breaking news
Sangareddy District News
-
‘సాక్షి’ చొరవ చాలా గొప్పది
ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి కొండపాక(గజ్వేల్): పదో తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించేందుకు సాక్షి దినపతిక్ర చేసిన చొరవ చాలా గొప్పదని ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. కొండపాక, మర్పడ్గ, సిర్సనగండ్ల గ్రామాల హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సాక్షి స్టడీ మెటీరియల్ను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక నిపుణులతో సాక్షి స్టడీ మెటీరియల్ను తయారు చేయించడం గొప్ప విషయమన్నారు. మూడు గ్రామాల్లో సుమారు 250 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశామని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సాక్షి దినపత్రిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభినందనీయం.. చిన్నకోడూరు(సిద్దిపేట): సాక్షి దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయమని సర్పంచ్లు ముక్కెర రేఖ, మాకు మహేశ్ అన్నారు. మండల పరిధిలోని గోనెపల్లి ఉన్నత పాఠశాలలో ఏడుగురు పదోతరగతి విద్యార్థులకు గురువారం ఓబులాపూర్ సర్పంచ్ ముక్కెర రేఖ, శంకరాయకుంట సర్పంచ్ మాకు మహేశ్ నలుగురికి సాక్షి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్తో రానున్న వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. రూ. 250కే స్టడీ మెటీరియల్ అందించడం సంతోషకరమని, విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.అంబిటస్లో.. సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని అంబిటస్ హైస్కూల్ విద్యార్థులకు గురువారం సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. సాక్షి రూపొందించిన స్టడీ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నమ్మించి.. పుస్తెలతాడుతో ఉడాయించి
చేర్యాల(సిద్దిపేట): చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సీఐ కార్యాలయంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని చుంచనకోటకు చెందిన వృద్ధురాలు మంద గాలమ్మ ఈనెల 4న ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పట్టణ కేంద్రానికి చెందిన ఆరపల్లి వంశీకృష్ణ వెనుక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మీ కూతురు అరటి పండ్లు ఇవ్వమని పంపిందని నమ్మించాడు. అనంతరం తాగు నీరు ఇవ్వమని అడిగాడు. వృద్ధురాలు వంట గదిలోకి వెళ్లడంతో వెంబడించి ఆమె మెడలోని 27 గ్రాముల బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీఐ రమేష్, చేర్యాల ఎస్ఐ నవీన్, కొమురవెల్లి ఎస్ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు -
ఏడేళ్లకొచ్చిన ఓట్ల పండుగ
ఐదు విలీన పంచాయతీల్లో కనిపిస్తోన్న ఎన్నికల హడావుడి జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణానికి సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్ల తర్వాత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నగరా మోగిన వెంటనే గ్రామాల్లో సందడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు జోరుగా ప్రచారం చేస్తుండటంతో జనంలో జోష్ కనిపిస్తుంది. జహీరాబాద్ పట్టణం చుట్టూ ఉన్న రంజోల్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్, హోతి(కె) ఐదు గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ఐదు పంచాయతీలను జహీరాబాద్ మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. గ్రామాల విలీనమైన తర్వాత 2019లో పురపాలక సంఘం ఎన్నికలు వచ్చాయి. తమ గ్రామ పంచాయతీని మున్సిపల్లో విలీనం చేయరాదని హోతి(కె) ప్రజలు కోర్టులో కేసు వేశారు. అప్పట్లో రాష్ట్రం అంతటా ఎన్నికలు జరగ్గా జహీరాబాద్ మున్సిపల్లో మాత్రం వాయిదా పడింది. దీంతో ఐదు పంచాయతీ గ్రామాల ఓటర్లు సుమారు ఏడేళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో రాజకీయ విరామం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈసారి ఐదు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాల్లో ప్రగతి పనులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పురపోరులో నామినేషన్, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం జోరుగా చేస్తున్నారు. దీంతో విలీన పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. -
కానరాని ఆప్షన్.. విద్యార్థుల్లో టెన్షన్
సాక్షి, సిద్దిపేట ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసేందుకు మోడల్ స్కూల్ ఆప్షన్ రావడం లేదు. విద్యార్థులకు చేయూత అందించేందుకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. Telanganaepass.cgg.gov.in లో దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థులకు సమాచారం అందించారు. దీనిలో భాగంగా ఆన్లైన్లో విద్యార్థుల నుంచి దరఖాస్తులను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 31, సిద్దిపేట జిల్లాలో 14 మోడల్ స్కూల్స్ ఉండగా వాటిలో సగానికి పైగా పేర్లు రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 5 నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు 5 నుంచి 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి బాలురకు రూ.1,000, బాలికలకు రూ.1,500లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.3,500 అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో లక్షకు పైగా ఎస్సీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చాలా వరకు తెలంగాణ మోడల్ స్కూళ్ల పేర్లు రాకపోవడంతో ఆదాయం, కులం సర్టిఫికెట్లను ఆయా మండల తహసీల్దార్ల నుంచి తీసుకుని ఆన్లైన్ సెంటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మోడల్ స్కూల్కు వెళ్లి అడిగితే తమకు సమాచారం లేదని చెప్పుతున్నారు.ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ అందేనా? అర్హులు కాదా? తెలంగాణ ఈపాస్ ఆన్లైన్లో కనపించని మోడల్ స్కూల్స్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు స్కాలర్ షిప్లకు దరఖాస్తు చేసేందుకు అర్హులు కారా?, మోడల్ స్కూళ్ల పేర్లు గల్లంతు అయ్యాయా? అధికారుల చేసిన నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారనుందా? అని ఆందోళన చెందుతున్నారు. పేదలకు చేయూతను అందించే స్కాలర్ షిప్ అందకుండా పోతుందా? అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎస్సీ వెల్ఫేర్ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై సిద్దిపేట ఎస్సీ వెల్ఫేర్ ఇన్చార్జి అధికారి హమీద్ను ఫోన్లో సంప్రదించగా ఈ విషయం హైదరాబాద్లోని ఉన్నత అధికారులకు సమాచారం అందించామని, రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రామాయంపేట(మెదక్): మాజీ సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయమైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం నిర్వహించిన మున్సిపల్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని మాట్లాడారు. కేవలం ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్ అభివృద్ధిని మరిచారని ఆరోపించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్, ఈరెండున్నర ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలని అభివర్ణించారు. గ్రామ గ్రామాన బెల్ట్షాపులతో పల్లెలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని, కాంగ్రెస్ నాయకులు భూములు అమ్ముకొని రూ. వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. నిరుపేద యువతుల వివాహాలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అడుగంటిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ రహదారి నుంచి దామరచెరువు వరకు బైపాస్ రోడ్డులో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో కేన్స్ర్ ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు పట్టణాధ్యక్షుడు అవినాశ్గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సామాన్య భక్తులే వీఐపీలు
శివరాత్రి ‘జాతర’పై సమీక్షలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: శివరాత్రి ఉత్సవాల్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని వీఐపీలుగా వారికి గుర్తింపునివ్వాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహించనున్న జాతర సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షకు ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా స్థానిక భక్తులతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 4 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఐదు రోజులపాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఈవో శశిధర్మం ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్, ఆలయ ఈవో శశిధర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రూ. లక్ష తీసుకో.. సోడా మెషీన్ కొనుక్కో
సదాశివపేట పాదయాత్రలో మహిళకు జగ్గారెడ్డి సాయంసదాశివపేట(సంగారెడ్డి): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు పట్టణ నాయకులు కార్యకర్తలతో కలిసి గురువారం శంభులింగేశ్వర మందిరం నుంచి గొల్లకేరీ, బస్టాండ్, సుభాష్రోడ్డు, శాసీ్త్రరోడ్ల మీదుగా పాదయాత్ర చేశారు. శంభులింగేశ్వర మందిరం సమీపంలో కారు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ సోడా బండిపై నిమ్మరసం అమ్ముకునే మహిళ కనిపించింది. ఆమె దగ్గర జగ్గారెడ్డి సోడా కొనుక్కుని తాగుతూ రోజుకు ఎంత సంపాదిస్తున్నావని అడిగి తెలుకున్నారు. సోడా మెషీన్ ఉంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తానని సదరు మహిళ చెప్పగా..సోడా మెషీన్ ధర ఎంత ఉంటుందో అనుచరులను కనుక్కుని వెంటనే ఆ మహిళకు రూ.లక్ష ఇచ్చేశారు. సోడా మెషీన్ కొనుక్కుని ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలని జగ్గారెడ్డి సదరు మహిళకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు శంకర్గౌడ్,జైగౌడ్, కొత్తగొల్ల శేఖర్, అరుణ్, చిరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిపుత్రుల కళాశా‘లా’
సంగారెడ్డి టౌన్: గిరిజనులు న్యాయ విద్య అభ్యసించేలా మొట్టమొదటి గిరిజన పురుషుల ‘లా’కళాశాలను ఐదేళ్ల కిందట సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల ఇది. గిరిజనులు న్యాయవిద్యను అభ్యసించేలా ఉచిత కళాశాలతోపాటు హాస్టల్ వసతి కల్పిస్తోంది. లా సెట్లో ఉత్తీర్ణులైన వారు విద్యను అభ్యసించవచ్చు. ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా ఐదేళ్లపాటు ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తోంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి బీఏ, ఎల్ఎల్బీ న్యాయశాస్త్ర పట్టాను అందించనున్నది. ఈ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉంది. ఐదేళ్ల కోర్సు... ఇంటర్మీడియెట్ అర్హతతో లా సెట్ రాసిన వారిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇతరులకు రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఐదేళ్లలో బీఏ ఎల్.ఎల్.బి పూర్తి చేసేందుకు వీలుంటుంది. ప్రతీ ఏటా 60 మందికి ప్రథమ సంవత్సరంలో సీట్లు కేటాయిస్తున్నారు. లా ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 8 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు రుసుముతో మే 15 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష మే 18న నిర్వహించనున్నారు. ఉచిత వసతి సౌకర్యం.. కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి కల్పిస్తారు. ఎలాంటి ఖర్చు లేకుండానే కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీనెల పాకెట్ మనీ రూపంలో డబ్బులను అందజేస్తారు. కాలేజీలోని గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కళాశాలలో సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. విద్యార్థుల కోసం వ్యాయామశాల ఏర్పాటు చేశారు. అలాగే న్యాయవాదులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటారు. స్పోకెన్ ఇంగ్లిష్, పీజీ కోర్సులకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తుంటారు. జిల్లా, హైకోర్టులలో ఇంటర్నషిప్ కల్పిస్తారు. ఇంటర్న్షిప్కు వెళ్లినప్పుడు స్టైపెండ్ రూపంలో డబ్బులు అందజేస్తారు. జిల్లాలలోని ప్రతీ తండాలలో కళాశాల ఉపాధ్యాయులు ఇంటర్ ఆపై చదివిన విద్యార్థులకు లా కళాశాలలో ప్రవేశం పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మారుమూల తండా నుంచి వచ్చా మారుమూల తండా నుంచి వచ్చి ఇక్కడ న్యాయ విద్యను అభ్యసిస్తున్నాను. పేదవారికి న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయ శాస్త్రం చదువుతున్నాను. శిక్షణ కోసం కోర్టుకు వెళ్లినప్పుడు వారు చెప్పే సలహాలు, సూచనలను అనుసరిస్తూ శిక్షణ తీసుకుంటున్నాను. న్యాయవాదిగా పేరు తెచ్చుకుని పేద వారికి న్యాయసేవ చేస్తాను. – చందు నాయక్, విద్యార్థి,సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం సద్వినియోగం చేసుకోవాలి సంగారెడ్డిలోని గిరిజన సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలను విద్యార్థులు ఎంపిక చేసుకుని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. 60 సీట్లలో 51 సీట్లు ఎస్టీలకే ఉన్నాయి. మిగతావి ఇతర రిజర్వేషన్లకు భర్తీ చేస్తారు. ఇక్కడ చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. – శ్రీనివాస్, ‘లా ’కళాశాల ప్రిన్సిపాల్ -
లీజుకు అసైన్డ్ భూములు
● జోరుగా క్రయ విక్రయాలు కూడా ● పేదల భూముల్లో పెద్దల పాగా హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న అసైన్డ్ భూముల్లో పెద్దలు పాగా వేస్తున్నారు. లీజు పేరుతో దస్తావేజులు తయారు చేసి అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తున్నారు. హత్నూర మండల కేంద్రంలో సర్వే నంబర్లు 115, 116, 132లలో వరుసగా 118 (ఎకరాలు), 315 (ఎకరాలు), 199 ఎకరాల అసైన్డ్ భూమి ఉండటంతో దశలవారీగా గత ప్రభుత్వాలు పేద ప్రజలకు అసైన్డ్ చేస్తూ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడంతో కబ్జాలో కొనసాగుతూ వచ్చారు. కొంతకాలంగా మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోని అసైన్డ్ భూములను జోరుగా ఇతర గ్రామాలకు చెందిన పట్టణాలకు చెందిన బడా నాయకులు లీజుల పేరుతో కొనుగోలు చేసి పాగవేశారు. సుమారు 80 ఎకరాల అసైన్డ్ భూమి వరకు క్రయవిక్రయాలు జరిగి ఉంటాయని పలువురు పేర్కొన్నారు. కాసాల గ్రామ శివారులో అసైన్మెంట్ విక్రయాల దందా జోరుగా సాగుతున్నాయి. సర్వే నంబర్ 336 లో 224 ఎకరాల అసైన్డ్ భూమిలో 200 మందికి పైగా పేద ప్రజలకు గత ప్రభుత్వాలు సర్టిఫికెట్లను మంజూరు చేశాయి. ప్రస్తుతం ఆ భూములు చాలావరకు కాంట్రాక్టర్లకు, బడా వ్యాపారుల చేతుల్లోకి మారిపోయాయి. అసైన్డ్ భూమిని లబ్ధిదారులకు ఎంతోకొంత డబ్బులు ముట్టజెప్పి బాండ్ పేపర్పై లీజు రాసుకుని ఇతర వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. ఫాంహౌజ్లు వేసుకుంటున్న బడా నాయకులు అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన బడా నాయకులు కాంట్రాక్టర్లు అసైన్డ్ భూమి చుట్టూ ఫంక్షనింగ్ పలకలు వేసుకుని దర్జాగా గేట్లు పెట్టుకుని ఫాంహౌజులు వేసుకుంటున్నారు. పేద ప్రజలకు కేటాయించిన అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసిన వారిపై ఇటు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా మండలంలో భూముల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు చింతల్చెరు, బోరపట్ల, సిరిపుర, గుండ్ల మాచనూర్, ముచ్చర్ల, గ్రామాలలో సైతం అసైన్మెంట్ భూములు లబ్ధిదారుల నుంచి ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పటికై నా అధికారులు అసైన్మెంట్ భూముల క్రయవిక్రయాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. క్రయ విక్రయాలు జరిగితే చర్యలే పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసినా విక్రయించినా చర్యలు తప్పవు. లీజుల పేరుతో అసైన్మెంట్ భూములను కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. పేదలకు ఇచ్చిన భూములు పేదలే సాగు చేసుకుని జీవనం పొందాలి. –పర్వీన్ షేక్, తహసీల్దార్ -
ఆ మూడింటిపై గురి..!
కోహీర్, జహీరాబాద్, సంగారెడ్డిపై ఎంఐఎం నజర్ ఈ ఎన్నికల్లో ఎంఐఎం జిల్లాలో తన ఉనికిని మరోమారు చాటుకోవాలనుకుంటోందా? చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికలో కీలకంగా మారాలని భావిస్తోందా? అందుకోసమే తమకు పట్టున్న మున్సిపాలిటీలపై గురిపెట్టి వ్యూహాత్మకంగా వెళుతోందా..? అంటే అవుననే సమాధానమే రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉండగా, ఐదు మున్సిపాలిటీల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. తమకు పట్టున్న వార్డులను ఎంపిక చేసుకుని మొత్తం 41 కౌన్సిలర్ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఒంటరిగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోకపోయినప్పటికీ, ఏదైనా పార్టీ అలయన్స్లో ఈ పీఠాలను కై వసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొత్తగా మున్సిపాలిటీగా మారిన కోహీర్లో 16 వార్డులుండగా..6 చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోహీర్లోని నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రెండు ఎంపీటీసీ స్థానాలను ఈ పార్టీ గెలిచింది. ఇప్పుడు మున్సిపాలిటీగా మారడంతో కౌన్సిలర్ స్థానాలపైనా గురి పెట్టింది. జహీరాబాద్ బల్దియాపైనా నజర్ వేసింది. 37 వార్డుల్లో 14 చోట్ల తమ అభ్యర్థులను దింపింది. 2010లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ ఇక్కడ మూడు కౌన్సిలర్ స్థానాలను కై వసం చేసుకోగా అంతకుముందు ఎన్నికల్లో ఏకంగా ఏడు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. ఈ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో కొన్ని గ్రామాల్లోనూ ఆ పార్టీకి గట్టి పట్టుంది. జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా, 13 వార్డుల్లో మజ్లిస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ రెండు చోట్ల ఎంఐఎం గెలిచింది. అంతకుముందు ఎన్నిక ల్లో 14 మంది పోటీ చేస్తే ఎనిమిది కౌన్సిలర్ స్థానాలను కై వసం చేసుకుంది. గత ఎన్నికల కంటే ఎక్కు వ స్థానాలను గెలుచుకునేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాల ఎంపికలో నిర్ణయాత్మకంగా మారాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డుల్లో మూడు చోట్ల, సదాశివపేటలోని 26 వార్డులకు ఐదు వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.కార్నర్ మీటింగ్లతో ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన మీటింగ్లో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని సంగారెడ్డి జిల్లాలో తమ పార్టీని బలోపేతం చేస్తున్నామని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ పార్టీనే ఆయన టార్గెట్ చేసిన అసదుద్దీన్ చైర్మన్, వైస్చైర్మన్ పీఠాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని విమర్శించారు. జహీరాబాద్, కోహీర్లలోనూ కార్నర్ మీటింగ్ ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద బల్దియా ఎన్నికల్లో సత్తాచాటేందుకు ఈ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది. -
కాంగ్రెస్కు ఓటు అభివృద్ధికి చోటు
కోహీర్లో రోడ్షోలో మంత్రి అజహరుద్దీన్జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన కోహీర్ మున్సిపాలిటీలో గురువారం రోడ్షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇతర పార్టీలకు ఓటు వేసినా ప్రయోజనం ఉండదన్నారు. మొత్తం వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపర్చాలని కోరారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, పట్టణ అధ్యక్షుడు శంషీర్, ఆయా వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు. -
రేయింబవళ్లు ప్రచారమే
పటాన్చెరు: మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచేవారెవరో స్పష్టత రావడంతో ఇక ఎన్నికల ఘట్టంలో ఎంతో కీలకమైన ప్రచార పర్వానికి అభ్యర్థులు తెరతీశారు. ఇస్నాపూర్ పారిశ్రామికవాడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు రాత్రి పూట సైతం తమ స్నేహితులు, బంధువులతో కలిసి వెళ్లి ఓట్లు వేయమని వేడుకుంటున్నారు. పగటిపూట కండువాలు కట్టుకుని దర్జాగా ప్రచారం సాగిస్తుండగా రాత్రిపూట తన వైపు ఓటర్లను తిప్పగలిగే వ్యక్తుల ఇళ్లకు వెళ్తున్నారు. ప్రతీ ఓటు కీలకమనే భావనలో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తుండటంతో వారిని కలుసుకునేందుకు ప్రత్యేక సమయం తీసుకుంటున్నారు. ఇందుకోసం రాత్రి సమయంలోనూ ప్రచారం చేస్తున్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మద్యం ఏరులై పారుతోంది. ప్రచార పర్వానికి ముందే అభ్యర్థులు మందు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తమ తమ శిబిరాల్లో మందును ముందే తెప్పించి పెట్టారని చెప్తున్నారు. అలాగే స్థానిక వైన్షాపుల నుంచి కార్యకర్తలకు మందు ఇప్పించే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇస్నాపూర్ పరిధిలోని పాశమైలారం, రుద్రారం, లక్డారం, చిట్కుల్, బచ్చుగూడ, ముత్తంగి, ఇస్నాపూర్ పాత గ్రామాల్లో పాత ఓటర్లతో నేతలకు పెద్దగా చిక్కుల్లేవు. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన కాలనీలతోనే సమస్యలు వచ్చాయి. కాలనీ ఓటర్లు తమ మనోగతం వెల్లడించడం లేదు. అలాగని ఏ పార్టీ అభ్యర్థులను కాదనడం లేదు. కాలనీల్లోని కొత్త ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు కౌన్సిలర్ అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. నిత్యం ప్రచార పర్వంలో పాల్గొంటున్న వారికి రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారని మందు, భోజన సదుపా యాలు వేరేగా ఉన్నాయని ఇంకా ఓటర్లకు డబ్బులు పంచే ప్రక్రియ మొదలు కాలేదని చెప్తున్నారు. ప్రతీ ఓటు కీలకమే -
కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదు
జహీరాబాద్: గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఎమ్మెల్యే కె.మాణిక్రావు విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆయన ఓటర్లను కోరారు. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15, 28వ వార్డుల్లో గురువారం ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను నేరుగా కలుసుకుని బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్ధతు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ పాలనలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, మాజీ ఎంపీటీసీ రజనీప్రియ, బీఆర్ఎస్ నాయకులు పద్మజ, శివకుమార్ పాల్గొన్నారు. -
పోష్ చట్టంతో వేధింపుల నుంచి రక్షణ
మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి లలితకుమారినారాయణఖేడ్: పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల నుంచి రక్షణకు పోష్ యాక్ట్ ఎంతో కీలకమని మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి లలితకుమారి స్పష్టం చేశారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం పోష్ యాక్ట్పై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతీ కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు ఆవశ్యకత, లోకల్ కమిటీ పాత్ర, ఫిర్యాదు విధానం, మహిళలు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదుచేయడానికి ఉపయోగపడే షీ–బాక్స్ పోర్టల్ గురించి సమగ్రంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, ఖేడ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ నర్సింహారావు, సీడీపీఓ సుజాత, మహిళా సాధికారిత కేంద్రం జిల్లా సమన్వయకర్త పల్లవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, స్థానిక ఎస్సై మొగులయ్య, షీటీమ్ ఎస్సై తులసీరాం తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న లలితకుమారి -
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. రామచంద్రాపురం పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద బుధవారం సీఐటీయూ సమ్మె నోటీసు ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తేవడం వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సురేశ్, లోకనాథ్, సంతోష, లక్ష్మి, సోనీ తదితరులు పాల్గొన్నారు. కరపత్రాల ఆవిష్కరణ నారాయణఖేడ్: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సాయిలు పిలుపునిచ్చారు. ఖేడ్లో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కేంద్రం తీసుకువచ్చిన కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసే లేబర్కోడ్ను రద్దు చేయాలన్నారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ముక్త కంఠంతో వ్యతిరేకించాలని సూచించారు. డివిజన్ కార్యదర్శి రమేశ్, బా లప్ప, రాజన్న, శివరాజ్, మాణికయ్య, నర్సింహులు, సంజీవులు, ఎల్లయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
మహిళకు గర్భసంచితో పాటు 2.5 కిలోల గడ్డ తొలగింపు దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం వైద్యులు మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులోంచి 2.5 కిలోల ఓవరియాన్ గడ్డతో పాటు గర్భసంచిని తొలగించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ సమాచారం మేరకు... అక్బర్పేట–భూంపల్లి మండలం బొప్పాపూర్కు చెందిన అరిగె వెంకటలక్ష్మి కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేదు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతతో దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి రక్తం తక్కువ ఉండటంతో 3 యూనిట్స్ రక్తం ఎక్కించారు. అనంతరం ఆపరేషన్ చేసి 2.5 కిలోల ఓవరియాన్ గడ్డతో పాటు, గర్భసంచిని తొలగించారు. -
వారసుల గెలుపు కోసం..
మాజీ చైర్మన్లు యత్నాలుమెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో వారసత్వ పోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన ముగ్గురు చైర్మన్లకు కౌన్సిలర్గా అవకాశం ఉన్నా ఈసారి పోటీ చేయడం లేదు. కేవలం వారి వారసులను రాజకీయంగా నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్గా మూడు సార్లు పనిచేసిన బట్టి జగపతి తన భార్యతోపాటు కొడుకును కూడా బరిలో దించాడు. 17వ వార్డులో బట్టి జగపతి భార్య బట్టి లలిత బీఆర్ఎస్ నుంచి పోటి చేస్తుండగా.. వారి కుమారుడు బట్టి ఉదయ్ 29వ వార్డు నుంచి ఇదే పార్టీ తరపున బరిలో ఉన్నాడు. దీంతో వారిద్దరి గెలిపే లక్ష్యంగా బట్టి జగపతి ప్రజల్లో ఆయనకు ఉన్న పలుబడిని వాడుతున్నాడు. తొడుపునూరి చంద్రపాల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసి చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం రిజర్వేషన్ అనుకూలించక పోవడంతో ఆయన కొడుకు శివరామకృష్ణను కాంగ్రెస్ పార్టీ తరపున 31వ వార్డులో కౌన్సిలర్ బరిలోకి దింపారు. వారి సామాజిక వర్గంతోపాటు ప్రజల్లో తనకున్న ఇమేజ్తో కొడుకును గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు మల్లికార్జున్గౌడ్ రెండుసార్లు చైర్మన్గా పనిచేశారు. ఈసారి పోటీచేసే అవకాశం ఉన్న వదులుకొని అతని భార్య గాయత్రిని 15వ వార్డులో బీఆర్ఎస్ తరపున నిలబెట్టారు. పార్టీ గెలిస్తే ఆమెనే మున్సిపల్ చైర్మన్గా ప్రచారం కొనసాగుతోంది. దీంతో ఆమె గెలుపే లక్ష్యంగా మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇలా ముగ్గురు మాజీ చైర్మన్లు వారి వారసుల గెలుపుకోసం ప్రచారాలు మొదలు పెట్టారు. -
బీసీలకు కాంగ్రెస్ అన్యాయం
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా కాంగ్రెస్ మోసం చేసిందని, దానికి మంత్రి దామోదర రాజనర్సింహనే కారణమని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. జోగిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుందని ఆయన ఎద్దేవా చేశారు. అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ వర్గాలకు కాకుండా ఓసీలకు కేటాయించడం విడ్డూరంగా ఉందని, బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీలకు కేటాయిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీ కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు.ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. జోగిపేట మున్సిపల్ పరిశీలకులు నరహరిరెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పి.నారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగభూషణం, సీనియర్ నాయకులు డి.వీరభద్రారావు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
చలి ప్రభావంతో ఎదుగుదల లేని వరి
● యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే మేలు ● వ్యవసాయ అధికారి శ్రీనాథ్ సిద్దిపేటఅర్బన్: ముందస్తుగా నాటు వేసిన లోతట్టు ప్రాంతాల వరి పైర్లలో చలి ప్రభావం అధికంగా ఉండడంతో ఎదుగుదల కుంటుపడింది. దీంతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వరి పైరు తిరిగి మెరుగవుతుందని సిద్దిపేట అర్బన్ మండల వ్యవసాయ అధికారం శ్రీనాథ్ అన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలంతో పాటు రంగధాంపల్లిలో వరి పైరులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ వరిలో నాచు సమస్య అధికంగా ఉన్న వారు పొలంలో నీరు తొలగించి ఆరబెట్టుకోవడంతో నాచు సమస్య తగ్గుతుందన్నారు. పొలంలో కలుపు తీయించడం వల్ల వేరు వ్యవస్థకు గాలి, వెలుతురు ప్రసరించి పోషకాలను స్వీకరించే సామర్థ్యం పెరిగి పైరు వృద్ధి చెందుతుందని తెలిపారు. వరి ఎదగకపోతే 300 గ్రాముల మాంకోజెబ్, కార్బండిజం మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ గట్టిపడి పైరు బాగా పెరుగుతుందని అన్నారు. వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతి అధికంగా ఉందని, అలాగే తేలికపాటి నేలల్లో జింక్ లోపం గమనించినట్లు తెలిపారు. నివారణ కోసం క్లోరాంథ్రానిలిప్రోల్ 60ఎంఎల్ తో పాటు 200 ఎంఎల్ జెనెట్రా లేదా 400 గ్రాముల కార్టప్ హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని ఎకరానికి 8 నుంచి 10 పంపులకు కలుపుకొని పిచికారీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ పవన్, రైతులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
వట్పల్లి(అందోల్): అదృశ్యమైన ఓ యువకుడు శవమై కనిపించిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపుడి కొత్తూరుకి చెందిన డమ్ము వెంకటేశ్(31) కుటుంబం 8ఏళ్ల క్రితం వట్పల్లికి వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 31న తెల్లవారు జామున కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం సాయంత్రం వారు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నుంచి దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడగా.. భవనం లిఫ్ట్ గుంత నీటిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లుగా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ లవకుమార్, ఎస్ఐ–2 శ్రీహరితో పాటు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పరిశీలించగా ఈనెల 31న అదృశ్యమైన డమ్ము వెంకటేష్గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆ రెండూ మోసకారి పార్టీలే
● బీజేపితోనే అభివృద్ధి సాధ్యం ● ఎంపీ రఘునందన్రావు మెదక్ కలెక్టరేట్: పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, మూడేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ రెండు మోసకారి పార్టీలేనని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. బుధవారం మెదక్ పట్టణంలోని పలు వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడుచోట్ల కార్నర్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు కారుపార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడు వేలకోట్లు వెనకేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో సంపాదించినది సరిపోక కవిత ఢిల్లీకి వెళ్లి అక్రమ మద్యం కేసులో జైలు పాలయ్యారని విమర్శించారు. హరీశ్రావు దోపిడీకి అడ్డే లేకుండా పోయిందని, జిల్లా ప్రజలకు ఈ విషయం బాగా తెలుసు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిందేమి లేదని విమర్శించారు. కరోనా సమయంలో ఉచిత టీకాలతోపాటు ఉచిత బియ్యం అందించిన ఘనత మోదీకే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, బక్కవారి శివ, ప్రతాప్, సుబాష్ చంద్రబోస్, నాయిని ప్రసాద్, రంజిత్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పురపోరు.. ప్రచార హోరు
256 వార్డులు... 1,045 అభ్యర్థులు ● స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు ● గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ఘట్టాలు ముగియడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇక ప్రచార పర్వం జోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను కలవడంతోపాటు ప్రచారానికి సామాజిక మాధ్యమాలను సైతం విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. 804 పార్టీ.. 241 మంది స్వతంత్ర అభ్యర్థులు జిల్లాలో 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డులున్నాయి. ఆయా మున్సిపాలిటీలలో ప్రస్తుతం కౌన్సిలర్ల పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. 2,293 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 1,490 ఆమోదించారు. మంగళవారం వరకు 445 మంది పోటీ నుంచి తప్పుకోగా 1,045 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోరులో ఉన్నారు. 804 మంది గుర్తింపు పొందిన పార్టీ, 241 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. బీ ఫారాలు సమర్పించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయించగా స్వతంత్రులుగా పోటీ చేస్తున్న వారికి ఎన్నికల సంఘం వివిధ రకాల గుర్తులు కేటాయించింది. స్థానిక సమస్యలే ఎజెండా పురపోరులో భాగంగా అభ్యర్థులు స్థానిక సమస్యలు ఎజెండాగా మార్చుకుని, వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి తమనే గెలిపించాలని ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా మద్దతుదారులతో కలిసి పట్టణంలోని గల్లీలు చుట్టేస్తున్నారు. వీటితోపాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే అభివృద్ధి చేసే కార్యక్రమాలను ఓటర్ల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లలో తమ గుర్తులతోపాటు హామీలను చేరవేస్తున్నారు. మరి కొంతమంది రీల్స్ చేస్తూ దగ్గరవుతున్నారు. వారం రోజులపాటు పట్టణంలోని గల్లీలో ప్రచారాలతో హోరెత్తుతాయి.బరిలో నిలిచిన అభ్యర్థులు మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు అందోల్–జోగిపేట 20 63 గడ్డపోతారం 18 72 గుమ్మడిదల 22 94 ఇంద్రేశం 18 76 జిన్నారం 26 101 కోహీర్ 16 59 ఖేడ్ 15 57 సదాశివపేట 26 99 సంగారెడ్డి 38 176 జహీరాబాద్ 37 174 -
అందరికీ సమాన హక్కులు అవకాశాలు
అదనపు కలెక్టర్ మాధురి సంగారెడ్డి జోన్: సమాజంలోని ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ మాధురి పేర్కొన్నారు. కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలె, అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ..సామాజిక న్యాయం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతీ ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగుల అభ్యున్నతికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విశాలాక్ష్మి, ఇతర జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
చేతులు కలిసేనా?
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్లోని అంతర్గత విభేదాల అంశం తెరపైకి వస్తోంది. పలు నియోజకవర్గాలోని మున్సిపాలిటీల్లో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతమేరకు సమన్వయంతో పనిచేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : డీసీసీ అధ్యక్ష ఎన్నిక నాటి నుంచి..కౌన్సిలర్ టికెట్ల కేటాయింపుల వరకు ఆ పార్టీలోని నేతల మధ్య అంతర్గత ఆధిపత్యపోరు తరచూ రచ్చకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లోని హస్తం పార్టీ పరిస్థితులను పరిశీలిస్తే.. ‘ఖేడ్’ బల్దియాలో పట్టుకోసం.. ఖేడ్లో ఎంపీ షెట్కార్కు మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో తన అనుచరులు నలుగురికి టికెట్లు ఇప్పించుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి కూడా ఇక్కడ పట్టుకోసం ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా పరిణమించింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే సమన్వయంతో ఇప్పుడు పనిచేస్తారా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ మున్సిపాలిటీలో కొన్ని టికెట్ల పంచాయితీ ఇటీవల ఏకంగా గాంధీభవన్కు చేరిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల కోసం నియమించిన మంత్రి అజహారుద్దీన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సమక్షంలో ఇద్దరి మధ్య టికెట్ల సయోధ్య కుదిర్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడో వర్గంతో సమన్వయమేదీ? పటాన్చెరు నియోజకవర్గంలో ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్, మెదక్ పార్లమెంట్ స్థానం ఇన్చార్జి నీలం మధుముదిరాజ్ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని అభ్యర్థుల ఎంపిక సందర్భంగా బహిరంగంగా ప్రకటించారు. ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సి పాలిటీలో నీలంమధు, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో శ్రీనివాస్ దృష్టిపెట్టారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉప్పు..నిప్పు..అన్నట్లు రచ్చకెక్కిన ఈ రెండు వర్గాలు ఈ బల్దియా ఎన్ని కల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ నేతల మధ్య సమన్వయం క్షేత్రస్థాయిలో ఎన్నికల చివరివరకు కొనసాగుతుందా లేదా అనేది కొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మరో వైపు ఇక్కడ మూడో వర్గం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ వర్గంతో ఈ రెండు వర్గాలు సమన్వయం చేసుకున్న దాఖలాలు కనిపించడం లే దని రాజకీయవర్గాల అభిప్రాయం పడుతున్నాయి.టికెట్లలో సయోధ్య సరే జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంపీ షెట్కార్, మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి వర్గాల మధ్య టికెట్ల లొల్లి ఏకంగా గాంధీభవన్లోనే సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. రెండు మున్సిపాలిటీల్లో ఈ మూడు వర్గాల నాయకులు క్షేత్రస్థాయిలో ఎంత సమన్వయంతో పనిచేసి హస్తం పార్టీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేరుస్తారనేది ఫలితాలను బట్టి తేలనుంది. అందోల్, సంగారెడ్డి, సదాశివపేట బల్దియాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలకు నియోజకవర్గాల్లో ఎదురులేకపోవడంతో ఇక్కడ అంతర్గతంగా నెలకొన్న విభేదాలు ఇంకా రచ్చకెక్కడం లేదు. మొత్తం మీద హస్తం పార్టీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో జరుగుతున్న ఈ బల్దియా ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తుందనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.అందోల్, సంగారెడ్డిల్లో.. -
సైన్స్తోనే మానవాళి ప్రగతి
ప్రజా శాస్త్రవేత్త రమేశ్ సదాశివపేట(సంగారెడ్డి): సైన్స్తోనే మానవాళి ప్రగతి సాధ్యమని ప్రజా శాస్త్రవేత్త రమేశ్ స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధం, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గింపు, ప్రకృతి సేద్యం, భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ అంశాలపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రకృతి మన జీవనానికి ఆధారమని ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని రమేశ్ విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలీ, కమిటీ సభ్యులు శోభారాణి, మంగక్క, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, తెలంగాణ శ్యామ్, అమ్మ అవయవదాన సంస్థ వ్యవస్థాపకుడు ఈశ్వరలింగం, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్వతంత్రుల సత్తా
పురపోరులో స్వతంత్రులు సత్తాచాటుతున్నా రు. రాజకీయ పార్టీల నడుమ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం సులువు కాదు. అయినా చెమటోడ్చి గట్టి పోటీనిస్తూ గెలు స్త్తుండటం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2020లో 15 పురపాలికలు 309 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. పలు బల్దియాల్లో చైర్మన్, వైస్ చైర్మన్గా వ్యవహరించారు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో 392 మంది ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలోనూ ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారే కీలకంగా మారుతున్నారు. ఇండిపెండెంట్లు ప్రచా రం నిర్వహించి.. ప్రజల మన్ననలు పొంది విజయబావుటా ఎగురవేశారు. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులుండగా టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5 వార్డుల్లో, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇండిపెండెంట్గా గెలుపొందిన నిమ్మ రాజీవ్రెడ్డి బీఆర్ఎస్కు మద్దతు తెలపడంతో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ గిరిని కై వసం చేసుకుంది. బీఆర్ఎస్కు మద్దతు పలికినందుకు వైస్ చైర్మన్గా రాజీవ్రెడ్డికి అవకాశం ఇచ్చారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను టీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 9, బీజేపీ 1, ఇతరులు 1 గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారు బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకుంది. పుర బరిలో 392 మంది ఇండిపెండెంట్లుఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 1,658 మంది పోటీ చేస్తుండగా అందులో 392 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ సారి జహీరాబాద్ మున్సిపాలిటీలో 58 మంది, సంగారెడ్డిలో 52, అత్యల్పంగా చేర్యాల మున్సిపాలిటీలో ఐదుగురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువగా ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇండిపెండెంట్లు దాదాపు 15శాతం వరకు విజయం సాధిస్తున్నారు. స్వతంత్రులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారంలో దూసుకపోతున్నారు. సొంత మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు. ప్రచార రథాలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎంత మంది ఇండిపెండెంట్లు గెలుపొందుతారోనన్న చర్చ అన్ని పార్టీల్లో సాగుతోంది. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఎంత మంది స్వతంత్రులకు ఓటర్లు పట్టం కడతారో వేచిచూడాల్సిందే.మున్సిపాలిటీ గత ఎన్నికల్లో గెలుపొందిన వారు దుబ్బాక 09హుస్నాబాద్ 03గజ్వేల్ 06చేర్యాల 02అమీన్పూర్ 01అందోల్–జోగిపేట్ 01బొల్లారం 0నారాయణఖేడ్ 0సదాశివపేట 01సంగారెడ్డి 03తెల్లాపూర్ 02మెదక్ 01నర్సాపూర్ 03రామాయంపేట్ 01తూప్రాన్ 02గత మున్సిపల్ ఎన్నికల్లో 35 మంది విజయం గతంలో ఇండిపెండెంట్కు దక్కిన చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఈసారి 19 మున్సిపాలిటీల్లో 392 మంది పోటీ ప్రస్తుత పుర బరిపై సర్వత్రా చర్చజిల్లా మున్సిపాలిటీలు మొత్తం స్వతంత్రులు అభ్యర్థులు సిద్దిపేట 4 326 73 సంగారెడ్డి 11 1,045 276 మెదక్ 4 287 43 -
అన్ని రంగాల్లో హైదరాబాద్ సమగ్రాభివృద్ధి
రామచంద్రాపురం(పటాన్చెరు): హైదరాబాద్ మహానగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలో రూ.40.70కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బుధవారం ఆమె ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అభివృద్ధిలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత రామచంద్రాపురం పట్టణంలో మేయర్ విజయలక్ష్మికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ నాయకులకు, స్థానికులకు మధ్య స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఒక వర్గానికి చెందిన సామాజిక భవనం కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. అదే సమయంలో మరొక వర్గం వారు తమ భవ నాన్ని ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పి వారిని ఇళ్లకు పంపించి వేశారు.నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి -
ఆరోగ్యరంగ ఆవిష్కరణలో ప్రేరణగా దేశం
ఐఐటీహెచ్లో జరిగిన సదస్సులో వక్తలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఆరోగ్య పరిశోధన రంగంలో కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత, నూతన ఆవిష్కరణలకు భారతదేశం ప్రేరణగా నిలుస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘‘ఆరోగ్య రంగం పరిశోధనల్లో సాంకేతికత –పురోగతులు’అంశంపై ఐఐటీ హైదరాబాద్లో మూడురోజుల సదస్సు జరిగింది. ఎన్ఐటీ రాయ్పూర్, రాయ్చూర్, ధ్వారాడ్ ట్రిపుల్ఐటీలు, పండిత్ రవిశంకర్శుక్లా వర్సిటీ, ఏపీలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు ఫ్రొఫెసర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. మాస్ స్పెక్టోమిటరీ– బేస్డ్ మెటబోలమిక్స్ ఫర్ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్, వివో ఇమేజింగ్ ఫర్ థెరఫ్యూటిక్స్, ఎలక్ట్రోన్సీఫాలాగ్రఫీ (ఈఈజీ), న్యూరోమాడ్యులేషన్, క్లినికల్ ఏఐ డిప్లయేబిలిటీ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చ జరిగింది. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, ఆరోగ్యరంగ పరిశోధన శాస్త్రవేత్తలు శేఖర్ సి.మండే, డాక్టర్ కుమారస్వామితంగరాజ్, హేమలతబలరామ్, డాక్టర్ స్వస్తి, డా.చిత్తరంజన్పాత్ర, ప్రొ.వి.శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
బాకీ వర్సెస్ ధోకా
● పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల నినాదాలు ● ఇరువర్గాలను అడ్డుకున్న పోలీసులు సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో మంగళవారం ఇరుపార్టీల మధ్య కార్డుల పంపిణీ హైటెన్షన్కు దారి తీసింది. అధికార కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి బాకీ కార్డుల పేరిట బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పదేళ్లుగా ప్రజలను ధోకా చేసిందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. దీంతో ఇరుపార్టీల కార్డుల పంపిణీ పోలీసుల రంగ ప్రవేశానికి దారి తీసి కొన్ని గంటల పాటు వార్డులో గందరగోళానికి తెర లేపింది. ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఇరువర్గాలను అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. స్థానిక 14వ వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, పార్టీ నాయకులు మహేందర్ ఆధ్వర్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ ధోకా కార్డుల పేరిట ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో అదే వార్డులో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల బకాయిల బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ క్రమంలో వార్డులో ఒక ప్రాంతంలో ఇరుపార్టీలు ఎదురెదురు పడటంతో ఒక్కసారిగా పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక దశలో ఇరు పార్టీల శ్రేణులు ముందుకు తోసుకుని ప్రయత్నం చేశారు. ఆయా పార్టీల నాయకులు కార్డులను చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సకాలంలో స్పందించి ఇరు పార్టీల నాయకులను అడ్డుకొని దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మిబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఒక్కొక్కరికి రూ.60వేలు బాకీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్కరికి రూ.60వేలు బకాయి పడిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నామని, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి పేర్కొన్నారు. 25 నెలలుగా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లుగా ప్రజలకు ధోకా.. గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు రాష్ట్ర ప్రజలను ధోకా చేసిందని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి బీఆర్ఎస్ విస్మరించిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను చెదరగొడుతున్న పోలీసులు సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావుఇరువర్గాలకు చెందిన 30మందిపై కేసుసిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణం 14వ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మంగళవారం జరిగిన ఘటనలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ ప్రదర్శన నిర్వహించిన ఇరు పార్టీలకు చెందిన 30మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇక ముందు ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసుల ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి
హంిపీ పీఠాధిపతులుశివ్వంపేట(నర్సాపూర్): సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిమార్గాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షంచడంలో కృషి చేయాలని హంిపీ పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామీజీ అన్నారు. హైందవ సంస్కృతి, సనాతన ధర్మం పరిరక్షణకు మంగళవారం మండలంలోని గోమారం పురాతన శివాలయం, పెద్దగొట్టిముక్లలోని ప్రాచీన ఉమా సంఘమేశ్వర స్వామిని దర్శించుకొని శతరుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను పరిరక్షిస్తూ గోమాత సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు శాస్త్రుల అమోధ్య రామశర్మ, భక్తులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణకు, ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలన్నారు. -
●పొద్దు తిరుగుడు సాగు లాభదాయకం
చిన్నకోడూరు(సిద్దిపేట): పొద్దు తిరుగుడు సాగులో సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్త డా.పల్లవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాచాపూర్లో జాతీయ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ పథకం ద్వారా యాసంగి పొద్దు తిరుగుడు సాగుపై అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. దిగుబడి పెరగడంలో విత్తన ఎంపిక, విత్తే పద్ధతి, విత్తే దూరం, ఎరువులు, నీటి యాజమాన్యం, తాలు గింజలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు, సూచనలు చేశారు. తెగుళ్ల నివారణ, జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పద్మ, తహసీల్దార్ సలీమ్, మండల వ్యవసాయ శాఖ అధికారి జయంత్, ఎఫ్పీఓ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి -
●పొలం బడి.. రైతులకు రాబడి
చిలప్చెడ్(నర్సాపూర్): వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే పొలం బడి ముఖ్య ఉద్దేశమని, సస్యరక్షణ కేంద్రం సహాయక మొక్కల సంరక్షణ అధికారి ఉదయ్శంకర్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని రైతువేదికలో పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలం బడి రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించి, ఉత్పత్తిని పెంచుతుందన్నారు. సస్యరక్షణ పద్ధతులైన లోతు దుక్కులు, ఎర పంటలు, మిత్ర పురుగులు, లింగాకర్షక బుట్టలు, తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం సస్యరక్షణ కేంద్రం అధికారి బసవన్నప్ప విత్తన శుద్ధిని డెమో చేసి చూపించారు. వ్యవసాయాధికారి రాజశేఖర్గౌడ్, ఏఈఓ అనిత, సర్పంచ్లు రాజేందర్రెడ్డి, అనిల్, ధర్మారెడ్డి పాల్గొన్నారు. సస్యరక్షణ కేంద్రం సహాయక అధికారి -
●దుమ్మురేగుతోంది..
నిర్వహణ లోపం.. వాహనదారులకు శాపంసంగారెడ్డి జోన్: జాతీయ రహదారి గ్రామీణ రోడ్డును తలపిస్తుంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే జాతీయ రహదారి నిర్వహణ పనులు సరిగా చేపట్టకపోవడంతో వాహనదారులకు శాపంగా మారింది. సంగారెడ్డి నుంచి ముంబై వెళ్లే రహదారి డివైడర్లో ఇటీవల నిర్వహణ పనులు చేపట్టారు. అందులో భాగంగా డివైడర్ పక్కనే వేసిన మట్టి దిబ్బలు తొలగించడంలో విఫలమయ్యారు. భారీ వాహనాలు వెళ్లే క్రమంలో దుమ్ము, ధూళితో నిండిపోతుంది. వెనక నుంచి వచ్చే వాహనదారులకు ముందున్న వాహనాలు కనిపించక అయోమయానికి గురవుతున్నారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులకు కళ్లలో దుమ్ము పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని నిర్వహణ పనులు చేపట్టి, మట్టి కుప్పలు తొలగించాలని కోరుతున్నారు. -
ప్రతిభ పరీక్షకు విద్యార్థిని ఎంపిక
మద్దూరు(హుస్నాబాద్): రాష్ట్ర స్థాయి సాంఘీకశాస్త్ర ప్రతిభ పరీక్షకు దూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన బి.వర్షిని ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థిని మూడోస్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై ంద న్నారు. అనంతరం సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయురా లు, విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు.. పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని లింగాయపల్లి– చీకోడ్ ఉన్నత పాఠశాల విద్యార్థి సుంగా గణేశ్ జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాడు. కామారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. టీచర్ రాందాస్ గైడ్గా వ్యవహరించారు. విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై డీఈఓ విజయ, సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఎంఓ సుదర్శణమూర్తి, మండల విద్యాధికారి ప్రతాప్రెడ్డి, హెచ్ఎం విజయలక్ష్మి అభినందనలు తెలిపారు. -
ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి
కాపాడబోయిన బావకు తీవ్ర గాయాలు హత్నూర (సంగారెడ్డి): ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తికి మూర్చ రావడంతో అదే వాహనం కిందపడి మృతి చెందాడు. కాపాడబోయిన మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీధర్ రెడ్డి కథనం ప్రకారం... రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య గ్రామ శివారులో కౌలుకు వ్యవసాయ భూమిని తీసుకొని సాగు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ట్రాక్టర్ కేజీవీల్ నడపడానికి సొంత బామ్మర్ది అయిన నవపేట గ్రామానికి చెందిన సమ్మయ్య (40) ను తీసుకొచ్చాడు. ఈ క్రమంలో పొలం దున్నుతున్న క్రమంలో ఒక్కసారిగా సయ్యకు మూర్ఛ వ్యాధి వచ్చింది. ట్రాక్టర్ అలాగే పొలంలో తిరుగుతుండటంతో గమనించిన బావ దుర్గయ్య దానిని ఆపే క్రమంలో సమ్మయ్య కేజీవీల్ కిందపడి మృతి చెందాడు. కాగా కాపాడే ప్రయత్నం చేసిన దుర్గయ్యకు కూడా కాళ్లపై నుంచి కేజీవీల్స్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బొలెరో ఢీకొని రైతు మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అమరేందర్రెడ్డి వివరాల ప్రకారం.. రాయిలాపూర్ గ్రామానికి చెందిన రైతు మదాసు రామస్వామిగౌడ్(48) సోమవారం తన బైక్పై పొలం వద్దకు వెళ్లి పనులు ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాయిలాపూర్గేట్ పెట్రోల్పంప్ సమీపంలో జాతీయ రహదారిపై బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రామస్వామికి తీవ్రగాయాలయ్యాయి. 108లో హైదరాబాద్లోని పైవ్రేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనం ఢీకొని.. హవేళిఘణాపూర్(మెదక్): ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హవేళిఘణాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన పెద్ద వెంకయ్య(75) గ్రామ స్టేజీ వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. -
గంజాయి స్వాధీనం
మునిపల్లి(అందోల్): గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శంకర్ వివరాల ప్రకారం... మంగళవారం బీదర్ నుంచి హైదరాబాద్కు బైక్పై మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ యాకూబ్ గంజాయిని తరలిస్తుండగా కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో పట్టుకున్నారు. ఎండు గంజాయి, బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎకై ్సజ్ అధికారులు అనుదీప్, హనుమంతు, అరుణజ్యోతి, అంజిరెడ్డి, సాయి, శివకాంత్, రాజేశ్, కృష్ణ పాల్గొన్నారు. కోహెడరూరల్(హుస్నాబాద్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న బోలెరో వాహనాన్ని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్ఐ అభిలాష్ వివరాల ప్రకారం... మండలంలోని వింజపల్లి గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. గ్రామంలోకి వస్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అక్రమంగా లోడ్ చేసిన ఇసుక లభ్యమైంది. దీంతో వాహన డ్రైవర్ గీకురు రమేశ్పై కేసు నమోదు చేసి, వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని చిలాపూర్పల్లె శివారులోని వడ్డెర కాలనీకి చెందిన గౌరవ్వ, మల్లేశ్వరి నాటుసారా తయారు చేస్తుండటంతో ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తహసీల్దార్ శ్రీకాంత్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. మరోసారి తయారు చేస్తే లక్ష రూపాయల జరిమాన గాని ఏడాది జైలు శిక్ష గాని విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎకై ్సజ్ సీఐ, పవన్, ఎస్ఐ దామోదర్, ట్రైనీ ఎస్ఐ మధుసూదన్ పాల్గొన్నారు. వట్పల్లి(అందోల్): యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలకేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ లవకుమార్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన డమ్ము వెంకటేశ్ (31) జనవరి 31న తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేదు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమాన విధించింది. టూటౌన్ సీఐ ఉపేందర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ 11 మంది పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,16,500 జరిమాన విధించారు. పటాన్చెరులో 14 మందికి.. పటాన్చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమాన విధించింది. పటాన్న్చెరు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం పట్టణంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 14 మందిని పట్టుకుకున్నారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పర్చగా, 10 మందికి రూ.వెయ్యి, నలుగురికి రూ.1500 జరిమాన విధించినట్లు పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మాసాయిపేట మండలం పోతాన్పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్ర శంకర్(42) కూలీ పనులు చేసుకుంటూ జీస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం గుండె ఆపరేషన్ కోసం రూ.5లక్షలు అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు మార్గం కనిపించక పోవడంతో నిత్యం బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో శంకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పులు తీర్చే మార్గం లేక.. హవేళిఘణాపూర్(మెదక్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని వాడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన బక్కంగారి బీమయ్య(38) ఇంటి నిర్మాణం, కుటుంబం కోసం చేసిన అప్పులు చేశాడు. దీంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. మంగళవారం ఉదయం చూసేసరికి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై.. కొల్చారం(నర్సాపూర్): మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎల్లపురం వెంకటేశం (31) కుటుంబ పోషణ భారం కావడంతో భార్య , ఇద్దరు కూతుర్లతో కలిసి రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం షాపూర్నగర్కు వెళ్లి పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన వెంకటేశం పనిచేయకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జనవరి 25న స్వగ్రామమైన పోతంశెట్టిపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తోటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపు తెరిచి చూడగా దూలానికి చీరతో ఉరివేసుకొని కనిపించాడు. -
కౌడిపల్లిలో సామాజిక తనిఖీ
రూ.1.25లక్షలు రికవరీ, రూ.16వేలు జరిమానకౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజాదర్బార్లో అవకతవకలకు పాల్పడిన వారికి అధికారులు రివకరీతోపాటు, జరిమాన వేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 1ఏప్రిల్, 2024 నుంచి 31మార్చి, 2025 వరకు ఉపాధిహామీ, పంచాయతీ రాజ్, అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.9,98 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృంద గ్రామాల్లో తనిఖీ చేసింది. మంగళవారం కౌడిపల్లి రైతువేదికలో సామాజిక తనిఖీ ఏర్పాటు చేయగా ఏపీడీ రంగాచారి, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీహరి, హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్రెడ్డి, జేక్యూసీ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి డీఆర్పీలు గ్రామాల వారీగా తనిఖీ చేసిన నివేదికను ప్రజాదర్బార్లో పంచాయతీ కార్యదర్శులు, టీఏ, ఫీల్డ్అసిస్టెంట్ల సమక్షంలో అధికారులకు చెప్పారు. అనంతరం అవకతవకలను గుర్తించిన అధికారులు రూ.1,25,491 రికవరీతోపాటు రూ.16వేలు జరిమాన విధించినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ పుణ్యదాస్ తెలిపారు. ఉపాధిహామి పనుల్లో పారదర్శకతకు సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఏపీడీ రంగాచారి తెలిపారు. ఇదిలా ఉండగా మండలంలోని దేవులతండాలో రైతు కొర్ర శ్రీను తనపొలంలో పాంపాండ్ పనులు సగం మాత్రమే చేశారని ఫిర్యాదు చేశారు. పనులు పూర్తి చేశామని టీఏ, తండావాసులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ పుణ్యదాస్, ఈసీ ప్రేమ్ కుమార్, ఎస్ఆర్పీ పాండురంగారావ్, డీఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి
● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ సదాశివపేట రూరల్(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. మండలంలోని ఆరూర్ షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..షేర్ వాల్ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్దేశించిన రూ.5 లక్షలతోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరిగితే లబ్ధిదారులకు ఆర్థికభారం ఉండదని, నిబంధన ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎండీ వెంట హౌసింగ్ పీడీ చలపతిరావు, ఆర్డీవో రాజేందర్, హౌసింగ్ డీఈ మాధవరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఏఈ రేష్మ, సర్పంచ్ లావణ్య, వార్డ్ సభ్యులు ఉన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హౌసింగ్ జిల్లా పీడీ చలపతిరావు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ డీఈలు, ఈఈలు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
నేతలకు నిరసనల సెగ
పక్కగా పంట లెక్క రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటల వివరాలను ఏఈఓలు ఆన్లైన్లో నమోదు చేపట్టారు. వివరాలు IIIలో uజహీరాబాద్: టికెట్లు లభించక అసంతృప్తితో ఉన్న ఆశావహుల నుంచి ప్రధాన పార్టీల నాయకులకు నిరసన సెగ తగిలింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో బీ ఫారాలు అందజేసేందుకు జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయానికి పార్టీ నేతలు రావడంతో వారిని ఆయా పార్టీల నేతలు నిలదీశారు. ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ బీ ఫారాలతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగానే 14వ వార్డు నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే పార్టీ మారిన వారికి టికెట్లు ఇస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనలు తెలిపారు. సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్ ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితి చక్కదిద్దారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు పార్టీ అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను అధికారులకు అందజేశారు. టికెట్లు రాని వారు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. -
తిరుగుబావుటా..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పిన రెబెల్స్..ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటు గా రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. అయితే ఆశించిన మేర తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. హామీలు ఇచ్చి బుజ్జగింపులు చేసినప్పటికీ విత్డ్రా చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్ ఇబ్బందిగా మారింది. టికెట్ దక్కని వారు కొందరు ఆ పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో మేమూ చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తుండటం గమనార్హం. విత్డ్రా చేసుకున్నా.. సహకరించడం ప్రశ్నార్థకమే.. నామినేషన్లు వేసిన వారిలో కొందరు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతల ఒత్తిడికి తలొగ్గి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కానీ, వీరు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపునకు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. భయానికో, భక్తికో నామినేషన్ విత్డ్రా చేసుకున్నప్పటికీ ఓటింగ్ విషయానికి వస్తే క్రాస్ ఓటింగ్ చేయించేందుకు అంతర్గతంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను కాదని మరొకరికి టికెట్ దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు లోలోపల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే పరిస్థితులు పలువార్డుల్లో కనిపిస్తున్నాయి. పోటీలో నిలుస్తున్న రెబెల్ అభ్యర్థులుచివరి రోజు నాటకీయ పరిణామాలు -
అలరించిన కుస్తీ పోటీలు
న్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్ గ్రామ శివారు లోని ఉర్సే షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం ప్రారంభమైన కుస్తీ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను చెందిన సుమారు 55 మంది పహీల్వాన్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఫైనల్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన కుషాల్, మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన సంతోష్ పాటిల్ తలపడగా..కుషాల్ గెలుపొందారు. తొలిసారి కుస్తీ పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. ఫైనల్ పోటీల్లో లాతూర్కు చెందిన దివ్యశ్రీ గెలుపొందారు. -
బీజేపీ నాయకుల నిలదీత
బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను అందజేసేందుకు పార్టీ ఎన్నికల ఇన్చార్జి పైడి ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా బీ ఫారం అందని నాయకులు ఎల్లారెడ్డిని నిలదీశారు. పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం టికెట్లు కేటాయించకుండా ఓడే వారికే టికెట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపు అవకాశాలున్న వారిని కాదని ప్రజల్లో గుర్తింపు లేని వారికి టికెట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అసంతృప్తులను ఎల్లారెడ్డి సముదాయించివెళ్లిపోయారు. -
అంధకారంలో నిమ్జ్ రహదారి
నిమ్జ్ రహదారి అంధకారంలో మగ్గిపోతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు ట్రయల్ రన్కు మాత్రమే పరిమితమయ్యాయి. ఫలితంగా ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. –సంగారెడ్డి జోన్ జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుంది. రెండు మండలాల పరిధిలో సుమారు 17 గ్రామాల శివారులో ప్రాజెక్టు నెలకొల్పేందుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు భూముల కేటాయింపు జరుగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలకు భూములు అప్పగించగా మరికొన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు. 100 అడుగుల విస్తీర్ణంతో రహదారి నిర్మాణం జహీరాబాద్ మండలంలోని హుగ్గెలి చౌరస్తా నుంచి ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామ శివారు ప్రాజెక్టు వరకు మౌలిక వసతుల్లో భాగంగా 100 అడుగుల విస్తీర్ణంలో రహదారిని నిర్మించారు. మౌలిక వసతులు భాగంగా ప్రధానమైన రహదారిని అన్ని హంగులతో రూ.173 కోట్ల వ్యయంతో నిర్మించారు. డివైడర్ మధ్యలో విద్యుత్ లైట్లతోపాటు ఇన్, అవుట్ గేట్ల వద్ద భారీ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.3.50 కోట్లు వెచ్చించారు. 9 కిలోమీటర్ల మేర సుమారు 360కి పైగా స్తంభాలు ఏర్పాటు చేశారు. ట్రయల్ వెలుగులతోనే... కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రోడ్డును ప్రారంభించారు. అప్పట్లోనే విద్యుత్ సరఫరా కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం విద్యుత్ను సరఫరా చేయటం లేదు. ట్రయల్తోనే విద్యుత్ వెలుగులు సరిపెట్టి దాటవేశారని రాకపోకలు సాగించేవారు చెబుతున్నారు. వాహనాల రద్దీ రవాణా సౌకర్యం మెరుగుపడటంతో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుంది. మరో 15 రోజుల్లో ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఈ దారి నుంచే వస్తారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.వెలగని విద్యుత్ దీపాలు చీకట్లోనే ప్రయాణం... ఇప్పటికే భూములు కేటాయించిన పరిశ్రమల నిర్వాహకులతోపాటు అధికారులు రాకపోకలు సాగిస్తున్నారు. అంతే కాకుండా బర్దిపూర్, చీలపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి, కష్ణాపూర్ పొట్టిపల్లి, ఝరాసంగం, మాచనూర్, న్యాల్కల్ మండలాలకు వెళ్లేవారు ఈ దారి గుండానే వెళ్తున్నారు. పలుచోట్ల ఉన్న మూల మలుపులు, రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి రోడ్డుపై దగ్గరకు వచ్చే వరకు వాహనాలు కనిపించక అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రి కాగానే మధ్యలో ఉన్న బ్రిడ్జిలు మందుబాబులకు అడ్డాగా మారాయి. -
హాజరైన ఎంపీ
జాతర ఉత్సవాలకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ హాజరై పీర్గైబ్ సాహెబ్ దర్గాను దర్శించుకున్నారు. దట్టీని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను వీక్షించారు. పోటీలో విజేతలైన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సిద్దిలింగయ్యస్వామి, గ్రామసర్పంచ్ జ్యోతిలక్ష్మి, నాయకులు పడకంటి వెంకట్, ప్రవీణ్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులు యూనూస్ఖాన్, నర్సింహులు, జగనాథ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు దరఖాస్తుల ఆహ్వానం
జోగిపేట(అందోల్): 2026–27 సంవత్సరానికిగాను పాలిసెట్ దరఖాస్తు నమోదు గడువు ఈనెల 2 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని జోగిపేట బాలికల పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ మాలోతు వాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 21 వరకు, రూ. 300 రుసుముతో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని తెలిపారు. పాలిసెట్ పరీక్ష మే 13న ఉంటుందని తెలిపారు. వార్డుల అభివృద్ధి బాధ్యత నాదేటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి: సంగారెడ్డిలోని 38వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి వార్డులను అభివృద్ధికి కృషి చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీనిచ్చారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయిస్తానన్నారు. వార్డుల్లో ఉన్న అభ్యర్థులను గెలుపుతోపాటు మిగతా వార్డుల్లో పరిచయం ఉన్న వాళ్లను కూడా గెలిపించేలా ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. -
తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నయం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని మహిళా ప్రాంగణం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. యువకులు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యకు బడ్జెట్ నిధులేవి?పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు తీవ్ర నిరాశకు గురిచేశాయని, దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యను కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసిందని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను మంగళవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్ మొత్తం సుమారు రూ 53.5 లక్షల కోట్లు కాగా, విద్యారంగానికి కేటాయించిన మొత్తం కేవలం రూ 1.39 లక్షల కోట్లు మాత్రమే అని తెలిపారు. మొత్తం బడ్జెట్లో సుమారు 2.6% మాత్రమేన్నారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉన్న యువత, విద్యార్థులు గల దేశానికి పూర్తిగా సరిపోని, బాధ్యతారాహిత్యపు కేటాయింపులన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, జెస్సీకా, జిల్లా నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యంఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్రావు జిన్నారం (పటాన్చెరు): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఎంపీ రఘునందన్ రావు ప్రజలను అభ్యర్థించారు. జిన్నారం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతితో కూరుకుపోయాయన్నారు. బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రంనారాయణఖేడ్: కేంద్ర బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమాన్ని మోదీ సర్కారు పూర్తిగా విస్మరించిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్ విమర్శించారు. ఖేడ్ అంబేడ్కర్ భవన్ ఆవరణలో సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జనాభాలో 5% ఉన్న దివ్యాంగులకు 0.0286% మాత్రమే బడ్జెట్లో నిధులను కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో జిల్లా, స్థానిక బాధ్యులు సంగమేశ్, ప్రకాశ్రావు, సాయిలు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పథకాన్ని కొనసాగించాలి
వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నర్సింలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రంలో మహాత్మా గాంఽధీ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం పట్టణంలోని జెడ్పీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ పేదలు జీవనం కొనసాగిస్తున్నారన్నారు. వీబీజీ రాంజీ 2025 చట్టంతో కూలీలకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న ఉపాధి హామీ రక్షణ, పాత 29 కార్మిక చట్టాల అమలు, 4 లేబర్ కోడ్లు, వీబీజీ రాంజీ చట్టం రద్దు చేయాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా కూలీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడ లు వంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, వ్యవసా య కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్, కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మహేష్, సతీష్, లక్ష్మణ్, అర్జున్, దాసు, కేవీపీఎస్ నాయ కులు మహేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రా పేరిట బెదిరిస్తే మూల్యం తప్పదు
సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి సంగారెడ్డిలోని నాల్సాబ్ గడ్డ చౌరస్తా వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో హైడ్రా సంగతేమిటో తేలుస్తానని చెప్పారు. ‘హైడ్రాకా బాప్ అసదుద్దీన్ హై’అని చెప్పారు. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడితే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హైడ్రా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందని, గెలిచిన, ఓడిన వారు పరేషాన్లో ఉన్నారని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని ఆ రెండు పార్టీలు విస్మరించాయని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఎంఐఎం అని పేర్కొన్నారు. మాది లౌకిక పార్టీ అని చెబుతూ.. ఏ పార్టీకి లొంగని ఏకై క పార్టీ కూడా ఎంఐఎం అని ఒవైసీ చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీల పేరుతో తమ దగ్గరికి వచ్చినప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని, కానీ ఓ సందర్భంలో ఆ పార్టీ నేత షబ్బీఅలీ ఎంఐఎం బీజేపీ ఒకటేనని అనడం బాధాకరమన్నారు. సంగారెడ్డిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు. సంగారెడ్డిలో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం కై వసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామన్నారు. ఎంఐఎం వార్డులలో అభివృద్ధి చేసి చూపించామని, తమ పార్టీ అభ్యర్థులు లేని వార్డులు ఏ విధంగా ఉన్నాయో సంగారెడ్డి ప్రజలు గమనించాలని కోరారు. ఎవరు గెలిస్తే సంగారెడ్డి మున్సిపాలిటీ బాగుపడుతుందని, పేద ప్రజలకు న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. మొత్తం 38 వార్డులకు గాను 13 వార్డుల్లో బరిలో దిగిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని, సంగారెడ్డి బల్దియా పీఠం లేదా వైస్ చైర్మన్ కుర్చీ దక్కించుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సభలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్, నాననగర్ కార్పొరేటర్ నాసిరొద్దీన్, జిల్లా అధ్యక్షులు నిజమొద్దీన్, టౌన్ ప్రెసిడెంట్ ఫాజిల్ ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్లు ఆరిఫ్, యాకూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరిక -
పటాన్చెరు ఎంవీఐగా నరేష్ బాధ్యతలు
పటాన్చెరు టౌన్: పటాన్చెరు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీ ఐ)గా నరేష్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎంవీఐగా విధు లు నిర్వహించిన విజయ్రావు.. పదవీ విరమ ణ పొందడంతో ఆయన స్థానంలో నరేష్ను నియమించారు. జహీరాబాద్ చెక్ పోస్టు నుంచి డిప్యుటేషన్పై పటాన్చెరుకు వచ్చిన ఆయన.. సోమవారం బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పటాన్చెరు: అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మెదక్ మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ సమన్వయకర్త పట్లోళ్ల శశిధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఇస్నాపూర్లో మున్సిపల్ ఎన్నికల సమీక్షలో గడీల శ్రీకాంత్గౌడ్తో కలసి ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిపినట్లు తెలిపారు. రెబల్స్ బెడద లేకుండా సమన్వయం చేసినట్లు చెప్పారు. ప్రచారానికి గడువు చాలా తక్కువగా ఉన్నందువల్లా బీఆర్ఎస్ అభ్యర్థులు సమయం వృథా కాకుండా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో విఫలమైన సందర్భాన్ని ప్రతి ఓటరుకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు ఘనపూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, మేరాజ్ ఖాన్, దుర్గయ్య, జోగు ధన్రాజ్, కాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
జహీరాబాద్కు బుల్లెట్ రైలు
జహీరాబాద్: జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడిపేందుకు రైల్వే బడ్జెట్లో మరోమారు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు అంశం పెండింగ్లో ఉండిపోయింది. తాజా రైల్వేబడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. ఇప్పటికే డీపీఆర్ను పూర్తి చేసుకున్న హైదరాబాద్–ముంబై ప్రాజెక్టును రెండుగా విభజన చేశారు. గతంలో హైదరాబాద్–ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్గా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్–పూణె, పూణె–ముంబైగా మార్చారు. ఆయా రైల్వే స్టేషన్ల మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్ను నిర్మించనున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 11 స్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు ప్రతిపాదించారు. అందులో భాగంగా హైదరాబాద్, జహీరాబాద్, కల్బుర్గి, షోలాపూర్, పండరిపూర్, అక్లోజ్, దౌండ్, పుణె, లోనావాలా, నవీ ముంబై, కుర్లా కంప్లెక్సు, బాంద్రా, ముంబై ష్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. తగ్గనున్న ప్రయాణం వ్యవధి కొత్త కారిడార్ మూలంగా ప్రయాణ వ్యవధి తగ్గనుంది. హైదరాబాద్ నుంచి పుణెకు ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుండగా రెండు గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ముంబైకి 14 గంటల సమయం పడుతుండగా.. హై స్పీడ్ రైలు మూలంగా కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలు గరిష్ట వేగం 350 కి.మీ సామర్థ్యం కాగా, ఆపరేషనల్ వేగం 320 కి.మీ ఉంటుంది. ఎలివేటెడ్, అండర్గ్రౌండ్తో కలిపి కారిడార్ ఉంటుంది. ఈ రైలులో 750 మంది ప్రయాణికులు ప్రయాణం చేసే వీలుంటుంది. ఇంజనీరింగ్ సర్వే ఇప్పటికే రైల్వేలైన్ నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. అవసరమైన చోట మట్టి పరీక్షలు చేసి ప్రాథమిక నివేదికలను సైతం ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖకు అందజేశారు. హైదరాబాద్ నుంచి పూణెకు.. పారిశ్రామిక ప్రాంతంగా జహీరాబాద్ జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో మహీంద్ర, హట్సన్, పిరామల్, అల్లానా లాంటి భారీ పరిశ్రమలు ఉన్నాయి. అంతే కాకుండా 12,650 ఎకరాల్లో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఇందు కోసం ఆరువేల ఎకరాల మేర భూ సేకరణ జరిగింది. నిమ్జ్కు అనుసంధానంగా 165,161 జాతీయ రహదారులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ సైతం ఉంది. బుల్లెట్ రైలు రాకతో జహీరాబాద్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు పర్యటించే ప్రయాణికులకు ఈ రైలు వల్ల ఎంతో సౌకర్యం కలగనుంది. ప్రాజెక్టు పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉపసంహరణకు ససేమిరా..!
మూగ జీవాలకు ఆవాసం సింగూర్ ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న గ్రామాలు మూగ జీవాలకు ఆవాసంగా మారాయి. వివరాలు 8లో uప్లాన్– బీని అమలు చేస్తున్న ఆశావహులు స్వతంత్రంగానే పోటీకి సై అంటున్న వైనంసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలే కాదు., ఆయా పార్టీల ఆశావహులు కూడా పథకం ప్రకారం ముందుకెళుతున్నారు. ఎలాగైనా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్న ఆశావహులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. పార్టీ టిక్కెట్ వచ్చిన వారు ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టిక్కెట్ దక్కని వారు మాత్రం తమ ప్లాన్–బీ ని అమలు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో వీరు ఈ రెండు పార్టీల అభ్యర్థులకు రెబల్స్గా తయారవుతుండటంతో ఆ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నాయి. రెబల్స్ బరిలో ఉంటే తమ పార్టీ ఓట్లు చీలిపోయి.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ప్రయోజనం చేకూరుతుందని ఆందోళన చెందుతున్నారు. వీరు బరిలో ఉంటే గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలుండటంతో ఎలాగైనా వీరిని నామినేషన్లను విత్డ్రా చేసుకోవాలని అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. సర్ది చెబుతున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలు స్వయంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలు రంగంలోకి దిగారు. విత్డ్రా చేసుకుంటే కోఆప్షన్ పదవిని ఇస్తామని కొందరిని హామీ ఇస్తున్నారు. మున్సిపల్ పనులు ఇస్తామని కూడా భరోసా ఇస్తున్నారు. పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని సర్దిచెబుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ రెబల్స్కు హామీ ఇస్తోంది. అయినప్పటికీ వినని పక్షంలో సస్పెన్షన్ వేటు కూడా వేయాల్సి ఉంటుందని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. ఈ బుజ్జగింపులకు లొంగి.. ఒత్తిళ్లకు తలొగ్గి ఎంత మంది ఆశావహులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారనేది మంగళవారం మధ్యాహ్నంతో తేలనుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించండి -
సాంఘికశాస్త్రం ఎంతో కీలకం
జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లుసంగారెడ్డిఎడ్యుకేషన్: సమాజాన్ని అర్థం చేసుకోడానికి సాంఘికశాస్త్రం చాలా ముఖ్యమైనదని, దానిని అధ్యయనం చేయడం ద్వారా ఎన్నో సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించవచ్చని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా సాంఘికశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సోమవారం జిల్లాస్థాయి సాంఘికశాస్త్ర ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పోటీపరీక్షలలో పాల్గొనాలంటే సాంఘికశాస్త్ర అధ్యయనం తప్పనిసరన్నారు. ఈ పరీక్ష ద్వారా పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యున్నత స్థాయి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని, అందుకు కృషిచేస్తున్న సాంఘికశాస్త్ర ఫోరం నాయకుల కృషిని అభినందించారు. పరీక్ష లో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలలో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతి, మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ లింబాజి, ఏఎంఓ బాలయ్య, సీఎంఓ వెంకటేశం, ఎంఈఓ విద్యాసాగర్, సైన్స్ అధికారి సిద్దారెడ్డి, సాంఘికశాస్త్ర ఫోరం నాయకులు సునీతాఖన్నా, రాంరెడ్డి, ప్రభాకర్, సంగమేశ్వర్ పాల్గొన్నారు. -
చేతులెత్తేశారు?
జహీరాబాద్: మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్నా.. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంధించి ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాలను వెల్లడించలేదు. దీంతో టికెట్ల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు నిరాశలో మునిగి తేలుతున్నారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంధించి టికెట్ల కేటాయింపులు, బీ ఫాం కేటాయించే విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రాధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో గందర గోళం నెలకొంది. దీంతో కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వ హించిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్, జహీరాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి అజహరుద్దీన్, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ బీ ఫాంలను అందజేశారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంధించిన బీ ఫాంలను సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్లకు అప్పగించారు. ఇరువురు కలిసి బీ ఫారాలను అధిష్టానం గుర్తించిన అభ్యర్థులకు కేటాయించనున్నారు. సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రావాల్సిందిగా అధిష్టానవర్గం వారికి బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. జాబితాల్లో పేర్లు మార్పు కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విడుదల చేసిన జాబితాల్లో మూడు సార్లు అభ్యర్థుల మార్పులు చేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల ప్రజల్లో నుంచి అభ్యంతరాలు రావడంతో మార్పులు చేసినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి టికెట్లు కేటాయించారనే ఆరోపణలు పార్టీ కార్యకర్తలు అధిష్టానం ముందు ఉంచారు. చివరి నిమిషంలో సీఎం పేషీ నుంచి వచ్చిన సూచన మేరకు ఒకరి పేరును మార్పు చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ మాత్రం సోమవారం ఒకరి అభ్యర్థిత్వాన్ని మార్పు చేసింది. కాంగ్రెస్ నుంచి టికెట్ రాక పోవడంతో బీఆర్ఎస్లో టికెట్ సంపాదించినట్లు సమాచారం. దీంతో 2వ వార్డు నుంచి మణెమ్మకు బదులుగా విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. బీజీపీ సైతం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ఉండడంతో అధిష్టానవర్గం నిర్ణయించిన అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ ఫారాలను అందించనున్నాయి. తలనొప్పిగా మారిన ఉపసంహరణలు ప్రధాన పార్టీల టికెట్లను ఆశించిన పలువురు ఆయా పార్టీల పేరిట నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో బీ ఫాం లభించని వారు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారా లేక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటారా అనే సందేహాలు ఆయా పార్టీల నేతలను వెంటాడుతున్నాయి. -
కేసీఆర్తో గూడెం మధు భేటీ
పటాన్చెరు టౌన్: ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం రాత్రి సిట్ విచారణ అనంతరం హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కేసీఆర్ సూచించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారని చెప్పారు. పీఓ, ఏపీఓల పాత్ర కీలకంజిల్లా శిక్షణ నోడల్ అధికారి రామాచారి పటాన్చెరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో పీఓ, ఏపీఓల పాత్ర కీలకమని జిల్లా శిక్షణ నోడల్ అధికారి రామాచారి అన్నారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. నోడల్ అధికారి రామాచారి, జిల్లా శిక్షణ సమన్వయకర్త కళింగ కృష్ణకుమార్, శ్రీకాంత్గౌడ్, చంద్రారెడ్డి, అమరేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు 292 మంది పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. ఉద్యాన పథకాలపై అవగాహనజిన్నారం(పటాన్చెరు): రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన వర్షాధారిత పంటల అభివృద్ధి పథకంలో భాగంగా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో సోమవారం ఉద్యానశాఖ అధికారులు రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికారులు సోమేశ్వరరావు, అనూషరెడ్డి మాట్లాడుతూ.. పథకానికి అర్హులైన రైతులకు వర్మీ బ్యాగులను సరఫరా చేస్తామని తెలిపారు. కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉద్యానశాఖ నుంచి వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. కాగా రైతులు కూరగాయలు పండించడంలో ఆసక్తి కనబరుస్తున్నారని, ఉద్యానశాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని సర్పంచ్ రాణి అధికారులను కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోచయ్య, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, కృష్ణాగౌడ్, భిక్షపతి, రైతులు పాల్గొన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో సందేహాలు వద్దుఆర్అండ్బీ ఏఈ శశాంక్ వట్పల్లి(అందోల్): రోడ్డు విస్తరణ పనుల్లో ఎటువంటి సందేహాలు వద్దని, నిష్పక్షపాతంగా నిబంధనల మేరకు పనులు చేపడుతున్నట్లు ఆర్అండ్బీ ఏఈ శశాంక్ అన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో కొంతమందికి మేలు జరిగేలా ఒకవైపు ఎక్కువగా మరోవైపు తక్కువ దూరంలో పనుల చేపడుతున్నట్లు ఆరోపిస్తూ స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన అక్కడికి చేరుకొని పనుల నిర్వహణపై స్థానికుల సమక్షంలో కొలతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల నిర్వహణలో ఎటువంటి పక్షపాతం లేదని ఆర్అండ్బీ రోడ్డు విస్తరించి ఉన్న పరిధిలోనే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనవసరంగా పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ లవకుమార్, సర్పంచ్ రవీందర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్పాటిల్, శ్రీకాంత్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ దిగంబర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పొలం బాట.. అన్నదాతకు బాసట
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థినులు పొలం బాట పట్టారు. సోమవారం కరీంనగర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు మండలంలోని గంగాపూర్లో పర్యటించారు. నెల రోజుల టూర్లో భాగంగా రైతులతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతులకు కొత్త విషయాలు చెబుతూ.. వారు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పంట దిగుబడి పెంచడానికి మెలకువలు, ఎన్ని తడులు పెట్టాలి, ఎప్పుడు కోతలు చేపట్టాలనే అంశాలు వివరిస్తున్నారు. గ్రామంలో పర్యటించడం వల్ల ఎన్నో కొత్త అంశాలు తెలుసుకుంటున్నామని విద్యార్థినులు హస్విత, ప్రత్యూష, మంజూష, మేఘన, శివానీ, ఫిర్దౌస్ పేర్కొన్నారు. వీరితో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి జయంత్ కుమార్ పలు సూచనలు, సలహాలు చేశారు. గంగాపూర్లో విద్యార్థుల పర్యటన -
విద్యార్థులకు సీపీఆర్పై శిక్షణ
నర్సాపూర్ రూరల్: స్టడీ టూర్లో భాగంగా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలో సీపీఆర్పై ఒక్కరోజు శిక్షణకు హాజరయ్యారు. దీంతో పాటు ఆటోమేటెడ్ ఎక్సటర్నల్ డీపీబ్రిలేటర్ ఏఈడీ వినియోగంపై నిపుణులు అవగాహన కల్పించారు. గాంధీ మెడికల్ కళాశాలలోని అటానమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ప్రయోగశాలను సందర్శించి అవగాహన పొందారు. విద్యార్థుల వెంట ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, జంతుశాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ సురేశ్ కుమార్ ఉన్నారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, అనుభవాత్మక విద్య, ప్రజారోగ్యంపై అవగాహన, సామాజిక సేవా దృక్పథం పెంపొందించడానికి ఈ టూర్ ఉపయోగపడుతుందని అధ్యాపకులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
వెల్దుర్తి(తూప్రాన్): తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్లో మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని వైష్ణవి ప్రతిభ చాటింది. సోమవారం మెదక్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వంద మంది విద్యార్థులు పాల్గొనగా వైష్ణవి ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. దీంతో డీఈఓ విజయ ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని సోషల్ ఫోరమ్ మండల కన్వీనర్ నాగరాజు, చందర్, శ్రీనివాస్, ప్రభాకర్, లక్ష్మణ్ తదితరులు అభినందించారు. మెదక్ కలెక్టరేట్: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ మహేశ్ వివరాల ప్రకారం... సోమవారం మెదక్ పట్టణ శివారులో బోధన్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కమ్మరి రాములు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా బైక్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి మూడు బైక్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కాగా రాములు గతంలో మెదక్ పట్టణంతోపాటు రామాయంపేట పరిసర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి జైలు శిక్ష కూడా అనుభవించాడు. జహీరాబాద్ టౌన్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లా బంటారం మండలం తొరమామిడికి చెందిన జనార్దన్(45) జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కటింగ్ షాపులో పనిచేస్తూ జీవిస్తున్నాడు. 8 నెలల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జనవరి 28న స్వగ్రామానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. మరోసటి రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది. భార్య మంజుల అత్తకు ఫోన్ చేసి జనార్దన్ ఊరికి వచ్చాడా అని అడుగగా రాలేదని చెప్పింది. దీంతో ఆయన కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. తూప్రాన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... సోమవారం పట్టణ సమీపంలోని అల్లాపూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో మినీ వ్యాన్లో 11.90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా వెల్దుర్తి మండలం కోమటిపల్లికి చెందిన కై లాస్ శ్రీనివాస్కు చెందినవిగా తెలిపారు. పట్టుబడిన రేషన్ బియ్యంను సివిల్ సప్లయి గోడౌన్ ఇన్చార్జి నర్సింహులుకు అప్పగించి డైవర్ కృష్ణతో పాటు బియ్యం యాజమాని శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష గజ్వేల్రూరల్: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి కోర్టు జైలు శిక్ష విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలో పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. సోమవారం వారిని గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. విచారణ అనంతరం 8 మందికి రూ. 71వేల జరిమానా, మరో ఇద్దరికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఏడుగురికి రూ.35వేల జరిమానా విధించినట్లు తెలిపారు. -
ప్రత్యామ్నాయ పంటలతోనే అధిక లాభాలు
శాస్త్రవేత్త మహాదేవప్పసిద్దిపేటరూరల్: రైతులు యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం, రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త మహాదేవప్ప పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని బచ్చాయిపల్లి గ్రామంలో వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం రాజేంద్రనగర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో యాసంగి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బదులు మొక్కజొన్న , పొద్దు తిరుగుడు సకాలంలో వేసినట్లయితే యాసంగిలో అధిక ఉష్ణోగ్రత, వడగండ్ల వల్ల పంట నష్టం జరగకుండా, అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అనంతరం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పల్లవి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల వల్ల తక్కువ నీటితోపాటు కాల పరిమితి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ నరేశ్, సిద్దిపేట ఏడీఏ పద్మ, ఏఈఓ సుమిత్ర, సర్పంచ్ ప్రేమలత, ఉప సర్పంచ్ అరుణ, రైతులు పాల్గొన్నారు. -
జీవన్మూక్త సంస్థానంలో ఆరాధన
మునిపల్లి(అందోల్): జీవన్మూక్త సంస్థానంలో సంస్థాన పీఠాధిపతి శమత బాల్రాజ్ జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. సోమ వారం మండలంలోని అంతారం జీవన్మూక్త మహారాజ్ సంస్థానంలో జీవన్మూక్త మహారాజ్తో పాటు పాండు రంగ విఠలేశ్వర రుక్మాబాయి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లకీ సేవ, భక్తి శ్రద్ధలతో భక్తులు భజన చేస్తూ సంస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
గొర్రె ఎరువు భూమికి బలం
గొర్ల ఎరువుతో పాటు వాటి మూత్రం భూమికి బలం. మందలు వేసిన తర్వాతనే భూములను దుక్కి దున్నుతాం. గొర్ల ఎరువుతో ఐదు సంవత్సరాల వరకు పంట దిగుబడి బాగా వస్తుంది. ఐదేళ్లకు ఒకసారి మంద పెట్టిస్తాం. –నాట్కర్ మారుతి, రైతు, (ఎన్జీ ఉక్రాన) అవసరమున్న వారికి మంద మందలు అవసరమున్న రైతుల దగ్గరే వేసి డబ్బులు తీసుకుంటాం. రైతు ఎన్ని రోజుల మంద వేయ మంటే అన్ని రోజులు వేస్తాం. గొర్లు రెండు, నుంచి నాలుగు వేల వరకు ఐదు, ఆరు మందిమి కలిసి ఒకే దగ్గర మంద వేస్తాం. దానిని బట్టి డబ్బులు తీసుకుంటాం. – నందిగొండ బీరప్ప, కాపరి, (దన్వాడ మండలం, నారాయణ పేట జిల్లా) -
వైజ్ఞానిక యాత్రకు చలో..
రాయికోడ్(అందోల్): మండలంలోని ఎస్సీ వసతి గృహం విద్యార్థులు సోమవారం వార్డెన్ కృష్ణ ఆధ్వర్యంలో వైజ్ఞానిక యాత్రకు తరలివెళ్లారు. హైదరాబాద్లోని బిర్లా మందిర్, శాసన సభ, సచివాలయ భవనాలతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించారు. సాలార్జంగ్ మ్యూజియంలోని వివిధ వస్తులను తిలకించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. నగర చరిత్రకు తలమానికగా ఉన్న చార్మినార్ పరిసరాలను తిలకించారు. హైకోర్టు, సిటీ కాలేజ్, హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించి, చారిత్రక వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో హాస్టల్, సిబ్బంది ఉన్నారు. -
మాజీ నక్సలైట్ పేరుతో డబ్బులు డిమాండ్
అరెస్టు చేసిన పోలీసులుచిన్నశంకరంపేట(మెదక్): మాజీ నక్సలైట్ అంటూ డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. నార్సింగి ఎస్ఐ సృజన వివరాల మేరకు... సోమవారం భద్రాద్రి కొత్తగూడెం సన్యాసి బస్తీకి చెందిన కుర్మ సాంబమూర్తి అలియాస్ శ్యామ్కుమార్ తాను మాజీ నక్సలైట్నని, డబ్బులు ఇవ్వాలని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాతగౌడ్ ఇంటికి వెళ్లి డిమాండ్ చేశాడు. తనకు రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ నక్సలైట్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో సుజాతగౌడ్ భర్త మల్లేశంగౌడ్కు ఫోన్ చేసి విషయం చెప్పగా తాను వచ్చేవరకు ఉండాలన్నారు. అక్కడి నుంచి మరో వ్యక్తి వద్దకు వెళ్లి ఇదే విషయం చెప్పడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు చెప్పారు. ఎస్ఐ సృజన వెంటనే వచ్చి సాంబమూర్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సాంబమూర్తి ఇదివరకు కూడా జనగామలో ఇలాగే డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. -
మూగ జీవాలకు ఆవాసం
● ఇతర జిల్లాల నుంచి మేత, నీటి కోసం వలస ● భూముల్లో ఎరువు కోసం గొర్రెల మంద ● రూ.6 వందల నుంచి వేయి వసూలు మునిపల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న గ్రామాలు మూగ జీవాలకు ఆవాసంగా మారాయి. పత్తి తీసిన తరువాత చేన్లను మేపేందుకు ఇతరత్రా జిల్లాల నుంచి గొర్రెలు, మేకలను తీసుకొని కాపరులు వలస వస్తున్నారు. పొద్దస్తమానం అక్కడ, ఇక్కడ గొర్రెలను మేపుకుంటూ రాత్రికి మంద వేసినందుకు రూ.600 నుంచి వెయ్యి వరకు రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటారు. రాత్రి సమయంలో గొర్రెలు బయటకు రాకుండా ఉండడానికి మంద చుట్టూ వల కట్టి కాపలా ఉంటారు. వీటి ఎరువు వ్యవసాయ భూములకు బలంతో పాటు పంట దిగుబడి వస్తుందని రైతులకు నమ్మకం. గొర్రెలు, మేకల ఎరువు కోసం రైతులు తమ వ్యవసాయ భూముల్లో మంద పెట్టించుకుంటున్నారు. ఉదయం వెళ్లి తిరిగి సాయంత్రం అదే చేనులో మంద నిర్వహిస్తూ, అక్కడే భోజనం చేస్తారు. గొర్ల ఎరువు మంద అవసరమున్న రైతులు వచ్చి ముందే మాట్లాడుకుని మంద వేసుకుంటుంటారు. గొర్రెలకు నీళ్లు, మేత దొరకడంతో పాటు మందలు వేస్తూ ఇలా రెండు విధాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. మంద వేసిన చేన్లలోనే కాపరులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రైతుల భూముల్లో మంద వేసిన డబ్బులతో పాటు మూగ జీవాలకు ఎదైనా వ్యాధి వస్తే చికిత్స చేయిస్తారు. -
బొమ్మ, బొరుసు ఆడుతున్న..
ఆరుగురి అరెస్ట్కొల్చారం(నర్సాపూర్): బొమ్మ బొరుసు ఆడుతున్న ఆరుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్టు చేకశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... దుంపలకుంట శివారులోని వాటర్ ట్యాంక్ సమీపంలో బొమ్మ బొరుసు ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు మెదక్ టాస్క్ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,054 , నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కొల్చారం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో తండ్రు పోచయ్య, పెద్దాపుట్టి లక్ష్మణ్, డప్పు అశోక్, ఉసికె లడ్డు, కోలా కల్యాణ్, గళ్ల జెషోబు ఉన్నారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు. -
ఆటో, ఐచర్ వాహనం ఢీకొని..
న్యాల్కల్(జహీరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని గణేశ్పూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... ఝరాసంగం మండల పరిధిలోని భోజ్యానాయక్ తండాకు చెందిన అంభ్యనాయక్(60), భార్య దీదీబాయి, మనుమలు అభిషేక్(8), కార్తీక్(6), భువనేశ్వర్(4)లతో కలిసి బీదర్ సమీపంలో గల బగ్దల్ తండాకు ప్యాసింజర్ ఆటోలో వెళ్తున్నారు. గంగ్వార్ మీదుగా ఆటో వెళ్తున్న క్రమంలో మండల పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కమలమ్మతో పాటు మరో మహిళ అదే ఆటో ఎక్కారు. ఈ క్రమంలో బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనం గణేశ్పూర్ గ్రామ శివారులో జహీరాబాద్–బీదర్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న అంభ్యనాయక్, కమలమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. అంభ్యనాయక్ భార్య దీదీబాయి, మనువళ్లు అభిషేక్, కార్తిక్, భువనేశ్వర్, మరో మహిళ, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హద్నూర్ ఎస్ఐ సుజిత్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన వారిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉత్సవాలకు వెళ్తుండగా ప్రమాదం... భోజ్యానాయక్ తండాకు చెందిన అంభ్యనాయక్ అత్తగారి ఊరైన బగ్దల్ తండాలో సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం అంభ్యనాయక్ భార్య, మనుమలతో ఆటోలో బయలు దేరాడు. మరి కొద్ది సేవాట్లో గమ్యస్థానానికి చేరుకుంటామని సంతోషంలో ఉండగా ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కళ్లేదుటే తాత మృతి చెందడం, అవ్వ గాయాలకు గురి కావడం, గాయాలైన చిన్నారుల రోదనలు మిన్నంటాయి. గాయాలైన చిన్నారులు తాత, అవ్వ అంటూ ఏడవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుజిత్ తెలిపారు. ఇద్దరు మృతి.. గాయాలైన ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు ఓ చిన్నారి పరిస్థితి విషమం సేవాలాల్ ఉత్సవాలకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం -
‘సింగూర్’ నుంచి మట్టి తరలింపు
జేసీబీ, ట్రాక్టర్పై కేసు మునిపల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్టు దిగువ భాగం మల్లారెడ్డి పేట గ్రామ శివారులో నీరు లేకపోవడంతో అక్రమంగా కొందరు మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ఐ సుభాష్ వివరాల ప్రకారం... ప్రభుత్వ నిబంధనల ప్రకారం సింగూర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ స్థలంలో మట్టిని తరలించవద్దని ఇంతకు ముందే ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియజేశారు. కొందరు జేసీబీతో, ట్రాక్టర్లో నల్ల రేగడి మట్టిని కొంత మందికి అమ్ముకుంటున్నట్లు తెలువడంతో బుదేరా పోలీస్లకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారని ఆర్ఐ తెలిపారు. -
గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజాగాయకుడు గద్దర్ ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డా.వెన్నెల పేర్కొన్నారు. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం వద్ద గద్దర్ గళం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సత్తయ్య, మాజీ కౌన్సిలర్ కె.భరత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు గద్దర్ అన్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు వివరించారు. ప్రధానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరారు. మారుమూల గ్రామాలలో సైతం పర్యటించి ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేస్తామని తెలిపారు. అనంతరం గద్దర్ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బీజేపీ రాష్ట్ర కో ఆర్టినేటర్ బాలయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డా.వెన్నెల -
జాతర ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో నిర్వహించనున్న జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, ఆర్డీవో దేవుజా అధికారులకు ఆదేశించారు. ఝరాసంగం మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై వారు శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగురాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చే అవకాశముందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మరుగుదొడ్లు, త్రాగునీరు, వసతి తదితర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆలయానికి వచ్చే రహదారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. సమీక్షలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, రూరల్ సీఐ హనుమంతు, ఎస్సై క్రాంతికుమార్పాటిల్, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో మంజుల, ఈవో శివ రుద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.అధికారులతో సమీక్షలో జెడ్పీసీఈఓ జానకిరెడ్డి -
క్రమశిక్షణ అలవర్చుకోవాలి
సీనియర్ జడ్జి కవితాదేవి జహీరాబాద్ టౌన్: పిల్లలు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లింగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ జి.కవితాదేవి సూచించారు. పట్టణంలోని సిద్ధార్థ హైస్కూల్లో శనివారం లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ..పిల్లలు పెద్దలను గౌరవించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగిఉండాలని స్పష్టం చేశారు. సందర్భంగా గుడ్, బ్యాడ్ టచ్ల గురించి వివరించారు. వెంకటాపూర్ ఇన్చార్జి హెచ్ఎం సస్పెన్షన్నారాయణఖేడ్: మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కాశీనాథ్పై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటన అనంతరం షోకాజ్ నోటీసు జారీచేసి వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పాఠశాల ఆవరణలో నిర్మించిన వంటగదిని గుత్తేదారు అప్పగించని కారణంగా చాలాకాలంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇంటివద్దే వండి పాఠశాలలో వడ్డిస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి: నర్సింహులుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు డిమాండ్ చేశారు. మండలంలోని నిజాంపూర్ గ్రామంలో ఆయన శనివారం పర్యటించి ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాని స్వరూపాన్ని మార్చి వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టెట్ మినహాయింపునివ్వాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించడంతోపాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ నెల 5న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ..ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపింఛను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషిజర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణలో ఎమ్మెల్యే చింతా సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా కొత్త జీవోను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రూపొందించిన డైరీ–2026ని శనివారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ప్రతీ జర్నలిస్టు సంక్షేమానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. -
వినికిడి పరికరాలకు ఎల్ఓసీ అందజేత
మునిపల్లి(అందోల్): వినికిడి సమస్య, మాటలు రాక ఇబ్బంది పడుతున్న ఓ బాలికకు వినికిడి పరికరాల కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రూ.7 లక్షలకు సంబంధించి ఎల్ఓసీని బాలిక తండ్రి ఎండీ.హుస్సేన్కు అందజేశారు. మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన 2వ వార్డు సభ్యుడు ఎండీ హుస్సేన్ కుమార్తె పుట్టుకతో వినికిడి సమస్యతో మాటలు రాక బాధపడుతోంది. ఈ విషయాన్ని మంత్రి దామోదర దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి చికిత్స కోసం రూ.7 లక్షలను మంత్రి మంజూరు చేయించారు. కార్యక్రమంలో మోహన్, సయ్యద్ అలీ, ఎండీ కలీం, విఠల్తోపాటు తదితరులు పాల్గొన్నారు. -
2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● 11వ తేదీ వరకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులు ● హాజరుకానున్న 20,049 మందివిద్యార్థులు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫిబ్రవరి 2నుంచి 11వ తేదీ వరకు రెండు విడతల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. మొదటి విడతకు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు 18 పరీక్ష కేంద్రాల్లో, రెండవ విడత ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు 28 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సును అభ్యసిస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. ప్రైవేట్ కళాశాలలో గల పరీక్ష కేంద్రాల్లో గ్రౌండ్ఫ్లోర్లోనే ప్రయోగ పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. హాజరుకానున్న 20,049 మంది విద్యార్థులు జిల్లాలో 46 ఇంటర్మీడియెట్ కళాశాలలున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి రెండవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న వారికి మాత్రమే ఈ పరీక్షలుంటాయి. ఫిజిక్స్, రసాయన శాస్త్రం విద్యార్థులు 11,054 మంది కాగా, జంతుశాస్త్రం, జీవశాస్త్రం విద్యార్థులు 5,222 మంది ఉన్నారు. వీరితోపాటు ఒకేషనల్ చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1,865 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,908 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఆన్లైన్ ద్వారా ప్రశ్నపత్రం ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కొన్ని ప్రైవేట్ కళాశాలలు ముందే లీకేజీ చేస్తున్నాయనే ఆరోపణలు రావడంతోపాటు ప్రాక్టికల్స్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా వుండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలకు అరగంట ముందే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానంలో పరీక్ష కేంద్రం ఎగ్జామినర్కు ఆన్లైన్లో పంపుతారు. ఇందుకోసం ఎగ్జామినర్ సెల్ఫోన్కు మెసేజ్ రాగానే అతడు సంబంధిత వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్విజిలేటర్లకు అందజేస్తారు. హాల్ టికెట్ ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసి ఇవ్వాల్సి వుంటుంది. పరీక్ష ముగించే గంట లోపు వాల్యుయేషన్ చేసి మార్కుల జాబితాను ఎగ్జామినర్ బోర్డుకు అప్లోడ్ చేయాల్సి వుంటుంది. -
ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం
● యథావిధిగా ప్రజావాణి ● కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ..ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లకు స్పష్టమైన లక్ష్యాలు కేటాయించి, క్షేత్రస్థాయిలో ప్రక్రియ వేగంగా సాగేలా పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఫిబ్రవరి 2న యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, ఆర్డీఓ రాజేందర్, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటీఎస్కూ ససేమిరా..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో విచ్చలవిడిగా లూఠీ చేసిన ఖనిజ సంపదకు సంబంధించి ఎగవేసిన రాయల్టీ (జరిమానాతో కలిపి) రూ.974 కోట్లుగా ప్రభుత్వం గతేడాది తేల్చింది. ఈ మేరకు బకాయి పడిన 15 మైనింగ్ కంపెనీలకు డిమాండ్ నోటీసులిచ్చింది. ఓటీఎస్ కింద సగం చెల్లిస్తే మిగతా సగాన్ని మాఫీ చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. ఓటీఎస్ జీఓ జారీ చేసి పది నెలలు దాటినా కానీ అక్రమ మైనింగ్ కంపెనీలు ఏమాత్రం స్పందించడం లేదు. రూ.974 కోట్ల బకాయిలకు గాను ఓటీఎస్ కింద రూ.1.07 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీన్నిబట్టి చూస్తే మైనింగ్ మాఫియా బకాయిలు చెల్లించేందుకు ఏస్థాయిలో బెట్టు చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. స్పందించని మైనింగ్ కంపెనీలు సంగారెడ్డి జిల్లాలో స్టోన్ అండ్ మెటల్ క్వారీల్లో విలువైన ఖనిజ సంపద లూఠీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి క్వారీల నుంచి కంకరను హైదరాబాద్కు తరలించి రూ.కోట్లు మైనింగ్ కంపెనీలు గడిస్తున్నాయి. నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు, టిప్పర్లలో కంకర అక్రమంగా తరలిపోతోంది. ఇక్కడి క్వారీలు సింగరేణి ఓపెన్కాస్ట్ గనులను తలపిస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ అక్రమ మైనింగ్పై దృష్టి సారించింది. డీజీపీఎస్ సర్వేలు, విచారణలు చేసి అక్రమాల నిగ్గు తేల్చింది. లూఠీ చేసిన ఈ ఖనిజ సంపదకు సంబంధించిన రూ.974 కోట్లు చెల్లించాలని 15 క్వారీలకు సంబంధించిన మైనింగ్ కంపెనీలు, వ్యక్తులకు నోటీసులిచ్చింది. కొన్ని మైనింగ్ కంపెనీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. అయితే ప్రభుత్వం ఇన్ని చర్యలకుపక్రమించినా ఈ మైనింగ్ మాఫియాకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు. దీంతో వీరి నుంచి ఎలాగైనా బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వం ఓటీఎస్ జీఓను తీసుకురాగా..కేవలం మూడు కంపెనీలే నామమాత్రంగా ఈ ఓటీఎస్ కింద బకాయిలను చెల్లించాయి. ఓ మైనింగ్ కంపెనీ రూ.55.06 లక్షలు చెల్లించగా, మరో మైనింగ్ కంపెనీ రూ.50లక్షలు, మరో సంస్థ రూ.2.40 లక్షలు కట్టాయి. మొత్తం కలిపి 1.07 కోట్లు మాత్రమే భూగర్భ గనులశాఖకు వసూలయ్యాయి.రాజకీయ పలుకుబడితోనే అక్రమ మైనింగ్ వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ నేతలే ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధుల కనుసనల్లోనే ఈ అక్రమ మైనింగ్ జరుగుతోంది. రాజకీయ అండదండలు, పలుకుబడి ఉండటంతో ఈ మైనింగ్ మాఫియాకు అడ్డే లేకుండా పోతోంది. సామాన్యుడు తన ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్లో ఇసుక తీసుకెళితే దాన్ని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి రూ.వేలల్లో జరిమానా చెల్లించేవరకు వదిలి పెట్టని గనులశాఖ అధికారులు..ఈ మైనింగ్ మాఫియా నుంచి రాయల్టీ వసూలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఓటీఎస్ కింద కొంతమొత్తంలో రాయల్టీ బకాయిలు వసూలయ్యాయని భూగర్భగనులశాఖ సంగారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ రవిబాబు ‘సాక్షి’తో పేర్కొన్నారు. మిగిలిన బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూగర్భ గనుల శాఖలో పేరుకుపోయిన రాయల్టీ పెండింగ్ బకాయిల వసూలుకు ఆశాఖ చేపట్టిన చర్యలు ఏమాత్రం ఫలితాలనివ్వడం లేదు. ఎగవేసిన రాయల్టీ మొత్తాన్ని వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద చెల్లిస్తే 50% తగ్గిస్తామని ఆశాఖ ఏడాది క్రితం జీఓను జారీ చేసింది. కానీ గనులశాఖకు రూ.వందల కోట్లు ఎగవేసిన మైనింగ్ మాఫియా ఈ ఓటీఎస్ కింద బకాయిపడిన మొత్తంలో కనీసం సగం చెల్లించేందుకు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. -
నార్త్ ఈస్ట్ కేఫ్లో మద్యం సిట్టింగ్
కేసు నమోదు చేసిన పోలీసులుచిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై నార్త్ ఈస్ట్ కేఫ్లో మద్యం సిట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీస్లు పట్టుకున్నారు. ఎస్ఐ సృజన కథనం మేరకు...నార్సింగి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ కేఫ్లో అక్రమంగా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో మద్యం తాగుతున్న వ్యక్తులు పరారీ కాగా పంచనామా నిర్వహించి నిర్వాహకులు చంద్రారెడ్డి కుమారుడు రవీందర్రెడ్డి, దొంతి మహేష్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైన అక్రమ మద్యం విక్రయాలు చేసినా, మద్యం సిట్టింగ్ నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. -
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
● బంగారు గొలుసు స్వాధీనం ● నిందితులు రిమాండ్కు తరలింపుజహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం పోలీస్స్టేషన్లో డీఎస్పీ సైదా నాయక్ చోరీ వివరాలను వెల్లడించారు. పటాన్చెరువుకు చెందిన ఎండీ నిజాం, ఆయాజ్లు ఈ నెల 22న పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. కాలనీలో నివాసం ఉంటున్న సౌజన్య కంప్యూటర్ తరగతులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సమయంలో వెనక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీసీ కెమెరాలను తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, మోటారు బైక్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్కుమార్, సిబ్బందిని అభినందించారు. -
కౌన్సిలర్ టు ఎమ్మెల్సీ
రెండు సార్లు కౌన్సిలర్, ఎమ్మెల్సీగా పని చేసిన ఫారూక్ హుస్సేన్ ● అప్పటి ఓటర్లను గుర్తుంచుకునిఇటీవల కానుకలుసాక్షి, సిద్దిపేట: కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్సీగా సిద్దిపేట పట్టణానికి చెందిన ఫారూక్ హుస్సేన్ పని చేశారు. సిద్దిపేట పురపాలక సంఘంలో 10వ వార్డు నుంచి 1981–1986, 1986–1992 వరకు కౌన్సిలర్గా గెలుపొందారు. 1987లో టెలిఫోన్ అడ్వైజరీ బోర్డు సభ్యునిగా, 1991లో రైల్వేబోర్డు జోనల్ మెంబర్గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా, 2011 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పని చేశారు. 2012లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతూనే 2016లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. రెండోసారి 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. 27 మే, 2023తో ఎమ్మెల్సీ పదవి ముగిసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అప్పటి ఓటర్లకు కానుకలు రాజకీయంగా ఎదగడానికి తొలి అడుగు కౌన్సిలర్గా గెలుపొందడం. ఆ గెలుపునకు కృషి చేసిన ఓటర్లను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. అప్పటి పదో వార్డులో ఉన్న 321 కుటుంబాలను గుర్తించి రూ.3వేల విలువ చేసే 25 కిలోల బియ్యం, రెండు కుర్చీలు, చీర, టవల్ను ఇటీవల కానుకగా మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందించారు. చిన్న గల్లీ లీడర్ నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదగడానికి అప్పటి గెలుపే కారణం అని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఖర్చులో అప్పటికీ, ఇప్పటికీ భారీ తేడా 1981లో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు నా ఎన్నికల ఖర్చు రూ.4,700 అయింది. ఆ డబ్బులు సైతం తన స్నేహితులు, కుటుంబ సభ్యులు డొనేట్ చేయగా వాటిని ఖర్చు చేశాను. ప్రత్యర్థిగా పోటీ చేసిన ఉప్పలయ్య రూ.85వేలు ఖర్చు చేశారు. అయినా నా మీద నమ్మకంతో కౌన్సిలర్గా గెలిపించారు. అప్పటి ఎన్నికల ఖర్చుకు... ఇప్పటి ఎన్నికల ఖర్చుకు భూమికి ఆకాశం అంత తేడా ఉంది. డాక్టర్ డబ్బులు తీసుకొని మంచి చేస్తారు. అదే రాజకీయ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేస్తారు. – ఫారూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ -
సంస్కృతి విలక్షణం
గజ్వేల్ పురం..2012లో మున్సిపాలిటీగా ఆవిర్భావం ● 9 గ్రామాల విలీనంతో పెరిగిన పరిధి ● 20 వార్డులు, 46వేలకుపైగా ఓటర్లు ● మూడోసారి ‘మున్సిపల్ పోరు’కు సిద్ధంగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 2012లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన ఈ పట్టణం.. నేడు 11 గ్రామాల విలీనంతో పరిధి పెరిగింది. ఓటర్ల సంఖ్య 46వేల పైచిలుకు చేరుకుంది. ప్రస్తుతం మూడోసారి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. – గజ్వేల్ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ భిన్నసంస్కృతులకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివాసముంటున్నారు. ప్రత్యేకించి కేరళ ఓనమ్ ఉత్సవాలు, మర్వాడీల ప్రత్యేక కార్యక్రమాలు ఏటా వైభవంగా జరుగుతాయి. ఇవేకాకుండా దేశంలోని భిన్న ఆచారాలు, సంప్రదాయాలు ఇక్కడ ఉండటం విశేషం. కేసీఆర్ను రెండుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అందించిన విలక్షణ ప్రాంతమిది. మొదట్లో టౌన్ మున్సిపాలిటీ 1959 నుంచి 1964వరకు ఈ పట్టణం టౌన్ మున్సిపాలిటీగా ఉండేది. ఆ తర్వాత పంచాయతీగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి 12మందికిపైగా సర్పంచ్లుగా కొనసాగారు. ఈ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చాలని గతంలో ఇక్కడి ప్రజలు డిమాండ్ చేయగా.. 2012 జనవరిలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ను మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గజ్వేల్తోపాటు ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్పల్లి గ్రామాలను ఈ పట్టణంలోని విలీనం చేశారు. ఇటీవల మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన తొగుట మండలం పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డకిష్టాపూర్, బ్రహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్తోపాటు కొండపాక మండలం ఎర్రవల్లి పంచాయతీలు విలీనమైన సంగతి తెల్సిందే. దీనివల్ల ప్రస్తుతం 80వేలకు జనాభా 20 వార్డులు, 46,740మంది ఓటర్లతో పరిధి విస్తరించింది. ప్రస్తుతం మూడోసారి మున్సిపల్ ఎన్నికల తరుణంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.వార్డుల సంఖ్య : 20 మొత్తం ఓటర్లు : 46,740 మహిళలు : 24,001 పురుషులు : 22,738 మున్సిపాలిటీగా ఆవిర్భావం తర్వాత -
అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభం
సంగారెడ్డి క్రైమ్: కంది మండలంలోని బీపీఆర్ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఉమ్మడి మెదక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో నల్గొండ, మెదక్ జట్లు తలపడగా.. మెదక్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన మెదక్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. చేతన్ నిఖిల్(82), హర్షిత్(37) పరుగులు చేశారు. నల్గొండ బౌలర్లలో అరుణ్ చంద్ర, వరుణ్ సాయి, అహ్మద్ అజాముద్దీన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నల్గొండ జట్టు కేవలం 34.1 ఓవర్లలో 159 పరుగుకే ఆలౌటైంది. హర్షవర్దన్(54) పరుగులుఓ రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మెదక్ బౌలర్లలో రిశ్వంత్ 6 వికెట్లు పడగొట్టగా.. హర్షిత 3 వికెట్లు తీశాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం కొండాపురం మండలంలోని సి.కోనాపుర్ ఎంఏ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో మ్యాచ్లో మహబూబ్నగర్, ఖమ్మం జట్లు తలపడ్డాయి. ఉమ్మడి మెదక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మ్యాచ్లో ఖమ్మం జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన మహబూబ్ నగర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 34.1 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఖమ్మం జట్టు కేవలం 22.3 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 126 పరుగులతో విజయం సాఽధించింది. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం
రాయికోడ్(అందోల్): మండలంలోని శంశోద్దీన్పూర్ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఎస్ఐ చైతన్య కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుసునూర్కి చెందిన ఆటో డ్రైవర్ మల్లారెడ్డి (30) తన ఆటోలో చిమ్నాపూర్ నుంచి న్యాల్కల్ మండలం హద్నూర్ వెళ్తున్నాడు. అయితే శంశోద్దీన్పూర్ గ్రామ శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వర్రావు జహీరాబాద్ టౌన్: ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వర్రావు అన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ది మిషన్ పథకం కింద లబ్ధిపొందిన కోహీర్ మండలంలోని వెంకటపూర్ గ్రామ పరిధిలోని రైతుల పంట పొలాలను శుక్రవారం ఆయన సందర్శించారు. రైతులు పండిస్తున్న కూరగాయ పంటలు, మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన అభివృద్ధి పథకం కింద పండ్ల తోటలు, కూరగాయల సాగు చేసుకునేలా ప్రభుత్వాలు రాయితీలు అందిస్తుందన్నారు. పూల సాగు, కూరగాయలకు వందశాతం రాయితీలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన పంటలో మల్చింగ్ విధానం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి కూడా ఆయన రైతులకు వివరించారు. ఆయన వెంట ఉద్యానశాఖ మండల అధికారి సునీత రోజ్, విస్తీర్ణ అధికారి ఆశోక్ రైతులు ఉన్నారు. -
కాంగ్రెస్లో టిక్కెట్ల తకరారు!
విడుదల చేసిన మొదటి జాబితా చెల్లదని మంత్రి అజహరుద్దీన్ ప్రకటన జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయమై కాంగ్రెస్ పార్టీలో గందర గోళం నెలకొంది. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు గురువారం రాత్రి తన సంతకంతో కూడిన 19మంది కౌన్సిలర్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు. అయితే.. ఈ జాబితాను మాత్రం కాంగ్రెస్ అధిష్టానవర్గం తోసి పుచ్చింది. జహీరాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మంత్రి అజహరుద్దీన్ ఈ మేరకు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితా అనధికారమైనదని, ఆధారం లేనిదని పేర్కొన్నారు. అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి గురువారం రాత్రి విడుదల చేసిన జాబితా అధికారికంగా వెలువడింది కాదని మంత్రి అజహరుద్దీన్ ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. జాబితాలో పేరు ఉన్న వారు సంతోషంలో మునిగి తేలారు. తీరా మంత్రి అజహరుద్దీన్ జాబితాను వెల్లడించలేదని ప్రకటించడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ తమకు టికెట్ ఇచ్చినట్లా లేదా అనే అనుమానం వారిని వెంటాడుతోంది. వారి సంతోషం ఎంతో సేపు లేకుండా పోయింది. ఇప్పటికే విడుదలైన జాబితాలో ఏమైనా సవరణలు ఉంటాయా అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. జాబితాలో సవరణలు ఉంటే తమ పేరు ఉంటుదా లేక ఊడుతుందా అనే భయం వారిని పట్టి పీడిస్తోంది. జాబితాలో పేరు ఉన్న వారిని స్థానిక పార్టీ ముఖ్య నేతలు ఎంత వరకు కాపాడుకోగలుగుతారనే ప్రశ్న పార్టీ కార్యకర్తల నుంచి ఉదయిస్తోంది. బీఆర్ఎస్ జాబితాలోనూ జాప్యం నామినేషన్ల ఘట్టం ముగిసినా ఇంకా బీఆర్ఎస్ సైతం రెండో జాబితాను విడుదల చేయలేదు. 37 వార్డులకు గాను 21 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను మాత్రమే ప్రకటించింది. కార్యకర్తల నుంచి ఎక్కువ ఒత్తిడి లేని స్థానాలను మాత్రమే ఖరారు చేసినట్లు, మితగా వార్డుల విష యమై ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. పోటీ ఎక్కువ ఉన్న స్థానాల్లో అందరి సమ్మతి మేరకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశం ఉంది. 3న తేలనున్న అభ్యర్థిత్వాలు జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల అభ్యర్థిత్వాలు ఫిబ్రవరి 3వ తేదీన తేలనుంది. ఆ రోజు పార్టీ బీ ఫాం ఎవరికి ఇస్తే వారే అభ్యర్థులవుతారు. అప్పటి వరకు ఆశావహులకు కాళరాత్రి తప్పదనే చెప్పాలి.30 వార్డులో బీజేపీ పోటీ జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను 30 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పలు వార్డుల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పార్టీ అధిష్టానవర్గం ఇప్పటి వరకు జాబితాను ప్రకటించలేదు. ఇది ఆశావహులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. -
మర్వెళ్లిలో తుపాకీ కలకలం
● మామ ఇంట్లో అల్లుడి దొంగతనంతో విషయం బయటకు.. ● భయంతో 100కు ఫోన్చేసిన అల్లుడు వట్పల్లి(అందోల్): మండలంలోని మర్వెళ్లిలో తుపాకీ ఘటన శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దగొల్ల విఠల్ చిన్న కూతురు అదే గ్రామానికి చెందిన సాయిగారి కిషోర్ను వివాహం చేసుకుంది. అయితే అల్లుడు కొంతకాలంగా మామ కుటుంబంతో దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అల్లుడు బుధవారం సాయంత్రం మామ ఇంటికి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఉన్న ఓ పెట్టెను ఎత్తుకెళ్లి చూడగా.. అందులో తుపాకీ కనిపించింది. తనను చంపడానికే అని భయపడి కిషోర్ 100కు ఫోన్చేసి సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న వట్పల్లి పోలీసులు శుక్రవారం మర్వెళ్లికి చేరుకొని విచారణ చేపట్టారు. కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లవకుమార్ తెలిపాడు. అయితే తుపాకీ లభించడంపై గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
గజ్వేల్: మున్సిపల్ ఎన్నికల వేళ.. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుంకరి బాల్కుమార్ ఇంటి గేటుకు శుక్రవారం ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ అంశం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఓటు ప్రాధాన్యతను చాటి చెప్పాలనే సంకల్పంతోనే ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు బాల్కుమార్ తెలిపారు. మిరుదొడ్డిలో వాలీబాల్ టోర్నీ చిన్నారిపై పిచ్చికుక్క దాడి చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం శంఖాపూర్ తండాలో చిన్నారిపై వీఽధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం తండాకు చెందిన దీపేందర్సింగ్ కుమారుడు అమన్ దీప్సింగ్ (3) ఇంటి ఎదుట ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. దీంతో బాలుడికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండాలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని తండా వాసులు వాపోయారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్ : చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని విఠల్ తండాకు చెందిన నున్సావత్ భిక్షపతి (48) వ్యవసాయంతో పాటు కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. దీంతో మనస్తాపం చెంది ఈనెల 28న పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు. చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం వెలికితీతవెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని మహ్మద్నగర్ తండా శివారులోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై రాజు కథనం ప్రకారం.. మహ్మద్నగర్ తండాకు చెందిన రమావత్ గోపాల్ (37) రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. గురువారం సాయంత్రం చెరువు గట్టుపై బట్టలు, చెప్పులు, సెల్ఫోన్ లభ్యమైనట్లు తెలిపారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి సంగారెడ్డి టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం పసల్వాది గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న అల్లాదుర్గం మండలం ముస్తాపూర్కు చెందిన సత్యనారాయణ(20) అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీ వెనకాల కూర్చున్న మరో వ్యక్తి కొత్త గొల్ల కుమార్ (18)కు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గుర్తు తెలియని శవం లభ్యంహత్నూర ( సంగారెడ్డి): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన సంఘటన హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. బోరుపట్ల గ్రామ శివారులోని పత్తి కుంట చెరువులో ఒక వ్యక్తి శవం నీటిలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతని వయసు సుమారు( 40) సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తు పడితే హత్నూర పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712656752కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. 22 మంది బైండోవర్సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డిలోని 22 మంది పాత నేరస్తులను తహసీల్దార్ జయరాం ఎదుట శుక్రవారం బైండోవర్ చేసినట్లు పట్టణ సీఐ రాము నాయుడు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పాత నేరచరిత్ర కలిగిన నేరస్తులను ముందస్తుగా బైండోవర్ చేసినట్లు చెప్పారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకుంటునట్లు వివరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 30ఎండికె 62ఏ: -
పారా అథ్లెటిక్స్లో నాలుగు పతకాలు
నవోదయ విద్యార్థుల ప్రతిభ వర్గల్(గజ్వేల్): ఎనిమిదో రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలలో వర్గల్ నవోదయ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగు పతకాలు సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీలలో వర్గల్ నవోదయ విద్యార్థులు ఎం వివేక్, బీ కార్తీక్ పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగులో సత్తాచాటిన వివేక్ గోల్డ్మెడల్, షాట్పుట్లో బ్రాంజ్ మెడల్ సాధించగా, కార్తీక్ జావెలిన్ త్రోలో గోల్డ్, హైజంప్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్, పీఈటీ వీరేందర్సింగ్ తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. -
మోసమే కాంగ్రెస్ నైజం
● కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం ● మాజీ మంత్రి హరీశ్రావుచిన్నకోడూరు(సిద్దిపేట): అనేక హామీలతో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కిష్టాపూర్లోని సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన మామీలను అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదని, రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవండతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసం రాజిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాక్ పాయింట్ ఏర్పాటు చేయండి సిద్దిపేటజోన్: సిద్దిపేట ప్రాంతంలో రైలు సౌకర్యం ఉందని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక రాక్ పాయింట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులకు సూచించారు. గురువారం పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ సెక్రటరీలతో పలు అంశాలపై అరా తీశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పీఏసీఎస్ చైర్మన్ లను తొలగించగా, న్యాయస్థానం కొట్టివేసిందని, మరి ఇప్పుడు చైర్మన్లు ఉన్నట్టా ... లేనట్టా అని అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో అనేక సమస్యలు ఉన్నాయని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పరిష్కరించాలని సూచించారు. సన్ ప్లవర్ కొనుగోలు మీద ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సన్న వడ్ల బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయని, అదేవిధంగా వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
చేజారి పోకుండా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కాంగ్రెస్లో నెలకొన్న వర్గ విభేదాల విషయంలో ఆ పార్టీ అధినాయకత్వం ముందుజాగ్రత్త పడుతోంది. ఈ ఆధిపత్య పోరు కారణంగా ఏకంగా మున్సిపాలిటీలే ‘చేయి’జారిపోయే అవకాశాలుండటంతో నారాయణఖేడ్, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకుల మధ్య సమన్వయం చేసే ప్రయత్నాలు చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం ఇన్చార్జిలుగా నియమితులైన మంత్రులు అజాహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏమాత్రం తేడాలు వచ్చినా అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నేతల మధ్య సమన్వయలోపం కారణంగా పార్టీకి ఆశించిన మేర ఫలితాలు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. అజహర్, దామోదరల సూచనలతో... నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరుల మధ్య పోటీ ఉంది. దీంతో మంత్రులు అజాహరుద్దీన్, దామోదరల సూచనల మేరకు ఇద్దరు నేతలూ చర్చించుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లాలో పట్టు నిలుపుకుంది. సుమారు 40% మున్సిపాలిటీలను గులాబీ పార్టీ గెలుచుకుంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలే ప్రత్యర్థి పార్టీ గెలుపునకు ప్రధాన కారణమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పైగా ఇప్పుడు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో సమన్వయం లేకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వర్గవిభేదాల విషయంలో మంత్రులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైరి వర్గాల సమన్వయంపై ఇన్చార్జి మంత్రుల నజర్ కలిసి పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు కొలిక్కివచ్చిన కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పటాన్చెరులో ఇలా... పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాటాశ్రీనివాస్గౌడ్, నీలంమధు వర్గీయులు ఆయా మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్ టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. దీంతో ఈ టికెట్ల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సమన్వయంతో టికెట్లు ఖరారు చేయాలని మంత్రి వివేక్ సూచించినట్లు తెలుస్తోంది. కాగా, ఒకరు రెండు మున్సిపాలిటీలు, మరొకరు మూడు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్లోజహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లోని ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు మున్సిపాలిటీల్లోని టికెట్ల కోసం మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి వర్గీయులు ఆశిస్తున్నారు. ఎంపీ షెట్కార్ అనుచరులు కూడా టికెట్ల రేసులో ఉన్నారు. దీంతో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చిన వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఏకాభిప్రాయం కుదరని వార్డుల విషయంలో ఆ పార్టీ సర్వే ఆధారంగా టికెట్లు ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
జోరందుకున్న నామినేషన్లు
● పోటా పోటీగా దాఖలు ● రెండోరోజు 719 నామినేషన్లు ● నేటితో ముగియనున్న గడువు సంగారెడ్డి జోన్: జిల్లాలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 719 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఈ రెండురోజుల్లోనూ 818 నామినేషన్లను దాఖలయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసి మద్దతుదారులతో ర్యాలీగా కేంద్రాలకు తరలివచ్చారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 299, బీఆర్ఎస్ 247, బీజేపీ 149, బీఎస్పీ 4, ఆప్ 1, సీపీఎం 2, ఎంఐఎం 9, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 5, స్వతంత్రంగా 102 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
బొగ్గు స్కామ్ దృష్టి మళ్లించేందుకే
కేసీఆర్కు సిట్ నోటీసులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్సంగారెడ్డి: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులివ్వడాన్ని ఎమ్మెల్యే చింతాప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డి చేసిన భారీ బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ నోటీసుల డ్రామాను సీఎం రేవంత్రెడ్డి నడిపిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకు మాజీమంత్రులు హరీశ్రావుకు, గట్టిగా నిలదీసినందుకు కేటీఆర్కు నోటీసులిచ్చారని ప్రభాకర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ అనే శక్తిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు కేసీఆర్కు అండగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కక్షసాధింపే: నరోత్తం జహీరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయ కుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు సిట్ నోటీసులివ్వడం కక్షసాధింపు చర్యేనని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ జోలికి వస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. పాలన చేతగాక ప్రతిపక్ష నాయకులకు నోటీసులిప్పించడం రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక దృష్టి మళ్లించే రాజకీయాలు చేయడం సీఎంకు తగదన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
వీబీజీరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి
కొండాపూర్(సంగారెడ్డి): ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే వీబీజీరామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యం డిమాండ్ చేశారు. మండల పరిధిలోని సీతారాంకుంటతాండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను సీపీఎం బృందం గురువారం కలసి కొద్దిసేపు ఉపాధి పనులు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ...కార్మిక, రైతు, కూలీలకు ప్రజా వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీరామ్జీ పథకాన్ని తెచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపిందని మండిపడ్డారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. కలసివచ్చే శక్తులతో ముందుకు: మల్లేశం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎర్రజెండా బిడ్డలను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బీరం మల్లేశం కోరారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అభ్యర్థితో కలిసి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ లౌకికవాద, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఎం కొండాపూర్ మండల కార్యదర్శి రాజయ్య మండల కమిటీ సభ్యులు బాబురావు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అర్జున్్ ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం -
కాంగ్రెస్ పతనానికి నాంది
గజ్వేల్: కేసీఆర్కు సిట్ నోటీసులు.. రేవంత్రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటే రు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించమే కాకుండా సీఎంగా పదేళ్లు పాలించి.. రాష్ట్రం దశాదిశాలను మార్చిన కేసీఆర్పై కుట్రలను ప్రజలు సహించరని హెచ్చరించారు. రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకున్న రేవంత్రెడ్డి ఫోన్ట్యాపింగ్ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్సన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
తెగని టికెట్ల పంచాయితీ
జహీరాబాద్: నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు శుక్రవారం ఒక్క రోజు మాత్రమే గడువు మిగిలి ఉంది. అయినా జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలను ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు విడుదల చేయలేదు. టికెట్ల కోసం ఆశావాహులు అధికంగా ఉండటంతో మొత్తం అభ్యర్థుల జాబితాలను విడుదల చేయలేదు. పోటీ తక్కువ ఉన్న వార్డులకు సంబంధించి అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించాయి. రెండు రోజుల నామినేషన్లు పూర్తయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం జహీరాబాద్ మున్సిపాలిటీలోని 37 వార్డులకుగాను గురువారం రాత్రి 19మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. మిగతా జాబితాను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. జాబితా ప్రకటించే విషయంలో జాప్యం జరిగితే ఆశావహులతో నామినేషన్లు వేయించి, ఖరారు చేసే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాత్రం 21 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. మిగతా చోట్ల పోటీ ఎక్కువ ఉన్నందున పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్... హైదరాబాద్ కేంద్రంగా టికెట్లను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా కార్యాచరణను చేపట్టింది. పార్టీలో నాలుగు గ్రూపులు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో వివాదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ అధిష్టానవర్గం అందరినీ ఒకేచోట చేర్చి టికెట్లను ఖరారు చేసే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ ఎండీ.తన్వీర్ సమావేశమై టికెట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. పట్టువిడుపులకు పోకుండా సామరస్య ధోరణిలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. బీఆర్ఎస్.. ముగ్గురు నేతలతో ఎంపిక బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారుచేసే బాధ్యతను ముగ్గురు నేతలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే కె.మాణిక్రావు, ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 21 మంది అభ్యర్థులను ఖరారు చేసి జాబితా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ప్రజా బలం ఉన్న వారికే టికెట్లను కేటాయించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయినా పలు వార్డుల నుంచి ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని వారు ఉంటే వారిలో ప్రజాబలం కలిగివున్న వారికి టికెట్లను కేటాయించే విషయమై పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందువల్లే జాబితాను ప్రకటించే విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మున్సిపల్ పరిధిలో మజ్లిస్ పార్టీ పలు వార్డుల్లో బలంగా ఉంది. అయినా పార్టీ ఇప్పటివరకు జాబితాను ప్రకటించలేదు. సగంమందితోనే బీఆర్ఎస్,కాంగ్రెస్ జాబితాలు ఇంకా ప్రకటించిన బీజేపీ ఆశావహులంతా నామినేషన్ల దాఖలు అభ్యర్థిత్వాల ఖరారు తర్వాతే బీ ఫారాలు -
నోటిఫికేషన్
1319 సీట్ల భర్తీకి ● మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు ● దరఖాస్తు సమర్పణకుగడువు జనవరి 31 ● జిల్లా వ్యాప్తంగా 24 గురుకులపాఠశాలలుసంగారెడ్డి క్రైమ్: ప్రభుత్వ మైనార్టీ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాదిలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ గురుకుల విద్యాలయంలో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి గడువును జనవరి 31వ తేదీ నిర్ణయించింది. అర్హత ఉన్న విద్యార్థులు మీసేవ సెంటర్ లేదా ఆన్లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అయితే ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలని సూచించింది. మెనూ ప్రకారం భోజనం గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం అందించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అంతేకాదు, వారానికి నాలుగు రోజులు ఎగ్, ఆరు రోజులు పాలు, వారానికి ఒకసారి మటన్, వారానికి రెండు రోజులు చికెన్ అందిస్తుంది. దీంతో పాటు ప్రతిరోజు సాయంత్రం లేదా రాత్రి భోజన సమయాల్లో స్నాక్స్, ప్రతిరోజు ఉదయం టిఫిన్, వారంలో కనీసం నాలుగైదు రకాల ఆకుకూరలతో కూడిన మెనూ ప్రకారం భోజనం అందిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. మైనార్టీ విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. – భాగ్యమతి, ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ భర్తీ చేయనున్నసీట్లు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మొత్తం గురుకులాలు 24 ఉండగా.. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాదిలో కలిపి మొత్తం 1,319 సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మైనార్టీ గురుకులాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, కాస్మోటిక్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా గురుకులాల్లో 5000పైగా విద్యార్థులు పోటీ పడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా మరింత పోటీ ఉండే అవకాశం ఉందన్నారు.విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాలికలు 262 260బాలుర 374 423 -
బండమీదిపల్లిలో దారుణం
వెల్దుర్తి(తూప్రాన్): వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని శంశిరెడ్డిపల్లి పంచాయతీ పరిధి బండమీదిపల్లిలో ఘటన వెలుగుచూసింది. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంపల బాలేష్(48)కు అదే గ్రామానికి చెందిన అప్పల సాయిలు భార్యతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. పలుమార్లు హెచ్చరించినా తీరు మారలేదు. ఈ క్రమంలో భార్యతో చనువుగా ఉన్న సమయంలో సాయిలు నేరుగా పట్టుకొని పదునైన ఆయుధంతో బాలేష్పై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం వెల్దుర్తి పోలీస్స్టేషన్కు నేరుగా వెళ్లి లొంగిపోయాడు. బుధవారం అర్థరాత్రి దాటాక పోలీసులు గ్రామ శివారులోని పంట పొలాల్లో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పల సాయిలు, శ్రీశైలం, శేఖర్తో పాటు పాంబండకు చెందిన తలారి యాదగిరి కలిసి తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య మనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి హత్య పోలీస్స్టేషన్లో లొంగిపోయిననిందితుడు -
మోడల్ కాలనీ
● కరువైన కనీస వసతులు ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుస్థితిగజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో సమస్యలు రోజురోజుకూ జటిలంగా మారుతున్నాయి. అధికారికంగా గృహప్రవేశాలు జరగకపోగా.. లబ్ధిదారులే సుమారు ఆరు వందల మందికిపైగా తమకు కేటాయించిన ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో కాలనీలో కనీస వసతులు కరువై అల్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ సమస్య ప్రధానంగా తెరపైకి వస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి మొత్తం 1250 ఇళ్ల మోడల్ కాలనీని మంజూరు చేసి పూర్తి చేయించారు. కానీ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఏళ్ల తరబడి నానుతూ వచ్చింది. వివిధ రకాల ఆందోళనల తర్వాత 2023 మార్చి 21న అధికారులు తుది లక్కీ డ్రా నిర్వహించి 1100 మందిని ఎంపిక చేశారు. కానీ ఆ కాలనీలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న మల్లన్నసాగర్ నిర్వాసితులను ఖాళీ చేయించి, హ ప్రవేశాలు చేయించడం అధికారులకు సవాలుగా మాంది, కొంత కాలంగా చాలామంది నిర్వాసితులు ఖాళీ చేసి వెళ్లిపోగా..లక్కీ డ్రా ద్వారా ఎంపికై న లబ్ధిదారులు నేరుగా తమకు కేటాయించిన నంబర్లలో సుమారు 600 మంది వరకు ఇళ్లను స్వాధీనం చేసుకొని ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. కాలనీలో కనీస సౌకర్యాలేవీ..? గృహప్రవేశాల గురించి చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం తాము కాలనీలో వచ్చి నివాసముంటున్న సందర్భంలో ఇక్కడ కల్పించాల్సిన కనీస వసతులను సైతం పట్టించుకోడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. తాము మున్సిపాలిటీలో అంతర్భాగం కాదా...? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా గృహప్రవేశాలు అధికారికంగా చేపట్టి.. పట్టాలు ఇవ్వపోవడం, కాలనీలో పారిశుద్ద్యలోపం పేరుకుపోవడం, వీధిదీపాలు లేక రాత్రి వేళల్లో చీకట్లు అలుముకోవడం, కుక్కల బెడద, రాత్రివేళల్లో మందుబాబుల వీరంగం తదితర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 25న కాలనీవాసులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పట్టించుకోకపోతే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. కాలనీలో ప్రస్తుతం నివసిస్తున్న వారివి 4వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమకు ప్రత్యేకంగా రెండు వార్డులు కేటాయించాల్సిన విషయాన్ని కూడా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. మొత్తానికి వీరి సమస్య ప్రస్తుతం ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారబోతున్నది. మమ్మల్ని పట్టించుకోరా...? కొంత కాలంగా కాలనీలో నివాసం ఉంటున్నా.. మా సమస్యల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీస సౌకర్యాల్లేక ఇబ్బంది పడుతున్నాం. మాకు అధికారికంగా పట్టాలు ఇవ్వాలనే విషయాన్ని కూడా మరిచిపోయారు. మా సమస్యలు తీరే వరకు పోరాడుతాం. – దయాకర్, కాలనీ కమిటీ అధ్యక్షుడు రాత్రి పూట లైట్లు లేక భయం మా కాలనీలో వీధి దీపాలు లేక రాత్రి పూట బయటకు రావాలంటే భయపడుతున్నాం. పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇప్పటికై నా కనీస సౌకర్యాలు కల్పించాలి. – నాగేందర్, డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసి -
8 మంది జూదరుల అరెస్టు
రూ.46,852 నగదు, 8 సెల్ఫోన్ల స్వాధీనం పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని మైసమ్మ గుడి వద్ద అక్రమంగా జూదం ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జూదం ఆడుతున్నట్లు సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ మేరకు వారి నుంచి రూ.46,852 నగదుతో పాటు 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జూదం ఆడుతున్న కృష్ణ, బాజీరావు, కంచరి సత్యం, సాయాగౌడ్, సంగమేశ్వర్, లింగం, యాదగిరిలను అరెస్ట్ చేశారు. పేకాట, బెట్టింగ్లతో చాలా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, యువత తప్పు మార్గాలను ఎంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ ప్రవీణ్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సంగమేశ్వర్, టాస్క్ఫోర్స్ పోలీసులుపాల్గొన్నారు. -
చిరుత సంచారం
● రైతులు అప్రమత్తంగా ఉండాలి ● బీట్ ఆఫీసర్ దేవేందర్రెడ్డి అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని చిరుతపులి సంచరిస్తున్నట్లు కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.మండలంలోని కేశనాయక్తండా పంచాయతీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులువురు రైతులు ఇచ్చిన సమాచరం మేరకు ఫారెస్టు బీట్ ఆఫీసర్ దేవేందర్రెడ్డి గురువారం ఆయా ప్రాంతాలను సందర్శించారు. పులి పాదముద్రల కోసం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్పష్టమైన పాదముద్రలు కనిపించలేదని, కానీ రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో పొలాలు, బావుల వద్దకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని చెప్పారు. కేశనాయక్తండా, గుబ్బడి, కుందనవానిపల్లి, బంజారాహిల్స్, గౌరవెల్లి, మైసమ్మవాగుతండాల పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. చిరుత కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలు గమనించినా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
నమ్మకం, సేవాభావం
నాడు రాజకీయమంటేమెదక్జోన్: నాడు రాజకీయం అంటే సేవాతత్పరతతోపాటు ప్రజా విశ్వాసాన్ని చూరగొనేలా పనులు చేయడం. నేడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అసలు రాజకీయం అర్థాలే మారిపోయాయి. సేవాభావం స్థానంలో స్వార్థం, విశ్వాసం స్థానంలో అవకాశవాదం వచ్చి చేరాయని మెదక్ మున్సిపాలిటీకి మూడుసార్లు చైర్మన్గా వ్యవహరించిన భట్టి జగపతి చెబుతున్నారు. ప్రస్తుతం వయోభారంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండగా ఈ ఎన్నికల్లో ఆయన సతీమణి, కుమారుడు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటి నుంచి నేటివరకు రాజకీయాల్లో వచ్చిన విపరీతధోరణులపై సాక్షితో ముచ్చటించిన విశేషాలు ఆయన మాటల్లోనే... మూడుసార్లు చైర్మన్గా.. ‘‘1952లో ఆవిర్భవించిన మెదక్ మున్సిపాలిటీకి ఇప్పటివరకు 14 మంది చైర్మన్లుగా వ్యవహరించగా..అందులో మూడుసార్లు (1981, 1995, 2005)లలో చైర్మన్గా వ్యవహరించాను. 1981లో మున్సిపల్ ఎన్నికల్లో తాను ఖర్చుపెట్టింది కేవలం రూ.30వేలే. ఇక రెండోసారి 1995 ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రూ.80 వేలు. అప్పట్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఉండేది. ఓటర్లు సైతం నాయకుడిపై అంతే విశ్వాసంతో ఓట్లు వేసేవారు. రెండోసారి చైర్మన్గా పోటీ చేసిన సమయంలో తనను రాజకీయంగా అణగదొక్కాలని నాటి మంత్రి కరణం రామచంద్రారావు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయగా...ప్రజలు భారీ మెజార్టీతో తనను గెలిపించారు. అప్పట్లో మున్సిపల్ చైర్మన్కు కాస్త ఎక్కువ అధికారాలే ఉండేవి. ఆ అధికారాలతోనే తన పదవీకాలంలో ప్రజలకు అనేక పనులు చేసిపెట్టాను. పట్టణంలో చాలా కాలనీలను ఏర్పాటు చేయడంతోపాటు పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వగలిగాను. చాలామందికి ఇళ్లు మంజూరు చేయించగలిగాను. ఇలా ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి పూర్తి చేసిన అభివృద్ధి పనులే తాను మూడుసార్లు చైర్మన్గా గెలుపొందడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఒక వెంచర్ ఏర్పాటు చేయాలన్నా చైర్మన్కు అధికారం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్లకు చైర్మన్ అధికారాలను బదిలీ చేసేశారు. మున్సిపల్ కార్యాలయం నిర్మాణం మున్సిపల్ కార్యాలయాన్ని తన హయాంలో నిర్మించాం. ప్రస్తుతం పట్టణానికి తాగునీరు అందించే పసుపులేరు వాగు నుంచి పైపులైన్ల ద్వారా ప్రజలకు తాగు నీటిని అందించాం. అప్పట్లో విద్యుత్ సక్రమంగా ఉండకపోవడంతో తరచూ పట్టణానికి తాగునీటి సమస్యలు ఎదురయ్యేవి. దీంతో ఏకంగా జనరేటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూశా అని వివరించారు. -
వెయ్యేళ్ల చరిత్రగల గుంతపల్లి
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. సర్పంచ్ పడమటి అనంతరెడ్డి ఆహ్వానం మేరకు గురువారం గుంతపల్లి శివారులోని శివాలయం, బురుజును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయం ద్వారం, వాటిపై ఉన్న పూర్ణకలశ చిహ్నాలు, గర్భాలయంలోని నల్ల శాసనపు రాతిలో, నునుపుగా చెక్కిన పానవట్టం, బ్రహ్మసూత్రం (లక్ష్మణోద్ధారణ రేఖ) ఉన్న శివలింగం, కల్యాణ చాళుక్య వాస్తు రీతికి అద్దం పడుతున్నాయన్నారు. సా.శ. 1076 నుంచి 1125 వరకు పరిపాలించిన కల్యాణ చాళుక్య చక్రవర్తి ‘త్రిభువనమల్ల’బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడికి పటాన్చెరు తాత్కాలిక రాజధాని(నేలవీడు)గా ఉందని చెప్పారు. ఆ కాలంలోనే ఈ శివాలయ నిర్మాణం జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయాన్ని, గ్రామ మధ్యలో 150 యేళ్ల క్రితం నిర్మించిన బురుజును కాపాడుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మేడిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గొల్లెన మల్లేశం(45) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ట్రాక్టర్పై ఇంటి నుంచి మల్లారం వైపు వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోడ్డు పక్కన పొలంలో బోల్తా పడింది. బలమైన గాయాలు కావడంతో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు ట్రాక్టర్ బోల్తా పడిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. మృతుడికి భార్య మహేశ్వరి, కుమారులు ప్రకాశ్, అజయ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైఫ్ అలీ తెలిపారు. -
అనర్హతే..
నిబంధనలు అతిక్రమిస్తే● అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్త ● పత్రాలతో ఉరుకులు పరుగులు ● మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నిబంధనలివీ.. కౌన్సిలర్ బరిలో నిలబడే అభ్యర్థులు కనీసం 21 సంవత్సరాలు నిండి, మున్సిపాలిటీ పరిధిలో ఓటరై ఉండాలి. అతన్ని ప్రతిపాదించే వ్యక్తి సైతం స్థానికుడై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రాలను జత చేయాలి. ఇద్దరు సాక్షులతో కలిసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అందులో విద్యార్హత, కుటుంబ ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర తదితర వివరాలను రాయాలి. అభ్యర్థి సొంత వార్డు కాకుండా ఇతర వార్డులో పోటీచేస్తే మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి బకాయిలు ఉండొద్దు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థి పేరిట ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంట్ బిల్లులు, బ్యాంకు రుణాలు వంటి ఎలాంటి బకాయిలు క్లియరెన్స్ ఉండాలి. అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి, సాక్షులుగా ఉండే ఇద్దరు వ్యక్తుల పేరున కూడా ఎలాంటి బకాయిలుండొద్దు. ప్రభుత్వ రుణాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలి. బకాయిలు ఉంటే స్క్రూటినిలో నామినేషన్ తిరస్కరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పోటీలో ఉండకూడదు. ఉండాలంటే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒక్క వార్డు నుంచే పోటీచేయాలి ఒక అభ్యర్థి అతని మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ని వార్డుల్లోనైన నామినేషన్లు దాఖలు చేయవచ్చు. కానీ పోటీ మాత్రం ఒక్క వార్డు నుంచే చేయాలి. స్క్రూటిని అనంతరం ఇతర నామినేషన్లు అన్ని ఉపసంహరించుకొని ఒక్క వార్డును ఎంపిక చేసుకోవాలి. రెండు వార్డుల్లో నామినేషన్ వేసి మర్చిపోయినా.. వాటిని ఉప సంహరించుకోక పోయిన అభ్యర్థి పోటీలో నిలబడే అర్హత కోల్పోతారు. డిపాజిట్ ఎంత? ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1250, ఓసీలు రూ.2500లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగాా డిపాజిట్ డబ్బులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. డిపాజిట్ సాధించకుంటే డబ్బులు ఇవ్వరు. అభ్యర్థులు రాయితీ పొందాలంటే తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. తప్పనిసరిగా ఏదైన ఒక బ్యాంకు నుంచి కొత్తగా అకౌంట్ తీసి వివరాలు ఇవ్వాలి. ఎన్నికల ఖర్చులకు మొత్తం ఆ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు వాడాలి. ఎన్నికల అనంతరం తప్పనిసరిగా ఖర్చుల వివరాలు ఎన్నికల అధికారులకు అందజేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. నామినేషన్లకు కేవలం మూడు రోజులే అవకాశం కల్పించారు. దీంతో ఆశావాహులు అర్హత పత్రాల సేకరణకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇదే సమయంలో కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నామినేషన్ పత్రాలను ఒకటికి పదిసార్లు పరిశీలించుకోవాలి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కమిషన్ అడిగిన అన్ని పత్రాలు సమర్పించాలి. అందులో ఏ ఒక్క సర్టిఫికెట్ నామినేషన్ పత్రంలో జత చేయక పోయినా.. తిరస్కరణకు గురవుతుంది. –మెదక్ కలెక్టరేట్అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ఫారం –2లో పూర్తి వివరాలు నింపాలి. ప్రధానంగా అభ్యర్థి తన ఇంటి పూర్తి పేరుతో రాయాలి. ఇతర పూర్తి వివరాలను తప్పనిసరిగా నింపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. ఆధార్కార్డు, ఓటరు కార్డుతోపాటు ఆస్తి పన్నులు, నీటి పన్నుల క్లియరెన్స్ పత్రాలు, ముఖ్యంగా మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ పొంది దానిని నామినేషన్ వెంట జత చేయాలి. -
విద్యుదాఘాతానికి రైతు
కొల్చారం(నర్సాపూర్): విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వసురాం గిరిజన తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మలావత్ శ్రీను (44) గతేడాది నుంచి అంసాన్పల్లికి చెందిన సాయవ్వోల్ల ఎగొండకు చెందిన భూమిని కౌలుకు తీసుకున్నాడు. బోరు పనిచేయడం లేదంటూ ఉదయం ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. సాయంత్రం అటుగా వెళ్లిన వ్యక్తికి బోరు స్టార్టర్ వద్ద నిర్జీవంగా పడి ఉన్న శ్రీను కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించి ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నీట మునిగి వ్యక్తి..
పాపన్నపేట(మెదక్): పక్షం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మంజీరా నదిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎంకెపల్లి శివారులో బుధవారం వెలుగు చూసినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా చింతకుంటకు చెందిన అన్నాసాగర్ లక్ష్మయ్య (85) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 13న ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ మేరకు కుటుంబీకులు గ్రామ శివారులో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని ఎంకెపల్లి శివారులోని మంజీరా నదిలో శవం కనిపించగా ,గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
● మరో ముగ్గురికి గాయాలు ● ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం రామాయంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట అటవీప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, వారి కూతురు, కుమారుడితో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసుల కధనం మేరకు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్కు చెందిన ముద్రకోళ్ల బాలరాజు సంతల్లో తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పాతూరులో జరిగే సంతకు ఆటోలో తన భార్య మంజుల, కుమారుడు అభి, కూతురు అక్షయతోపాటు మరో మహిళ పావనిని తీసుకొని వెళుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మంజూల (32) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన బాలరాజు (38)ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందాడు. కామారెడ్డిలో చికిత్స పొందుతున్న బాలుడు అభి పరిస్థితి విషమంగా ఉంది. అక్షయ, పావని చికిత్స పొందుతున్నారు. ఉదారత చాటుకున్న ఏఎస్పీ అదే సమయంలో రామాయంపేట వైపు వస్తున్న ఏఎస్పీ మహేందర్ తన వాహనాన్ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. దారిన వెళుతున్న వారితోపాటు తన సిబ్బందితో కలిసి గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి తన ఉదారతను చాటుకున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ జాం కాగా, స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఎస్ఐ బాలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.బాలరాజు మంజూల -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
జిన్నారం: ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గుమ్మడిదల ఎస్సై లక్ష్మీకాంత్రెడ్డి హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు, సభలు, ర్యాలీలు, గుంపులుగా ఏర్పడవద్దని హెచ్చరించారు. బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరపవద్దన్నారు. నర్సాపూర్: అనుమానాస్పద స్థితిలో మూడో తరగతి విద్యార్థి మృతిచెందిన సంఘటన నర్సాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. ప్రిన్సిపాల్ వెంకటేశం కథనం ప్రకారం.. పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న హర్షిత్నాయక్ (8) బుధవారం మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో కళ్లు తిరుగుతున్నాయని, కడుపులో నొప్పిగా ఉందని తోటి విద్యార్థులకు చెప్పగా, వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు విద్యార్థి తండ్రి కిషన్నాయక్కు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు వచ్చి బాలుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాట్లాడుతూ.. పాఠశాలలో ఏం జరిగిందో ఉపాధ్యాయులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మరణంపై అనుమానంగా ఉందన్నారు. ఈవిషయమై ఎస్ఐ రంజిత్రెడ్డిని వివరణ కోరగా.. తమకు సమాచారం రాగానే పాఠశాలకు వెళ్లి ఆరా తీశామన్నారు. సీసీ కెమెరాలు పని చేయడం లేదని పాఠశాల సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని వివరించారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యవట్పల్లి(అందోల్): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని దుద్యాలలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ లవకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని గోపాల్(40) తన కొంత కాలంగా మద్యానికి అలవాటు పడి భార్యతో పాటు ఘర్షణకు దిగేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో పాటు కుటుంబీకులతో గొడవకు పాల్పడ్డాడు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి గోపాల్ ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. –––––––––––––––– 28 జెజిపి 82: గోపాల్ -
లేబర్ కోడ్ల రద్దుకు పోరాటం
జహీరాబాద్ టౌన్: పెట్టుబడుదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దుకు పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. పిరామల్ పరిశ్రమ వద్ద కార్మికులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, దేశంలో సంఘాలు, చట్టాలు లేకుండా ఉన్న చట్టాలను మార్చాలని చూస్తోందన్నారు. తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి మహిపాల్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
రూ.3.30 కోట్లతో అభివృద్ధి పనులు
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ● రూ.30 లక్షల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ పటాన్చెరు: నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు డివిజన్ సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రూ.3.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్తో కలసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శరవేగంగా విస్తరిస్తున్న పటాన్చెరు డివిజన్, జేపీ కాలనీ డివిజన్ల పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, యూజీడీలు, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని చోటి మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గల స్థలంలో రూ.30 లక్షల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రామాలయం నిర్మాణానికి విరాళం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, శివాలయం దేవాలయాల నిర్మాణానికి రూ.75 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించినట్లు గుర్తు చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మించిన మంచినీటి సంప్ హౌస్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
ఏడుపాయల ఈఓగా వీరేశం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల నూతన ఈఓగా ఎం.వీరేశం బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంత కాలం అదనపు బాధ్యతలు నిర్వహించిన అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తన సొంత శాఖకు వెళ్లిపోయారు. మేడ్చల్ మల్కాజిగిరి శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ గ్రేడ్–1 ఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరేశంకు ఏడుపాయల ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పచెబుతూ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మొదట ఏడుపాయల దుర్గమ్మకు పూజలు చేసిన అనంతరం, చంద్రశేఖర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గజ్వేల్రూరల్: మందుబాబులకు కోర్టు జరిమాన విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్లో పలువురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని బుధవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి ఎదుట హాజరు పర్చగా ఐదుగురికి రూ. 50వేలు, ఓ వ్యక్తికి ఒకరోజు జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఐదుగురికి రూ. 5వేల చొప్పున జరిమానా విధించారు. కొమురవెల్లి(సిద్దిపేట): పోక్సో కేసులో యువకునికి జైలు శిక్ష, జరిమాన విధించినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో బాలికపై లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు శరిపుద్ధీన్ (19)పై కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేసి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. బుధవారం సిద్దిపేట మొదటి అదనపు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జయప్రకాశ్ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2లక్షల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితునికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసులను కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. చేగుంట(తూప్రాన్): మండలంలోని వడియారం గ్రామంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకు చోరీ జరిగిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామంలో నరేందర్నాయక్ తన గ్లామర్ బైక్ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. మంగళవారం అర్ధరాత్రి ఓ దొంగ అదను చూసి గ్లామర్ బైకు ను నకిలీ తాళంతో స్టార్ట్ చేసుకొని ఉడాయించాడు. ఈ విషయం మొత్తం సమీప సీసీ టీవీలో రికార్డు అయింది. కేసు దర్యాప్తులో ఉంది. శివ్వంపేట(నర్సాపూర్): అనాథాశ్రమం నుంచి మహిళ అదృశ్యమైంది. ఎస్సై మధుకర్రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని మగ్ధుంపూర్లోని బేతని అనాథాశ్రమంలో ఉంటున్న మతిస్థిమితం లేని బోనాల భవిత(32) మంగళవారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఆశ్రమ ఇన్చార్జ్ కార్మెల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కన్నపేట(హుస్నాబాద్): అప్పుల బాధ, మరో వైపు కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని గౌరవెల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మారబోయిన కల్పన(33)భర్త భీమరాజుతో కలిసి పలు రకాల పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే వీరికి అప్పులు కాగా మరోవైపు కుటుంబ కలహాలు తోడయ్యాయి. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్పన ఉరివేసుకుంది. మృతురాలికి 13ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కల్పన తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేటరూరల్: యూడీఐడీ వికలాంగుల గుర్తింపు శిబిరానికి జిల్లాలోని అర్హులైన వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ఆర్యా ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 12, 26వ తేదీల్లో నడవలేని వారికి, 5వ తేదీన మానసిక స్థితి, 19వ తేదీన కంటిచూపు, చెవుడుతో బాధపడే వారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మీసేవలో యూడీఐడీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని, నిర్దేశించిన తేదీ రోజున ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ధరఖాస్తు రసీదు, ఆధార్కార్డు, వైకల్యం ఫొటో, వైద్యుల రిపోర్టులు తీసుకురావాలన్నారు. దరఖాస్తు సంబంధిత మెసేజ్ వచ్చిన వారు మాత్రమే శిబిరానికి రావాలని తెలిపారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
వివరాలు వెల్లడించిన పోలీసులు సిద్దిపేటకమాన్: అనుమానంతో భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసి, అడ్డొచ్చిన కూతురిపై హత్యా యత్నానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణంలో నివాసం ఉంటున్న దున్నపోతుల ఎల్లయ్య (40) ఇంట్లో నిద్రపోతున్న తన భార్య శ్రీలతను అనుమానంతో ఈ నెల 18న తెల్లవారుజామున కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. పక్క గదిలో ఉన్న తన కూతురు హర్షితను తలపై రోకలితో బాది, కత్తితో మెడ కోసి చంపడానికి ప్రయత్నించాడు. తర్వాత నిందితుడైన ఎల్లయ్య సైతం గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం నిందితుడు దున్నపోతుల ఎల్లయ్యను రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం హర్షిత హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ప్రాణాపాయ స్థితిలో ఉందన్నారు. ఏఎస్ఐ ముత్యం, కానిస్టేబుల్ స్వామి పాల్గొన్నారు. -
సీఎం కప్ విజేతలకు బహుమతులు
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటీలలోని విజేతలకు బుధవారం టేక్మాల్లో ఎంఈఓ సుజాత అందించారు. కబడ్డీ పోటీలలో టేక్మాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి, రెండో బహుమతి ఎలకుర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందించారు. ఇందులో సర్పంచ్ తిమ్మిగారి సుదాకర్, ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మరమేష్, పీడీ మధు తదితరులు ఉన్నారు. సీఎం కప్ క్రీడాపోటీల వేదిక మార్పు గజ్వేల్రూరల్: ఈనెల 29, 30వ తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించ తలపెట్టిన సీఎం కప్ 2026 క్రీడా పోటీలను మండల పరిధిలోని బయ్యారంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, చెస్, వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. 2008 జనవరి ఒకటి తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ క్రీడాపోటీలకు అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ఫారంతో పాటు ఆధార్కార్డు జీరాక్స్ తీసుకొని గురువారం ఉదయం 9గంటలలోగా హాజరు కావాలని సూచించారు. -
ఎలక్షన్.. ఫుల్ కలెక్షన్
● పన్నుల చెల్లింపుల కోసం ఎగబడిన అశావహులు ● నామినేషన్ కేంద్రాల వద్ద సందడి జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని పన్నుల బకాయిలు వసూలు అవుతున్నాయి. బుధవారం మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. దీంతో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారు తమ పేరిట ఏమైనా పన్నుల బకాయిలు ఉన్నాయా అనే సమాచారం తెలుసుకునేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సంప్రదిస్తున్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద వివరాలు తెలుసుకుంటున్నారు. నామినేషన్లు వేసే వారితో పాటు వారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారు సైతం ఎలాంటి పన్నుల బకాయిలు ఉండరాదనే నిబంధన ఉండడంతో అభ్యర్థులు తమ ప్రతిపాదకులను వెంటబెట్టుకుని వచ్చి అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆస్తి, నల్లా, వ్యాపార కేంద్రాల పన్నుల బకాయిల వివరాలను తెలుసుకుంటున్నారు. దీంతో సేవా కేంద్రాల కౌంటర్లు సందడిగా మారాయి. ఏర్పాట్ల పర్యవేక్షణ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆర్డీఓ దేవుజా, డీఎస్పీ సైదా, మున్సిపల్ కమిషనర్ జైత్రాం, సీఐ శివలింగం, ఎస్ఐలు వినయ్కుమార్, కాశీనాథ్లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు వేసే కేంద్రాల్లోకి పరిమితంగానే అనుమతించారు. ఎన్నికల సంఘం నియమావళిని అమలు చేస్తున్నారు. మొదటి రోజున నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, అభ్యర్థులు సాదా సీదాగా వచ్చి నామినేషన్లు వేశారు. -
ఓటు హక్కు వజ్రాయుధం
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలోని కొండాపూర్ మండల పరిధిలో మల్కాపూర్లోని ఓ ప్రైవేటు స్కూల్ గ్రౌండ్లో బుధవారం ‘మై భారత్– మై ఓట్ 18+’పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా యువజన శాఖ అధికారి రంజిత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటు హక్కు విలువను గురించి ప్రజలకు తెలియజెప్పారు. ‘మై భారత్– మై ఓట్ 18+ ఆకృతిలో విద్యార్థులు వరుసలు కట్టడం అలరించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజయ్యతో పాటు విద్యార్థులు, యువతీ, యువకులు పాల్గొన్నారు. – కొండాపూర్(సంగారెడ్డి): -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం వద్దని అదనపు కలెక్టర్ పాండు స్పష్టం చేశారు. స్టాటిస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా బృందాలు, జోనల్ అధికారులకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ తరగతులు ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థుల ప్రచార పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, జోనల్ అధికారుల విధులు, బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాస్టర్ ట్రైనర్ కృష్ణ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. సమావేశంలో ట్రైనింగ్స్ నోడల్ అధికారి రామాచారి, ఎంసీసీ నోడల్ అధికారి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ పాండు -
కొత్త మున్సిపాలిటీలకు మహర్దశ
జిన్నారం(పటాన్చెరు): నూతన మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొత్తగా ఏర్పాటైన జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కల్పించేందుకు ఒక్కొ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.45కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు అధికార యంత్రాంగం కార్యచరణ రూపొందించేందుకు సిద్ధమవుతోంది. మురుగు కాల్వలు, ఎల్ఈడీ లైట్లు జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ నిధులతో రోడ్లు, మురుగు కాల్వలు, పార్కుల అభివృద్ధి, కూడళ్ల ఆధునీకరణ, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, తాగునీటి సరఫరా, అంతర్గత పారిశుద్ధ్య నిర్వహణ వంటి అభివృద్ధి పనుల ను చేపట్టనున్నారు. కొత్త పాలకవర్గం కొలువు తీరాక అభివృద్ధి పనులు చేపట్టే అవకాశాలున్నాయి. మూడు మున్సిపాలిటీల్లో కార్యచరణకు అనుగుణంగా అధికారులు సమాయత్తమవుతున్నారు. జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలకు.. ఒక్కో బల్దియాకు రూ.15కోట్ల చొప్పున రూ.45కోట్లు మంజూరు మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులిచ్చిన ప్రభుత్వం -
తొలి రోజు 99 నామినేషన్లు
సంగారెడ్డి జోన్: జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందడి మొదలైంది. మున్సిపల్ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలతో ఫైనల్ నోటిఫికేషన్ను ఆయా మున్సిపల్ కమిషనర్లు బుధవారం విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజే జిల్లా వ్యాప్తంగా 99 నామినేషన్లను దాఖలయ్యాయి. 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. మొదటి రోజు సాదాసీదాగా వచ్చి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. సంగారెడ్డిలో అత్యధికంగా 25 నామినేషన్లు రాగా కోహీర్లో ఒక్కటి కూడా దాఖలు కాలేదు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 10, సదాశివపేట మున్సిపాలిటీలో 14 , అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో 18, జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 3 నామినేషన్లు, గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 3, గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 6 జహీరాబాద్లో 04 నామినేషన్లు దాఖలయ్యాయి. 99 నామినేషన్లలో కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 28, బీజేపీ 18, బీఎస్పీ 1, స్వతంత్రంగా 6 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదలైన మున్సిపల్ ఎన్నికల సందడి సంగారెడ్డిలో అత్యధికంగా 25 నామినేషన్లు దాఖలు రేపటితో నామినేషన్లు ముగింపు -
ఇక్రిశాట్లో గవర్నర్
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్లో బుధవారం జరిగిన నేషనల్ ఐపీ యాత్ర–2026, వికసిత్ భారత్–2047 కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేధో సంపత్తి అవగాహనపై చర్చించారు. కార్యక్రమంలో శాస్త్రవేతలు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సల్లగా చూడమ్మా!పటాన్చెరు: మేడారం వెళ్లలేని భక్తుల కోసం రెండు దశాబ్దాలుగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బంధంకొమ్ములో సమ్మక్క సారలమ్మ జాతరకు బుధవారం భక్తులు తరలివచ్చారు. ఈ జాతరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దంపతులు హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనం పండుగలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.సజావుగా నామినేషన్ల ప్రక్రియసంగారెడ్డి: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. నామినేషన్ల మొదటిరోజైన బుధవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల తీరును తెలుసుకుని తగుసలహాలు, సూచనలను ఎన్నికల అధికారులకు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఎన్నికల అధికారులు ఉన్నారు. ఎన్హెచ్ఆర్ఎస్ జిల్లా చైర్మన్గా దుర్గాప్రసాద్నారాయణఖేడ్: నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ సంగారెడ్డి జిల్లా చైర్మన్గా వడ్ల దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ రహీం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ...సంస్థ బాధ్యులు సమాజసేవకు, మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సంస్థ నాయకులు గౌస్చిస్తీ, మైనోద్దీన్ ఖురేషీ, నర్సింహులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ కొండాపూర్(సంగారెడ్డి): గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ మండల నాయకులు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో సౌమ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...జీవో నెంబర్ 51 సవరించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలన్నింటిని కొనసాగించాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం అందించే సరుకులు, సబ్బులు, బెల్లం, ఏడాదికి రెండు జతల బట్టలు, బూట్లు,నూనె వంటివి అందడం లేదన్నారు. అనారోగ్యానికి గురై చనిపోయిన కార్మికుడికి దహన సంస్కారాల కింద రూ.20 వేలు, పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తే రూ.20 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు విజేందర్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్, కోహీర్, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, అందోల్–జోగిపేట్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు ఎన్నికల సమన్వయకర్తగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో సమన్వయం మెరుగుపరచడం లక్ష్యంగా మాజీమంత్రి హరీశ్రావు ఈ నియామకం చేసినట్లు ఆయన వివరించారు. కోడ్ నిబంధనలు పాటించకుంటే చర్యలేసంగారెడ్డి డీఎస్పీ సంగారెడ్డి క్రైమ్: మున్సిపల్ ఎన్నికల నియమ నిబంధనలను ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు.విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ..మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమాళి అమల్లో ఉండటంతో రాజకీయ సభలు, ర్యాలీలు, సమావేశాలకు ఎలాంటి అనుమతిలేదని పేర్కొన్నారు. అధిక మొత్తంలో డబ్బును తరలిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగతంగా, అత్యవసర సమయాల్లో రూ.50 వేలకు మించి డబ్బును తమ వెంట తీసుకువెళ్లరాదని సూచించారు. ఇతరత్రా ఖరీదైన వస్తువులు టీవీ, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కాని రూ.10 వేలకు మించి తీసుకువెళ్లరాదని, వస్తువుల రశీదు తప్పనిసరిగా చూపించాలని తెలిపారు. వాహనాల తనిఖీల్లో ప్రజలు తప్పనిసరిగా పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. -
కొత్త టెక్నాలజీతో భూముల సర్వే
పటాన్చెరు టౌన్: అధునాతన టెక్నాలజీతో భూములు సర్వే చేపడుతున్నామని అందుకు 5,500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను నియమించామని, భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల కాంప్లెక్స్కు మంత్రి వివేక్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ...స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పారదర్శకంగా, అవినీతిరహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తోందని చెప్పారు. మొదటి విడతగా ఓఆర్ఆర్ పరిధిలోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయించామని తెలిపారు. కర్ధనూర్లో 20వేల చదరపు అడుగుల పరిధిలో నిర్మిస్తోన్న కార్యాలయానికి మూడు ఎకరాల భూమిని కేటాయించినట్లు వివరించారు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 5,500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను నియమించాం మంత్రి వివేక్తో కలసి సబ్ రిజిస్ట్రార్ కాంప్లెక్స్ శంకుస్థాపన -
పకడ్బందీగా కోడ్ అమలు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలతోపాటు నామినేషన్ కేంద్రాలను పోలీసు అధికారులు సందర్శించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎస్హెచ్ఓలకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయా కేంద్రాలను సందర్శించి సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పాటించవలసిన సూచనలివీ.. ● నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ ఎస్ (144 సీఆర్పీసీ) అమలులో ఉంటుంది. కావున ప్రజలు గుంపులుగా ఉండకూడదు. ● కేంద్రానికి అభ్యర్థితోపాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతిస్తారు. ● శాంతి భద్రతలు పాటించాలి. నినాదాలు, ప్రచారం పూర్తిగా నిషేధం. ● పరిసరాల్లో నినాదాలు, లౌడ్ స్పీకర్లు, బ్యాండ్లు వాడకూడదు. అదేవిధంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయకూడదు. ● ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలి. ● నామినేషన్ కేంద్రం పరిసరాల్లో మద్యం తాగడం, పంపిణీ చేయడం నిషేధం. ● ఇతర అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడకూడదు. ● సంబంధిత అధికారుల అనుమతి లేనిదే ర్యాలీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదు. ● నామినేషన్ ప్రక్రియకు అంతరాయం కలిగించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదు.ఎస్పీ పరితోశ్ పంకజ్ -
కుటుంబ పోషణ భారమై వ్యక్తి అదృశ్యం
సంగారెడ్డి క్రైమ్: ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... ఝరాసంఘం మండలంలోని చిలకపల్లి గ్రామానికి చెందిన వడ్ల శంకర్ (36) బతుకుదెరువు నిమిత్తం 8 ఏళ్లుగా పట్టణంలోని ప్రశాంత్నగర్లో భార్య గాయత్రి(32)తో కలిసి వడ్ల పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి పాప ఉంది. దంపతుల మధ్య గొడవలు అధికం అవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఇరువురిని మందలించారు. కుటుంబ పోషణ భారమై అదే ఆవేశంలో మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మతిస్థిమితం లేని మహిళ.. జహీరాబాద్ టౌన్: మహిళ అదృశ్యమైంది. చిరాగ్పల్లి ఎస్ఐ.రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బూచినెల్లి గ్రామానికి చెందిన సత్వార్ ఖదీర్ కూతురు నస్రీన్కు మతిస్థితిమితం లేదు. ఈ నెల 19న ఇంట్లో ఎవరు లేని సమయంలో సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లింది. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేదు. గతంలో రెండు సార్లు ఇలాగే ఇంటి నుంచి వెళ్తే.. క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. -
ఆగిపోయిన ప్రైవేట్ స్కూల్ బస్సు
శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు మార్గమధ్యలో ఆగిపోయింది. దీంతో ఆ బస్సును విద్యార్థులతో నెట్టిస్తున్న క్రమంలో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా.. మండల కేంద్రమైన శివ్వంపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు మంగళవారం గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తుండగా చండీ గ్రామ శివారులో ఆగిపోయింది. దీంతో విద్యార్థులతో బస్సుని ముందుకు నెట్టించినప్పటికీ స్టార్ట్ కాలేదు. కాగా వెనుక వైపునకు రోడ్డు డౌన్ ఉండటంతో బస్సును వెనకకు నెడుతుండగా బ్రేక్ పనిచేయలేదు. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో పొలాల్లో ఉన్న రైతులు వచ్చి బస్సు టైర్ల కింద రాళ్లు పెట్టి ఆపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలానికి వచ్చి ఆందోళన చేశారు. గతంలో ఇదే బస్సు రెండు సార్లు ఆగిపోయిందని, బస్సును మార్చాలని పలుసార్లు పాఠశాల సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు బద్దు, ఆంజనేయులు, పాండు, కుమార్, శ్రీకాంత్, తదితరులు ఆరోపించారు.విద్యార్థులకు తప్పిన ప్రమాదం -
హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
మనోహరాబాద్(తూప్రాన్): హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు జరిమాన విధించినట్లు మంగళవారం మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్గౌడ్ తెలిపారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం... బీహార్కు చెందిన సర్వన్కుమార్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో వీవీఎం ఆగ్రో కంపెనీలో వెల్డర్గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2024లో ఏప్రిల్ 20న తోటి కార్మికుడు ఓం ప్రకాశ్ రాయ్తో సర్వన్కుమార్కు గొడవ జరిగింది. దీంతో ఓం ప్రకాశ్ బండరాయితో సర్వన్ తల పగులగొట్టి హత్యచేసి పరారయ్యాడు. అప్పటి ఎస్ఐ కరుణాకర్రెడ్డి కేసు నమోదు చేశాడు. ఇన్వెస్టిగేషన్ అధికారి కృష్ణ సమగ్ర దర్యాప్తు చేసి , కీలక సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు ఓం ప్రకాశ్రాయ్కు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేలు జరిమాన విధించారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్, లైసనింగ్ అధికారి విఠల్, కానిస్టేబుల్ రవీందర్గౌడ్, సీడీఓ మహిపాల్రెడ్డి కేసులో సహకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసినందుకు ఎస్పీ అభినందించారు. పేకాట స్థావరంపై దాడికల్హేర్(నారాయణఖేడ్): పేకాట స్థావరంపై దాడి చేసి జూదరులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని కృష్ణాపూర్ శివారులో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసుల దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురి జూదరులను అదుపులోకి తీసుకుని రూ. 20,040 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. -
జాతీయ పోటీలకు క్రీడాకారులు
మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్కు ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపికై నట్లు మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరయ్య, జనరల్ సెక్రెటరీ పీవీ రమణ తెలిపారు. ఇటీవల ఆర్మూర్లో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు. మెదక్ జిల్లా బాలికల జట్టు నుంచి నిహారిక, రాధిక, గాయత్రి, బాలుర జట్టు నుంచి భరత్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి, ఫిబ్రవరి ఒకటి వరకు తమిళనాడులో జరిగే బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. -
పట్ట పగలు చోరీ
న్యాల్కల్(జహీరాబాద్): పట్ట పగలు రెండిళ్లలో దొంగలు చొరబడి బంగారం, వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జైపాల్రెడ్డి ఉదయం పొలానికి వెళ్లగా, భార్య లక్ష్మి రేజింతల్ గ్రామ శివారులో గల శ్రీసిద్దివినాయ ఆలయానికి వెళ్లింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని తీసి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 7తులాల వెండితో పాటు రూ.1.50లక్షలు ఎత్తుకెళ్లారు. అరగంట తర్వాత ఇంటికి వచ్చిన జైపాల్రెడ్డి ఇంటి తలుపులతో పాటు బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే గ్రామానికి చెందిన సురప్ప ఇంటి తాళం పగుల గొట్టి దొంగలు రూ.2.05లక్షలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్, రూరల్ సీఐ హన్మంతు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బంది చోరీ జరిగిన ఇళ్లలో వివరాలు సేకరించారు. జాలపల్లి గ్రామంలో.. మద్దూరు(హుస్నాబాద్): తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మెతుకు శ్రీనివాస్రెడ్డి రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లాడు. మంగళవారం తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి రూ.45వేల నగదు, 35 తులాల వెండి, పావు తులం బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.బంగారం, వెండి, రూ.3.55లక్షలు అపహరణ -
నిబంధనలు బేఖాతర్
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలేవీ?సంగారెడ్డి క్రైమ్: జిల్లా హెడ్ క్వార్డర్స్లో నంబర్ ప్లేట్ లేని భారీ వాహనాలు ప్రధాన రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరి వంటి నిబంధనలున్నా పట్టణంలో ఇవేవి పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. హెడ్ క్వార్డర్స్లో రోజు రోజుకు ప్రమాదాలు జరుగుతున్నా.. పోలీస్ సిబ్బంది మాత్రం తమకేమి పట్టనట్టు వ్వవహరిస్తున్నారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు ప్రధాన రోడ్లపై తిరిగే భారీ వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వెల్దుర్తి(తూప్రాన్): విద్యుత్ షాక్తో రైతు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని శెట్టిపల్లికలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పడిగె అంజయ్య(46) గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద బోర్ మోటార్ పనిచేయకపోవడంతో స్టార్టర్ వద్ద చెక్ చేస్తుండగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. మద్దూరు(ముస్నాబాద్): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బెక్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు,గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చొప్పరి కనకయ్య(50) ఈనెల 21న తన పెద్దకూతురు ఇంటి వద్ద పండుగ ఉండటంతో సముద్రాల గ్రామానికి బైక్పై వెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో తోర్నాల గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం సంగారెడ్డి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చౌటకూరు మండలం వెండికోల్ గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద మంగళవారం మృతదేహం లభ్యమైంది. పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం... మృతుడికి 30 సంవత్సరాలు ఉంటాయని, నీలం రంగు ఫుల్ కట్ అండర్వేర్, క్రీమ్ రంగు నిలువు గీతలతో ఉన్న కాలర్ లేని టీ–షర్ట్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు పుల్కల్ పోలీస్ స్టేషన్ నం. 87126 61837, జోగిపేట సీఐపీ – 87126 56723 ను సంప్రదించాలని కోరారు. -
మార్పుతోనే ప్రమాదాల నివారణ
పెద్దశంకరంపేట(మెదక్): ప్రమాదాలను అరికట్టాలంటే ప్రజలలో మార్పు తప్పనిసరి అని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పద్మయ్య ఫంక్షన్ హాల్లో స్వయంసహాయక సంఘాలు, విద్యార్థులకు 37వ జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలనే లక్ష్యంతో అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని, హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దన్నారు. మద్యం తాగి వాహనం నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్ఐలు ప్రవీణ్రెడ్డి, శంకర్, పోచయ్య, ఏపీయం శకుంతల, క్యూబ్ హైవే సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ -
అక్రమంగా మద్యం విక్రయాలు
నంగునూరు(సిద్దిపేట): అక్రమ మద్యం అమ్మకాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వైన్స్ నిర్వాహకులకు వరంగా మారింది. అమ్మకాలను పెంచే లక్ష్యంతో ఊరూరా బెల్ట్షాపులను ప్రోత్సహిస్తూనే కొన్ని సెంటర్లలో మద్యాన్ని నిల్వ చేసి హోల్సేల్, రిటైల్ ధరలకు విక్రయిస్తున్నారు. నేషనల్ హైవేను ఆనుకొని ఓ ఇంట్లో యథేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు బెల్ట్షాపుల నిర్వాహకులను పోలీసులు బైండోవర్ చేయడంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అలాగే గతంలో ఉన్న వైన్స్ దుకాణాల కాల పరిమితి ముగిసి పోగా డిసెంబర్లో కొత్త వారు రావడంతో తిరిగి ఊరూరా బెల్ట్షాపులు వెలిశాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మూడు మద్యం షాపుల యజమానులు ఏకమై బెల్ట్షాపుల ద్వారా అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.చోద్యం చూస్తున్న అధికారులు హైవే పక్కనే హోల్సేల్ దుకాణం వైన్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం 160 మందిని బైండోవర్ చేసినా మళ్లీ అమ్మకాలు! -
ఆశావహుల పైరవీలు
టికెట్ ఎవరికి ఇవ్వాలనే ఒత్తిడిలో నేతలు షెడ్యూల్ రాకతో రాజకీయ వేడి ● ప్రధాన పార్టీల్లో తీవ్ర పోటీమున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ వేడి మొదలైంది. కౌన్సిలర్ టికెట్లను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల్లోని ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలను కలిసి తనకు టికెట్ కేటాయిస్తే గెలుపు పక్కా అంటూ నమ్మకంగా చెబుతున్నారు. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనుండటంతో సమయం లేదని అభ్యర్థులు పార్టీ నేతలను కలిసి వేడుకుంటున్నారు. ఒక్కో వార్డులో 5 నుంచి 8 మంది వరకు టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పలువురు ఆశావహులు గాడ్ ఫాదర్తో ఫోన్లు చేయించి టికెట్ కేటాయించాలని రెకమండ్ చేయిస్తున్నారు. – జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు కాంగ్రెస్ పార్టీ నుంచి 130 మంది టికెట్లకు దరఖాస్తు చేసుకోగా, బీఆర్ఎస్లో 100కు పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆయా పార్టీల తరపున దరఖాస్తులు స్వీకరించారు. 16 వార్డులు ఉండగా అన్ని వార్డుల్లో నలుగురి చొప్పున ప్రధాన పార్టీల అభ్యర్థులు టికెట్లను ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా గెలిచే అవకాశం ఎవరికున్నదనే ప్రాతిపదికన టికెట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల్లోని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనగా, బీజేపీ, ఎంఐఎం పార్టీల టికెట్లకు సైతం పలు వార్డుల్లో తీవ్ర పోటీ ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు సమావేశమై టికెట్లను ఎవరికివ్వాలనే దానిపై అధిష్టానవర్గానికి నివేదించనున్నట్లు సమాచారం. అభ్యర్థుల గుణగణాలు, ప్రజల్లో ఆదరణ, పార్టీకి అందిస్తున్న సేవలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఇన్చార్జీలే కీలకం టికెట్ల కేటాయింపులో ఎన్నికల ఇన్చార్జీలే కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి అజారుద్దీన్ను నియమించడంతో ఆయనే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని టికెట్లను కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ శ్రేణులు మంగళవారం హైదరాబాద్లో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే... బీఆర్ఎస్ జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికల ఇన్చార్జీగా దేవీ ప్రసాద్ను నియమించగా పక్షం రోజులుగా ఆయన జహీరాబాద్లోనే మకాం వేశారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్లతో కలిసి అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరంతా మంగళవారం హైదరాబాద్కు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైనట్లు తెలిసింది. బుధవారం జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంఽధించి ఖరారైన అభ్యర్థుల మొదటి లీస్టు వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. కాగా బీజేపీ ఎన్నికల ఇన్చార్జీగా పైడి ఎల్లారెడ్డిని నియమించడంతో ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికలకు సిద్ధం చేశారు. టికెట్లు కేటాయింపుపై ముఖ్య నేతలతో సమావేశమై ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం -
సమస్యలకు వాట్సప్తో పరిష్కారం
హుస్నాబాద్రూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. మండలంలోని పందిల్ల గ్రామం సర్పంచ్ తోడేటి రమేశ్ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, గ్రామస్తులతో కలిపి ‘పందిల్ల వాట్సప్’ గ్రూపును ఏర్పాటు చేశాడు. మంగళవారం ఒక రైతు ఎస్ఎస్ –1 ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ స్తంభం పడిపోతుండటంతో గ్రామానికి సరఫరా నిలిచిపోతుందని వాట్సప్ గ్రూపులో పోస్టు చేశాడు. దీంతో సాయంత్రం విద్యుత్ అధికారులు వచ్చి పడిపోతున్న విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టారు. పలుమార్లు చెప్పినా స్పందించని అధికారులు వాట్సప్ గ్రూపులో పోస్టు చేయగానే స్తంభం సరిచేయడంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముడావత్ రవినాథ్ తెలిపారు. మంగళవారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్తో కలిసి స్థానిక కళాశాలలో శిక్షణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెనకబడిన అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి శిక్షణను అందిస్తున్నదన్నారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రూప్ –1, 2, 3, 4లతో పాటు ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందుతుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రూ. 3లక్షలలోపు ఆదాయం కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు. ఫిబ్రవరి 8న ప్రతిభా డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి 5 నెలల పాటు ఉచిత రెసిడెన్సియల్తో కూడిన శిక్షణ అందిస్తామని తెలిపారు. వివరాలకు 9182 220112లో సంప్రదించాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నామినేషన్లురామాయంపేట(మెదక్): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి నామినేషన్ల ప్రక్రియ సీసీ కెమెరాల పర్యవేక్షించనున్నట్లు వేక్షణలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. 28 నుంచి 30 వరకు మూడు రోజులు మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్లు వేసే కార్యాలయాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్వోలు, ఏఆర్వోలతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం మేలు కౌడిపల్లి(నర్సాపూర్): ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండుతాయని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని డీఏఓ దేవ్కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి కేవీకేలో ప్రకృతి వ్యవసాయంపై సీఆర్పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్)లకు ఐదురోజుల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేల ఆరోగ్యం బాగుంటేనే పంటలు బాగా పండుతాయన్నారు. నేల బాగు కోసం జీవామృతం, బీజామృతం, జీవన, పశువుల ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టెక్నికల్ ఏడీఏ వినయ్ స్థానిక ఏడీఏ పుణ్యవతి, కేవీకే శాస్త్రవేత్తలు శంభాజీ దత్తాత్రేయ నల్కర్, రవికుమార్, ప్రతాప్రెడ్డి, భార్గవి, శ్రీనివాస్, ఏఓలు స్వప్న, రాజశేఖర్, బాల్రెడ్డి, కవిత, శ్వేత, ప్రవీణ్తోపాటు 30మంది సీఆర్పీలు పాల్గొన్నారు. కేంద్రానివి కార్మిక వ్యతిరేక విధానాలుసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పటాన్చెరు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు ఆరోపించారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకుని మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ...ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను, రద్దుచేసి ప్రస్తుతం 12 గంటలకు పెంచడం అన్యాయమని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికుల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
మోగిన నగారా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లాలోని 11 మున్సిపాలిటీల పరిధిలో 256 కౌన్సిలర్ స్థానాలకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వెంటనే నామినేషన్ల స్వీకకరణ కొనసాగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌన్సిలర్ స్థానాలకు మున్సిపల్ కార్యాలయాల్లోనే నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతి రెండు, మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఆయా వార్డు కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఈ రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు. రిటర్నింగ్ అధికారులుగా హెచ్ఎం స్థాయి అధికారులను నియమించారు. నామినేషన్ల స్వీకరణ గదుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులు పలు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అమలులోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలులోకి రానుంది. దీంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం వీలు పడదు. అలాగే ఎన్నికలు ముగిసే వరకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు వీలుండదు. ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. నేటి నుంచి మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి నియామకం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ: 28.01.2026 (ఉ.10.30 నుంచి సా.5.00 వరకు) నామినేషన్ల దాఖలు చివరి తేది: 30.01.2026 (సా.5 గం.ల వరకు) నామినేషన్ల పరిశీలన: 31.01.2026 నామినేషన్ల తిరస్కరణపై అప్పీలుకు చివరి తేది: 01.02.2026 నామినేషన్ల ఉపసంహరణకు గడువు : 03.02.2026 (మ.3 గం.ల వరకు) బరిలో నిలిచే తుది అభ్యర్థుల ప్రకటన: 03.02.2026 (మ.3 గం.ల తర్వాత) పోలింగ్ తేది : 11.02.2026 (ఉ.7 గం.ల నుంచి సా.5 గం.ల వరకు) ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన: 13.02.2026 (ఉ.8 గం.ల నుంచి) -
పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
అదనపు కలెక్టర్ పాండు సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పాండు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, టీఓటీ అధికారులకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి ఎన్నికలు విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో శిక్షణ తరగతుల నోడల్ అధికారి రామాచారి తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐఎన్హెచ్ఆర్పీసీ) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ ఖైసర్ను నియమించినట్లు సంస్థ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బషీరాబాద్లో సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఖైసర్కు నియామక ఉత్తర్వును అందజేశారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడారు. జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు న్యాయం అందేలా ఖైసర్ కృషి చేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యా హక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ నాయకులు సదాశివపేట మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశ జనాభాలో 0.1% ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్న పాలకులు వారికి మాత్రం రెండేసి పెన్షన్లు తీసుకోవడం మరీ విచిత్రమన్నారు. ఫిబ్రవరి 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు ప్రధాన ఎన్కె షాప్ అలీ, సీనియర్ జిల్లా నాయకులు బి.నరసింహరాజు, సుజావుద్దీన్, జిల్లా ఆర్థిక కార్యదర్శి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు హత్నూర (సంగారెడ్డి)/సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యల తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు హెచ్చరించారు. హత్నూర మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ..విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతోపాటు విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మేడారం జాతర పై మాక్ అసెంబ్లీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పర్యావరణ అవగాహన కల్పించేలా ఈ నెల 29,30 తేదీలలో మాక్ అసెంబ్లీని నిర్వహించాలని వెంకటేశ్వర్లు ఆదేశించారు. మాక్ అసెంబ్లీకి సంబంధించి నివేదికను తయారు చేసి 3 లేదా 4 ఫొటోలను జతచేసి పీడీఎఫ్ రూపంలో 9440069750 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపాలని సూచించారు. -
సర్కారు బడుల్లో తనిఖీలు
జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలంలోని గుడుపల్లి, విట్టునాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా నోడల్ అధికారి ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిమ్మల కిష్టయ్య, వహబొద్దీన్ పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, టాయిలెట్స్ నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల సామర్థ్యం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుతోపాటు పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
మున్సిపోల్కు పార్టీలు సిద్ధం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. టికెట్ల ఖరారుపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న ఆయా పార్టీలు తమ తరఫున బరిలోకి దిగనున్న అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 26 వార్డులకుగాను, ఇప్పటికే 11 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా మంగళవారం మరో ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 30తో ముగియనుంది. దీంతో మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్ స్థానాలకు ఈ పార్టీలు బుధ, గురువారాల్లో విడతల వారీగా ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు సంబంధించి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. నామినేషన్లకు రెడీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇటు అభ్యర్థులు సైతం సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్ వేయాలంటే సంబంధిత మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సర్టిఫికెట్ల కోసం ఆశావహులు ఆయా మున్సిపల్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీ కోసం ఆయా మున్సిపాలిటీల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విడతల వారీగా అభ్యర్థిత్వాల ప్రకటన నేడో, రేపో పూర్తిస్థాయిలో టికెట్ల ఖరారు నామినేషన్లకు సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు -
ఆయకట్టు హుష్ కాకి
కంగ్టి(నారాయణఖేడ్): ఖేడ్ నియోజకవర్గంలో నల్లవాగు ప్రాజెక్టు తర్వాత అత్యంత ఎక్కువ ఆయకట్టున్న ప్రాజెక్టు కంగ్టి మండలం దామర్గిద్దా కాకివాగు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు కుడి కాలువ 15 తూములతో దాదాపు 900 ఎకరాల ఆయకట్టు, ఎడమకాలువ 10 తూములతో దాదాపు 230 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా, తూములు ధ్వంసం కావడం, కాల్వలు పూడుకుపోవడంతో 150 ఎకరాలకు కూడా సాగునీరందడం లేదని రైతులు తెలిపారు. సాగు నీటి అక్రమ తరలింపు చెరువు నీటిని లిఫ్ట్ పంపులసాయంతో ఎగువన ఉన్న రాసోల్, గాజుల్పాడ్, సుక్కల్తీర్థ్ గ్రామాలకు చెందిన రైతులు అక్రమంగా తరలిస్తున్నారు. వేసవి పంట సీజన్లో చెరువులో దాదాపు 80కి పైగా మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నారు. దీంతో దిగువ ఆయకట్టు రైతుల చేలకు సాగు నీరు అందడం లేదు. ఏటా పంటలు చేతికొచ్చే దశలో నీరు లేక ఎండిపోతున్నాయి. తైబంది చేసి.. నిబంధనలు గాలికి చెరువు కింది ఆయకట్టు రైతులు వేసవిలో ఏయే పంటలు నిర్దేశిత ఎకరాల్లో వేసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖల అధికారులు తైబంది చేస్తున్నారు. అయితే చెరువులోని లిఫ్ట్ పంపుల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువు ఎగువనున్న గ్రామాల వారు చెరు వు నీటి ఆధారంగా పంటలు వేయకుండా ఇప్పుడే ఆయా గ్రామాల రైతులకు అవగాహన కల్పించడం, మోటార్లతో నీటిని తరలించే వారిపై చర్యలుంటాయని అధికారులు హెచ్చరించడం వంటివి చేస్తేనే ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజావాణిలో ఫిర్యాదు ఎగువన మోటార్లతో నీటిని తోడకుండా చర్యలు తీసుకోవాలని, కాల్వలు, తూముల మరమ్మతులు చేపట్టాలని బాన్సువాడ, దామర్గిద్దా గ్రామాల ఆయకట్టు రైతులు ప్రజావాణిలో నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు అధికారులు చర్యలకు ఉపక్రమించలేదు. సంబంధిత శాఖలోని డివిజన్, మండలస్థాయి అధికారులకు ఈ విషయం తెలియదని సమాచారం. 150 ఎకరాలకు కూడాసాగునీరు అందని వైనం కాల్వల మరమ్మతులకు ఏటా ప్రతిపాదనలతోనే సరి కాకివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తప్పని దుస్థితి -
అభివృద్ధి పనులను అడ్డుకోవద్దు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని జరుగుతున్న రాయసముద్రం చెరువు అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని భెల్ అధికారులకు హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ స్పష్టం చేశారు. రాయసముద్రం చెరువును రంగనాథ్ మంగళవారం సందర్శించారు. చెరువు అభివృద్ధి పనులను భెల్ యాజమాన్యం అడ్డుకుంటుందని గత కొద్దిరోజుల క్రితం స్థానిక కార్పొరేటర్తో పాటు పలువురు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చెరువు పనులను పరిశీలించేందుకు భెల్ అధికారులతో ఆయన కలసి వచ్చారు. అక్కడ చెరువు పరిసరాలను, మురుగునీటిని మళ్లించే ప్రాంతాన్ని పరిశీలించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బి.పుష్ప, వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ కేంద్రాల్లో కెమెరాలు
కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ పరితోశ్ పంకజ్, మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ...అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. నోటిఫికేషన్ వెలువడినందున వెంటనే ఎంసీసీని అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా సీజ్ర్లు, రోజువారీ నివేదికలు తదితర అంశాల్లో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ రఘునందన్రావు, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఎం రామకృష్ణను అభినందించిన కలెక్టర్ సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం రామకృష్ణ రాష్ట్రస్థాయిలో సాధించిన విజయం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఆయనను కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని విద్యారంగంలో రామకృష్ణ సేవలు అభినందనీయమన్నారు. కాగా, రామకృష్ణ చేసిన విశిష్ట సేవలకుగాను ఇటీవలే రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న సంగతి కూడా తెలిసిందే. 54 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు అదనపు కలెక్టర్ మాధురి సంగారెడ్డి ఎడ్యుకేషన్: వచ్చేనెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 54 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ మాధురి పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై కలెక్టరేట్లో మంగళవారం పోలీస్, ఇంటర్, పోస్ట ల్, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొని మాట్లాడారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఉదయం 9.00 నుంచి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ రచ్చ..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పఠాన్చెరు మండలం కర్దనూరులో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనర్సింహ శంకుస్థాపనలు చేయనున్న రిజిస్ట్రేషన్శాఖ కార్యాలయ భవనం విషయం వివాదానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో సంగారెడ్డి సబ్రిజిష్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను కర్దనూరుకు తరలిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని (జాయింట్–1,2,3) తరలిస్తే తమకేమీ అభ్యంతరం లేదని జగ్గారెడ్డి తెలిపారు. మరోవైపు సంగారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సైతం ఈ కార్యాలయం తరలింపు విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రులు పొంగులేటికి చింత ప్రభాకర్ లేఖ రాశారు. ఆగమేఘాలపై ఆహ్వాన పత్రికలో మార్పులు భూమి పూజ కార్యక్రమం కోసం అధికారులు విడుదల చేసిన ఆహ్వాన పత్రికలో ‘‘ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ కాంప్లెక్స్’’అని పేర్కొనడంతో సంగారెడ్డి ఎస్ఆర్ఓ కార్యాలయంతోపాటు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా కర్దనూరుకే తరలిస్తారనే అర్థం వచ్చింది. దీంతో జగ్గారెడ్డితోపాటు, ఎమ్మెల్యే చింతప్రభాకర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయగా తమ తప్పును తెలుసుకున్న అధికారులు వెంటనే ఆగమేఘాలపై ఆహ్వాన పత్రికలో మార్పు లు చేశారు. ‘‘సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లెక్స్’’ పేరుతో మరో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లయింది. వివాదానికి దారితీసిన రిజిస్ట్రార్ శాఖ భవనం భూమిపూజ ఆహ్వాన పత్రిక ఆ రెండు కార్యాలయాలు ఇక్కడే చిన్న సమాచార లోపం వల్లే ఇది జరిగింది. సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంగారెడ్డి నుంచి తరలించే ప్రతిపాదనేమీ లేదు. ఈ రెండు కార్యాలయాలు సంగారెడ్డిలోనే కొనసాగుతాయి. పటాన్చెరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం (జాయింట్–1, –2, –3)లు మాత్రమే అక్కడికి వెళతాయి. –వల్లి సుబ్బలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్ -
మేడారానికి ప్రత్యేక బస్సులు
● ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ● హుస్నాబాద్ డిపో నుంచి 50 బస్సులు ● ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర హుస్నాబాద్: గిరిజన సంప్రదాయాలకు వేదికగా సమ్మక్క, సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని 51 బస్సు స్టేషన్ల ద్వారా ఆర్టీసీ సంస్థ 4 వేల బస్సులను ఏర్పాటు చేసినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ బస్టాండ్లో మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవార్లకు పూజలు చేసి క్యూలెన్లను ప్రారంభించారు. అంతకు ముందు ఆర్టీసీ డిపోలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సైదాపూర్, చిగురుమామిడి మండలాల దివ్యాంగులకు ఉపకరణాలు, ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ఎల్లమ్మ దేవాలయంలో మాఘ నవరాత్రుల సందర్భంగా పొన్నం ప్రభాకర్ దంపతులు చండీహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ డిపో నుంచి మేడారం జాతరకు 50 బస్సులు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాకుండా అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళతాయని తెలిపారు. ప్రభుత్వం తరపున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బాండ్ ఇస్తుందని దానిని వాడుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఫీల్డ్లో ఉండి పర్యవేక్షిస్తారన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర కోసం వచ్చే భక్తులకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేయడం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం, నూతనంగా రెండు కొత్త డిపోలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 341 బస్ స్టేషన్లు, 97 డిపోలు, 10 వేల బస్సులు, రోజుకు 65 లక్షల మంది, 35 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ సంస్థ బస్సులను నడుపుతుందని తెలిపారు. వీటిని మరింత పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్ఎం రాజు, డిపో మేనేజర్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. మంత్రి ఎత్తు బంగారం ఇచ్చిన అభిమానిహుస్నాబాద్రూరల్: మండలంలోని పోతారం(ఎస్) గ్రామం ఒకటో వార్డు సభ్యురాలు యాదమ్మ సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎత్తు బంగారం ఇచ్చి సమ్మక్క సారక్కకు మొక్కు చెల్లించుకుంది. కాగా సార్వత్రిక ఎన్నికల్లో పొన్నం గెలిస్తే అమ్మవారికి ఆయన ఎత్తు బంగారం ఇస్తామని మొక్కిన యాదమ్మ ఆ మేరకు మొక్కు చెల్లించింది. -
మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ర్యాలీ సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు అనే నినాదంతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైశ్య భవన్ నుంచి మొదలైన ర్యాలీ పట్టణ వీధుల గుండా సాగింది. అనంతరం కొండ మల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు శాకాహారం గొప్పదనం గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ ప్రతినిధులు జక్క రాఘవులు, హైదరాబాద్ ప్రతినిధి మాధవి దర్తిక, సిద్దిపేట పిరమిడ్ మెడిటేషన్ ట్రైనర్ డాక్టర్ పాండు రంగం తదితరులు పాల్గొన్నారు. -
డ్రైనేజీ పనులపై డీసీహెచ్ఎస్ అసంతృప్తి
జోగిపేట(అందోల్): మున్సిపాలిటీలోని ఏరియా ఆస్పత్రి మురికినీరు బయటకు వెళ్లేందుకు వీలుగా అవుట్ఫుట్ను ఏర్పాటు చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంపై డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎండీ షరీఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆస్పత్రిలోని డ్రైనేజీ లీకేజీలను స్వయంగా పరిశీలించారు. నాలుగు చోట్ల లీకేజీలు ఉన్నాయని, దీనివల్ల దుర్వాసన వస్తుందని సూపరింటెండెంట్ అన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ వదిలేశాడని డీసీహెచ్ఎస్ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్పై చర్యలకు కలెక్టర్కు లేఖ రాయాలని సూపరింటెండెంట్కు సూచించారు. వారం రోజుల్లో ఆరు మంది నూతన వైద్యులు నియామకం అవుతారని తెలిపారు. ఇటీవల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 12 మంది వైద్యులకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేయగా అందరు కమిషనర్కు సమాధానం ఇచ్చారని డీసీహెచ్ఎస్ తెలిపారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు -
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పారిశ్రామికవేత్త
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ కేంద్రానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి మౌనిక ఉదయ్ కుమార్ సోమవారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరై తిలకించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఐక్యత సమగ్రతను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. త్రివిధ దళాల పరేడ్ను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపింది. -
విద్య, పరిశోధన రంగాల్లో ప్రగతి
ములుగు కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ ములుగు(గజ్వేల్): విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన ప్రగతిని సాధించిందని ములుగు కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయంలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం ద్వారా ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు పొందడం గర్వకారణమన్నారు. తెలంగాణలో ఉద్యాన సాగుకు ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ సమక్షంలో అధికారికంగా ప్రారంభించారని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయి బోధనా పోస్టులకు సంబంధించి మొత్తం 140 ప్రత్యక్ష నియామకాల కోసం ప్రభుత్వ అనుమతులు లభించాయన్నారు. పూర్తిగా ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, బోధన, బోధనేతర, కాట్రాక్ట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల మహిళా ఉత్పత్తుల జాతర రెండో రోజు సోమవారం కూడా కొనసాగింది. వివిధ గ్రామాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తాము పొందిన రుణాలతో తయారు చేసిన ఉత్పత్తులను స్టాళ్లలో ఏర్పాటు చేశారు. పిండి వంటలు, దుస్తులు, నిత్యావసరాలను ప్రదర్శించారు. పట్టణంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల వారు ఉత్పత్తులను తిలకించి కొనుగోలు చేశారు. ఐకేపీ ఏపీఎంలు సాయిలు, వంశీకృష్ణ, అనంతయ్య, నర్సింహులు, శ్రీనివాస్, సరిత, డీఎంటీ నర్సప్ప, సీసీలు వెంకట్, సంతోష్ కుమార్, సురేశ్, సుందర్లాల్, తుకారాం, శివానంద్, సంగన్న, మెప్మా అధికారి అనిత పాల్గొని పర్యవేక్షించారు. మహిళా సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను ఇతర రోజుల్లో విక్రయించుకునేందుకు ముందుకు వస్తే రైతు బజార్లో అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. -
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిమద్దూరు(హుస్నాబాద్): పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం దూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాఠశాలకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంపీ నిధుల నుంచి రూ.1.20లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు పది పరీక్షల్లో ప్రతిభ కనబర్చి పాఠశాలకు జిల్లా స్థాయిలో పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, సర్పంచ్లు శ్రీలీలారెడ్డి, కమలాకర్ యాదవ్, ప్రధానోపాధ్యాయులు కరుణాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షుడు అనిల్ పాల్గొన్నారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి మృతి
● అనాథలైన చిన్నారులు ● ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలుఅక్కన్నపేట(హుస్నాబాద్): మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా... సోమవారం గుండెపోటుతో తల్లి మృతి చెందింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ సంఘటన మండలంలోని కేశవాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జెట్టి లావణ్య గుండెపోటుతో మృతి చెందారు. మూడేళ్ల క్రితం జెట్టి భాస్కర్ ట్రాక్టర్తో పొలం దున్నుతున్న క్రమంలో అది తలకిందులై మృతి చెందాడు. ఈ దంపతులకు జెట్టి సాహిత్య(08), శ్రీనిధి(10) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ చిన్నారులిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మమత, వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.


