breaking news
Sangareddy District News
-
వేధింపులతో నవవధువు ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నశంకరంపేట(మెదక్): కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... బుడగజంగాల కాలనీకి చెందిన తల్లితండ్రులు లేని ఊబిది అలియాస్ రాధిక(19)ని నెల రోజుల క్రితం ఇదే కాలనీకి చెందిన వానరాసి కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచే భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో కుల పెద్దలను ఆశ్రయించడంతో భార్యాభర్తలకు నచ్చజెప్పారు. అయినా భర్త తీరు మార్చుకోకపోవడంతో పాటు భౌతికదాడికి దిగడంతో రెండు రోజుల క్రితం అత్తింటి నుంచి తల్లిగారి ఇంటికి వచ్చింది. రెండు రోజులుగా మానసిక ఆందోళనకు గురైన యువతి జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధుృవీకరించారు. అదే ఇంట్లో.. నలుగురు.. కాగా.. క్షణికావేశం, జీవితంపై అవగాహన లేకపోవడంతో ఐదేళ్లలో బుడగజంగాల కాలనీలోని ఆ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఊబిది యాదగిరి, యాదమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు అయ్యాయి. ఆరేళ్ల క్రితం తండ్రి యాదగిరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇది జరిగిన ఏడాదికి మరో కూతురు పూజ(15), గత ఏడాది అక్టోబర్లో తల్లి యాదమ్మ(40), ఆరు నెలల క్రితం పెద్ద కుమారుడు శ్రీనివాస్, తాజాగా చిన్న కూతురు రాధిక కూడా ఇదే ఇంట్లో ఉరివేసుకున్నారు. అప్పుల బాధతో రైతు.. శివ్వంపేట(నర్సాపూర్): అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని పోతులబోగూడ గ్రామానికి చెందిన నర్సింలు గౌడ్ (45) వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ ఫామ్తో జీవనోపాధి పొందుతున్నాడు. సంవత్సరం క్రితం నూతనంగా ఇంటి నిర్మాణంతో పాటు కోళ్ల ఫామ్ షెడ్ వేశాడు. వీటికి రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులిచ్చిన ప్రైవేటు బ్యాంకు, ఇతరుల నుంచి ఒత్తిడి పెరగడంతో తీర్చలేక మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న నర్సింలుగౌడ్ని చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుండి సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనారోగ్యంతో ఆటో డ్రైవర్.. జగదేవ్పూర్(గజ్వేల్): అనారోగ్యంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణారెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్(36) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో పాటు ఫిట్స్తో బాధపడుతున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంట్లో గొడవపడి వెళ్లిన మహిళ..
సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది.ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... ములుగు జిల్లా మంగంపేట గ్రామానికి చెందిన నీలం వీరమ్మ (55) తన కుటుంబంతో సంగారెడ్డి పట్టణానికి వచ్చి మంజీరనగర్ కాలనీలో స్థిరపడ్డారు. వృత్తిరీత్య పట్టణంలో పద్మశాలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరమ్మ గత నెల 30న మధ్యాహ్నం ఇంట్లో కోడలుతో గొడవ పడి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. పటాన్చెరులో వ్యక్తి.. పటాన్చెరు టౌన్: పనిపై బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని కుమ్మరి బస్తీకి చెందిన శాబుద్దీన్ బేకరీలో వర్కర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 29న పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. స్థానికంగా వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. -
సకల హంగులతో సిద్ధం
మెడికల్ కాలేజీ, హాస్టల్ సముదాయాలుజిల్లాలో పూర్తయిన వైద్య కళాశాల భవనాలు ● అందుబాటులోకి ఖరీదైన వైద్య సేవలు ● రేపు ప్రారంభించనున్న మంత్రి దామోదర ● హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు సంగారెడ్డి: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. జిల్లా మెడికల్ కళాశాల భవనాలు పూర్తయ్యాయి. ఈ భవన సముదాయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించనున్నారు. గతంలో సరైన భవనాలు లేకపోవడంతో ఇబ్బందుల మధ్యే బోధన, వైద్య సదుపాయాలు కొనసాగాయి. 500 పడకల జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, క్రిటికల్ కేర్ యూనిట్, కేన్సర్ రోగుల ప్రత్యేక వార్డును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఆస్పత్రికి శంకుస్థాపన సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి భవనాలు ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో శిథిలమయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇక్కడ 300 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రి, 150 పడకలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటి స్థానంలో 500 పడకలతో భవనాలు నిర్మించనున్నారు. వైద్య కళాశాలకు మంజూరైన నిధుల నుంచి రూ. 273.40 కోట్లను ఆస్పత్రి నిర్మాణానికి వెచ్చించనున్నారు. రేపు ఆస్పత్రి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 50 పడకలతో క్రిటికల్ కేర్ 50 పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని రూ.23.70 కోట్లతో నిర్మించారు. అందులో ఖరీదైన వైద్య పరికరాలను సిద్ధం చేశారు. ఇక నుంచి కార్పొరేట్కు దీటుగా వైద్యం అందిస్తామని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళికృష్ణ పేర్కొన్నారు.కళాశాలకు రూ.510 కోట్లు.. జిల్లా ఆస్పత్రి ఆవరణలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు 2022లో రూ.510 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవలే రెండంతస్తుల భవనం పనులు పూర్తయ్యాయి. కాలేజీలో ప్రస్తుతం మూడో బ్యాచ్ కొనసాగుతోంది. విద్యార్థులు, వైద్యులు, సిబ్బంది కోసం వేర్వేరుగా వసతి గృహ భవనాలు కూడా నిర్మించారు. ఇక విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి. కేన్సర్ రోగుల కోసం కేన్సర్ రోగులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందనున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 13 చోట్ల ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా పేరిట వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేన్సర్ అనుమానితులను హైదరాబాద్లోని ఎంఎన్ ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇక నుంచి ఇక్కడే వైద్యం అందించేలా 20 పడకలతో వార్డును ఏర్పాటు చేశారు.భవనాల వివరాలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో భాగంగా రెండో విడతలో ఆర్అండ్బీ శాఖ రూ.156 కోట్ల నిధులతో మెయిన్ బ్లాక్(జీ+2), బాలుర హాస్టల్ (జీ+7), బాలికల హాస్టల్(జీ+8), బాలుర రెసిడెంట్ హాస్టల్(జీ+2), ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ క్వార్టర్స్ జీ+3, నూతన మార్చురీ భవనాలు నిర్మించారు. వీటన్నింటిని గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారు.మంత్రి కృషితో అందుబాటులోకి వైద్యశాఖ మంత్రి దామోదర కృషితోనే మెడికల్ కాలేజీ భవనాలు పూర్తయ్యాయి. ఇక నుంచి రోగులకు మెరుగైన సేవలు, విద్యార్థులకు నాణ్యమైన బోధన వసతి అందనుంది. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తాం. – జయప్రకాశ్ రావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ -
అభివృద్ధి పనులపై అధ్యయనం
పర్యటించిన యూపీ సర్పంచ్ల బృందంమనోహరాబాద్(తూప్రాన్): గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సర్పంచ్ల పాలన విధానం, చేపడుతున్న పనులపై అధ్యయనానికి ఉత్తరప్రదేశ్ నూతన సర్పంచ్ల బృందం మంగళవారం మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎల్పీఓ యాదయ్య వారికి పలు అంశాలపై వివరించారు. ముప్పిరెడ్డిపల్లిలో రికార్డులు, ఇండ్ల అనుమతులు, పనుల తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద మొక్కలు నాటారు. అక్కడి నుంచి దండుపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతివనం, డంప్యార్డ్, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణలో ‘సీసీ’లు
దౌల్తాబాద్(దుబ్బాక): నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల జియోట్యాగింగ్ ద్వారా సిద్దిపేట కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయబడతాయని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, వివేకానంద యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, దౌల్తాబాద్, తొగుట ఎస్ఐలు అరుణ్కుమార్, రవికాంత్రావు, మాజీ జెడ్పీటీసీ భూపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు భద్రయ్య, రాములు, అశోక్, లాల్ రమేశ్, నర్సింహారెడ్డి, ఎల్లయ్య పాల్గొన్నారు.సిద్దిపేట సీపీ అనురాధ -
అంత్యక్రియలకు వెళ్లి.. కుంటలో గల్లంతై..
జగదేవ్పూర్(గజ్వేల్): అంత్యక్రియలకు వెళ్లిన యువకుడు కుంటలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన చిక్కుడు రాజు(26) ఆ అంత్యక్రియలకు వెళ్లాడు. అవి పూర్తి కాగానే బస్వారెడ్డి కుంటలోకి స్నానం చేసేందుకు దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. వెంటనే పక్కన ఉన్నవారు రాజు కోసం కుంటలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది కుంటలో ఈత వచ్చిన వారితో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి పడటంతో బుధవారం గజ ఈతగాళ్ల సహాయంతో వెతకనున్నట్లు పోలీసులు తెలిపారు. -
డెంగీ.. డేంజర్
జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాల్లో విష జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర, జిల్లా వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ పారిశుధ్య నిర్మూలన పూర్తిస్థాయిలో నిర్మూలించలేకపోతున్నారు. గ్రామంలో మురికి కాల్వలు శుభ్రం చేసినప్పటికి ఇళ్ల మధ్య, పక్కన ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చి గడ్డి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. గడ్డి మందు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల్లో డెంగీ లక్షణాలతో ముగ్గురు మృతి చెందగా, 350 మంది వరకు జ్వరాల బారిన పడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా గత నెల 24న కలెక్టర్ హైమావతి గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యంపై పలు సూచనలు చేశారు. అలాగే అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డీపీఓ దేవికీదేవి, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, రాష్ట్ర మలేరియా అదనపు డైరెక్టర్ అమర్సింగ్నాయక్ గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కానీ పారిశుద్ధ్య నిర్మూలనకు నిధులు మాత్రం కేటాయించలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం తిమ్మాపూర్లో మాజీ సర్పంచ్ నవ్యసుమన్, అనంతసాగర్లో గ్రామస్తులు కలిసి బ్లీచింగ్ పౌడర్ను కొనుగోలు చేసి ఉరంతా పిచికారీ చేశారు. ప్రతి రోజు మండల శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మరో ముగ్గురికి డెంగీ.. తిమ్మాపూర్, అనంతసాగర్లో ఈ నెల 17 నుంచి వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజు వైద్యులు జ్వర బాధితులకు రక్త నమునాలు సేకరిస్తూ.. డెంగీ లక్షణాలు ఉన్న వారిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం తిమ్మాపూర్లో 75 మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి డెంగీ లక్షణాలు కనిపించాయని డాక్టర్ కిరణ్ తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతసాగర్లో 43 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రస్తుతం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు గ్రామాలకు చెందిన 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ముగ్గురికి లక్షణాలు తిమ్మాపూర్, అనంతసాగర్లో తగ్గని జ్వరాలు కొనసాగుతున్న వైద్య శిబిరాలు పారిశుధ్య నిర్మూలన అంతంతే -
లోకకల్యాణం కోసం సైకిల్ యాత్ర
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రానికి చెందిన రాంచందర్ లోక కల్యాణం కోసం కశ్మీర్ వరకు సైకిల్ యాత్రను ప్రారంభించాడు. మండల కేంద్రం నుండి ఆయన పలు రాష్ట్రాల మీదుగా వెండి త్రిశూలం సైకిల్పై ఏర్పాటు చేసుకొని కశ్మీర్ వరకు సైకిల్యాత్ర చేపట్టనున్నాడు. మంగళవారం స్థానిక రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సైకిల్యాత్రను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ సత్యం, శిశుమందిర్ హెచ్ఎం వీరప్ప, రమేశ్, సీతారం, మల్లేశం తదితరులున్నారు. విధులకు ఆటంకం కేసు నమోదు దుబ్బాకటౌన్: ఇంటి కొలతలు తీసుకునేందుకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్, సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కల్గించిన ఆర్ఎంపీపై కేసు నమోదైంది. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కమిషనర్ రమేశ్ కుమార్ వివరాల మేరకు... పట్టణంలోని 14వ వార్డులో ఆర్ఎంపీ మర్గల రత్నాకర్కు చెందిన ఇంటికి కొలతలు తీసుకునేందుకు గతంలో మున్సిపల్ సిబ్బంది రెండు సార్లు వెళ్లారు. రత్నాకర్ వారిని దూషిస్తూ, ఇంటి కొలతలు తీసుకోకుండా అడ్డుపడ్డాడు. దీంతో మూడు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి కొలతలు తీసుకునేందుకు వెళ్లగా, మరోసారి అను చిత వ్యాఖ్యలు చేస్తూ, దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రత్నాకర్పై కేసు నమోదు చేశారు. గంజాయి మొక్కలు స్వాధీనం వట్పల్లి(అందోల్): గంజాయి మొక్కలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోగిపేట సీఐ అనిల్కుమార్, ఎస్ఐ లవకుమార్ వివరాల ప్రకారం... మండంలోని బిజిలీపూర్ గ్రామానికి చెందిన గడ్డమీది రాములు తన భూమిలో పత్తిలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఆరు గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గంజాయి సాగుచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి క్లూస్టీం ఇన్చార్జి చిట్టిబాబు, తహసీల్దార్ చంద్రశేఖర్, వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. రెగ్యులర్ డాక్టర్ను నియమించాలి: సీఐటీయూ పటాన్చెరు: ఇస్నాపూర్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం వల్ల కార్మికులకు వైద్యం అందడం లేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో డిస్పెన్సరీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ.. రెగ్యులర్ డాక్టర్ను నియమించడంతోపాటు, మందుల కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ డిస్పెన్సరీకి పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి చాలామంది కార్మికులు వస్తారన్నారు. అయితే, రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్న రెగ్యులర్ డాక్టర్ లాంగ్ లీవ్లో ఉన్నాడని, ప్రస్తుతం పటాన్న్ చెరు నుంచి డిప్యుటేషన్పై వస్తున్న వైద్యుడు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. నిరసనలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మానిక్, పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. -
మహబూబ్సాగర్ సుందరీకరణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా రూ.500 కోట్ల అంచనా వ్యయంతో మహబూబ్సాగర్ సుందరీకరణ పనులు చేపడుతామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రజలతో పాటు, హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు, ఆర్డినెన్స్ఫ్యాక్టరీ ఉద్యోగులకు ఆహ్లాదాన్ని పంచేలా దీన్ని ఓ టూరిజం స్పాట్గా, రిక్రియేషన్ సెంటర్గా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో కలిసి మహబూబ్సాగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సాగర్ మధ్యలో ఉన్న సోమేశ్వరాలయం అభివృద్ధితోపాటు, మహాశివుడి విగ్రహం ఏర్పాటు చేసి కేబుల్ బ్రిడ్జితో అనుసంధానించేంలా డిజైన్లు రూపొందించారని చెప్పారు. ఐఐటీహెచ్ను అనుసంధానించేలా మహబూబ్సాగర్ నుంచి వంద ఫీట్ల వెడల్పుతో రహదారిని నిర్మిస్తామన్నారు. పట్టణంలోని మురుగునీరు మహబూబ్సాగర్లోకి చేరకుండా 23.5 కే.ఎల్. సామర్థ్యంతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సైకిల్ ట్రాక్, వాచ్టవర్, బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా నిర్మాణం వంటివి సుందరీకరణ పనుల్లో ఉంటాయని ఆయన వివరించారు. ఈ సందర్బంగా హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు సుందరీకరణ పనుల్లోని వివిధ కాంపోనెంట్ల అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
జహీరాబాద్లో ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్రావు, పార్టీ కార్యకర్తలుసంగారెడ్డిలో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్యకర్తలుసంగారెడ్డి /జహీరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కె.మాణిక్రావు విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి, జహీరాబాద్ పట్టణాల్లో ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వేర్వేరుగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను బద్నామ్ చేసేందుకు తప్పుడు నివేదికలతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఇది కేసీఆర్పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గురుదక్షిణ చెల్లించుకోవడానికి కాళేశ్వ రం ప్రాజెక్టును మూత పడాలని, గోదావరి జలా లు బనకచర్లకు వెళ్లేందుకు రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. సీబీఐకీ కాళేశ్వరం కేసు అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసివేయడమేనని చెప్పారు. నిన్నటి దాక సీబీఐపై వ్యతిరేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక్క రోజులోనే ఎందుకు మాట మార్చారో చెప్పా లని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారి దృష్టి మరల్చేందుకు కాళేశ్వరం నాటకం ఆడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. .సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్లు విజేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి ,నాయకులు వెంకటేశ్వర్లు ,నర్సింలు, అలాగే.. జహీరాబాద్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ, నర్సింహు లు, సంజీవరెడ్డి, వెంకటేశం, రవీందర్, నాయ కులు బండి మోహన్, మొహియొద్దీన్, బొగ్గుల సంగమేశ్వర్, నర్సింహాగౌడ్ పాల్గొన్నారు.బీఆర్ఎస్ను బద్నామ్ చేసేందుకు యత్నం -
గతుకుల రోడ్లు.. అగచాట్లు
కోహీర్–తాండూరు ప్రధాన రహదారి అధ్వానంక్రీడాజ్యోతిని వెలిగిస్తున్న నాయకులు జహీరాబాద్: మండల కేంద్రమైన కోహీర్ పట్టణం మీదుగా 65వ జాతీయ రహదారి నుంచి తాండూరు వెళ్లే రహదారిపై పెద్ద గోతులు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి బిలాల్పూర్ గ్రామమైన రాష్ట్ర సరిహద్దు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. రాత్రి పూట అయితే ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. కోహీర్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పడిన పెద్ద గోతిని పూడ్చే విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు నుంచి మనియార్పల్లి, బిలాల్ పూర్, కోహీర్ గ్రామాల మీదుగా 65వ జాతీయ రహదారి వరకు ఆర్అండ్బీ రహదారిపై గోతులు ఏర్పడినా వాటిని తాత్కాలిక మరమ్మతులు చేయడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరు వెళ్లే ఆర్అండ్బీ రహదారి కావడంతో ట్రాఫిక్ అధికంగా ఉంటోంది. ఈ రహదారి మీదుగా భారీ వాహనాలు రాక పోకలు సాగిస్తుంటాయి. పెద్ద గోతులు ఏర్పడటంతో అధిక లోడ్తో వెళ్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్ధ కాలం క్రితం రహదారికి ప్యాచ్ వర్క్ పనులు చేసి సరిపెట్టారు. క్రమంగా రహదారి దెబ్బతినడంతో ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.కోహీర్–తాండూర్ ఆర్అండ్బీ రహదారిపై కోహీర్ అంబేద్కర్చౌక్ వద్ద ఏర్పడిన పెద్ద గోతి దెబ్బతిన్న రోడ్డుపై ఏర్పడిన పెద్ద గోతులు వాహనాదారులకు తప్పని పాట్లు తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదించాం రహదారి దెబ్బతిన్నందున తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రతిపాదించాం. రూ.15 లక్షలతో వరద నష్టం కింద నిధుల మంజూరీ కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే తాత్కాలికంగా అభివృద్ధి పనులను చేపడుతాం. పెద్ద గోతులు ఏర్పడిన ప్రాంతంలో కంకరను పోయించి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడతాం. – శ్రీనివాస్, ఆర్అండ్బీ డీఈఈ -
యూరియా కోసం ఇక్కట్లు హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలు 9లో u
కవిత సస్పెన్షన్ సబబే..● కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ● ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సబబేనని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా ప్రకటలు విడుదల చేశారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజల మేలు చేకూరే విధంగా ఉంటుందని చెప్పారు. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై వారు స్పందించారు. ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుందని పేర్కొన్నారు. పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూస్తే తన, పర భేదాలు లేకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని అన్నారు. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యేలు చింతా, మాణిక్రావు అన్నారు. -
7,44,157
పంచాయతీ ఓటర్లు ● తుది ఓటరు జాబితా విడుదల ● తగ్గిన పంచాయతీలు, వార్డులు, ఓటర్లు ● పంచాయతీ కార్యాలయాల్లోజాబితా ప్రదర్శన మున్సిపాలిటీలలో విలీనంతో తగ్గింపు జిల్లాలో పలు గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయటంతో పాటు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబరులో విడుదల చేసిన జాబితా కంటే ప్రస్తుతం విడుదల చేసిన జాబితా ప్రకారం 40 వేల వరకు ఓటర్లు తగ్గారు. గ్రామ పంచాయతీలు 20, వార్డులు 188 తగ్గాయి.సంగారెడ్డి జోన్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు కొత్త ఓటరు జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల జాబితా సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు ఉండగా 5370 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అత్యధికంగా మహిళలు ఉన్నారు. గత నెల 26న పంచాయతీలలో వార్డుల వారీగా కొత్త ఓటరు జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్లను గుర్తించి జాబితా తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జాబితాలను సిద్ధం చేసి, ప్రచురించింది. 2010 అభ్యంతరాలు స్వీకరణ, పరిష్కారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత నెల 28న ముసాయిదా ఓటరు జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల వివరాలు పంచాయతీల వారీగా ప్రకటించారు. 29, 30 తేదీలలో జిల్లా స్థాయితోపాటు మండల స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో ముసాయిదా జాబితాలపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా 28 నుంచి 30 వరకు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లాలో 2010 అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల జాబితాలను సిద్ధం చేశారు. మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య ఆమోదంతో తుది జాబితాలను విడుదల చేశారు. గ్రామ పంచాయతీలలో పూర్తి వివరాలను ప్రచురించారు.జిల్లాలోని ఓటర్ల వివరాలు నియోజకవర్గం మహిళలు పురుషులు ఇతరులు పోలింగ్ స్టేషన్లు అందోల్ 84548 81382 3 1252 నారాయణఖేడ్ 94347 95108 7 1628 నర్సాపూర్ 22051 20841 2 334 పటాన్చెరు 11227 10805 2 102 సంగారెడ్డి 68346 65367 28 810 జహీరాబాద్ 95324 94767 2 1244 -
సింగూరుకు 62,336 క్యూసెక్కుల ఇన్ఫ్లో
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి మంగళవారం వరద జలాలను విడుదల చేశారు. ఎగువ భాగం నుంచి 62,336 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. ఆరు గేట్లు ఎత్తి 63,906 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.అర్హులందరికి రేషన్ కార్డులుఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం కల్హేర్లో లబ్ధిదారులకు కొత్తగా రేషన్కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివ శ్రీనివాస్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ భాస్కర్సేట్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోచయ్య, నాయకులు తుకరాం, దేవదాస్, వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం: సౌజన్య పటాన్చెరు టౌన్: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం బీరంగూడ లోని శక్తి సదన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్య, వృత్తి నైపుణ్యాలు, అభివృద్ధి ద్వారా సమాజంలో తమ స్థానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, రక్షణ పథకాలు సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, శక్తి సదన్ హోమ్స్ ఇన్చార్జి సుజాత తదితరులు పాల్గొన్నారు. కార్మికశాఖ సహాయ అధికారి సస్పెన్షన్నారాయణఖేడ్: అవినీతి, ఆరోపణలపై నారాయణఖేడ్ సహాయ కార్మికశాఖ అధికారి గిరిరాజ్, ఆయనకు సహకరించిన జూనియర్ అసిస్టెంట్ సాయిలు, అటెండర్ నర్సింహులును సస్పెండ్ చేశారు. పలువురు కార్మికుల ఫిర్యాదులపై ఉమ్మడి జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రావు జూలై నెలలో విచారణ జరిపారు. నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా కార్మికశాఖ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వికారాబాద్ జిల్లా నుంచి యాదయ్యను ఇన్చార్జి సహాయ కార్మిక శాఖ అధికారిగా నియమించారని తెలిపారు. క్రీడలతో మానసికోల్లాసం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మాణయ్య జోగిపేట(అందోల్): క్రీడలతో క్రమశిక్షణ, మానసికోల్లాసానికి దోహదపడతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య, మండల విద్యాధికారి బి.కృష్ణ అన్నారు. మంగళవారం జోగిపేటలోని ఎన్టీఆర్ మైదానంలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిలుగా విచ్చేసి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు క్రీడాపోటీలు అవసరమన్నారు. భవిష్యత్లు ఎస్జీఎఫ్ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయని చెప్పారు. క్రీడాకారులు క్రీడాస్పూర్తితోనే క్రీడలు ఆడాలని, గెలుపోఓటములు సహజమేనని వివరించారు. పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్షుడు నరోత్తంకుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మంజ్యానాయక్, జి.అనిల్కుమార్, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్, రాష్ట్ర అసోసియేట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సోయాబీన్ ఎదుగుదల ఇలా..
జహీరాబాద్: సోయాబీన్ పంట ఎదుగుదలకు గాను డీడీఎస్–కేవీకే ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. సోమవారం మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల కేవీకేలో జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం, కంగ్టి మండలాల్లోని హుగ్గెల్లి, తూంకుంట, బూర్దిపాడ్, సత్వార్, కొత్తూర్(బి), రేజింతల్, మెటల్కుంట, కుప్పానగర్, గౌసాబాద్ తండా, దెగుల్వాడి గ్రామాలకు చెందిన రైతులకు సామూహిక ప్రదర్శన క్షేత్రాలలో భాగంగా సోయాబీన్ పంట ఎదుగుదల, పురుగుల నివారణకు సంబంధించిన 250 ఎకరాలకు కావాల్సిన జిగురు అట్టలు, పంచగవ్య 1,250 లీటర్లు, దశపర్ణి కషాయం 1,500 లీటర్లు, వేపనూనె 150 లీటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సస్యరక్షణ శాస్త్రవేత్త స్నేహలత మాట్లాడుతూ.. తెగుళ్లు, పురుగుల నివారణకు పసుపుపచ్చ, నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 12 వరకు అక్కడక్కడ అమర్చడం ద్వారా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులను నివారించుకోవచ్చని వివరించారు. మట్టి విభాగం నిపుణుడు ఇ.స్వామి మాట్లాడుతూ సోయాబీన్ పంటలో ఎరువుల యాజమాన్యంలో భాగంగా 19:19:19 వేసుకోవాలని, పంచగవ్య 16 రకాల పోషకాలు కలిగి ఉంటుందని, మొక్క ఎదుగుదలకు, రోగ నిరోధక శక్తి పెంచుతుందన్నారు. కార్యక్రమంలో పది గ్రామాల రైతులు, వ్యవసాయ యూనివర్శిటీ విద్యార్థులు పాల్గొన్నారు. -
శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి జోన్: పోటీ పరీక్షల కొరకు నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 తో పాటు ఆర్.ఆర్.బి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల కొరకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్యం గల శిక్షకులతో నాణ్యమైన శిక్షణ అందించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సర్వే ఏడీ ఐనేష్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రజావాణికి 44 అర్జీలు కాగా, కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 44 అర్జీలు సమర్పించారు. అధికంగా రెవెన్యూ సమస్యలే వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఆర్ఓ పద్మజరాణి, తదితరులు పాల్గొన్నారు. -
పొలాల్లో నీరు నిల్వ ఉండొద్దు
● వ్యవసాయ శాస్త్రవేత్త విజయ్కుమార్ ● నీట మునిగిన పంటల పరిశీలనన్యాల్కల్(జహీరాబాద్): ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దీంతో కొంత మేరకు పంట నష్టాన్ని నివారించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని మొల్కన్ పాడ్ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పంట పడిపోకుండా ఉండేందుకు మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలని సూచించారు. పొలంలోంచి నీరు వెళ్లేందుకు 40 సెంటీ మీటర్ల లోతు, 60 సెంటీ మీటర్ల వెడల్పు ఉండేలా కాల్వలు తీయాలన్నారు. తెగుళ్ల నివారణకు మోనోక్రోటోపాస్, లేదా క్లోరి ఫైరిపాస్ మందును తగిన మోతాదులో పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. కాగా, మండల పరిధిలోని చాల్కి, చీకూర్తి, హుస్సేన్ నగర్ తదితర గ్రామాల శివారులో నీట మునిగిన పంటలను ఏఈఓలు పరిశీలించారు. ఎగువ ప్రాంతమైన కర్నాటక నుంచి మంజీరలో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో సుమారు 300 ఎకరాల్లో పత్తి, పెసర, మినుము తదితర పంటలు నీట ముగినట్లు వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ తెలిపారు. -
టీచర్ల పదోన్నతుల్లో అవకతవకలు!
దివ్యాంగ సంఘాల ఫిర్యాదు● అర్హులకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన ● ఫిర్యాదు అందిన వారి పదోన్నతినితాత్కాలికంగా నిలిపివేత ● సరిఫికెట్ వెరిఫికేషన్ కోసంసరోజినిదేవి ఆసుపత్రికి లేఖఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కోటాలో ఇచ్చిన పదోన్నతులపై ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వైకల్యం లేకపోయినా.. దివ్యాంగ ధ్రువీకరణ పత్రాన్ని పొంది పదోన్నతులు దక్కించుకున్నారని జిల్లా విద్యాశాఖకు దివ్యాంగుల సంఘాలు ఫిర్యాదులు చేశాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 221 మంది ఉపాధ్యాయులకు వారం రోజుల క్రితం పదోన్నతులు వచ్చాయి. ఇందులో 190 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్గా, 31 మంది స్కూల్ అసిస్టెంట్లకు పీజీ హెచ్ఎంగా పదోన్నతులు లభించాయి. సీనియార్టీ రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఈ పదోన్నతులు లభించాయి. అయితే దివ్యాంగుల కోటాలో అంధత్వ ధ్రువీకరణ పత్రంతో పదోన్నతి పొందిన ఓ ఉపాధ్యాయుడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని, రంగారెడ్డి జిల్లా నుంచి తాను విధులు నిర్వర్తించే పాఠశాలకు నిత్యం తన కారులో వంద కిలోమీటర్ల దూరం నుంచి కారు నడుపుకుంటూ వచ్చి వెళ్లే వ్యక్తికి అంధత్వం ఎలా ఉంటుందని దివ్యాంగుల సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆధారాల కోసం ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్ గేట్లలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తే బండారం బయట పడుతుందని పేర్కొన్నారు. హోల్డ్లో పెట్టారు.. దొడ్డిదారిన అంధత్వ ధ్రువీకరణ పత్రం పొందారనే వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు.. తాత్కాలికంగా నిలిపి వేశారు. ఈ అంధత్వ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనా అనే దానిపై స్పష్టత కోసం హైదరాబాద్లో ఉన్న సరోజినిదేవి కంటి ఆసుపత్రికి క్లారిఫికేషన్ కోసం రాశారు. రాజకీయ పలుకుబడి, విద్యా, వైద్యశాఖలో తనకున్న బంధుమిత్రుల సంబంధాలతో అంధత్వ సర్టిఫికెట్ పొందారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వారి వల్ల అర్హులైన అంధులకు అన్యాయం జరుగుతుందని దివ్యాంగుల సంఘాలు ఫిర్యాదు చేశాయి. విమర్శలకు దారితీస్తున్న అధికారుల తీరు దొడ్డిదారిన పదోన్నతులపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో జిల్లా విద్యాశాఖ అనుసరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంధత్వ ధ్రువీకరణ పత్రం సరైనదేనా? కాదా? స్పష్టత ఇవ్వాలని సరోజినిదేవి కంటి ఆసుపత్రికి పంపాల్సిన లేఖను ఏకంగా ఫిర్యాదు అందిన వ్యక్తి చేతికే ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగిపై ఫిర్యాదు అందితే.. దానిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలంటే రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ, ఆయా శాఖ మెయిల్ ద్వా రా గానీ జరపాలి. కానీ ఫిర్యాదులు వచ్చిన వ్యక్తి చేతికే క్లారిఫికేషన్ లేఖలు ఇవ్వడం గమనార్హం. వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ పదోన్నతులపై వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సిబ్బంది నిరాకరించడం గమనార్హం. పదో న్నతుల విషయంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి..? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు వంటి వివరాల కోసం డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్ సిబ్బందిని ‘సాక్షి’ సంప్రదించగా., వివరాలు ఇవ్వకుండా దాటవేయడం గమనార్హం. క్లారిటీ వచ్చాకే ఆర్డర్ ఇచ్చాం దివ్యాంగుల కోటా పదోన్నతికి సంబంధించి ఫిర్యాదు అందింది. దీంతో ఈ పదోన్నతిని హోల్డ్లో పెట్టాం. వెరిఫికేషన్ కోసం హైదరాబాద్లో ఉన్న సరోజినిదేవి కంటి ఆసుపత్రికి రాశాం. అక్కడి నుంచి క్లారిటీ వచ్చాకే ప్రమోషన్ ఆర్డర్ ఇచ్చాం. : వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి -
వైరల్ పరీక్ష
జోగిపేట ఆస్పత్రికి తరలివచ్చినరోగులు జోగిపేట ఏరియా ఆస్పత్రిలో వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారంతా రక్త నమూనా, యూరిన్ టెస్టుల కోసం ఎగబడ్డారు. సోమవారం సుమారుగా వెయ్యికి పైగా ఓపీ పేషెంట్లు నమోదయ్యారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది జ్వరాల బారిన పడ్డారు. పరీక్షించిన వైద్యులు.. అందరికి టెస్టులకు రాయడంతో ల్యాబ్ వద్ద వందల సంఖ్యలో గుమి గూడారు. వాగ్వాదం.. తోపులాటతో గందరగోళం ఏర్పడింది. ఒకేసారి ఐదుగురు రోగులకు చొప్పున పిలిచి పరీక్షలు నిర్వహించారు. – జోగిపేట(అందోలు) జోగిపేట ఆసుపత్రిలో ల్యాబ్ వద్ద కిక్కిరిసిన రోగులు -
సీపీఎస్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సీపీఎస్ అంతం అయ్యేదాకా ఉపాధ్యాయుల పోరాటం ఆగదని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉపాధ్యామ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదురుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని (సీపీఎస్) ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సీపీఎస్ పథకం ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట పెనుశాపంగా మారిందని మండిపడ్డారు. ఈ సీపీఎస్ పథకంలో ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రతి నెల పదిశాతం వేతనం నుంచి మినహాయిస్తారని, దానికి తోడు ప్రభుత్వం కూడా పది శాతం ఉద్యోగుల ఖాతాలలో జమ చేస్తుందన్నారు. ఇలా జమ అయినా మొత్తాలను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుందన్నారు. దీంతో షేర్ మార్కెట్ విలువల మీద ఉద్యోగుల పెన్షన్ ఆధారపడి ఉంటుందని వాపోయారు. సీపీఎస్ ఉద్యోగులు రిటైర్ అయితే రెండు, మూడు వేల పెన్షన్ మాత్రవే వస్తుందని చెప్పారు. ఉద్యోగం విరమణ తర్వాత సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా తయారవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తక్షణమే సీపీఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు వై.అశోక్ కుమార్, సయ్యద్ అలీ, సోమశేఖర్, రామచందర్, ప్రసాద్, దుర్గయ్య చంద్రశేఖర్, అబ్దుల్లా, అజ్మతుల్లా, గోపాల్, పుండరికం, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కలుపు కష్టాలు!
పొలాల్లో పెరిగిపోతున్న కలుపుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీలకు డిమాండ్ పెరగడంతో సకాలంలో కలుపుతీయని కారణంగా వర్షాలకు చేలన్నీ బీళ్లుగా మారుతున్నాయి. కలుపు తీసేందుకు కూలీలు దొరక్క పైగా రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు పెరిగి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. – జహీరాబాద్ టౌన్ జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ మండలాల్లో రైతులు ఖరీప్ సీజన్లో పత్తి, సోయాబిన్, పెసర, కంది, మినుము తదితర పంటలను సాగు చేశారు. సుమారు 80 వేల ఎకరాల్లో పత్తి, 55 వేల ఎకరాల్లో సోయాబిన్, 6,724 ఎకరాలో మినుము, 7,589 ఎకరాల్లో పెసర పంట సాగవుతుంది. పంటలు ఆశాజనకంగా ఉండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలతో పాటు కలుపు మొక్కలు పెరిగాయి. పత్తి. సోయాబిన్, మినుము, మొక్కజొన్న, పెసర, కంది చేలల్లో విపరీతంగా కలుపు పెరడంతో నివారణకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి చేన్లలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో నీటి తడి ఆరకుండా మొక్కల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు వెసులుబాటు లేక కలుపు తీసేందుకు కూలీలు దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరత వల్ల కొంత మంది కలుపు నివారణ మందులపై ఆధారపడుతున్నారు. కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో దినసరి కూలీ రూ. 500 ఉండగా రూ.600 చెల్లించాల్సి వస్తుంది. ఎకరం పొలంలో కలుపు తీసేందుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు అవుతుంది. సకాలంలో సస్యరక్షణ చేపట్టాలి మొక్కల మధ్యన కలుపును పూర్తిగా నివారిస్తేనే దిగుబడులు పెంచుకునేందుకు ఆస్కారం ఉంది. దీంతో పొలాల్లో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి కాయ అభివృద్ధి దశలో ఉంది. పొలాల్లో చేరిన మురుగునీరును తొలగించాలి. తొందరగా అంతర కృషి చేసుకోవాలి. మొక్కజొన్న కంకి దశలో ఉంది. ఎక్కువ నీటికి పంట తట్టుకోలేదు. అందుకని వెంటనే పొలం నుంచి నీటిని తొలగించాలి. క్షేత్రస్థాయిలో తిరుగుతున్న వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్కూలీలకు డిమాండ్ -
ఆర్టీసీ డ్రైవర్.. నో ఫోన్
ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఆర్టీసీ సంస్థ డ్రైవర్లకు సెల్ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ చర్యలు చేపట్టింది. విధినిర్వహణలో ఉన్న డ్రైవర్ తన వద్ద సెల్ఫోన్ కలిగి ఉండకుండా చూస్తుంది. ప్రయోగాత్మకంగా మొదట 11 డిపోల్లో అమలు చేస్తుంది. విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. – నారాయణఖేడ్: మెదక్ రీజియన్లో సంగారెడ్డి డిపోలో పైలెట్ ప్రాజెక్టుగా సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ డిపోలో విధులు నిర్వహిస్తున్న 161మంది డ్రైవర్లు డ్యూటీ సమయంలో సెల్ఫోన్ను డిపోలో డిపాజిట్ చేసి వెళ్తున్నారు. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడటం వల్ల జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ నిబంధన అమలు చేస్తుంది. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో అమలు చేయనుంది. ఈ డిపోల పరిధిలో 569 సర్వీసులకు గాను 577మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లకు పరీక్షలు ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు చర్యలు చేపట్టింది. ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు రెగ్యులర్గా డ్రైవింగ్ పరీక్షలు చేసి, తగు శిక్షణ ఇస్తున్నారు. రెండు నెలలకోసారి సంగారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు హకీంపేట్లో ఆరు నెలలకోసారి డ్రైవింగ్ పరీక్ష కూడా పెడుతున్నారు. ప్రతి డిపోలో డ్యూటీకి వెళ్లే సమయంలో డ్రైవర్కు బ్రీతింగ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. 45 ఏళ్లు నిండిన డ్రైవర్లకు ఏడాదికి ఒకసారి, 45 ఏళ్లలోపు వారికి మూడేళ్లకు ఒకసారి జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటేనే వారిని విధులకు పంపిస్తారు. తెల్లవారు జామున విధులకు వెళ్లే డ్రైవర్లు రాత్రి వచ్చి పడుకునేందుకు, డబుల్ డ్యూటీకి వెళ్లే వారు విశ్రాంతి తీసుకొనేందుకు ప్రతి డిపోలో రెస్టు రూంలు ఏర్పాటు చేశారు. ఏవైనా పండుగల సందర్భంలో స్పెషల్ బస్సులు నడిపే క్రమంలో ఆహారం అందజేస్తున్నారు. భద్రతకు ప్రాధాన్యం.. విధుల్లో ఉన్న సమయంలో కొందరు డ్రైవర్లు సెల్ఫోన్లు వాడుతున్నట్లు ఆర్టీసీ విజిలెన్స్ విభాగం తనిఖీల్లో వెల్లడైంది. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని భావిస్తూ యాజమాన్యం సెల్ఫోన్ వినియోగం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం డ్రైవర్లు విధులకు హాజరైన వెంటనే సెల్ఫోన్లను డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాకర్లో భద్రపర్చాలి. విధులు పూర్తయిన తర్వాత తమ ఫోన్లను తిరిగి తీసుకోవాలి. ఒకవేళ డ్రైవర్కు ఏదైనా అత్యవసర సమాచారం అందించాల్సి వస్తే అధికారులు లేదా వారి కుటుంబ సభ్యులు సంబంధిత బస్సు కండక్టర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కండక్టర్ ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్కు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. అమలు ప్రారంభం సంగారెడ్డి డిపోలో డ్రైవర్లకు సెల్ఫోన్ వాడకంపై నిషేధాన్ని ప్రారంభించాం. డ్రైవర్లే సంతోషంగా సెల్ఫోన్ను ఇచ్చి విధులకు వెళుతున్నారు. ఇది మంచి నిర్ణయంగా స్వాగతిస్తున్నారు. ప్రయాణికులు, ప్రజల భద్రత, కార్మికుల సంక్షేమం కోసం సంస్థ పాటుపడుతుంది. – విజయభాస్కర్, ఆర్ఎం, సంగారెడ్డిబస్సు నడిపే వేళ నిషేధం విధిస్తూ సంస్థ నిర్ణయం ప్రయోగాత్మకంగా మెదక్ రీజియన్ సంగారెడ్డిలో ప్రారంభం ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా చర్యలు -
మందేసి.. చిందేసిన అధికారులు
హత్నూర(సంగారెడ్డి): అధికారులు మందు తాగి చిందులేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బోరుపట్ల గ్రామ శివారులోని మంజీరా ఫిల్టర్ బెడ్లో నీటి సరఫరా గ్రిడ్ కాంట్రాక్టర్, అధికారులు సోమవారం రాత్రి మందేసి చిందులేశారు. రెండు, మూడు రోజుల నుంచి తాగునీరు రాక హత్నూర, నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఫిల్టర్ బెడ్లో మందు తాగుతూ చిందులేసారని బోరుపట్ల గ్రామస్తులు తెలిపారు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని బార్గా మార్చుకొని మద్యం తాగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్లో సాయంత్రం ఆరు తర్వాత స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నారని, ఎవరిని ఇబ్బంది పెట్టలేమని గ్రిడ్ కాంట్రాక్టు మేనేజర్ జగపతిబాబు స్థానికుల సమక్షంలోనే తెలుపడం గమనార్హం. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లోనే మందు తాగుతూ చిందులేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కోమా నుంచి కోలుకునే దాకా..
సిద్దిపేటకమాన్: పాము కాటుకు గురై కోమాలోకి వెళ్లిన బాలికకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించి వైద్యులు ప్రాణాలు కాపాడారు. నెల రోజుల పాటు చికిత్స అందించి కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేశారు. ఈ ఘటన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత వివరాలు వెల్లడించారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన గంగరవేని శ్రీనివాస్, అంజలి దంపతుల రెండో కూతురు శ్రీజ (10) ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతుంది. జులై 31న అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఆమె కుడి చేతిపై కట్లపాము కాటు వేసింది. వెంటనే పాపను బైక్పై సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన చిన్న పిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ సురేశ్బాబు, అనస్థీషియా వైద్యుడు చందర్.. పాప శరీరంలో విష ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల ద్వారా గుర్తించారు. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడం, నరాల బలహీనత, గుండె, మెదడుపై విష ప్రభావం వల్ల మాట్లాడలేకపోయినట్లు గమనించారు. పాపకు సీపీఆర్ సైతం చేశారు. 10రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి ప్రతిరోజు ప్రత్యేక వైద్య సేవలందించినట్లు తెలిపారు. పాప కాస్త కోలుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి 30రోజుల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో పాప తల్లిదండ్రులు వైద్యాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు. సీఎస్ఆర్ఏంఓ డాక్టర్ జ్యోతి, శ్రావణి, వైద్యులు చందర్, సురేశ్బాబు, అనుపమ, రాగిని, రమ్య, రవి, స్నిగ్ధ, గ్రీష్మ, సాత్విక తదితరులు పాల్గొన్నారు. బాలిక ప్రాణాలు కాపాడిన వైద్యులు పాము కాటుకు గురై.. నెల రోజుల పాటు వైద్యం.. డిశ్చార్జి -
పంచాయతీ కార్యదర్శిపై విచారణ
నంగునూరు(సిద్దిపేట): పంచాయతీ కార్యదర్శిపై విచారణ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఘటన సోమవారం పాలమాకులలో కలకలం రేపింది. వివరాలు ఇలా.. గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిత విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గ్రామస్తులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం నారాయణరావ్పేట ఎంపీఓ శ్రీనివాసరావు పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ప్రొసిడింగ్ ఇవ్వలేదని నూనె కుమారస్వామి అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. అలాగే కార్యదర్శి గ్రామసభ నిర్వహించడం లేదని, అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన యాదండ్ల నారాయణ గత ప్రభుత్వంలో తనకు ఇల్లు మంజూరై నిర్మించుకున్నానని, ఇప్పటి వరకు బిల్లు రాలేదని అధికారులను నిలదీశాడు. ఒక్కసారిగా పెట్రోల్ బాటిల్ తీసి ఒంటిపై పోసుకుంటున్న క్రమంలో గ్రామస్తులపై పడటంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులు అతన్ని బయటకు పంపించడంతో పెను ప్రమాదం తప్పింది.ఇంటి బిల్లు రాలేదని పెట్రోల్ పోసుకున్న గ్రామస్తుడు -
ఏ ఎన్నిక ముందు.!
హత్నూర( సంగారెడ్డి): ఏ ఎన్నిక ముందు.. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొస్తాయి? ప్రభుత్వం రోజుకో లీకుతో గ్రామస్థాయిలో నాయకులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో 613 గ్రామపంచాయతీలకు 5370 వార్డులు, 271 ఎంపీటీసీ స్థానాలు, 25 ఎంపీపీలు , జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఓటరు జాబితాను సైతం గ్రామాల్లో ఏర్పాటు చేసింది. అలాగే ఎంపీటీసీ ఎన్నికలకు ఓటర్ లిస్టును అధికారులు సిద్ధం చేశారు. కానీ ఏ ఎన్నికలు ముందు వస్తాయో ప్రభుత్వం తేల్చకపోవడంతో మండల, గ్రామస్థాయి నాయకులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ముందు ఏ ఎన్నిక వచ్చినా పోటీ చేయాలన్న ఆలోచనలో నాయకులు ఉన్నారు. మరికొందరు ఎంపీటీసీ వస్తే పోటీ చేద్దామని ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదు, ఎప్పుడు ఏ ఎన్నిక పెడతారో తెలియక నాయకులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ముందుగా ఏ ఎన్నిక నిర్వహిస్తుందో ఎదురు చూడాల్సిందే. గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేయాలనే ఆశతో ఉన్న కొంతమంది నాయకులు నియోజకవర్గస్థాయి నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే తనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలంటూ గ్రామ, మండల స్థాయి నాయకులు ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు కానీ గ్రామాల్లో మాత్రం ఇప్పుడే రాజకీయ సందడి మొదలైంది. గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై జోరుగా చర్చ అయోమయంలో నాయకులు -
మురుగుకాల్వలకు నిధులు
జగదేవ్పూర్(గజ్వేల్): తిమ్మాపూర్ గ్రామంలో మురికి కాల్వలకు నిధులు కేటాయిస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. సోమవారం గ్రామస్తులు కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామంలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామంలో మురికి కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయించామని తెలిపారు. వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంబంధిత అధికారులకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. గ్రామంలో విష జ్వరాలపై శాంపిల్స్ను సేకరించామని, అలాగే ఇటీవల జ్వరంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి కూడా శాంపిల్స్ సేకరించామన్నారు. శాంపిల్స్ను పుణేకు పంపించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు.వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలికొంపాక(గజ్వేల్): సీజన్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. కొండపాక పీహెచ్సీని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ రిజిష్టర్, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆమె వెంట వైద్యాధికారి శ్రీధర్, ఆయుష్ డాక్టర్ రజనీ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ -
ఖాళీ బిందెలతో నిరసన
కౌడిపల్లి(నర్సాపూర్): తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని ధర్మాసాగర్ గేట్ తండావాసులు సోమవారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండాలో నాలుగు నెలలుగా తాగునీటి సమస్య ఉందని, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కొంతకాలంగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు తండాలో సింగిల్ ఫేజ్ బోరుబావులు లేకపోవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నీటి కోసం వ్యవసాయ బోర్ల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో తాగునీటి సమస్య అధికమైందని, అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్రెడ్డి, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని తండావాసులకు నచ్చజెప్పారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో తండావాసులు ధర్నా విరమించారు.తాగునీటి కోసం రాస్తారోకో -
యూరియా కోసం రైతుల ధర్నా
తెల్లవారక ముందే యూరియా కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిలుచున్నా యూరియా దొరకట్లేదని వాపోతున్నారు. మూడు, నాలుగు రోజులుగా ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన రైతులు సోమవారం మండల కేంద్రంలో యూరియా కోసం ధర్నా చేశారు. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ఎస్ఐ మానస, ఏవో నరేశ్ ధర్నా వద్దకు చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియా తెప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. – దుబ్బాకటౌన్: -
శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం
మధుప్రియ డెయిరీ ఫామ్ నెయ్యి శాంపిల్ను ల్యాబ్కు పంపించాం. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలుంటాయి. ప్రస్తుతానికి అనుమతులు లేకుండా నెయ్యి తయారు చేస్తుండటంపై యజమాని బొమ్మ రాఘవేందర్తో పాటు అందులో పని చేసే కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆహార పదార్థాల తయారీపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. ఏ పదార్థమైనా కల్తీవి తయారు చేస్తే ఈ నంబర్ 99856 00602కు సమాచారం అందించండి. – రాజేశ్వర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, సంగారెడ్డి జిల్లా కల్తీ పదార్థాలు తింటే అనారోగ్యమే.. కల్తీ పాలు, నెయ్యి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, జీర్ణ సమస్యలు, దీర్ఘకాలంలో కాలేయం, మూత్రపిండాలు, గుండైపె ప్రభావం చూపే అవకాశం ఉంది. దీర్ఘకాలం కల్తీ ఆహారం తీసుకుంటే కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు రక్తహీనత, ఎముకల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. – డాక్టర్ రజిని, పీహెచ్సీ వైద్యురాలు -
మౌలిక వసతులేవీ?
తూప్రాన్ మున్సిపల్గా మారినా.. అవే సమస్యలు ● పట్టించుకోని అధికారులు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలుమున్సిపల్ ఆదాయం.. మున్సిపాలిటీకి ప్రతి ఏటా సుమారు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఇంటి పన్నులు, లైసెన్స్ల రూపంలో రూ.1.75 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో రూ.50 లక్షల వరకు వస్తాయి.తూప్రాన్: శరవేగంగా విస్తరిస్తున్న పట్టణంలో నిర్మాణాలు జోరందుకున్నా మౌలిక వసతుల కల్పన కలగానే మిగిలింది. తూప్రాన్ మేజర్ పంచాయతీ నుంచి మున్సిపల్గా మారి ఏళ్లు గడుస్తున్నా సౌకర్యాలు మాత్రం అధికారులు కల్పించడం లేదని పట్టణ వాసులు వాపోతున్నారు. మున్సిపల్గా మారితే పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ, సీసీరోడ్లు, అంతర్గత డ్రైనేజీలు లేకపోవడంతోపాటు అస్తవ్యస్త పారిశుద్ధ్యం, పారుతున్న మురుగునీరు తదితర కాలనీల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలు మార్లు పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలో జనాభా– 22,148 మంది ఉండగా, ఇందులో మహిళలు– 11,154, పరుషులు–10,994 మంది ఉన్నారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణంలో జనాభాకు తగ్గట్లు అధికారులు వసతులు కల్పించడం లేదు. మున్సిపాలిటీలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ, అసంపూర్ణ పారిశుద్ధ్యం, సీసీరోడ్లు తదితర మౌలిక వసతులు లేని కారణంగా నిత్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో అక్కడక్కడ మురుగునీరు నిలిచి దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిపాలన పరంగా అధికారులు, సిబ్బందిని నియమించకపోవడం గమనార్హం. మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని సాయినగర్, విద్యానగర్, నాగార్జున కాలనీ, ఎస్సీ కాలనీ, కిందిబస్తీ, బీడీ కార్మికుల కాలనీ తదితర కాలనీల్లోని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు సమస్యలపై దృష్టి సారించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తాం నిధుల కొరత కారణంగా పట్టణంలో మౌలిక వసతులు కల్పన విషయంలో జాప్యం నెలకొంది. త్వరలోనే మున్సిపల్కు టీయుఎఫ్ఐడీసీ ద్వారా రూ.15 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. ఈ నిధులతో పట్టణంలోని 16 వార్డుల్లో నెలకొన్న సమస్యలను షరిష్కరిస్తాం. ప్రస్తుతం పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం.. కార్మికుల వేతనాలు, తదితర పనులకే సరిపోతుంది. –పాతూరి గణేశ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తూప్రాన్ -
పచ్చకామెర్లతో యువకుడు మృతి
జగదేవ్పూర్(గజ్వేల్): పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ యువకుడు మృతి చెందదాడు. ఈ ఘటన మండలంలోని బస్వాపూర్గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికు ల కథనం ప్రకారం.. .గ్రామానికి చెందిన రెడ్డమైన మహిపాల్(28) వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వారం రోజుల క్రితం జ్వరం రావడంతో గ్రామంలోనే ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. అయినా తగ్గకపోవడంతో గజ్వేల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. అందరితో కలిసిమెలిసి ఉండే మహిపాల్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కల్తీ సవాల్..!
కేసులు పెట్టినా మారని తీరు ● ఏడాది క్రితం 2వేల లీటర్ల పాలు కల్తీ ● తాజాగా 200 కేజీల నెయ్యి.. ● అనుమతులు లేకుండా తయారీ, సరఫరాఅభం, శుభం తెలియని చిన్నారులతోపాటు ప్రజలు సైతం నిత్యం తాగే పాలు కల్తీ అవుతున్నాయి. పాలు, నెయ్యి తదితర పదార్థాలు కల్తీ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ కేసులు పెడుతున్నా తీరు మారడం లేదు. తిరిగి మళ్లీ కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటే గాని ఇలాంటివి పునరావృతం కావని ప్రజలు వాపోతున్నారు. – హత్నూర( సంగారెడ్డి) మండలంలోని గోవిందరాజు పల్లి గ్రామ శివారులోని మధుప్రియ డెయిరీ ఫామ్లో ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ దాడుల్లో 200 లీటర్ల కల్తీ నెయ్యి దొరికింది. దీంతోపాటు కాన్ ప్లోర్, టెస్టింగ్ సాల్ట్ ప్యాకెట్స్, మిల్క్ పౌడర్, మంచి నూనె ప్యాకెట్స్, కాటన్ ఇతర కెమికల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని బొమ్మ రాఘవేంద్రపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేస్తూ హైదరాబాద్ ,సంగారెడ్డి, పటాన్ చెరు ,నర్సాపూర్, జోగిపేట ఇతర పట్టణాల్లోని హోల్సేల్ దుకాణాలకు సరఫరా చేస్తూ లక్షలు గడిస్తున్నాడు. -
గల్లంతైన మహిళ కోసం గాలింపు
కొల్చారం(నర్సాపూర్): ఈనెల 17న మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి చెందిన ప్రమీల కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి మంజీరా నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం ఎస్డీఆర్ఎఫ్, జిల్లా ఫైర్ అధికారి వేణు ఆధ్వర్యంలో నదీ తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. బైనాక్యులర్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారి వేణు మాట్లాడుతూ.. నది ఉధృతి ఎక్కువగా ఉండటం, నదిలో బోటు దించేందుకు అనుకూలంగా లేదన్నారు. డోన్ర్ కెమెరా ద్వారా నదీ పరిసర ప్రాంతాల వెంట పరిశీలిస్తామని తెలిపారు. ప్రమీల ఆచూకీ ఎప్పుడు లభిస్తుందా? అని ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తుక్కాపూర్ బ్రిడ్జి వద్ద ఎదురు చూస్తున్నారు. -
చుంచనకోటలో అడవి జంతువు సంచారం
లేగ దూడ మృతిచేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని చుంచనకోట గ్రామ శివారులోని పెద్ద గుట్టల్లో గుర్తు తెలియని అడవి జంతువు సంచరిస్తుందని, పరిసర ప్రాంతాల రైతులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్టు బీట్ అధికారి రాముడు తెలిపారు. ఆదివారం గ్రామ శివారులోని పెద్ద గుట్ట ప్రాంతంలో యాట కనకయ్యకు చెందిన లేగ దూడ గుర్తు తెలియని అడవి జంతువు దాడిలో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పెద్దగుట్ట ప్రాంతంలో చిరుత లేదా పెద్ద నక్క(జుక్కల్) సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు. కావున పరిసర ప్రాంతాల రైతులు, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి గ్రామాల రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా పశువులను ఇంటి వద్దనే కట్టేసుకోవాలన్నారు. అలాగే పొలం పనులకు వెళ్లే రైతులు గుంపుగా వెళ్లి, తిరిగి సాయంత్రం 6 గంటలలోపు ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు రైతులున్నారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గజ్వేల్రూరల్: విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా యూఎస్ఎఫ్ఐ పోరాడుతోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవి, తిరుపతిలు అన్నారు. పట్టణంలోని కోలా అభిరాం గార్డెన్స్లో ఆదివారం రెండవ రోజు యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రథమ మహాసభలు కొనసాగాయి. ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలకు సొంత భవనాలను నిర్మించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈవో, ఉపాధ్యాయ, లెక్చరర్, వర్కర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు. అనంతనం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా శేఖర్, రవిని ఎన్నుకున్నారు. -
‘పోచారం’ వద్ద తాత్కాలిక మరమ్మతులు
పోచారం డ్యామ్ దిగువన ఉన్న బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్న అధికారులుపొంగిపొర్లుతున్న పోచారం అలుగుహవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ వరద ఉధృతికి దిగువన ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయి మెదక్– బోధన్ రోడ్డు రవాణా సదుపాయం నిలిచిపోయింది. మూడు రోజులుగా వరద ఉధృతి ఎక్కువగా ఉండగా ఆదివారం తగ్గి అవతలి వైపు ఉన్న బ్రిడ్జిపై వరకు అధికారులు టిప్పర్లతో మట్టిని పోసి రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్కు ఎల్లారెడ్డి, బోధన్, మెదక్ ప్రజలు ఈ రోడ్డు ద్వారానే వెళ్తారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసే దిశగా అధికారులు శ్రమిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలతో దిగువన ఉన్న పోచారం డ్యామ్, దూప్సింగ్ తండాలకు రాకపోకలకు అంతరాయం కలుగడంతో పాటు నాలుగు రోజులుగా వరద ఉధృతి కొనసాగింది. ఆదివారం కొంత మేర తగ్గడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయడంలో నిమగ్నమయ్యారు. -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల మృతి ● మరో ఐదుగురికి గాయాలు జహీరాబాద్: దైవ దర్శనానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... ఆదివారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలోని ఆనంద్నగర్ కాలనీకి చెందిన కుటుంబం ఆల్టో కారులో దైవ దర్శనం నిమిత్తం న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో గల ఆదిలక్ష్మి ఆలయానికి వెళుతున్నారు. మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వెంకట్(33), ఆయన అక్క కుమారుడు సాయిలు (20)లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న నాగేశ్వరరావు, వరలక్ష్మి, రుషికేష్, జాన్వీ, హరిచందనలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మృతులు వెంకట్, సాయిలు మామ అల్లుడు అవుతారు. లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ శివలింగం, ఎస్.ఐ వినయ్కుమార్లు సందర్శించి కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటకు తీయించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
పటాన్చెరు టౌన్: అతిగా మద్యం తాగిన వ్యక్తి పడుకున్న చోటే మృతి చెందాడు. పటాన్చెరు పోలీసుల వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్కు చెందిన సునీల్ యాదవ్(41) బతుకుదెరువు కోసం వచ్చి మండలంలోని పెద్ద కంజర్ల గ్రామంలో అరబిందో నిర్మిస్తున్న నిర్మాణాల వద్ద లేబర్ క్యాంప్లో ఉంటూ, కూలి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం పనికి వెళ్లి తిరిగి లేబర్ క్యాంపునకు మద్యం తాగి వచ్చి పడుకున్నాడు. తిరిగి మరుసటి రోజు ఆదివారం ఉదయం సునీల్ను నిద్రలేపేందుకు రూమ్లో ఉండే ప్రమోద్ ప్రయత్నించగా మృతిచెంది ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడు కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నట్టు తోటి కార్మికులు చెప్పారు. విద్యుదాఘాతంతో రైతు.. తొగుట(దుబ్బాక): మోటారు సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చందాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రవికాంత్రావు కథనం మేరకు... గ్రామానికి చెందిన చందా నర్సయ్య (65)కు గ్రామ శివారులో కూడవెల్లి వాగు సమీపంలో ఎకరం భూమి ఉంది. వాగులోని నీటిలోకి మోటారు వేసి వరిసాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మోటారు కొంతదూరం కొట్టుకుపోయింది. ఉధృతి తగ్గడంతో మోటారు బయటకు తేలింది. దీంతో ఆదివారం వాగులోకి దిగిన నర్సయ్య మోటారును సరిచేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన రైతులు కాపాడేందుకు ప్రయత్నించగా ఆయన అప్పటికే మరణించాడు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గణేష్ లడ్డూ అదరహో
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మైహోం అంకురలో గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఆదివారం వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక లడ్డూను వేలం వేయగా.. కాలనీకు చెందిన అభిషేక్ రెడ్డి, మల్లేపల్లి రాజేందర్ రెడ్డిలు రూ.6,66,666లకు కై వసం చేసుకున్నారు. అనంతరం వారిని వినాయక కమిటీ సభ్యులు సన్మానించారు. అలాగే మై ఫెయిర్ విల్లాస్లో నాగేంద్ర కిషోర్ రూ.3.8లక్షలు, మేగ్నా మేడోస్ విల్లాస్లో వినోద్ రూ.2.7లక్షలు, బ్లూమ్ ఫీల్డ్ విల్లాస్లో దుర్గా ప్రసాద్ రూ.75వేలకు లడ్డూలను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంకుర సోసైటీ సభ్యులు రాధిక, నగేష్, కార్తీక్, శ్రీధర్, గణేష్, శ్రీశైలం, మల్లారెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేష్, ఉమా పాల్గొన్నారు. -
‘భావ తరంగాలు’తో ప్రేరణ
సంగారెడ్డి టౌన్: మండల పరిధిలోని శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో పాకా రాజమౌళి రచించిన ‘భావతరంగాలు భారతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి రచించిన భావ తరంగాలు ఎంతో మందికి ప్రేరణాదాయకంగా ఉందన్నారు. అనంతరం ఆయన రచనా స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి, వడ్డీ విజయ సారథి, పూర్ణ కృష్ణ, చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చెరకు సాగు విస్తరణకు సహకారం
న్యాల్కల్(జహీరాబాద్): చెరకు పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని గోదావరి–గంగా ఆగ్రో చెక్కర కర్మాగారం ఎండీ సచిన్ గోయాల్ అన్నారు. న్యాల్కల్ మండల పరిధిలోని ముంగి, హద్నూర్, రుక్మాపూర్లలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో చెరకు పంటను పరిశీలించి అనంతరం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. అక్టోబర్లో ఫ్యాక్టరీలో చెరకు క్రస్సింగ్ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది 3లక్షల టన్నుల క్రస్సింగ్ చేసేందుకు నిర్ణయించామన్నారు. రోజుకు దాదాపు 2,700 టన్నుల చెరకు క్రస్సింగ్ చేయనున్నామని తెలిపారు. గతేడాది టన్నుకు రూ.3,700 చెల్లించగా.. కోత, రవాణా ఖర్చులు పోను రైతుకు రూ.2,800 మిగిలిందన్నారు. రైతులను ప్రోత్సాహం అందించి పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు సుమారు 85లక్షల చెరకు మొక్కలు అందజేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది 15లక్షల మొక్కలను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేన్ డెవలప్మెంట్ మేనేజర్ రవీందర్రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ సురేందర్ పాటిల్, రైతులు నర్సింహారెడ్డి, విఠల్రెడ్డి, అశోక్, తుల్జారాం తదితరులు పాల్గొన్నారు. గోదావరి–గంగా ఆగ్రో చెక్కర కర్మాగారం ఎండీ సచిన్ గోయాల్ ముంగి, హద్నూర్, రుక్మాపూర్లలో చెరకు పంటల పరిశీలన -
‘పరిషత్’ సందడి!
సంగారెడ్డి జోన్: రానున్న పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని షెడ్యూల్ విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులను పరిశీలించి జాబితా రూపకల్పన చేసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ల ఆమోదంతో పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ఎంపీడీఓలు ప్రచురించనున్నారు. ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఈనెల 6న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. జనవరి 1, 2025 ఓటరు జాబితా ప్రకారం.. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో భాగంగా 1,547 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా.. ప్రస్తుతం వచ్చిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించనున్నారు. ఆ తర్వాత ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై ఈనెల 8న జిల్లా, మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. 6 తేదీ నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం వీటిని 9న పరిష్కరించి 10న తుది జాబితాను ప్రకటించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు తగిన మౌలిక వసతులు కల్పిస్తూ ఏర్పాటు చేయనున్నారు. ప్రధానగా తాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు దివ్యాంగులకు ర్యాంపు సౌకర్యం కల్పించనున్నారు. రెండు విడతల్లో ఛాన్స్! పరిషత్ ఎన్నికల నిర్వహణ రెండు విడతల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలై చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.25 జెడ్పీటీసీ, ఎంపీపీలు.. 271 ఎంపీటీసీ స్థానాలు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మండలాలు వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్, 25 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలతో పాటు 271 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019 లో నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో 25 జెడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు పలు మండలాలు, గ్రామ పంచాయతీలతో కలిపి మున్సిపాలిటీలో విలీనంతో పాటు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. దీంతో పరిషత్ స్థానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త పరిషత్ స్థానాల జాబితా ప్రకారం.. టాప్ 5 అత్యధిక స్థానాల్లో సంగారెడ్డి జిల్లా ఉండడం విశేషం. జిల్లాలోని ఓటర్ల వివరాలు నియోజకవర్గం మహిళలు పురుషులు ఇతరులు అందోల్ 84,948 82,015 6 నారాయణఖేడ్ 95,075 95,964 6 నర్సాపూర్ 21,919 20,797 2 పటాన్చెరు 29,261 20,797 2 సంగారెడ్డి 68,688 65,908 27 జహీరాబాద్ 95,491 95,047 2 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ 6న ముసాయిదా జాబితా విడుదల వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష 10న తుది జాబితా విడుదల -
‘ఆకుకూరల’ పండుగ
జహీరాబాద్: వర్షాకాలంలో సహజంగా వచ్చే మొక్కల్లో ఆరోగ్యాన్ని అందించే పోషకాలు ఉంటాయని సందర్శకులకు పోషకాహార నిపుణులు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని దిడిగిలో గల కేవీకేలో డీడీఎస్ ఆధ్వర్యంలో సహజ ఆకుకూరల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు తదితర ప్రాంతాల నుంచి వందకు పైగా సందర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 40 రకాల సహజ ఆకుకూరలను ప్రదర్శనలో ఉంచారు. అనంతరం 30 రకాల ఆకుకూరలతో వండిన వంటకాలతో భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా పోషకాహార నిపుణులు సలోమి మాట్లాడుతూ.. పంట పొలాల్లో సహజంగా వచ్చే మొక్కల్లో అనేక పోషకాలు ఉంటాయన్నారు. అయితే వీటిని కలుపు మొక్కలుగా భావించి తొలగిస్తుంటారన్నారు. కానీ ఇవి కలుపు మొక్కలు కాదని, ఆకు కూరలుగా ఉపయోగించుకోవచ్చని అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే జహీరాబాద్లోని పస్తాపూర్, న్యాల్కల్లోని గుంజోటిలలోని జీవవైవిద్య పొలాలను సందర్శించారు. అనంతరం జహీరాబాద్లోని దిడిగిలో ఉన్న కేవీకేలో అనుభవ రైతులు చంద్రమ్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ మీలా అవగాహన కల్పించారు. అనంతరం ఆకు కూరల గొప్పతనాన్ని పాటల రూపంలో మహిళలు పాడి ఆకట్టుకున్నారు. 30 రకాల సహజ ఆకుకూరలతో వంటకాలు ఆరోగ్యాన్ని అందించే పోషకాలపై అవగాహన -
ప్రభుత్వ బడుల్లో రాగిజావ
విద్యార్థులకు పౌష్టికాహారం దిశగా అడుగులుప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న ప్రభుత్వం.. మరింత పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో రాగిజావను అందజేయాలని నిర్ణయించింది. అయితే రెండేళ్లుగా రాగిజావను అందజేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచి నిలిపివేయగా.. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించనుంది. ఇందులో భాగంగా నేటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ బెల్లంతో కూడుకున్న రాగిజావ అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం పోషన్ (మిడ్డే మిల్) పథకం కింద 2025–26 విద్యా సంవత్సరానికి రాగిజావ సరఫరాకు అనుమతి మంజూరైంది. – నారాయణఖేడ్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,186 పాఠశాలల్లో చదువుతున్న 2.70లక్షల మంది విద్యార్థులకు రాగిజావ పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇంటి నుంచి ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు బయలుదేరే చిన్నారులు తరగతి గదుల్లో అలసి పోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారంగా బెల్లంతో కూడిన రాగిజావ అందజేస్తే ప్రయోజనకరంగా ఉండడంతోపాటు విద్యార్థులు పౌష్టికాహారం అందుతుందని భావించింది. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య జిల్లా పాఠశాలలు విద్యార్థులు సంగారెడ్డి 1,265 1,02,000 మెదక్ 980 98,000 సిద్దిపేట 941 72,000రెండున్నర నెలల తర్వాత.. ఈ ఏడాది జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవ్వగా.. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకం అమలు కానుంది. గతంలో మాదిరిగా సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సహకారంతో పథకాన్ని అమలు చేయనుంది. ట్రస్టు 60శాతం వ్యయం భరిస్తుండగా.. 40శాతం ప్రభుత్వం భరించి ఈ పథకాన్ని అమలు చేయనుంది. సత్యసాయి ట్రస్ట్ విద్యార్థులకు అవసరమైన ఫోర్టిఫైడ్ రాగి పొడి, బెల్లం పొడి పాకెట్లను పాఠశాలలకు సరఫరా చేస్తుంది. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కొనసాగిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు రాగిజావను తయారు చేసి విద్యార్థులకు అందించనున్నారు. ప్రతీ గ్లాసుకు ప్రభుత్వం రూ.25 పైసల చొప్పున చెల్లించనుండగా.. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ విద్యార్థికి రోజుకు 10 గ్రాముల రాగిపొడి, 10 గ్రాముల బెల్లం పొడి ఇవ్వాలని ఆదేశింశించారు. ఇందులో భాగంగానే వారంలో మూడు రోజులు గుడ్లు ఇవ్వని రోజుల్లో రాగిజావ, మిగతా మూడు రోజులు గుడ్డు అందించనున్నారు. అయితే ప్రారంభం నుంచి రావిజావ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆతర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కాగా, జిల్లాలోని అన్ని మండలాలకు ఇప్పటికీ రాగిజావ, బెల్లం పాకెట్లు చేరుకోలేదు. రెండు రోజుల్లో ఎమ్మార్సీలు, అక్కడి నుంచి పాఠశాలలకు వీటిని చేరవేయనున్నారు. నేటి నుంచి పంపిణీకి శ్రీకారం రెండున్నర నెలల తర్వాత పథకం పునఃప్రారంభం ఉమ్మడి జిల్లాలో 2.70లక్షల మంది విద్యార్థులకు మేలు నేడు సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో ప్రారంభంపకడ్బందీగా అమలు చేస్తాం పాఠశాలల్లో రాగిజావ పంపిణీ పథకాన్ని తిరిగి ప్రభుత్వం కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు జెడ్పీహెచ్ఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో సోమవారం ప్రారంభిస్తాం. రాగిజావ, బెల్లం ప్యాకెట్లు సత్యసాయి ట్రస్టు నుంచి రావాల్సి ఉంది. రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, సంగారెడ్డి -
విభిన్న రూపాయా.. విఘ్న రాజాయా!
జిల్లా వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సంగారెడ్డిలోని వాడవాడల్లో విశేషాలంకరణలో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగానే శ్రీ నగర్, మహాకాల్, పాత బస్టాండ్ చైతన్య యువజన సంఘం, గంజ్ మైదాన్ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో, పరమశివుడు, అయోధ్య రాముడు, శ్రీకృషుడు, బెపాస్ రోడ్డులోని లాల్ బాగ్ ఛా రాజా రూపంలో ఉన్న గణనాథులకు పూజలు చేశారు. కాగా రుద్రారం దేవస్థానంలో లంబోదరుడు రుద్రేశ్వరుడి వర్ణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
కలుపు మొక్కలు కాదు.. పోషకాలు
తుమ్మికూర, తలైలి, అడవిమెంతి, జొన్న చెంచేలి, అడవి సోయ, దొగ్గలి, బంకటి, ముల్లు దొగ్గలి, పెద్ద కాశ, ఎర్రకాశ, తెల్ల బచ్చలి, ఎర్రపుండి, తెల్లపుండి, దుసరి, ఉత్తరేణి, చెన్నంగి, వామకూర, తగిరెంచ, తెల్లగర్జ, ఎర్రగర్జ, పొల పత్రం, చామగడ్డ, నాగ చెవిలి, సన్న వాయిలి, మునగకూర, గునుగు, ఎర్ర గునుగు, చిత్రమలం, నాగలిచెవి, తడక దొగ్గలి, గంగ వాయిలి, చిన్న కాశ, గుర్మశి, పప్పుకూర, పిట్టకూర, చెన్నంగి, ఎన్నాద్రి, పుల్లకూర, ఎలుకచెవి అలం, అంగిబింగి, తెల్లవార్జం పువ్వు వంటి ఆకు కూరలు వర్షాకాలంలో సహజంగా లభిస్తాయనిపోషకాహార నిపుణులు తెలిపారు. ఇవి కలుపు మొక్కలు కాదని.. పోషకాలు అందించే ఆకు కూరలు అని వెల్లడించారు. -
అటవీ భూమి ఆక్రమణ
అడ్డుకున్న అధికారులు.. వాహనాల స్వాధీనంశివ్వంపేట(నర్సాపూర్): అటవీ భూమిని కబ్జా చేసేందుకు చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని పిల్లుట్లలో శనివారం చోటు చేసుకుంది. పిల్లుట్ల కంపార పరిధిలో శనివారం పలువురు వ్యక్తులు డోజర్లు, జేసీబీలతో అటవీ భూమిని చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 4 డోజర్లు, 2 జేసీబీలను స్వాధీనం చేసుకుని నర్సాపూర్ అటవీ కార్యాలయానికి తరలించారు. కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్ తెలిపారు. సెక్షన్ అధికారులు శ్రీధర్ బాబు, రాజమణి, సాయిరాం, బీట్ ఆఫీసర్లు కుమార్, వెంకటేశ్ ఉన్నారు. -
వర్షానికి తెగిపోయిన రోడ్లు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు దుబ్బాకరూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ తెగిపోయాయి. కామారెడ్డి జిల్లాకు వెళ్లాలంటే బీబీపేట వద్ద రోడ్డు కోతకు గురైంది. అలాగే నర్మాల నుంచి వెళ్లాలంటే మానేరు వాగు పొంగి పొర్లడంతో రోడ్డుపై నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా పోతోంది. మెదక్ జిల్లాకు వెళ్లాలంటే నిజాంపేట వద్ద రోడ్డు తెగింది. కామారెడ్డి జిల్లాను సరిహద్దును కలిపే మండలంలోని ఆకారం వాగు బ్రిడ్జిపై నుంచి నీళ్లు ఎక్కువగా పోవడంతో రాక పోకలు నిలిచి పోయాయి. ఇలా ఎటూ చూసినా వీలు లేకుండా పోయింది. ఎక్కడి వారు అక్కడే తమ బంధువుల ఇండ్లల్లోనే ఉండి పోయారు. ఒక వేళ కామారెడ్డికి వెళ్లాలంటే కరీంనగర్ మీదుగా 160 కిలో మీటర్ల దూరం అవుతుంది. ఇంతకు ముందుకు 35 కిలో మీటర్లు ఉండేది. మూడు రోజులుగా ఊర్లకు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఎఫ్ఆర్ఎస్ బాగుంది
కళాశాలల్లో ముఖ హాజరు విధానం ప్రవేశ పెట్టడం చాలా బాగుంది. దీంతో కాలేజీకి డుమ్మాలు కొట్టేవారు దొరికిపోతారు. ముఖ్యంగా ఇంట్లో ఈ విషయం తెలిసే అకాశం ఉన్నందున దాదాపు డుమ్మాలకు చెక్ పడునుంది. – మల్లేశ్వరీ విద్యార్థినీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల హద్నూర్ అన్ని కళాశాలల్లో అమలు విద్యార్థుల హజరు శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అన్ని కళాశాలల్లో అమలు చేస్తున్నాం. దీని వల్ల విద్యార్థుల హజరు శాతం పెరుగుతుంది. – గోవిందరాం డీఐఈఓ–సంగారెడ్డి -
ఇల్లు వచ్చేసిందోచ్
డబుల్బెడ్రూమ్ ఇళ్ల తాళాల అప్పగింతమండలంలోని హోతి(కె) గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించగా అందులో మిగిలిన వాటిని కూడా అధికారులు పంపిణీ చేసేశారు. ఈ మేరకు మిగిలిపోయిన ఇళ్లకు సంబంధించి తాళం చెవిలను లబ్ధిదారులకు శనివారం రెవెన్యూ అధికారులు అందజేశారు. దీంతో లబ్ధిదారులు సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్, లబ్ధిదారులు పాల్గొన్నారు. – జహీరాబాద్: -
సింగూరుకు పోటెత్తిన వరద
● ఏడు గేట్లు ఎత్తి నీరు విడుదల ● ఇన్ఫ్లో 71,025 క్యూసెక్కులు.... ఔట్ ఫ్లో 74,722 క్యూసెక్కులుపుల్కల్(అందోల్): రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మునిపల్లి మండలం దుబ్బవాగు,రాయికోడ్,రేగోడ్ మండలాలలో కురిసిన నీరంతా డ్యామ్లోకి చేరుకుంటోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 71,025 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో అధికారులు ఏడు గేట్లను ఎత్తి దిగువకు 74,722 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాలుగు గేట్లు రెండు మీటర్లు, మూడు గేట్లు రెండున్నర మీటర్లు ఎత్తారు. జెన్కోకు 1,732 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు అదికారులు నిరంతరం అప్రమత్తంగ ఉంటున్నారు.ఏడు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు ప్రాజెక్టు వద్ద సందడి చేస్తున్నారు. -
మట్టి రవాణ వాహనాల పట్టివేత
● నలుగురిపై కేసు నమోదు ● ‘సాక్షి’కథనాలపై అధికారుల్లో కదలిక ● అక్రమ మట్టి రవాణపై అధికారుల నిఘా వట్పల్లి(అందోల్): అక్రమ మట్టి మాఫియా వట్పల్లిలో అనుమతులు లేకుండా సాగిస్తున్న మట్టి దందాపై ‘సాక్షి’వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు మేల్కొన్నారు. మట్టి మాఫియాపై నిఘా పెట్టి అక్రమ రవాణ వాస్తవమేనని నిర్థారించుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ మట్టిని తవ్వుతున్న జేసీబీతోపాటు టిప్పర్, ట్రాక్టరుతో మరో మూడు వాహనాలను పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లవకుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. అక్రమ మట్టి రవాణపై దృష్టి సారించామని, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దారు చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. సెలవు రోజుల్లో కుడా పోలీసుల నిఘా ఉంచుతామన్నారు. -
మీ సేవలు భేష్: కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: జిల్లాను గౌరవప్రదమైన స్థానంలో నిలపడంలో హౌసింగ్ పీడీ దామోదర్రావు, మిషన్ భగీరథ ఈఈ గిరిధర్ అందించిన సేవలు అమోఘమని కలెక్టర్ కె. హైమావతి అన్నారు. శనివారం కలెక్టరేట్లో దామోదర్రావు, గిరిధర్ల పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను మొదటగా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలైందని, దీనిపై ఎప్పటికప్పుడు పీడీతో చర్చించి ముందుకెళ్లానన్నారు. మిషన్ భగీరథ సైతం రోజువారీగా ప్రజలకు నీరందించడం అభినందనీయమన్నారు. ఇరువురి శేష జీవితం బాగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మిషన్ భగీరధ ఈఈ గిరిధర్ మాట్లాడుతూ నీటి సరాఫరా చేయడంలో అధికారులు బాగా సహకరించారన్నారు. హౌసింగ్ పీడి.దామోదర్రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం సక్సెస్ చేయడానికి రాత్రివేళల్లో సైతం విధులు నిర్వహించినట్లు తెలిపారు.కొమురవెల్లి నూతన ఈవోగా అంజనీదేవి కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నూతన ఈవోగా కె.అంజనీదేవిని నియమిస్తూ దేవాదాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యాలయంలో జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారిగా (అసిెస్టెంట్ కమిషనర్)గా విధులు నిర్వహిస్తున్న అంజనీదేవికి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ ఈవోగా పని చేస్తున్న అన్నపూర్ణ నేటితో పదవీ విరమణ పొందుతున్నారు. సోమవారం నూతన ఈవో బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ తనిఖీ సదాశివపేట(సంగారెడ్డి): పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తనిఖీ చేశారు. ఈ సదర్భంగా పోలీసుల పనితీరు, స్టేషన్ పరిసరాలను పరిశీలించి రికార్డులను తనీఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వినాయక నిమజ్జనంలో తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదు దారులతో స్నేహంగా వ్యవహరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. నాటు సారా స్వాధీనంనారాయణఖేడ్: నాటు సారాను తయారు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని, 16.75లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్ టీం ఎస్ఐ హనుమంతు, అనుదీప్ వివరాల ప్రకారం... ఖేడ్ మండలం శేరి తండాలో కేతావత్ హిరామన్ ఇంట్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం దాడులు చేసి సారాయిని స్వాధీనం చేసుకుని, బట్టిని ధ్వసం చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ డీసీ హరికిషన్ ఆదేశాల మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. సిబ్బంది అంజిరెడ్డి, అరుణ్జ్యోతి, రాజేశ్ ఉన్నారు. ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడు (ఆర్ఎంపీ) వైద్యుడు సుదర్శన్పై కేసు నమోదైంది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... గ్రామంలో క్లినిక్ పేరిట యథేచ్ఛగా ఆస్పత్రి పేరు పెట్టుకొని ప్రాథమిక వైద్య చికిత్సలకు బదులుగా అత్యవసర వైద్యం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి యశ్వంత్ డెంగీ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చాడు. ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాలి. కానీ ఆర్ఎంపీ వైద్యుడు సుదర్శన్ అనుభవ రాహిత్యంతో అత్యవసర వైద్యం చేయడంతో విద్యార్థి మృతి చెందినట్లు కుటుంబీకులు డీఎంహెచ్ఓ ధన్రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
విధి నిర్వహణలో అప్రమత్తం
సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మ్డ్ రిజర్వ్డ్ సిబ్బందికి శనివారం వీక్లి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ..శారీరక దారుఢ్యం కోసం ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు అధికారులు ఎలాంటి పరిస్థితులలోనైనా స్పందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వినాయక నిమజ్జనం, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేవిధంగా తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, తదితరులు ఉన్నారు.జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ -
పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు
జహీరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎంపీ సురేశ్ షెట్కార్ అధికారులకు సూచించారు. జహీరాబాద్ పట్టణంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులోని నారింజ ప్రాజెక్టును సందర్శించి సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభాలకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి శుక్లవర్ధన్రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్రావుపాటిల్, పి.నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మక్సూద్, కండెం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.ఎంపీ సురేశ్ షెట్కార్ -
డుమ్మాలకు చెక్
ధూప్సింగ్ తండా.. నాలుగు రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజనులు. వరదతో విలవిల్లాడిన ముంపు బాధితులు.. ఆ పీడకల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. శనివారం సాక్షి పలకరించగా.. వారిలో భయం ఇంకా కనిపించింది. సీన్ కట్ చేస్తే.. తెల్లవారితే వినాయక చవితి.. రాత్రి భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి మొదలైన చినుకులు కొద్దిసేపట్లోనే జడివానగా మారింది. తెల్లవారేలోగా గంగమ్మ వాగు పోటెత్తింది. వరద విజృంభించి తండాను చుట్టుముట్టింది. అనుకోని ఉపద్రవంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెట్టుకొకరు.. పుట్టకొకరు పరుగులు తీశారు. కరెంట్ లేదు, తిండీ తిప్పలు లేవు.. వాన నీటితోనే కడుపు నింపుకున్నారు. ఆ నరకయాతనను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులోకి ముఖ హాజరు విధానంన్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఇష్టానుసారంగా డుమ్మాలు కొట్టేందుకు వీలు లేకుండా పోయింది. కాలేజీల్లో విద్యార్థుల హాజరు పెంచేందుకు ముఖ హాజరు (ఎఫ్ఆర్ఎస్) విధానానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఉదయం వచ్చి మధ్యాహ్నం డుమ్మా కొట్టడం, మరి కొందరు కళాశాలకు వెళ్తున్నామని చెప్పి కాలేజీకి రాకుండా గైర్హాజరు కావడంలాంటివి చోటు చేసుకుంటుడటంతో హాజరు శాతం తగ్గిపోయి విద్యార్థులే నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు విద్యార్థుల డుమ్మాలపై దృష్టి సారించి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈనెల 23 నుంచే మొదలైన ఎఫ్ఆర్ఎస్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 23 నుంచి ఎఫ్ఆర్ఎస్(ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్)కు ఇంటర్బోర్డు శ్రీకారం చుట్టింది. సీజీజీ(సెంటర్ బోర్డు ఫర్ గుడ్ గవర్నెన్స్) సాంకేతిక సహకారంతో ఇంటర్ బోర్డు అధికారులు టీజీబీఐఈ, ఎఫ్ఆర్ఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో రిజిస్టర్ విధానం ద్వారా హాజరు తీసుకునేవారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త విధా నం ద్వారా ఉదయం, మధ్యాహ్నాం రెండుసార్లు అధ్యాపకులు మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఏ కారణంతోనైనా పాఠశాలకు డుమ్మాకొడితే ఆ సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు కళాశాలలకు డుమ్మా కొట్టే సమాచారం తల్లిదండ్రులు, అధికారులకు తెలియనుండటం వల్ల డుమ్మాలకు స్వస్తి పలికే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థుల హాజరు పెరడంతోపాటు విద్యాపరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 20 కళాశాలలు జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 4,623 మంది, ద్వితీయ సంవత్సరంలో 3,350 మంది, మొత్తం 7,973 విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 140 మందికి పైగా బోధన సిబ్బంది ఉండగా, 50కిపైగా బోధనేతర సిబ్బంది ఉన్నారు. -
అన్ని రంగాల్లో ముందుండాలి
నారాయణఖేడ్: ఆడ పిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా సీ్త్ర శిశు వయోవృద్ధుల సంక్షేమ అధికారి లలిత కుమారి పేర్కొన్నారు. నిజాంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం ‘బేటీ బచావో, బేటీ పడావో’కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆడ పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. డీఎస్పీ వెంకట్రెడ్డి మాట్లాడుతూ..పోక్సో చట్టం, షీ టీమ్ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీడీపీవో సుజాత, ఎంపీడీవో సంగ్రాం, ఏసీడీపీపీవో సుశీల, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం కోఆర్డినేటర్ పల్లవి, తహశీల్దార్ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.ఐసీడీఎస్ పీడీ లలిత కుమారి -
సైన్యానికి సాంకేతిక దన్ను
ఐఐటీహెచ్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ‘విగ్రహ’ఏర్పాటు ● రక్షణ రంగానికి అవసరమైన ఆధునిక సాంకేతికతపై పరిశోధనలు ● అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన ఐఐటీహెచ్, ఎస్డీడీసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐటీ) హైదరాబాద్ భారత సైన్యానికి దన్నుగా నిలవనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఈ విద్యా సంస్థ ఇకపై దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతానికి పరిశోధన సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు ఐఐటీహెచ్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్కు చెందిన సిమ్యూలేటర్ డెవలప్మెంట్ డివిజన్ (ఎస్డీడీ, సికింద్రాబాద్)తో కీలకం ఒప్పందం చేసుకున్నట్లు ఐఐటీహెచ్ వర్గాలు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటీలో ‘విగ్రహ’పేరుతో ఓ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీని స్థాపిస్తున్నారు. ఈ రెండు అత్యున్నత సంస్థలు సంయుక్తంగా శాసీ్త్రయ, సాంకేతిక అంశాలపై పరిశోధనలను చేపట్టనున్నాయి. ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ ఇండియన్ ఆర్మీతో కలిసి 3 డీ–ప్రింటెడ్ మిలిటరీ బంకర్ల నిర్మాణంపై పరిశోధన చేస్తోంది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశం లేహ్లో ఈ బంకర్లను నిర్మిస్తోంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్తో కలిసి ఈ ప్రాజెక్టును కొనసాగిస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)తో కూడా ఐఐటీహెచ్ కలిసి పనిచేస్తోంది. క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలకు సంబంధించి పనితీరు విశ్లేషణ, డిజైన్లు, డేటా ఏఐ సాంకేతికత తదితర విభాగాలపై కూడా ఐఐటీహెచ్ సేవలందిస్తోంది. అలాగే తూనీగలు, కీటకాలు, పక్షుల ఆకారంలో గాలిలో ఎగురుతూ సరిహద్దుల్లో నిఘా పెట్టే బయో ఇన్స్పైర్డ్ డ్రోన్లు వంటి వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారత సైన్యానికి సాంకేతిక శిక్షణ సంస్థతో కలిపి ఈ ప్రాజెక్టు చేపట్టడం గమనార్హం.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతోఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, డ్రోన్లు, అగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, మానవ రహిత వాహనాలు తదితర అంశాలపై ఈ ఎస్ఎస్డీ సైన్యానికి శిక్షణను అందిస్తోంది. ఇలాంటి అత్యున్నత సంస్థతో కలిసి ఐఐటీహెచ్ పనిచేయనుంది. అలాగే రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ కార్యకలాపాలను ప్రోత్సహించనున్నారు. ఐఐటీహెచ్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ ఎక్స్లెన్స్ సెంటర్లో ఇంటర్నషిప్ చేసే అవకాశాలుంటాయి. ఈ కీలక ఒప్పందాలపై ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఎస్డీడీ తరఫున బ్రిగేడియర్ ఏ.కే.చతుర్వేది సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఒప్పందం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని, రక్షణ దళాల సాంకేతిక సామర్థ్యాలను పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. -
డ్వాక్రా మహిళలకు ఆర్టీసీ బస్సులు
సంగారెడ్డి టౌన్: గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళల స్వయం ఉపాధికి బాటలు వేయడంతోపాటు వారిని వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా రుణాలను అందజేస్తోంది. వీటితోపాటు మహిళా క్యాంటీన్లు, డెయిరీ పార్లర్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్ల బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం రావడంతోపాటు బస్సుల కొరత సైతం తీరుతోంది. జిల్లాలో మూడు డిపోల పరిధిలో ప్రస్తుతం 260 బస్సులుండగా మరికొన్ని మహిళా సంఘాల యొక్క బస్సులు పెరగనున్నాయి. నెలకు రూ.70వేల వరకు ఆదాయం జిల్లావ్యాప్తంగా 695 గ్రామ సంఘాలుండగా, అందులో 25 సమాఖ్య మహిళా సంఘాలు, ఒక లక్ష 95వేల మహిళా సభ్యులున్నారు. ప్రభుత్వం రూ.30 లక్షలు ఇవ్వడంతో, మహిళా సమాఖ్య సంఘాల నుంచి రూ.6 లక్షలు తీసుకుని బస్సును కొనుగోలు చేయనున్నారు. నెల నెలా సుమారు రూ.60 నుంచి రూ.70 వేల వరకు ఆదాయం మహిళా సమాఖ్య సంఘాలకు సమకూరనుంది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ క్రమంలో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల కొరత ఏర్పడింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం ఆర్టీసీకి భారంగా మారింది. ఈ క్రమంలో మహిళా సంఘాల అద్దె బస్సుల వినియోగించడంతో బస్సుల కొరత కూడా కొంత తగ్గనుంది. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బస్సులను అద్దెకు తీసుకునే బదులు మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను తీసుకుంటుండటంతో ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సంఘాలకు లాభం చేకూరనుంది.త్వరలో జిల్లాకు మంజూరు -
డెయిరీ ఫామ్పై పోలీసుల దాడి
210 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం హత్నూర( సంగారెడ్డి): కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారన్న అనుమానంతో సీసీఎస్ పోలీసులు దాడి చేసి సుమారు 210కేజీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... మండలంలోని గోవిందరాజు పల్లి గ్రామ శివారులోని మధుప్రియ డెయిరీ ఫామ్పై పోలీసులు శనివారం దాడి చేశారు. 10 కేజీల నెయ్యి బకెట్లు 16, 30 లీటర్ల పెద్ద క్యాన్లు రెండు, కాటన్ మంచి నూనె ప్యాకెట్లు, కార్న్ఫ్లోర్ పౌడర్, టెస్టింగ్ సాల్ట్ ప్యాకెట్, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, ఇతర కెమికల్ వస్తువులను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. డెయిరీ నిర్వాహకుడితోపాటు ఆటో, కల్తీ నెయ్యిగా భావిస్తున్న డబ్బాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయమై ఎస్సై శ్రీధర్ రెడ్డిని సంప్రదించగా స్వాధీనం చేసుకున్న వాటిని స్టేషన్లో ఉంచామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా గతంలో కూడా ఈ డెయిరీపై కల్తీ పాలు తయారు చేస్తున్నారని కేసు నమోదు చేశారు. -
మోదుగు ఆకులతో వినాయకుడు
తీర్చిదిద్దిన ఫార్మసీ గ్రాడ్యుయేట్వర్గల్(గజ్వేల్): పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు వద్దు.. పర్యావరణ హిత గణపతులే మేలు అంటున్నాడు వర్గల్కు చెందిన ఫార్మసీ గ్రాడ్యుయేట్ అయ్యగల్ల దయాకర్. ప్రతి యేటా పర్యావరణ హిత గణపతిని తానే తయారు చేసి పూజిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈసారి మోదుగాకులతో గణపతిని కళాత్మకంగా తీర్చిదిద్దా డు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదన్నట్లు నాలుగేళ్ల క్రితం 2021లో మట్టి వినాయకుడిని, 2022లో వినూత్నంగా కాగితాలతో, 2023లో గోనెసంచులతో (గన్నీ బ్యాగ్) గణేశుడిని తయారు చేసి కళాత్మకంగా తీర్చిదిద్దాడు. తన ఇంట్లో ప్రతి ష్ఠించుకొని పూజలు చేశాడు. గత సంవత్సరం అమ్మమ్మ మృతితో నవరాత్రోత్సవాలు జరుపుకోలే దు. తాజాగా వినూత్న రీతిలో మోదుగ ఆకులు వినియోగించి 7 అడుగుల గణపతిని తయారు చేశాడు. సమాజంలో మార్పే లక్ష్యంగా పర్యావరణహిత వస్తువులతో వినాయకుడిని తయారుచేస్తూ ప్రచారం చేస్తున్నట్లు దయాకర్ పేర్కొ న్నాడు. ఆ యువకుడిని గజ్వేల్ శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామ రాజు అభినందిస్తూ జ్ఞాపిక అందజేసి సన్మానించాడు. -
కుంటలో పడి వ్యక్తి మృతి
రెస్క్యూ టీం సహాయంతో శవాన్ని బయటకు తీసిన పోలీసులుచేర్యాల(సిద్దిపేట): ప్రమాదవశాత్తు కుంటలో పడిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో శనివారం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు, కొమురవెల్లి పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎగుర్ల సాయిబాబు(30) శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పలు చోట్ల వెతికిన కుటుంబ సభ్యులు పొలం దగ్గర నుంచి వచ్చే దారిలో కుంట వద్ద సాయిబాబు బైక్ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా కొమురవెల్లి ఎస్ఐ రాజు, తహసీల్దార్ దిలీప్నాయక్ కుంట వద్దకు వెళ్లి రెస్క్యూ టీం సహాయంతో శవాన్ని బయటకు తీశారు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు దారి పక్కనే ఉన్న కుంటలో పడినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఘటనా స్థలానికి వచ్చి గాలింపు చర్యలను పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతూ యువకుడు.. బెజ్జంకి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సౌజన్య కథనం మేరకు... ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర పర్షరాములు(48) , భార్య, ఇద్దరు కుమారులతో కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈనెల 20న గ్రామం నుంచి మండల కేంద్రానికి బైక్పై సరుకుల కోసం వెళ్తుండగా పంది అడ్డు వచ్చి బైక్ను ఢీకొంది. దీంతో కిందపడ్డ అతడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఈనెల 23న కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై స్వెరోస్, ఎంఆర్పీఎస్, దళిత శక్తి సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు బెజ్జంకి గ్రామ పంచాయతీ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. బహిర్భూమికి వెళ్లి... కౌడిపల్లి(నర్సాపూర్): బహిర్భూమికి వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తునికి గ్రామంలో జరిగింది. శనివారం ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి సత్తయ్యకు ఇద్దరు భార్యలు. పెద్దభార్యకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కొడుకు చాకలి మల్లేశం(28) ఈనెల 28న రాత్రి బహిర్భూమికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులు పలుచోట్లు వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. కాగా శనివారం ఉదయం గ్రామ సమీపంలోని కలీల్సాగర్ చెరువులో మల్లేశం మృతదేహం నీటిపై తేలడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తించి బయటకు తీశారు. ఇదిలా ఉండగా మృతుని అన్న శ్రీనివాస్ సైతం సుమారు ఆరునెలల క్రితం పశువులు మేపేందుకు వెళ్లి ఫిట్స్ రావడంతో చెరువులో మునిగి చనిపోయాడు. ఆరునెలల్లో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
హాస్టల్ విద్యార్థిని అదృశ్యం
నారాయణఖేడ్: విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నారాయణఖేడ్లోని ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్లో ఉంటూ వడ్డూరి సంధ్య (18) పట్టణంలోని నలంద వొకేషనల్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతుంది. ఈనెల 22న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. హాస్టల్ వెల్ఫేర్ అధికారి రజిత పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి కేసు నమోదు చేశారు.చికిత్స కోసం వచ్చి.. సంగారెడ్డి క్రైమ్: చికిత్స నిమిత్తం పట్టణానికి వచ్చిన వృక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... సదాశివపేట మండలం ఏటిగడ్డ సంగ్యం గ్రామానికి చెందిన మంగు పోచయ్య(48) ఫిట్స్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స కోసం సంగారెడ్డి మండలంలోని ఇర్గిపల్లి గ్రామానికి ఈ నెల 29న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి గ్రామా నికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రీడాకారులకు సన్మానం సిద్దిపేటజోన్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక టీటీసీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన క్రీడాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
● కౌన్సెలింగ్ ద్వారా సెర్ప్ సిబ్బంది బదిలీ ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేటరూరల్: సెర్ప్ సిబ్బంది మహిళా సంఘాల బలోపేతానికి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఆదేశాల మేరకు సెర్ప్ సిబ్బందికి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని సెర్ప్ సిబ్బందిని ఎల్ –2, ఎల్ –1, ఎంఎస్ సీసీఎస్ 115 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు అన్ని మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ అందించామన్నారు. ప్రతి మహిళా సంఘం ఒక రిజిస్టర్ పెట్టి ఎక్కడ ఏ ఏ కార్యక్రమాల్లో ఉపయోగించారు? ఎంత ఆదాయం వచ్చింది? అనే విషయాలు నమోదు చేసుకోవాలన్నారు. క్లస్టర్ల వారీగా ప్రజలకు డ్రై డేపై, నీటి నిల్వతో దోమల లార్వా పెరిగి, వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, అదనపు డీఆర్డీఓ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోపాటు క్రీడలూ ముఖ్యం
సంగారెడ్డి జోన్/సంగారెడ్డి: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ఎంతో ముఖ్యమని కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. సంగారెడ్డిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన హాకీపోటీలను ఇద్దరూ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మండల కేంద్రమైన చౌటకూర్లో పర్యటించి గ్రామంలోని బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అన్ని రంగాల్లో ఆడపిల్లలను ప్రోత్సహించాలన్నారు. విద్యార్థి జీవితంలో క్రీడలు ఒక భాగంగా చేసుకోవాలని, క్రమశిక్షణ, మానసిక ఎదుగుదలకు క్రీడలు బలమైన పునాది వేస్తాయన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, యువజన క్రీడా శాఖ జిల్లా అధికారి ఖాసీంబేగ్, ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్, వివిధ క్రీడాకారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో గ్రామపంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్ ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం -
సర్వేలు సరే.. పరిహారం?
పత్తి పంట చేలో నిలిచిన వర్షపునీరునారాయణఖేడ్: ప్రతీ ఏటా కొన్ని పంటలు కోతల సమయాల్లో, మరికొన్ని పంటలు చేతికొచ్చే దశలో అతివృష్టి వర్షాలతో నష్టపోతున్నారు. జిల్లాలో వేలాది ఎకరాలు పంటలు నీటిపాలవుతున్నాయి. పంట నష్టం సంభవించాక అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపిస్తున్నా రైతులకు మాత్రం పరిహారం అందడంలేదు. గత ప్రభుత్వం అవలంభించిన నిర్లక్ష్యాన్నే ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తుండటం రైతులపాలిట శాపంగా మారింది. పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులకు పరిహారం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం ఎంతగానో ఉపయోగపడేది. కానీ, తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు పంట నష్టపరిహారం అందుకోలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో పక్షం రోజుల క్రితం కురిసిన అతివృష్టి వర్షాలకు 2,208 ఎకరాల్లో నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనావేసి ప్రభుత్వానికి నివేదించింది. అయితే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వారం వ్యవధిలోనే మళ్లీ భారీవర్షాలు జిల్లాను ముంచెత్తాయి. దీంతో మరో 3,596 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. పైన పేర్కొన్న దానికంటే అధికంగానే పంట నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు. బీమా లేదు.. ధీమా లేదు ప్రతీ ఏటా వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికారులు సర్వే చేసి నివేదికలు పంపుతున్నారు. గతేడాది సైతం పంపినప్పటికీ ఇంతవరకు పరిహారం అందలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందేవారు. కానీ, పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ ప్రభుత్వం 2018– 19లో పథకాన్ని నిలిపివేయడంతో వర్షాలతో నష్టపోయిన రైతులకు ధీమా లేకుండా పోయింది. గతంలో పత్తికి వాతావరణ ఆధారిత బీమా, వరి, సోయా పంటలకు గ్రామ యూనిట్గా, ఇతర పంటలకు మండలం యూనిట్గా పథకాన్ని అమలు చేశారు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నష్టపోయిన పంటలకు ఈ పథకం ద్వారా పరిహారం అందించేవారు. బీమా ప్రీమియంలో రైతులు 50% చెల్లిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున చెల్లించేది. కానీ, పథకాన్ని కొన్నేళ్లుగా అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫసల్ బీమా పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. వర్షాల వల్ల పంట నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందడం గాలిలో దీపంలానే మారింది. ఫసల్ బీమా ఉంటే రైతులకు ఇలాంటి సమయాల్లో ప్రయోజనకరంగా ఉండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.ఫసల్ బీమా లేక రైతులకు అందని పరిహారం 2018 నుంచి పథకానికి రాష్ట్రం దూరం రాష్ట్రం పరిహారంపైనే ఆశలు అకాల వర్షాలతో నెలలోనే భారీగా పంట నష్టంఏటా నష్టాల పాలవుతున్నాం ప్రభుత్వాలు మారుతున్నా పంటలకు ఫసల్ బీమా చేయకపోవడంతో అకాల, అతివృష్టి వర్షాలకు ఏటా పంటలు నష్ట పోతున్నాం. ప్రభుత్వాలు పంటల బీమా చేయడంలో విఫలం చెందడంతో మాకు ఈ తిప్పలు తప్పడం లేదు. అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే ప్రస్తుతం మేము నష్టపోయిన పెసర, పత్తి, సోయా పంటలకు బీమా పొందే అవకాశం ఉండేది. గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో మాకు నష్టాలు తప్పడం లేదు. – డార్కు బాల్కిషన్, దామర్గిద్దా, కంగ్టి మండలం(రైతు) -
రైతులకు అండగా ఉంటా
సంగారెడ్డి ఎడ్యుకేషన్/సదాశివపేట(సంగారెడ్డి): భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటానని ఎంపీ రఘునందన్రావు స్పష్టం చేశారు. భూమిని కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డి బీజేపీ నాయకులు శుక్రవారం రఘునందన్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘునందన్రావు భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...గతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తొగర్పల్లి రైతుల దగ్గర భూమిని తీసుకుందన్నారు. ఆ రైతులకు పరిహారంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని చెప్పి పదేళ్లు గడిచినా నేటికీ ఇవ్వలేదని చెప్పారు. కొన్ని రోజుల క్రితం వచ్చి కార్పొరేట్ సంస్థకు మాత్రం ప్రభుత్వం వెంటనే భూమిని మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి త్వరలోనే రైతులందరికీ ఇళ్ల స్థలాలిచ్చి న్యాయం చేయాలని లేదంటే రైతులందరితో కలిసి ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇళ్ల స్థలం ఇప్పించేవరకు రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీనిచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి శివ, నాయకులు కిషన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి చదువుకున్న యువత ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా మరో పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. పట్టణంలోని సుభాష్రోడ్డులో నూతన సాయిగణేశ్వస్త్రషాపింగ్ మాల్ను ఆయన ప్రారంభించారు.ఎంపీ రఘునందన్రావు -
పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు
జహీరాబాద్/జహీరాబాద్ టౌన్: వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కె.మాణిక్రావు, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులోని నారింజ ప్రాజెక్టును వారు అధికారులతో కలిసి సందర్శించారు. నారింజ వద్ద నిమజ్జనం కోసం చేయాల్సిన ఏర్పాట్లను అధికారులకు వివరించారు. ప్రాజెక్టు వరకు ఉన్న రోడ్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అంతకుముందు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కె.మాణిక్రావు ఝరాసంగం మండలంలోని బొప్పన్పల్లికి చెందిన సిద్దప్పకు రూ.15 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. జహీరాబాద్ పట్టణంలోని అతిథిలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్రావు -
మార్కండేయ ఆలయాభివృద్ధికి కృషి
సదాశివపేట(సంగారెడ్డి): ఈశ్వర మార్కండేయ ఆలయాభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారం అందిస్తానని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఈశ్వర మార్కండేయ ఆలయ నూతన పాలక మండలి ప్రమాణస్వీకార మహోత్సవానికి శుక్రవారం ఆమె హాజరై మాట్లాడారు. మార్కండేయ మందిరంలో నిర్మలారెడ్డితోపాటు నూతన పాలకమండలి చైర్మన్, సభ్యులు ప్రత్యేక పూజలు చేసి మార్కండేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ ఈఓ రామారావు నూతన పాలకమండలి చైర్మన్గా వెంకన్న, డైరెక్టర్లుగా సి.మాణిక్యం, ఎం.రామకృష్ణ, కె.హరికృష్ణ, ఎం.అనితతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి -
పరిహారం అందేలా కృషి చేస్తా
నారాయణఖేడ్: వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నాగల్గిద్ద మండలం గౌడ్గాం జన్వాడ, మంజీరా నది పరీవాహకంగా గ్రామాల వ్యవసాయ క్షేత్రాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. రైతులు, గ్రామాల ప్రజల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖేడ్లోని శాఖా గ్రంథాలయాన్ని సందర్శించి పాఠకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అధికారులు జరిగిన పంటలు, ఆస్తుల నష్టంను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపించాలని సూచించారు. మనూరు మండలంలోని కమలాపూర్ చెరువు పరిశీలించి చెరువు వద్ద చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశించారు. చెరువు దుస్థితిని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. రెస్క్యూటీం సేవలు సద్వినియోగం చేసుకోండి వర్షాల నేపథ్యంలో సహాయంకోసం టోల్ ఫ్రీ నంబరు 101కు లేదా అగ్నిమాపక కేంద్రానికి సంబంధించి 8712699393, 8712699392 నంబర్లలో సంప్రదించాలన్నారు. రాకపోకల పునరుద్ధరణనారాయణఖేడ్: ఖేడ్– సిర్గాపూర్ మార్గంలో ఖేడ్ మండలంలోని చల్లగిద్ద తండా వద్ద రోడ్డు వర్షాలకు కోతకు గురవ్వడంతో కామారెడ్డి జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించడంతో శుక్రవారం ఉదయం జేసీబీతో మరమ్మతు పనులు చేపట్టి సాయంత్రానికి పూర్తి చేశారు. దీంతో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
జహీరాబాద్ చెక్పోస్టు ఎత్తివేత!
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని 65వ జాతీయ రహదారిపై జహీరాబాద్ వద్ద ఉన్న రవాణ శాఖ చెక్పోస్టును త్వరలో ఎత్తివేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్పోస్టులను ఎత్తివేయనున్నందున అందులోభాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మాడ్గి వద్ద చెక్పోస్టు త్వరలో మూతపడనుంది. చెక్పోస్టులను ఎత్తివేస్తూ రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జహీరాబాద్ చెక్పోస్టు సైతం ఎత్తివేయనున్నారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జహీరాబాద్, కామారెడ్డి, మద్నూర్ రవాణా శాఖ చెక్పోస్టులను ఎత్తివేయనున్నారు. రవాణ సరుకు వాహనాలకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ సరిహద్దు చెక్పోస్టులను ఎత్తివేశారు. ఇంతకు ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్పోస్టుల ఎత్తివేతకు సానుకూలంగా లేనందునే ఎత్తివేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో చెక్పోస్టుల ఎత్తివేతకు మార్గం సుగమం అయింది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రవాణ పర్మిట్లు, ఇతర అనుమతులన్నీ ఆన్లైన్లోనే లభిస్తున్నాయి. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రవాణ శాఖ చెక్పోస్టులు అవసరం లేదని కేంద్రం 2021లో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సరిహద్దు చెక్పోస్టులను ఇప్పటికే తీసివేశారు. మిగతా రాష్ట్రాల్లో చెక్పోస్టుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడ చెక్పోస్టులను తొలగించేందుకు నిర్ణయించారు. ఆయా శాఖల్లో తీరనున్న సిబ్బంది కొరత చెక్పోస్టులను తొలగించడం వల్ల లారీ యజమానులు, ఇతర వాహనాల యజమానులకు ఊరట లభించనుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలు, వాటి పర్మిట్లు చెక్పోస్టుల్లో తనిఖీ చేయించుకోవాలి. పర్మిట్లతోపాటు అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వాహనం చెక్పోస్టు దాటాలన్నా ఎంతో కొంత ముట్టుజెప్పుకోక తప్పదనే అభిప్రాయాలను వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. చెక్పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని ఇతర శాఖలకు మార్చడం ద్వారా ఆయా శాఖల్లో కొంతమేర సిబ్బంది కొరత కూడా తీరనుంది. చెక్పోస్టులను మూసివేయడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ఆర్టీఏ చెక్పోస్టుల ఎత్తివేతకు ప్రభుత్వం నిర్ణయం త్వరలో మూసివేసేందుకు కార్యాచరణ తీరనున్న వాహనదారుల ఇబ్బందులుప్రత్యేక నిఘా పన్నులు ఎగవేసే వాహనాలపై ప్రత్యేక నిఘా వేయనున్నారు. చెక్పోస్టులు పూర్తిగా తొలగించినా వాటి స్థానంలో ఆరు నెలల పాటు మొబైల్ స్క్వాడ్లు పనిచేయనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా వేయనున్నారు. వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగానే వాహనాల నంబర్లను కెమెరాలు స్కాన్ చేస్తాయి. డాక్యుమెంట్ లేని వాహనాలను మాత్రం చెక్పోస్టు వద్ద నిలిపి వేస్తారు. అనంతరం వాటికి ఫైన్ విధించి వదిలిపెడతారు. రెండు మూడు నెలల్లో కెమెరాల బిగింపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
జహీరాబాద్ ఇన్చార్జిఆర్డీఓగా డెవూజా
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఇన్చార్జి ఆర్డీఓగా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి డెవూజా శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఆర్డీఓగా ఉన్న రాంరెడ్డి ధీర్ఘకాలం సెలవుపై వెళ్లగా..ఆయన స్థానంలో డెవూజాను నియమించారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన వరద ప్రాంతాల్లో పర్యటించారు. నారింజ ప్రాజెక్టును సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. సింగూరుకు భారీ వరదఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షపునీరు డ్యామ్లోకి చేరుతోంది. దీంతో 5,6,9,8,10,11 నంబర్ గల ఆరు గేట్లను రెండు మీటర్ల పైకి ఎత్తి దిగువకు 60,920 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా, ప్రాజెక్టులో 19 టీఎంసీల నీటిని ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 53,075 ఇన్ఫ్లో రాగా..ఔట్ఫ్లో 60,920 క్యూసెక్కులని అధికారులు తెలిపారు. -
కదం తొక్కిన కార్మికులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మిక హక్కుల కోసం కాంట్రాక్ట్ కార్మికులు సంగారెడ్డిలో కదం తొక్కారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని, చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సంగారెడ్డిలో కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు లోపలికి వెళ్లేందుకు గేట్లు ఎక్కారు. కార్మికుల సమస్యలపై స్పందించాలని నినాదాలు చేయడంతో కలెక్టరేట్ ఏవో,కార్మిక శాఖ ఏఎల్ఓ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. అనంతరం సీఐటీయూ కాంట్రాక్ట్ వర్కర్స్యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ... నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్నా కార్మికుల కనీస వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రభుత్వాలను హెచ్చరించారు. 15 ఏళ్లకుపైగా కనీస వేతనాలను సవరించకపోవడం దారుణమన్నారు. అర్హులైన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కి ఆందోళన సీఐటీయూ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం -
నల్తూర్లో నవోదయకు 25 ఎకరాలు: అదనపు కలెక్టర్
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం పట్టణ పరిధిలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ మాధురి పర్యటించారు. ఈ సందర్భంగా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని అల్లినగర్ గ్రామం సర్వేనంబర్ 27లో పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో కలిసి జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని నల్తూరు గ్రామంలోనీ సర్వేనంబర్ 159లో నవోదయ పాఠశాల ఏర్పాటుకు 25 ఎకరాలను కేటాయించారు. పరిశీలన రిపోర్టులను కలెక్టర్కు నివేదించనున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభంఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు: పటాన్చెరు పట్టణంలో సుమారు రూ.300 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కార్మికులకు అత్యాధునిక వైద్య చికిత్సలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారన్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో ఈ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. ఉత్తీర్ణత పెంచాలి: డీఈఓ సంగారెడ్డి టౌన్: విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని డీఈవో వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సంగారెడ్డి మండలంలోని కల్పగూర్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు బాగా చదువు కుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వ్యాధులు రాకుండా చర్యలు జిల్లా కార్మిక శాఖ అధికారి రవీందర్రెడ్డి న్యాల్కల్(జహీరాబాద్): ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారి రవీందర్రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు న్యాల్కల్లోని కేజీబీవీ, బీసీ బాలిక వసతి గృహాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహాలకు వచ్చే రోడ్డు అధ్వానంగా ఉందని దానిని బాగుచేయించాలని, నీటి సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరారు. పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలి: టీజీఈ జేఏసీ సంగారెడ్డి ఎడ్యుకేషన్: వచ్చేనెల 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పాటించాలని టీజీఈ జేఏసీ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. అదే రోజు కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనాలని కోరాయి. -
డెంగీతో బాలుడు మృతి
జగదేవ్పూర్(గజ్వేల్): తీవ్ర జ్వరంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అనంతసాగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బొనగిరి కిష్టయ్య, రూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు యశ్వంత్(10) కుకునూర్పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజుల నుంచి అతడు జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అక్కడే ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. జ్వరం తగ్గకపోవడంతో గురువారం గజ్వేల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా గ్రామంలో 15 మంది విష జ్వరాల బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్ గ్రామానికి చేరుకుని బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. -
గడువు తీరిన బీరు విక్రయం
తాగిన వ్యక్తికి అస్వస్థతదుబ్బాకటౌన్: గడువు తీరిన బీరు తాగిన వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా... దుబ్బాకకు చెందిన ఒక వ్యక్తి అంగడి బజార్లోని ఓ వైన్ షాపులో 2 బీర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి ఒకటి తాగడంతో కడుపు వికారంగా మారి, కండ్లు ఎర్రబడ్డాయి. దీంతో మద్యం సీసాలను తనిఖీ చేయగా దానిపై ఉన్న గడువు తేదీ ఈ నెల 13వ తేదీతోనే ముగిసింది. దీంతో వెంటనే బాధితుడు మద్యం దుకాణం యజమానిని నిలదీశాడు. వెంటనే యజమాని బాధితుడికి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించాడు. అనంతరం బాధితుడు మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ప్రస్తుతం బాధితుడు అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాడు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది దుబ్బాకలోని గడువు తీరిన మద్యం అమ్మిన దుకాణంలో తనిఖీ చేశారు. అలాగే పట్టణంలోని 4 మద్యం దుకాణాలను తనిఖీ చేసి, ఆ దుకాణాలపై టెక్నికల్ కేసులు నమోదైనట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న హల్దీవాగు
● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● ధ్వంసమైన కాజ్వే తూప్రాన్: భారీ వర్షాలకు చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని కిష్టాపూర్, గుండ్రెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లాల్సిన ప్రధాన రహదారి హల్దీవాగుపై నిర్మించిన కాజ్వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా కిష్టాపూర్, వెంకటాయిపల్లి, నర్సంపల్లి, గుండ్రెడ్డిపల్లి, గౌడిగుడెం, దాతర్పల్లి, మల్కాపూర్, కోనాయిపల్లి(పీబీ) గ్రామాలతో పాటు ఇతర దౌల్తాబాద్, వర్గల్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు సుమారు 15 కిలోమీటర్ల తిరిగి వెళుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. తూప్రాన్ పెద్ద చెరువు అలుగు నుంచి భారీగా నీరు వెళుతుండటంతో చెరువు కట్టపైకి వెళ్లాల్సిన దారి నీటి ప్రవాహానికి కోతలు ఏర్పడి భారీ గుంతలు ఏర్పడ్డాయి. -
ప్రేమ పెళ్లి వద్దన్నందుకు..
● యువకుడు ఆత్మహత్య ● సిద్దిపేట జిల్లాలో ఘటన చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రేమ పెళ్లి వద్దన్నందుకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఇబ్రహీంనగర్లో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పొన్నాల శివసాయి(19)కి తల్లి ఎల్లవ్వ, సోదరి భవిత ఉన్నారు. తల్లీకొడుకు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. సోదరి నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. తండ్రి మల్లేశం రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా శివసాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పాడు. కూలీ పనులు చేస్తేనే కుటుంబం గడుస్తుందని, ఇప్పుడు పెళ్లి వద్దని, తరుచూ ఫోన్ మాట్లాడవద్దని మందలించింది. దీంతో ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్లో ఉరేసుకున్నాడు. ఇది గమనించిన తల్లి ఇతరుల సాయంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవితంపై విరక్తి చెంది.. బెజ్జంకి(సిద్దిపేట): జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ కథనం మేరకు... ఎల్లంపల్లె గ్రామానికి చెందిన సంగెం చంద్రవ్వ కుమారుడు రాజేందర్(25)తో కలిసి జీవిస్తుంది. శుక్రవారం ఉదయం చక్కెర తెస్తానని వెళ్లాడు. డిగ్రీ పూర్తి చేసిన రాజేందర్ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు రాకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. పెళ్లి సంబంధాలు రావడం లేదు. దీంతో మనస్తాపం చెంది బెజ్జంకి వైకుంఠధామం సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇంటర్ విద్యార్థిని.. హత్నూర( సంగారెడ్డి): క్షణికావేశంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని కొన్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం... పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాల గ్రామానికి చెందిన మిన్పూరి మల్లేశం కూతురు మిన్పురి అనూష అలియాస్ వడ్డేపల్లి అనూష (16) కొన్నేళ్లుగా కొన్యాలలో అమ్మమ్మ వడ్డేపల్లి మల్లమ్మ దగ్గర ఉంటుంది. మండలంలోని గుండ్లమాచ్చునుర్ శివారులోని ఆదర్శ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. రోజు మాదిరిగానే ఆమె శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లడానికి గ్రామంలోని బస్టాండ్ వద్ద నిలుచుంది. అదే సమయంలో అమ్మమ్మ అటువైపు వెళుతూ చేతిలో టిఫిన్ బాక్స్ కనిపించకపోవడంతో మీ నాన్నకు చెబుతానని అనడంతో అనూష తిరిగి ఇంటికి వెళ్లింది. క్షణికావేశంలో ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకుంది. అమ్మమ్మ వచ్చి చూసేసరికి ఉరి వేసుకుని కనిపించడంతో అనూష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జల దిగ్బంధంలో సదాశివనగర్
● ఇబ్బందులు పడుతున్న తండావాసులు ● ఇతర ప్రాంతాలతో సంబంధాలు కట్ ● అత్యవసరమైతే అటవీ ద్వారా కాలినడకే దిక్కు రామాయంపేట(మెదక్): మండలంలోని సదాశివనగర్ తండా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తండాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రెండు వైపులా ఉన్న దారిలో ఐదు చోట్ల రోడ్డు తెగిపోగా, మధ్యలో ఉన్న చెరువు అలుగు పారుతుండటంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు ఇలా.. జాన్సిలింగాపూర్ పంచాయతీ పరిధిలో ఉన్న సదాశివనగర్ తండాలో 25 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మొత్తం జనాభా 180కి ఉంది. ఈ తండాకు ఝాన్సిలింగాపూర్, అక్కన్నపేట ఆర్అండ్బీ రోడ్డు నుంచి అటవీ ప్రాంతం గుండా వేర్వేరుగా రెండు దారులున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి తండాకు నాలుగైదు రోజులపాటు రాకపోకలు స్తంభిస్తాయి. దీంతో ప్రతి ఏటా గిరిజనులకు కాలినడకే శరణ్యంగా మారింది. తాజాగా కురిసిన భారీ వర్షంతో ఎక్కడిక్కడ రోడ్లు తెగిపోయాయి. ఈసారి వరద తీవ్రత అధికంగా ఉండటంతో అక్కన్నపేట వైపు మూడు చోట్ల, ఝాన్సిలింగాపూర్ వైపు రెండు చోట్ల రోడ్డు తెగిపోయింది. తండా సమీపంలో ఉన్న చెరువు అలుగు పారుతుండటంతో వెళ్లడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో గిరిజనులు చెరువు నీటిలోనుంచి, అటవీప్రాంతం గుండా కాలినడకన వస్తున్నారు. తండా రహదారి మరమ్మతు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు విజ్ఞప్తి చేశారు. నీటి పారుదలశాఖ ఏఈ సూర్యకాంత్ చెరువు అలుగును, రోడ్డును పరిశీలించారు. -
తగ్గని వరద.. వీడని వాన
కూలిన ఇల్లు నీట మునిగిన పంటను పరిశీలిస్తున్న రైతులు పాపన్నపేట(మెదక్): వర్షాలతో మంజీరాలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఘనపురం ఆనకట్ట నుంచి శుక్రవారం 59,800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దీంతో ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. 16 రోజులుగా అమ్మవారి ఆలయం భక్తులు వెళ్లడానికి వీలు లేకపోవడంతో, రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని 2450 ఎకరాల వరి పంట నీట మునిగింది. 2935 రైతులు పంటను కోల్పోయారు. అలాగే మండలంలో 29 ఇళ్లు కూలిపోయాయి. ఎల్లాపూర్ బ్రిడ్జిపై, భారాఖానల వద్ద మంజీరా నీటి‘ప్రవాహం తగ్గడంతో, ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో మండల వాసులు మెదక్ వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. ఎమ్మార్వో సతీశ్ ఆధ్వర్యంలో రెవెన్యు సిబ్బంది, రాజ్యాతండా రోడ్డు, కూలిన ఇళ్లను పరిశీలించారు. మండలంలో సుమారు 29 ఇళ్లు కూలిపోయినట్లు తెలిపారు. వ్యవసాయ అధికారి నాగమాధురి మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ముఖ్యంగా మంజీరా తీర ప్రాంతాల్లో పంట ఎక్కువగా మునిగినట్లు తెలిపారు. జలదిగ్బంధంలోనే వన దుర్గమ్మ ఎల్లాపూర్.. భారాఖాన వద్ద రాకపోకలకు సుగమం మండలంలో 2450 ఎకరాల్లో పంట నష్టం కూలిన 29 ఇళ్లు -
పొలానికి వెళ్లాలంటే తిప్పలే..
● 14 కి.మీటర్లు తిరిగి వెళ్లాల్సిందే ● భాగీర్థిపల్లిలో బ్రిడ్జి లేకపోవడంతో రైతుల కు ఇబ్బందులు చిన్నశంకరంపేట(మెదక్): వాగు ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు నీటమునిగాయి. మండలంలోని భాగీర్థిపల్లిలో శుక్రవారం గ్రామ రైతులు వాగు అవతల ఉన్న పంట పొలాలకు వెళ్లలేకపోతున్నామని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాగును దాటలేని పరిస్థితి ఉందని, దీంతో చిన్నశంకరంపేట మీదుగా గవ్వలపల్లి నుంచి జంగరాయి తండా మీదుగా పంట పొలాలకు సుమారు 14 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంద న్నారు. వర్షాలకు పైన ఉన్న చిన్నశంకరంపేట, గవ్వలపల్లి, జంగరాయి, సూరారం గ్రామాల చెరువులు అలుగుపారడంతో బంద్ అయ్యే వరకు తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. తాము పంట పొలాలకు వెళ్లేలా బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సహకరించాలని రైతులు కోరుతున్నారు. -
వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయొద్దు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి పటాన్చెరు టౌన్: విద్యార్థులు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ముందు ఆలోచించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకోవడమే కాకుండా... వ్యక్తిగత డేటాను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా దొంగిలిస్తారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులు ఫేస్ బుక్, వాట్సప్, ఈ–మెయిల్తోపాటు ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని తెలిపారు. అలాగే ఆన్లైన్లో గేమ్స్, యాప్లను డౌన్లోడ్ చేయకూడదని సూచించారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్–4) శైలేష్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాపూర్లో పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని, దీంతో గ్రామంలో ఇద్దరు డెంగీతో మరణించారు. ఈ నేపథ్యంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శైలేష్ సస్పెన్షన్ కావడంతో అనంతసాగర్ కార్యదర్శిని తిమ్మాపూర్కు ఇన్చార్జిగా నియమిస్తూ ఎంపీడీఓ రాంరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హవేళిఘణాపూర్(మెదక్): వినాయక చవితి సందర్భంగా మెదక్ వెళ్లి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఆటోలో వస్తుండగా రాజ్పేట వాగు వద్ద వరద ఉధృతిలో కొట్టుకుపోయిన వారిలో దామరంచ యాదాగౌడ్(38) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మరో వ్యక్తి బెస్త సత్యనారాయణ మృతదేహం గురువారం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు డ్రోన్ కెమెరాలతో వెతకగా ఆటోకు వంద మీటర్ల దూరంలో ఉన్న నీటిలో శవం ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. మృతుడి కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన వారి రెండు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటించారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకొని చేయూతనిస్తామని తెలిపారు. ఆచూకీ కోసం గాలింపు సంగారెడ్డి : పలు ఇబ్బందులతో వ్యక్తి పారుతున్న మంజీరా నదిలో దూకాడు. ఈ ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ మండలంలోని శివంపేట గ్రామానికి చెందిన బదంపేట మల్లేశం గౌడ్ (50) బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పులకల్ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి నది వద్ద గాలింపు చర్యలు చేపట్టేసరికి చీకటి కావడంతో నిలిపివేశారు. తిరిగి శనివారం గాలింపు చర్యలు చేపట్టనున్నారు. మల్లేశం నదిలో దూకే దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయింది. మూడు రోజుల్లో 28 కాల్స్ మాత్రమే.. మెదక్ కలెక్టరేట్: వరదల నుంచి తక్షణ సాయం అందించేందుకు మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్రూంను ప్రజలు అంతంత మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 సెంటి మీటర్ల వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు, కట్టలు తెగిపోయి, వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లాయి. అయితే గురువారం రాత్రి మెదక్ మండలంలోని గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన మహేశ్ తన భార్య గర్భిణి కావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫోన్ చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ లక్ష్మణ్బాబు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కంట్రోల్రూంకు పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల నుంచి కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
టెండర్ల ద్వారా మల్లన్నకు రూ.3.43కోట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం అంతకంతకూ పెరుగుతోంది. అదే రీతిలో ఆలయంలో నిర్వహించే పలు అంశాలకు సంబంధించి నిర్వహించే బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లు, ఆన్లైన్ టెండర్ల ద్వారా స్వామి వారికి ఆదాయం సమకూరింది. ఇటీవల ఈ సంవత్సరానికి టెండర్లు నిర్వహించారు. ఆలయంలో కొబ్బరి ముక్కల సేకరణ ద్వారా రూ.71,77,777, ఒడిబియ్యం, వస్త్రాలు, పసుపు సేకరణ ద్వారా రూ.70. 56లక్షలు, చెప్పుల స్టాండ్ ద్వారా రూ.15 లక్షలు, కొబ్బరికాయల విక్రయం ద్వారా రూ.45లక్షల 50వేల 115, ఎల్లమ్మ ఆలయం ఒడిబియ్యం సేకరణ ద్వారా రూ.18.30 లక్షల ఆదాయం వచ్చింది. కోరమీసాల ద్వారా రూ.16.61లక్షలు, తలనీలాల ద్వారా రూ.1,01, 01,116, సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ ద్వారా రూ.4.71వేలు రాగా మొత్తం రూ.3కోట్ల 43లక్షల 47,009 ఆదాయం సమకూరింది. గతేడాది టెండర్ల ద్వారా రూ.2లక్షల 44వేల 28వేలు సమకూరింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రూ.99లక్షల 19,009 అధిక ఆదాయం వచ్చింది. పెరిగిన ఆదాయంతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. గతేడాది కంటే రూ.99 లక్షలు అధికం -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ పి.ప్రావీణ్యసంగారెడ్డి, సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో కురిసిన వర్షాలపట్ల అన్ని శాఖలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట, ఎర్రగుంట, మాసానుకుంట చెరువులను కలెక్టర్ సందర్శించారు. రేణిగుంట చెరువులో ఏర్పడిన గండిని పరిశీలించిన కలెక్టర్ తక్షణ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగులు, చెరువులు, కుంటల వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. జిల్లాలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం 08455–276155 నంబర్కు కాల్చేయవచ్చని చెప్పారు. ఇంటింటా జ్వర సర్వేలు నిర్వహించాలని ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సత్వర చికిత్సలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్రెడ్డి, సంగారెడ్డి తహసీల్దార్ జయరామ్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలపై శ్రద్ధపాఠశాలలో మౌలిక వసతుల సదుపాయాలలో భాగంగా విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు తదితర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. -
ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలి
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్సదాశివపేట(సంగారెడ్డి): వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ఉభచెరువును పోలీసు, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి గురువారం సందర్శించి అక్కడ చేపట్టనున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ధేశిత సమయంలోనే నిమజ్జనం చేసేలా చూడాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కురుస్తున్న వర్షాలకు ఉభచెరువు కట్టరోడ్డుపై ఇతర రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీస్పీ సత్తయ్యగౌడ్, సీఐ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ శివాజీ, తహసీల్దార్ సరస్వతి, ఇంజీర్ రాజేష్ పాల్గొన్నారు. -
తెలుగుభాషపై ఉన్న పట్టు ఇతర భాషలపై ఉండదు
ఎన్ని భాషలు నేర్చుకున్న మన తెలుగుభాష మీద ఉన్న ప్రావీణ్యం ఎందులో ఉండదు. తెలుగుభాషపై ఉన్న పట్టు ఇతర భాషలపై ఉండదు. రాష్ట్రంలోనే సిద్దిపేటకు ప్రత్యేక స్థానం ఉంది. అన్ని రంగాల్లో ముందు ఉన్న సిద్దిపేట తెలుగుభాష అభివృద్ధిలోను ముందుంటుంది. జిల్లాలో అనేక సంఘాలు, సంస్థలు ఈ తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. –కథల తాతయ్య ఎన్నవెళ్లి రాజమౌళి, ప్రముఖ కవి, సిద్దిపేట తెలుగు భాషను మించినది లేదు కన్నతల్లి ప్రేమ, పుట్టి పెరిగిన ఊరు, తెలుగుభాషపై మమకారం తీరనిది. ఎన్ని భాషలు వచ్చిన, ఎన్ని ప్రాంతాలకు వెళ్లిన మన ప్రాంతం, మన తెలుగు భాషపై పట్టు ఉంటుంది. చిన్న పిల్లలు కూడా తమ అభిప్రాయాలను కేవలం తెలుగుభాషలో మాత్రమే వ్యక్తం చేస్తారు. జిల్లాలో తెలుగు సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలతో నిత్యం తెలుగుభాష పరిరక్షణకు అందరం తోడ్పాడుతున్నాం. –ఉండ్రాళ్ల రాజేశం, బాలసాహితీవేత్త, సిద్దిపేట -
వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.భార్యకూతురు.. పటాన్చెరు టౌన్: భార్య,కూతురు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగికి చెందిన రమేష్ చెత్త బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రమేష్ భార్య సంగీతకు ఇటీవల ఆపరేషన్ కావడంతో గుల్బర్గాలో ఉండే తల్లిగారి ఇంటికి కూతురు నమనీ(2)ని తీసుకొని వెళ్లింది. తిరిగి ఈనెల 20న తిరిగి ముత్తంగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 24న రమేష్ పనికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి భార్య సంగీత, కూతురు నమనీ కనిపించలేదు. రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త... బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గాగిళ్లాపూర్కు చెందిన రాగి రాజేశం(45) అదృశ్యమైనట్లు ఎస్ఐ సౌజన్య తెలిపారు. ఈ నెల 27న తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో రాజేశం కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు మిిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సౌజన్య తెలిపారు. కాగా, రాజేశం మద్యం తాగే విషయంలో భార్యతో ఘర్షణ చోటుచేసుకుందని, ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో పసుపు చొక్కా వేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తి...పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలం పరిధి రామేశ్వరంబండకు చెందిన సాయిలు ఈ నెల 26న భార్య స్వప్నతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో భర్త కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది. -
2న తుది ఓటరు జాబితా
సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ను జారీ చేయగా వార్డుల వారీగా కొత్త ఓటరు జాబితాను తయారు చేశారు.ముసాయిదా ఓటరు జాబితాజిల్లాలోని గ్రామ పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన జాబితాను సిద్ధం చేసి వార్డుల వారీగా గురువారం ప్రచురించారు. 29న జిల్లాస్థాయిలో, 30న మండలస్థాయిలో మండల అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులతో ఓటరు జాబితాపై సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముసాయిదా జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే 28 నుంచి 30 వరకు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వీకరించిన అభ్యంతరాలు 31న పరిష్కరించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధం చేసిన తుది ఓటరు జాబితాను వార్డులు పంచాయతీల వారీగా సెప్టెంబరు 2న విడుదల చేయనున్నారు.కొనసాగుతున్న ప్రత్యేక పాలన2024 సంవత్సరం జనవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అనంతరం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పట్నుంచీ గ్రామాల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. అందులోభాగంగా మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పంచాయతీ పాలన కొనసాగిస్తున్నారు.తగ్గిన గ్రామ పంచాయతీలు, వార్డులుజిల్లాలో పలు మండలాలతోపాటు గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో విలీనం చేయడంతో గతంలోకంటే జీపీలు, వార్డుల సంఖ్య తగ్గింది. త్వరలో మరిన్ని పంచాయతీలు తగ్గనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలో 613 గ్రామపంచాయతీలున్నాయి. అందులో 5,370 వార్డులు ఉండగా 5,542 పోలింగ్ స్టేషన్లున్నాయి. జిల్లావ్యాప్తంగా 7,44,297 మంది ఓటర్లు ఉన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకురాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల వారీగా కొత్తగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమైన తేదీల వారీగా సమావేశాలు నిర్వహించి, తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. –సాయిబాబా, జిల్లా పంచాయతి అధికారి, సంగారెడ్డి -
పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
జిల్లాలో సహాయకచర్యల ను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పర్యటించి బాధితులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. రాసోల్ గ్రామానికి వెళ్లే స్వాములవాగు వంతెన వద్ద నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరిశీలించారు. జహీరాబాద్ పట్టణంలోని వరద ముంపునకు గురైన కాలనీలను, నారింజ ప్రాజెక్టును ఎమ్మెల్యే కె.మాణిక్రావు సందర్శించారు. కల్హేర్–పిట్లం మధ్యలో మహరాజ్ వాగు, మీర్ఖాన్పేట్ వద్ద ప్రవహిస్తున్న వాగును ఖేడ్ మండలం కాంజీపూర్, మాద్వార్ వంతెనలతోపాటు నిజాంపేట్ మండలం శాకాపూర్ చెరువు ఉధృతిని, జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, సబ్కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. -
నాటి పోరాట ఫలితమే ఉచిత విద్యుత్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములుసంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపడతామని, నాటి విద్యుత్ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కారాములు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్కిషన్భవన్లో విద్యుత్ అమరవీరుల 25వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పోరాట మృతవీరులు విష్ణువర్ధన్రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ..2000లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవలంబించిన ప్రజావ్యతిరేక విధానాలు, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉధృతమైన ఉద్యమాలు జరిగాయన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణకు, పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు. పాలక ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఆగస్టు 28న బషీర్బాగ్ వద్ద ముగ్గురు అమరులను దుర్మార్గంగా కాల్చి చంపిందన్నారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దారుణంగా ఓడించారని గుర్తు చేశారు. దీంతో నేటీకీ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, కృష్ణ, నాయకులు అశోక్, రాజయ్య, శివకుమార్, బాలరాజు, ప్రవీణ్, విఠల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
లేఖారచనలో జాతీయస్థాయి విజేతగా రిబ్క
సిద్దిపేటఎడ్యుకేషన్: ‘యువత సామాజిక మాధ్యమాల ప్రభావం’అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి లేఖారచన పోటీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని తిప్పనబోయిన రిబ్క విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా గురువారం ఆమెను కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యారెడ్డి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా తెలుగుశాఖ, భాషాసాంస్కృతిక విభాగం అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్కుమార్రెడ్డి మాట్లాడుతూ వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం డీఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ పోటీలు జరిగాయన్నారు. విద్యార్థిని రిబ్బ త్వరలో నగదు పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకోనున్నట్టు చె ప్పారు. కార్యక్రమంలో తెలుగువిభాగం అధ్యాపకుడు పిట్లదాసు, వెంకటరమణ, శైలజ, సాయిసురేశ్, నరేశ్, రామస్వామి పాల్గొన్నారు. దౌల్తాబాద్(దుబ్బాక): మండల పరిధిలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఆ పాఠశాల హెచ్ఎం వెంకట్రెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. ‘తల్లి దండ్రులను సులభంగా పాల్గొనేలా చేయొచ్చు’అనే అంశంపై పాఠశాల ఉపాధ్యాయుడు బి.రవి రాసిన కథనాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ప్రచురించిన ‘ట్రైల్ బ్లేజర్స్’అనే పుస్తకంలో ప్రచురించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తోటి ఉపాధ్యాయులు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీనివాస్, షెహనా బేగంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, దాతల సహకారం పాఠశాలలో నిర్వహించిన వినూత్న కార్యక్రమాలే పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడానికి తోడ్పడ్డాయన్నారు. ఇసుక లారీ సీజ్చిన్నకోడూరు(సిద్దిపేట): అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీని సీజ్ చేసినట్లు ఎస్ఐ సైఫ్ అలీ తెలిపారు. రాజీవ్ రహదారిపై చర్లఅంకిరెడ్డిపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకుని డ్రైవర్ శ్రీనివాస్ను విచారించారు. కరీంనగర్ జిల్లాలోని మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తేలింది. దీంతో లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి, ఇసుక లారీని సీజ్ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సదాశివపేటరూరల్(సంగారెడ్డి): విద్యుదాఘాతానికి గురై రెండు ఆవులు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ఆరూర్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాములు రోజులాగానే శివారులో ఆవులను మేతకు వదిలాడు. ఈ క్రమంలో అవి మేత మేస్తూ అక్కడ వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఆవుల విలువ రూ.1.40 లక్షలు ఉంటు ందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న వెటర్న రీ అధికారులు పంచనామా నిర్వహించారు. ఐదుగురికి గాయాలు వట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లిలో పిచ్చి కుక్క వీర విహారం చేసింది. ఐదుగురికి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సంతోష, ఎలీషా, కార్తీక్, దస్తగీర్, ప్రశాంత్లపై కుక్క దాడి చేసింది. గాయాలైన వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గ్రామంలో కుక్కల సంచారం పెరిగిందని, అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. సిద్దిపేటజోన్: మున్సిపల్కు చెందిన అధికారిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. సిద్దిపేట మున్సిపాలిటీలో యూడిఆర్ఐగా పనిచేస్తున్న బాలకృష్ణ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్టు వి చారణలో తేలింది. ఈ మేరకు బాలకృష్ణను తిరి గి జూనియర్ అసిస్టెంట్గా డిమోషన్ చేసి తూప్రాన్ మున్సిపాలిటీకి బదిలీ చేస్తూ వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ ఉత్తర్వులు జారీ చేశారు. విషయాన్ని గురువారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ధ్రువీకరించారు. -
గణనాథుడి సన్నిధిలో యాదాద్రి కలెక్టర్
పటాన్చెరు టౌన్: వినాయక చవితి పురస్కరించుకుని పటాన్చెరు మండలం పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలో గణేశ్గడ్డ దేవస్థానంలో గణేశుడిని బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేసి, కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోశ్ జోషి,జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్ ,అయ్యప్ప ,సతీష్,ఆలయ ఈవో లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలికలెక్టర్కు టీజీఈజేసీ వినతి సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీజీఈజేసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్కు ఆ సంఘం నాయకులు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జావెద్ అలీ మాట్లాడుతూ...పెన్షన్ విధానంలో వచ్చిన మార్పులు ఉద్యోగుల భవిష్యత్ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. సెప్టెంబర్ 1న నిర్వహించతలపెట్టిన పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీజీ జేఏసీ కార్యదర్శి వైద్యనాథ్, కో చైర్మన్ గంగాధర్ టీఎన్జీవోస్ నాయకులు రవి పాల్గొన్నారు. గండ్లను పూడ్చటంలో కాలయాపనమాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పుల్కల్(అందోల్): సింగూరు పంట కాలువలకు గండ్లు పడి పక్షం రోజులైనా పూడ్చకపోవడం పట్ల అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాలకుల తీరును విమర్శించారు. పక్షం రోజుల క్రితం ఇసోజిపేట వద్ద, బస్వాపూర్ వద్ద సింగూరు పంట కాలువకు గండ్లు పడితే స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహా అట్టహాసంగా ట్రాక్టర్పై వెళ్లి గండ్లను పరిశీలించారు. పరిశీలించిన గండ్లను పూడ్చకుండా కాలయాపన చేస్తే ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గండ్లు పడటం వల్ల కాలువ లిఫ్టులను మూసివేశారని, ఆయకట్టుకు సింగూరు నీటిని నెల రోజులు తర్వాత వదలటంతో రైతులు ఆలస్యంగా నాట్లు వేశారని తెలిపారు. వర్షాలతో ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే మంత్రి దామోదర పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉపకారవేతనాలు విడుదల చేయాలిగణనాథుడికి వినతి పత్రం సంగారెడ్డి ఎడ్యుకేషన్: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ ఆకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో వినాయకుడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆకాష్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు చెల్లించవలసిన రూ.8,500 కోట్ల స్కాలర్షిప్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే బుద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాదించాలని వినాయకునికి ప్రార్థించినట్లు తెలిపారు. -
పిల్లలను పోషించలేక..
● చెరువులో దూకి మహిళ ఆత్మహత్య ● పండగ పూట విషాదంమనోహరాబాద్(తూప్రాన్): చనిపోయిన భర్త జ్ఞాపకాలు మరవలేక, ఇటు పిల్లలను సాకలేక మనస్తాపం చెందిన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని రంగాయపల్లికి చెందిన జంగం రజిత(33) భర్త నాగేష్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి భార్యకు కూతురు కూడా వీరి దగ్గరే ఉంటుంది. ముగ్గురు పిల్లలతో కలసి సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో ఒక్కసారిగా పిడుగులాంటి వార్త కుదుపేసింది. రెండేళ్ల క్రితం భర్త గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి పిల్లలను పోషించలేక, ఆర్థిక సమస్యలు భరించలేక బుధవారం వినాయక చవితి రోజు ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మామ జంగం నర్సింలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం చెరువులో శవమై తేలింది. మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల తీర్చలేక వ్యక్తి.. పటాన్చెరు టౌన్: అప్పుల బాధలు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీకి చెందిన గుర్రం జాకబ్ (43) పటాన్చెరు మండలం రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇటీవల బంధువుల దగ్గర అప్పులు తీసుకున్నాడు. 15 రోజులుగా పనికి వెళ్లకుండా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి అల్లుడు విక్రంకు లోకేషన్ పంపాడు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం అక్కడికి వెళ్లగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
తేనెలొలుకు తెలుగు... పరిమళించు పలుకు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అమ్మ ఒడి నుంచి నేర్చిన మాటలు తేనె లొలుకు తెలుగు భాష. తెలుగు భాషలో ఎక్కడ మాట్లాడినా మన తెలుగోడికి మధురానుభుతిని కల్గిస్తాయి. ఎల్లభాషలలో మాతృభాష పరిమళం నయనానందం. మనం ఎక్కడ ఉన్న మన భాష, మనం మాట్లాడే మాటల్లో వ్యక్తం అవుతుంది. తెలుగులో మాట్లాడే విధంగా ఇతర భాషలో మాత్రం అంత స్పష్టంగా మాట్లాడలేము. తెలుగు అనేది కేవలం భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించే భాష మాత్రమే కాదు, యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన భాష. మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం తెలుగు భాష. ప్రపంచంలో అధికులు మాట్లాడే భాషల్లో మన తెలుగుభాషకు ప్రత్యేక స్థానం ఉంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్న అక్కడ మన తెలుగు వర్థిల్లుతుంది. అక్కడి భాష ఏదైనా మన తెలుగువారు కలుసుకున్నపుడు మాత్రం తెలుగులోనే మాట్లాడుతూ.. తెలుగును మరింత వ్యాప్తి చేయడం సంతోషించదగిన విషయం. శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జిల్లాలో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు, సంఘాలు, వ్యక్తులపై సాక్షి పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం. తేనేలేను తెలుగు లోగిళ్లలో వికాస తరంగం. నిత్యం సాహిత్య పూదోటగా వికాసానికి తోడ్పడుతున్న మాగాణి. సాహిత్య సంపదకు నిలయమైన సిద్దిపేట జిల్లాలో అనేక సంఘాలు, సాహితీ సంస్థలు ముందుంటాయి. ముఖ్యంగా మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, వెన్నెల సాహిత్య సంఘం, తెలంగాణ రచయితల వేదిక, సిద్దిపేట రచయితల సంఘం తదితర సంఘాలు, సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, సమావేశాలు, సాహిత్య గోష్టిలతో తెలుగు వెలుగులు నింపుతున్నాయి. శతాధిక కవులున్న సిద్దిపేటలో కవిత, పద్యం, కథ, మణిపూసలు, గేయాలు, వ్యాసాలు తదితర ప్రక్రియలలో తమదైన శైలిలో రచనలు చేయడంతో పాటుగా, పుస్తకాలు ముద్రిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నారు. సృష్టమైన తెలుగులో అక్షరబద్ధమైన రచనలతో చైతన్యం నింపుతూ తాము రచనలు చేయడంతో పాటుగా బాలలచే రచనలు చేయిస్తున్నారు. బాలకవులను తయారు చేస్తున్నారు. తెలుగుభాష పరిమళం సిద్దిపేట ఒడిలో ఓలలాడుతూ పలు భాషల ప్రక్రియల పట్ల అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్న రచయితల స్ఫూర్తి అభినందనీయం. ఇలాగే సాహితీ క్షేత్రంగా సిద్దిపేట భావితరాలకు తెలుగుభాష మాధుర్యాన్ని పంచుతూ ముందుకు సాగుతుంది. -
కబ్జా చేస్తే ఇలాగే ఉంటుంది
రామాయంపేట/నిజాంపేట(మెదక్)/ చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జాతీయ రహదారిపై నందిగామ వద్ద కొత్త వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తామని ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం రామాయంపేట, నిజాంపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అనంతరం గురుకులంలో షెల్టర్ పొందుతున్న డిగ్రీ విద్యార్థినులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. చెరువులు, కుంటలను కబ్జా చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇకనైనా కబ్జాలను మానుకోకపోతే ప్రకృతి ప్రకోపాన్ని చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్ధితులు ఎదురైనప్పుడు యువత ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సూచించారు.జాతీయ రహదారి మరమ్మతులు చేపట్టాలిజాతీయ రహదారిని వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీ రఘునందన్రావు కోరారు. గురువారం నార్సింగి జాతీయ రహదారిని పరిశీలించారు. జాతీయ రహదారి అధికారులతో మాట్లాడారు. వరద ఉధృతితో ఇసుక మేటలు వేసిన పంట పొలాలను పరిశీలించారు. జాతీయ రహదారిపై వరద రాకకు కారణం అన్వేషించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదాల నివారణకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం, బీజేపీ కార్యకర్తలు స్పందించడంపై అభినందించారు.విద్యుత్ను పునరుద్ధరించండిహవేళిఘణాపూర్(మెదక్): వరద ముప్పు తప్పిందని, తమ తండాకు విద్యుత్ పునరుద్ధరించేలా చూడాలని మండల పరిధిలోని దూప్సింగ్ తండావాసులు ఎంపీ రఘునందన్రావుతో ఫోన్లో మొర పెట్టుకున్నారు. రాజ్పేట వంతెన సందర్శించిన అనంతరం అక్కడి నుంచి తండావాసులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. వరద ముప్పు ఏమీ లేదని, కరెంటు సరఫరా లేకపోవడంతో తాగునీటి, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు ఎంపీ బదులిస్తూ.. ప్రస్తు తం స్తంభాలు కూలిపోయి కరెంటు సరఫరా లేనందున ప్రత్యామ్నాయంగా కామారెడ్డి జిల్లా నుంచి విద్యుత్ సరఫరా చేసే విధంగా చూస్తామని హామీనిచ్చారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా నాయకులు శ్రీపాల్, ఎంఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కేసుకు సంబంధించి గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాలు వెల్లడించారు. వర్గల్ శివారులో కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపిస్తున్న వేలూరుకు చెందిన అరిగె ఆంజనేయులు(22), తూప్రాన్కు చెందిన తుమ్మల ప్రశాంత్ (20), మామిడి నికిత్ రెడ్డి(19)లను అదుపులోకి తీసుకున్నారు. వారి బైక్ కవర్లో ఉన్న 93 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నాందేడ్ పట్టణానికి చెందిన విజయ్ బాలేరావ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి వేలూరు, వర్గల్ తదితర ప్రాంతాల్లో లేబర్, యువకులకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో అధికారికి గాయాలు
పరామర్శించిన మంత్రి తుమ్మలగజ్వేల్: రోడ్డు ప్రమాదంలో అధికారి గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నర్మెటలో ఉన్న ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీలో సమావేశానికి మంగళవారం ఆయిల్ఫెడ్ అధికారి ప్రశాంత్కుమార్ వెళుతున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గజ్వేల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమావేశంలో పాల్గొనేందుకు సిరిసిల్ల వైపు నుంచి వస్తున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రశాంత్కుమార్కు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాద ఘటనతో సమావేశం వాయిదా పడింది. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
పది రోజుల తర్వాత శవం లభ్యం కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నదిలో గల్లంతై పది రోజుల తర్వాత శవమై తేలాడు. ఈ ఘటన మండలంలోని ఎరగ్రండ్ల గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఏషబోయిన దుర్గేశ్(38) ఈనెల 17న గ్రామ శివారులో ప్రవహిస్తున్న మంజీరా నదిలోకి చేపల కోసం వెళ్లాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నదిలో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఎగువ నుంచి నది నీటి ప్రవాహం తగ్గడంతో కోనాపూర్ గ్రామ రైతులు నది వైపు వెళ్లారు. వారికి నదిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించి దుర్గేశ్గా నిర్ధారించారు. మృతుని భార్య శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య
జగదేవ్పూర్(గజ్వేల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రమైన జగదేవ్పూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... జగదేవ్పూర్కు చెందిన ఎర్ర రామవ్వ(60)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లున్నారు. రామవ్వ భర్త మైసయ్య నాలుగేళ్ల క్రితం మృతి చెందగా అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తుంది. కొంతకాలంగా కడుపునొప్పి, ఫిట్స్తో బాధపడుతున్న రామవ్వ సోమవారం సాయంత్రం తన గదిలో దూలానికి ఉరివేసుకుంది. మంగళవారం ఉదయం ఆమె కొడుకు సత్యనారాయణ గది తలుపులను పగులగొట్టి చూడగా ఉరివేసుకొని చనిపోయి కనిపించింది. పురుగుల మందు తాగి వృద్ధుడు.. జగదేవ్పూర్(గజ్వేల్): వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాడబోయిన మల్లయ్య(80)కు వివాహం కాకపోవడంతో అతని బాగోగులను తమ్ముడి కొడుకులు చూసుకుంటున్నారు. మండల కేంద్రంలో తిరుగుతూ సాయంత్రానికి ఇంటికి చేరుకునే మల్లయ్య సోమవారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. మంగళవారం ఉదయం జగదేవ్పూర్ మార్కెట్లో పురుగుల మందు తాగి వ్యక్తి చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణ చేపట్టిన పోలీసులు మల్లయ్య మృతదేహంగా గుర్తించి గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. -
కరెంట్ సమస్యలకు చెక్
మెదక్ కలెక్టరేట్: ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే వానతోపాటు ఈదురు గాలుల కారణంగా అనేక విద్యుత్ సమస్యలు వచ్చేవి. దీంతో ఆ సమస్యలను పరిష్కరించాలంటే రోజుల సమయం పడుతుంది. లైన్మెన్లు, అధికారులు వెతికి వెతికి సమస్యను గుర్తించాల్సి వచ్చేది. ప్రస్తుతం వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంగా విద్యుత్ శాఖ సాంకేతిక ఒరవడిపై దృష్టి పెట్టింది. రైతులు, ప్రజలు, వ్యాపారులు, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా సాంకేతిక పరమైన ఎఫ్ఓఎంఎస్ యూనిట్లను తీసుకొచ్చింది. వీటితో ఎక్కడైన విద్యుత్ సమస్య ఏర్పడితే క్షణాల్లో స్పాట్ను గుర్తించి సమస్యను పరిష్కరిస్తారు. జిల్లాలోని పలు ఫీడర్లకు ఎఫ్ఓఎంఎస్ (ఫీడర్ ఔట్ మేనేజ్మెంట్ సిస్టమ్)లను అమర్చారు. క్షణాల్లో పరిష్కారం జిల్లాలో 33, 11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు మొత్తం 127 ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న 477 ఫీడర్లకు ఎఫ్ఓఎంఎస్లు ఏర్పాటు చేశారు. ఒక్కో ఎఫ్ఓఎంఎస్ 65 విద్యుత్ స్తంభాల పరిధిలో పనిచేస్తుంది. దీని గురించి తెలుసుకునేందుకు జిల్లాలోని అన్ని విద్యుత్ స్తంభాలకు నంబర్లు వేశారు. ఎక్కడ సమస్య వచ్చినా నిమిషాల్లో సమాచారం వస్తుంది. ఫలితంగా విద్యుత్ సిబ్బంది సమస్యను వెతకాల్సిన ఇబ్బందులు తగ్గుతాయి. నాణ్యమైన విద్యుత్ అందిస్తాం జిల్లాలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖలో సాంకేతిక ఒరవడిని తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా ఎఫ్ఓఎంఎస్లు బిగించాం. దీంతో చాలా వరకు విద్యుత్ సమస్యలు క్షణాల్లో పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. – నారాయణ నాయక్, విద్యుత్శాఖ ఎస్ఈ, మెదక్ విద్యుత్లో సాంకేతిక ఒరవడి ఎఫ్ఓఎంఎస్ల పనితీరు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ జిల్లాలోని పలు ఫీడర్లకు ఎఫ్ఓఎంఎస్లను ఏర్పాటు చేసింది. ఎక్కడైన విద్యుత్త్ సమస్య ఏర్పడితే క్షణాల్లో గుర్తించేందుకు ఇవి పనిచేస్తాయి. ఎఫ్ఓఎంఎస్ యూనిట్కు మూడు ఇండికేటర్లు ఉంటాయి. విద్యుత్ ఫీడర్లకు మూడు విద్యుత్లైన్లను ఇవి కవర్ చేస్తాయి. ఏ లైన్లో విద్యుత్ సమస్య ఏర్పడితే ఆ లైన్ ఇండికేటర్ వెలుగుతుంది. వీటిలో సిమ్కార్డు ఉండటం వల్ల సమస్య ఏర్పడిన లొకేషన్తో స్థానికంగా ఉండే లైన్మెన్కు ఏఈ, ఏడీఈల సెల్ఫోన్లకు సమాచారం పంపిస్తుంది. వీటి ద్వారా విద్యుత్ సమస్య ఏర్పడితే సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అధికారులు తక్షణం స్పందించి అక్కడికి చేరుకుని పరిష్కరిస్తారు. ఫలితంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఽఅధికారులు క్షణాల్లో స్పందించి సమస్య పరిష్కరించడంతో విద్యుత్ ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి. -
భుజిరంపేటలో రాతి గణపతి
వినాయక చవితితోపాటు ప్రతినెల సంకట చతుర్థి రోజు పూజలుకౌడిపల్లి(నర్సాపూర్): మండల పరిధిలోని భుజిరంపేటలో వినాయకుని ఆలయంలోని రాతి గణపతి ప్రతి నెల భక్తుల పూజలందుకుంటుంది. గ్రామంలోని చెరువు అలుగు వద్ద గల సుమారు 75 ఏళ్ల నాటి రాతి గణపతి ఉండగా రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి భుజిరంపేటలో శ్రీకృష్ణాశ్రమానికి వచ్చినప్పుడు విగ్రహాన్ని పరిశీలించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన సూచన మేరకు గ్రామస్తులు 2015లో అక్కడే ఆలయం నిర్మించి అందులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి గ్రామ పురోహితుడు జోషి గోపాలశర్మ, గ్రామస్తులు ప్రతినెల సంకట చతుర్థి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, వివిధ గ్రామాలవారు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. -
పర్యావరణ హితం.. మట్టి వినాయకులు
నాలుగు తరాలుగా తయారీలో బ్రహ్మచారి కుటుంబంకౌడిపల్లి(నర్సాపూర్): మట్టి వినాయకులను నాలుగు తరాలుగా మండల కేంద్రానికి చెందిన అవుసలి బ్రహ్మచారి కుటుంబం తయారు చేస్తోంది. గ్రామానికి చెందిన బ్రహ్మచారి తాత ముత్తాతల నుండి వినాయకులను తయారు చేస్తుండగా నేడు అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. చెరువు మట్టిని తీసుకువచ్చి వినాయకుడు, ఆవు, ఎడ్లు, బండి తయారు చేస్తారు. గతంతో తయారు చేసిన మట్టి గణపతులను గ్రామస్తులకు ఇచ్చేవారు. కాగా ప్రస్తుతం రూ.50 వరకు అమ్ముతున్నారు. ఆనవాయితీ, నైపుణ్యాన్ని పడగొట్టవద్దనే ఉద్దేశంతో పండగకు రెండు రోజుల ముందు నుంచి తయారు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో మట్టి వినాయకులు మాత్రం ఉండేవని ప్రస్తుతం రసాయనాలతో తయారు చేసిన వాటిని పూజిస్తున్నారని పేర్కొన్నారు. అవి పర్యావరణానికి హానీ చేస్తాయని తెలిపారు. అయినప్పటికీ మట్టి వినాయకులను ప్రత్యేకంగా తన వద్దకు వచ్చి తీసుకువెళ్లేవారు ఉన్నారని చెప్పారు. అందరూ పర్యావరణ హిత మట్టి గణనాథులను పూజించాలని సూచించారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగి
మద్దూరు(హుస్నాబాద్): లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఉపాధి హామి కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... జాతీయ ఉపాధిహామి పథకం కార్యాలయంలో ఈజీఎస్లో ఈసీ (ఇంజనీరింగ్ కన్సెల్టెంట్)గా పని చేస్తున్న బండకింది పరశురాములు తన కింది ఉద్యోగి వద్ద ఫైళ్ల చెక్, కొలతల ధృవీకరణ, బిల్లు ఆమోదం కోసం ఉన్నతాధికారులకు ఫైల్ను పంపేందుకు లంచం డిమాండ్ చేశాడు. అంత నగదును ఇవ్వలేనని తగ్గించాలని అతడు బ్రతిమిలాడినా వినలేదు. దీంతో సదరు ఉద్యోగి ఈనెల 20న అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం ఉద్యోగి నుంచి పరశురాములు రూ.11,500 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. నగదును స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని అదనపు స్పెషల్ జడ్జి, ఏసీబీ ఎదుట హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఉపాధి హామి కార్యాలయంతోపాటు పరశురాములు స్వగ్రామమైన చేర్యాల మండలం శభాష్గూడెంలోని అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కాగా నిందితుడికి ఈనెల 15న ఉత్తమ అవార్డు రావడం గమనార్హం. -
మార్కెట్కు ‘మొక్కజొన్న’
● పచ్చి కంకులు అమ్మడానికి రైతుల ఆసక్తి ● జోరుగా కొనుగోళ్లుజహీరాబాద్ టౌన్: సీజన్ కావడంతో జహీరాబాద్ మార్కెట్కు మక్క కంకులను రైతులు తీసుకొస్తున్నా రు. వర్షాలు కురుస్తున్నందున మొక్కజొన్న రైతులు పచ్చి కంకులనే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ధర గిట్టుబాటు అవుతుండటంతో అమ్మకాలు, కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడుతోంది. జహీరాబాద్ వ్యవసాయ డివిజన్లో పత్తి, కంది, సోయాబీన్ తరువాత మొక్కజొన్నను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. కొంత మంది రైతులు చెరకులోనూ అంతరపంటగా మొక్కజొన్న పండిస్తుంటారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది డివిజన్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 75 శాతం వరకు పెరిగింది. జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం తదితర మండలాల్లో రైతులు గత సంవత్సరం 3 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సంవత్సరం సుమారు 11 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్నకు కేంద్రం కనీస మద్దతు ధర రూ. 2,360 ప్రకటించడం వల్ల గిట్టుబాటవుతుందని సాగుకు మొగ్గు చూపారు. మార్కెట్లో కొనుగోళ్లు.. సీజన్ కావడంతో మార్కెట్కు రైతులు పచ్చి కంకులను తీసుకొస్తున్నారు. వర్షాల కారణంగా మొక్కజొన్న కంకులను(బుట్టాలు) ఎండబెట్టడం శ్రమతో కూడుకున్న పని కారణంగా రైతులు పచ్చి కంకులనే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలోని పశువుల సంత వద్ద రహదారి పక్కనే మార్కెట్ ఉండటంతో దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు వాహనాలను ఆపి కంకులను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుత ధర కిలోకు రూ.16 నుంచి 20 వరకు పలుకుతోంది. గిట్టుబాటు ధర లభిస్తుండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చిరువ్యాపారులు కాల్చిన ఒక్కో కంకిని రూ. 20కు అమ్ముతున్నారు. -
పక్కదారి పట్టిందా!
యూరియా కొరత కష్టాలు●హత్నూర మండలం దౌల్తాబాద్లో యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు జిల్లాతోపాటు, రాష్ట్రమంతటా యూరియా కొరత వేధిస్తోంది. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రోజంతా క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఒక్కోసారి రాత్రంతా పీఏసీఎస్లు, రైతుసేవా కేంద్రాల వద్ద జాగారం చేయా ల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా హత్నూర మండలంలో ఈ సమస్య అధికంగా ఉంది. పుల్కల్, చౌటకూర్, వట్పల్లి తదితర మండలాల్లో ఈ బస్తాల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఎరువుల అక్రమ రవాణా అంశం తెరపైకి వస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న న్యాల్కల్ మండలంలో గతేడాది ఖరీఫ్ సీజను మొత్తానికి యూరియా విక్రయాలు 1,300 మెట్రిక్ టన్నులు. ప్రస్తుత సీజను సగం కూడా పూర్తికాకముందే 1,505 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయి. సీజను పూర్తయ్యే నాటికి 2,500 మెట్రిక్ టన్నులు దాటే అవకాశాలున్నాయి. బీదర్కు సమీపంలో ఉన్న మనూరు మండలంలో గతేడాది కేవలం 152 టన్నుల యూరియా అమ్మినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, ఈసారి ఇప్పటి వరకు విక్రయాలు 200 టన్నులు దాటింది. సీజను పూర్తయ్యే నాటికి మరో 200 టన్నుల అవసరం ఉంటుందని అంచనా. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో యూరియా విక్రయాలు ఈ సీజనులో గణనీయంగా పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతేడాది ఖరీఫ్ సీజనుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మండలాల్లో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం రెట్టింపు కాలేదు. అలాంటప్పుడు రెట్టింపుస్థాయిలో యూరియా విక్రయాలు జరగడం చూస్తే ఇక్కడి నుంచి ఈ ఎరువు కర్ణాటకకు పక్కదారి పడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు పట్టుబడిన ఘటనలు జిల్లాకు వచ్చిన ఈ ఎరువు సరిహద్దులు దాటే అవకాశాలు లేకపోలేదనే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఆయా వస్తువుల ధరల్లో తేడాల కారణంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ సరుకులు అక్రమ రవాణా జరగుతుండటం ఈ ప్రాంతంలో పరిపాటే. ధరల్లో వ్యత్యాసం కారణంగా ఈ ఎరువులు, విత్తనాలతోపాటు, సిమెంట్ వంటి లారీలను కర్ణాటకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు మండలాల్లో సాగు విస్తీర్ణం పెరగకపోయినా యూరియా విక్రయాలు రెట్టింపుస్థాయిలో జరుగుతుండటం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు మండలాల్లో.. న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్, కంగ్టి, నాగల్గిద్ద, సిర్గాపూర్, మనూర్ మండలాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈ మండలాల్లో సాగు విస్తీర్ణం రెట్టింపు కాలేదు. అలాంటప్పుడు యూరియా అమ్మకాలు భారీగా పెరగడం వెనుక కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ప్రస్తుతం బీదర్లోనూ ఎరువుల కొరత ఉంది. దీంతో ఇక్కడి నుంచి యూరియా బీదర్కు అక్రమ రవాణా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7.46 లక్షల ఎకరాల సాగు.. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనులో 7.46 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగువుతున్నాయి. ఈసారి మొత్తం 38,872 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపింది. వ్యవసాయశాఖ కమిషనరేట్ జిల్లాకు సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఇప్పటి వరకు 26,274 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దీంతో జిల్లాలోనూ యూరియా సమస్య తలెత్తుతోంది. సరిహద్దు మండలాలను అప్రమత్తం చేశాం సరిహద్దు మండలాల్లో యూరియా పక్కదారి పట్టే ఆస్కారం లేదు. చాలామంది రైతులు అవసరానికి మించి ఎరువులు వాడుతున్నారు. రానున్న రోజుల్లో యూరియా లభిస్తుందో లేదోననే ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. సరిహద్దు మండలాలను కూడా అప్రమత్తం చేశాం. –శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 26,274 మెట్రిక్ టన్నుల యూరియా ఏమైందో? కర్ణాటక సరిహద్దు మండలాల్లో యూరియా విక్రయాలు రెట్టింపు! సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట ప్రాథమిక సహకార సంఘం కేంద్రానికి మంగళవారం యూరియా వచ్చిందనే తెలియగానే రైతులు ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. యూరియా కోసం క్యూలో నిలబడి పడిగాపులు కాశారు. ఈ క్రమంలో యూరియా కోసం అధికారులతో రైతులు వాగ్వాదానికి కూడా దిగారు. అయితే ఈ కేంద్రంలో గత నాలుగైదు రోజులుగా యూరియా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
మట్టి ప్రతిమలనే ప్రతిష్ఠించండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల పరేషాన్
● ఐదు నెలలుగా రాని కమీషన్ బకాయిలు ● రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉన్న ప్రభుత్వం ● 1 నుంచి రేషన్ దుకాణాల బంద్కు యోచన! హత్నూర(సంగారెడ్డి): రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్న డీలర్లకు ఐదు నెలలుగా రావాల్సిన కమీషన్ బకాయిలను ప్రభుత్వం నిలిపివేయడంతో వారు ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి కమీషన్ బకాయిలు విడుదల చేయకపోతే వారంతా ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమీషన్ బకాయిలు విడుదల చేయాలని రేషన్ డీలర్లు ఆందోళన చేసి తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. గత ఐదు నెలలకు జిల్లాలోని 846 రేషన్ దుకాణాలకు సంబంధించి సుమారు రూ.15 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. వీటికి అదనంగా రెండేళ్ల క్రితం రెండు నెలల గన్నీ బ్యాగులను ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వం వాటి తాలుకూ సుమారు రూ.6కోట్లను ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో డీలర్లు కనీసం రేషన్ దుకాణాల అద్దె, కరెంట్ బిల్లులు సైతం కట్టుకోలేక ఇబ్బందులుపడుతున్నారు. క్వింటా బియ్యానికి రూ.140 క్వింటా బియ్యానికి డీలర్కు రూ.140 కమీషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే తాము అధికారంలోకి వస్తే రేషన్ డీలర్లకు నెలకు రూ.5000 గౌరవవేతనంతోపాటు క్వింటాకు రూ.300 కమీషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ మాట ఎలాగున్నా బకాయిలైనా సక్రమంగా చెల్లించాలని రేషన్ డీలర్లు వాపోతున్నారు. కాగా, ఈ నెలాఖరుకల్లా కమీషన్ బకాయిలతోపాటు గన్నీ బ్యాగుల డబ్బుల్ని ప్రభుత్వం చెల్లించకుంటే సెప్టెంబర్ 1 నుంచి జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్కు డీలర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
గణపతి ఆకారంలో విద్యార్థులు
నారాయణఖేడ్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఖేడ్లోని నియోప్రగతి పాఠశాల విద్యార్థులు వినాయక ఆకారంలో కూర్చొని ప్రదర్శన చేశారు. వినాయక ప్రతిమ తరహాలో వారి ఆకృతి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు. నారాయణఖేడ్: వినాయ చవితి పండుగను పురస్కరించుకుని ‘వాసవీ మా ఇల్లు’స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి గణపతి మట్టి విగ్రహాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమాహారతి మాట్లాడుతూ...ఖేడ్లో సైతం ఈ సంస్థ వారు మట్టి ప్రతిమలను అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పుల్లూరు ప్రకాశ్ తహసీల్దారు హసీనాబేగం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతంలో విద్యాభివృద్ధికి జార్జ్ బి గార్డెన్ దొర అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కె.మాణిక్రావు కొనియాడారు. గార్డెన్ దొర 33వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎంఆర్హెచ్ఎస్ స్కూల్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అమెరికాకు చెందిన జార్జ్ బి గార్డెన్ దొర దంపతులు వెనుకబడిన జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి విద్యాప్రమాణాలను పెంచారన్నారు. ఈయన సేవల వల్ల ఎంతోమంది విద్యావంతులయ్యారని, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో గార్డెన్ దొర కమిటీ సభ్యులు, క్రైస్తవ సంఘ నాయకులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: మద్యం దుకాణాల టెండర్లలో కల్లు గీత కార్మికులకు 25% కేటాయించాలని ఆ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మద్యం దుకాణాల టెండర్ల వల్ల గీత కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని 15% రిజర్వేషన్ జీవో నంబర్ 93ను సవరించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 25% పెంచి కల్లుగీత సొసైటీలకు అందజేయాలని కోరారు. నానో యూరియాతో పర్యావరణానికి మేలుజిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ సంగారెడ్డి: నానో యూరియాతో పర్యావరణానికి మేలలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. చౌటాకూర్ మండల కేంద్రంలో ఇఫ్కో ఆధ్వర్యంలో రైతులకు యూరియా పిచికారీపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సు శివప్రసాద్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సరిపడా యూరియాను అందించకుండా అవగాహన సదస్సులు నిర్వహించడమేంటని రైతులు నిలదీశారు. సబ్సిడీ కింద డ్రోన్లను అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డినారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. నిజాంపేట్ మండలం రాంరెడ్డిపేట్లో మంగళవారం గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ వాసులకు వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు చిన్నచిన్న మరమ్మతులను చేయకుండా దుర్మార్గపు పాలన చేశారని మండిపడ్డారు. పర్యావరణ కాలుష్యం మానవాళికి శాపంలా మారుతోందని ప్రతీ ఒక్కరూ మట్టివినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు జగ్జీవన్, మాజీౖ చెర్మన్ ఆనంద్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ కౌన్సిలర్లు రామకృష్ణ, హన్మాండ్లు, మాజీ సర్పంచ్ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీపై సాగు పరికరాలు
సంగారెడ్డి జోన్: వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్(స్మామ్)పథకానికి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లా రైతులకు 7,832 యంత్రాలను అందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.6.58 కోట్లు కేటాయించగా మొదటి విడతలో రూ.2.23కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, ఆసక్తి ఉన్న రైతులకు యంత్ర పరికరాలు పొందేందుకు వ్యవసాయాధికారులకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్తోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జతచేయాలి. కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఎంపిక కమిటీల ద్వారా ఈ పథకానికి అర్హులను గుర్తించనున్నారు. యూనిట్ విలువ రూ.లక్షలోపు ఉంటే మండల వ్యవసాయాధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్ కలిసి అర్హులను ఎంపిక చేస్తారు. రూ.లక్ష కంటే ఎక్కువగా ఉంటే కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి, రీజనల్ మేనేజర్, లీడ్ బ్యాంకు మేనేజర్, హార్టికల్చర్ జిల్లా అధికారి కలిసి ఎంపిక చేయనున్నారు. ఎంపిక కమిటీ చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా డీఏఓ, ఇతర అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. కాగా, చిన్న, సన్నకారు రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50%, మిగతా రైతులకు 40% రాయితీపై యంత్రపరికాలను అందించనున్నారు. జిల్లాకు కేటాయించిన సబ్సిడీ పరికరాలు ఇవీ యంత్రం పేరు మంజూరైనవి బ్యాటరీ, చేతి, మాన్యువల్ స్ప్రేయర్లు 5,871 పవర్ నాప్సాక్ స్ప్రేయర్లు 784 రొటోవేటర్లు 292 విత్తన, ఫర్ట్టిలైజర్ వేసే యంత్రాలు (గొర్రు) 71 ట్రాక్టర్ పరికరాలు (వ్యవసాయం అనుబంధం) 479 బండ్ ఫార్మర్లు 9 గడ్డి కత్తిరించే యంత్రాలు 83 బ్రష్ కట్టర్లు 83 కలుపు తీతయంత్రాలు 83 మెయిజ్ షెల్లర్ష్ (మొక్కజొన్న రాశి యంత్రం) 39 స్ట్రాబాలెర్స్ (గడ్డి మోపులు కట్టే యంత్రం) 38 రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం అర్హుల ఎంపికకు కమిటీలు జిల్లాకు 7,832 యంత్రాలు మంజూరు -
వసతుల కల్పన తప్పనిసరి
● మంత్రి దామోదర రాజనర్సింహ ● నియోజకవర్గ విద్యా సంస్థల బలోపేతంపై సమీక్ష జోగిపేట(అందోల్)/పటాన్చెరు టౌన్/ మునిపల్లి (ఆందోల్): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి, పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గంలోని విద్యా సంస్థల అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతంపై మంగళవారం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సమీక్ష నిర్వహించారు. అవసరమైన వసతుల కల్పనపై ప్రిన్సిపాల్లు, అధికారులతో చర్చించారు. పుల్కల్, అందోల్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అందోల్, శివ్వంపేట, సంగుపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలు, ఆక్సాన్పల్లి, పోతుల బొగుడ, బస్వాపూర్లోని మోడల్ స్కూళ్లు, అందోల్, సింగూర్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో సదుపాయాల గురించి మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్యార్థులకు వసతి, ఆహారం, క్రీడా సదుపాయాల నాణ్యతను మరింత మెరుగుపరచాలన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ, పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, బుదేరా విద్యాసంస్థల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, హాస్టల్లో వసతి సదుపాయాల పెంపు, ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మాజీ డీసీసీ అధ్యక్షుడు డాకూరి గాలయ్య 35వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. వినాయక చవితి పురస్కరించుకుని ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేశ్గడ్డ దేవస్థానంలో జరుగనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రి దామోదరను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ఈవో లావణ్య, ఆలయ కమిటీ సభ్యులు సంగారెడ్డిలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. -
63 లక్షల గంజాయి పట్టివేత
ఇద్దరి అరెస్ట్.. రెండు కార్లు స్వాధీనంసంగారెడ్డి: ఆంధ్రా ఒడిశా బార్డర్ నుంచి రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి డీటీఎఫ్ టీం పట్టుకుంది. సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ వెల్లడించారు. ఏవోబీ నుంచి గంజాయి మహారాష్ట్రకు వెళుతుందనే సమాచారంతో సంగారెడ్డి కంది మండలం చేర్యాల గేటు వద్ద కాపు కాసి మహారాష్ట్రకు చెందిన వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారును తనిఖీ చేస్తుండగా కారు డిక్కీలో, బాడీ కింద ప్రత్యేకమైన అరలు చేయించి గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఒక కారులో 69.5 కేజీలు, మరో కారులో 53.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 63 లక్షలుంటుందని తెలిపారు. నిందితులు అబ్దుల్ వహాబ్ సయ్యద్, ఉమాకాంత్ సబర్ను అరెస్ట్ చేశారు. చాంద్ మహమ్మద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. డీటీఎఫ్ సీఐ శంకర్, నజీర్ పాషా, సిబ్బంది, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్రను అభినందించారు. -
బైబిల్ హౌస్ ప్రారంభం
మెదక్జోన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో సోమవారం మాడరేటర్ ప్రొఫెసర్ రూబెన్మార్క్ బైబిల్ హౌస్ను ప్రారంభించారు. ఇందులో అన్ని భాషల్లో ఉన్న బైబిళ్లు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో చర్చి ప్రెసిబెటరి ఇన్చార్జి శాంతయ్య, గంట సంపత్ తదితరులు ఉన్నారు. కరాటేలో విద్యార్థి ప్రతిభదుబ్బాకటౌన్: హైదరాబాద్లోని బోడుప్పల్ లో బొమ్మక్ శంకరయ్య కన్వెన్షన్లో ఆదివారం రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దుబ్బాకకు చెందిన యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థి వేముల హర్షవర్ధన్ పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడని కరాటే మాస్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్కు సైతం నిర్వాహకులు బెస్ట్ కోచ్ అవార్డు అందించారు. ఇరువురిని నిహాన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ ఇండియా వ్యవస్థాపకుడు రవీందర్, రేంజుకి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ నగేశ్, అధ్యక్షుడు అశోక్, జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, సురేందర్, సిద్ధార్థ్ అభినందించారు. అడవి పందుల బీభత్సం పంటలు ధ్వంసం అక్కన్నపేట(హుస్నాబాద్): పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. మండలంలోని రామవరం గ్రామ పరిధిలోని బంగారు లొద్దితండా, సేవాలాల్ మహారాజ్ తండాలో సుమారు 13మంది రైతులు సాగుచేసిన మొక్కజొన్న, ఇతర పంటలపై పందులు దాడి చేశాయి. సోమవారం వ్యవసాయ విస్తరణాధికారి శ్రీలతతోపాటు ఫారెస్టు అధికారులు పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం చేను కంకి దశలో ఉందన్నారు. చేను చుట్టూ వల, చీరలు కట్టి..రాత్రి కాపలా ఉన్నా కూడా పంటపై దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరారు. మెరుగైన ఫలితాలు సాఽధించాలి నర్సాపూర్: రోజువారి ప్రణాళికతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యేక పరిశీలకుడు కిషన్ విద్యార్థులకు సూచించారు. ఆయన సోమ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. వంద శాతం ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కాగా కాలేజీకి చెందిన పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాలను ప్రిన్సిపాల్ శేషాచారి ఆయనకు వివరించారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులు చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచారు. త్వరలో హైదరాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన జిల్లా స్థాయి త్రోబాల్ పోటీల్లో విద్యార్థుల జట్టు మొదటి స్థానంలో నిలిచింది. జట్టుకు రూ. 10 వేల నగదు, ట్రోఫీ, ప్రశంసా పత్రాలు అందజేశారు. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 3 వేల నగదు, సర్టిఫికెట్లు అందజేశారు. పేకాట రాయుళ్ల అరెస్టున్యాల్కల్(జహీరాబాద్): నలుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... హద్నూర్ గ్రామ శివారులో గ్రామానికి చెందిన కొందరు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం దాడి చేశారు. దాడిలో పట్టుబడిన నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3980 నగదు, పేకాట ముక్కలు, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
భవితకు ‘నవోదయం’
ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం ● రేపే దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ● డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష వర్గల్(గజ్వేల్): ఆశ్రమ వసతులు, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యకు మారుపేరుగా నవోదయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయలో 2026–27విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ టెస్ట్ జరగనుంది. ఇందుకు విద్యార్థుల నుంచి ఈ నెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 1987లో ఉమ్మడి జిల్లాలోని వర్గల్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసింది. ఆంగ్లం, తెలుగు, హిందీ త్రిభాషా సూత్రం ప్రాతిపదికన జాతీయ సమైక్యతకు బాటలు వేస్తున్నది. గ్రామీణ విద్యార్థుల ఉజ్వల భవితకు సోపానంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, బాల బాలికలకు వేర్వేరు డార్మెటరీలు, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్కు క్వార్టర్లు వంటి వసతులు ఉన్నాయి. అంతర్గత సీసీరోడ్లు, స్ట్రీట్లైట్లు, ఆరోగ్యాన్ని పంచే హరిత సంపద, సుశిక్షితులైన అధ్యాపక గణం, స్మార్ట్ క్లాసులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు, గ్రంథాలయం, ఆటలకు బాసటగా విశాలమైన స్టేడియం, బాస్కెట్బాల్ తదితర మైదానాలు, జిమ్, హెల్త్ సెంటర్లతో నవోదయ ప్రత్యేకతను చాటుతుంది. ఇక్కడ పుస్తకాలు, దుస్తులు సహా విద్యార్థులకు అన్నీ ఉచితమే. ఇక్కడ ఆరు, ఏడు తరగతులు మాతృభాషలో, ఎనిమిదో తరగతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తారు. 27 వరకు దరఖాస్తుల స్వీకరణ వర్గల్ నవోదయలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వరకు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.గవ్.ఇన్ ద్వారా దరఖాస్తులు అప్లోడ్ చేయవచ్చు. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. అభ్యర్థుల అర్హతలు ప్రస్తుత విద్యా సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ లేదా సర్కారు గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. వరుసగా 3,4,5 తరగతులు ఒకే పాఠశాలలో చదివి ఉండాలి. మే 1, 2014 – జూలై 31, 2016 మధ్య జన్మించి ఉండాలి.సద్వినియోగం చేసుకోవాలి 2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలు పూరించి, హెచ్ఎం సంతకంతో ఆన్లైన్లో గడువులోగా అప్లోడ్ చేయాలి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజేందర్, ప్రిన్సిపాల్, వర్గల్ నవోదయ -
వైద్యుల పర్యవేక్షణలో చిన్నారులు
72 గంటల పాటు అబ్జర్వేషన్నర్సాపూర్: చుంచెలుక పడిన నీళ్లు తాగి అస్వస్థతకు గురైన చిన్నారులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రంలో ఈనెల 23న ఎలుక పడిన నీళ్లు తాగి ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా వారిలో రిషివర్ధన్కు కడుపు ఉబ్బడంతో అతన్ని ఆదివారం మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు. స్థానిక ఆస్పత్రిలో ఉన్న ఏడుగురిలో అక్షిత్ సోమవారం ఉదయం వాంతి చేసుకున్నాడు. 72గంటల అబ్జర్వేషన్లో ఉంచామని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పావని, ఆర్ఎంఓ రాజేశ్కుమార్ తెలిపారు. మిగతా చిన్నారులు కోలుకుంటున్నారని చెప్పారు. చికిత్స పొందుతున్న చిన్నారులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ పరామర్శించారు. ఆయన వెంట పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేశ్ గౌడ్, నాయకులు పెద్ద రమేశ్ గౌడ్, నారాయణరెడ్డి, చంద్రయ్య, బాల్రాజ్, రాజు, రాంరెడ్డి తదితరులు ఉన్నారు. -
డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ
జాతీయ రహదారిపై ట్రాఫిక్పటాన్చెరు టౌన్: ఉల్లి లోడ్తో వెళుతున్న లారీ బోల్తా పడింది. వివరాలు ఇలా.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయ బాలాజీ గార్డెన్ సమీపంలో సోమవారం జాతీయ రహదారిపై సంగారెడ్డి వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఉల్లి లోడ్ లారీ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న ఉల్లి మూటలు జాతీయ రహదారిపై పడ్డాయి. ఆరు కిలోమీటర్ల మేర రుద్రారం వరకు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సీఐ లాలు నాయక్, సిబ్బందితో కలిసి క్లియర్ చేశారు. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్ను వాహనదారులు డివైడర్ దాటించి పంపించారు. సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు, కంది వైపు నుంచి వచ్చే వాహనాలను ఇతర దారుల గుండా మళ్లించారు. -
భూ సేకరణ చట్టం ఉల్లంఘన
● 30న నిమ్స్ కార్యాలయం ఎదుట ధర్నా ● వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు రాంచందర్జహీరాబాద్టౌన్: భూ సేకరణ చట్టాన్ని ఉల్లఘించి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్ భవనంలో సోమవారం నిమ్స్ రైతుకూలీలతో నిర్వహించిన సమవేశంలో ఆయన మాట్లాడారు. భూ సేకరణ చట్టానికి తూట్లు పోడుస్తున్నారని, రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో తెలియకుండా వ్యవసాయ భూములను తీసుకోవద్దని, కూలీలకు ఇవ్వాల్సిన పునరావాసం గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అధికారుల వైఖరికి నిరసనగా 30న నిమ్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శంకర్, బాలప్ప, సంజీవ్ పాల్గొన్నారు. -
వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నర్సాపూర్: హాస్టళ్లలో వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజీల ప్రాంతీయ సమన్వయ అధికారి దివం బహుమతి సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మైనారిటీ పాఠశాలలు, కాలేజీల ప్రిన్సిపాల్స్తో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలు, కాలేజీల పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసిజర్ నిబంధనలు పాటించాలన్నారు. మెనూ పాటించాలని, విద్యా విధానాలు, డైనింగ్ విధానాలను ప్రిన్సిపాల్స్ నిరంతరం పరిశీలించాలని సూచించారు. సమావేశంలో విజిలెన్స్ అధికారులు మహ్మద్గౌస్, జగదీశ్వర్రెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ వసీమోద్దీన్, స్థానిక పాఠశాల కాలేజీ ప్రిన్సిపాల్ నసీమా షేక్ పాల్గొన్నారు. -
తుఫాన్లో చెలరేగిన మంటలు
పటాన్చెరు టౌన్: తుఫాన్ వాహనంలో మంటలు చెలరేగి పాక్షికంగా కాలిపోయింది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం... మెదక్ జిల్లా రేగోడు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 12 మంది సోమవారం బీరంగూడ లోని ఓ వేడుకకు వెళ్తున్నారు. కాగా, స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాన్ని గణేశ్ దేవాలయ ఆవరణలో నిలిపి లోపలికి వెళ్లారు. ఈ లోపు వాహనంలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దేవస్థానం సిబ్బంది నీటితో మంటలను అదుపు చేశారు. అయినా అప్పటికే వాహనం పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
గీతంలో 160 మంది రక్తదానం పటాన్చెరు: భారతదేశం, నేపాల్లో లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని బ్రహ్మకుమారీస్ సంకల్పించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్రహ్మకుమారీలు (చందానగర్ శాఖ), సోషల్ సర్వీస్ వింగ్ (ఆర్ఈఆర్ఎఫ్), రెడ్ క్రాస్ సొసైటీల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. శిబిరంలో దాదాపు 160 మంది విద్యార్థులు రక్తదానం చేయగా, వీరికి బ్రహ్మకుమారీలు ప్రశంసా పత్రాలు అందజేశారు. నీటి గుంతలో పడి యువకుడి మృతి చిన్నకోడూరు(సిద్దిపేట): ఓ యువకుడు నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దకోడూరులో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... ఆనరాశి లక్ష్మి, సత్తయ్య దంపతుల కుమారుడు రాజు(20) కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో వాళ్ల ఇంటి సమీపంలోని నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు గుర్తించి 108లో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యపటాన్చెరు టౌన్: ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జీడిమెట్లకు చెందిన బసవరాజు (38) రెండు నెలల క్రితం ముత్తంగి సాయిప్రియ కాలనీకి వచ్చి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే బసవరాజు రోజు మద్యం తాగుతున్నాడు. ఐదు రోజుల నుండి భార్యాభర్తల మధ్య సంసార విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 24న రాత్రి భార్యను కొట్టడంతో పిల్లలని తీసుకుని ఇస్నాపూర్లో ఉన్న తన అక్క జగదీశ్వరి ఇంటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం భార్య ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు గడియపెట్టి ఉండటంతో కిటికీ నుంచి చూసింది. అప్పటికే భర్త ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నాడు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత గజ్వేల్రూరల్: అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్నారు. గజ్వేల్ సీఐ రవికుమార్, పశువైద్యశాఖ ఏడీ రమేశ్ వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం ప్రాంతం నుంచి ఓ కంటైనర్లో 89 పశువులను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారు పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో పశువులను తరలిస్తున్న కంటైనర్ను పట్టుకున్నారు. ఇందులో 54గోవులు ఉండగా మిగతా 35 పశువులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 5గోవులు, 2 పశువులు మృతి చెందాయి. పశువులను ఆర్అండ్ఆర్ కాలనీలోని లక్ష్మాపూర్లోగల గోశాలకు పంపించారు. ఒక డ్రైవర్ పారిపోగా, మరో డ్రైవర్తోపాటు క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. -
రైతులను మోసం చేసిన ప్రభుత్వం
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కల్హేర్(నారాయణఖేడ్): ఎన్నికలు వస్తేనే రైతు భరోసా, ప్రభుత్వ పథకాలు అరకొరగా అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం సిర్గాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలి సి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అధికారం కోసం హామీలు ఇచ్చి రైతులు, ప్రజలను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లడుతూ.. నల్లవాగు కాల్వల్లో పూడిక తీయడంలో జాప్యం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీలు మహిపాల్రెడ్డి, జంగం శ్రీనివాస్,సంజీవరావు, నజీబ్, ముజమ్మిల్, మాధవరావు పటేల్, బాదల్గాం నగేష్, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. -
సార్.. ప్లానింగే వేరు!
● ఎప్పుడొస్తారో తెలియదు ● టౌన్ప్లానింగ్ అధికారి తీరుపై విమర్శల వెల్లువసంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు సమయపాలన పాటించకుండా ‘మా రూటే.. సెపరేటు..’అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తామొచ్చిందే టైం, చేసిందే పనిగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సంగారెడ్డి బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి మధ్యాహ్నం 12 గంటలు దాటినా విధులకు హాజరు కావడం లేదు. తన లెక్కేవేరు అన్నట్టు వ్యవహరిస్తున్న సదరు అధికారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10 గంటలకే కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆయన రాక కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్కోసారి సాయంత్రం వరకు కూడా ఆయన దర్శనం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారంలో రెండు రోజులే వస్తారని, అది కూడా సమయానికి రారని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించేలా, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
మట్టి గణపతిని పూజిద్దాం
విగ్రహాలను పంపిణీ చేసిన కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్తో కలిసి కలెక్టర్ చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేలకు పైగా విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు సంస్థ అధ్యక్షుడు తోపాజి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో వాయు, నీటి కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు సంక్షేమ వసతి గృహాలు తనిఖీ చేసి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. మహోత్సవంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని వివరించారు. ప్రజావాణికి 35 అర్జీలు ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎపపటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 35 అర్జీలు వచ్చాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. వినతులు స్వీకరించిన వారిలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్ఓ పద్మజరాణి పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం భోజనం
వార్డెన్కు ఏఎస్డబ్ల్యూఓ ఆదేశం వట్పల్లి(అందోల్): వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఏఎస్డబ్ల్యూఓ శ్రీనివాస్రావు అన్నారు. సోమవారం వట్పల్లి మండలం దేవునూర్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతిగృహం పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించడంలేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బందిని ఇతర చోట్లకు పంపించారు. వార్డెన్ అందుబాటులో ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి: గిరిజన బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. పుల్కల్ మండలం లాల్సింగ్ నాయక్ తండాకు చెందిన రామావత్ ప్రకాశ్ వ్యాయామ విద్య(స్పోర్ట్స్)లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. నగరంలో ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ నుంచి పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రకాశ్ను అభినందించారు. డీపీఓ సాయిబాబా సంగారెడ్డి టౌన్: గ్రామాల్లోని చెత్త సేకరణ షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డీపీఓ సాయిబాబా అన్నారు. సోమవారం మండలంలోని తాళ్లపల్లిలో ఉన్న డంపు యార్డ్, శ్మశానవాటిక, చెత్తసేకరణ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్త సేకరణ చేయించాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఏబీవీపీ అధ్యక్షుడు ఈశ్వర్ జహీరాబాద్ టౌన్: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని ఏబీవీపీ జహీరాబాద్ అధ్యక్షుడు ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిధులు విడుదల చేయడంలో జాప్య ం వహిస్తున్నారని ఆరోపించారు. పేద విద్యా ర్థులు స్కాలర్షిప్పై ఆధారపడి చదువుతుంటారని, ఫీజులు చెల్లించనిదే కళాశాల నిర్వాహకులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు. నాయకులు బసవరాజ్, అభివర్ధన్, సమీర్ పాల్గొన్నారు. నారాయణఖేడ్: పర్యావరణహిత మట్టి, ఇతర సహజ వనరులతో గణనాథుల తయారీపై విద్యార్థులకు మండల, డివిజన్స్థాయి పోటీలకు సబ్ కలెక్టర్ ఉమాహారతి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రత్యేకంగా పోటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని 14 గురుకులాల్లో పోటీలు పూర్తయ్యాయి. సోమవారం నుంచి డివిజన్ పరిధిలోని 34 ఉన్నత పాఠశాలల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. మండల, డివిజన్ స్థాయిల్లో అందంగా తయారు చేసిన విద్యార్థులను ఎంపికచేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నట్లు ఆమె వివరించారు. నారాయణఖేడ్: మద్యం దుకాణాల టెండర్లలో కల్లుగీత కార్మికులకు 25 శాతం కేటాయించాలని గీత కార్మిక కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన సంఘం డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు 25 శాతం దుకాణాలను కేటాయించాలన్నారు. వ్యక్తిగతం కాకుండా కల్లుగీత సహకార సంఘాలకు కేటాయిస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. వృత్తి పెన్షను రూ.5 వేలకు పెంచి కల్లుగీత కార్పొరేషన్కు రూ.5 వేల కోట్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజాగౌడ్, ఖేడ్ డివిజన్ అధ్యక్షుడు భూమాగౌడ్, జిల్లా, స్థానిక బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి మండపాన్ని సందర్శించాలి: ఎస్పీ
సంగారెడ్డి జోన్: ప్రతి వినాయక మండపాన్ని పోలీసు అధికారులు సందర్శించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రత నిర్వహణలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డీజే బాక్స్లకు అనుమతి లేదని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లో అనుమతి పొందాలన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద బందోబస్తు జిల్లాలోని వివిధ బ్యాంకుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులకు ఎస్పీ సూచించారు. సోమవారం బ్యాంకు అధికారులతో సమీక్షించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలతోపాటు ఖాతాదారులకు బ్యాంకు, పోలీస్ అధికారులు కలిసి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సైబర్ క్రై మ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. -
హైవేలపై అండర్పాస్లు
● మంత్రి దామోదర రాజనర్సింహ ● అధికారులతో కలిసి పరిశీలన వట్పల్లి(అందోల్): నాందేడ్–అకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చోట అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం హైవే అధికారులతో కలిసి 161 జాతీయ రహదారిని పరిశీలించారు. అందోల్ మండలం డాకూర్ వంతెన వద్ద అండర్పాస్ లేకపోవడంతో డాకూర్ వెళ్లే గ్రామాల ప్రజలు సుమారు 6 కి.మీల దూరం సర్వీసు రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. ఇలా హైవేపై రానుపోను అదనంగా 12 కి.మీల దూరం ప్రయాణం చేస్తున్నారు. ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని డాకూర్ వద్ద అండర్ పాస్, అల్మాయిపేట వద్ద వంతెన ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ పాండు, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి, తహసీల్దార్ మధుకర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
మృత్యు కుహరాలు
పరిశ్రమలు.. ● తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యంత్రాలను సర్దేసి ● ఇరుకై న ప్రదేశాల్లో కొనసాగుతున్న వస్తు ఉత్పత్తి ● కాలం చెల్లిన యంత్ర పరికరాలనే కొనసాగింపు ● పని ప్రదేశంలో కనీసం వెంటిలేషన్ కూడా కరువు ● పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రమాణాలు గాలికి.. ● అధికారుల తనిఖీల్లో వెలుగులో ఆందోళనకరమైన అంశాలు పాశమైలారం పారిశ్రామికవాడలో సుమారు 30 ఏళ్ల క్రితం ఎకరం విస్తీర్ణంలో ప్రారంభమైన పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యానికి అవసరమైన అదనపు యంత్ర పరికరాలు మాత్రం అదే ఎకరంలోనే సర్దేశారు. దీంతో ఇరుకు షెడ్లలో కార్మికులు పనిచేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పదుల సంఖ్య ప్రాణాలు గాలిలో కలిసే పరిస్థితులు నెలకొన్నాయి. 40 పరిశ్రమల్లో తనిఖీలు పూర్తి తొలి విడతలో హై రిస్క్ పరిశ్రమలను తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న ఫార్మా, కెమికల్, గ్లాస్, బల్క్డ్రగ్, పెయింట్ వంటి పరిశ్రమల్లో తనిఖీలు సాగుతున్నాయి. మొత్తం 599 పరిశ్రమలను తనిఖీలు చేయాల్సి ఉండగా, 48 పరిశ్రమలను తనిఖీలు చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సుమారు ఎనిమిది పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. నెల రోజుల్లో ఈ తనిఖీలు పూర్తికి ప్రభుత్వం నెలరోజులు గడువు విధించింది. ఈ తనిఖీలన్నీ పూర్తి కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయని ఫ్యాక్టరీల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
టన్నుకు రూ. 1200
● ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక పంపిణీ ● ఇతరులు రూ.1800 చెల్లించాలి ● నేడు ఇసుక బజార్ ప్రారంభం ప్రజలకు స్టాక్ పాయింట్తో ప్రయోజనం చేకూరుతుంది. మార్కెట్లో టన్ను ఇసుకకు రూ.2700 వందల వరకు ఉంది. కేవలం ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు నాణ్యత కలిగిన ఇసుక దొరుకుతుంది. ప్రజలు టోకెన్న్ తీసుకుని తమ అవసరానికి అనుగుణంగా బుకింగ్ చేసుకోగలుగుతారు.స్టాక్ పాయింట్తో ప్రయోజనం జోగిపేట(అందోల్): ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. అందోలు శివారులో టీజీఎండీసీఽ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ను మంగళవారం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 1,500 టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా మూడు మండలాలను గుర్తించింది. ఇటీవల అందోలు, కోహీర్, నిజాంపేట మండలాల్లో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. డిజిటల్ మానిటరింగ్ ద్వారా కేంద్రాలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ లబ్ధిదారులు టన్ను ఇసుకకు రూ.1,200, ఇతరులు రూ.1,800 చెల్లించాలి. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.2వేలకు పైబడి ఉంది. ఇసుక ఎవరికి అవసరం ఉన్నా టీజీఎండీసీ వెబ్సెట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మరుసటి రోజే సాండ్ బజార్ వద్దకు వచ్చి తీసుకొని వెళ్లవచ్చని ప్రాజెక్టు ఆఫీసర్ ఆకుల శ్రీకాంత్ తెలిపారు. ట్రాన్స్పోర్టు ఖర్చులు లబ్ధిదారుడే భరించాలని చెప్పారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోతే డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోతే ప్రజలు మళ్లీ మార్కెట్ వైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇసుక పంపిణీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేనట్లయితే అధికారిక వ్యవస్థ స్వేచ్ఛగా పనిచేస్తే ప్రభుత్వ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. సర్కారే ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తుండటంతో అమ్మకం ద్వారా ఖజానాకు ఆదాయం రావడంతోపాటు, అక్రమ మాఫియా నియంత్రణ జరుగుతుంది. నిర్వహణ పారదర్శకంగా ఉండి, పాలసీ అనుసరణ, టెండర్లు, డిజిటల్ మానిటరింగ్ ఉంటే.. కేంద్రాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. -
జోరుగా అక్రమ మట్టి రవాణ
జిన్నారం (పటాన్చెరు): ప్రభుత్వ భూముల్లో రాత్రి వేళ అక్రమ మట్టి రవాణ జోరుగా సాగుతోంది. జిన్నారం మున్సిపాలిటీ కొడకంచి పరిధిలోని సర్వేనం 286 ప్రభుత్వ భూమి నుంచి కొందరు అక్రమార్కులు జోరుగా మట్టిని తరలిస్తూ లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు. వారం రోజులుగా రాత్రి పది దాటిందంటే చాలు టిప్పర్ల ద్వారా శివనగర్ ఎల్ఈడీ పార్కులోకి భారీగా మట్టి రవాణ చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి మట్టి రవాణకు అడ్డుకట్ట చేయాలని కోరుతున్నారు. లేదంటే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరిస్తున్నారు. -
పింఛన్లు పెంచకుంటే ఉద్యమమే
జహీరాబాద్ టౌన్/జోగిపేట(అందోల్): హైదరాబాద్లో నిర్వహించే మహాసభ కంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెన్షన్లు పెంచితే గౌరవంగా ఉంటుందని, లేదంటే ఉద్యమంగా మారి అదే ఉరితాడవుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహాగర్జన సన్నాహక సదస్సును పట్టణంలోని ఫంక్షన్హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించారు. అంతకుముందు అందోల్లోని శ్రీలక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో సన్నాహక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి 20 నెలల గడిచినా అమలుచేయకపోవడం అంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. దివ్యాంగులు, వృద్ధులు ఏం చేస్తారులే అనుకుంటే రేవంత్రెడ్డి రాజకీయ జీవితమే తారుమారవుతుందని హెచ్చరించారు.ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ -
మట్టి.. కొల్లగొట్టి
● రోడ్డు నిర్మాణం పేరిట సర్కారు భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు ● మట్టి తరలింపులో రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలువట్పల్లి(అందోల్): ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.లక్షల ఆదాయం కాంట్రాక్టరు జేబులోకి చేరుతున్నాయి. పట్టపగలే అధికారుల ముందు నుంచే వందల టిప్పర్ల మట్టిని రోడ్డుకు తరలిస్తున్నా తమకేమీ పట్టదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన వట్పల్లిలో ప్రధాన రహదారి విస్తరణ పనులకు రూ.2.97 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇటీవల రోడ్డు పనులను ప్రారంభించారు. రోడ్డు పనులు నిర్వహిస్తూ అవసరమైన మొరం(మట్టి) కోసం సంబంధిత మైనింగ్ శాఖ వద్ద ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కాంట్రాక్టర్ తన రాజకీయ పలుకుబడితో స్థానిక తహసీల్దారు వద్ద అనుమతి పత్రం పొంది ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి మొరంను తరలించినా అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. లక్షల్లో మట్టి దోపిడి... మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్ శాఖకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వారు ఎల్ఓసీ కోసం స్థానిక తహసీల్దారుకు పంపుతారు. తర్వాత సంయుక్తంగా సర్వే చేసిన తవ్వకాల ప్రణాళిక, పర్యావరణ, సీఎఫ్వో, సీఎఫ్ఈ వంటి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అన్ని అనుమతులు వచ్చాక తగినంత రుసుము చెల్లిస్తేనే మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాలకు అనుమతులిస్తారు. కానీ అవన్నీ తన రాజకీయ పలుకుబడి ముందు పనిచేయవన్నట్లు కాంట్రాక్టరు స్థానిక తహసీల్దారు వద్దకు వెళ్లి ఓ అనుమతి పత్రాన్ని పొంది, స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి రహదారి నిర్మాణానికి తరలించాడు. విషయం తెలిసిన స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు దీన్ని అడ్డుకోగా కాంట్రాక్టరు తన రాజకీయ పలుకుబడితో అడ్డుజెప్పిన స్థానిక నాయకులకు ఓ ముఖ్య నాయకురాలితో ఫోన్ చేయించడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ప్రభుత్వానికి రావాల్సిన లక్షల ఆదాయానికి గండి పడుతున్న విషయమై స్థానికులు తహసీల్దారు, అందోలు ఆర్డీఓల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కాంట్రాక్టరు లక్షల విలువ చేసే మట్టిని రోడ్డుకు తరలించే పనులను దాదాపుగా పూర్తి చేశారు.బిల్లుల్లో కోత విధిస్తారా..?ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి -
గృహప్రవేశాలకు సిద్ధం
నారాయణఖేడ్: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరున ఇళ్ల గృహ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇందులోభాగంగా జిల్లాలో ఈ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 100 ఇళ్లను ప్రారంభిస్తూ లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు జిల్లా గృహనిర్మాణ శాఖ సిద్ధమైంది. అందుకు నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్ల పనులు చకచకా పూర్తి చేయిస్తున్నారు. ఈ పథకాన్ని జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేల సిఫారసు మేరకు 14,505 ఇందిరమ్మ ఇళ్లకు కలెక్టర్ మంజూరు ఇచ్చారు. ఇందులో నిర్మాణాలకు ముందుకు వచ్చిన 7,223మంది లబ్ధిదారులకు అధికారులు నిర్మాణాలకు సంబంధించి ముగ్గువేసి మర్కోట్ ఇచ్చారు. కాగా, వీటిలో పునాది స్థాయిలో 3,383 ఇండ్లు ఉండగా 303 నివాసాలు రూఫ్ లెవల్ నిర్మాణం జరిగాయి. ఆర్సీసీ నిర్మాణం 103 ఇళ్లు పూర్తి చేశారు. ఒక నివాసం ఇప్పటికే పూర్తయ్యింది. 2,783మంది లబ్ధిదారులకు పునాది నిర్మాణం పూర్తి చేసుకున్నందున రూ.లక్షల చొప్పున వారి ఖాతాలో డబ్బులను జమ చేశారు. 191 ఇళ్లకు రూఫ్లెవల్ నిర్మాణం పూర్తయిన బిల్లులు రూ.2లక్షల చొప్పున చెల్లించారు. ఆర్సీసీ పూర్తి చేసుకున్న 66 ఇళ్లకు బిల్లులు అందించారు. మిగతా ఇళ్ల బిల్లుల చెల్లిపులు ప్రాసెస్లో ఉన్నాయి. జిల్లాలో 103 ఇళ్లు ఆర్సీసీ పూర్తి చేసుకోగా వీటన్నింటినీ లేదా 100 ఇళ్లను తప్పకుండా ప్రారంభించి గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. గత పరిస్థితి వద్దని.. గత ప్రభుత్వ హయాంలో డబుల్బెడ్రూం ఇళ్ల పేర నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మాణాలు జరుగుతుండటంవల్ల చాలా నియోజకవర్గాల్లో నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయినా అర్హులకు అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు పట్టుదలతో ఈ పథకం కచ్చితంగా అర్హులకే దక్కాలనే సంకల్పంతో వారికి ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు మంజూరులిచ్చారు. మంజూరైన లబ్ధిదారులు కొందరు నిర్మాణాలు చేపట్టగా..ఇంకా చేపట్టని లబ్ధిదారులకు త్వరలో పనులు ప్రారంభింపచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
న్యాల్కల్(జహీరాబాద్): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ బౌదిక్ ముత్యం కృష్ణ కోరారు. న్యాల్కల్లోని శ్రీ కృష్ణ కన్వెన్షన్హాల్లో ఆదివారం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ... ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారన్నారు. సురవరానికి ఘన నివాళిజహీరాబాద్ టౌన్: సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్ మాట్లాడుతూ.. పేదల కోసం పరితపించిన మహానీయుడన్నారు. ఆయన మృతి పార్టీ కి తీరనిలోటని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు. వడ్డెరల సంక్షేమానికి కృషిఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు..వడ్డెర కులస్తుల సంక్షేమానికి అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మంజీరనగర్లో నూతనంగా నిర్మించిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ను ఆదివారం ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వడ్డెరలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. మట్టి గణపతినే పూజించండిఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి: వినాయక చవితి పండుగను అందరూ పర్యావరణహితంగా జరుపుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు అఖిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం సంగారెడ్డి జోన్: పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఆదివారం సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి 5 కే రన్ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా యువజన క్రీడా అధికారి ఖాసీం బేగ్తోపాటు సుమారు 300మంది విద్యార్థులు పాల్గొన్నారు. మండపాలకు ఉచిత విద్యుత్నారాయణఖేడ్: గణేశ్, దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా విగ్రహాల కోసం ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నట్లు ఖేడ్ ఏడీఈ నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎస్పీడీటీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈనెల 27 నుంచి సెప్టెంబరు 6వ వరకు గణేశ్ మండపాలకు, సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2వ వరకు దేవీ నవరాత్రుల ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ పొందవచ్చన్నారు. గతంలో డీడీలు కట్టడం తప్పనిసరని చెప్పినా తాజా ఉత్తర్వులతో ఉచితంగా పొందవచ్చని తెలిపారు. -
పథకాలపై ప్రజల్లో ఆదరణ
నారాయణఖేడ్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన నిజాంపేటకు చెందిన బీఆర్ఎస్కు సంబంధించిన 30 కుటుంబాల నుంచి 100 మంది ఆదివారం ఖేడ్లో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాయితీపై వంటగ్యాస్, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోపాటు ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేస్తున్న అభివృద్ధి, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న తీరుపట్ల ఆకర్షితులమై కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. కాగా, పార్టీలో చేరినవారిలో మాజీ వార్డు సభ్యులు రమేశ్, నాయకులు సంజీవులు, బాలయ్య, శ్రీనివాస్ తదితరులున్నారు. స్థానిక పోరులో కాంగ్రెస్ను గెలిపించండి కంగ్టి(నారాయణఖేడ్): కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతస్థాయిలో ప్రచారం చేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని రాంసింగ్ తండాకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దివంగత కిష్టారెడ్డి హయాంలో వేసిన ఫార్మేషన్ రోడ్డు నేటికీ అలాగే ఉందని మళ్లీ తానే బీటీ రోడ్డు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి తండాలకు చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. అన్నీ తండాలకు బీటీ రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అర్హులందరికీ పథకాలు
మునిపల్లి(అందోల్): రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మండలంలోని తాటిపల్లిలో ఆదివారం యువజన సంఘం నాయకులు కలిసి మంత్రికి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ...రాజకీయాలకతీతంగా అందరం కలిసి అభివృద్ధి చేసుకునేందుకు ఇది మంచి సువర్ణావకాశమన్నారు. స్థానిక సంస్థలకాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీదేనని యువకులకు సూచించారు. కార్యక్రమంలో రాయికోడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైపాల్, యువత నాయకులు మారుతి, నరేశ్తోపాటు తదితరులు పాల్గొన్నారు. గురు శిష్యుల అనుబంధం పూర్వజన్మ సుకృతం రాయికోడ్ (అందోల్ ): ప్రతీ గురు శిష్యుల అనుబంధం పూర్వ జన్మ సుకృతం అని మంత్రి దామోదర వ్యాఖ్యానించారు. మండలంలోని ఇందూర్ గ్రామ శివారులోని ఆశ్రమంలో చిన్మయ జ్ఞానీ శ్రీ చెన్న మల్లికార్జున స్వామి వారి 49వ జన్మదిన వేడుకలకు మంత్రి హాజరై మాట్లాడారు. బసవేశ్వరుడి బోధనలు ఆచరించి సన్మార్గంలో భక్తితో, నిజాయితీతో ప్రతీ ఒకరు జీవించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న బొగ్గులంపల్లి గ్రామ శివారులోని వంతెన పనులను నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. బుదేరా రోడ్ నిర్మాణ పనులపై సూచనలు చేశారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
అంగన్వాడీలను క్రమబద్ధీకరించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్చేయడంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం అంగన్వాడీ యూనియన్ జిల్లా ఐదవ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వ ఐసీడీఎస్తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసమే నూతన జాతీయ విధాన విద్యా విధానాన్ని తెచ్చిందన్నారు. ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సిఫార్సులను అమలు చేస్తుందని మండిపడ్డారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ, ఇంగ్లిష్ మీడియం విద్య పేరుతో ఆరేళ్లలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం సరైన నిర్ణయం కాదని ఇది ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు కార్యదర్శి పి.మంగ, శశికళ, కోశాధికారి ఏసుమణి పాల్గొన్నారు.ఆ సంఘం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి -
ప్రత్యేకంగా ఉండాలని..
మేము 15 ఏళ్లుగా వినాయకున్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ సంవత్సరం నిమజ్జన ఉత్సవాల్లో దుబ్బాక ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సారి స్వాగత ఉత్సవాలు కూడా ప్రత్యేకత సంతరించుకునేలా ఏర్పాట్లు చేశాం. –నేహాల్ గౌడ్, మిత్రయూత్, దుబ్బాక దుబ్బాక పేరు మారుమోగేలా పోయిన సంవత్సరం మా యూత్ ఆధ్వర్యంలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లతో నిమజ్జనం ఘనంగా నిర్వహించాం. ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశాం. దీంతో ప్రజలందరూ ఆకర్షితులయ్యారు. –నిఖిల్ రెడ్డి, రాక్స్టార్ యూత్, దుబ్బాక -
ఆధార్కార్డు ఉన్నా టికెట్ కొడతారా?
● జిరాక్స్ కాపీ కావడంతో టికెట్ కొట్టిన కండక్టర్ ● జోగిపేట కంట్రోలర్తో మహిళ వాగ్వాదంజోగిపేట(అందోల్): మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి తన దగ్గర టికెట్కు డబ్బులు ఎందుకు తీసుకున్నారని ఓ మహిళ ఆర్టీసీ కంట్రోలర్ను నిలదీసింది. వివరాలు ఇలా... చౌటకూరు బస్స్టేజీ వద్ద బస్సు ఎక్కిన మహిళ జోగిపేట వరకు వెళుతున్నానని కండక్టర్కు తన వద్ద ఉన్న జిరాక్స్ ఆధార్కార్డును చూపించింది. ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా అని కండక్టర్ ప్రశ్నించడంతో నిన్న కూడా జిరాక్స్ కార్డుపైనే ఉచితంగా ప్రయాణించానని చెప్పింది. ఆధార్ జిరాక్స్ కాపీతో పాటు అప్డేట్ లేకపోవడంతో కండక్టర్ ఆమెకు టికెట్ కొట్టి డబ్బులు తీసుకున్నాడు. కాగా, జోగిపేట బస్టాండ్కు వచ్చిన తర్వాత ఆ మహిళ... ఉచిత బస్సు అని చెప్పి పైసలు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ కంట్రోలర్ నాగేందర్ చారిని నిలదీసింది. ఇది ఒరిజినల్ కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జారీ చేసిన ఆధార్ కార్డు అని, వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు. బస్టాండ్లో ఇతర కండక్టర్లు కూడా చాలా సేపు నచ్చజెప్పినా ఆ మహిళ వినిపించుకోకుండా వివాదం సృష్టించింది. పలువురు ప్రయాణికులు ఆమెకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
పటాన్చెరు టౌన్: అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కేఎస్ఆర్ కాలనీకి చెందిన పూనంచంద్ స్థానికంగా అప్పులు చేశాడు. వారు తిరిగి చెల్లించమని రోజు ఫోన్ చేస్తుండటంతో ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టాడు. దీంతో అప్పు ఇచ్చినవారు భార్యకు ఫోన్ చేసి తిడుతున్నారు. ఈ క్రమంలో భార్య మమత భర్తను ఎందుకు అప్పులు చేస్తున్నావని ప్రశ్నించింది. కాగా ఈనెల 18న పూనంచంద్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. చెల్లింటికి వచ్చిన మహిళ.. చిన్నశంకరంపేట(మెదక్): చెల్లింటికి వచ్చిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... మనోహరబాద్ మండలం పరికిబండ గ్రామానికి చెందిన చింతల కవిత(40) ఈ నెల 21న చందాపూర్లోని తన చెల్లింటికి వచ్చింది. ఆరోజు నుంచి కన్పించకుండా పోయిందని, ఆమె మతిస్థిమితంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కవిత సోదరుడు నగేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పటాన్ చెరులో యువకుడు.. పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగికి చెందిన నాగులమ్మ కొడుకు రాజు ఈ నెల 21న ఉదయం తల్లి దగ్గర రూ.2 వందలు తీసుకొని బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుమారుని కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మొక్కజొన్నపై అడవి పందుల దాడి
నిజాంపేట(మెదక్): మొక్కజొన్న పంటపై అడవి పందులు దాడి చేశాయి. వివరాలు ఇలా... మండల పరిధిలోని చల్మెడ గ్రామానికి చెందిన పెద్దబోయిన స్వామి తనకున్న ఒక ఎకరాలో మొక్కజొన్న సాగు చేశాడు. ప్రస్తుతం పంట కంకి దశలో ఉంది. బయటకు వచ్చిన కంకులను అడవి పందులు దాడి చేశాయి. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతు చేను చుట్టూ వల, చీరలు కట్టి.. రాత్రిఫూట కాపలా ఉన్నా కూడా అవి పంటపై దాడి చేస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చే శాడు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. అంతర్ జిల్లా దొంగ అరెస్టు జగదేవ్పూర్(గజ్వేల్): అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని పీర్లపల్లిలో జరిగిన దొంగతనాల కేసు దర్యాప్తు చేస్తుండగా ఛత్తీస్గఢ్కు చెందిన రాహుల్ దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాలో రెండు దొంగతనాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఐదు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు రాహుల్ జులాయిగా తిరుగుతూ పాత సామాన్లు ఏరుకుని జీవించేవాడు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడేవాడని తెలిపారు. అతడి వద్ద నుంచి ఫోన్, బైక్, అల్యూమినియం సామాన్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని గజ్వేల్ కోర్టులో హాజరు పరిచారు. ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్: ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొ న్నారు. ఆదివారం మండలంలోని కోమటిబండ గ్రామంలోని పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధ్యానంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్న ధ్యాన క్షేత్రం కృషి అభినందనీయమన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాల ను సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ‘ఆపన్న హస్తం’ సంస్థ అధ్యక్షుడు బాలచంద్రం, సూర్యనమస్కార బృందం అధ్యక్షుడు సుభాష్రెడ్డి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడు నర్సింలు పాల్గొన్నారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: సిద్దిపేట సీపీ సిద్దిపేటకమాన్: విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ లాంటి వికృత చేష్టలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటా మని సీపీ అనురాధ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ర్యాగింగ్ మన సంస్కృతి కాదని, ఇలాంటి విష సంస్కృతికి ఎవరూ పాల్పడవద్దన్నారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల విద్య, ఉద్యోగ, భవిష్యత్పై ప్రభా వం చూపుతుందని తెలిపారు. ఎవరైనా ర్యా గింగ్కు గురైతే వెంటనే ప్రిన్సిపాల్ లేదా డయ ల్ 100కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్మరణం బెజ్జంకి(సిద్దిపేట): ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండ లంలోని గుగ్గిల్లలో చోటు చేసుకుంది. ఎస్ఐ సౌజన్య కథనం మేరకు... గ్రామానికి చెందిన బాణాల స్వామికి కుమారుడు, కుమార్తెలున్నా రు. అతను డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు రఘు(22) హైదరాబాద్లో ఐటీఐ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈనెల 21న వ్యవసాయ బావి వద్ద క్రిమిసంహారక మందు తాగి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. -
గణేశ్ లైటింగ్.. ట్రెండింగ్
దుబ్బాకలో యూత్ పేరుతో బోర్డులుదుబ్బాక టౌన్: దుబ్బాక మండల వ్యాప్తంగా ఈ సారి వెయ్యికి పైగా వినాయక మండపాలు ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు సైతం వినాయకుల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వైరల్ యూత్ పేరును సినిమా పేరు తలపించేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ను జత చేసి సోషల్ మీడియాలో వదులున్నారు. దీంతో ఆ వీడియోలు ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి. ఘనంగా స్వాగత ఉత్సవాలు వినాయక చవితి మూడు రోజుల మందే దుబ్బాకలో స్వాగత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భారీ గణనాథులకు పుర వీధుల గుండా డీజే సౌండ్లతో, యువకుల డాన్స్లతో స్వాగతం పలుకుతున్నారు. ముందే ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఊరేగింపును తిలకించడానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఏయ్ బిడ్డా ఇది మా అడ్డా అంటున్నారు..దుబ్బాక మండల వినాయక మండపాల యూత్ సభ్యులు. జిల్లాలో చవితి ఉత్సవాల్లో ఏళ్ల నుంచి దుబ్బాక ప్రత్యేకతను సంతరించుకుంటూ వస్తోంది. వినూత్నంగా లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేసి, యూత్ పేరును సినిమాను తలపించేలా తీర్చిదిద్ది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. -
సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారమని రామకృష్ణ మఠం స్వామీజీ తత్పదానంద మహరాజ్, ప్రతినిధి సూర్య ప్రకాశ్ పేర్కొన్నారు. శ్రీరామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ ఆవరణలో సత్సంగం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదా దేవిల జీవితం, బోధనలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సేవాసమితి జిల్లా అధ్యక్షుడు నాగేందర్, కార్యదర్శి రాజేశ్వర్రావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆదుకోని పెసర
భారీ వర్షాల కారణంగా పెసర పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల పెట్టుబడులు పెట్టినా చివరకు గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. చేనులో నీరు నిలిచి పైరు మొత్తం రంగుమారి కాయలు బూజు పడుతున్నాయి. కాయలు పగిలి గింజలు చేనుపైనే మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – జహీరాబాద్ టౌన్: పత్తి, సోయాబీన్, కంది తరువాత పెసరను ఎక్కువగా రైతులు సాగు చేశారు. తక్కువ కాల పరిమితి, 50 రోజుల పంటను అంతర పంటగా కూడా సాగు చేస్తున్నారు. పెసర పంట, పచ్చిరొట్టె ఎరువులుగా నేల సారాన్ని కాపాడుతుంది. 25 శాతం ప్రొటీన్లు కలిగి ఉంటూ త్వరగా అరుగుదల ఉండే పప్పుధాన్యపు పంట. జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటలైన పెసర, మినుము,పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలను రైతులు సుమారు 7.75 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెసర సుమారు 12 వేల ఎకరాల్లో రైతులు వేసుకున్నారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పంట కోతకు వచ్చింది. అక్కడక్కడ పంటను కోస్తున్నారు. ఇదే సమయంలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. కొన్ని చోట్ల పంటలు నీట మునిగి గింజలు పగిలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లపైనే గింజలు మొలకెత్తుతున్నాయి. ఎకరాకు సుమారు రూ. 15 వేల వరకు పెట్టుబడి పెట్టామని, చివరకు గింజ కూడా చేతికి రావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 60 శాతం వరకు పెసర పంట దెబ్బతిన్నట్లు తెలిసింది. వ్యవసాయ అధికారులు వర్షాలకు నీటి మునిగి దెబ్బతిన్న పంటలను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు.వర్షాలకు నీరు నిలిచి దెబ్బతిన్న పంట చేనుపైనే మొలకెత్తుతున్న వైనం ఆందోళన చెందుతున్న అన్నదాతలు -
ఆస్తి పంపకాల విషయంలో తగాదా
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నంసిద్దిపేటరూరల్: ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు తలెత్తడంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తోర్నాల గ్రామానికి చెందిన మేడిశెట్టి పుష్పమ్మకు ఇద్దరు కుమారులు నవీన్, శ్రవణ్ ఉన్నారు. నవీన్ ట్రాక్టర్ నడిపిస్తూ జీవనం సాగిస్తుండగా, శ్రవణ్ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అన్నదమ్ములు ఇరువురి భాగస్వామ్యంతో వరి కోత యంత్రం కొనుగోలు చేసి కొద్ది రోజులుగా నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా సంవత్సరం క్రితం వరికోత యంత్రానికి సంబంధించిన శ్రవణ్ భాగాన్ని నవీన్ కొనుగోలు చేశాడు. మరోవైపు నాటి నుంచి ఆస్తి పంపకాలు ఇతరత్రా వ్యవహారాల్లో ఇరువురి మధ్య వివాదం కొనసాగుతోంది. గొడవ చివరికి పోలీసు స్టేషన్కు చేరింది. దీంతో ఇరువురిని పోలీసులు మందలించి మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో నవీన్ ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగే ఫొటోను, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితుడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సీఐని సాక్షి వివరణ కోరగా... ఎవరిని కొట్టలేదని, వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, సమస్య పరిష్కారానికి సలహాలు ఇచ్చామన్నారు. ఎవరో కావాలని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని సీఐ తెలిపారు. -
చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎమ్మెల్యే సునీతా రెడ్డినర్సాపూర్ రూరల్: రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం చుంచెలుక పడిన నీరు తాగడంతో చిన్నారులు అస్వస్థతకు గురై నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న విషయం విధితమే. కాగా ఆదివారం ఎమ్మెల్యే సునీతా రెడ్డి అస్వస్థతకు గురైన పిల్లలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు మన్సూర్, శివకుమార్, భోగ శేఖర్, పంబల భిక్షపతి, రమణ ఉన్నారు. కాగా చిన్నారులను డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి పరామర్శించారు. అలాగే పిల్లలకు అందుతున్న వైద్యంపై ఆర్జేడీ ఝాన్సీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను పరామర్శించిన వారిలో డీడబ్ల్యూఓ హైమావతి, ఈడీపీఓ హేమ భార్గవి, సూపర్ వేజర్ సంతోష ఉన్నారు. -
తిమ్మాపూర్లో ప్రత్యేక వైద్య శిబిరం
● ఇంటింటికీ జ్వర సర్వే ● 212 మంది నుంచి రక్త నమునాల సేకరణ జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్లో విష జ్వరాలతో బాధపడుతున్న ఘటనపై ఈ నెల 16న సాక్షిలో ‘ తిమ్మాపూర్లో విషజ్వరాలు’ అనే కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ తిగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాజశేఖర్కు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 17న గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొదటి రోజు 85 మందికి రక్తనామునాలు సేకరించి, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే చేపట్టారు. 360 ఇళ్లలో మొత్తం 212 మంది నుంచి ఇప్పటికి వరకు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు వైద్యుడు రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో డెంగీతో చనిపోయిన మహేశ్, శ్రావణ్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకోగా డెంగీ లక్షణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో జిల్లా యంత్రాంగం, మండలంలోని వివిధ శాఖ అధికారులు స్పెషల్ డ్రై డే నిర్వహించారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం, మందులు పిచికారీ చేసి, చెత్త సేకరణ చేపట్టారు. జిల్లా వైద్యాధికారి ధనరాజ్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. వారం రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని, వైద్యులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా అనంతసాగర్లో కూడా విష జ్వరాలు విజృంభించాయని గ్రామస్తులు తెలిపారు. సుమారు పదిహేను మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నారని, ఇక్కడ కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. -
హామీలు అమలు చేయాలి
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగనర్సాపూర్ రూరల్: ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ దారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం నర్సాపూర్లో ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల 9న హైదరాబాద్లో చేపట్టనున్న మహాధర్నా సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నెల రోజులకే వికలాంగులు, వితంతువులు, వద్ధులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి మర్చిపోయారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది పెన్షన్పై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. కొత్తగా మరో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాగా అంతకుముందు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సూరారం నర్సింలు మందకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఇన్చార్జి సైదులు, వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు పాండు, కళామండలి సభ్యుడు రమేశ్ పాల్గొన్నారు. -
తాగునీటి తండ్లాట
హుస్నాబాద్: వర్షాకాలంలో కూడా ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా నిలిచిపోవడంతో తల్లడిల్లుతున్నారు. మండలంలోని మహ్మదాపూర్లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి రెండు పంపుల ద్వారా మున్సిపాలిటీతో పాటు పలు మండలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ, ఐదు రోజుల నుంచి అక్కన్నపేట మండలంలోని 5 గ్రామాలు, భీమదేవరపల్లి మండలంలో 14 గ్రామాలతోపాటు మున్సిపాలిటీ, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, గన్నెరువరం, ఇల్లంతకుంట మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. భగీరథ గ్రిడ్ నుంచి ప్రతి రోజు 330 లక్షల లీటర్ల (33 ఎంల్) నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఐదు రోజులుగా నీటిని నిలిపివేయడంతో ప్రజలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజల అవస్థలు హుస్నాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా మూడు బిందెల చొప్పున ఇస్తున్న నీరు సరిపోవడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. ట్యాంకర్ ఎప్పుడు వస్తోందో తెలియక పనులు విడిచిపెట్టి ఇంటి ముందు బిందెలు, ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లలో దాదాపు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి బోరు బావులు లేవు. భగీరథ నీళ్లు వస్తేనే దాహం తీరుతుంది. వారిని పట్టించుకునే నాఽథుడే కరువయ్యాడు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోమవారం లోగా సరఫరా చేస్తాం మహ్మదాపూర్లోని మిషన్ భగీరథ సంపునకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సబ్స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్యానల్ బోర్డు పూర్తిగా కాలిపోయింది. వాటి మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నాం. సోమవారం లోగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. –రామ్కుమార్, ఈఈ, గ్రిడ్ డివిజన్, హుజురాబాద్ -
డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి
జగదేవ్పూర్(గజ్వేల్): డెంగీ జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తిమ్మాపూర్లో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నాయిని మహేందర్–పోచమ్మ దంపతుల కుమారుడు శ్రావణ్(17) గజ్వేల్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం శ్రావణ్కు జ్వరం రావడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు క్లినిక్లో చికిత్స చేయించుకున్నాడు. జ్వరం ఎక్కువ అవడంతో శుక్రవారం రాత్రి గజ్వేల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో కొంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ జ్వరంగా గుర్తించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు.