపాయిలు వెనుకేసుకుంటున్నారు. ఏవైనా కొర్రీలు పెడతారేమోననే భయంతో పింఛనుదారులు సైతం ఆ రూ.16లు అడగకుండానే కిమ్మనకుండా వెళ్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నెల ఇంకా పింఛనురాలేదంటూ చెప్పి మళ్లీ నెలలో వస్తాయని పేర్కొంటూ ఒక నెల దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మ్యాన్యువల్ పద్ధతిలో పంపిణీ జరుగుతుండటంతో అక్రమాలకు ఆస్కారమేర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నేరుగా పింఛనుదారు బ్యాంకు ఖాతాలోనే జమ చేసేందకు ప్రభుత్వం నిర్ణయించింది. చాలా గ్రామాల్లో వృద్ధులు మరణించినా వారి పేర్లపై, కొన్ని బోగస్ పింఛన్ల పేర లబ్ధిపొందుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. కాగా పింఛనుదారులు అందరినీ ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) యాప్లో నమోదు పూర్తి చేసి మరణించిన, అనర్హుల వివరాలతో అధికారులు త్వరలో జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈనెలాఖరులోపు ఫేషియల్ రికగ్నేషన్ పూర్తి చేయనున్నారు. -
తొలకరికి ముందే పత్తి విత్తు పనులు
నారాయణఖేడ్: వర్షాకాలం ప్రారంభం కాకముందే రోహిణి కార్తెలోనే రైతులు పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈనెల 8న మృగశిర కార్తె ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రైతులు ఆశించి పత్తి సాగు పనులు ప్రారంభించేశారు. నాలుగు రోజుల క్రితం ప్రాంతంలో మోస్తారు వర్షం కురియగా గురువారం భారీ వర్షం కురిసింది. రెండు వర్షాలకు నల్లరేగడి భూములు కాస్త నానడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. నాగల్గిద్ద మండలం డోవూరు శివారులో కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తే పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోను పత్తి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి వర్షాలు కాస్త తక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా రైతులు కొంత ముందస్తు వ్యవసాయ పనుల్లో నిగమ్నవుతున్నారు. -
పారదర్శకంగా బదిలీలు
జహీరాబాద్ టౌన్: వైద్యశాఖలో బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వద్ద శుక్రవారం వైద్యులు, నర్సులు నిరసన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..వైద్యుల బదిలీలు ప్రభుత్వ జారీ చేసిన జీఓ నం.38 నిబంధనలకు అనుగుణంగా జరగడంలేదని, ఏకపక్షంగా నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా స్పౌస్ బదిలీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యులు సమర్పించిన రిక్వెస్టు బదిలీలను మంజూరు చేయాలని కోరారు. పారదర్శకత కోసం ఆఫ్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
ములుగు(గజ్వేల్): పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, జీవవైవిధ్య నష్టాన్ని నివారించడానికి అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి, చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ వినయ్కుమార్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు అటవీ కళాశాల పరిశోధన సంస్థలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి అందరం బాధ్యత వహించాలని కోరారు. రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్, చీఫ్ కన్జర్వేటర్ డా.ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. పర్యావరణ విద్య, సామర్థ్య వృద్ధి ప్రజల భాగస్వామ్యం ద్వారానే దీర్గకాలిక స్థిరాభివృద్ధి సాధ్యమన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణలో అడవుల పాత్ర అత్యంత కీలకమని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లానింగ్, మానిటరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎన్. ఉమేశ్ పేర్కొన్నారు. పరిశోధన విధానాలు ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సమర్థవంతంగా సాగుతుందని టీఎస్ఎఫ్డీసీ శాస్త్రవ్తేత్త, రీసెర్చ్ కన్సల్టెంట్ డా. శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, గాయకుడు పర్యావరణవేత్త జయరాజు ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ కులకర్ణి శశికాంత్, అటవీ కళాశాల డీన్ బి.ప్రవీణ, అధ్యాపకులు, అటవీశాఖ అధికారులు, పర్యావరణ నిపుణులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.మొక్కలు నాటుతున్న వినయ్కుమార్రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణఅధికారి వినయ్కుమార్ -
జొన్న రైతుల పడిగాపులు
నారాయణఖేడ్: జొన్న కొనుగోలు కేంద్రాలకు పంట తెచ్చిన రైతులు కొనుగోళ్ల కోసం రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మనూరు, నాగల్గిద్ద మండల కేంద్రాల్లో జొన్నల కొనుగోళ్లను మనూరు పీఏసీఎస్ సొసైటీ ద్వారా చేపట్టారు. అష్టకష్టాలు పడి టోకెన్లు పొందిన పలువురు రైతులు నాగల్గిద్ద పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి జొన్నలు తీసుకురాగా రెండు రోజులుగా తూకం వేయడంలేదు. ఉజలంపాడ్, వల్లూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు కేంద్రం వద్ద సరుకులను వాహనాల్లో ఉంచి వర్షంలోనే ఇబ్బందులు పడుతున్నారు. భోజనాలు తినకుండా అవస్థలు పడుతూ కేంద్రం వద్ద పడిగాపులు పడుతు న్నారు. రెండు రోజులు కావడంతో వాహనాల కిరాయి కూడా పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ
మెదక్జోన్: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రక్షణ, వైద్య సహాయం, కౌన్సిలింగ్, పునరావాస సేవలు సమర్థ వంతంగా అందించాలని సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై నమోదవుతున్న కేసు ల్లో వేగవంతమైన దర్యాప్తు జరగడంతో పాటు బాధితులకు అవసరమైన అన్ని సేవలు సకా లంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సేవల కల్పనలో పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, భరోసా కో–ఆర్డినేటర్ సౌమ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతిమెదక్జోన్: ఉపాధ్యాయుల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ ఎంపీని కోరారు. శుక్రవారం ఆయన తపస్ జిల్లా బాధ్యులతో కలిసి ఎంపీ రఘునందన్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, శ్రీధర్ రెడ్డి, ఆంజనేయులు, రాజు, కిషన్ పవర్, తదితరులు ఉన్నారు. జీఓ 38ని పారదర్శకంగా అమలు చేయాలి దుబ్బాక: ప్రభుత్వం వైద్యశాఖలో చేపడుతున్న ఆన్లైన్ బదిలీలను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు జీఓ 38ని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట టీజీజీడీఏ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని లేనిచో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, డాక్టర్ హేమరాజ్సింగ్, ఏవీ శ్రీనివాస్, ముఖేశ్, ఐశ్వర్య, స్టాప్నర్సులు, తదితరులు ఉన్నారు. వివాహిత అదృశ్యంపటాన్చెరు టౌన్: వివాహిత అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జేపీ కాలనీ డివిజన్కు చెందిన కుమార్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. శుక్రవారం లేచి చూడగా భార్య రాధిక(40) కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. భార్య కోసం తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య అదృశ్యంపై కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు వెల్దుర్తి(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని ఓ మద్యం షాపు ఎదుట వెల్దుర్తి నుంచి జలాల్పూర్ వెళ్తున్న ఆటో, మెదక్ నుంచి వస్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న మండలంలోని బండపోసాన్పల్లికి చెందిన తుమ్మల నితిన్(20)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని పోలీసులు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
సంత.. తీరిన చింత
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామంలో ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న వారాంతపు సంతకు విశేష స్పందన లభిస్తోంది. సంతలో అన్ని వస్తువులు లభిస్తుండటంతో ప్రజలకు పట్టణానికి వెళ్లే బాధ తప్పింది. మల్చెల్మతోపాటు పరిసర గ్రామాల ప్రజలు కనీసం కూరగాయలు కొనుగోలు చేసేందుకు సైతం జహీరాబాద్కు రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ సర్పంచ్తోపాటు పెద్దలు నిర్ణయించి వారాంతపు సంత నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు వారాంతపు ప్రారంభించగా తాజా కూరగాయలతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు, పనిముట్లు, బట్టలు, ప్లాస్టిక్ సామగ్రి అందుబాటులోకి వచ్చాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు కొనుగోళ్లకు సంతకు రావడంతో మంచి స్పందన వస్తుంది. వారాంతపు సంత వల్ల తమ చింత తీరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నగల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలిని నమ్మించి, బెదిరించి చెవి బంగారు కమ్మలు అపహరించిన కేసులో ఇద్దరిని రిమాండ్ చేశారు. శుక్రవారం తూప్రాన్ సీఐ వెంకట్రాజగౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 30న మండలంలోని రామాయిపల్లికి చెందిన రాపర్తి రాజమ్మ ఆరెగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి సెంట్రల్ బ్యాంక్ వద్ద వేచి ఉంది. ఈ క్రమంలో నర్సాపూర్కు చెందిన ఆటో డ్రైవర్లు శ్రీకాంత్, శైలని ఆరెగూడెంలో దింపుతామని నమ్మబలికి ఆటోలో ఎక్కించుకున్నారు. ఆరెగూడెం స్టేజీ వద్ద దింపకుండా వృద్ధురాలిని భస్వాపూర్ శివారులోని చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బంగారు చెవి కమ్మలను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సాపూర్ తూప్రాన్ బ్రిడ్జి వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును దుండగులు విక్రయించిన కృష్ణ జ్యువెల్లరి, కొత్తూరు నుంచి స్వాధీనం చేసుకొని, ఆటోను సీజ్ చేశారు. -
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కోర్టులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పర్యావరణాన్ని పెంపొందించడంతోపాటు వనమహోత్సవం లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం(పటాన్చెరు): జీవితాంతం కార్మికుల సంక్షేమం, తెలంగాణ కోసం ఆలోచించిన నిస్వార్థ నాయకుడు జి.ఎల్లయ్య అని అందుకే నేడు పార్టీల కతీతంగా అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని మాజీమంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జీ బ్లాక్లో శుక్రవారం జరిగిన కార్మిక నేత జి.ఎల్లయ్య 85వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్లయ్య కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్ రెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లయ్య కార్మిక నాయకుడిగానే కాకుండా చివరిశ్వాస వరకు నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడన్నారు. భెల్ పరిసర ప్రాంతంలో ఆయన పేరు తెలియని వారు లేరని, ఒక సాధారణ కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన జాతీయస్థాయి కార్మిక నేతగా ఎదిగారని వివరించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన ఎల్లయ్య విగ్రహం ఆయన స్థాయికి తగినట్టుగా లేదని త్వరలోనే మంచి స్థలంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దాని బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఇస్తున్నట్లు తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్రావు రామచంద్రాపురం(పటాన్చెరు): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, తెల్లాపూర్ను ప్లాస్టిక్రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎంపీ ఎం.రఘునందన్రావు పిలుపునిచ్చారు. తెల్లాపూర్ డివిజన్లో శుక్రవారం సాయంత్రం తేనా గ్రీన్ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగిన అనర్థాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఐటీ ఉద్యోగులు పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ఆర్మీ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించడం హర్షదాయకమన్నారు. కార్యక్ర మంలో దిశ కమిటీ సభ్యడు కాసర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు టౌన్: పటాన్చెరుకు చెందిన వర్షిణీరెడ్డి ఐదేళ్ల లాసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ప్రతిభ చాటుకుంది. కేవలం నెలరోజుల పాటు ప్రణాళికాబద్ధంగా చదివి ఈ ఘనత సాధించినట్లు ఆమె వెల్లడించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తండ్రి కొల్కూరి శంకర్సేన్రెడ్డి కోరిక మేరకు లాసెట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపింది. వర్షిణీరెడ్డి మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి మనవరాలు కావడం విశేషం. -
ప్రజాసొమ్ము.. నకిలీ బిల్లులతో స్వాహా
రామాయంపేట(మెదక్): మున్సిపల్ నిధులను స్థానిక అఽధికారులు దుర్వినియోగం చేస్తున్నారని కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కౌన్సిలర్లు నాగరాజు, దేవుని రంజిత్, జిల్లా నాయకులు యాదగిరి, గణేశ్, స్వామి, కోఆప్షన్ సభ్యుడు యాదగిరి శుక్రవారం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నకిలీ బిల్లులతో రూ.లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ట్రాక్టర్లు, ఆటోలకు డీజిల్ విషయంలో భారీ స్థాయిలో దుర్వినియోగానికి పాల్పడ్డారని, గతంలో ప్రతి నెలా డిజిల్ ఖర్చు రూ. 90 వేల వరకు కాగా, ఈ నాలుగైదు నెలల్లో ఏకంగా రూ. రెండు లక్షలు దాటిందన్నారు. ట్రీ గార్డుల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే, కలెక్టర్తోపాటు విజిలెన్సు అధికారులకు సాక్ష్యాలతో ఫిర్యాదు చేశామని, త్వరలో విచారణ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.మున్సిపల్ కౌన్సిలర్ల ఆరోపణ -
జాతీయ రహదారిపై భద్రతా చర్యలు
పటాన్చెరు టౌన్: రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి–65 పై సంగారెడ్డి నుంచి పటాన్చెరు వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు, వాటర్ లాగింగ్ పాయింట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల తరలింపు, నీటి పైప్లైన్ల షిఫ్టింగ్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...బ్లాక్ స్పాట్ల వద్ద తాత్కాలిక భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేసి మూసివేయాలన్నారు. అవసరమైన చోట వాటర్ పైప్లైన్లను వెంటనే షిఫ్ట్ చేయడంతోపాటు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తరలించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణకు ప్రభావితమవుతున్న నివాస భవనాల యజమానులకు పరిహారం చెల్లించి తొలగింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోశ్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్, డీఎస్పీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వాగులు, కాలువలు కబ్జా చేస్తే చర్యలే సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రహదారి మీదుగా వెళ్లే వాగులు, కాలువలు కబ్జాలకు గురైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. మండలంలోని పెద్దాపూర్ శివారులో రానున్న వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న రోడ్డును ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి
హవేళిఘణాపూర్(మెదక్): OÆð‡™èl$Ë$ JMóS-Æý‡MýS… ç³…rË$ M>MýS$…yé {ç³™éÅÐ]l*²Ä¶æ$ ç³…r-ÌS¯]l$ G…^èl$-Mø-ÐéÌS° yîlHK §ólÐŒæ-MýS$Ð]l*ÆŠ‡ A¯é²Æý‡$. Ô¶æ${MýS-ÐéÆý‡… Ððl$§ýlMŠS HK M>Æ>ÅÌS-Ķæ*°² BĶæ$¯]l ™èl°T ^ólÔ>Æý‡$. BƇ$$-ÌŒæ-¸ëÐŒl$ MøçÜ… §ýlÆý‡RêçÜ$¢ ^ólçÜ$-MýS$¯]l² OÆð‡™èl$ÌS VýS$Ç…_ AyìlW ™ðlË$-çÜ$-MýS$¯é²Æý‡$. Ððl$§ýlMŠS Ð]l$…yýlÌS… Æ>Ƈ$$¯ŒSç³-ÍÏMìS ^ðl…¨¯]l OÆð‡™èl$ ^øÌS ç³Ð]l¯ŒS Hyðl-MýS-Æ>ÌS BƇ$$-ÌŒæ-¸ëÐŒl$ ç³…r¯]l$ ÝëVýS$ ^ólõÜ…-§ýl$MýS$ Ð]l¬…§ýl$MýS$ Æ>V> BĶæ$¯]l ¯]l$…_ §ýlÆý‡RêçÜ$¢ ïÜÓMýS-Ç…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$™èl*.. BƇ$$-ÌŒæ¸ëÐŒl$ ÝëVýS$ ^ólçÜ$-MýS$¯]l² OÆð‡™èl$-ÌSMýS$ 90 Ô>™èl… çܼÞyîl Ððl¬MýSPË$ A…§ýl-gôæ-Ķæ$-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. OÆð‡™èl$ çܼÞyîl ´ù¯]l* GMýS-Æ>MýS$ Æý‡*.1100 yîlyîl ¡íÜ A…§ýl-gôæõÜ¢ {yìl‹³ÌZ MýS*yé Æ>Ƈ$$¡ MýS͵-çÜ$¢…-§ýl¯é²Æý‡$. D AÐ]l-M>-Ô>°² OÆð‡™èl$Ë$ çܨ-Ó°-Äñæ*VýS… ^ólçÜ$MøÐéÌS° MøÆ>Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ HDKË$ {糆¿ýæ, {ç³Ô>…™Œæ, Æ>f-Ôóæ-QÆŠ‡ ´ëÌŸY-¯é²Æý‡$.దడీఏఓ దేవ్కుమార్ -
ప్రకృతి వనరులను సంరక్షిద్దాం
నర్సాపూర్: భవిష్యత్ తరాలకు సుస్థిర జీవన వాతావరణాన్ని అందించేందుకు ప్రకృతి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అబ్రదీప్ మజుందర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో సేవ్ క్లైమేట్ అండ్ సేవ్ ఎర్త్ అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్దూబె, సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడీ కృష్ణారావు,మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేశ్ పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో డ్రైవర్ ఆత్మహత్య
దుబ్బాక: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ కీర్తి రాజు కథనం ప్రకారం... పట్టణానికి చెందిన ప్రైవేట్ వాహన డ్రైవర్గా ఆస సురేశ్(40) పనిచేస్తున్నాడు. డబుల్ బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్న అతడు ఓ మహిళకు ఫోన్పే ద్వారా డబ్బులు పంపించాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఉదయమే ఇంట్లో నుంచి వెళ్లిన బోడోనికుంట వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బుల విషయంలో మనస్తాపానికి గురై.. పటాన్చెరు టౌన్: డబ్బుల విషయంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన శ్యామ్ కుమార్(25) నాలుగు నెలల క్రితం వచ్చి ఇస్నాపూర్ పరిధిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తున్నాడు. కాగా అతడికి రూ.2 లక్షల వరకు అప్పులున్నాయని..డబ్బులు కావాలని తన అన్న చక్రధారిని అడిగాడు. ఈ నెల 3న చక్రధర్ అతని భార్య నాగలక్ష్మితో కలిసి ఇస్నాపూర్కి వచ్చి తమ్ముడికి డబ్బుల విషయంపై మాట్లాడి వెళ్లిపోయారు. వారు వెళ్లిన మరుసటి రోజు బుధవారం శ్యామ్ కుమార్ బాత్రూంలో ఉరివేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న చక్రధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ యువకుడు.. దుబ్బాక: చికిత్స పొందుతూ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. ఎస్ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బాక పట్టణానికి చెందిన డెకరేషన్ పనులు చేసే కాల్వ నరేశ్(25) ఈ నెల 2న లచ్చపేట శివారులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదంలో యువకుడి ఆత్మహత్యాయత్నం సిద్దిపేటరూరల్: ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం నారాయణరావుపేట మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత యువకుడి తండ్రి నర్సింగోజు కృష్ణమూర్తి వివరాల ప్రకారం... గ్రామంలోని సర్వే నం. 1306లోని తమ కుటుంబ సభ్యులైన నర్సింగోజు విజయ్ కుమార్, నర్సింగోజు విష్ణుమూర్తిలకు సంబంధించి 585 గజాల స్థలాన్ని నారాయణరావుపేటకు చెందిన రఘువీర్ శాస్త్రికి విక్రయించారు. కాగా ఆయన 422 గజాల స్థలానికి మాత్రమే డబ్బులు చెల్లించి మిగతావి చెల్లించడం లేదు. ఈ విషయమై మాట్లాడుకునేందుకు గత ఆదివారం రఘువీర్ శాస్త్రి నారాయణరావుపేటకు పిలిపించాడు. అక్కడ మాట్లాడుకుంటున్న సమయంలో మాటామాటా పెరగడంతో ఆయన తన అనుచరులతో కలిసి నర్సింగోజు కృష్ణమూర్తి, విజయ్ కుమార్, అమర్పై దాడి చేశారు. దీంతో తమనే కొట్టి తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. డబ్బులు రాక, దాడికి గురై, చివరకు న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురైన నా కుమారుడు అమర్ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ రాజేశ్ను వివరణ కోరగా.. ఇరువురు కొట్లాడుకున్న అనంతరం ఫిర్యాదు మేరకు అమర్పై కేసు నమోదు చేశామని, విచారణలో భాగంగా అమర్తో పాటు ఉన్న వ్యక్తుల వివరాలివ్వాలని కోరినా ఇవ్వలేదు. కేసును తప్పు దోవ పట్టించేందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. -
భూమికి రెక్కలు
● అత్యధికంగా ఆర్సీపురంలో భూముల విలువ పెంపు ● అమలులోకి పెరిగిన స్థిరాస్తులరిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువ ● గజం విలువ రూ.39 వేల నుంచి రూ.49 వేలకు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో అత్యధికంగా రామచంద్రాపురం (ఆర్సీపురం)లో నివాస స్థలాల (ఓపెన్ప్లాట్ల) మార్కెట్ విలువ పెరిగింది. ఇక్కడ ఇప్పటివరకు గజానికి రూ.39,200 ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతంలో గజం మార్కెట్ విలువను రూ.49,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా రామచంద్రాపురంలోని కమర్షియల్ ఏరియాలోని నివాస స్థలాలకు ఈ మార్కెట్ విలువగా నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ మెయిన్ రోడ్డుకు గజం రూ.లక్షకు పైనే పలుకుతోంది. వ్యాపార, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంలో క్రయవిక్రయాలు చాలా తక్కువేనని రిజిస్ట్రేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రియల్ఎస్టేట్ పరంగా దూసుకుపోతున్న తెల్లాపూర్, కొల్లూరు, అమీన్పూర్లలో నివాస స్థలాల మార్కెట్ విలువలు కూడా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు గజానికి రూ.15,200 ఉన్న విలువ ఇప్పుడు రూ.19 వేలకు పెంచారు. ఇంద్రేశం, చిట్కుల్, రుద్రారం వంటి ప్రాంతాల్లో కూడా గజం రూ.2,100 ఉన్న ప్లాట్ల మార్కెట్ విలువ రూ.3,700లకు పెంచారు. నివాస స్థలాలతో పాటు, ఫ్లాట్లు, భూముల మార్కెట్ విలువను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ఈ విలువలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. తక్కువ ఉన్న చోట్ల మూడు రెట్లు.. ఇప్పటి వరకు ఓపెన్ ప్లాట్లకు సంబంధించి తక్కువలో తక్కువ మార్కెట్ విలువ ఒక గజానికి రూ.700 ఉండేది. ఇప్పుడు ఈ కనీస మార్కెట్ విలువ ఇప్పుడు ఏకంగా రూ.2,000 వేలకు పెంచారు. అంటే దాదాపు 300 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. దీంతో తక్కువ ధర ఉన్న ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగనుంది. వారం రోజులుగా కిక్కిరిసిన ఎస్ఆర్ఓలు ఇప్పుడు వెలవెల.. శుక్రవారం నుంచి పెరిగిన మార్కెట్ ధరలు అమలులోకి వస్తుండటంతో గురువారం వరకు ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. మార్కెట్ విలువలు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువవుతాయని చాలామంది వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. దీంతో వారం రోజులుగా సాధారణ రోజుల కంటే సుమారు 40 శాతం రిజస్ట్రేషన్ల సంఖ్య పెరిగినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని కార్యాలయం పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెంచిన విషయం విదితమే. పెరిగిన ధరలు అమలులోకి వచ్చాక శుక్రవారం ఎస్ఆర్ఓ కార్యాలయాలు కాస్త వెలవెలబోయాయి. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్ విలువ కూడా భారీగానే పెరిగింది. చదరపు అడుగుకు రూ.2,200 ఉన్న అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్ విలువ ఇప్పుడు ఏకంగా రూ.2,700లకు పెంచారు. రూ.2,500 ఉన్న ఫ్లాట్లను రూ.3,000లకు పెంచారు. దీంతో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై మరింత భారం పడుతోంది. ఫ్లాట్ల మార్కెట్ విలువను ఆయా ప్రాంతాలను బట్టి కనీసం 20 శాతం నుంచి 50 శాతం మేరకు పెరగడం గమనార్హం. -
జూన్.. టెన్షన్
ఈ నెలలోనే స్కూళ్లు, సాగు ప్రారంభంసంగారెడ్డి క్రైమ్ /సంగారెడ్డి టౌన్: జూన్ మాసం వచ్చిందంటే అటు పిల్లలను స్కూలుకు పంపించే తల్లిదండ్రులకు, ఇటు వ్యవసాయం చేసే రైతులకు భారీ ఖర్చులుంటాయి. ఈ నెలలో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు పెనుభారంగా మారుతున్నాయి. పిల్లల యూనిఫామ్, పుస్తకాలు అవసరాలకు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంటి నుంచి పాఠశాలకు పిల్లల రవాణా వంటి ఖర్చులతో సతమతం అవుతుంటారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించాలనే అత్యాశతో ఆయా తల్లిదండ్రులు అప్పులపాలు కావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాగు ఖర్చులు జూన్ ప్రారంభంలోనే సాగు కోసం అన్నదాత అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్ ఖర్చులతో పాటు ఎరువులు, విత్తనాలకు ఖర్చు అవుతుంది. దానికి తోడు రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ఖర్చులు పెను భారం అవుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి డబ్బులను ఖర్చు చేసే పనులే ఉంటాయి.భారీగా ఫీజులు 2026–27 విద్యాసంవత్సరానికి పట్టణంలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు భారీగా ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులపై తీవ్రత ప్రభావం పడుతుంది. ప్రీ ప్రైమరీ, యూకేజీ, ఎల్కేజీ తరగతుల్లో స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, బస్ఛార్జీలతో కలిపి రూ.70 వేలకు పైగా అవుతున్నాయి. దీనికి తోడు అదనపు ఖర్చులన్నీ మరో పదివేలు మీద మీద పడుతున్నాయి. జిల్లాలో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ధరలు పెరిగాయి పంటలు వేయడానికి కావలసిన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయాలంటే ధరలు పెరిగిపోయాయి. వీటికి తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. – రాములు, రైతు, ఇరిగిపల్లి, సంగారెడ్డిఫీజుల మోత పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి. రోజురోజుకు విద్యాసంస్థలు ఫీజులు పెంచుతున్నాయి. పుస్తకాలు, యూనిఫాం, తదితర రవాణా ఖర్చులతో భారం పడనుంది. – శాంతిప్రియ, గృహిణి, సంగారెడ్డి పేద, మధ్య తరగతిపై భారం ఫీజుల మోత, మరోవైపు నిత్యావసర ధరలు అన్నదాతలకు సైతం సాగు పెట్టుబడులు -
సేంద్రియ సాగుతోనే పర్యావరణ హితం
జహీరాబాద్/ఝరాసంగం(జహీరాబాద్): రానున్న రోజుల్లో సేంద్రియ వ్యవసాయానికే భవిష్యత్తు ఉందని, క్రమంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు మండల కేంద్రమైన ఝరాసంగం రైతు వేదికలో ఫర్టిలైజర్ దుకాణ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. పంటల సాగుకు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని శివప్రసాద్ హెచ్చరించారు. సేంద్రీయ వ్యవసాయంతో పర్యావరణం సమతుల్యంగా మారుతుందన్నారు. రసాయన ఎరువులు వాడటం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని, భూములు నిస్సారం అవుతున్నాయని వివరించారు. బయోచార్తో ఎరువులుబయోచార్ ద్వారా ఎరువులను తయారు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. అడవులు అంతరించిపోవడం వల్ల కూడా పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఎల్నినో వల్ల 10% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని అనువుగా ఉండే పంటలనే సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కృష్ణతేజ, ఏడీఏ భిక్షపతి, కేవీకే శాస్త్రవేత్తలు గౌరీశంకర్, వరప్రసాద్, రమేశ్, స్నేహలత, శైలజ, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్, డీడీఎస్ వైస్ చైర్మన్ రుక్మిణిరావు, ఈడీ దివ్య, బయోచార్ నిపుణులు సాయి భాస్కర్, మట్టి పరీక్షల నిపుణులు స్వామి, ఆయా ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ -
నిర్లక్ష్యం చేస్తే మిల్లర్లపై చర్యలు
అదనపు కలెక్టర్ సంగీత హత్నూర(సంగారెడ్డి): రైస్ మిల్లర్లు ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, అనుమతులను సైతం రద్దు చేస్తామని అదనపు కలెక్టర్ సంగీత హెచ్చరించారు. హత్నూర మండలం దౌల్తాబాద్, కాసాల, బోరపట్ల గ్రామ శివారులలోని రైస్మిల్లులను గురువారం ఆమె పరిశీలించారు. ధాన్యం లోడు లారీలను వెంటనే కూలీల చేత ఖాళీ చేయించాలని లేకుంటే ధాన్యం నిలువల తరలింపులో ఆలస్యం జరుగుతోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తూకం వేసి లారీలో రైస్ మిల్లుకు వచ్చిన తర్వాత ఆలస్యం జరగనివ్వకుండా హమాలీల చేత లారీలను అన్లోడ్ చేయాలని ఆదేశించారు. రైస్మిల్లుల వద్ద ధాన్యం లారీలు ఎక్కువగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. పకడ్బందీగా ఓటరు మ్యాపింగ్ఆర్డీఓ దేవూజా జహీరాబాద్ టౌన్: ఓటరు మ్యాపింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీఓ దేవూజా అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం బీఎల్ఓ, సూపర్వైజర్లకు పీపీటీ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో దేవూజా పాల్గొని మాట్లాడారు. మ్యాపింగ్ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు తులసీరాం రాథోడ్, శ్రీనివాస్ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులకు సంబంధించిన దరఖాస్తుల విధానం తదితర అంశాలపై బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 8న అప్రెంటిషిప్ మేళాహత్నూర( సంగారెడ్డి): ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తమ క్యాంపస్లో ఈనెల 8న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు హత్నూర ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ట్రేడ్లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అప్రెంటిషిప్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనుందని, ఆసక్తిగల అభ్యర్థులు సంస్థ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని విద్యార్హత ధ్రువపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి: గూడెం పటాన్చెరు టౌన్: మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో ఆయనను కలిసిన గూడెం శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హరీశ్రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, చిరకాలం ప్రజాసేవలో ఉండాలని ఆయన అభిలషించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి రాజీనామానారాయణఖేడ్: బీజేపీ జిల్లా కార్యదర్శి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి అరుణ్ శేరికార్ గురువారం రాజీనామా చేశారు. పార్టీలో క్రమశిక్షణతోనే తాను మెలిగానని తన పనిని మెచ్చి పార్టీలో కీలకమైన పదవినిచ్చి గౌరవించినందుకు పార్టీశ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని అనివార్యకారణాల వల్ల మాత్రమే రాజీనామా చేస్తున్నాని పేర్కొంటూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరికి రాజీనామా లేఖను పంపించారు. -
ఫ్యూచర్లోకి సంగారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర వాణిజ్య పన్నుల (జీఎస్టీ) శాఖను పునర్ వ్యవస్థీకరించిన రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి డివిజన్ను ఫ్యూచర్ సిటీ సర్కిల్లో విలీనం చేసింది. అలాగే మెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లతోపాటు, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్ను కూడా ఫ్యూచర్సిటీ సర్కిల్లో కలిపారు. ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యూచర్సిటీ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం విదితమే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఫ్యూచర్సిటీని వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించిన కొత్త డివిజన్గా మార్చింది. రీజనల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) లోపల (ప్యూర్ ఏరియా) ఉన్న డివిజన్లన్నింటినీ కూడా ఈ ఫ్యూచర్సిటీ సర్కిల్లో విలీనం చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోని ఈ నాలుగు సర్కిళ్లు నిజామా బాద్ డివిజన్ పరిధిలో ఉండేవి. ఈ మేరకు ప్రభు త్వం ఇటీవల జీఓ నెంచి 126ను జారీ చేసింది. నిజామాబాద్ డివిజన్లో జహీరాబాద్.. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ సర్కిల్ను మాత్రం నిజామాబాద్ డివిజన్లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మెదక్, సిద్దిపేట ప్యూర్ ఏరియా పరిధిలో ఉన్న ఆశాఖ సర్కిళ్లను కూడా నిజామాబాద్ డివిజన్ పరిధిలోనే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ప్యూర్ ఏరియా పరిధిలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిళ్లను మాత్రం శేర్లింగంపల్లి సర్కిల్లో విలీనం చేశారు. ఇలా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన సర్కిల్ కార్యాలయాలన్నీ మూడు భాగాలుగా విడిపోయాయి. ఈ వాణిజ్య పన్నుల శాఖకు అత్యధికంగా జీఎస్టీ చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ను సైతం శేర్లింగంపల్లి డివిజన్లో విలీనం చేశారు. ఇప్పటివరకు ఈ బీహెచ్ఈఎల్ నిజామాబాద్ డివిజన్లో కొనసాగింది. సంగారెడ్డి నుంచే ఖజానాకు కాసుల గలగల.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు అత్యధిక పన్ను రాబడి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే ఎక్కువ. ఇక్కడ పరిశ్రమలతోపాటు, వ్యాపార సంస్థల నుంచి అత్యధికంగా జీఎస్టీ, ఇతర పన్నుల ఆదాయం లభిస్తుంది. ప్రధానంగా సంగారెడ్డి సర్కిల్ నుంచే రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల ఉంటుంది. ఇందుకు ఇక్కడ వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే ఫార్మా, బల్క్డ్రగ్, ఇంజనీరింగ్ మ్యాన్ఫ్యాక్చరింగ్ పరిశ్రమలే కారణం. బీహెచ్ఈఎల్తోపాటు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ భారీ పరిశ్రమలు ప్రతినెలా రూ.కోట్లలో జీఎస్టీలు, ఇతర పన్నులు చెల్లిస్తుంటాయి. అలాగే వ్యాపారులు, వ్యాపార సంస్థలు కూడా ప్రతినెలా జీఎస్టీ చెల్లింపులు ఉంటాయి. ఇలా వాణిజ్యపన్నుల రాబడిలో సంగారెడ్డి జిల్లా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పోటీ పడుతోంది. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ శాఖ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. -
చావ్రస్తాలు!
తరచూ ప్రమాదాలు ● నివారణ చర్యలు తీసుకోవడంలో జాప్యం జహీరాబాద్ టౌన్: జాతీయ రహదారిపై పలు చౌరస్తాలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఫోర్లేన్ రోడ్డుగా విస్తరించిన చౌరస్తాల వద్ద ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోనందున తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాలను ‘బ్లాక్స్పాట్’లుగా గుర్తించిన రోడ్లు భవనాల శాఖ అధికారులు అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మాణంలో మాత్రం ఎడతెగని జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్–ముంబై జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి పట్టణం పక్కనుంచి బైపాస్ నిర్మించారు. బైపాస్ రోడ్డుపై ప్రధాన చౌరస్తాల వద్ద అండర్ బ్రిడ్జిలు నిర్మించనందున ప్రమాదాలు జరిగి చాలామంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. జహీరాబాద్ బైపాస్ రోడ్డులో అల్గోల్ చౌరస్తా, రాయిపల్లి(డి), కోహీర్ మండలంలోని దిగ్వాల్, కొత్తూర్(డి) చిత్తల్ఘాట్, హుగ్గెలి, బూచినెల్లి, సత్వార్ చౌరస్తాలు డెత్ స్పాట్లుగా మారాయి. బ్లాక్స్పాట్గా అల్గోల్ చౌరస్తా బైపాస్ రోడ్డులోని అల్గోల్ చౌరస్తా మరీ ప్రమాదకరంగా తయారైంది. అల్గోల్, భరత్నగర్,ఎల్గోయి, దిడ్గి, పొట్పల్లి తదితర గ్రామాల ప్రజలు చౌరస్తా దాటి వెళ్లాల్సి వస్తోంది. జాతీయ రహదారి కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉన్నందున రోడ్డు దాటేందుకు సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దాటే సమయంలో వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఇప్పటివరకు పలు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది గాయపడ్డారు. అల్గోల్ చౌరస్తాను ‘బ్లాక్స్పాట్’గా గుర్తించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వాహనాల వేగం నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లు ఏర్పాటు చేయలేదు. అల్గోల్లో చౌరస్తా విషయమై ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసి చౌరస్తాలో అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అయినా ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చౌరస్తాల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ప్రమాదకరంగా కల్వర్టు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ నుంచి హౌసింగ్ బోర్డుకు వెళ్లే రోడ్డు మధ్యలో నిర్మించిన కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. స్లాబ్ ధ్వంసమై గుంత పడి ఇనుపకడ్డీలు పైకి తేలడం వల్ల మోటారు బైక్ టైర్లు దెబ్బతింటున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే దెబ్బతిన్న కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
భారీ వర్షం.. తడిసిన ధాన్యం
● కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన జొన్నలు ● పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కంగ్టి(నారాయణఖేడ్)/కల్హేర్(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని జమ్గి(బీ), జమ్గి(కే), గాంధీనగర్, బాన్సువాడ, దామర్గిద్దా, ముర్కుంజాల్, తడ్కల్, ఘన్పూర్, చాప్టా పరిసర గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు జమ్గి(బీ) కొనుగోలు కేంద్రంలో జొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి జమ్గి(బీ) కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన జొన్నలను పరిశీలించారు. ప్రభుత్వ ఆలసత్వంతో తడిసిన జొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కల్హేర్, మాసాన్పల్లి, తదితర చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతర్గాంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వరి కుప్పలు తడిసిపోయాయి. అయితే ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న జనం వర్షం కారణంగా ఉపశమనం పొందారు. -
రోడ్డెక్కిన రైతులు..
హత్నూర(సంగారెడ్డి): ధాన్యం తీసుకొచ్చిన నెలలు గడుస్తున్నా తూకం వేయడం లేదని, అన్లోడింగ్కు లారీలు పంపించడం లేదని నవాబుపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన హత్నూర తహసీల్దార్ కార్యాలయం వద్ద జోగిపేట ప్రధాన రహదారిపై గురువారం నవాబుపేట గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. డబ్బులిచ్చిన వారికే ధాన్యం తూకం వేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. అధికారులకు చెప్పినా లారీలు పంపిస్తామంటున్నారే తప్ప లారీలు పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఇప్పటికే మొలకొచ్చి తడిసిపోయిందని నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోయారు. రాస్తారోకో సమాచారం అందుకున్న వెంటనే లారీలు పంపిస్తామని ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. -
డీఈఓను కలిసిన పలు సంఘాల నేతలు
సంగారెడ్డి/జహీరాబాద్ టౌన్: నూతనంగా జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రోహిణి ని పలు సంఘాల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిడ్ అలీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, నాయకులు శాలువ, పూలమాలతో సత్కరించారు, అలాగే బీఆర్ ఎస్వి నాయకులు అఖిల్ డీఈఓ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టీబెస్ నాయకులు కూడా... తెలంగాణ బంజార ఎంప్లాయిస్ సేవా సంఘం(టీబెస్) నాయకులు డీఈఓ రోహిణిని సంగారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలిశారు. టీబెస్ రాష్ట్ర అధ్యక్షుడు పీపీరాథోడ్, ప్రధాన కార్యదర్శి తులసీరాం రాథోడ్ ఆధ్వర్యలో జహీరాబాద్ డివిజన్ నాయకులు అర్జున్ చవాన్ తదితరులు ఆమెను కలిసి శాలువాతో సత్కరించారు. -
జోరందుకున్న ఖరీఫ్ సాగు
మునిపల్లి(అందోల్)/జహీరాబాద్ టౌన్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ పనులు జోరందుకున్నాయి. మునిపల్లి మండలంలోని పిల్లోడి, పెద్దలోడి, తాటిపల్లి, మన్సాన్పల్లి, మేళసంగ్యం గ్రామాలతోపాటు ఆయా గ్రామాల్లో రైతులు కూలీలతో పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇక జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలో పత్తి విత్తనాలు నాటే పనులు జోరుగా సాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పత్తి విత్తనాలు నాటే కూలీల కొరత ఉండటంతో ఏదోవిధంగా ఖర్చుకు వెనుకాడకుండా అడిగిందే తడవుగా ఆటో ల్లో కూలీలను పొలాలకు తీసుకొచ్చి విత్తనాలు నాటిస్తున్నారు. పత్తి పంటలో వివిధ రకాల గడ్డి, పిచ్చి మొక్కలు మొలకెత్తకుండా ఉండేందుకు విత్తనాలు నాటగానే పత్తి గడ్డిమందు పిచికారీ చేస్తున్నారు. -
ఆనవాళ్లున్నా.. ఆచూకీ లేదు
● తంగడపల్లిలో చిరుతపులి సంచారం ● భయాందోళనలో చుట్టుపక్కల గ్రామాలు ● పొలాలకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు ● ఖరీఫ్ పనులకు ఆటంకం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని తంగడపల్లి శివారులో చిరుతపులి సంచరిస్తుండటంతో గ్రామస్తుల్లో భయాందోళన రోజురోజుకు తీవ్రతరమవుతోంది. గత నెల 27న గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్లో చిరుతపులి సంచరించినట్లుగా అటవీ అధికారులు ఆనవాళ్లు గుర్తించారు. జరిగి పదిరోజులవుతున్నా ఇప్పటివరకు దాని ఆచూకీని కనుగొనడంలోగానీ, బంధించడంలో గానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయపనులకు ఇబ్బంది ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావడానికి, పొలాలకు వెళ్లడానికి రైతులు, కూలీలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏవైపు నుంచి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చిరుతపులి ఆనవాళ్లు, ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆందోళన నెలకొంది. పది రోజులుగా ఈ ప్రదేశంలో చిరుతపులి సంచరిస్తున్నా అధికారులు మాత్రం ఒకటి, రెండుసార్లు వచ్చారే తప్ప ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు చిరుతను బంధించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
పంట మార్పిడితో అధిక లాభాలు
కలెక్టర్ ప్రతీక్జైన్కంది(సంగారెడ్డి): పంట మార్పిడితో అధిక దిగుబడితోపాటు లాభాలను పొందవచ్చని కలెక్టర్ ప్రతీక్జైన్ రైతులకు సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కంది మండల పరిధిలోని జుల్కల్లో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధిక లాభాలను అందించే పామాయిల్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. జనగణన, ఎస్ ఐ ఆర్ లో ప్రజలందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. నమోదు కోసం వచ్చే అధికారులకు తమ కుటుంబ సభ్యుల వివరాలను తెలపాలన్నారు. అనంతరం గ్రామ శివారులోని పొలంలో సాగవుతున్న టమాటా పంటను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ జుబేర్, డీఆర్డీఓ జ్యోతి, తహసీల్దార్ హసీనా బేగం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్రెడ్డి, ఏవో ఆసియా బేగంతోపాటు ఏఈ ఓలు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. -
దాడి చేసిన వ్యక్తి అరెస్టు
జహీరాబాద్ టౌన్: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిచేసి దుర్భాషలాడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ.రాజేందర్రెడ్డి కథనం ప్రకారం... చిరాగ్పల్లి పీఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు చాకలి తుకారం, మన్నెం గణేశ్ మే 31న ధనసిరి గ్రామంలో బసవేశ్వర చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆర్య రమేశ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ల వద్దకు వెళ్లి అసభ్య పదజాలంతో దూషించాడు. కానిస్టేబుల్ బైక్ తాళాలు తీసుకొని గణేశ్ను తోయడంతో ఆయన కిందపడ్డాడు. మరో కానిస్టేబుల్ తుకారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం నిందితుడ్ని కోర్టులో రిమాండ్ చేశామని ఎస్ఐ తెలిపారు. -
ఆత్మబలిదానం వృథా కాలేదు
హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన నా తమ్ముడు నరేశ్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయగా వృథా కాలేదు. మా కుటుంబానికి గత ప్రభుత్వం రూ.10లక్షలిచ్చి, నాకు ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నేడు మెదక్లో ప్రభుత్వ హాస్టల్లో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నాను. – నర్సింహులు, తెలంగాణ అమరవీరుడి సోదరుడు, శమ్నాపూర్ గత ప్రభుత్వంలో ఆదుకున్న విధంగానే తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న కుటుంబీకులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. కన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త ఎప్పటికి మరిచిపోలేనిది. ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలకు న్యాయం చేసినప్పుడు వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. – తెలంగాణ అమరవీరుడి తల్లి కమలమ్మ, రాజ్పేట -
అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్
● బంగారం, వెండి ఆభరణాలు స్వాఽధీనం ● వివరాలు వెల్లడించిన మెదక్ డీఎస్పీ పెద్దశంకరంపేట(మెదక్): అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 14న మండలంలోని చీలాపల్లిలో కిలో పైగా బంగారం, రెండున్నర కిలోల వెండిని దొంగలు చోరీ చేశారు. ఈ కేసులో ఇటీవల నిందితుల నుంచి 94 తులాల బంగారం, కిలోన్నర వరకు వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగతా బంగారం, నిందితుల కోసం పోలీసులు మూడు బృందాల ద్వారా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు జైరాంయాదవ్ను విచారించారు. బుధవారం ఉదయం అతడి బంధువులైన మరో ప్రధాన నిందితుడు రాథోడ్ ఇప్పూసింగ్, బానోత్ సురేఖ, బానోత్ మీరిబాయిలను చందర్నాయక్తాండా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14.2 తులాల బంగారు, 87 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు చోట్ల 23 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో రాథోడ్ సుగుణాబాయి, బానోత్ సుభాష్ పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కేసును ఛేదించిన అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్రెడ్డి, శంకర్, పోచయ్యలతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
గిరిజన కుటుంబంపై దాడి
చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ సంగారెడ్డి: గిరిజన కుటుంబంపై దాడి ఘటన కలకలం రేపింది. ఈ ఘటన చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... రాత్రి 10 గంటల సమయంలో గేదె కనిపించకపోవడంతో జాదవత్ వాల్కీబాయి, శివరాం, అరవింద్, అభిలాష్ తదితరులు వెతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బొమ్మరాజు అంజయ్య, రమేశ్, విష్ణు, భూమ్మయ్య, తదితరులు మద్యం మత్తులో వచ్చి వారిపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. దాడిలో గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయమై పుల్కల్ ఎస్ ఐ విశ్వజన్ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. సిద్దిపేటకమాన్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తకు సిద్దిపేట కోర్టు జైలు శిక్షతో పాటు జరిమాన విధించింది. టూటౌన్ సీఐ మురళి వివరాల ప్రకారం... సిద్దిపేట బారాయిమామ్కు చెందిన కొత్వాల్ సందీప్కు అదే కాలనీకి చెందిన లహరితో 17ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి సందీప్ తన భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో లహారి 2017లో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాస్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ లావణ్య తన వాదనలు వినిపించారు. సందీప్ నిందితుడిగా తేలడంతో అతడికి న్యాయమూర్తి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేలు, వరకట్న నిషేధ చట్టం కింద మరో రూ.10వేల జరిమాన విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు. రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం, భారతినగర్ డివిజన్లలో బుధవారం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సింధు రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి డ్రైనేజీ సమస్యలను వివరించారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఈడీ సంతోష్ ఆదేశించారు. జల మండలి జీఎం ్డ, డీజీఎం పాల్గొన్నారు. -
సింగూరు..
ధాన్యపు సిరులుఉవ్వెత్తున ఎగిసిపడిన పలుగు తండానారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో మండలంలోని పలుగుతండా ముందు వరుసలో నిలిచింది. చిన్న తండా అయినా వినూత్న కార్యక్రమాలతో రాష్ట్ర స్థాయి నాయకులను ఆకట్టుకుంది. రాష్ట్రంలో మహిళా జేఏసీ మొట్ట మొదటిసారిగా ఈ తండాలోనే ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించి తండావాసులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అర్థనగ్న ప్రదర్శనలు, కేంద్ర, రాష్ట్ర నేతల ఫొటోలు పట్టుకొని ప్రదర్శనలు, మాక్పోలింగ్, నిరాహార దీక్షలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. తండాకు చెందిన టోప్యానాయక్, చౌహాన్ మారుతి నాయక్, మోహన్సింగ్, కేతావత్ మారుతీనాయక్, రవీందర్నాయక్ జైలుకెళ్లారు. వృద్ధులైన టోప్యానాయక్ (90) రెండేళ్ల క్రితం మరణించారు. బస్సుల ధ్వంసం, తహసీల్దార్, ఎకై ్సజ్, సీడీపీవో, మిల్క్చిల్లింగ్ సెంటర్ కార్యాలయాలపై దాడి ఘటనలు జరగగా అందులో కేసులు నమోదై ఇటీవలి వరకు కోర్టుల చుట్టూ తిరిగారు. పిల్లల భవిష్యత్తు కోసం.. రాష్ట్రం ఏర్పాటైతే చదువుకున్న పిల్లల భవిష్యత్తు మారుతుందని ఆలోచించాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం బాగుపడుతుంది. అందుకోసం తాము చదువుకోకున్నా తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, రాష్ట్ర ప్రజలకు దోపిడీ నుంచి విముక్తులవుతారని ఆందోళనల్లో పాల్గొన్నాం. 16 రోజులపాటు జోగిపేట జైలులో ఉన్నాను. – జాదవ్ మారుతి నాయక్, రైతు, పలుగుతండా స్వరాష్ట్రంతోనే అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతేనే అభివృద్ధి సాధ్యం. దోపిడీ, పీడన పోవాలంటే రాష్ట్ర ఏర్పాటే లక్ష్యమని రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అన్ని పోరాటాల్లో ముందున్నాం. వినూత్న కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టి రాష్ట్ర నాయకులు దృష్టిలో పడ్డాం. ప్రతీ పిలుపును అందుకొని పోరాటం చేశాం. తెలంగాణ వస్తే వెనుకబడ్డ జిల్లాతో పాటు ఖేడ్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాం. అందుకు అనుగుణంగా జిల్లా అభివృద్ధి చెందింది. వారం పాటు జోగిపేట జైలులో ఉన్నాను. – రవీందర్నాయక్, పలుగు తండాఉద్యమ సమయంలో తెలంగాణ రాదని మనస్తాపంతో ఉరివేసుకున్న కుమారుడు గుర్తుకొస్తే గుండెలు పగిలిపోతున్నవి. త్యాగంను గుర్తించిన ప్రభుత్వం రూ.10లక్షలిచ్చి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంది. దీంతో కుమారుడిని కోల్పోయిన లోటును తీర్చినా కన్న పేగుబంధం ప్రేమ మండుతూనే ఉంది. – తెలంగాణ అమరవీరుడు లింగం తల్లి కిష్టవ్వ, బూర్గుపల్లి తెలంగాణ వచ్చిన తర్వాత సింగూరు ప్రాజెక్టు ప్రాంత వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సింగూరు సాగునీటి కాల్వకు మోక్షం లభించడంతో ఈ ప్రాంతం పచ్చని మాగాణమై మెరిసింది. రైతులు పుట్ల కొద్ది ధాన్యాన్ని పండిస్తున్నారు. ఉమ్మడి రాష్టంలో బోరు బావుల కింద విడుతల వారీగా వచ్చే కరెంటుతో ఆరుతడి పంటలు పండించారు. స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్, చౌటకూర్, అందోల్ మండలాల్లో 40 వేల ఎకరాల వరకు వరి పంటను పండిస్తున్నారు. ఈ మండలాల్లో సాగునీటి కాలువలను చెరువుల్లోకి మళ్లించడంతో అదనంగా 114 చెరువుల కింద ఆయకట్టులో ఏటా రెండు పంటలు వరి సాగు చేస్తున్నారు. దీంతో దశాబ్ద కాలంలో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించారు. – పుల్కల్(అందోల్)రైతుల దశ మార్చిన ప్రాజెక్టు ● వేల ఎకరాలు మాగాణం ● రెండు పంటలు పండిస్తున్న రైతులు ● ఆరుతడి పంటలకు స్వస్తిసింగూరు సాగునీటి కాలువతెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సింగూరు సాగునీటి కాలువలను నిర్మించారు. దీంతో 2016 నుంచి సింగూరు సాగునీటి కాలువల ద్వారా 40 వేల ఎకరాలకు, పలు చెరువుల్లోకి నీటిని మళ్లించారు. కాగా అందోల్ నియోజకవర్గంలో సుమారు 50 వేల ఎకరాల వరకు రెండు పంటలకు సాగునీరు అందించారు. సింగూరు సాగునీరు అందడంతో అప్పట్లో ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన కూలీలు 600 కుటుంబాల వరకు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు.నంగునూరు(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం. కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం కోనాయపల్లి వేంకటేశ్వరాలయంలో నాటి టీఆర్ఎస్ పార్టీకి బీజం పడగా హైదరాబాద్లోని జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన వెలువడింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ మండల ప్రజలు ఉద్యమానికి అండగా నిలిచారు. ధర్నాలు, రాస్తారోకోలు, రహదారుల దిగ్భందం, వంటావర్పు, దిష్టిబొమ్మల దహనం, బతుకమ్మ ఆటలతో ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. కేసీఆర్ ఆమరణ దీక్ష భగ్నంతో భగ్గుమన్న మండల ప్రజలు అధినేత పిలుపుతో పాలమాకులలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు సైతం ఊరూరా తరలివచ్చి 1,144 రోజుల పాటు దీక్షలో కూర్చున్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటనతో దీక్షలు విరమించి సంబరాలు జరుపుకున్నారు.పాలమాకులలో 1144వ రోజు దీక్షలో పాల్గొన్న మహిళలుమాజీ మంత్రి హరీశ్రావు చొరవతో.. ఉద్యమంలో జైలుకెళ్లా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి, మలి ఉద్యమంలో పాల్గొని 45 రోజులు జైలుకెళ్లా. కేసీఆర్తోపాటు ఉద్యమ జేఏసీ పిలుపుతో పాలమాకులలో సుదీర్ఘ కాలంగా రిలే దీక్షలు చేపట్టాం. మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజలు పండుగలను సైతం పక్కన పెట్టి పాల్గొన్నారు. నాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించి అండగా నిలవాలి. – సంగు పురేందర్, జేఏసీ మాజీ కన్వీనర్ -
ప్రగతిలో హుస్నాభాగ్
హుస్నాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుస్నాబాద్ వడివడిగా అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. శాతవాహన యూనివర్సిటీ అనుబంధంగా హుస్నాబాద్లో గత ఏడాది ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5 కోర్సులతో 300 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. కళాశాలకు శాశ్వత బిల్డింగ్ కోసం ప్రభుత్వం 36 ఎకరాల భూమిని కేటాయించింది. బిల్డింగ్ నిర్మాణానికి రూ.44.12 కోట్లు మంజూరు చేసింది. ఈ భవనం పూర్తయ్యేలోపు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాలిటెక్నిక్ కళాశాల క్యాంపస్లో తాత్కాలికంగా అడ్మిషన్లు, తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజల మెరుగైన వైద్యం కోసం ఇతర పట్టణాలకు వెళ్లకుండా 250 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. రూ.88 కోట్ల వ్యయంతో ఆస్పత్రి భవన నిర్మాణం కొనసాగుతుంది. అలాగే కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు వరసల రహదారి నిర్మాణానికి రూ.163.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను రెండు ఫేజ్లుగా విభజించారు. 2వ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 10 కిలోమీటర్ల మేర నాలుగులేన్లతో హ్యామ్ విధానంలో రోడ్డు నిర్మాణానికి రూ.58.91 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే ప్రకృతి సోయగాలకు ప్రతీకగా నిలిచిన ఉమ్మాపూర్ కోటగిరి గుట్టలపై అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
నాణ్యమైన ఆహారం అందించాలి
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వదీప్ కుమార్మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో డిప్యూటీ వార్డెన్లు, కిచెన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వదీప్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీజీఎంఆర్జేసీ కళాశాలలో ఫుడ్సేఫ్టీ అంశంపై ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లాలోని తెలంగాణ గురుకుల మైనారిటీ పాఠశాలలు, జూనియర్ కళాశాలల డిప్యూటీ వార్డెన్లు, కిచెన్ సిబ్బంది హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా జిల్లా ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ స్వదీప్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ డాక్టర్ రాజ్కుమార్ హాజరై ఆహార భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ సురేఖ అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ఎల్సీ బహుమతి, విజిలెన్స్ అధికారులు గౌస్ పాషా, జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్య
పురుగు మందు తాగి పటాన్చెరు టౌన్: భర్త చనిపోవడంతో ఒత్తిడికి లోనై మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్కు చెందిన రాములు 10 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్ప టి నుంచి అతని భార్య అనిత (34) ఒత్తిడికి లోనై మానసికంగా బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల2న ఉదయం గుర్తు తెలియని క్రమిసంహారక మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి, మెరుగైన వైద్యం క కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి కూతురు శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనుమానాస్పదంగా విద్యార్థి.. తూప్రాన్: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ పరిధిలోని రావెల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం... పట్టణంలో నివాసం ఉంటున్న మహ్మద్ షరీఫ్ అహ్మద్ పెద్ద కుమారుడు అబ్బు హజీఫా(21) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటి నుంచి మంగళవారం ఉదయం వెళ్లిన అతడు రాత్రయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. బుధవారం రావెల్లి గ్రామ శివారులో వాటర్ గదిలో తాడుతో ఉరివేసుకొని మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మృతిపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స పొందుతూ యువకుడు.. పటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్న కంజర్లకు చెందిన మల్లికార్జున్ (26) గత నెల 27న రాత్రి ఇంట్లో నుంచి బయటకు బాత్రూమ్ కోసం వెళ్తూ కాలుజారి పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎనిమిది మంది అదృశ్యం
వేర్వేరు చోట్ల ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది అదృశ్యమయ్యారు. జహీరాబాద్ పరిధిలోని అల్లీపూర్కు చెందిన విద్యార్థిని, పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన యువతి, రాంనగర్కు చెందిన వివాహిత, హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన యువకుడు, పటాన్చెరులో ఇద్దరు, మిరుదొడ్డి మండలంలో ఒకరు కనిపించకుండా పోయారు. వివరాలు ఇలా... కంప్యూటర్ క్లాసుకు వెళ్లిన విద్యార్థి.. జహీరాబాద్ టౌన్: విద్యార్థిని అదృశ్యమైన ఘటన జహీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టౌన్ ఎస్ఐ.లవకుమార్ కథనం ప్రకారం... అల్లీపూర్కు చెందిన వసీహ బేగం(21) పట్టణంలోని ఓ కళాశాలలో చదువుతుంది. ఈ నెల 1న మధ్యాహ్నం కంప్యూటర్ క్లాసుకు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. చీకటిపడినా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి కంప్యూటర్ నిర్వాహకుల వద్దకు వెళ్లి అడగగా రాలేదన్నారు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. శాంతినగర్లో యువతి.. పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన రాథోడ్ పల్లవి(18) ఈ నెల 1న రాత్రి రోజూ మాదిరిగా అందరితో పాటు కలిసి నిద్రపోయింది. ఆమె తల్లి ఉదయం చూసేసరికి కనిపించలేదు. దీంతో బంధువుల వద్ద అడిగినా ఆచూకీ లభించలేదు. రాంనగర్లో వివాహిత.. పట్టణంలోని రాంనగర్కు చెందిన దత్తుతో 15 ఏళ్ల క్రితం పూజారి కల్పన(30) పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. సంసారం విషయంలో రెండు మూడు రోజుల కింద ఇరువురు గొడవపడ్డారు. ఈనెల 1న భర్త పనులకు వెళ్లగా మధ్యాహ్నం కల్పన ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయింది. భర్త ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. దీంతో బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. హౌసింగ్ బోర్డులో యువకుడు.. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన ఎండీ ఖదీర్(24) కూలీ పనులు చేస్తున్నాడు. ఈ నెల 1న పనులకు వెళ్లి వచ్చి రాత్రి 11 గంటలకు నిద్రపోయాడు. ఉదయం చూస్తే అతడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి షాహీన్బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి బయటకెళ్లి.. మండలంలోని బుర్దిపాడ్ గ్రామానికి చెందిన మ్యాతరి సురేందర్(41) అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన అతడు కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మే 28న బైక్పై ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించారు. బంధువులను అడిగినా ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి ఏసప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యతో గొడవపడి.. పటాన్చెరు టౌన్ : భార్యతో గొడవపడిన భర్త అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయం సమీపంలో ఉండే వేణు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 2న భార్య కుమారి తనకు తెలియకుండా మీ తల్లిదండ్రులకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నారని అడిగింది. ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. దీంతో వేణు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. ఇంటి నుంచి వెళ్లిన గృహిణి.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పీఎన్ఆర్ టౌన్షిప్కు చెందిన లక్ష్మి(29) బుధవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె కోసం భర్త సిద్దు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భూంపల్లికి చెందిన మహిళ.. మిరుదొడ్డి(దుబ్బాక): మహిళ అదృశ్యమైన సంఘటన అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ హరీశ్ కథనం ప్రకారం.. భూంపల్లి గ్రామానికి చెందిన కుంట రేఖ, స్వామి దంపతులు. వీరికి ఎనిమిది సంవత్సరాలలోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాగా మే 28న రేఖ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త చుట్టుపక్కల, బంధు మిత్రుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. -
హరీశ్ రావుకు శుభాకాంక్షల వెల్లువ
రామచంద్రాపురం(పటాన్చెరు): మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వి.ఆదర్శ్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సింధు రెడ్డి, అంజయ్యు, నాయకులు పరమేష్, భాస్కర్, నర్సింహ, దేవేందర్ చారీ, రాణి యాదవ్ పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో పండ్ల పంపిణీ సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ, అన్నదానం, రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, సదాశివపేటలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, డాక్టర్ శ్రీహరి, మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, వేణుగోపాలస్వామి, సునీల్ జై, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మహిళా కౌన్సిలర్ల పాదయాత్ర జహీరాబాద్ టౌన్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు జన్మదినం పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్ ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లు, పార్టీ నాయకులు బుధవారం సిద్ధివినాయక ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పట్టణం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర 15 కిలోమీటర్లు సిద్ధివినాయక ఆలయ వరకు కొనసాగింది. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు స్రవంతి, అన్నపూర్ణ, సుజిత, స్వప్న, పాండు, సర్పంచ్లు మహాదేవి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. -
గడ్డపోతారం కమిషనర్గా తాన్యా
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం కమిషనర్గా తాన్య బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కమిషనర్గా పనిచేసిన వెంకటరమయ్య సీడీఎంఏ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి జహీరాబాద్ టౌన్: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని మున్సిపల్ చైర్మన్ యూనూస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధంపై బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. అనంతరం కమిషనర్ ప్రభాకర్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ఎస్హెచ్జీ మహిళా సంఘాల సభ్యులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. రోగులకు టీబీ పరీక్షలు న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్సీ వైద్యులు అమృత్ రాజ్ జైన్ అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో బుధవారం ఉచిత టీబీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 40 మంది రోగులకు టీబీ ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ నాగరాజు, వైద్య సిబ్బంది గోపిరాజ్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్కు మరమ్మతులు చేయండిరామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ నుంచి విద్యుత్నగర్ వెళ్లే మార్గంలోని రైల్వే అండర్పాస్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ సమస్యను వెంటనే పరిష్కారించాలని కొరుతూ పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు లచ్చిరాం నాయక్, బాలాజీలు బుధవారం ఉప కమిషనర్ జ్యోతి రెడ్డికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రైల్వే అండర్పాస్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్లకు మరమ్మతులు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఉచిత శిక్షణ జహీరాబాద్: బ్యూటీషియన్లో ఉచిత శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బుధవారం పట్టణంలోని లతాస్ బ్యూటీ అకాడమీలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు 25 మంది యువతులకు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందించారు. సామాజిక సేవకురాలు, అకాడమీ నిర్వాహకురాలు లత ఆధ్వర్యంలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన వారు బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు. భవిష్యత్త్ల్లోనూ ఇలాంటి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ సిబ్బంది వనీల, లక్ష్మి పాల్గొన్నారు. -
అంచులో దాగిన మృత్యువు!
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్న భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ కాలనీల్లో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే సుమారు 30 నుంచి 50 వరకు భారీ హోర్డింగులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈదురుగాలులకు ఇవి ప్రయాణికులు, వాహనదారుల మీద పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు కేవలం ఆదాయంపైనే కాకుండా, ప్రజల భద్రతపై దృష్టి సారించి తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు.. జిల్లా కేంద్రంలో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతులు పొందడం తప్పనిసరి. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో లేదా మీసేవా కేంద్రాల ద్వారా నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ తమ ఇష్టానుసారంగా భారీ హోర్డింగులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వేగంగా వీస్తున్న గాలులకు ఈ ఫ్లెక్సీలు చినిగిపోయి రోడ్లపై వెళ్లే వాహనదారుల మీద పడుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలను కేవలం కర్రల సాయంతో బలహీనంగా ఏర్పాటు చేయడంతో, అవి ఎప్పుడు ఊడి నెత్తిన పడతాయోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల హోర్డింగులకు ఉన్న ఇనుప రేకులు సైతం ఊడిపోయి ప్రధాన రహదారులు, వాహనాలపై పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.భద్రత ఏది? మున్సిపల్ అధికారులు హోర్డింగుల ద్వారా వచ్చే ఆదాయంపై చూపుతున్న శ్రద్ధ, వాటితో ప్రజలకు ఎదురవుతున్న ముప్పును నివారించడంలో చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోకముందే పట్టణ అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ హోర్డింగులు అనుమతులు లేకుండానే వెలుస్తున్న ఫ్లెక్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు -
సింగూరు భూ అక్రమణలపై అధికారుల సర్వే
వట్పల్లి(అందోల్): సింగూరు ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంలో వందల ఎకరాలను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. బుధవారం మండల పరిధిలోని ఖాదిరాబాద్ గ్రామ శివారులో సింగూరు భూముల్లో జరుగుతున్న పనులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. సర్వే నంబర్. 424 పెద్దచెరువులో గల 14 ఎకరాల పట్టా భూములు, సర్వే నెంబర్ 425లో గల శిఖం భూముల ఆక్రమణలపై సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇరిగేషన్కు సంబంధించిన భూములు, రెవెన్యూ భూముల హద్దులను గుర్తించడంలో సర్వేను చేశారు. అదే విధంగా గడి నిర్మాణం చేపట్టేందుకు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జంగేశ్వర్ మాట్లాడుతూ 424, 425 సర్వే నంబర్లలో సర్వే పట్టా భూములు, శిఖం భూములను గుర్తించడంలో సర్వే చేపట్టామన్నారు. ఇంకా సర్వే పూర్తికాలేదని గురువారం నాటికి సర్వే పూర్తి చేసి గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహసీల్దార్ తెలిపారు. సర్వేయర్ మురళీధర్, జీపీఓ యోహన్, ఇరిగేషన్ ఏఈఈలు యాదయ్య, నవీన్, నాగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాల అభ్యున్నతికి పెద్దపీట
పటాన్చెరు: నియోజకవర్గ పరిధిలోని ప్రతి స్వయం సహాయక సంఘానికి రుణాలు మంజూరు చేయడంతో పాటు వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఆర్డీఏ, మెప్మా, రెవెన్యూ, ఎకై ్సజ్, హెచ్ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే కొల్లూరులో పెట్రోల్ బంక్, కొత్తపల్లిలో రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలోనే భూములు కేటాయిస్తామని తెలిపారు. గుమ్మడిదలలో మహిళా సమాఖ్య భవనానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేసేందుకు పోలీసు, ఎకై ్సజ్ శాఖలు సమన్వయంతో నిఘా పెట్టి, అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నిధులు మంజూరైనా నత్తనడకన సాగుతున్న సాకి చెరువు, తిమ్మక్క చెరువు, దోషం చెరువుల సుందరీకరణ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పశువదశాల, కుల సంఘాలు, సబ్స్టేషన్ల ఏర్పాటుకు వెంటనే స్థలాలు కేటాయించాలని రెవెన్యూ శాఖకు సూచించారు. వడకపల్లి కోట అభివృద్ధి కోసం రూ.10 కోట్ల నిధులు వెనక్కి వెళ్లకుండా ఎన్ఓసి జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. లాలాబావి, చక్రపురి కాలనీలలో హైడ్రా పేరుతో సిసి రోడ్ల పనులను ఆపడం సరికాదని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ జ్యోతి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యారావు, తహసీల్దార్లు వెంకటేష్, హరిబాబు, హెచ్ఎండీఏ డీఈ రామారావు, ఎక్సైజ్ సీఐ పరమేశం, తదితరులు పాల్గొన్నారు. డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండిపటాన్చెరు టౌన్: అమీన్పూర్, పటాన్చెరు సర్కిల్ పరిధిలోని తొమ్మిది డివిజన్ల సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం గచ్చిబౌలిలోని సీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్తో ఎమ్మెల్యే సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. డివిజన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యే సమయంలో రూ. 250 కోట్ల మిగులు నిధులను సైతం డివిజన్ల అభివృద్ధికి మంజూరు చేయాలని కోరారు. ప్రధానంగా మినీ స్టేడియాలు, చెరువులు, శ్మశాన వాటికలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. రెండు సర్కిళ్ల పరిధిలో శరవేగంగా నూతన కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని, ఇందుకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా.. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్తో ఎమ్మెల్యే సమావేశమై పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలో వరద నీటి సమస్య పరిష్కారానికి ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించామని, కాల్వల నిర్మాణానికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు జోనల్ కమిషనర్ అమిత్.. ఎమ్మెల్యేకు తెలిపారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని రేడియం రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పాటు ఉర్జిత్ విల్లాస్ సమీపంలో వరద నీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అంతేకాదు, మినీ స్టేడియాల అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించాలని కోరారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చైర్మన్ కన్నెర్ర
జిన్నారం (పటాన్చెరు): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని గుమ్మడిదల మండలంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం, లారీల కొరత కారణంగా రైతన్నలు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతున్న తీరుపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి, నాణ్యత దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికై నా ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం తగు విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. -
అధికారులకు సహకరించాలి
మునిపల్లి(అందోల్): బూత్ లెవల్ అధికారులకు సహకరించి ఓటరు నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ రంగారావు ప్రజలను కోరారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో గ్రామ సభ కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామ సభలో 18 ఏళ్లు పూర్తయిన యువతీ యువకులు తమ ఓటును ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలన్నారు. ఆధార్ కార్డు, చదువుకున్న సర్టిఫికెట్ల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు పూర్తయిన యువతీ యువకులు తమ పేర్లను బూత్ లెవల్ అధికారుల దగ్గర నమోదు చేయించుకోవాలన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామచారి, ఎంపీడీఓ అంజయ్య, బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్, ఎంపీఓ అండాళ్లు, ఏపీఓ యాదయ్య, వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యకు పరిష్కారం
నారాయణఖేడ్: తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి నూతన నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడి తెలిపారు. మనూరు మండలంలోని బోరంచలో రూ.95లక్షల వ్యయంతో చేపట్టనున్న 4 ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం పునరుద్ధరణ పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, దిగంబర్రెడ్డి, సిద్దారెడ్డి, బీరప్ప, సంజీవ్, శివాజీ పాటిల్, ఖరీం, రాజు, అఖిలేష్రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ దోహదం అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఖేడ్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో ఎమ్మెల్యే సైక్లింగ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం పార్కు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే, పలుగు తండాలోని భవానీమాత ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖేడ్లోని చారిత్రక గాంధీచౌక్లో సబ్ కలెక్టర్ ఉమాహారతి,జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. దీంతో పాటు కంది, పటాన్చెరు, జహీరాబాద్, న్యాల్కల్, సంగారెడ్డి, మునిపల్లి, హత్నూర మండలాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు చౌరస్తాలు, కార్యాలయాలపై జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అలాగే పోలీస్స్టేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద అధికారులు, ఉపాధ్యాయులు.. పంచాయతీ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. – సాక్షినెట్వర్క్ -
తహసీల్దార్గా హసీనా బేగం
కంది(సంగారెడ్డి): మండల తహసీల్దార్గా హసీనా బేగం నియామకమయ్యారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన తహసీల్దార్ రవికుమార్ ములుగు డీఆర్ఓగా బదిలీపై వెళ్లారు. దీంతో నారాయణఖేడ్ తహసీల్దార్గా పనిచేస్తున్న హసీనా బేగం కందికి బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం నారాయణఖేడ్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ సభ్యత్వ నమోదు ఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి జైపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరారు. పట్టణంలో మంగళవారం సభ్యత్వ నమోదు, జనగణనపై మండల సమన్వయకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైనందున ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నారన్నారు. కూలీలకు ఓఆర్ఎస్, జ్యూస్ పంపిణీ న్యాల్కల్(జహీరాబాద్): ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు, కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని గుంజోటి సర్పంచ్ దెశెట్టి పాటిల్ కోరారు. మంగళవారం పంట పొలాల వద్ద పని చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన ఆయన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్యూస్ అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక పూజలు మునిపల్లి(అందోల్): మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఉన్న ఇస్మాల్ ఖాదీర్ దర్గాలో మంగళవారం మాజీ ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. కాగా, ఇస్మాల్ ఖాధీర్ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మల్చెల్మలో వారాంతపు సంత జహీరాబాద్ టౌన్: మండలంలోని మల్చెల్మలో వారాంతపు సంతను మంగళవారం సర్పంచ్ పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి వారాంతపు సంత భాగమేనని చెప్పారు. గ్రామంలో వారాంతపు సంత నిర్వహించడంతో ప్రజలు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశాబ్దాల క్రితం గ్రామంలో సంత జరిగేదని గుర్తు చేశారు. హరీష్ రావును కలిసిన మాజీ కార్పొరేటర్ రామచంద్రాపురం(పటాన్చెరు): మాజీ మంత్రి హరీష్రావును ఆయన నివాసంలో భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి మంగళవారం కలిశారు. ఈ మేరకు సింధు రెడ్డి దంపతులు హరీష్రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావును కలిసి పుట్టికరోజు శభాకాంక్షలు తెలిపినట్లు వివరించారు. -
విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించండి
కలెక్టర్ ప్రతీక్జైన్ సంగారెడ్డిజోన్: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో మంగళవారం ఆయన వీడియో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీవర్షాల సమయంలో ప్రమాదాలు తలెత్తే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. నిరు అధికంగా నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించి సర్ ఓటరు జాబితా, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఏ పంటలు సాగుచేయాలో ముందుగానే సూచించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిన్నారం (పటాన్చెరు): స్థానిక పట్టణ కేంద్ర సమీపంలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపీసీ, ఎంపీసీ మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో సంప్రదించాలన్నారు. -
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
సంగారెడ్డి జోన్: ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వస్త్ర, కాగితం సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాల వినియోగం, ఘన, ద్రవ వ్యర్థాల వేర్వేరు సేకరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎన్ విజయలక్ష్మి, పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు సంగీత, పాండు -
ఉపాధి కూలీలకు తాగునీటి తిప్పలు
హత్నూర(సంగారెడ్డి): ఎండలు తీవ్రం కావడంతో ఉపాధి కూలీలు నీటి కోసం తలడిల్లుతున్నారు. ఉపాధి కూలీలకు పని వద్ద నీటి సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్న క్షేత్రస్థాయిలో నీటి కోసం ఎండలో కూలీలు విలవిలలాడుతున్నారు. ఈ మేరకు మండలంలోని బోరుపట్ల ఉపాధి హామీ పథకం కూలీలు నీటి సౌకర్యం కల్పించడం లేదంటూ ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిళ్లను చూపిస్తూ నిరసన తెలిపారు. అధికారులు ఎవరూ పని వద్దకు రావడంలేదని, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి పటాన్చెరు టౌన్: సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం హెఎండబ్ల్యూఎస్ఎస్బీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా పోటీలో చేస్తున్న రాజిరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌరవిస్తూ జూన్ 1న రాష్ట్రంలోని కోటి పది లక్షల మందికి నెలకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ వేతనాలు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, నాయకులు విజయ్ కుమార్ యువరాజ్, రవి, మహేందర్ లాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఐఐఐటీకి ఎంపిక న్యాల్కల్(జహీరాబాద్): బాసరలోని ఐఐఐటీకి ఎంపికై న రేజింతల్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు పవిత్ర, భార్గవి, అబ్బు ఉస్మాన్, అక్షరలకు మంగళవారం ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకుడు అరుణ్రెడ్డి, మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం మేనేజర్ సునీల్ విద్యార్థులకు శాలువాలు, పూల మాలలతో సన్మానించారు. -
హుండీ పగులగొట్టి చోరీ
నారాయణఖేడ్: ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లి అందులోని నగదును చోరీ చేశారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా... వెంకటాపూర్ చౌరస్తా సమీపంలోని భక్తమార్కండేయ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పెకిలించి ఎత్తుకెళ్లి ఆలయం పక్కనగల వెంచర్లో దాన్ని పగులగొట్టారు. అనంతరం అందులోని నగదు, కానుకలను అపహరించారు. మంగళవారం ఉదయం ఆలయ కమిటీ బాధ్యులు విషయాన్ని గుర్తించారు. దాదాపు ఏడాది కాలంగా భక్తులు వేసిన రూ.లక్ష వరకు నగదు, కానుకలు చోరీకి గురయ్యాయని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా హుండీ పారవేసిన స్థలం, సీసీ ఫుటేజీని పరిశీలించారు. వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ జహీరాబాద్: మండలంలోని హుగ్గెల్లిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. రూరల్ ఎస్ఐ కాశీనాథ్, హుగ్గెల్లి సర్పంచ్ విమలారెడ్డిలు బైక్పై వెళ్తున్న వారికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం సర్పంచ్ విమలారెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అలాగే ఉత్తమ విద్యార్థులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ లక్ష్యాల కోసమే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేలా ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్కు రూపకల్పన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ డాక్యుమెంట్ తెలంగాణకు ఒక భగవద్గీతలాంటిదని, ఇది రాష్ట్రం రూపురేఖలు మార్చే అభివృద్ధి, బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. నిరుపేదల సంక్షేమం, సమగ్ర విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక, జవాబుదారితనంతో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఇప్పటికే వెల్ఫేర్, సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, టూరిజం పాలసీలను సిద్ధం చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీస్పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మహలక్ష్మి పథకం కింద మహిళలు 5.32 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. రూ.239 కోట్ల మేరకు లబ్ధి జరిగింది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ద్వారా 1.76లక్షల మంది వినియోగదారులకు రూ.21 కోట్ల సబ్సిడీని అందించాం. గృహజ్యోతి పథకం ద్వారా రెండు లక్షల గృహ వినియోగదారులకు రూ.180 కోట్లు కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. రైతు భరోసా పథ కం కింద 2025 వానాకాలం సీజన్లో 3.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.422 కోట్లు జమ చేశాం. జిల్లాలో ఇప్పటి వరకు 1,794 ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారులకు రూ.203 కోట్ల మేరకు లఇ్ధ చేకూరింది. 2.24 లక్షల ఎస్హెచ్జీ మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.79.60 కోట్లు రుణాలు ఇచ్చాం. 3.33 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేశాం. రైతుబీమా పథకం కింద 2.48 లక్షల మంది రైతుల పేర్లను నమోదు చేశాం. 2025–26 సంవత్సరంలో మరణించిన 698 మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ.34.90 కోట్ల పరిహారం అందించాం..’అని మంత్రి వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ. ‘‘వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 7,800 మంది రైతులకు రూ.6 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయనున్నాం. సంగారెడ్డి, అందోల్లలో నర్సింగ్ కాలేజీ భవనాలు, కొత్త పీహెచ్సీలను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలు 27 అందుబాటులోకి వచ్చాయి. జేఎన్టీయూహెచ్లో ఫార్మాసుటికల్ సైన్సెస్ అభివృద్ధికి రూ.57 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతి మంజూరైంది. రాజీవ్ ఆరోగ్య పథకం కింద జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఈరోజు వరకు 47,833 మందికి శస్త్ర చికిత్సలు చేయగా రూ.134 కోట్ల బిల్లులు చెల్లించాం ’అని దామోదర తెలిపారు. 132 ప్రీప్రైమరీ పాఠశాలలు ‘‘ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా 132 ప్రీప్రైమరీ పాఠశాలలు మంజూరు చేశాం. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4.43 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతినెల ఉచితంగా 9,485 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇస్తున్నాం. 74 మంది దివ్యాంగులకు రిట్రో పిట్టేడ్ స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్స్, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్స్ ఉచితంగా పంపిణి చేశాం. 16 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి రూ. 3.90 కోట్లు రైతులకు చెల్లించాం. సేకరించిన ధాన్యానికి సంబంధించి రూ.159కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు,, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆరైవ్ అలైవ్, కమ్యూనిటీ పోలిసింగ్, సోషల్ మీడియా ద్వారా పోలీసుశాఖ ప్రజలను చైతన్య పరుస్తోంది. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 57 మంది బాల కార్మికులను పని నుంచి విముక్తి లభించింది..’’అని రాజనర్సింహ చెప్పారు. ఇది తెలంగాణ భవిష్యత్కు భగవద్గీత లాంటిది సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీలతో సర్వతోముఖాభివృద్ధి నర్సరీ నుంచి ఇంటర్ వరకు సమగ్ర విద్యావిధానం మంత్రి దామోదర రాజనర్సింహ ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు -
అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యం
నారాయణఖేడ్: అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు కేటాయించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే పనులు ప్రారంభించిందన్నారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు మిగులు రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుతో అప్పగించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని ప్రజలను మభ్యపెట్టేందుకు విమర్శలు చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం పాత బిల్లులు చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రెండున్నరేళ్లలోనే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.100 కోట్ల వరకు మంజూరు చేయించగా.. మరో రూ.100 కోట్ల వరకు త్వరలోనే మంజూరు కానున్నాయన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్అలీ, నాయకులు వినోద్పటేల్, రమేష్ చౌహాన్, ముంతాజ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అయ్యో పాపం..
న్యాల్కల్(జహీరాబాద్): అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వాస్పత్రి సమీపంలోని పొదల్లో వదిలివెళ్లారు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపులు వినిపించడంతో స్థానిక మహిళ ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వైద్య సిబ్బందికి, హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది శిశువును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 108లో జహీరాబాద్కు తరలించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వారు శిశువును సంగారెడ్డిలోని శిశు విహార్కు తరలించారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పొదల్లో మగ శిశువును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స సంగారెడ్డిలోని శిశు విహార్కు తరలింపు -
ప్రధానోపాధ్యాయులకు ఘన సత్కారం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: వేసవి శిబిరాల్లో విశిష్ట సేవలందించిన పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి దామోదర సత్కరించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం సంగారెడ్డి పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ పరితోష్ పంకజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ జాతీయ హరిత దళం సంయుక్త ఆద్వర్యంలో పీఎంశ్రీ పాఠశాలలో వేసవి శిబిరాలను నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, బాధ్యతను పెంపొందించేందుకు వివిధ నాటికలు, నృత్యాలు తదితర సృజనాత్మ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ మేరకు శిక్షణ అందించిన జెడ్పీహెచ్స్ తెల్లాపూర్ ప్రధానోపాధ్యాయుడు భాస్కర్, నారాయణఖేడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు మన్మద కిషోర్, శివంపేట జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు వేద శ్రీలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీసీ జిల్లా పర్యావరణ అధికారి విజయలక్ష్మి, ఇన్చార్జి డీఈఓ శంకర్, హరితదళం కో ఆర్డినేటర్ మాధవ రెడ్డి, జిల్లా నోడల్ అధికారి లింబాజి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిది
సంగారెడ్డి: ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తొలిదశ తెలంగాణ పోరాట యోధులను వైఎస్సార్ భవన్లోని బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్ అధ్యక్షతన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తొలి దశ తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. తొలి దశ ఉద్యమకారులైన సుభాష్, సుధాకర్, నరసింహులు, సీతారామతీర్థం, కృష్ణారావు, జయప్రకాష్, శ్రీనివాస్, సర్జిత్ కౌర్, జయలక్ష్మిలను ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కష్ణ, నాగరాణి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సాయిలు, కార్యదర్శులు సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, పాండురంగం, శ్రీధర్ మహేంద్ర, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల గౌడ్, మంగా గౌడ్ శతి గౌడ్, లతా, మానస, మౌనిక, వీరమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ను కలిసిన గుంతపల్లి సర్పంచ్
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లి సర్పంచ్ పడమటి అనంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లోని మాజీ మంత్రి కేటీఆర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించినట్లు తెలిపారు. గత పదేళ్లుగా యువకుడిగా ఉంటూ గ్రామాభివృద్ధితో పాటు పేద ప్రజలకు అనంత్ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. కష్టకాలంలో పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికే రానున్న కాలంలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గుంతపల్లి గ్రామాభివృద్దికి తన వంతు సహాయ, సహాకారాలు అందిస్తానని తెలిపారన్నారు. -
వినతులపై తక్షణ చర్యలు తీసుకోండి
నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కరించే దిశగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి సూచించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తొమ్మిది వినతులు వచ్చాయి. అయితే 40 ఏళ్ల కిందట ప్రభుత్వం తనకు 4.18 ఎకరాల భూమిని పంపిణీ చేయగా.. సర్వే నిర్వహించి తనకు భూమి చూపాలని కోరుతూ కరస్గుత్తికి చెందిన ఇస్మాయిల్ వినతిపత్రం అందజేశారు. అలాగే తనభూమి 161బీ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తన భూమి కోల్పోతున్నా.. తనకు పరిహారానికి సంబంధించిన నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని డీఎన్టీ తండాకు చెందిన మారుతి కోరారు. అంబోజీ కాలనీలో రహదారి వెంట కంచెలు వేసి మొక్కలు నాటిన వారిపై చర్యలు తీసుకొని రహదారి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. -
ఈసారైనా నిధులు వచ్చేనా?
3న సీఎం రేవంత్ రాకకొన్యాల– చౌటకూర్ లింకు రోడ్డు దుస్థితిదశాబ్దాలుగా నలుగుతున్నదౌల్తాబాద్ – కాసాల శివారు పంచాయితీమట్టిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు బోరపట్లకు రానున్న సీఎంపైనే ప్రజల ఆశలుమండలానికి సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 3న రానుండడంతో మండలంలోని దశాబ్దాల నాటి సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గతంలో ఇద్దరు సీఎంలు పర్యటించినా తీరని సమస్యలు.. ఇప్పుడు మూడో సీఎం రాకతోనైనా పరిష్కారమవుతాయా అని స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. హత్నూర (సంగారెడ్డి) కాసాల–దౌల్తాబాద్ గ్రామాల సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ’రాజీవ్ పల్లె బాట’ బస్సు యాత్రలో దౌల్తాబాద్ మీదుగా వెళ్లినప్పుడు రెండు గ్రామాల ప్రజలు ఈ శివారు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో పరిష్కారం లభించకపోవడంతో ఇప్పటికీ తరచూ రెండు గ్రామాల మధ్య ఘర్షణలు నెలకొంటున్నాయి. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సైతం నర్సాపూర్ బహిరంగ సభలో దౌల్తాబాద్, కాసాలను కలిపి మున్సిపాలిటీగా మారుస్తామని ప్రకటించినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా తరచూ తై బజార్ వసూళ్లు, వ్యాపార సంస్థల అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాకతోనైనా ఈ పంచాయితీకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఇరు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. కొన్యాల – చౌటకూర్ లింక్ రోడ్డు దుస్థితి కొన్యాల గ్రామ శివారులోని మంజీరా నదిపై స్వర్గీయ వైఎస్సార్ హయాంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ, కొన్యాల–చౌటకూర్ లింక్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. దీంతో వాహనదారులు మట్టిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే జోగిపేటకు వెళ్లే ప్రజలకు ప్రయాణ దూరం భారీగా తగ్గనుంది. మరోవైపు సంగారెడ్డి నుంచి భువనగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ అనేది కేవలం కలగానే మిగిలిపోయింది. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ గుంతలమయంగా మారి ధ్వంసమయ్యాయి. పెరిగిన నిరుద్యోగం.. కాలుష్య కోరల్లో మంజీరా హత్నూర మండలంలో 16 భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ, స్థానిక యువతకు ఉపాధి దక్కడం లేదు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగు లు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అంతేకాదు, ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న రసాయన కాలుష్యంతో నక్కవాగు, మంజీరా పరివాహక ప్రాంతాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. విషపూరిత జలాలతో మూగజీవాలు, వాగులోని చేపలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఈ కాలుష్య జలాలు నక్కవాగులో కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మార్కెట్ యార్డుగా దౌల్తాబాద్ ఉప మార్కెట్ ప్రస్తుతం ఉన్న దౌల్తాబాద్ ఉప మార్కెట్ యార్డును పూర్తిస్థాయి మార్కెట్ యార్డ్గా అప్గ్రేడ్ చేసి, దానికి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేయాలని స్థానిక రైతు నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి మండల పరిధిలోని బోరపట్లకు రానున్న నేపథ్యంలో ఈ దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ సీఎం సానుకూల నిర్ణయంతో మోక్షం కలిగిస్తారని మండల ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
వట్పల్లి(అందోల్): ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందిచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి అన్నారు. సోమవారం జోగిపేట్ ఏరియా ఆస్పత్రి, తాలేల్మ, నేరడిగుంట పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వివిధ విభాగాలను సందర్శించారు. గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉంచరాదని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. వైద్యులు సిబ్బంది సమయం పాలన పాటించాలని స్పష్టం చేశారు. వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాలెల్మ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారి లలితాదేవి తాలెల్మ, నేరడిగుంట పీహెచ్సీలఆకస్మిక తనిఖీ -
చెరువులో మునిగి యువకుడి మృతి
హత్నూర(సంగారెడ్డి): చెరువులో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని షేర్ఖాన్పల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం... హైదరాబాద్ ఫతేనగర్కు చెందిన మేకల రాఘవేందర్(18) మరో 13 మంది స్నేహితులతో కలిసి షేర్ఖాన్పల్లి గ్రామ శివారులోని పలుగుమీది నల్ల పోచమ్మ ఆలయ దర్శనానికి ఆదివారం వచ్చారు. దావత్ చేసుకొని సాయంత్రం స్నేహితులతో కలిసి చెరువులో నీటిలో ఆటలాడుతున్న క్రమంలో రాఘవేందర్ నీటిలో మునిగిపోయాడు. వెంటనే తోటి స్నేహితులు, అక్కడ ఉన్న కొంతమంది అతడ్ని చెరువులో నుంచి బయటకు తీసినప్పటికీ మృతి చెందాడు. అనుమానాస్పద స్థితిలో రైతు..సంగారెడ్డి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చౌటకూర్ మండల శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రానికి చెందిన రైతు శ్రీశైలం(50) రెండు రోజుల కింద అదృశ్యమయ్యాడు. కాగా మండల శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలానికి స్థానిక తహసీల్దార్ కిష్టయ్య వెళ్లి పరిశీలించారు. శ్రీశైలంను కొందరు కొద్ది రోజులుగా భూ తగాదాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అభివృద్ధి పనుల ప్రారంభం
హత్నూర(సంగారెడ్డి): మండలంలోని గుండ్ల మాచునూర్లో సీసీ రోడ్డు నిర్మాణం, చెరువులో ఉపాధి పనులను సోమవారం సర్పంచ్ శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద చెరువులో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన ఉడికతీత పనులతో చెరువు లోతు కావడంతో పాటు ఆ మట్టిని పొలాల్లో వేసుకున్నట్లయితే సారవంతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గునుకుంట్ల శంకర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సభ్యులు బద్రేశ్, శివకుమార్, మల్లమ్మ, అంకిత ప్రభాకర్, జలీల్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పదవీ బాధ్యతల స్వీకరణ జహీరాబాద్ టౌన్: స్థానిక మున్సిపల్ కమిషనర్గా ప్రభాకర్ సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. కమిషనర్గా ఉన్న జైత్రాం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభాకర్ను కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన చైర్మన్ యూనూస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల్రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. రావి ఆకుపై రాష్ట్ర ఆవిర్భావ శోభ నారాయణఖేడ్: త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన పత్ర చిత్రకారుడు శివకుమార్ రావి ఆకుపై తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాగునీటి ప్రగతి, రైతు శక్తి, నాయకత్వం, కాకతీయ కళాతోరణం, భగీరథ, కాళేశ్వరం, బంగారు బతుకమ్మ, సీఎం రేవంత్రెడ్డి చిత్రాలను మలచి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
మునిపల్లి(అందోల్): మేడ్చల్కు చెందిన శ్రీనివాస్ గానుగపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా లింగంపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు కారు ఇంజిన్లో నుంచి మంటలు వచ్చాయి. వివరాల ప్రకారం 65వ నంబర్ జాతీయ రహదారి కంకోల్ టోల్ ప్లాజా సమీపంలోని లింగంపల్లి చౌరస్తా సమీపంలో సోమవారం భోజనం చేయడానికి కారునుంచి కిందకు దిగారు. అయితే కొద్దిసేపటికే కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. జాతీయ రహదారిపై తిరుగుతున్న వివిధ రకాల వాహనదారులు కాసేపు అక్కడే ఆపేశారు. బుదేరా పోలీస్లకు విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
నారాయణఖేడ్: అర్హులకు సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని పోతనపల్లి (ఎం)లో సోమవారం ఐదు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అనంతరం తాగునీటి అవసరాల కోసం తన ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద నూతనంగా తవ్వించిన రెండు బోర్లను ప్రారంభించారు. అలాగే నిజాంపేట్ మండలంలోని మునిగేపల్లి, రాంచెందర్నాయక్ తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని గ్రామస్తులను కోరారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కంది(సంగారెడ్డి): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని కౌలంపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ప్రత్యేక అధికారి జ్యోతిలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి తుల్జా నాయక్, ఎంపీడీఓ శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ సుమ, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, సర్పంచ్ స్వాతి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి
జహీరాబాద్ టౌన్: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కోరారు. సోమ వారం పట్టణానికి వచ్చిన సందర్భంగా పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములు నేత, రాంచందర్ భీంవంశీ, గడ్డం జనార్థన్, నారాయణరెడ్డి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి -
క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం
పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రాన్ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత నెల 23, 24వ తేదీలలో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్లో దేశం తరపున జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్కు చెందిన 14 మంది క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 52 పతకాలు సాధించగా.. వీటిలో బంగారు పతకాలు 27, వెండి పతకాలు 11, కంచు పతకాలు 4 ఉన్నాయి. ఈ సందర్భంగా సోమ వారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గత 20ఏళ్లుగా తమ క్రీడా పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 80, 90 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అభినందించారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని పథకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఫహీం ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఉపాధ్యక్షుడు బాలయ్య, నరేందర్ రెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు. పచ్చదనమే ప్రజారోగ్యానికి పునాది రామచంద్రాపురం(పటాన్చెరు): పటాన్చెరు, అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్నగర్, తెల్లాపూర్ హూడా కాలనీలో పార్కుల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ సరస్వతి, ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బాలాజీ, నాగారాజు, శ్రీశైలం, నాయకులు మాల్లారెడ్డి, దేవేందర్ యాదవ్, శ్రీపాల్ రెడ్డి, ఉమేష్, శ్రీకాంత్ రెడ్డి, సాయిచరణ్ గౌడ్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
స్వచ్ఛ గౌవ్పై అవగాహన
పటాన్చెరు టౌన్: మండల పరిధిలోని నందిగామ రైతు వేదికలో స్వచ్ఛ గౌవ్. సురక్ష జల వాయు కార్యక్రమంలో భాగంగా సోమవారం గూగుల్ మీట్ ద్వారా మండల స్థాయి అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల వేరు చేయడం, సేకరణ, శాసీ్త్రయ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదిగిరి, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, సర్పంచ్లు విక్రమ్ గౌడ్, శాంతయ్య, సంగీత, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిరసన నారాయణఖేడ్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ మేరకు ఎర్ర బ్యాడ్జిలు ధరించి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దు.. విలీనమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిపో జేఏసీ ఛైర్మన్ నెహ్రూ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కార్మికుల దశాబ్దాల కల అని తెలిపారు. సంఘం ఎన్నికల కన్నా కార్మికుల సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల నిరంతర శ్రమకు గుర్తింపునివ్వాలని కోరారు. జేఏసీ ఇతర బాధ్యులు బీఎన్ రెడ్డి, బీరప్ప, రాజు, కార్మికులు పాల్గొన్నారు. నాలాలపై నిర్లక్ష్యం తగదు జహీరాబాద్ టౌన్: పట్టణంలోని 27వ వార్డులో నాలాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్ స్రవంతి ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం నాలాలను పరిశీలించి మాట్లాడారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లి నుంచి వచ్చే పెద్ద నాలా 27వ వార్డులో ప్రవహిస్తుందన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నాలా పూర్తిగా చెత్తతో నిండిపోయిందన్నారు. వేసవిలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కలిసి నాలాను శుభ్రం చేస్తుండగా.. గత ఏడాది నుంచి ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. వర్షాకాలంలో నాలా పొంగి మురుగుంతా ఇళ్లలోకి వస్తుందన్నారు. కొంత మంది నాలాను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారన్నారు. అధికారులు స్పందించి చెత్తతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆమె కోరారు. బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పటాన్చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం మియాపూర్ డిపో మేనేజర్ సుధను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీవాసులు మాట్లాడుతూ నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు మియాపూర్, పటాన్చెరు తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నప్పటికీ, నేరుగా బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. దీంతో ప్రయాణ ఖర్చులు పెరగడంతో పాటు సమయం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటాం జిన్నారం (పటాన్చెరు): ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అక్రమంగా కబ్జా చేస్తున్నారని కిష్టయ్యపల్లి భూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. గడ్డపోతారం పట్టణ పరిధిలోని కిష్టయ్యపల్లి సర్వేనెంబర్ 42లో గతంలో ప్రభుత్వం 91 మంది నిరుపేదలకు ఇళ్లస్థలాలను కేటాయిస్తూ పట్టాలను అందజేసిందన్నారు. ప్రస్తుతం ఆ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంతమంది ఆ స్థలంలో కంచెను వేశారని బాధితులు కౌన్సిలర్ ఇంద్రసేన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ భూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిరుపేదలకు భూములు దక్కే విధంగా కృషి చేస్తామన్నారు. -
పటాన్చెరును ప్రగతిబాట పట్టిస్తా
పటాన్చెరు: నియోజకవర్గాన్ని ప్రగతిబాట పట్టిస్తానని, అందులో భాగంగానే జాతీయ రహదారి నుంచి అమీన్పూర్కు నేరుగా వెళ్లేందుకు నాలాపై బ్రిడ్జ్డి నిర్మాణానికి నిధులు మంజూరుకావడమేకాక.. పనులు కూడా ప్రారంభమయ్యాయని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అమీన్పూర్ ప్రజలు బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఈ క్రమంలో లింగంపల్లి చౌరస్తాలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అక్కడే ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను ఇక్కడకు రప్పించి ఈ ప్రాంతంలో రోడ్డు ఆవశ్యకతను వివరించానని గుర్తు చేశారు. ఆ తర్వాతే జీహెచ్ఎంసీ అధికారులు రూ.3.5 కోట్లు కేటాయించి నిధులను మంజూరు చేశారన్నారు. అమీన్పూర్కు నేరుగా రోడ్డు కావాలని స్థానికులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారన్నారు. లింగంపల్లి జంక్షన్ వద్ద ఉన్న కాల్వపై బ్రిడ్జి నిర్మించి నేరుగా శ్రీదేవి థియేటర్ వైపు ఉన్న రోడ్డునకు కలపాలని ఆయన సూచించారు. పటాన్చెరు ప్రజల ఆశీస్సుల వల్లే తాను ఎంపీగా గెలిచానని, అభివృద్ధి చేపడుతూ ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన వివరించారు. అలాగే ముత్తంగి, కిష్టారెడ్డిపేట వద్ద ఔటర్ సర్వీసు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సాకి చెరువు అభివృద్ధికి కృషి పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. సాకి చెరువు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పార్టీ నాయకులు రవియాదవ్, మహిపాల్రెడ్డి, నర్సింగ్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యం ఈ ప్రాంత ప్రజల ఆశీస్సుల వల్లే ఎంపీగా గెలిచా ఎంపీ రఘునందన్రావు -
నర్సింగ్ విద్యకు అధిక ప్రాధాన్యం
జోగిపేట(అందోల్): రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోలు మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు. అందోలు వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవన నిర్మాణ పనులను, నూతనంగా మంజూరైన ఫార్మసీ కళాశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నర్సింగ్ కళాశాల విద్యార్థినిలతో ముఖాముఖిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హమీనిచ్చారు. నర్సింగ్ కళాశాల భవనం, వసతి గృహాలను త్వరలో ప్రారంభించేందుకు సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. అజ్జమర్రి వంతెన పనుల పరిశీలన రూ.80 కోట్లతో చేపడుతున్న అజ్జమర్రి వంతెన పనులను మంత్రి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జోగిపేటలోని బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్తో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వట్పల్లి(అందోల్): పేద ప్రజల సొంతింటి కల నెరవేరుస్తామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోల్ మండల పరిధిలోని మన్సాన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు పాల్గొన్నారు. మూడు మాసాల్లో పనులు పూర్తి మంత్రి దామోదర రాజనర్సింహ -
అటకెక్కిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సాగు నీటి రంగం అభివృద్ధి జరుగుతుందని భావించారు. కానీ రైతుల ఆశలు ఇంకా నెరవేరలేదు. కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందిన దాఖలాల్లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగినా.. పనులు మాత్రం పట్టాలెక్కలేదు. కాంగ్రెస్ సర్కారు కూడా ఈ పథకాలను పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ రెండు పథకాల నిర్మాణం పూర్తయితే దాదాపు 3.84 లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తుందని రైతులు భావించారు. కానీ రైతుల ఆకాంక్షలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. -
అక్షయపాత్రకు అప్పగించ వద్దు
కలెక్టర్కు మంత్రి దామోదర ఆదేశం జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ డివిజన్ పరిధిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్కు అప్పగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్కు ఫోన్ చేశారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న తమను అకస్మాత్తుగా తొలగిస్తే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కాంగ్రెస్ నేతలు ఉజ్వల్రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే ఫోన్లో కలెక్టర్తో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల సభ్యులతోనే వంటలు చేయించాలని, అక్షయ పాత్రకు అప్పగించరాదని ఆదేశించారు. సీఎం రాక కోసం ఏర్పాట్లు హత్నూర(సంగారెడ్డి): ఈనెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్నూర మండలం బోరపట్లకు రానున్న నేపథ్యంలో అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు, ఆర్డీవో రాజేందర్, డీఎస్పీ ప్రభాకర్, రెవెన్యూ, పోలీసులు హెలిప్యాడ్, సభాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడారు. అయితే సీఎం పర్యటనపై సందిగ్ధం నెలకొంది. రేవంత్రెడ్డి వస్తారా.. లేదా వర్చువల్గా పరిశ్రమను ప్రారంభిస్తారా అనేది సస్పెన్స్గానే ఉంది. జీలుగు కోసం ఎగబడిన రైతులుహత్నూర(సంగారెడ్డి): పచ్చి రొట్టె ఎరువుల (జీలుగు) కోసం రైతులు ఎగబడ్డారు. సోమవారం రైతు వేదిక వద్ద 450 క్వింటాళ్ల జీలుగు (1500 బస్తాలు) 30 క్వింటాళ్ల జనుము (75 బస్తాలు) వచ్చినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మూడు క్లస్టర్లలో వీటిని రైతులకు అందించనున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా రైతులు జీలుఉ జిలుగుల కోసం ఎగబడటంతో రైతు వేదికల వద్ద గందరగోళం నెలకొంది. అవసరం ఉన్న మేరకు ఇంకా జిలుగులు తెప్పిస్తామని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో బయోమెట్రిక్ తొలగించాలిబీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి సంగారెడ్డిటౌన్: జొన్నల కొనుగోలు కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రైతులతో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. జొన్నల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలు వల్ల రైతులు నష్టపోకుండా జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రైతులు సంఘం నాయకులు పాల్గొన్నారు. 3న జిల్లా స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలుసంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలను సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ్, జిల్లా పర్యావరణ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఎన్. విజయలక్ష్మి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇంటర్మీడియెట్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. -
అవతరణ’ వేడుకలకు సర్వం సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పరితోష్ సంగారెడ్డి జోన్: రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ సర్వం సిద్ధమైంది. మంగళవారం నిర్వహించే వేడుకల ఏరాట్లను ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్లో పోలీసు సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు. అమరవీరుల స్తూపం అలంకరణ, స్టాల్స్ ఏర్పాట్లు, పోలీసు భద్రత తదితర ఏర్పాట్లు పరిశీలించారు. వేడుకలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. ముందుగా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులచే గౌరవ వందనం స్వీకరిస్తారు. పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ల్యాప్ టాప్, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ లను సందర్శిస్తారు. -
వేతనంలో కోత విధించడం సరికాదు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్య పథకం అమలు చేయడం కోసం ప్రభుత్వం విధివిధానాలు విడుదల చేయకుండా మే నెల వేతనం నుంచి కోత విధించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖర్, రాంచందర్ మాట్లాడుతూ.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పేరిట మే నెల వేతనం నుంచి 1.5 శాతం ప్రభుత్వం కోత విధించడం సరికాదన్నారు. ఆరోగ్య పథకాన్ని అన్ని రకాలుగా తయారు చేసిన తర్వాతనే కోత విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆరోగ్య పథకానికి సంబంధించి అమలు, విధివిధానాలు, మార్గదర్శకాలు వెంటనే ప్రకటించాలని కోరా రు. అదేవిధంగా ప్రతి ఉద్యోగి ఆరోగ్య పథకంలో చేరాలా వద్దా అనే ఆప్షన్ కూడా ఇవ్వాలని కోరారు. ఆస్పత్రి జాబితా ప్రకటించడంతో పాటు ఏ వ్యాధులకు అవకాశం ఉందో తెలపాలన్నారు. ఆరోగ్య పథకం ద్వారా చికిత్స అమౌంట్ పరిమితి తెలియజేయాలని, భార్యాభర్తల విషయంలో ఇద్దరి నుంచి కాకుండా ఒకరి నుంచే కోత విధించాలని కోరారు. వేతన సవరణ కమిటీ రిపోర్టు తెప్పించుకొని ఫిట్మెంట్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు లక్ష్మయ్య యాదవ్, శ్రీనివాస్, కమ్రుద్దీన్, సంజీవయ్య , నాజర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.టీపీటీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన -
టిప్పర్ లారీ ఢీకొని ఒకరు మృతి
జిన్నారం (పటాన్చెరు): టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గుమ్మడిదల పట్టణ కేంద్రంలోని అన్నారం జాతీయ రహదారిపై అశోక్ లీలాండ్ (ఆటో) వాహనాన్ని వెనకాల వచ్చిన టిప్పర్ లారీ ఢీ కొట్టింది. బాలానగర్ వైపు నుంచి వస్తున్న రెండు వాహనాల్లో అశోక్ లీలాండ్ వాహనం అన్నారం ప్రకృతి నివాస్ ఎదుట ఉన్న డివైడర్ను దాటే క్రమంలో వెనకాల ఉన్న టిప్పర్ లారీ అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో అశోక్ లీలాండ్ వాహనం బోల్తా కొట్టడంతో ప్రమాదం చోటు చేస్తుంది. అశోక్ లీలాండ్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాగరాజు (40)పై వాహనం పడడంతో మృతి చెందాడు. డ్రైవర్ రిజ్వాన్, తోటి ప్రయాణికుడు చిన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేదల సొంతింటి కల సాకారం
నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి అయిదు మంది లబ్ధిదారులకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, కౌన్సిలర్లు స్వప్న అభిషేక్ షెట్కార్, వివేకానంద్, రాజు, మహేష్, గోపాల్రెడ్డి, మైతాబ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాహెర్అలీ పాల్గొన్నారు. ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడికి సన్మానం కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన మనూరు మండలం శెల్గిర్గాకు చెందిన మాజీ ఎంపీటీసీ మేటి పురంజన్ను ఖేడ్లోని తన స్వగృహంలో ఎంపీ సన్మానించారు. పీసీసీ సభ్యులు శంకరయ్యస్వామి, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్, కౌన్సిలర్లు వివేకానంద్, మైతాబ్, మాజీ జెడ్పీటీసీ నిరంజన్, ఖేడ్, మనూరు, నాగల్గిద్ద మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు తాహెర్అలీ, సుభాష్ పటేల్, మాణిక్రావు పాల్గొన్నారు. కాగా, ఖేడ్ పట్టణంలోని మహాతి జ్యోతిష్యాలయ ఆవరణలో అధికజ్యేష్ట మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం పురోహితులు, స్మార్త జ్యోతిష్య చండీ ఉపాసకులు గురురాజ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష్మీ సుదర్శన యాగంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఉమాదేవి షెట్కార్ దంపతులు పాల్గొని ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ సురేష్ షెట్కార్ ఖేడ్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం -
‘పారిశ్రామిక’ పరుగులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ఆవిర్బావం అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. ప్రధానంగా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతోంది. ఔషధ, బల్క్డ్రగ్, కెమికల్, మాన్ఫ్యాక్చరింగ్ తదితర రంగాలకు సంబంధించి జిల్లాలో భారీ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కొనసాగుతోంది. పటాన్చెరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులో ఉత్పత్తి అవుతున్న వైద్య పరికరాలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. గుండెకు వేసే స్టెంట్లు, రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమయ్యే కిట్లు, ఆపరేషన్ థియేటర్లలో వాడే పరికరాలు, క్యాథెటర్లు, దంతాలకు సంబందించిన ఇంప్లాంట్లు, ఆర్థో, కంటి వైద్య పరికరాలు, కరోనా వంటి ఆపత్కాళంలో అవసమైన కిట్లు వంటివి ఈ పార్కులోని పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్నాయి. 2017లో ఏర్పాటైన ఈ పార్కుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో పాటు, వైద్య పరికరాల రంగంలో పరిశోధనలకు కూడా బాటలు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నిమ్జ్లో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. వెమ్ టెక్నాలజీ వంటి పరిశ్రమల రాకతో యుద్ధాల్లో వినియోగించే డ్రోన్లు వంటి రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమలు ఈ నిమ్జ్లో కొలువుదీరనున్నాయి. ఆ రెండు జాతీయ రహదారులు నాందేడ్–అకోలా జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా దశ దిశ మారుతోంది. మహారాష్ట్రలోని ఉత్తరాది ప్రాంతానికి అనుసంధానిస్తూ సుమారు 430 కి.మీ.ల పొడవున్న ఈ రహదారి జిల్లాలో సుమారు 70 కి.మీ వరకు ఉంటుంది. భారత్ మాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ జాతీయ రహదారిని ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. కంది నుంచి నిజాంపేట్ మండలం వరకు ఉంది. పరిశ్రమల్లో తయారైన ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ రహదారి ఎంతో కీలకంగా మారింది. జిల్లా పారిశ్రామికంగానే కాకుండా, వ్యవసాయ పరంగా అభివృద్ధికి బాటలు వేసింది. మరోవైపు ముంబై హైవే ప్రాంతం కూడా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందింది. అందుబాటులోకి ఉన్నత వైద్యం సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణంతో జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఉన్నత వైద్యం చేరువైంది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రిని 500 పడకలకు అప్గ్రేడ్ అయింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆయా విభాగాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల నియామకంతో అనుబంధ ఆసుపత్రిలో ఉన్నత వైద్య సదుపాయం అందుతోంది. అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరు కావడంతో జిల్లా వాసులు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభించింది.సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల161 జాతీయ రహదారి161 జాతీయ రహదారి నిర్మాణంతో అభివృద్ధికి బాటలు మెడికల్ కళాశాల ఏర్పాటుతో చేరువైన ఉన్నత వైద్యం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రగతి దిశగా పయనం నెరవేరని సాగునీటి ఆకాంక్షలు -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సంగారెడ్డి జోన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఅని కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి నివేదికలో భాగంగా ఈనెల 12 వరకు నిర్వహించే పర్యావరణ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా సంస్థలలో క్విజ్ పోటీలు, పర్యావరణ అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అవగాహన సదస్సులు, ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనమహోత్సవం, అధిక సాంద్రతతో మిశ్రమ మొక్కల నాటకం, గృహావసర మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, కమలాపూర్ సరస్సు ప్రాంతాల్లో ప్రకృతి సందర్శన కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా పర్యావరణ హిత ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న జరిగే ముగింపు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పాఠశాలలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం కోసం కృషి చేస్తామని అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో 73 అర్జీలు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. కలెక్టరేట్లో 38, సంగారెడ్డి డివిజనన్కు 05, ఆందోల్ 01, నారాయణఖేడ్ 9, జహీరాబాద్ 20 అర్జీలు అందాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్ 12 వరకు పర్యావరణ వారోత్సవాలు -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
పటాన్చెరు టౌన్: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కు క్వారీకి ఐడీఏ బొల్లారానికి చెందిన ప్రదీప్(16)తో ఏడుగురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు శనివారం వెళ్లారు. అయితే ప్రదీప్కు ఈత రాకపోవడంతో థర్మోకోల్ సహాయంతో నీటిలోకి దిగేందుకు ప్రయత్నించాడు. అతనితో పాటు మధు అనే యువకుడు కూడా నడుముకు థర్మకోల్ కట్టుకొని నీటిలోకి వెళ్లాడు. అయితే నీటిలో ఉండగానే ఇద్దరి నడుములకు కట్టుకున్న థర్మకోల్ ఊడిపోయింది. మధు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, ప్రదీప్ మాత్రం లోతైన నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో ఘటన -
వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యం
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యమయ్యారు. పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో వివాహిత మహిళ, హవేళిఘణాపూర్లో తల్లీ, ఇద్దరు కుమారులు, మెదక్ మండలంలో మతిస్థిమితం లేని వ్యక్తి కనిపించకుండా పోయారు. వివరాలు ఇలా... ఇంటి నుంచి బయటకెళ్లిన వివాహిత.. పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇస్నాపూర్కు చెందిన శాంతి గత నెల 29న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ ఇంట్లోనే ఉంది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య అదృశ్యంపై భర్త ధర్మరాజు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ సీటు కోసం వెళ్లిన తల్లీ,పిల్లలు.. హవేళిఘణాపూర్(మెదక్): తల్లీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మే 27న మాచవరం గ్రామానికి చెందిన గోవిందపురం అశోక్ భార్య శిల్ప, తన ఇద్దరు కుమారులు మనోజ్, శశాంక్తో కలిసి పదవ తరగతి పూర్తి కావడంతో ఇంటర్ కాలేజీలో సీటు కోసం హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి ఆచూకీ కోసం భర్త అశోక్ బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం మెదక్రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తి.. మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన రాజు మే 24 నుంచి కనిపించడం లేదు. పలు చోట్ల వెతికినా కనిపించకపోవడంతో అతడి తల్లి కొత్తపల్లి మల్లమ్మ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. -
ఎండు గంజాయి పట్టివేత
నారాయణఖేడ్: ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ సీఐ శంకర్ వివరాల ప్రకారం... కర్ణాటకలోని బీదర్ నుంచి గంజాయిని తీసుకొస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శంకర్, ఎస్ఐలు అనుదీప్, హన్మంతు సిబ్బందితో కలిసి ఆదివారం తెల్లవారు జామున ఖేడ్– వాసర్ల మధ్య తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఖేడ్ మండలం శేరితండాకు చెందిన చవాన్ ప్రభు, మున్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ పర్లాల్ రెండుబస్తాల్లో 30 కిలోల ఎండు గంజాయిని బీదర్ నుంచి తీసుకొస్తూ పట్టుబడ్డారు. గంజాయి విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టుచేసి, గంజాయితోపాటు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని ఖేడ్ ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించారు. న్యాల్కల్(జహీరాబాద్): పేకాట ఆడుతున్న ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... మల్గి గ్రామానికి చెందిన పలువురు గ్రామ శివారులో గోవిందు పొలం వద్ద పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, ఐదు సెల్ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. టేక్మాల్ మండలంలో.. టేక్మాల్(మెదక్): మండలంలోని సర్మోనికుంట శివారులో కోళ్లఫాం వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మేరకు ఎస్ఐ అరవింద్కుమార్ సిబ్బందితో శనివారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో ధర్మావత్ నరేశ్, ధర్మావత్ నితిన్, మహ్మద్ అతిక్, మహ్మద్ ఇమ్రాన్, మేఘావత్ శంకర్, జర్పుల పండిత్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.22150 నగదు, ఫోన్లు, 3బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మాసాన్పల్లిలో ఆరుగురు.. వట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని మాసాన్పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై జోగిపేట పోలీసులు ఆదివారం దాడిచేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న గడ్డమీది మల్లేశ్, ఊస నరేందర్, డాకూరు రమేశ్, వావిలాల లక్ష్మయ్య, చింతకుంట వెంకటేశం, ఎర్రొళ్ల నరేశ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ పాండు తెలిపారు. వారి నుంచి రూ. 28,430 నగదుతో పాటు 2 మోటార్ సైకిళ్లు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పందిరి, సొప్పతోపాటు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దకోడూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన లచ్చపేట సురేశ్ పొలం వద్ద సమీప ప్రాంతం నుంచి మంటలు వ్యాపించి పందిరి అంటుకుంది. అక్కడే ఉన్న స్ప్రింక్లర్ పైపులు, వ్యవసాయ సామగ్రి, మొక్కజొన్న సొప్ప పూర్తిగా కాలిపోయింది. గమనించిన రైతు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అప్పటికే పూర్తిగా కాలిపోయింది. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని రైతు బోరున విలపించాడు. మరో చోట బైక్ దగ్ధం జోగిపేట(అందోల్): గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను తగులబెట్టారు. ఈ ఘటన మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న రాజిరెడ్డికి చెందిన ద్విచక్రవాహనాన్ని శనివారం తన ఇంటి ప్రక్కన పార్కు చేశాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని తగులబెట్టి పారిపోయారు. ఒక్కసారిగా మంటలు రావడంతో బయటకు వచ్చి చూసే సరికి వాహనం కాలిపోయింది. అనుమానితులపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పుస్తెలతాడు చోరీ అంటూ హంగామా..తొగుట(దుబ్బాక): దొంగలు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారని ఓ మహిళ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా... గ్రామానికి చెందిన సీత బాలమ్మ, మల్లయ్య దంపతులు రాత్రి భోజనం చేసి ఆరుబయట నిద్రించారు. అర్ధరాత్రి బాలమ్మ దొంగలు పడ్డారని అరిచింది. తన నోట్లో గుడ్డలు కుక్కి పుస్తెలతాడును ఎత్తుకెళ్లారని విలపించింది. వెంటనే స్థానికులు 100కు కాల్చేయగా రాత్రి 1.30 గంటల సమయంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్రావు ఘటనాస్థలానికొచ్చారు. పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా ఆదివారం ఉదయం మరోమారు ఎస్ఐ వెళ్లి ఇంట్లో వస్తువులను పరిశీలించాడు. ఈక్రమంలో పుస్తెలతాడు సగభాగం దేవుని ఫొటో వెనకాల, మరో సగం సమీప పొలంలో లభించింది. అయితే ఎత్తుకెళ్లింది బయటి వ్యక్తులా లేక కుటుంబీకులా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సీ్త్రలను గౌరవించాలి
నారాయణఖేడ్: ప్రతీ ఒక్కరూ సీ్త్ర జాతిని గౌరవించాలని ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాల మేధావి నైనా జైస్వాల్ పేర్కొన్నారు. మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న ఏడువారాల జాతరకు ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆలయంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులతోపాటు పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి నైనా జైస్వాల్ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. అమ్మవారిని నమ్ముకుంటే ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, శ్రద్ధ, తేజస్సును ప్రసాదిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లయ్య, ఈవో శివరుద్రప్ప, పూజారులు సిద్దుస్వామి, నగేశ్ స్వామి, శ్రీకాంత్స్వామి, ప్రవీణ్, సిబ్బంది శేఖర్ పాల్గొన్నారు. ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ -
అసైన్డ్పై రియల్ కన్ను
కొండాపూర్(సంగారెడ్డి): అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు అక్రమార్కులు పంజా విసురుతున్నారు. ఏదో ఒక సాకుతో ఆ భూములను ఆక్రమిస్తున్నారు. భూములకు ధరలు కోట్లలో పలుకుతుండడంతో రాజకీయ నాయకుల అండదండలతో అధికారులకు సైతం కొంత ముట్టజెప్పి కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల్లో అక్రమార్కుల పాగా.. మండల పరిధిలోని కుతుబ్షాహీపేటలో సర్వే నం.16లోని రెండెకరాల అసైన్డ్ భూముల్లో ఓ అక్రమార్కుడు ఏకంగా బోరు వేసి తన పరిశ్రమకు సంబంధించిన వాహనాలు వెళ్లేలా రోడ్డును ఏర్పాటు చేశాడు. అలాగే అక్కడే ఉన్న ఓ పరిశ్రమకు ఆనుకొని ప్రహరీ గోడనూ సైతం నిర్మించాడు. అలాగే సర్వే నం.20లో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఆ భూములకు ఆనుకొని ఉన్న ఓ వెంచర్కు వెళ్లేందుకు రోడ్డు నిమిత్తం ఆ రైతులకు అధిక మొత్తంలో డబ్బులు ఆశ జూపి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రెండెకరాల భూమిని అధికారులకు మాముళ్లు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లు సమాచారం. సాధారణ రైతులకు అమ్ముకునేందుకు ఎన్ఓసీ ఇవ్వని అధికారులు రియల్ వ్యాపారులకు ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. సైదాపూర్లో ఆక్రమించి కౌలుకు.. మండల పరిధిలోని సైదాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన భూమి పక్కనే ఉన్న సర్వే నం.15లో రెండెకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించి ఇతరులకు కౌలుకు ఇచ్చాడు. ప్రస్తుతం ఆ భూమిలో బోరు వేయడంతో పాటు జొన్న పంటను కూడా సాగు చేస్తున్నాడు. ఈ అసైన్డ్ భూమి గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉన్న రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసైన్డ్ భూమిలో ఏర్పాటు చేసిన బోరు కుతుబ్షాహీపేట సర్వే నం.16లో ఆక్రమించిన అసైన్డ్ భూమిలో ఏర్పాటు చేసిన రోడ్డు వక్ఫ్ భూములతో దందా! వక్ఫ్ భూములనూ వదలని ఘనులు పట్టించుకోని రెవెన్యూ అధికారులు మండల పరిధిలోని సైదాపూర్ తండాలో గతంలో ప్రభుత్వం గిరిజనులకు సర్వే నం.78లో 197 ఎకరాల 32 గుంటల భూమిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం పంపిణీ చేసింది. ధరణి వచ్చిన తరువాత ఆ భూములు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవని తేలాయి. ఇదే అదనుగా భావించిన రియల్ వ్యాపారులు ఎకరాకు రూ.27 లక్షల చొప్పున చెల్లించి, ఆ భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ భూములున్న కొండాపూర్, మాందాపూర్, మునిదేవునిపల్లి, మల్లెపల్లి తదితర గ్రామాల్లోనూ రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ వారిని మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములను పరిరక్షించడంతోపాటు పాటు అమ్మకాలు, కొనుగోళ్లను నివారించి రైతులను కాపాడాలని కోరుతున్నారు. -
పరీక్ష రాసేందుకు వెళ్తూ.. అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ విద్యార్థిని మృతి ● బైక్ను ఢీకొట్టిన లారీ కల్వర్టును ఢీకొట్టడంతో లారీ డ్రైవర్.. చేర్యాల(సిద్దిపేట): లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అపూర్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అడవిటక్కలపాడుకు చెందిన షేక్ మౌలాలి(51), కరీముల్లా ఇద్దరు గుంటూరు నుంచి సిరిసిల్లకు లారీలో సబ్బులు, సర్పులు లోడు చేసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మండల పరిధిలోని వీరన్నపేట గ్రామశివారులోకి రాగానే వాహనం నడుపుతున్న మౌలాలి నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కరీముల్లా లారీలో నుంచి కిందకు దూకాడు. కాగా డ్రైవర్ ముందు ఉన్న అద్దం పగిలి మౌలాలి కిందపడగా అతడిపై లారీ క్యాబిన్ పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన కరీముల్లాను ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. అందోల్ మండల పరిధిలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి, చిన్న కోడూరు మండలంలో యువకుడు, చేర్యాలలో లారీ డ్రైవర్, నారాయణఖేడ్ పరిధిలో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా... వట్పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందింది. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామ శివారులో నాందేడ్ –అకోలా జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జోగిపేట ఎస్ఐ పాండు కథనం ప్రకారం... అల్లాదుర్గ్ మండలం మందాపూర్ గ్రామానికి చెందిన పాముల స్రవంతి(20) హైదరాబాద్లోని బాచుపల్లి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. పరీక్షలు రాసేందుకు ఆదివారం ఉదయం తన మేనబావ వరాల సాయితో కలిసి బైక్పై కళాశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కన్సాన్పల్లి గ్రామ శివారులో నాందేడ్ జాతీయ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో స్రవంతి బైక్ పైనుంచి కింద పడిపోగా లారీ ఆమె తలపై నుంచి దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సాయికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వ్యక్తులు లారీని వెంబడించి, ఫొటోలు తీసి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న స్రవంతిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ పాండు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీతోపాటు డ్రైవర్ జగదీష్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. లారీ, బైక్ ఢీకొని యువకుడు.. చిన్నకోడూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రామునిపట్ల శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన కావటి మల్లయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు ఎల్లం(31), కూతురు రేణుక ఉన్నారు. ఇద్దరి వివాహం జరిపించారు. కాగా ఎల్లం భార్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఎల్లం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సిద్దిపేటలో ఉంటున్నాడు. గ్రామంలో జరుగుతున్న పోచమ్మ బోనాల పండుగకు వచ్చాడు. పండుగ సామాను తేవడానికి ఉదయం 6 గంటలకు బైక్పై సిద్దిపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామునిపట్ల శివారులోకి రాగానే అతివేగంగా వచ్చిన లారీ వెనుకనుంచి బైక్ను ఢీకొట్టడంతో ఎల్లం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రమోహన్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. లారీ ఢీకొట్టడంతో ఒకరు.. నారాయణఖేడ్: రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్కు చెందిన దుర్గయ్య (60) తన కుమారుడు దుర్గేశ్తో కలిసి బైక్పై బాన్సువాడ వైపు వెళ్తున్నాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పోతిరెడ్డి శివారులో వేగంగా వచ్చిన లారీ వెనుకనుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన దుర్గేశ్ను స్థానికులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. -
పిల్లలు పుట్టడం లేదని.. మహిళ ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: సంతానం కలగడం లేదని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కట్ట రామయ్యతో కొన్నేళ్ల క్రితం పెద్దలు ఊర్మిళకు వివాహం జరిపించారు. ఏండ్లు గడిచినా పిల్లలు పుట్టక పోవడంతో ఆమె తరచూ బాధపడేది. శనివారం పొలం వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఊరకుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారుల జోష్..
సంగారెడ్డి: సమ్మర్ వచ్చిందంటే చాలు విద్యార్థులకు ఎనలేని ఆనందం, సంతోషం. సెలవుల్లో టీవీలకు, ఫోన్లకు దూరంగా ఉండేందుకు సెలవులను ఉపయోగకరంగా, సృజనాత్మకంగా మలచాలనే ఉద్దేశంతో చౌటకూర్ మండలంలోని శివ్వంపేట పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. క్యాంపులో ఆటలు, యోగా, మెమొరీ గేమ్స్, క్రీడా కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యోగాసనాలు, వ్యాయామాలు, గ్రూప్ యాక్టివిటీస్, సంగీతం, సైన్స్ ప్రయోగాలు, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఆకట్టుకుంటున్నారు. సమూహాలుగా పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, పరస్పర సహకార నైపుణ్యాలు పెరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థులకు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే వ్యాయామాలతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాంపులో బాలికలు సంప్రదాయ ఆటల్లో, వాలీబాల్ వంటి క్రీడల్లో నైపుణ్యం కనబరుస్తున్నారు. ఇటీవల విద్యా ర్థుల్లో ఒత్తిడి, ఏకాగ్రత లోపం, శారీరక చలనం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి క్యాంపులు ఎంతో ఉపయోగమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. సెలవులను వృథా చేయకుండా విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. నృత్యంలో ఆసక్తి నృత్య పోటీల్లో పాల్గొని, అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు పొందాలనే ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నాను. స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరిక ఉంది. – మానస, విద్యార్థిని డ్యాన్స్ అంటే ఇష్టం డ్యాన్స్ అంటే ఇష్టం. మెలకువలు నేర్పుతూ డ్యాన్స్లో శిక్షకులు శిక్షణనిస్తున్నారు. డ్యాన్న్స్తో మైండ్ ప్రశాంతంగా ఉంది. – రవళి, విద్యార్థిని నృత్యం, యోగా, సంగీతం , క్విజ్ తదితర పోటీల్లో.. ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు -
ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి
బలి తీసుకున్న అనారోగ్యంకల్హేర్(నారాయణఖేడ్): గంటల వ్యవధిలో తండ్రి,కొడుకు ఒకే రోజు మరణించారు. ఈ ఘటన మండలంలోని మార్డిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోమ్మల పోచయ్య(69), బోమ్మల రాజు(39) ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. బోమ్మల పోచయ్య ఇంట్లోనే మంచం పట్టాడు. రాజు హైదరాబాద్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుదిశ్వాస వరకు చూసుకోవాల్సిన కొడుకు రాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో మనోవేదనకు గురైన పోచయ్య ఇంట్లోనే మరణించాడు. తండ్రి పోచయ్య మరణవార్త తెలిసిన రాజు రాత్రి మృతి చెందాడు. తండ్రీ, కొడుకు ఒకే రోజు మరణించడంతో కుటుంబీకులు, గ్రామస్తులు విషాదంలో మునిగారు. ఆదివారం సాయంత్రం ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. -
అంగన్వాడీ ఖాళీల భర్తీ!
సంగారెడ్డి జోన్: జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ ఆయా పోస్టులను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార యంత్రాంగం ఈ మేరకు భర్తీకి సన్నాహాలు ప్రారంభించింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి కేంద్రాలు పునఃప్రారంభం కానున్నాయి. 79 టీచర్.. 416 ఆయా పోస్టులు జిల్లావ్యాప్తంగా ఖేడ్, సదాశివపేట, జహీరాబాద్, అందోల్, పటాన్చెరు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో 79 టీచర్, 416 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులు 98,450 మంది ఉన్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తుంటారు. త్వరలో కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యను అందించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చిన్నారులకు కేంద్రాల వద్ద నాణ్యమైన, రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ అందించేందుకూ రూపకల్పన చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీకి కలెక్టర్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేసి మార్గదర్శకాలకనుగుణంగా నియామకాలు చేయనున్నారు. నియామకాలకు సంబంధించి విద్యార్హతల్లో పలు మార్పులు చేశారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారిని అర్హులుగా గుర్తించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేంద్రాల్లో ఇతర సిబ్బందితో కొనసాగిస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్ జిల్లాలో 79 టీచర్, ఆయా పోస్టులు ఖాళీ నేటి నుంచి కేంద్రాల పునఃప్రారంభంప్రభుత్వ ఆదేశాల మేరకు -
టీచర్ల జీతాల్లో కోతలు సరికాదు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: హెల్త్ కార్డుల పేరిట ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకుండానే ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం సరికాదని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్, తపస్, యూటీఎఫ్, టీటీయూ సంఘాల ఉపాధ్యాయ నాయకులు ఆదివారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆస్పత్రులతో సమావేశం నిర్వహించకుండానే ఆరోగ్యకార్డులు, విధివిధానాలు తెలియజేయకుండానే ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసే ప్రీమియం రక్షణ టీచర్లను మోసగించే విధంగా ఉందన్నారు. విధివిధానాలు విడుదల చేసిన తర్వాత ప్రీమియం సంబంధించిన డబ్బులు జీతాల నుంచి కోత విధించాలని స్పష్టం చేశారు. ఈ పథకం ఇష్టంలేని వారికి మినహాయింపునివ్వాలని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పుడు ఒకరి నుంచి మాత్రమే ప్రీమియం వసూలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ తపస్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విధివిధానాలు లేకుండా కోతలా?? నారాయణఖేడ్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న ఆరోగ్య పథకం అమలు కోసం మార్గదర్శకాలు లేకుండానే వేతనంలో కోత పెట్టడం సరైందికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఖేడ్ మండలం తుర్కాపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య పథకం విధివిధానాలు, మార్గదర్శకాలు, ఆస్పత్రుల జాబితా, వ్యాధుల ప్రస్తావన ప్రకటించకుండానే జూన్ 2 నుంచి అమలు చేస్తున్నామని ప్రకటించడం శోచనీయమన్నారు. మార్గదర్శకాలను వెంటనే ప్రకటించాలన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, కౌన్సిలర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, ప్రధానకార్యదర్శి రాంచందర్, స్థానిక బాధ్యులు పాల్గొన్నారు. -
లింగంపల్లి గురుకులానికి రూ.14 కోట్ల నిధులు
మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి(అందోల్): మునిపల్లి మండలంలోని లింగంపల్లి బాలుర గురుకుల పాఠశాల అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రి ఆదివారం లింగంపల్లి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గురుకుల పాఠశాల హాస్టల్ భవనం, డార్మెట్ గదులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం మంత్రి బుధేరాలోని మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాటిపల్లి కేజీఏబీ పాఠశాలను కూడా మంత్రి సందర్శించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.61 లక్షలు మంజూరుచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తక్కడపల్లి బ్రిడ్జి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. -
132 బడుల్లో ప్రీ ప్రైమరీలు
ప్రభుత్వం సర్కారీ స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు అనుభవమున్న ఉపాధ్యాయులతో బోధన చేస్తున్నప్పటికీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తరగతులు ప్రారంభించకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించింది. అందులోభాగంగానే ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగానే ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీలు మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది మరిన్ని ప్రీప్రైమరీల ఏర్పాటుకురంగం సిద్ధమైంది. న్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో 860 ప్రాథమిక, 197 ప్రాథమికోన్నత, 205 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నప్పటికీ ప్రీ ప్రైమరీలు లేకపోవడంతో అధికశాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గతేడాది జిల్లాలో 59 ప్రీ ప్రైమరీలను ప్రారంభించింది. ఒక్కో పాఠశాలలో ఇన్స్ట్రక్టర్తోపాటు ఆయాను నియమించింది. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు వేతనంగా ఇస్తోంది. ఆట పాటల ద్వారా సుమారు 38 రకాలుగా వివిధ రూపాల్లో చిన్నారులకు విద్యాబోధన చేస్తున్నారు. దీంతో గతేడాది 750 మంది చిన్నారులు ప్రీ ప్రైమరీల్లో చేరారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రీప్రైమరీలు మంచి ఫలితాలనివ్వడంతో ఈ ఏడాది 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాకు మరో 132 ప్రీ ప్రైమరీలను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో 22 ప్రీ ప్రైమరీలు, నాన్ కోర్ పరిధిలో 110 ప్రీ ప్రైమరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్స్ట్రక్టర్లతోపాటు ఆయాలను నియమించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. వీటి ఏర్పాటుతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. గతేడాది 59 మంజూరు సర్కారీ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి


