కారు బోల్తాపడి ఒకరు మృతి
ముగ్గురికి స్వల్ప గాయాలు
పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రేశం మున్సిపాలిటీకి చెందిన ముజీబుద్దీన్ (29) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున స్నేహితులు షేక్ అస్లాం, చంద్రశేఖర్, నిత్యానంద్తో కలిసి ఇంద్రేశం నుంచి ఇస్నాపూ ర్కు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో పోచారం సమీపంలోని నక్క వాగు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముజీబుద్దీన్ తీవ్రంగా గాయపడగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ముజీబుద్దీన్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేశారు.


