breaking news
	
		
	
  Sangareddy District News
- 
      
                   
                                 పత్తిని ముంచిన మోంథా● రైతుల ఆశలపై నీళ్లు జల్లిన తుపాను ● ప్రభుత్వం ఆదుకోవాలని వినతి పత్తి రైతుల్ని మొంథా తుపాను నిలువెల్లా ముంచేసింది. అసలే ఈ ఏడాది వరుస వర్షాలతో దిగుబడి తగ్గిపోయి పత్తి రైతుల్ని తీవ్రంగా దెబ్బతీయగా తాజా ముసురు రైతులుపెట్టుకున్న చిన్నపాటి ఆశలపై కూడా ‘కన్నీళ్లు’చల్లింది. దీంతో పత్తి రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పత్తిరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. –మునిపల్లి(అందోల్) జిల్లాలో 3.48 లక్షల ఎకరాల్లో ఆయా గ్రామాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్లో పడిన భారీవర్షాలతో పత్తి పంట భారీగా దెబ్బతింది. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి ఆశించిన రైతులకు ప్రస్తుతం 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో పూర్తిస్థాయిలో కూరుకుపోయారు. సుమారు 45 రోజుల క్రితమే కూలీలతో పత్తితీతకు రైతులు అన్నీ సిద్ధం చేస్తుండగానే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడి పత్తిపంట దిగుబడి భారీగా పడిపోయింది. కొంతమంది రైతులకు ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే రావడంతో ఆ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంట దిగుబడి కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పు ఎలా కట్టాలో తెలియడం లేదని రైతులు మనోవేదన చెందుతున్నారు. ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకు పంట దిగుబడి కోసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వర్షాలు తమను నిండా ముంచాయని పలువురు రైతులు దుఃఖిస్తున్నారు. ఐదారు రోజుల తర్వాతే తీత పనులు గత 45 రోజుల నుంచి పలు తుపాన్ల రూపంలో వచ్చిన వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కష్టపడి పండించిన పత్తి పంటను వర్షాలు మట్టిపాలు చేశాయి. వర్షపు నీరు కారణంగా కూలీలు పత్తి తీయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. ఎండలు బాగా కాస్తే సుమారు ఐదు ఆరు రోజుల తర్వాత పత్తి పంట తీసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆధారం పంట నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పరిహారం మంజూరుకు సంబంధిత అధికారులకు నివేదిక అందజేస్తాం. –శివప్రసాద్, జిల్లా వ్యవసాయాఽధికారి తీవ్రంగా నష్టపోయా మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశా. అధిక వర్షాలు పత్తి పంటను దెబ్బతిశాయి. ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. ఎకరంన్నర భూమిలో పత్తితీత పనులు పూర్తయ్యాయి. జోరుగా వర్షాలు పడుతుండటంతో పత్తితీత పనులకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలి. –ఇస్మాయిల్, పత్తి రైతు, రాయికోడ్
- 
      
                   
                                 డీజిల్ దొంగల ముఠా అరెస్ట్రిమాండ్కు తరలింపుపెద్దశంకరంపేట(మెదక్): రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్ చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి గురువారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సబావత్ రాహుల్(వనపర్తి), కురుమ గణేష్(కామారెడ్డి), తోకల నాగరాజు(మహబూబ్నగర్)లు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ మేరకు డబ్బును సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఓ కారును అద్దెకు తీసుకొని డీజిల్ను దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇలా దొంగలించిన డీజిల్ను హైదరాబాద్లోని బోరబండకు చెందిన అన్వర్కి అమ్ముతున్నారు. ఈ నెల 25న పెద్దశంకరంపేటలో నారాగౌడ్కు చెందిన లారీల్లో 150 లీటర్ల డీజిల్తో పాటు గోదాం తాళంను పగలగొట్టి బ్యాటరీ, లారీ జాక్ను ఎత్తుకెళ్లి విక్రయించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమనాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని విచారించగా దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అన్వర్ పరారీలో ఉండగా.. మిగతా ముగ్గురినిఅరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
- 
      
                   
                                 బెదిరింపు కేసును ఛేదించిన పోలీసులునిందితుల రిమాండ్ దుబ్బాకటౌన్: అక్బర్పేట–భూంపల్లి మండలంలోని రుద్రారంలో ఆర్ఎంపీ ఇంట్లోకి చొరబడి, తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిద్దిపేట ఏసీపీ రవీందరెడ్డి వెల్లడించారు. రుద్రారంలో ఆర్ఎంపీ లక్ష్మీనర్సయ్య ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడి చంపుతామంటూ తుపాకీతో బెదిరించారన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ధర్మారానికి చెందిన మొగిలి భిక్షపతి, కాసులాబాద్కి చెందిన గోవిందారం బ్రహ్మం, రుద్రారానికి చెందిన రంగనమైన నర్సింలు అలియాస్ కమలాకర్తో పాటు రుద్రారానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు నరేందర్ రెడ్డిని నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు హరీష్, సమతను ఏసీపీ ప్రత్యేకంగా అభినంధించారు.
- 
      
                   
                                 నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలిసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు గజ్వేల్రూరల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్లో రాణే పరిశ్రమ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులకు రక్షణగా ఉండే చట్టాలను బలహీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. వేతనాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పర్మినెంట్ ఉద్యోగులు లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ పరిశ్రమల యాజ మాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి వాటిని అమలు చేసేందుకు శ్రమశక్తి నీతి 2025 పేరుతో తీసుకువచ్చిన నూతన లేబర్ పాలసీని సీఐటీయూ వ్యతిరేకిస్తుందని తెలిపారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల రణక్ష కోసం పోరాటు చేసేందుకు డిసెంబర్ నెలలో మెదక్లో రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు వేణుగోపాల్, బండ్లస్వామి, యూనియన్ చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్, రంగారెడ్డి పాల్గొన్నారు.
- 
      
                   
                                 రహదారులు ధ్వంసంగుంతలమయంగా రోడ్లు ● అవస్థలు పడుతున్న ప్రజలు జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండల పరిధిలోని పలు రోడ్లు వర్షాలకు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు గుంతలు పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగ్గుతోంది. గుంతల వల్ల బైక్లు అదుపు తప్పి పడిపోతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకోవడంతో వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. మరమ్మతులు కూడా లేవు జహీరాబాద్–అల్లాన రోడ్డు గుంతలమయంగా తయారైంది. బైపాస్ రోడ్డు నుంచి అల్లనా మీదుగా దిడ్గి చౌరస్తా వరకు రోడ్డుపై ఎక్కడ చూసిన పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. నిత్యం వాహనాల రద్దీ ఉండే రోడ్డుపై వెళ్తుంటే సర్కస్ ఫీట్లు చేసినట్లుగా ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డుపై పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు కూడా చేయడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. బైక్లు అదుపుతప్పి పడిపోతున్నాయి. మండలంలోని బూచినెల్లి రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతింది. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు గల సుమారు ఐదారు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ప్రజలు నరకం చూస్తున్నారు. ఇటీవల గ్రామస్థులు ముందుకు వచ్చి బురదమయంగా తయారైన రోడ్డుపై సొంత డబ్బులతో కంకరు వేసి గోతులను పూడ్చిపెట్టారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరినా పట్టించుకునే వారు కరువైయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్–శేఖాపూర్ రోడ్డు కూడా దెబ్బతిని గుంతలు పడ్డాయి. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో పడిన గుంతల కారణంగా దగ్గరకు వచ్చే వరకు వాహనదారులు గమనించడంలేదు. అధికారులు స్పందించి దెబ్బతిని అధ్వాన్నంగా మారిన రోడ్లను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
- 
      
                   
                                 గుంతలు మిగిల్చిన మోంథామోంథా తుపాను కారణంగా సంగారెడ్డి నుంచి పెద్దాపూర్ వెళ్లేదారిలో రహదారి అడుగడుగునా గుంతలమయంగా మారింది. దీంతో మూడు రోజులుగా హాస్టల్గడ్డ నుంచి చింతలపల్లి, ఇరిగిపల్లి, పెద్దాపూర్ మీదుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు తెలియక నీళ్ళల్లో పడిపోతున్నారు. దశాబ్దకాలంగా ఈ ప్రాంత వాసులకు రహదారి సమస్య ఉన్నా అధికారులు చొరవ చూపడంలేదని జనం వాపోతున్నారు. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
- 
      
                   
                                 అక్రమాలకు ‘అండదండ’లుపటాన్చెరు: అమీన్పూర్లోని వాణీనగర్లో అన్ని అనుమతులతో సర్వే నంబర్ 174 పరిధిలో వెలుస్తున్న నిర్మాణాలపై స్థానిక మాజీ కౌన్సిలర్ కన్ను పడింది. తనను సంప్రదించకుండా హెచ్ఎండీఏ అనుమతులతో ఆ బిల్డర్ నిర్మాణ పనులు చేపడుతుండటంతో ఆ మాజీ కౌన్సిలర్కు చిర్రెత్తి పోయింది. దీంతో మున్సిపల్ సిబ్బందిని పురమాయించి పనులు ఆపాలని హుకుం జారీ చేశాడు. కానీ ఆ బిల్డర్ ఎవరికీ బెదరలేదు. ఏం చేయాలో తోచక ఆ మాజీ కౌన్సిలర్ ఆ బిల్డింగ్కు హెచ్ఎండీఏ తప్పుడు పద్ధతిలో అనుమతి ఇచ్చిందని మీడియాకు చెప్పడంతో పలు కథనాలు వెలువడ్డాయి. మొత్తమ్మీద అధికారులు ఆ కథనాలకు స్పందించారు. రెవెన్యూ, మున్సిపల్, సర్వే, ఇరిగేషన్శాఖల అధికారులు సంయుక్తంగా ఆ భవంతి నిర్మాణ పనులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అన్ని అనుమతులు సక్రమంగానే ఉన్నాయని అధికారులు తేల్చారు. మాజీకౌన్సిలర్లు, చోటా నేతల ఫిర్యాదులతో అధికారులు విసుగెత్తిపోతున్నారు. పటాన్చెరు అమీన్పూర్ మండల పరిధిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అమీన్పూర్లో మరో ఘటనలో ఓ బిల్డర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కోసం హెచ్ఎండీఏ అనుమతులతో భవంతి నిర్మాణం చేసుకున్న తర్వాత కమర్షియల్గా మార్చారు. ఆ భవన నిర్మాణ యజమానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. తప్పు చేస్తున్నావని హెచ్చరించారు. దాంతో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆ భవంతికి అండగా నిలిచారు. ఆయన చేసిన తప్పేమీ లేదని ప్రెస్మీట్ పెట్టారు. అధికారులకు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధితో ఫోన్ కూడా చేయించారు. ఆ అక్రమ భవంతిని సక్రమం చేసేందుకు ఓ నేత డబ్బులు కూడా డిమాండ్ చేశారని చెప్తున్నారు. ఇదిలాఉండగా అమీన్పూర్ పరిధిలోని వాణీనగర్, హెచ్ఎంటీ కాలనీలో పార్టీలకతీతంగా నేతలు బిల్డర్లను బెదరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమీన్పూర్ పట్టణ పరిధిలో విలీనమైన కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో అక్రమ నిర్మాణాలను నిలువరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నేతల జోక్యంతోనే సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. చర్యలకు అడ్డంకి.. చిట్కుల్, ఇంద్రేశంలలో అక్రమ నిర్మాణాలకు నేతలు అండగా నిలుస్తున్నారు. నేతల అండ చూసుకుని నిర్మాణాలు సాగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నట్లు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి అక్రమ భవంతులకు వత్తాసు పలుకుతున్న నేతలను చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.అక్రమ నిర్మాణలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే వాటికి వంత పాడుతుండటంతో అధికారులు అవాక్కవుతున్నారు. పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం, అమీన్పూర్ మున్సిపాలిటీల్లో ఈ తంతు జోరుగా సాగుతుండటం గమనార్హం. అయినా ఉన్నతాధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే కానీ అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- 
      
                   
                                 అనుమతిలేని వెంచర్లుజహీరాబాద్ జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు ఆశ చూపుతూ జహీరాబాద్లో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇండ్ల నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేకున్నా రియల్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేసి అమ్మకాలకు పెడుతున్నారు. నల్లరేగడి నేలల్లో సైతం పెద్ద సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. ఆన్లైన్లో అమ్మకాలకు పెట్ట డంతో కొందరు సైట్ చూడకుండానే కొనుగోలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు. జహీరాబాద్ దాని చుట్టుపక్కలా వేలాది ఎకరాల్లో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నాయి. ఇప్పటివరకు అనుమతులు పొందిన వెంచర్లు 42 మాత్రమే ఉండగా 100కు పైగా అనుమతులు లేని వెంచర్లే ఉన్నాయి. అయినా రియల్టర్లు వాటిలో ప్లాట్లను అమ్మకాలకు పెడుతున్నారు. పట్టణం చుట్టుపక్కల ఉన్న అల్లీపూర్, పస్తాపూర్, చిన్న హైదరాబాద్, రంజోల్, హోతి(కె) గ్రామాలను జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో విలీనం చేశారు. ఆయా గ్రామాల్లో గతంలో గ్రామ పంచాయతీలో నామమాత్రపు అనుమతులు పొందారు. ఇప్పుడు వెంచర్లను ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. పార్కుల స్థలాలు వదలకుండా అందినకాడికి దండుకుంటున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కురిస్తే ఇప్పటికే పలు వెంచర్లలోని ఇళ్లు నీట మునుగుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగాలేని నల్లరేగడి భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి, వాటిలో అక్రమంగా వేలాది టిప్పర్ల ఎర్రమట్టిని పోసి కొనుగోలుదారులకు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. జహీరాబాద్ సమీపంలో 12వేల ఎకరాల్లో నిమ్జ్ ప్రాజెక్టు వస్తుండటంతో ఈ ప్రాంతం భారీస్థాయిలో అభివృద్ధి చెందనుందనే ఆశతో ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి బలహీనత, ఆశలను ఆసరాగా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. రియల్టర్లు సొమ్ము చేసుకునేందుకు అనువుగాలేని భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. వెంచర్లలో నుంచి వెళ్లే వరద కాలువలను సైతం దారి మళ్లిస్తున్నా నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు వెంచర్లలో వాగులను దారి మళ్లించారు. అనుమ తుల్లేని వెంచర్లలో క్రయ విక్రయాలను నిలిపివేసి అమాయకులు నష్టపోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు గుడ్డిగా వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసుకోకూడదు. ఇండ్ల నిర్మాణానికి అనువుగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేసుకోవాలి. అనుమతులు లేని వెంచర్లలో అమ్మకాలు జరిపితే చట్టపరంగా చర్యలు చేపడతాం. –సుభాష్రావు, మున్సిపల్ కమిషనర్నిర్మాణాలకు అనుకూలంగా లేకున్నా ఏర్పాటు
- 
      
                   
                                 పంటలన్నీ వర్షార్పణంమోంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో పంటలన్నీ వర్షార్పణం అయ్యాయి. అసలే రైతులు అతివృష్టి కారణంగా కుదేలయ్యారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ తుపాను మళ్లీ రైతులను నిండా ముంచింది. కోతకు వచ్చిన వరిపొలాలు నేలకొరిగి నీళ్ళల్లో మురుగుతున్నాయి. పత్తిచేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొంతమంది రైతులు కూరగాయలు వేసుకుంటే వరద ధాటికి నీళ్లు ప్రవహించి పొలాలు మైదానంలా మారాయి. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
- 
      
                   
                                 పిల్లుట్లలో చోరీశివ్వంపేట(నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గంగుల కిష్టారెడ్డి, అనసూయ ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి పైనుంచి లోనికి వచ్చి బీరువా పగులగొట్టారు. ఏమీ దొరకకపోవడంతో మరోగదిలో డబ్బాలో ఉన్న 4 తులాల బంగారం, రూ.65 వేలు అపహరించారు. నిద్రిస్తున్న అనసూయ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు తీయడానికి ప్రయత్నించగా ఆమె మేలుకుని అరవడంతో దొంగలు పారిపోయారు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీంతో పరిశీలించి ఆధారాలు సేకరించారు. గ్రామానికి చెందిన ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
- 
      
                   
                                 చిరుత కలకలంతూప్రాన్: మండల పరిధిలోని గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కనిపించిన చిరుత మరోమారు బుధవారం కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉదయం అటవీ ప్రాంతంలోని ఓ గుట్టపై చిరుతను పలువురు గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో బుధవారం పోలీసులు నార్కోటిక్ డాగ్ తనిఖీలు చేపట్టారు. బస్టాండ్తోపాటు జనసంచార ప్రదేశాలు, పలు వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేశారు. భద్రత చర్యల్లో భాగంగా గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. డ్రగ్స్, గంజాయి, తదితర మత్తు పదార్థాలు రవాణా, విక్రయాలు నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనుమానంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జహీరాబాద్ టౌన్: మండలంలోని గిరిజన తండాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ను ఆల్ఇండియా ట్రైబల్ ఫెడరేషన్(ఏఐటీఎఫ్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్పవార్ కోరారు. బుధవారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ తండాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మూత్రశాలలు, తాగునీరు, సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్ నవంబర్లో జహీరాబాద్కు వస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. మద్దూరు(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని గాగిళ్లాపూర్లో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేక రామాంజనేయులు మంగళవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద పాడిగేదెను కట్టేశారు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. బోరు మోటార్కు ఉన్న సర్వీసు వైరు పాడిగేదెకు చుట్టుకుని, విద్యుత్ షాక్కు గురై మృతి చెందిందని బాధిత రైతు తెలిపాడు. గేదె విలువ రూ.లక్ష వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. తప్పిన ప్రమాదం నారాయణఖేడ్: ఓవర్లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. కంగ్టి వైపునుంచి ఖేడ్ వైపు మంగళవారం రాత్రి ఓవర్ లోడ్తో వస్తున్న లారీ మున్సిపాలిటీ పరిధిలోని నెహ్రూనగర్ హనుమాన్ ఆలయ సమీపంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు.
- 
      
                   
                                 విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ సర్టిఫికెట్లుసిద్దిపేటరూరల్: జక్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో డాటా ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక భావనలపై 8 వారాల కోర్సు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు పొందారని ప్రధానోపాధ్యాయుడు షౌకత్అలీ బుధవారం తెలిపారు. 13 మంది విద్యార్థులు కోర్సు నేర్చుకున్నారని, వారిలో 11 మంది ఉత్తీర్ణత సర్టిఫికెట్, మరో ఇద్దరు భాగస్వామ్య సర్టిఫికెట్ పొందారని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు రాజేందర్ను ఉపాధ్యాయ బృందం సన్మానించింది. అనంతరం ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పొందిన సర్టిఫికెట్లను అందించారు. బక్రిచెప్యాల పాఠశాల... సిద్దిపేట అర్బన్: ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో అందించిన ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సును బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పూర్తి చేశారని ఉపాధ్యాయుడు పూర్ణచందర్రావు తెలిపారు. పదవ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు దుగ్యాని చైతన్య, సూరం సుష్మిత, స్నేహ, పిండి సహస్ర, బొమ్మ కీర్తన కోర్సు పూర్తి చేశారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేందర్రెడ్డి సర్టిఫికెట్స్ను అందించి అభినందించారు.
- 
      
                   
                                 12 మందికి ఐదుగురే హాజరు?హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 12 మంది టీచర్లు ఉంటే బుధవారం ప్రార్థన సమయానికి ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. విద్యార్థులకు ఎస్ఏ పరీక్షలు 9.15 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉన్నా.. టీచర్లు రాకపోవడంతో కాలేదు. 9.30 నిమిషాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడు హాజరు రిజిస్టర్లో మూడు రోజుల సంతకాలు పెట్టి బయటకు వెళ్లిపోయాడు. నిత్యం ఇలాగే ఉపాధ్యాయులు, వంట చేసే సిబ్బంది సైతం విధులకు గైర్హాజరు అవుతున్నారని విద్యార్థుల తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విధులకు రాని ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడు హాజరు వేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిత్యం ఇదే తంతు
- 
      
                   
                                 మొబైల్యాప్లో వన్యప్రాణుల గణనశిక్షణకు హాజరైన ఫారెస్ట్ సిబ్బందిచిన్నశంకరంపేట(మెదక్): వన్యప్రాణుల గణన కోసం మొబైల్యాప్ను ఉపయోగించి కచ్చితమైన సమాచారం సేకరించేందుకు అటవీశాఖ సిబ్బంది కృషి చేయాలని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి కోరారు. బుధవారం నార్సింగి మండల వల్లూర్ సెంట్రల్ నర్సరీలో జిల్లాలోని అటవీశాఖ సిబ్బందికి ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో జరుగుతున్న వన్యప్రాణుల లెక్కింపుపై ప్రత్యేక దృష్టితో పనిచేయాలని సూచించారు. మొదట ఎంచుకున్న ప్రదేశంలో సంచరిస్తున్న వన్యప్రాణులను అంచనా వేసి మొబైల్యాప్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విజయ్కుమార్, ఆఫీసర్ రామలీల, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                    ఆలు సాగులో మెలకువలుకూరగాయల సాగుపట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో ప్రధానంగా ఆలుగడ్డ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ పంటలు వేసుకుంటారు. జహీరాబాద్ ప్రాంతంలోనే అత్యధికంగా సాగవుతుంది. రైతులు విత్తనం నాటినప్పటి నుంచి పంటను తీసుకునే వరకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై డీడీఎస్–కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త జి.శైలజ రైతులకు పలు సూచనలు చేశారు. –జహీరాబాద్వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగటి వేళ 32 డిగ్రీల సెంటిగ్రేడ్, రాత్రి 15–20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న నేలలు ఆలుగడ్డ సాగుకు అనుకూలం. ఆలు విత్తనాన్ని తెగుళ్లు, వ్యాధులు సోకని వాటిని ఎంపిక చేసుకోవాలి. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దుంపలను ఎంచుకోవాలి. ప్రతి దుంప సుమారుగా 30 నుంచి 40 గ్రాముల మేర బరువు ఉండాలి. కన్నులు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి 10 లీటర్ల నీటికి ధమోవనారిమాను 100 గ్రాములు, జిబ్బరెల్లిక్ ఆమ్లం 10 మిల్లి గ్రాములను కలిపి దుంపలను 10 నిమిషాల పాటు ఉంచి, తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. నేల తయారీ.. ఎరువులు.. మూడు నుంచి నాలుగు సార్లు లోతు దుక్కి దున్నుకోవాలి. బోదెలు, సాళ్ల పద్ధతిలో నాటుకుంటే మొలక శాతం ఎక్కువగా వస్తుంది. ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ పాస్పేట్, 40 కిలోల యూరియా, 30 కిలోల పొటాష్ చల్లుకోవాలి. దుంపలను నాటే ముందు శిలీంధ్ర నాశనితో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒక లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెట్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ను కలిపి దుంపలను 20 నిమిషాల పాటు నానబెట్టి, తరువాత నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. కలుపు నివారణకు దుంపలను నాటిన తర్వాత మెట్టిబుజిన్ను పిచికారీ చేయాలి. ప్రతి 7 రోజులకు లేదా 10 రోజులకు క్రమం తప్పకుండా నీటిని డ్రిప్, లేదా స్ప్రింక్లర్ల ద్వారా అందించాలి. రసం పీల్చే పురుగల బెడద ఉంటే డైమిథోయేట్ 3. మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒకటి లేదా రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. శనగపచ్చ పురుగును గమనిస్తే ఎకరానికి 4–10 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర్లి బ్లెట్ ఉంటే మాంకోజెట్ 2.5 గ్రా, లేదా 2 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేట్ బ్లెట్ ఆకుల కింద తెల్లటి వలయాకార మచ్చలు ఏర్పడితే.. 2 మి.లీ హెక్సాకోనజోల్ లేదా 2 గ్రాముల క్లోరోదాలోనిల్ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే తెగుళ్లు తగ్గి అధిక దిగుబడులను సాధించవచ్చు. విత్తనం ఎంపిక ముఖ్యమే.. చీడ,పీడలకు మందులుపిచికారీ చేయాలి డీడీఎస్–కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త జి.శైలజ
- 
      
                   
                                 తుపాకీతో ఆర్ఎంపీకి బెదిరింపులుమాజీ మిలిటెంట్ల పనేనా!మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఇద్దరు అగంతకులు ఓ ఇంట్లోకి చొరబడి తుపాకితో బెదిరించిన ఘటన కలకలం సృష్టిస్తోంది. డబ్బుల కోసం తుపాకితో బెదిరించింది అగంతకులా లేక మాజీ మిలిటెంట్లేనా అంటూ మండల పరిధిలో జోరుగా చర్చ జరుగుతోంది. వివరాలు ఇలా... మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ లక్ష్మీనర్సయ్య ఇంట్లోకి మంకీ క్యాపులు ధరించిన ఇద్దరు అగంతకులు వచ్చారు. తమది సిరిసిల్ల జిల్లా అనీ, ఇంట్లో ఉన్న నగలు డబ్బులు ఇవ్వాలంటూ తుపాకి చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు తేరుకుని కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు వచ్చి పట్టుకునేలోపు బైక్పై పారిపోయారు. స్థానికులు పట్టుకునే పెనుగులాటలో ఓ అగంతకుడి మంకీ క్యాపు ఊడిపోయింది. దీంతో ఆ వ్యక్తి ధర్మారం గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై మిరుదొడ్డి ఎస్ఐ సమతను వివరణ కోరగా... రుద్రారంలో ఇద్దరు అగంతకులు తుపాకితో బెదిరింపులకు పాల్పడింది వాస్తవమేనన్నారు. నిందితులను పట్టుకుని త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా దుండగులను పట్టుకుని శిక్షించాలని బాధితుడు ఆర్ఎంపీ లక్ష్మీనర్సయ్య అధికారులను కోరారు. రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను కోరాడు. బాధితుడిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం పరామర్శించారు. అగంతకులను పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.నాయకులు జెన్నారెడ్డి, కనకయ్య, రాజేశ్వర్రెడ్డి, అశోక్గౌడ్, సంజీవ్, లక్ష్మినర్సు, కిష్ట య్య, రాజు, ఆంజనేయులు, ప్రశాంత్ ఉన్నారు.
- 
      
                   
                                 భారతదేశం సంప్రదాయాలకు నిలయంకంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతికొండపాక(గజ్వేల్): దేవాలయాలు భావితరాలను హిందూ, సనాతన వైదిక ధర్మాలవైపు నడిపిస్తాయని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మర్పడ్గలో గల విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆయన విజయదుర్గ మాతకు స్వర్ణ కిరీట ధారణ చేశారు. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమన్నారు. కూలీ నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల సహకారంతో విజయదుర్గ మాతకు 1600 గ్రాముల స్వర్ణ కిరీటధారణలో భాగస్వాములవ్వడం గొప్ప విషయమన్నారు. ఏదేని పనిని సత్సంకల్పంతో మొదలు పెడితే తప్పకుండా విజయం వైపు నడిపిస్తాయన్నారు. కార్తీక మాసంలో శివాలయాల్లో చేసే పూజలు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయన్నారు. అంతకు ముందు క్షేత్రం నిర్వాహకులు హరినాథ శర్మ ఆధ్వర్యంలో రాంపూర్ దేవాలయ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, కలెక్టర్ హైమావతి పూర్ణకుంభంతో జగద్గురు శంకరాచార్య విజయేంద్ర స్వామికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి, దేవాలయ కమిటీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.జగద్గురు శంకరాచార్య విజయేంద్ర స్వామికి స్వాగతం పలుకుతున్న కలెక్టర్ హైమావతివిజయ దుర్గామాతకు స్వర్ణ కిరీటధారణ చేసిన దృశ్యం
- 
      
                   
                                 మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యశివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని మగ్ధుంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహ్మద్ బిన్ఇద్రిస్(42) కొన్నాళ్ల నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం పురుగుల మందు తాగాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తూప్రాన్కు తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడు భార్య శాహిన్బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు.. జిన్నారం (పటాన్చెరు): అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంద్రజిత్పాల్ (25) కొంతకాలంగా గడ్డపోతారం పట్టణ పరిధిలోని కిష్టయ్యపల్లిలోని ఓ వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం తాను పనిచేసే పాంట్ వద్దకు వెళుతున్నాడు. ఈ క్రమంలో పంటపొలాల్లో నడుచుకుంటూ వెళ్లే క్రమంలో వరం మీది నుంచి కిందపడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విధులు నిర్వహిస్తూ కార్మికుడు.. జిన్నారం (పటాన్చెరు): విధులు నిర్వహిస్తూ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన గడ్డపోతారం పారిశ్రమికవాడలో చోటు చేసుకుంది. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... ఛత్తీస్గఢ్కు చెందిన ఆశి శ్రీనివాసరావు (49) కొన్నేళ్లుగా బొల్లారం పట్టణ పరిధిలోని వెంకట్ రెడ్డినగర్లో నివాసముంటున్నాడు. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీఫార్మా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం విధులు నిర్వహిస్తుండగా కిందపడిపోయాడు. దీంతో వెంటనే సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా పపరిశ్రమ నిర్వాహకులు మాత్రం ఎలాంటి ఘటన జరగలేదని చెబుతున్నారు. దీంతో కార్మికుడి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- 
      
                   
                                 దళారులతో మోసపోవద్దువట్పల్లి(అందోల్): ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని విక్రయించే సమయంలో దళారులను ఆశ్ర యించి మోసపోవద్దని జోగిపేట ఏయంసీ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రామకృష్ణ జిన్నింగ్ మిల్, సిద్ధార్థ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. పత్తి ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.8110, బీ గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.8,060 ప్రభుత్వం మద్దతు ధరలు చెల్లిస్తుందన్నారు. తేమశాతం 12% లోపల ఉండేలా రైతులు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, ఏయంసీ కార్యదర్శి సునీల్, సీపీఓ తిరుపతిరెడ్డి రైతులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 రోజంతా కురిసిన చిరు జల్లులుగురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● ఝరాసంగంలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదు ● ఇబ్బందులు పడిన జిల్లా వాసులు మొంథా ముసురుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మొంథా తుఫాను ప్రభావంతో ముసురు పట్టింది. బుధవారం తెల్లవారు ఝాము నుంచి రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. చెప్పుకోదగిన వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ ఎడతెరిపి లేకుండా ముసురు పట్టడంతో జనం తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ప్రధానంగా ఉదయం పూట పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. అలాగే ఆఫీసు వెళ్లేవారు, చిరు వ్యాపారులకు కూడా ముసురు కష్టాలు తప్పలేదు. రోడ్లపై వర్షం నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముసురుతో కల్లాల్లో ఉన్న వర్షం తడిసి ముద్దయింది. కోతలు కోసి రోడ్లపై వడ్లు ఆరబెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుని పోకుండా కాపాడుకునేందుకు అనేక తంటాలు పడ్డారు. తగినన్ని టార్పాలిన్లు లేకపోవడంతో బస్తాలు కప్పుకుని ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. జిల్లాలో చాలాచోట్ల రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోశారు. తేమశాతం తగ్గించుకునేందుకు రోడ్లపై పోసిన ధాన్యం ఇప్పుడు తడిసిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా కల్హేర్, హత్నూర, నారాయణఖేడ్, వట్పల్లి తదితర మండలాల్లో ధాన్యం రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాగే జోగిపేట్లోని మార్కెట్యార్డులో ధాన్యం తడిసిపోయింది. తూకాలు వేసేందుకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో పత్తితీత జోరందుకుంది. ఈ క్రమంలో కురిసిన ముసురుతో రాయికోడ్, సదాశివపేట, సంగారెడ్డి, కొండాపూర్, మునిపల్లి, వట్పల్లి, నారాయణఖేడ్ తదితర మండలాల్లో పత్తి దెబ్బతింది. పత్తి కాయల్లో ఉన్న పత్తి తడిసిపోవడంతో అది రంగు మారి నల్లబడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి చేలల్లోకి వర్షం నీరు చేరడంతో మొక్కకు కింద భాగంలో ఉన్న పత్తి నీటిలో మునిగి నేల పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం ఏమాత్రం ఎక్కువగా ఉన్నా సీసీఐ కొనుగో లు చేయడం లేదని, ఇప్పుడు పూర్తిగా తడిసిపోయి న పత్తిని ఎండబెట్టాలంటే ఎన్నిరోజులు పడుతుందోనని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండండిఝరాసంగంలో 2.1 సెం.మీలు తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురియకపోయినప్పటికీ తేలికపాటి వర్షంపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా ఝరాసంగం మండలంలో 2.10 సెం.మీ.ల వర్షపాతం రికార్డు అయింది. అలాగే మునిపల్లిలో 2 సెం.మీలు, కొండాపూర్, రామచంద్రాపురంలో 1.8 సెం.మీల చొప్పున, జిన్నారంలో 1.5 సెం.మీలు, కోహీర్లో 1.4 సెం.మీలు, అమీన్పూర్లో 1.3 సెం.మీలు, పటాన్చెరు 1.2 సెం.మీలు, పుల్కల్లో 1.1 సెం.మీలు, రుద్రారంలో 1 సెం.మీల వర్షం కురిసింది. భారీ వర్షాలు నమోదు కాకపోయినప్పటికీ, ముసురుతో జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు.
- 
      
                   
                                 పక్కాగా భూసేకరణ● విండ్ టవర్ల తొలగింపునకు చర్యలు ● నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షిజహీరాబాద్ టౌన్: నిమ్జ్(జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి) భూ సేకరణ పనులు జోరుగా సాగుతున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన ఆకస్మిక దాడులతో ఆ జోరు కాస్తా నెమ్మదించింది. భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు ఏసీబీకి దొరికిపోవడంతో రెండు నెలల నుంచి భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రైతులతో నిత్యం కిక్కిరిసిపోయే నిమ్జ్ కార్యాలయం కళ తప్పింది. రాజు స్థానంలో నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలక్షి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యాకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. భూసేకరణ పనులతో పాటు పరిహారం చెల్లింపులు చేపడుతున్నారు. నిమ్జ్ కార్యాలయం తిరిగి రైతులతో కళ కళలాడుతోంది. ఈ సందర్భంగా నిమ్జ్ భూసేకరణ తదితర అంశాలపై విశాలాక్షి మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్: ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని ఎల్గోయి, బర్దీపూర్, చిలేపల్లి, రుక్మాపూర్, ముంగి, హద్నూర్, మొలకన్పాడు, రేజింతల్, గంగ్వార్, న్యామతాబాద్, మెటల్కుంట, గణేశ్పూర్, హుసెల్లి, బసంత్పూర్, కల్బెమల్, మామిడ్గి, గుంజెట్టి 17 గ్రామాల్లో భూసేకరణ చేపడుతున్నాం. డిప్యూటీ కలెక్టర్: భూసేకరణ లక్ష్యం 12,635 ఎకరాలు ఉంది. ఇందులో పట్టా, ప్రభుత్వ భూములున్నాయి. ఇప్పటి వరకు సుమారు 8 వేల ఎకరాల వరకు భూసేకరణ జరిగింది. డిప్యూటీ కలెక్టర్: ఫేజ్ వన్లో ఎల్గోయి, బర్దీపూర్, చిలేపల్లి గ్రామాల్లో 3,240 ఎకరాలు సేకరించాల్సి ఉండగా సుమారు 3 వేల ఎకరాల భూమిని సేకరించాం. మిగతా భూమికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి సేకరించే పనిలో ఉన్నాం. డిప్యూటీ కలెక్టర్: సెకండ్ ఫేజ్లో 9.747 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు 4 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాం. హద్నూర్, మామిడ్గి తదితర గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ కాగా పరిహారం చెల్లింపులపై కసరత్తు చేస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్: నిమ్జ్లో భారీ పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఒప్పందాలు జరిగాయి. జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.డిప్యూటీ కలెక్టర్: భూసేకరణ పనులు పక్కాగా చేపడుతున్నాం. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు పరిహారం చెల్లిస్తున్నాం. కొంత జాప్యం జరిగిన పక్కాగా చేస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్: నిమ్జ్ భూముల్లో కొన్ని విండ్ టవర్లున్నాయి. వాటిని తొలగిస్తాం. ఈ మేరకు ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- 
      
                   
                                 హరీశ్రావుకు రాములునేత పరామర్శజహీరాబాద్ టౌన్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావును జాగో తెలంగాణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ రాములు నేత బుధవారం పరామర్శించారు. హరీశ్రావు తండ్రి మరణించిన విషయం తెసుకున్న రాములునేత హైదరాబాద్లోని హరీశ్రావు నివాస గృహానికి వెళ్లి కలిశారు. అనంతరం ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట జాగో తెలంగాణ కార్యవర్గ సభ్యులున్నారు. గీత కార్మికులకు పింఛను ఇవ్వాలికల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ సంగారెడ్డి టౌన్: అర్హులైన కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం రూ.నాలుగు వేల పింఛను అందించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో బుధవారం కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికుల ఉపాధి కోసం గౌడ కులస్తుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఈత, తాటి చెట్ల పెంపకానికి, అనేక విధాలుగా కార్మిక సంఘం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దళారులను ఆశ్రయించొద్దుమున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎవరూ మధ్యవర్తుల్ని, దళారుల్ని ఆశ్రయించవద్దని మున్సిపల్ కమిషనరు జగ్జీవన్ సూచించారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ బిల్డ్నౌలో ఆన్లైన్ ద్వారా నేరుగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫీజులను సైతం ఆన్లైన్లోనే చెల్లించాలన్నారు. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అనుమతులిస్తామని తెలిపారు. మధ్యవర్తులు, దళారులు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇది శాండ్విక్ కార్మికుల విజయంసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్చెరు టౌన్: శాండ్విక్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరగాలని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు నెలలుగా చేసిన పోరాటం విజయవంతమైంది. కార్మికులు చేసిన ఆందోళనలతో జీవోలకు మించి వేతనాలు సాధించుకున్నారని ఇది పూర్తిగా కార్మికుల విజయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యంపై ఒత్తిడి చేసి జీవోపై అదనంగా రూ. 285ల పెరుగుదల సాధించామన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు సౌకర్యాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ నికరంగా పోరాడుతోందని, ఈ పోరాటానికి ఐక్యంగా మద్దతునివ్వాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో యూనియన్ నాయకులు పాండురంగారెడ్డి, వీరారావు, వీఆర్కే రాజు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 అభివృద్ధి పనులు వేగవంతంకలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పారిశ్రామిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్లలో కొనసాగుతున్న నిమ్జ్, జాతీయ రహదారి–65 విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ, నిమ్జ్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిమ్జ్, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు జాప్యం లేకుండా పరిహారం అందించాలన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు నిధల కొరత లేదని స్పష్టం చేశారు. జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా చేపట్టిన సర్వీస్ రోడ్డు పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్పామ్ సాగుకు భూములు గుర్తించాలి జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనువైన భూములను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఒకసారి ఆయిల్ ఫామ్ పంట దిగుబడి రావడం ప్రారంభమైతే 25–30 ఏళ్లపాటు వరుసగా ఆదాయం వస్తుందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 3,750 ఎకరాలు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 1,400 ఎకరాలలో సాగు చేసినట్లు తెలిపారు. ప్రతీరోజు రైతులు సహకార సంఘానికి వస్తుంటారని అలాంటి రైతులకు సీఈవోలు ఆయిల్పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ప్రోత్సాహక పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు తగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పీఏసీఎస్ కార్యదర్శులు రైతులను చైతన్యపరచడంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సమావేశంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి–జహీరాబాద్ ఆర్డీఓలు, టీజీఐఐసీ, నిమ్జ్, జాతీయ రహదారి అథారిటీ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి పీహెచ్ పండరీ, డీసీఓ కిరణ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఆదాయ, వ్యయాలపై ఆరాసంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రతీ ఏటా వివిధ రకాల నిధులతో అనేక అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఈ అభివృద్ధి పనులకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ వివరాలను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ఆడిట్లో నిధులు సద్వినియోగమయ్యా లేక అక్రమ మార్గం పట్టాయా అనే అంశాన్ని తేలుస్తారు. గత ఆర్థిక ఏడాది 2024–25కు సంబంధించిన ఆదాయ, వ్యయాలపై ప్రస్తుతం ఆడిట్ కొనసాగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చులపై ఆడిటర్లు తనిఖీలు చేస్తారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్తు, వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో ప్రతీ ఏటా వార్షిక తనిఖీ చేస్తుంటారు. వీటన్నంటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరవుతాయి. వీటితోపాటు పంచాయతీలకు సాధారణ నిధులతోపాటు ఎస్ఎఫ్సీ 15ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతుంటాయి. పంచాయతీ పరిధిలో ప్రజలు ఇంటిపన్ను, వృత్తి వ్యాపార లైసెన్సు పన్నులు పంచాయతీకి చెల్లిస్తుంటారు. మున్సిపల్ కార్యాలయాలకు అర్బన్ డెవలప్మెంట్, ఇంటి, కుళాయి, వృత్తి వ్యాపారాల లైసెన్స్తోపాటు వివిధ రకాల పన్నులు, జరిమానాల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఆలయాలు, మార్కెట్ కమిటీలకు సైతం నిధులతోపాటు వివిధ రకాల ఆదాయం సమకూరుతుంది. ఆయా నిధులతో ఎంత కేటాయించి, ఎంత ఖర్చు చేశారు అనే అంశాలతోపాటు వాటి బిల్లులు, ఓచర్లు, బుక్కులు, రశీదులు, రికార్డులను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వసూలైన పన్నులు జమ చేశారా లేదా అనే అంశాలు ఆడిట్లో చూస్తారు. ఆడిట్ పూర్తి చేసిన వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసి నివేదికలను సిద్ధం చేస్తారు. గతంలో మాన్యూవల్ పద్ధతిలో వివరాలు నమోదు చేసేవారు. అయితే గత నాలుగేళ్ల నుంచి ఆన్లైన్ విధానంలో చేస్తున్నారు. ఆడిట్ నిర్వహించిన అదేరోజు వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ విధంగా నమోదు చేసిన తర్వాత మార్పులు చేసేందుకు అవకాశాలుండవని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. 15 మంది అధికారులతో... 15 మంది ఆడిట్ అధికారులతో అన్నింటిలోనూ తనిఖీ చేస్తారు. మున్సిపల్ పరిధిలో విలీనం చేసిన గ్రామపంచాయతీలలో సైతం పంచాయతీల వారీగానే ఆడిట్ చేస్తున్నారు. ఆడిట్ కోసం ముగ్గురు అసిస్టెంట్, 11 సీనియర్ ఆడిటర్లు, ముగ్గురు జూనియర్ ఆడిటర్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో ఆడిట్ కొనసాగుతోంది. ఆడిట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు రికార్డుల్లో వివరాలు తప్పులతడకగా నమోదైనట్లు తెలుస్తోంది. రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవటం, వివరాలు తప్పుగా నమోదు చేయటం, చేసిన పనుల కంటే ఎక్కువగా రికార్డు చేయడం, అభివృద్ధి పనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని జమ చేయకపోవటంతో పాటు తదితర అంశాలను గుర్తిస్తు న్నారు. ఆడిటింగ్ పూర్తయిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి నివేదికలను సిద్ధం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
- 
      
                   
                                 చిరుసంచుల ‘వరిసాగుతో’ లాభాలుఏరువాక కేంద్రం శాస్త్రవేత్త నిర్మలచిలప్చెడ్(నర్సాపూర్): చిరుసంచుల వరి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నిర్మల అన్నారు. మంగళవారం ఆమె శాస్త్రవేత్తల బృందంతో కలిసి మండల పరిధిలోని చండూర్, ఫైజాబాద్ గ్రామాల్లో వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా వరి పంటలో ప్రయోగదశలో ఉన్న డబ్య్లూజీఎల్–1380 అనే రకానికి సంబంధించిన మిక్కిలి, మధ్యస్థ గింజల వరి రకం 135 రోజుల్లో, కేపీఎస్–10642 సన్న గింజ రకం 125 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపారు. ఇది వానాకాలానికి అనువైన రకమన్నారు. శాస్త్రవేత్తలు అరుణ, ఆకాశ్, రైతు చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
- 
      
                   
                                 పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టండి: మెదక్ ఆర్డీఓఅల్లాదుర్గం(మెదక్): పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులపై దృష్టి పెట్టాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. మంగళవారం అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బందితో పలు అంశాలపై సమీక్షా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రెవెన్యూ, ప్రజావాణి మీసేవా సమస్యలపై చర్యలు తీసుకొవాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య పాల్గొన్నారు. పెట్రోల్ పంపు స్థలం పరిశీలన రేగోడ్(మెదక్): మండలంలోని తాటిపల్లి సమీపంలో నిర్మించతలపెట్టిన పెట్రోల్ పంపు స్థలాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి మంగళవారం సందర్శించారు. తాటిపల్లి వద్ద బసవేశ్వర ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ పెట్రోల్ పంపు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పంపు ఏర్పాటు చేసే స్థలం, సంబంధిత రికార్డులను ఆర్టీఓ పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్ఐ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఉపాధి కూలీల ఈ–కేవైసీ పూర్తి చేయాలి జెడ్పీ సీఈఓ ఎల్లయ్య చిలప్చెడ్(నర్సాపూర్): ఉపాధి కూలీల ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం ఆయన చిలప్చెడ్లో ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా విధుల్లోకి చేరిన ఎంపీడీఓ బానోత్ ప్రవీణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, పంచాయతీ కార్యదర్శులకు తగిన సూచనలు ఇస్తూ, కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామా ల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి రంగాచార్యులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించండిఅదనపు కలెక్టర్కు రైతుల వినతి మెదక్ కలెక్టరేట్: తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని, వెల్దుర్తి మండలం పెద్దాపురం గ్రామ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మెదక్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేశ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ కేంద్రం ఉండేదన్నారు. గత పంట కాలం నుంచి ఐఓపీ కేంద్రాన్ని పెట్టడం లేదని తెలిపారు. పెద్దాపూర్ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఒక్క కేంద్రం కూడా తమకు అందుబాటులో లేదన్నారు. దీంతో గ్రామంలోని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ట్రాక్టర్, టాపర్ల కిరాయిలు కట్టలేక, ధాన్యాన్ని తరలించడంలో ఆలస్యమై ధాన్యం తడిసిపోయి పెట్టుబడి కూడా మిగలడం లేదన్నారు. కొనుగోళ్లను పరిశీలించిన డీఆర్డీఓ పీడీహవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన తూకం, తేమశాతం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం నాగరాజు, సీసీ సత్యం, నిర్వాహకులు, వీఓఏ నవనీత ఉన్నారు.
- 
      
                   
                                 యాంత్రీకరణ బాటచెరుకు కోతలకు తీరనున్న కూలీల కొరత ● నేడు ఐదు యంత్రాలు అందజేయనున్న బ్యాంకర్లు ● సంగారెడ్డి జిల్లాకు 35 కోత యంత్రాలు జహీరాబాద్: చెరుకు పంట నరికేందుకు గాను రైతులను తీవ్రంగా వేధిస్తూ వస్తున్న కూలీల కొరతను ఇక నుంచి యంత్రాలు తీర్చనున్నాయి. చెరుకు నరికేందుకు కూలీలు స్థానికంగా లభించని పరిస్థితి ఉండటంతో గత ఐదేళ్ల నుంచి పక్క రాష్ట్రాల్లోని కూలీలపై ఆధారపడుతూ వస్తున్నారు. ఇక నుంచి ఆ సమస్య నుంచి కూడా రైతులు గట్టెక్కనున్నారు. మరో వారం పది రోజుల్లో క్రషింగ్ సీజన్ ప్రారంభం కానుంది. 2025–26 క్రషింగ్ సీజన్కు గాను సంగారెడ్డి జిల్లాలో సుమారు 35 చెరుకు కోత యంత్రాలు రంగంలోకి దిగనున్నాయి. జిల్లాలోని సంగారెడ్డిలో గల గణపతి చక్కెర కర్మాగారం, రాయికోడ్ మండలంలోని మాటూర్లో గల గోదావరి–గంగా కర్మాగారాల పరిధిలో సుమార 12 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి కానుంది. ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 9లక్షల టన్నుల చెరుకు పంట ఉత్పత్తి కానుందని అంచనా. ఈ క్రషింగ్ సీజన్కు గాను జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న చెరుకును నరికేందుకు వీలుగా గోదావరి–గంగా కర్మాగారానికి చెరుకును తరలించుకునేందుకుగాను 18 చెరుకు కోత యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. కామారెడ్డి, మాగి కర్మాగారాలకు తరలించేందుకుగాను 10 కోత యంత్రాలు, గణపతి కర్మాగారానికి తరలించేందుకు 3 యంత్రాలు, మహబూబ్నగర్లోని కొత్తకోట కర్మాగారానికి తరలించుకునేందుకు 4 యంత్రాల వంతున చెరుకు కోతకు ఉపయోగించనున్నారు. ఒక్కో యంత్రం రోజుకు 70 నుంచి100 టన్నుల వరకు చెరుకు పంటను కోసే సామర్థ్యం ఉంది. యంత్రాలు కోసే చెరుకు పంటను వెంట వెంటనే ఆయా కర్మాగారాలకు ట్రక్కుల్లో తరలించనున్నారు. యంత్రాలు చెరుకును కోయడంతో ఒకే రోజులోనే రైతులకు సంబంధించిన కమతాలు ఖాళీ అవుతాయి. దీంతో రెండో పంటకు సిద్ధం చేసుకునేందుకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కూలీలతో చెరకు నరికించడం వల్ల మూడు ఎకరాల కమతానికి వారం నుంచి పది రోజులు పట్టేది. యంత్రాలను వాడటం వల్ల మూడుఎకరాల్లో ఉండే చెరుకు పంట దిగుబడులను పరిగణలోకి తీసుకుంటే ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయవచ్చు. భూమి సారాన్ని బట్టి ఎకరాకు 25 నుంచి 60 టన్నుల వరకు చెరుకు పంట దిగుబడి వస్తుంది. సగటున ఎకరానికి 33 టన్నుల దిగుబడులు వస్తాయి. బ్యాంకర్లు ముందుకు చెరుకు కోత యంత్రాలను ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వస్తున్నారు. దీంతో రైతులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది మంజీర గ్రామీణ బ్యాంకులు నాలుగు యంత్రాలను రైతులకు అందజేశాయి. ఈ ఏడాది కూడా ఐదు యంత్రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. జహీరాబాద్లో బుధవారం నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ మేరకు యంత్రాలు స్థానిక రైతులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. చెరుకు కోతకు యంత్రాలను ఉపయోగించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కూలీలు దొరకకపోతే ఇబ్బందులు పడేవారు. కొరతను బట్టి డిమాండ్ మేరకు కూలీ రేట్లు చెల్లించుకోవాల్సి వచ్చేది. యంత్రాల వల్ల ఒకే రోజులో చిన్న కమతాలు ఖాళీ అవుతాయి. సంగారెడ్డి జిల్లాలో 30కి పైగా యంత్రాలు చెరుకు కోతకు సిద్ధం అవుతున్నాయి. యంత్రాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు వస్తుండటంతో రైతులు కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. –రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్, సంగారెడ్డి
- 
      
                   
                                 సిటిజన్ క్లబ్లో విస్తృత తనిఖీలు● పేకాట ఆడుతున్న 50 మందిపై కేసు ● కాయిన్స్, స్కోర్ కార్డులువినియోగిస్తూ డబ్బులు ఎక్చేంజ్ సిద్దిపేటకమాన్: పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... సిద్దిపేటలోని సిటిజన్ క్లబ్లో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చింది. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ రవీందర్రెడ్డి, టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్ ఆధ్వర్యంలో సీఐ వాసుదేవరావు, సిబ్బంది సోమవారం రాత్రి 7నుంచి సుమారు రెండు గంటలకు పైగా సిటిజన్ క్లబ్లో తనిఖీలు నిర్వహించారు. ఆరు టేబుళ్ల చుట్టూ 50 మంది డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆన్లైన్లో డబ్బులు పంపించారు. మరొక ఐదుగురు వ్యక్తుల వద్ద 20 ప్లాస్టిక్ కాయిన్స్ను గుర్తించారు. మిగతా వారిని విచారించగా డబ్బులు పెట్టి ఆడితే పోలీసులు కేసులు పెడతారనే భయంతో క్లబ్లో ఆడి ఆ వివరాలు స్కోర్ కార్డులో నమోదు చేస్తారని, బయటకు వెళ్లిన తర్వాత డబ్బులు తీసుకుంటారని పోలీసులు తెలిపారు. దీంతో 50 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు సెల్ఫోన్లు, 8 ప్లే కార్డ్ సెట్స్, 6 స్కోర్ కార్డులు, 20 ప్లాస్టిక్ కాయిన్స్ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై వన్టౌన్ పోలీసు స్టేషన్లో మంగళవారం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రమేశ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిపారు. క్లబ్లో పేకాట ఆడుతున్న దృశ్యం క్లబ్లో తనిఖీ చేస్తున్న పోలీసులు
- 
      
                   
                                 వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యంవర్గల్(గజ్వేల్): ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని గౌరారంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నరాని రాములు కుమారుడు సాయికుమార్ (24) సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. జహీరాబాద్లో మహిళ.. జహీరాబాద్ టౌన్: మహిళ అదృశ్యమైన ఘటన మండలంలోని రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ.కాశీనాథ్ వివరాల పక్రారం... గ్రామానికి చెందిన అలిగే నర్సింహులు భార్య క్రిస్టినా(21) ఈ నెల 26న అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులను విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
- 
      
                   
                                 ధాన్యం సేకరణ ఏదీ?సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ తూకాలు మాత్రం షురూ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కొన్ని మండలాల్లో వారం క్రితమే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతున్నారు. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి తూకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా..? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హత్నూర, కల్హేర్ తదితర మండలాలతోపాటు, నారాయణఖేడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో వరి కోతలు జోరందుకున్నాయి. కాస్త ముందుగా వరి నాట్లు వేసుకున్న చోట్ల ధాన్యం చేతికందింది. చేతికందిన వెంటనే ధాన్యం తూకాలు అయితే ఇబ్బందులు ఉండేవి కావు. కానీ, కొనుగోలు కేంద్రాల్లో మాత్రం తూకాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. పక్కనే ఉన్న మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకుంది. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇంకా తూకాలు ప్రారంభం కాలేదు. ధాన్యంలో తేమ శాతం తగ్గాకే తూకాలు ప్రారంభిస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. లేనిపక్షంలో రైసుమిల్లర్లు ధాన్యం దించుకోవడానికి నిరాకరిస్తారని అంటున్నారు. కానీ చాలాచోట్ల 17 కంటే తక్కువ తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కూడా తూకాలు వేయడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే హత్నూరతోపాటు నారాయణఖేడ్ డివిజన్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. కాగా జోగిపేట ప్రాంతంతోపాటు, గుమ్మడిదల, జిన్నారం తదితర మండలాల్లో ఈసారి కాస్త ఆలస్యంగా వరి నాట్లు వేశారు. ఈ మండలాల్లో కూడా మరో నాలుగైదు రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా తూకాలు ఊపందుకుంటే ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 51,492 హెక్టార్లు కాగా, ఈసారి 55,826 హెక్టార్లలో ఈ పంట సాగైంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం హెక్టారుకు 6.17 టన్నుల ధాన్యం వస్తుందని లెక్కగట్టారు. ఈ మేరకు సుమారు 3.29 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి ఉంటుందని అంచనా. ఇందులో స్థానిక అవసరాలు పోగా సుమారు 2.23 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రణాళికను రూపొందించారు. ఇందులో సుమారు 20 వేల మెట్రిక్ టన్నులు సన్న రకాలు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 207 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో ఐకేపీ కేంద్రాలు 89 కాగా, సహకార సంఘాల ఆధ్వర్యంలో 88 కేంద్రాలు, డీసీఎంఎస్లు కేంద్రాలు 29 ఎఫ్పీఓకు ఒక కేంద్రాన్ని కేటాయించారు. 207 కేంద్రాల్లో 20 కేంద్రాలను కేవలం సన్న రకం ధాన్యం సేకరణ కోసమే ఏర్పాటు చేశారు. ఆందోళనకు గురిచేస్తున్న తుపానులు అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. కండ్ల ముందే చేతికందిన పంట వర్షపునీటిలో కొట్టుకుని పోతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభించి ఉంటే తమకు ఈ కష్టాలు తప్పేవని రైతులు వాపోతున్నారు.
- 
      
                   
                                 నిజాయితీగా పనిచేయాలిమెదక్ కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్/కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలనే లక్ష్యంగా ముందు సాగుతున్నామని, అధికారులు ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి నిజాయితీగా పనిచేయా లని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జిల్లాలో ‘కల్చర్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పర్టీ’అనే థీమ్తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుగుతాయన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశా ల మేరకు స్టేట్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనపై క్విజ్ పోటీలు, వాక్థాన్లు, మార థాన్ లు, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విజిలెన్స్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. తుపాను ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మొంథా తుపాను నేపథ్యంలో రైతులు వరికోతలు వాయిదా వేసుకోవాలన్నారు.
- 
      
                   
                                 ఫొటోగ్రఫీలో ఉచిత శిక్షణసంగారెడ్డి టౌన్: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. నవంబర్ 4 నుంచి నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని, 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 9490103390, 9490129839 ఫోన్ నంబర్ను ప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–14, 17 యోగా, మల్లకంబ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక నవంబర్ ఒకటిన జెడ్పీ ఉన్నత పాఠశాల నారాయణరావుపేటలో నిర్వహించనున్నట్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌందర్య మంగళవారం తెలిపారు. ఆసక్తి కల్గిన క్రీడాకారులు ఒకటో తేదీన ఉదయం 9.30గంటల లోపు పాఠశాలకు రావాలని పేర్కొన్నారు. వివరాలకు వ్యాయామ ఉపాధ్యాయుడు సతీశ్ ఫోన్ నం. 9948 110433 ను సంప్రదించాలన్నారు. మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వరదరాజులు మంగళవారం తెలిపారు. 7వ తరగతి చదివి, వంట చేయడంలో అనుభవం ఉన్న మహిళలు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు 94939 72765, 93987 90830 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ ఎల్లయ్య (57) సౌదీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం కుటుంబసభ్యులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పదహారు నెలల క్రితం ఎల్లయ్య జీవనోపాధి కోసం సౌదీలోని జిద్దాకు వలస వెళ్లాడు. అక్కడ తోటమాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 25న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ఎల్లయ్య తిరిగి 27వ తేదీ వరకు ఫోన్ చేయలేదు. అదే రోజు రాత్రి గదిలో ఉరివేసుకున్నాడని తెలిసిందని చెప్పారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని, మృతదేహాన్ని గ్రామానికి చేర్చాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నారు. మద్దూరు(హుస్నాబాద్): ఆర్ఎంపీ వైద్యుడి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. వివరాలు ఇలా... మండలంలోని రేబర్తి గ్రామంలో వైద్యం చాటున చోరీలకు పాల్పడుతున్నట్లు ఆర్ఎంిపీ పూర్ణచందర్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మూడు రోజుల నుంచి చేర్యాల సీఐ శ్రీను ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అనుమతులు లేకుండా క్లినిక్ను నడుపుతూ, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్నాడని, వ్యక్తి మృతికి కారణమైన ఆర్ఎంపిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు లేఖ రాశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ఆర్ఎంపీ ఇంట్లో మద్దూరు తహసీల్దార్ ఏజీ రహీం పర్యవేక్షణలో లద్నూరు వైద్యాధికారి అర్జున్ , వైద్యుడు మహేందర్తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టెరాయిడ్స్, ఇంజెక్షన్, గ్లూకోజ్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా వైద్యంతో పాటు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాగా ఆర్ఎంపీని పోలీసులు విచారిస్తున్నారు. పటాన్చెరు టౌన్: నకిలీ డాక్యుమెంట్ చూపించి అనుమతులు తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, మున్సిపల్ కమిషనర్ వివరాల ప్రకారం... అమీన్పూర్ , రంగారెడ్డి జిల్లా మియాపూర్ శివారుకు చెందిన ప్లాట్ నెం.206లో ఎల్లారెడ్డి అనే వ్యక్తి 2022లో హెచ్ఎండీఏకు డాక్యుమెంట్లు చూపించి అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాడు. కాగా అతడిచ్చిన డాక్యుమెంట్లు నకిలీవని అధికారులు తేల్చారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసు నమోదైంది.
- 
      
                   
                                 పశు సంపద అభివృద్ధే ధ్యేయంరాష్ట్ర మానిటరింగ్ అధికారి డాక్టర్ శిరీషనర్సాపూర్ రూరల్: పశు సంపద అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్, డాక్టర్ శిరీష జిల్లా పశు వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని తిరుమాలపూర్లో నవార్టస్ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్, జిల్లా పశుసంవర్ధక శాఖ నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. పశు సంపద కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఉచిత గర్భాధారణ టీకాలు, పాడి రైతులకు పాల దిగుబడిని పెంచేందుకు మినరల్ మిశ్చర్, కాల్షియం సప్లిమెంట్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నర్సాపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జనార్దన్ రావు, పశు వైద్యాధికారులు సమిత్ కుమార్, స్వప్న, విదేశం, ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 చావుకు నా భార్యే కారణం!ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ పెట్టి భర్త అదృశ్యం పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీకి చెందిన శ్రీధర్ (24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహం జరిగింది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం పెద్దల మధ్య పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్లిన శ్రీధర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అనంతరం ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్లో నా చావుకి కారణం భార్య అని మెసేజ్ పెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
- 
      
                   
                                 ఛట్ పూజ ఉపవాస దీక్షల ముగింపువేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ దంపతులు పటాన్చెరు: ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్య భగవానుడిని ఆరాధిస్తూ నిర్వహించుకునే ఛట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపాల్గొన్నారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సూర్యాస్తమయం నుంచి ఉపవాస దీక్షలతో ప్రారంభమైన ఛట్ పూజ కార్యక్రమాలు మంగళవారం ఉదయం సూర్యోదయంతో సూర్య భగవానుడుని ఆరాధిస్తూ ఘనంగా ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున జరిగిన ముగింపు కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
- 
      
                   
                                 సేంద్రియం జాడేది?పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేలా ప్రణాళికలు చేశారు. ఇందుకనుగుణంగా కంపోస్ట్ షెడ్లను సైతం నిర్మించారు. కాగా ప్రస్తుతం వాటిని ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. – సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి జిల్లాలోని 648 గ్రామాలు, 25 మండలాల్లో కంపోస్టు షెడ్డులు నిర్మించారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా రోజు నివాస ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి కంపోస్టు ఎరువుగా మార్చి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో పంచాయతీలో ఏర్పాటు చేశారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు నిర్మించిన అవి ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఒక్కో కంపోస్టు షెడ్ నిర్మాణానికి లక్షల్లో ఖర్చు చేశారు. కానీ గ్రామ పంచాయతీలు ఈ షెడ్లను ఉపయోగించడం లేదు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. ఇండ్ల నుంచి సేకరించిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర వ్యర్థాలను వేరు చేసి ఎరువుగా మార్చే పదార్థాలను కంపోస్టు గుంతల్లో వేస్తారు. ఎరువుగా మారిన అనంతరం గ్రామ పంచాయతీల పరిధిలో హరితహారంలో నాటిన మొక్కలు, నర్సరీల్లో ఎరువుగా ఉపయోగించాలని నిర్ధేశించారు. ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు సీసాలు, ఇతర వస్తువులను విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వనరులు చేకూరుతాయని లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మించిన కంపోస్టు షెడ్లు అలంకారప్రాయంగా ఉన్నాయి. కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం గ్రామాల్లో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం ద్వారా వాటిలోని రసాయనాలు భూమిలోకి చేరి తద్వారా నేల, నీరు కలుషితం అవుతోంది. చెత్త కుళ్లిపోయి దుర్గంధం, కాల్చడం వల్ల వెలువడే పొగ కాలుష్యాన్ని నివారించి పర్యావరణహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధిహామీ ద్వారా గ్రామాల్లో కంపోస్టు షెడ్ల నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను అక్కడికి తరలించి వాటితో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందించాలని నిర్ణయించారు. తద్వారా భూసారాన్ని పరిరక్షించాలనే ప్రణాళికతో రూపొందించిన ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. షెడ్లను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. కానరాని ప్రణాళిక గ్రామాల్లో ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అధికారులు వ్యర్థాలను కంపోస్ట్ షెడ్లకు తరలించాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ గ్రామ పంచాయతీల్లో వ్యర్థాలను నేరుగా కంపోస్టుకు తరలించకుండా బయట ఎక్కడో ఒక చోట పారబోసి చేతులు దులుపుకుంటున్నారు. పర్యవేక్షణ లోపం పలు గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం లేదు. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపంతోనే తరలించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి యార్డుల నిర్వహణ పూర్తిస్థాయిలో చేపట్టి గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై దర్శనమిస్తున్న చెత్త గ్రామాలకు అదనపు ఆదాయం నిల్ పట్టించుకోని అధికారులు
- 
      
                   
                                 ఐసీయూ అందుబాటులోకి తేవాలిఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర సంగారెడ్డి: ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగం భవనం వెంటనే రోగులకు అందుబాటులోకి తెచ్చి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర కోరారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. ఫోరమ్ బృందం సభ్యులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర విభాగం రేకుల షెడ్డులో నడుస్తోందని, బెడ్లు విరిగి పాడై పోయాయన్నారు. ఆస్పత్రిలో మరుగు దొడ్లు కూడా దుర్వాసనతో అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పారు. రోగులకు మెనూ ప్రకారం ఆహారం, భోజనం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచి నీటిసౌకర్యం కూడా ఆస్పత్రిలో లేదని రోగులు తాగునీటిని డబ్బులు చెల్లించి కొనుక్కుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోనే ఆస్పత్రికి వసతులు లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- 
      
                   
                                 యువకుడికి కృత్రిమ కాలు..అమర్చిన స్వచ్ఛంద సంస్థచిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు కాలు కోల్పోగా ఓ స్వచ్ఛంద సంస్థ కృత్రిమ కాలును అందజేసింది. వివరాలు... మండలంలోని ఖాజాపూర్ తండాకు చెందిన రమేశ్కు సానీక్ష ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా కృత్రిమ కాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన భారత్ వికాస్ పరిషద్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో అతడికి ఉచితంగా కృత్రిమ కాలును పెట్టించినట్లు సానీక్ష ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ తెలిపారు. ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన బాధితులు ఉంటే తమను సంప్రదించాలని, ఉచితంగా కృత్రిమ కాలు పెట్టించనున్నట్లు ఇక్షణ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి తెలిపారు.
- 
      
                   
                                 మురుగునీటి పాలైన ధాన్యంజోగిపేటలో భారీ వర్షం ● కన్నీరు పెట్టుకున్న రైతులు జోగిపేట(అందోల్): అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 200 సంచుల వరి ధాన్యం వర్షపునీటిలో తడిసి, మురికి కాలువల్లోకి కొట్టుకుపోయింది. జోగిపేట మార్కెట్ గంజ్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో అన్నాసాగర్, జోగిపేట ప్రాంత రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ధాన్యం తడిసిముద్దయ్యింది. గంజ్లో సోమవారం కొనుగోళ్లు ప్రారంభించగా రైతులు తాము పండించిన ధాన్యాన్ని వారం రోజుల క్రితం నుంచే ఆరబెట్టుకుంటున్నారు. వర్షాలు లేవన్న అంచనాతో రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లారేసరికి భారీ వర్షం కారణంగా ధాన్యం అంతా కొట్టుకుపోయింది. జోగిపేటకు చెందిన రైతులు లింగం, అరీల్ గౌడ్, అన్నాసాగర్ గ్రామానికి చెందిన పోచయ్యలకు చెందిన వరి ధాన్యం వర్షం కారణంగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులను నిర్వాహకులను కోరారు. మళ్లీ వర్షం రావచ్చు... మళ్లీ వర్షం కురిసే సూచనలుండటంతో రైతులు తమ ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని మార్కెట్ కమిటీ సిబ్బంది రైతులకు తెలియజేశారు. వాతారణం చల్లగా ఉన్నందున రైతులు జాగ్రత్త వహించాలని చెప్పారు.
- 
      
                   
                                 నైట్డ్యూటీ వాచ్మెన్ హత్యగజ్వేల్ పట్టణంలో ఘటన గజ్వేల్రూరల్: వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గజ్వేల్లో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన అడెపు బాలయ్య(60)కు భార్య పుష్పతో పాటు నలుగురు కూతుర్లు ఉన్నారు. కూతుర్లకు వివాహాలు అయ్యాయి. బాలయ్య పట్టణంలోని పిడిచెడ్ రోడ్డులో వీమార్ట్లో ఐదేళ్లుగా నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి 8గంటలకు విధులకు వెళ్లిన అతడు మంగళవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు విషయాన్ని బంధువులకు చెప్పగా వారు వీమార్ట్కు వెళ్లి యజమాని కళాధర్ను అడిగారు. ఈ క్రమంలో బాలయ్యతో పాటు వీమార్ట్లో సెక్యూరిటీగార్డ్గా పనిచేస్తున్న బీహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు రంజిత్, రితేశ్ సైతం కనిపించకుండా పోయారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మార్ట్ వెనుకభాగంలో వెతుకుతున్న క్రమంలో చెట్ల పొదల మధ్యన మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్స్కాడ్తో వివరాలు సేకరించారు. బాలయ్య గొంతుకు టవల్ బిగించి హత్య చేసి ఉంటారని, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో మృతుడు బాలయ్య కుటుంబ సభ్యులు, బంధువులు రంజిత్, రితేశ్లపై అనుమానం వ్యక్తం చేస్తూ గజ్వేల్–పిడిచెడ్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. సీఐ రవికుమార్ అక్కడికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
- 
      
                   
                                 గురుకుల విద్యార్థులకు సన్మానంజహీరాబాద్ టౌన్: నీట్ పరీక్షలో ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన మైనార్టీ గురుకుల విద్యార్థులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సన్మానించారని ప్రిన్సిపాల్ కేఎస్ జమీల్ తెలిపారు. మండలంలోని అల్గోల్లోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఏడుగురు, బూచినెల్లిలోని బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థినులకు ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయన్నారు.హైదరాబాద్లో నిర్వహించిన ఉడాన్ 2025 కార్యక్రమంలో భాగంగా మంత్రి విద్యార్థులను సన్మానించి ల్యాప్టాప్లు అందజేశారని పేర్కొన్నారు.
- 
      
                   
                                 బాధ్యతగా విధులు నిర్వర్తించాలికలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: ఉద్యోగులు తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో కేంద్ర విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో అధికారులు వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం పారదర్శకతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పారదర్శకతతోనే మంచి పాలన అందించగలుగుతామన్నారు. సమగ్రమైన సేవలు అందించడంతో ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు. వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించబోయే మేరా యువభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25 వరకు నిర్వహించే పటేల్ జయంతి వేడుకల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా మేరా యువభారత్ అధికారి రంజిత్రెడ్డి, జిల్లా యువజన క్రీడాధికారి కాశీంబేగ్, జిల్లా కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఆర్సీపురం యూనిట్ ఎస్పీ శతకీర్తి, అదనపు కలెక్టర్ మాధురి, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ప్రయాస్కు లచ్చపేట మోడల్ విద్యార్థులుదుబ్బాకటౌన్: ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రయాస్–2025 (ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ ఆటీట్యూడ్ ఇన్ యంగ్ అండ్ అస్పైరింగ్ స్టూడెంట్స్)కు నిర్వహించిన నూతన ఆవిష్కరణకు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మెడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికై నట్లు ఎంఈఓ జోగు ప్రభుదాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల నైపుణ్యాన్ని పెంపొందిచేందుకు ప్రతీ ఏటా ఎన్సీఆర్టీ –న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ప్రయాస్ పేరుతో పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మహ్మద్ అజీజ్ , శివ కుమార్ రైతులకు ఉపయోగపడే కొత్త యంత్ర నమూనా పరికరాన్ని ( ఆటోమేటిక్ ఫర్టిలైజర్ డిస్పెన్సర్ సిస్టమ్)ను ఆవిష్కరించారన్నారు. ఈ పోటీట్లో దేశ స్థాయిలో 35 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కేవలం లచ్చపేట మోడల్ స్కూల్ ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు ఉపయోగపడే యంత్ర తయారీలో విద్యార్థులను ప్రోత్సహించిన గైడ్ టీచర్ జ్యోతి, ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, విద్యార్థులను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కాగా త్వరలో విద్యార్థులు రూ.50 వేల పారితోషికంతో పాటు సర్టిఫికెట్ అందుకోనున్నట్లు ఎంఈఓ తెలిపారు.
- 
      
                   
                                 పత్తితీతలో మెలకువలుపాటిస్తే నాణ్యతతోపాటు లాభం ● తేమ 8 నుంచి 9శాతం ఉంటే డిమాండ్ఆరబెట్టే విధానం పత్తిని సేకరించిన అనంతరం పరిశుభ్రంగా ఉండే టార్పాలిన్ కవర్లను గానీ, తాటిపత్రిపై గానీ, సీసీలపై గానీ తగినంత నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పత్తిలోని గింజలు గట్టిపడి పత్తిలో తేమ శాతాన్ని తగ్గిస్తాయి. తేమ శాతం తగ్గడం వల్ల పత్తి పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం గోనె సంచుల్లో తొక్కిపెట్టి తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తిలో తేమ శాతం 8 నుంచి 9 శాతం ఉంటే మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది.మిరుదొడ్డి(దుబ్బాక): పత్తి సాగు ఏకవార్షిక పంట. పత్తిని తీసే తరుణం ఆసన్నమవుతోంది. పత్తి సాగులో పూత దపదపాలుగా వస్తుంది కాబట్టి పత్తిని ఒకటి రెండు సార్లు తీయాల్సి ఉంటుంది. ఈ దశలో నాణ్యమైన పత్తిని సేకరించడంలో రైతులు మెలకువలు పాటించాల్సిన అవసరం ఉందని మండల వ్యవసాయ అధికారి మల్లేశం చెబుతున్నారు. శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో పత్తి సేకరణలో పలు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పత్తిని తీసే విధానంలో పూర్తి మెలకువలు పాటిస్తేనే నాణ్యమైన పత్తి లాభసాటిగా మారుతుందంటున్నారు. పత్తితీతలో చేపట్టే విధానంపై సలహాలు, సూచనలు. పత్తి తీయడంలో మెలకువలు పత్తితీత రెండు దపాలుగా తీయాల్సి ఉంటుంది. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుంచి సేకరించాలి. పత్తిని తీసే క్రమంలో ఆకులు, తొడిమలు, కాడలు, చెత్తాచెదారం రాకుండా జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా పత్తితీత కార్యక్రమం చలికాలంలోనే ఎక్కువ తీయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ శాతం ఉదయం ఫూట మంచు కురుస్తుంది. దీంతో పత్తి పచ్చిగా, తేమ కలిగి ఉండటం, ముద్దగా మారుతుంది. అయితే పత్తి నాణ్యత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పత్తిపై కురిసిన మంచు ఆవిరయ్యే వరకు పత్తిని తీయరాదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు పత్తిని తీయించాలి.
- 
      
                   
                                 శివ్వాయిపల్లిలో తల్లీకూతురు అంత్యక్రియలుహవేళిఘణాపూర్(మెదక్): కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మెదక్ మండలం శివ్వాయిపల్లికి చెందిన తల్లీకూతురు సంధ్యారాణి, చందన అంత్యక్రియలను సోమవారం స్వగ్రామంలో నిర్వహించారు. కర్నూల్ నుంచి మృతదేహాలను అంబులెన్సులో ఆదివారం రాత్రి శివ్వాయిపల్లికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు డప్పు రాజు నివాళులర్పించారు. మిన్నంటిన రోదనలు ఒకే ఇంట్లో తల్లీకూతురు మృతి చెందడంతో కనీసం కడసారి చూపు కూడా నోచుకోకపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంధ్యారాణికి కుమారుడు ప్రహ్లాద్, చందనకు తండ్రి ఆనంద్గౌడ్ అంత్యక్రియలు నిర్వహించారు.దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే
- 
      
                   
                                 గొర్రెలపైకి దూసుకెళ్లిన బస్సుకొల్చారం(నర్సాపూర్): ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామానికి చెందిన కురుమ నరసింహులుకు చెందిన గొర్రెలను కాపరులు కౌడిపల్లి నుంచి ఏడుపాయలకు మేత కోసం తోలుకెళ్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కొల్చారం సమీపంలోని చిన్న గుప్పటి కల్వర్టు వద్ద గొర్రెల మందపైకి అతివేగంగా వచ్చి దూసుకెళ్లింది. దీంతో 30 గొర్రెలు మృతి చెందాయి. గమనించిన కాపరి అంజప్ప డ్రైవర్కు ఆపమని చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదని, తనకు తృటిలో ప్రమాదం తప్పిందని తెలిపాడు. ఇదే సమయంలో వెనకవైపు నుంచి వస్తున్న డీసీఎం రోడ్డుపై చచ్చిపడి ఉన్న గొర్రెలను చూసి తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న సైడ్ రెయిలింగ్కు ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. కాపరి అంజప్ప మాట్లాడుతూ ఒక్కో గొర్రె విలువ రూ.15 వేల వరకు ఉంటుందని, లక్షల్లో నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు.ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాత మెదక్ జిల్లాలో ఘటన
- 
      
                   
                                 పంట వ్యర్థాలు కాల్చితే నష్టంప్రశాంత్నగర్(సిద్దిపేట): పంట కోతల తరువాత వ్యర్థాలను కాల్చటం ద్వారా భూసారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూప అన్నారు. సోమవారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో రైతులకు ‘వరి కొయ్యలు కాల్చడం – నష్ట నివారణ చర్యలు’ అనే అంశంపై సలహాలు, సూచనలు అందించారు. పంటలు కోసిన తర్వాత పంట వ్యర్థాలను రైతులు పొలాల్లోనే కాల్చడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం, శ్వాసకోశ వ్యాధులకు, భూమిలోని సేంద్రియ కర్బనశాతం తగ్గి భూమి నిస్సారంగా మారడానికి దారితీస్తుందన్నారు. పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నడం వల్ల మేలు చేసే సూక్ష్మజీవులు, బాక్టీరియా, శిలీంధాల్రు బాగా అభివృద్ధి చెందుతాయన్నారు. మంగళవారం ఉదయం 10 నుంచి 11.30గంటల వరకు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతువేదికల్లో ధాన్యం, మొక్కజొన్న పంట, పత్తి కొనుగోళ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.రైతులతో జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూప
- 
      
                   
                                 కేంద్రాలు సరే.. కొనుగోలు ఏదీ?నిలిచిన ధాన్యంహబ్సిపూర్లో కొనుగోలు కేంద్రంలో ధాన్యం● కాంటాలు ప్రారంభించాలని రైతుల వేడుకోలు ● వర్షానికి కొట్టుకుపోతున్న పరిస్థితిప్రారంభించి వారం రోజులు.. దుబ్బాక మండలం, మున్సిపాలిటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం రోజులవుతుంది. ఇంత వరకు కొనుగోళ్లు చేపట్టలేదు. ఐకెపీ ఆధ్వర్యంలో–27సెంటర్లు, పీఏసీఎస్ ద్వారా–9సెంటర్లు, మెప్మా ద్వారా–6సెంటర్లు ప్రారంభించారు. ప్రారంభించి వారం రోజులవుతున్నా 6 సెంటర్లలో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. మిగతా సెంటర్లల్లో ఇంత వరకు కొనుగోలు చేపట్టలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు పలు ఇబ్బందులు పడుతున్నారు. – దుబ్బాకరూరల్: వర్షాలతో ఇబ్బందులు వర్షాలు కురువడంతో రైతులు ఎక్కువ శాతం తమ వరి పొలాలను తడి ఆరకముందే హార్వెస్టర్ సహాయంతో కోస్తున్నారు. ఆ తరువాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే రైతు కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోవడంతో చేసేదేమీలేక కుమిలిపోతున్నారు.
- 
      
                   
                                 మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్పటాన్చెరు టౌన్: ఆటోలో మర్చిపోయిన బ్యాగును ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో బాధితురాలికి అందజేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు బస్టాండ్ వద్ద మధులత అనే మహిళ ఆటో ఎక్కి రామచంద్రాపురం జ్యోతినగర్లో దిగింది. ఈ సమయంలో రూ.15 వేల నగదు, 15 తులాల బంగారం ఉన్న బ్యాగ్ను ఆటోలో మరిచిపోయింది. వెంటనే రామచంద్రాపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ప్రేమానంద్ ఆటోలో ఓ మహిళ బ్యాగును మరిచిపోయి దిగిందని, పటాన్చెరు ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు అప్పగించాడు. వెంటనే బాధితురాలు ముధులతను పిలిపించి బ్యాగును అందజేశారు. అనంతరం ఆటో డ్రైవర్ను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్స్ వి.శంకర్, మధుసూదన్ గౌడ్, ఆటో స్టాండ్ ఉపాధ్యక్షులు చోటు బాయి, ఎండీ సాధిక్ పాల్గొన్నారు. మరో ఘటనలో.. రామచంద్రాపురం(పటాన్చెరు): సంగారెడ్డి ప్రాంతానికి చెందిన హర్షిని చౌదరి ఆదివారం రాత్రి పటాన్చెరులో ఆటో ఎక్కి బీరంగూడ కమాన్ వద్ద దిగే సమయంలో బ్యాగ్ను మరిచిపోయింది. ఆ బ్యాగులో కిలో వెండి వస్తువులు, రూ.2,600నగదు ఉన్నాయని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ షకీల్ సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆటోను గుర్తించి బాధితురాలికి బ్యాగ్ను అందజేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ను మియాపూర్ ఏసీపీ సీ.హెచ్. శ్రీనివాస్ అభినందించారు. మర్చిపోయిన బ్యాగు బాధితురాలికి అప్పగింత
- 
      
                   
                                 అక్రమ మట్టి తవ్వకాలపై ఉక్కుపాదంసిద్దిపేటఅర్బన్: అర్ధరాత్రి మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిని అడ్డుకొని హిటాచీ, టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి అనుమతి లేకుండా సుడా మోడల్ వెంచర్కు చెందిన ప్రభుత్వ భూమిలో కొంత మంది వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలించి విక్రయిస్తున్నారని గ్రామ యువకులు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్ఐ మల్లేశం, సిబ్బందితో వెళ్లి టిప్పర్ డ్రైవర్లు బోదాసు నర్సింహులు, రేపాక రాజు, హిటాచీ ఆపరేటర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వంగ ప్రవీణ్రెడ్డి వెంచర్లో మట్టి పోయించుకుంటున్నాడని తెలిపారు. కాగా నిందితులను రిమాండ్కు తరలించారు.ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- 
      
                   
                                 కారు, బస్సు ఢీ..పలువురికి గాయాలు దుబ్బాకటౌన్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన రాయపోల్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామాయంపేట నుంచి గజ్వేల్కు వస్తుంది. ఈ క్రమంలో మార్గమధ్యలో రాయపోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల మూలమలుపు వద్దకు రాగానే గజ్వేల్ నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కామారెడ్డికి చెందిన భరద్వాజ్ శంకర్ రావు, స్వప్న, అనంతరావుకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా అజాగ్రత్తగా కారు నడిపి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ మహమ్మద్ మౌసీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పార్క్ చేసిన బైక్ దహనంవెల్దుర్తి(తూప్రాన్): పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు. ఈ ఘటన మండలంలోని కుకునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు వివరాల ప్రకారం... బీజేపీ నాయకుడు, గ్రామానికి చెందిన శివరాం రోజూ మాదిరిగా ఆదివారం రాత్రి తన బైక్ను ఇంటిముందు పార్క్ చేశాడు. అర్ధరాత్రి బైక్కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల వారు గమనించి అతడికి చెప్పారు. అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఇదే గ్రామంలో ఇరవై రోజుల క్రితం నాగులు బైక్ను దుండగులు దహనం చేశారు. వరుస ఘటనలతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
- 
      
                   
                                 కొలువుదీరిన థీమ్ పార్క్వర్గల్(గజ్వేల్): ప్రతిష్టాత్మక ఉమ్మడి మెదక్ జిల్లా పీఎంశ్రీ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో ‘మేథమెటిక్స్ థీమ్ పార్క్’ కొలువుదీరింది. పచ్చని హరిత వృక్షాల మధ్య ఆహ్లాద వాతావరణంలో దాదాపు రూ. 1.5 లక్షలు పీఎంశ్రీ నిధులు వెచ్చించి గణిత సంబంధ 3డీ ఆకృతులతో దీనిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మధ్యలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ విగ్రహం ఏర్పాటు చేశారు. రూ. 50 వేలతో ఐలవ్ జేఎన్వీ సిద్దిపేట పార్క్ను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిని సోమవారం సాయంత్రం నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ సాగరిక ప్రారంభించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 రైతులను ఇబ్బందులు పెట్టొద్దుతొగుట(దుబ్బాక)/కొండపాక(గజ్వేల్)/గజ్వేల్రూరల్ / దౌల్తాబాద్ (దుబ్బాక): పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మెదక్ ఎంపీ రఘునందన్రావు అధికారులను ఆదేశించారు. తొగుటలోని ఎల్లారెడ్డిపేట శ్రీ వేంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీ, కొండపాక మండలంలో వెలికట్ట, దుద్దెడ, గజ్వేల్ పరిధిలోని పిడిచెడ్లో సాయిబాలాజీ కాటన్ మిల్, దౌల్తాబాద్ పరిధిలోని హైమద్నగర్ తిరుమల కాటన్మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిని సోమవారం ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా చైర్మన్ దేవేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పత్తిని వ్యవసాయ బావుల వద్ద ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చే రైతులకు మద్దతు ధర కల్పించాలని, తేమశాతం పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. రైతుల పట్ల మిల్లుల నిర్వాహకులు దళారుల మాదిరిగా వ్యవహరించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదగిరి, రాష్ట్ర మార్కెటింగ్ డీడీ ప్రసాద్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్రావు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
- 
      
                   
                                 తాగి డ్రైవ్ చేస్తే పదివేలు ఫైన్సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమాన అమల్లోకి వచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమాన విధించింది. సీఐ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. సోమవారం వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.70వేలు జరిమాన విధించారు. గంజాయి రహిత జిల్లాకు కృషిసీపీ విజయ్ కుమార్ దుబ్బాకటౌన్ /దౌల్తాబాద్ (దుబ్బాక) /కొండపాక(గజ్వేల్): డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం బేగంపేట, రాయపోల్, దౌల్తాబాద్, కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ... మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడిపే వాహనదారులపై దృష్టి సారించాలన్నారు. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ షేక్ లతీఫ్, బేగంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి, రాయపోల్ ఎస్ఐ మానస, ఏఎస్ఐలు, ఎస్సై అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంకు రికవరీ ఏజెంట్ ఆత్మహత్య అల్లాదుర్గం(మెదక్): చెరువులో దూకి వ్యక్తి అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వద్ద దొరికిన ఆనవాళ్లు, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం... రాంచంద్రపురానికి చెందిన నాగాచారి(42) హైదరాబాద్ బోడుప్పల్ ఎస్బీఐ బ్యాంకులో రికవరీ ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. టీఎస్ 08 జీజె2645 బైక్పై రాంపూర్ చెరువు కట్టకు వద్దకు వచ్చాడు. ఐడీ కార్డు, బైక్ తాళం చెవి కట్టపై పెట్టి చెరువులో దూకాడు. ఆ సమయంలో వ్యవసాయ పనులు చేస్తున్న వారు చూసి అక్కడికి చేరుకునేలోపు దూకాడు. అక్కడ లభించిన ఆధారాలతో ఎస్బీఐ రికవరీ ఏజెంట్గా గుర్తించారు. వెంటనే పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చెరువు కట్టపై ఉన్న ఆధారాలతో పోలీసులు భార్యకు సమాచారం ఇచ్చారు. కాగా కొన్నిరోజులుగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్ఐని సంప్రదించగా చెరువులో దూకిన వ్యక్తి బాడీ పైకి తెలలేదని , పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యంసంగారెడ్డి క్రైమ్: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం సంగారెడ్డి పట్టణంలోని స్థానిక మహబూబ్సాగర్ చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చెరుకుని మృతదేహన్ని బయటకు తీశారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలను బట్టి హైదరాబాద్లోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ఫాతిమా (27)గా పోలీసులు గుర్తించారు. చెరువును చూడటానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిదా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని ప్రభు త్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిగజ్వేల్రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన మినుముల నర్సింహులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మృతురాలి వివరాలు గుర్తింపుచిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ధరిపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో మృతి చెందిన మహిళ మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎరుకల చంద్రవ్వగా గుర్తించినట్లు ఏఎస్ఐ విఠల్నాయక్ తెలిపారు. సోమవారం చంద్రవ్వ కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలికి మతిస్తిమితం సరిగా లేదని, వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
- 
      
                   
                                 రేపు డయల్ యువర్ డీఎంనారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో ఈనెల 29న ఉదయం 10: 30 గంటల నుంచి 11:30 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. డిపో పరిధిలోని గ్రామాల ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీకి సంబంధించి 9959223170 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు, సమస్యలు చెప్పాలన్నారు. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా..?సబ్ కలెక్టర్ ఉమాహారతి కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని వసతిగృహాలను సబ్ కలెక్టర్ ఉమా హారతి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల, కస్తూర్బా విద్యాలయం, బీసీ వెల్ఫేర్ బాలుర, ఎస్సీ వెల్ఫేర్ బాలుర వసతి గృహాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల హాజరుశాతం పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జూనియర్ కళాశాలలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని విద్యార్థులు అడిగారు. తాగునీటి సరఫరాపై వార్డన్ను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ విజయ్కుమార్, వార్డెన్ శివకుమార్, పీడి మహేశ్వరి, డబ్ల్యూహెచ్ఓ పండరి, సురేష్లు తదితరులున్నారు. మూడు రోజులునీటి సరఫరా బంద్జహీరాబాద్ టౌన్: నీటి శుద్ధి కర్మాగారంలో మరమ్మతుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ ఉంటుందని ఈఈ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సింగూరు ఆనకట్ట వద్ద ఉన్న బూసరెడ్డిపల్లి 100 ఎంఎల్టీ శుద్ధి కర్మాగారంలో మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. దీంతో జహీరాబాద్, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్, మున్సిపల్లి, సంగారెడ్డి, సదాశివపేట, కొండపూర్, తెల్లపూర్, పటాన్చెరువు మున్సిపాలిటి పరిధిలో మూడు రోజుల పాటు నీటి సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. కానిస్టేబుల్నుసస్పెండ్ చేయాలిఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాల మహిళ ప్రధానోపాధ్యాయురాలిపై కానిస్టేబుల్ దాడి చేయడం అప్రజాస్వామికమని ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్ అన్నారు. సోమవారం హత్నూర మండలం తెల్లరాళ్ల తండా పాఠశాల ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులతో కలసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిపై కానిస్టేబుల్ దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. సదరు కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గో రక్షకులపై దాడులు అరికట్టాలి సంగారెడ్డి: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గోరక్షకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సోమవారం చౌటకూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గోరక్షకులపై దాడులు చేస్తున్న దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ సంగారెడ్డి జిల్లా సంయోజక్ పల్లె ప్రభుకుమార్ గౌడ్, చౌటకూర్ మండల గోరక్ష ప్రముఖ చంద్రశేఖర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మర్రి మహేశ్, నాయకులు ఇతర నాయకులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఏడాదిలోగా సూర్యభగవాన్ ఆలయంఛట్ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేపటాన్చెరు/జిన్నారం (పటాన్చెరు): అన్ని ప్రాంతాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని ఎంపీ రఘనందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా పటాన్చెరులోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో, అలాగే.. బొల్లారం పారిశ్రామికవాడలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భగవంతుడి కృపతో వచ్చే సంవత్సరం ఛట్ పూజల్లోపు సాకి చెరువు కట్టపై సూర్య భగవాన్ దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ఘాట్ సైతం నిర్మిస్తామని తెలిపారు. ఉత్తర భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవిస్తామన్నారు. వారికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు. తెలంగాణ ప్రజలతో సమానంగా అన్ని రాష్ట్రాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని చెప్పారు. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పటాన్చెరు నియోజకవర్గం అని పేర్కొన్నారు. అనంతరం ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.మాజీ ఎమ్మెల్యే మనో జ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అలాగే.. మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ● కార్తీక కాంతులులక్ష దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు కార్తీక మాసం పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం మైదానంలో లలితాదేవి వైభవం ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వర కల్యాణం, లక్ష దిపోత్సవం వైభవంగా నిర్వహించారు. రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను భక్తుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా చిన్నారులు చేసిననృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. – నారాయణఖేడ్
- 
      
                   
                                 క్రీడాపోటీల్లో ప్రతిభ చాటాలిడీఎస్పీ సైదా జహీరాబాద్: క్రీడాపోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవాలని.. ఇందుకు టోర్నమెంట్లను ఉపయోగించుకోవాలని డీఎస్పీ సైదా అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంఆర్హెచ్ఎస్ ప్రాంగణంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరపోలీసుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పలు పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వాలీబాల్ టోర్నమెంట్లో ఆయా ప్రాంతాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఎస్ఐ వినయ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 కోతకు వచ్చే వరకు జాగ్రత్తకంది పంట ఆశాజనకంగా ఉంది. కోతకు వచ్చే వరకు పంటను కాపాడుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. మబ్బుల వల్ల కంది పంటకు నష్టం కల్గుతుంది. ఆకాశం మేఘావృతమైతే మబ్బులు కమ్మి తెగుళ్లు ఆశిస్తాయి. పూత, కాత దశలో ఉన్న కంది పంటలో ఆకు చుట్టూ పురుగులు, మారుకా మచ్చలపురుగు, కాయతొలుచు పురుగు, ఎండు తెగులు, గొడ్డు మోతు తెగులు, రసం పీల్చే పురుగులు, పూత పెంకు పురుగులు, శనగ పచ్చపురుగులు ఆశించి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్నాయి. వ్యవసాయ అధికారుల సూచన మేరకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. – భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్
- 
      
                   
                                 కందిపైనే ఆశలు..!● వర్షాలతో దెబ్బతిన్న పంటలు ● ఆశాజనకంగా కంది ● సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు జహీరాబాద్ టౌన్: వర్షాల వల్ల ఈ సంవత్సరం చాలా వరకు ఖరీఫ్ సీజన్ పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవడం వల్ల చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం అయ్యాయి. పెసర, మినుము పంటలు పూర్తిగా దెబ్బతినగా.. పత్తి, సోయాబిన్ పంటల దిగుబడిపై ప్రభావం పడింది. కంది పంట పర్వాలేదు అన్నట్లుగా ఉంది. పెసర, పత్తి, సోయాబిన్ తదితర పంటల్లో ఏర్పడిన నష్టాన్ని కంది పంటలో భర్తీ చేసుకోవాలని రైతులు ఆశతో ఉన్నారు. కంది పూత, కాత దశలో ఉంది. సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జిల్లాలో ఖరీప్ సీజన్లో రైతులు సుమారు 7.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అఽత్యధికంగా సుమారు 3.75 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. సుమారు 86 వేల ఎకరాల్లో రైతులు కంది సాగు చేస్తున్నారు. కంది అంతర పంటగా ఎక్కువ మంది వేశారు. ఇతర పంటలతో పోల్చితే కంది పంటలకు వాతావరణం అన్ని రకాలు అనుకూలంగా ఉంది. పంట ఏపుగా పెరిగి పూత, కాత దశలో ఉంది. ఒకటి రెండు నెలల్లో పంట చేతికి అందే అవకాశం ఉంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న నమ్మకం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర పంటలో ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. కంది పంట మద్దతు ధర కూడా పెరగడంతో రైతులకు కొంత ఊరట లభించింది. దెబ్బతిన్న పంటల కారణంగా ఏర్పడిన నష్టాన్ని కందితో పూడ్చుకొనే అవకాశం రైతులకు కల్గుతుంది. నెల రోజుల పాటు కంది పంటకు చాలా కీలకమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తెగుళ్లు, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండే సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
- 
      
                   
                                 ● కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షణలోలక్కీ డ్రా ప్రక్రియ ● తాటిపల్లి మద్యం షాపు డ్రా వాయిదా ● డిసెంబర్ 1 నుంచి షాపులనిర్వహణ కొత్త వారికి..ఆరోవంతు ట్యాక్స్ చెల్లింపునకుఈ రోజే గడువు జిల్లాలో ఉన్న 101 షాపుల్లో నాలుగు రకాల ఎకై ్సజ్ ట్యాక్ (యానివల్ రెంటల్) కేటగిరీలు ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలతో పాటు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పటాన్చెరు ఎకై ్సజ్స్టేషన్ పరిధిలోని షాపులకు రూ.1.10 కోట్లుగా ఎకై ్సజ్ట్యాక్ ఉంది. లక్కీ డ్రాలో ఈ షాపులు దక్కించుకున్న వారు ఆయా షాపునకు నిర్దేశించిన ఈ ఎకై ్సజ్ ట్యాక్సులో 1/6 వంత వెంటనే చెల్లించాలి. అంటే మంగళవారం లోపు ఈ మొత్తాన్ని బ్యాంకులో చెల్లించిన వారికే ఈ షాపు దక్కుతుంది. ఉదహరణకు రూ.60 లక్షల యానివల్ రెంటల్ ఉన్న షాపులకు సుమారు రూ.పది లక్షలు చెల్లించాలి. ఈ ట్యాంకును చెల్లించే వారి సౌకర్యం కోసం సంగారెడ్డిలోని స్టేట్బ్యాంకు మెయిన్ బ్రాంచ్కు సోమవారం రాత్రి 8 గంటల వరకు స్టేట్బ్యాంకును తెరిచి ఉంచేలా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈసారి మద్యం దుకాణాలను మహిళలు భారీగానే దక్కించుకున్నారు. జిల్లాలో దాదాపు మూడో వంతు షాపులు వారికే వచ్చాయి. జిల్లాలోని మొత్తం 101 మద్యం దుకాణాలకుగాను సోమవారం 100 దుకాణాలకు కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో మొత్తం 32 షాపులు మహిళలకు దక్కడం గమనార్హం. మిగిలిన 69 షాపులు పురుషులకు దక్కాయి. అయితే మద్యం వ్యాపారులకు తమ కుటుంబసభ్యుల్లోని మహిళల పేర్లతో దరఖాస్తు చేసుకుంటే అదృష్టం వరిస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది. ఇలా చాలా మంది మద్యం వ్యాపారులు తమ కుటుంబసభ్యుల్లోని మహిళల పేర్లతో దరఖాస్తులు చేయించారు. దీంతో ఈ మహిళలకు మూడో వంతు షాపులు దక్కాయి. కాగా ఈసారి కూడా మద్యం షాపులు పాత వ్యాపారులకే ఎక్కువగా దక్కాయి. వందలో సుమారు 70కి పైగా షాపులు పాత వారినే వరించినట్లు ఎకై ్సజ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టిన వారికి నామమాత్రపు సంఖ్యలో షాపులు వచ్చాయి. జిల్లాలో 101 మద్యం షాపులకు గాను 4,432 దరఖాస్తులు వచ్చిన విషయం విదితమే. తక్కువ దరఖాస్తులు వచ్చాయని.. జిల్లాలోని మునిపల్లి మండలం తాటిపల్లిలో ఉన్న మద్యం షాపు లక్కీ డ్రాను అధికారులు వాయిదా వేశారు. ఈ షాపునకు 19 దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు. గతసారి ఈ షాపునకు 46 దరఖాస్తులు రాగా, సగానికిపైగా దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో ఈ షాపు లక్కీడ్రాను వాయిదా వేశారు. రెండేళ్లుగా ఈ మద్యం షాపులో అమ్మకాలు కూడా బాగానే ఉన్నప్పటికీ.. దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో లక్కీడ్రాను వాయిదా వేయాలని నిర్ణయించారు. కాగా ఆందోల్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 18 దరఖాస్తులు వచ్చినా లక్కీ డ్రా నిర్వహించారు. నిర్దేశించిన క్రైయిటీరిలో తాటిపల్లి షాపునకు దరఖాస్తుల సంఖ్య లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు.మూడు పర్యాయాలు ఒకే సిండికేట్కు.. మద్యం షాపుల లక్కీడ్రాలో చిత్రాలు చోటు చేసుకున్నాయి. సదాశివపేటలోని ఓ మద్యం షాపు రెండు పర్యాయాలు దాదాపు నాలుగేళ్లు పైగా ఒకే సిండికేట్ గ్రూపునకు దక్కుతోంది. ఈసారి కూడా ఈ షాపు ఇదే సిండికేటును వరించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే నారాయణఖేడ్కు చెందిన మరో సిండికేట్కు మూడు మద్యం షాపులు దక్కడంతో సిండికేట్ గ్రూపులోని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
- 
      
                   
                                 నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడిటీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలకొండాపూర్(సంగారెడ్డి): నాణ్యమైన విత్తనాలతోనే పంటల్లో అధిక దిగుబడులు వస్తాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల అన్నారు. సోమవారం మండల పరిధిలోని తొగర్పల్లిలో పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గతంలో రైతులు పండించిన పంటలనే విత్తన శుద్ధి చేసుకొని తిరిగి వాటినే విత్తనాలు నాటేవారన్నారు. కానీ ప్రస్తుతం పండించిన పంటను మొత్తం అమ్ముకొని తిరిగి విత్తనాల కోసం మార్కెట్లో క్యూ కట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను గట్టించేందుకు ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు ప్రతి గ్రామంలో ముగ్గురికి చొప్పున విత్తనాలను పంపిణీ చేశారని తెలిపారు. విత్తనాలు తీసుకున్న వారు తమ పంటలను బహిరంగ మార్కెట్లో అమ్మకుండా నేరుగా రైతులకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల రీసెర్చ్ స్కాలర్ బలరాం, జెడీఏ శివప్రసాద్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీకాంత్రెడ్డి, మాణిక్రెడ్డి, రాంరెడ్డి, పవన్కుమార్, ఏఓ గణేష్తో పాటు వ్యవసాయాఽధికారులు పాల్గొన్నారు.రూ.1.30 కోట్ల నిధులివ్వండి కలెక్టర్కు నిర్మలారెడ్డి వినతి సంగారెడ్డి: ప్రభుత్వ బాలుర హైస్కూల్, జూనియర్ కళాశాలలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేయాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్కు ప్రావీణ్యకు వినతి పత్రం సమర్పించారు. హైస్కూల్, జూనియర్ కళాశాలను వేరు చేస్తూ ప్రహరీ నిర్మాణం, పెయింటింగ్ , గ్రావెల్ వేయించడం లాంటి పనుల కోసం నిధులు అవసరం అవుతాయన్నారు.
- 
      
                   
                                 లక్ష్యం సాధించాలి● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● ఆయిల్పామ్ సాగు విస్తీర్ణంపై సమీక్ష సంగారెడ్డి జోన్: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం కోసం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సూక్ష్మ నీటి సేద్యం, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ వెదురు మిషన్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం వంటి పథకాల అమలు ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరానికి గాను 3,750 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. రైతులకు అర్హత ప్రకారం ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు చేపట్టే పథకాలు రైతుల స్థాయిలో ఫలితాలను ఇవ్వాలంటే సమయపాలనతో పాటు సాంకేతిక మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో భాగంగా గోద్రెజ్ ఆగ్రోవేట్ ఆధ్వర్యంలో మండల వారీగా రైతుల అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సీహెచ్ పండరి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఏడీఎస్ అధికారులు, ఉద్యాన విభాగ సిబ్బంది, గోద్రెజ్ ఆగ్రోవేట్ జనరల్ మేనేజర్ స్వీటీ వేగుంట, తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజావాణిలో భాగంగా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ మేరకు 59 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఆర్ఓ పద్మజరాణి పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన కలిగి ఉండాలి గుండెపోటు, శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చిన సమయంలో ప్రాణాలు కాపాడే సీపీఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సీపీఆర్పై అధికారులకు అవగాహన కల్పించారు.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సంగారెడ్డి జోన్: జిల్లాలో రెండు రోజులలో వంద శాతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టరు ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం వరిధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు అధికారులు హాజరయ్యారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్డీఏ పీడీ జ్యోతి, డీఏఓ శివ ప్రసాద్, డీసీవో కిరణ్ కుమార్, డీఎం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్ తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పేకాట స్థావరంపై మెరుపు దాడిరేగోడ్(మెదక్): పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో జూదరులను అరెస్టు చేశారు. ఆదివారం కేసుకు సంబంధించిన వివరాలు అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి వెల్లడించారు. మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలోని రేకుల షెడ్డులో హైదరాబాద్, పటాన్చెరు, శంకర్పల్లి, జనవాడ, చేవేళ్ల, ఆల్వాల్కు చెందిన కొందరు వచ్చి పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 19మందిలో 16మందిని అరెస్ట్ చేయగా.. ముగ్గురు పారిపోయారు. వారి వద్ద ఉన్న రూ.2లక్షల 19వేలు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. వారి వద్ద దొరికిన నగదు, వాహనాలు, సెల్ఫోన్లను కోర్టులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. పేకాట ఆడుకోవడానికి సహకరించిన, స్థలమిచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని, సంబంధిత ఆర్డీఓ అనుమతితో సీజ్ చేస్తామన్నారు. సీఐ వెంట ఎస్ఐ పోచయ్య, సిబ్బంది ఉన్నారు. జహీరాబాద్లో 16 మంది..జహీరాబాద్ టౌన్: పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్ఐ.వినయ్కుమార్ పేర్కొన్నారు. వివరాలు... జహీరాబాద్ పట్టణంలోని ఆర్యనగర్ కాలనీలోని మంగలి దత్తు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.59,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్యనగర్ వడ్డె నర్సింహులు ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.5,380 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 16మంది జూదరుల అరెస్ట్
- 
      
                   
                                                       బైక్ను ఢీకొట్టిన లారీ● ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు● గాంధీ ఆస్పత్రికి తరలింపుమిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ఎనగుర్తి గ్రామానికి చెందిన బూరు ప్రభాకర్, చిన్న ముత్యాల ప్రసాద్ అక్బర్పేట–భూంపల్లి క్రాస్ రోడ్డును దాటుతూ ఎనగుర్తి వైపు వెళ్తుండగా సిద్దిపేట నుంచి మెదక్ వైపు అతి వేగంగా వెళుతున్న లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్తో సహా సుమారు 20 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమించడంతో సికిద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- 
      
                   
                                 అధ్వానంగా ఐబీ భవనంశివ్వంపేట (నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో నిర్మించిన ఐబీ భవనం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. భవనాన్ని నిర్మించినప్పటి నుంచి వినియోగించుకోకపోవడం మూలంగా పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో దర్శనమిస్తోంది. దీంతోపాటు అసాంఘిక కార్యకలాపా లకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ ఫర్నిచర్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ వినియోగించడంలో ప్రస్తుత అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వృథాగా ఉన్న ఈ భవనాన్ని ఇతర ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తూప్రాన్ నర్సాపూర్ హైవే పక్కన లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం వృథాగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి భవనం వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. పట్టించుకోని అధికారులు
- 
      
                   
                                 సంచార జాతుల కళలు కాపాడాలిసామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్బాబు గజ్వేల్రూరల్: అంతరించిపోతున్న సంచార జాతుల కళలను కాపాడుతూ, వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేశ్బాబు పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో సామాజిక సమరసతా వేదిక, విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఆదివారం సంచార జాతుల కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్తో కలిసి నరేశ్బాబు మాట్లాడారు. భారతీయ సంస్కృతిని, విలువలను తరతరాలుగా అందించే సంచార జాతుల కళా ప్రదర్శనలను నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ వర్గాలు, ఆశ్రిత కులాలు, కుల చరిత్రలు చెబుతూ జీవనం గడిపే విముక్త సంచార జాతుల కళలు సమాజ చైతన్యానికి ఉపయోగడుతాయన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 32 సంచార జాతుల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ప్రధాన కార్యదర్శి చిరంజీవి, సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత మహిళా కన్వీనర్ రుక్మిణి, పట్టణ ప్రముఖులు సాయినాథ్రెడ్డి, శ్రీధర్, నాగేందర్తో పాటు ప్రజలు పాల్గొన్నారు.
- 
      
                   
                                 విద్యుదాఘాతంతో పెయింటర్ ..తూప్రాన్: విద్యుత్ షాక్కు గురై పెయింటర్ మృతి చెందాడు. ఈ ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన కంచర్ల సతీశ్గౌడ్ (38) పెయింట్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆదివారం తూప్రాన్ పరిధిలో సెంట్ ఆర్నాల్డ్ స్కూల్ దగ్గరలో ఓ నూతన భవనం వద్ద పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెయింట్ వేస్తున్న సతీశ్గౌడ్కు పక్కనున్న విద్యుత్ వైర్లు తాకి షాక్కు గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
- 
      
                   
                                 టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలిటీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి మెదక్జోన్: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష రాయాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీని 2023 జులై నుంచి అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, కోశాధికారి అజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారిపై వీధి కుక్క దాడిచిన్నశంకరంపేట(మెదక్): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటన మండలంలోని మడూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమాగౌడ్ కూతురు రిషిక(9) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి ముందు అడుకుంటుంది. ఈ క్రమంలో బాలికపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన తల్లిదండ్రులు కుక్కను తరిమేశారు. కుక్కదాడిలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హల్దీవాగులో గుర్తుతెలియని మృతదేహంచిన్నశంకరంపేట(మెదక్): గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ నారాయణగౌడ కథనం మేరకు...ఽ ఆదివారం మండలంలోని దరిపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో 45 నుంచి 50 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. ఆకుపచ్చ చీర, నల్లని జాకెట్ ధరించిన మహిళ గోసికట్టి ఉంది. ఉదయం ధరిపల్లి గ్రామస్తులు వాగువద్ద మహిళ శవం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అల్లీపూర్ శివారులో..చిన్నకోడూరు(సిద్దిపేట): గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని అల్లీపూర్ శివారులో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు... గ్రామ శివారులోని గండి చెరువు వద్ద దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులు చెట్లపొదలను పరిశీలించగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సైఫ్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, 30 ఏళ్లు ఉంటాయని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.సంత్రాల వాహనం బోల్తాహుస్నాబాద్రూరల్: మండలంలోని మీర్జాపూర్ క్రాసింగ్ వద్ద ఆదివారం సంత్రాలతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం... మహారాష్ట్ర నుంచి వరంగల్కు బొలెరో వాహనంలో సంత్రాలను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పోతారం(ఎస్) దాటిన తర్వాత ముందు వెళ్తున్న జేసీబీ సడన్గా మీర్జాపూర్ వైపు క్రాస్ కావడంతో వెనుక ఉన్న బొలెరో డ్రైవర్ ప్రమాదంను తప్పించడానికి రోడ్డు వైపు తిప్పడంతో బోల్తా పడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు.
- 
      
                   
                                 అతిగా మద్యం తాగి వ్యక్తి మృతిచిన్నశంకరంపేట(మెదక్): అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలోని వైన్స్ ఎదురుగా ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు... మండలంలోని అంబాజిపేట గ్రామానికి చెందిన బండారు వెంకటేశం(40) శనివారం రాత్రి ఓ వైన్స్ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి పక్కనే ఉన్న పర్మిట్ రూమ్లో తాగాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన అతను ఇంటికి వెళ్లలేదు. ఆదివారం ఉదయం చూస్తే వైన్స్ సమీపంలో వెంకటేశం మృతి చెంది కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
- 
      
                   
                                 బాబోయ్.. దొంగలుఉమ్మడి జిల్లాలో వరుస చోరీలు, దోపీడీలు● భయాందోళనకు గురవుతున్న ప్రజలు ● పని చేయని సీసీ కెమెరాలు ● నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులుఉమ్మడి జిల్లాలో దొంగలు వరుస దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోడ్లపై పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లడం, తాళం వేసిన ఇళ్లలో, ట్రాక్టర్ల బ్యాటరీలను ఇలా ఏది దొరికితే అది దోచుకెళ్తున్నారు. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. – సంగారెడ్డి క్రైమ్/ మద్దూరు (హుస్నాబాద్):సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో... ఇప్పటి వరకు అయిన చోరీలు ట్రాక్టర్ బ్యాటరీలు 30 ఆలయాల్లో 12 ఇండ్లలో 06 పశువులు 02 మొత్తం 50సంగారెడ్డిలో దోపీడీలు గత నెల 11న మధ్యాహ్నం సంగారెడ్డి బైపాస్లోని కిరాణ షాపునకు చెందిన నరసింహా రెడ్డి కారులో ఉన్న డబ్బుని అద్దాలు పగులగొట్టి రూ.50వేలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈనెల 17న కందిలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తికి సంబంధించిన డబ్బును దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ. లక్షా50 వేలను దోచుకెళ్లారు. ఈనెల 14వ తేదీన ఉదయం ఓ ఫంక్షన్ హాల్ ఎదురుగా పార్కు చేసిన ఇన్నోవా కారులో ఉన్నా రూ.20 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కారు అద్దాలు పగులగొట్టి ఎత్తుకెళ్లారు.
- 
      
                   
                                 వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యంపటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బాల్రెడ్డి ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 24న సాయంత్రం బయటకు వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సమత ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లోనే ఉంది. స్థానికంగా చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మరో ఘటనలో ఆటో డ్రైవర్.. పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన మోహన్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24న ఉదయం ట్రాలీ ఆటో కిరాయి వచ్చిందని, ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్యగజ్వేల్రూరల్: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలం రిమ్మనగూడలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎన్నెల్లి కిషన్(31) డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలంగా కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిషన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గడ్డి మందు తాగి.. సిద్దిపేటకమాన్: వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేటలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని భరత్నగర్కు చెందిన కడవెర్గు యాదగిరి(40) జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన అనితతో 16ఏళ్ల కింద వివాహమైంది. వీరికి పదమూడేళ్ల కూతురు ఉంది. నాలుగేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిగా ఉంటున్నారు. యాదగిరి స్థానికంగా తల్లితో పాటు ఉంటూ ఇర్కోడులో పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది. ఈ క్రమంలోనే యాదగిరి మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం ఇంట్లో గడ్డి మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.
- 
      
                    రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులుతొగుట(దుబ్బాక): రాష్ట్ర స్థాయిలో జరిగే బీచ్ వాలీబాల్ క్రీడా పోటీలకు మండల పరిధిలోని వెంకట్రావుపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్న కంది అర్చన, బెజ్జమైన శివానీ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నహీమా తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 17 విభాగంలో బీచ్ వాలీబాల్ క్రీడల్లో జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికై న విద్యార్థినిలను గ్రామస్తులు అభినందించారు. మార్షల్ఆర్ట్స్లో జాతీయ స్థాయికి నవనీత కౌడిపల్లి(నర్సాపూర్): మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో విద్యార్థి సత్తా చాటింది. మండలంలోని కొట్టాల తండాకు చెందిన బనోత్ నవనీత మార్షల్ఆర్ట్స్ ఉషూ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూర్ణచందర్, పోచయ్య తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–18 విభాగంలో నవనీత పాల్గొని బంగారు పతకం సాధించింది. 2026 జనవరిలో ఛత్తీస్గఢ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.
- 
      
                   
                                 వడ్ల కుప్పలను ఢీకొట్టిన బైక్అక్కన్నపేట(హుస్నాబాద్): రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని బంజారాహిల్స్ తండా వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం... దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామ పరిధిలోని శివాలితండాకు చెందిన లకావత్ రవి, అతని తండ్రి ఉమా ఇద్దరు కలిసి రోజు కూలీ పని నిమిత్తం బైక్పై కరీంనగర్కు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ తండా వద్ద రోడ్లపై ఆరబోసిన వడ్ల కుప్పులు చీకట్లో కనిపించకపోవడంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరి ముఖాలకు, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి , అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలు
- 
      
                   
                                 పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతరామచంద్రాపురం(పటాన్చెరు): పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. భెల్ టౌన్షిప్లో ఆదివారం శ్రీకృష్ణదేవరాయ కాపు సేవాసమితి, పారిశ్రామికవేత్త అరవ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భవిష్యత్ తరాల వారికి మంచి వాతావరణాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. ప్రధానంగా ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సమాజాభివృద్ధిలో అన్ని కులాలు, అన్ని మతాలు కలసిమెలసిగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కుల పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్
- 
      
                   
                                 కిక్కులక్కు ఎవరికో?సంగారెడ్డి జోన్: జిల్లాలోని 2025–27 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్సుల కోసం సోమవారం డ్రా నిర్వహించనున్నారు. సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సంబంధిత శాఖ అధికారులు పూర్తి చేశారు. ఆయా మండలాల్లో దుకాణాలను దక్కించుకునేందుకు పోటీపడి దరఖాస్తు చేసుకున్నారు. రూ.132.96 కోట్ల మేర ఆదాయం జిల్లావ్యాప్తంగా 101 మద్యం దుకాణాలు 4,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున రూ.132.96 కోట్ల మేర ఆదాయం సమకూరింది. 2023లో 6,156 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది రూ.లక్ష అదనంగా పెంచడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ఈనెల 18న దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. అయితే అనుకున్నంతస్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరోసారి గడువును పెంచడంతో 420 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఎంపికపై ఉత్కంఠ కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలు ఎంపిక కోసం దరఖాస్తుదారులు లాటరీ పద్ధతిలో అదృష్టం ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని 35దుకాణాలకు 2,316 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధించి అధికారులు వెల్లడించారు. కొత్తగా ఎంపికై న మద్యం దుకాణాలకు డిసెంబర్ 1 నుంచి కేటాయిస్తారు. 101 దుకాణాలు.. 4432 దరఖాస్తులు కలెక్టర్ అధ్యక్షతన ఎంపిక చేయనున్న అధికారులు గతంలో కంటే తగ్గిన అప్లికేషన్లు
- 
      
                   
                                 సదర్లో జగ్గారెడ్డి సందడిసంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ లో ‘‘పెద్ద గొల్ల సదర్ ఉత్సవం’’ఆదివారం ఘనంగా నిర్వహించారు. దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యువత అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. వారిలో జోష్ నింపేలా గాయకులు పాటలు పాడి ఆహుతులను అలరించారు. ఈ ఉత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూన సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదర్ ఉత్సవానికి హాజరైన జగ్గారెడ్డి అందరిలో జోష్ నింపారు. కార్యక్రమానికి వచ్చినవారు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి ప్రదర్శించారు. అనంతరం అక్కడున్న వారితో కలిసి జగ్గారెడ్డి స్టెప్పులు వేశారు. సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఆర్టీసీ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాలనీల మధ్య అంతర్గత రహదారులు నిర్మిస్తూ.. మెరుగైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: పెండింగ్ డీఏలతోపాటు డీఎస్సీ 2003 ఉపాధ్యాయులపై కోర్టు తీర్పును అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డిలోని కేవల్కిషన్ భవన్లో ఆదివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో జ్ఞానమంజరి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్న డీఏను నవంబర్ నెలలో ప్రకటించి అమలు చేయాలన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను ప్రతీ నెల రూ.700 కోట్లు విడుదల చేసి ఉద్యోగుల అకౌంట్లో జమ చేయాలని కోరారు. గతంలో కేంద్రప్రభుత్వం 57 రూల్కు అనుగుణంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛను పథకం ప్రకటిస్తూ అమలు చేయడానికి వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు తాత్కాలిక ఉపాధ్యాయులు (విద్యా వలంటీర్ల)ను నియమించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాలు ఇవ్వడంతోపాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ జీతాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు ఉపాధ్యక్షుడు కాశీనాథ్, సువర్ణ కోశాధికారి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి షామయ, నరసయ్య, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఆడపిల్లను ఆదరిద్దాంబాలికలు.. భవిష్యత్ దీపికలు ● ఉమ్మడి జిల్లాలో తగ్గిన జనన రేటు ● 2022తో పోలిస్తే 2023లో తగ్గిన జననాలు ● సీఆర్ఎస్ తాజా నివేదికలో వెల్లడి అవకాశాలు అందిపుచ్చుకుని ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. అయినా ఇంకా కొంతమంది వదిలించుకోవాలన్న దురాలోచన చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికల జనన రేటు దారుణంగా పడిపోయింది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీఆర్ఎస్) నివేదిక–2023లో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మహిళా కలెక్టర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండి పురుషులకు దీటుగా పాలన కొనసాగిస్తున్నారు. –సాక్షి, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం జననాలు 72,545, మరణాలు 17,392 జరిగాయి. 2023లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించడంతో 2022తో పోలిస్తే శిశుమరణాలు బాగా తగ్గాయి. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022లో 74,862 మంది, 2023లో 72,545 మంది జన్మించారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే జననాలు 2,317 తగ్గాయి. 2022లో మగ శిశువులు 38,928, 2023లో 37,928 మంది పుట్టారు. 2022లో ఆడపిల్లలు 35,934, 2023లో 34,617 మంది జన్మించారు. పెరిగిన శిశు మరణాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. 2023లో 471 మంది చిన్నారులు మృతి చెందితే అందులో 273మంది మగపిల్లలు, 198మంది ఆడ పిల్లలు మృతి చెందారు. 2022లో ఈ మొత్తం 447 మందిగా ఉంది. 2023లో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృషితో సిద్దిపేట, గజ్వేల్ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాయి. దీంతో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. తగ్గిన మరణాలు 2022లో 22,014మంది, 2023లో 17,392 మంది మృతిచెందారు. మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు, ఆరోగ్యంపై అందరూ ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి.
- 
      
                   
                                 రోడ్డు విస్తరణకు బ్రేక్జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారిని విస్తరించకపోవడానికి గల కారణాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అందోల్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జోగిపేట అంబేడ్కర్ వరకు ఉన్న రోడ్డును విస్తరించకుండా కేవలం అంబేడ్కర్ విగ్రహం నుంచి మాసానిపల్లి చౌరస్తా వరకు మాత్రమే 70 అడుగుల రోడ్డును నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ అధికారులు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. సంగుపేట నుంచి అందోల్ అంబేడ్కర్ వరకు, పట్టణంలోని పెట్రోల్ పంపు వద్ద నుంచి అన్నాసాగర్ దర్గా వరకు రోడ్డును ఫోర్లేన్గా ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందోల్ వైపు డివైడర్ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. అయితే అందోల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి భారత్ పెట్రోల్ పంపు వరకు పదేళ్ల క్రితం కేవలం డివైడర్ పనులు చేపట్టి రోడ్డును విస్తరించకుండా వదిలేశారు. పట్టణంలో కనీసం 60 అడుగుల వరకు రోడ్డును విస్తరించకుండా వదిలేసి మిగతా భాగాన్ని రోడ్డు విస్తరించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోడ్డుకిరువైపులా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇరుకుగా ఉన్నాయి. ఈ రోడ్డుపైనే ఆటోలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్లు, బైకులు రోడ్డుపైనే పెట్టుకుని దుకాణాల్లో కొనుగోలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో సర్వేలు చేసి వదిలేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా రోడ్డు విస్తరణకుగాను మార్కింగ్ కూడా చేశారు. కొన్నిచోట్ల రోడ్డు ముందుకు వచ్చి నిర్మాణాలు చేసుకున్న వారు కూలగొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, నర్సాపూర్ ప్రాంతాల్లో రోడ్డును విస్తరించి పాదాచారుల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణాలు సైతం చూడటానికి విస్తారంగా కనిపించడంతోపాటు రవాణా రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనుకున్నారు. అయితే మధ్యలోనే ఈ పనులను ఆపివేశారు. నాయకుల ఒత్తిడే కారణమా? 2023 ఎన్నికల్లో అందోల్ ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట పట్టణాన్ని సిరిసిల్ల, సిద్దిపేట పట్టణాల కంటే అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. పట్టణంలో 60 అడుగుల రోడ్డును ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రకటించారు. సంగుపేట వద్ద నుంచి అన్నాసాగర్ వరకు రోడ్డు విస్తరణ పనులకుగాను ప్రభుత్వం ద్వారా రూ.20 కోట్ల నిధులను మంజూరు చేయించారు. అయితే స్థానిక నాయకుల ప్రమేయంతో పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉ ండటంతో స్థానిక నాయకులు మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ పనులు నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంబేడ్కర్ రోడ్డును 70 అడుగుల వెడల్పుతో అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి మాసానిపల్లి వరకు గల కి.మీ రోడ్డును మాత్రం 70 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి సర్వే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు అజ్జమర్రి బ్రిడ్జి వద్ద నుంచి డాకూరు రోడ్డుకు అనుసంధానిస్తూ రోడ్డును అభివృద్ధి చేసేలా ప్రణాళికను చేపడుతున్నట్లు సమాచారం. మంత్రి దామోదర ఈ రోడ్డుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రోడ్డు పనులు చేపట్టి తీరాల్సిందేనని రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే. అధికారపార్టీ నాయకుల జోక్యమే కారణమా? ఇరుకై న రోడ్లతో ప్రజలకు తప్పని ఇబ్బందులు జోగిపేట రోడ్డు విస్తరణపై మంత్రి గతంలో హమీ! పాదాచారులకు ప్రత్యేకంగా రోడ్డు పాదాచారులు రోడ్డుపై నడవకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట, సిరిసిల్ల, నర్సాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విధంగా జోగిపేటలో కూడా ఏర్పాటు చేయాలని జోగిపేట అభివృద్ధిని కాంక్షించే పలువురు సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు గతంలో మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ పనుల కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. మంత్రి దామోదర రాజనర్సింహ అయినా ఈ విషయంలో చొరవచూపాలని స్థానికులు కోరుతున్నారు.
- 
      
                   
                                 సాగుకు ఉపాధి ఊతం● వ్యవసాయ అనుబంధ పనుల గుర్తింపు ●కొత్తగా పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పాడి పశువుల షెడ్లు ●ఇంకుడు గుంతల నిర్మాణానికీ అవకాశం ●నవంబర్ 30లోగా పనుల జాబితా అందించాలి నారాయణఖేడ్: వలసలు నివారించి సొంత ఊరిలోనే ఉపాధి పనులు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేస్తోంది. కాలానుగుణంగా పలు నూతన పనులు ఈ పథకంలో చేరుస్తూ కూలీలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది. గ్రామాల్లోని చెరువులు, కాలువలు, మొక్కల పెంపకం వంటి వాటితోపాటు గత రెండేళ్లుగా ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల్లో వ్యక్తిగత లబ్ధిదారులకు సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్వయం సహాయక బృందాలు, ఎన్ఆర్ఎల్ఎం సమన్వయంతో పశువుల, గొర్ల, కోళ్ల పెంపకం, పాకల నిర్మాణం, అజోల్ల సాగు, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం, వర్మీ కంపోస్టు పిట్ నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. లేబర్ బడ్జెట్ తయారీకి సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామ సహజ వనరుల కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో పనులను గుర్తించి వివరాలతో నివేదిక రూపొందించాలని ఆదేశాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఆ పనులకు గ్రామ సభ ఆమోదంతో ఫార్మాట్–1లో పనుల వివరాలను పొందుపరిచి పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను నవంబర్ 30లోగా తప్పనిసరిగా అందజేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎక్కువగా వ్యవసాయరంగ పనుపై దృష్టి సారించాలని ఆదేశించింది. మిషన్ వాటర్ కన్జర్వేటర్ మండలాల్లో సహజ వనరుకలు సంబంధించి పనులు 65%, వ్యక్తిగత పనులు 60%కు మించి గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొనసాగుతున్న గ్రామ సభలు.. జిల్లాలో 619 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు సాగుతుండగా పనుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభల్లో వ్యవసాయ అనుబంధంగా జిల్లాలో అజోలా గడ్డి సాగు, చెక్ డ్యామ్ల నిర్మాణం, అన్ని రకాల పంటలతో సాగు, ఫారం ఫాండ్స్ నిర్మాణం, ఫీడర్ ఛానెల్స్లో పూడికతీత, మళ్ళింపు కాలువలు, భూమి చదును, రాళ్ళకట్టల నిర్మాణం తదితర పనులు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా సన్న చిన్నకారు రైతుల భూమి చదునుకు ప్రాధాన్యతనిస్తూ మొదటగా ఎస్సీ, ఎస్టీలు తర్వాత ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. షెడ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం పౌల్ట్రీ షెడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్నారు. రైతుకు ఒక్కో షెడ్కు యూనిట్కు రూ.85వేలు అందిస్తారు. దీని ద్వారా రైతు షెడ్డును నిర్మించుకుని 100 నాటు కోడిపిల్లలను పెంచాల్సి ఉంటుంది. పశువుల పాకలకు యూనిట్ ధర రూ.96వేలు అందించనుంది. 3 పశువులు కచ్చితంగా ఉన్నవారికే ప్రాధాన్యమిస్తారు. మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణానికి యూనిట్కు రూ.98వేలు అందించనున్నారు.
- 
      
                   
                                 బైకును ఢీకొట్టిన కంటైనర్ప్రమాదంలో వ్యక్తి మృతి కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చెందాడు. ఈ ఘటన కందిలోగల జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... కందికి చెందిన దుర్గయ్య(62) మరో ఇద్దరితో కలిసి బైకుపై పాత కందికి వెళుతున్నాడు. ఈ క్రమంలో కందిలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మలుపు వద్ద కంటైనర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 10 కిలోల గంజాయి స్వాధీనంవ్యక్తి అరెస్టు పటాన్చెరు టౌన్: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయక్ రెడ్డి వివరాల ప్రకారం... మహారాష్ట్ర ఉస్మానాబాద్కు చెందిన సంతోష్ మధుకర్ (34) ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకెళుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఓఆర్ఆర్ వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా బ్యాగ్తో కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా ఒడిశాలోని సురేష్ బెహరా అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశానని, లారీలో ముత్తంగి వరకు వచ్చినట్లు తెలిపారు. నిందితుడు సంతోష్ మధుకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐలు రాజు, ఆసిఫ్ అలీలను సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు అభినందించారు.
- 
      
                   
                                 అక్రమ కల్లు దుకాణాలపై దాడులుఅల్లాదుర్గం(మెదక్): కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మండలంలోని చిల్వెర గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎకై ్సజ్ ఎస్ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామ శివారులో 161 జాతీయ రహదారి పక్కన అక్రమంగా కొంత కాలంగా కల్లు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా చిల్వెర గ్రామానికి చెందిన ప్రభుగౌడ్, మహేశ్ గౌడ్, సత్యనారాయణ కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు. 110 లీటర్ల కల్తీ కల్లును పారబోసి, ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రోడ్ల పక్కన , జాతీయ రహదారుల పక్కన అక్రమంగా కల్లు విక్రయిస్తే కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.ముగ్గురిపై కేసు నమోదు
- 
      
                   
                                 విద్యార్థులు నైపుణ్యం సంపాదించాలిసిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అధునాతన నైపుణ్యాలను సంపాదించుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ అన్నారు. సైబర్ భద్రత సవాళ్లు, దృక్పథాలు అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక దేశం బలం ఆదేశం డేటా దాని నియంత్రణలో ఉంటుందని, చైనా మినహా దాదాపు అన్ని దేశాల నుంచి గూగుల్ డేటాను కలిగి ఉన్నట్లు చెప్పారు. ఉచిత డిజిటల్ సేవలకు ఆకర్షితులైతే సైబర్ నేరాలకు అవకాశం ఉంటుందని సూచించారు. సైబర్ మోసాలకు పేరుగాంచిన ప్రముఖ వెబ్సిరీస్ను ప్రస్తావిస్తూ విద్యార్థులు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. సంప్రదాయ ఐటీ రంగంలో నైపుణ్యాలు ఉంటే ఆశాజనకమైన కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, సీఓఈ గోపాలసుదర్శనం, సదస్సు కన్వీనర్లు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ ముగిసిన జాతీయ సదస్సు
- 
      
                   
                                 కూరగాయలకు వెళ్తుండగా..వర్గల్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం వర్గల్ మండలం గౌరారం సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మర్కూక్ మండలం పాతూరుకు చెందిన ఉప్పరి సత్తయ్య, కనకలక్ష్మి దంపతులు కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేందుకు శనివారం తమ ఆటోలో బయల్దేరారు. గౌరారం మార్స్ పరిశ్రమ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు వెనక నుంచి వీరి ఆటోను ఢీకొట్టింది. ఆటో రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టడంతో ధ్వంసమైంది. ఈ ఘటనలో దంపతులు ఆటో నుంచి ఎగిరిపడటంతో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ముగ్గురికి.. దుబ్బాకరూరల్: బోలెరో వాహనం బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రాజక్కపేట గ్రామంలో జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బాక నుంచి ముస్తాబాద్కు బొలెరో వాహనం వెళ్తున్నది. ఈ క్రమంలో రాజక్కపేట నుంచి దుబ్బాక వైపు వస్తున్న బైక్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బిట్ల గణేశ్, ఆస బాలపవన్, కరికె కిశోర్ను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడి ఒకరికి.. సంగారెడ్డి: కారు బోల్తాపడి ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. నాందేడ్ జాతీయ రహదారిపై చౌటకూర్ మండలం పరిధిలోని శివ్వంపేట్ గ్రామం సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన కారు దంపతులకు గాయాలు
- 
      
                   
                                 మేకప్తో మెరిసేద్దాంప్రభుత్వం తరఫున ఉచిత శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలువురికి జహీరాబాద్లో లతాస్ బ్యూటీ అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్స్ను కూడా అందిస్తున్నారు. కొందరు సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతుండగా, మరికొందరు ఫ్రీలాన్సర్స్గా మేకప్, మెహిందీ, ఫ్లవర్ మేకింగ్, శారీ ఫ్రీ ప్లీటింగ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని ఎదుగుతున్నారు. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల నిరుద్యోగులైన యువతులే కాకుండా గృహిణులు కూడా ఉపాధి పొందుతున్నారు.అందం ఉట్టిపడేలా.. పెళ్లి కుమార్తె అందం ఉట్టి పడేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖంపై మొటిమలు కనిపించకుండా కవర్ చేసుకునేలా చూస్తున్నారు. పెదవులు, కళ్లు, జడను అందంగా మేకోవర్ చేస్తున్నారు. పెళ్లి ఫొటోల్లో చక్కగా కనిపించేలా మేకప్కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు.– లత, ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు, జహీరాబాద్ఏ శుభకార్యమైనా ముస్తాబవ్వాల్సిందే! డ్రెస్సింగ్, మేకప్లకు ప్రాధాన్యత మహిళల్లో పెరుగుతున్న ఆసక్తి గ్రామాలకూ విస్తరించిన బ్యూటీ పార్లర్లు ఉపాధి పొందుతున్న యువతులు
- 
      
                   
                                 ఎర్రరాయి తవ్వకాలపై దాడులున్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గణేశ్పూర్ గ్రామ శివారులో అక్రమంగా కొనసాగుతున్న ఎర్ర రాయి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఒక ఇటాచీని స్వాధీనం చేసుకున్నారు. శనివారం జహీరాబాద్ ఆర్డీఓ దేవూజీ, రెవెన్యూ అధికారులు శ్యామ్రావు సిబ్బందితో కలిసి గణేశ్పూర్ గ్రామ శివారులో ఎర్ర రాయి తవ్వకాలపై దాడులు నిర్వహించారు. దాడి విషయం ముందుగానే తెలుసుకున్న తవ్వకాల నిర్వాహకులు వాహనాలతో పరారయ్యారు. తవ్వకాల వద్దకు వెళ్లిన అధికారులు అక్కడ ఎవ్వరు కనిపించకపోవడంతో పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఉన్న ఇటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దేవూజీ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎర్ర రాయి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇటాచీని స్వాధీనం చేసుకున్న అధికారులు
- 
      
                   
                                 బొమ్మ, బొరుసు జూదంపై దాడిఏడుగురు అరెస్ట్ వట్పల్లి(అందోల్): బొమ్మ, బొరుసు జూదం ఆడుతున్న వారిపై శనివారం రాత్రి జోగపేట పోలీసులు దాడి చేసి ఏడుగురిని ఆదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ పాండు కథనం ప్రకారం అందోల్ మండల పరిధి ఎర్రారం గ్రామ శివారులో బొమ్మ, బొరుసు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం వచ్చింది. ఈ మేరకు దాడి చేసి జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.34, 840 నగదు, 7 సెల్ఫోన్స్, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. హక్కుల సాధనకు పోరాటంజహీరాబాద్ టౌన్: బీసీల హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలు చేయాలని జేఏసీ నాయకులు కోరారు. పట్టణంలో శనివారం జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కొండపురం నర్సింలు, పెద్దగొల్ల నారాయణ తదితరులు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జేఏసీని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు బీసీ వర్గాలకు అందేలా జేఏసీ కృషి చేయాలని కోరారు. వాహన తనిఖీ కొనసాగించాలి పటాన్చెరు టౌన్: వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగించాలని నవ భారత్ నిర్మన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కర్నూల్ బస్సు ప్రమాద ఘటనలో పలువురు మరణించడంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ప్రమాదాలు జరిగిన సమయంలో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా కాకుండా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగించాలన్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలు బరితెగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచముఖి ఆలయంలో చోరీపటాన్చెరు టౌన్: పంచముఖి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు కేజీ వెండి కిరీటం, అమ్మవారి బంగారు తాళి, హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడా మెట్రో ఎంక్లేవ్లోని పంచముఖి దేవాలయంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఆంజనేయస్వామికి అలంకరించిన వెండి కిరీటం, అమ్మవారి బంగారు తాళి, హుండీలోని లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం పూజ చేసేందుకు అర్చకులు వచ్చి చూడగా గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రక్తదాన శిబిరంసంగారెడ్డి క్రైమ్: పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పోలీస్ గ్రాండ్లో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్పందన లభించింది. పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లు, పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పోలీసులతో పాటు స్థానిక యువకులు 20 మంది నుంచి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది రక్తాన్ని సేకరించారు. దరఖాస్తుల ఆహ్వానంచేర్యాల(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా పలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి నర్సింహచారి తెలిపారు. గురుకుల పాఠశాలల్లో కొన్ని కేటగిరిల్లో పరిమిత సీట్లు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన బాల, బాలికలు ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- 
      
                   
                                 శిక్షణ తోపాటు ప్లేస్మెంట్ ఇప్పించాంసికింద్రాబాద్లోని బ్యూటీపార్లర్లో శిక్షణ పొందాను. కరోనా సమయంలో జహీరాబాద్లో పార్లర్ పెట్టాను. సెలబ్రిటీలకు మేకప్ చేసే స్థాయికి ఎదిగాను. పలువురు సినీ, టీవీ సీరియల్స్ నటీమణులకు మేకప్ చేస్తున్నా. తిరగబడరా సామి సినిమాలో నటీమణులకు మేకప్ ఆర్టిస్ట్గా పని చేశా. ప్రభుత్వం తరఫున మా సంస్థలో 150 మందికి ఉచితంగా, తక్కువ ఫీజుతో 500 మందికి శిక్షణనిచ్చా. వీరిలో 80 మంది సొంతంగా పార్లర్లు పెట్టుకున్నారు. చాలా మందికి హైదరాబాద్లోని ప్రముఖ బ్యూటీపార్లర్స్లో ప్లేస్మెంట్ ఇప్పించాం. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి అవార్డులు దక్కించుకున్నారు. డిజైన్ జడకట్టులో యువతి
- 
      
                   
                                 పార్లర్ పెట్టుకుని ఉపాధిబ్యూటీషియన్ రంగంలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందాను. సొంతంగా పార్లర్ ఏర్పాటు చేసుకున్నా. దీంతో నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించుకుంటున్నా. అంతే కాకుండా ఫ్రీలాన్సర్గా కూడా వెళ్లి సంపాదిస్తున్నాను. దీంతో ఆర్థికంగా ఎంతో నిలదొక్కుకోగలిగాను. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తీరాయి. – హారిక, బ్యూటీషియన్, సంగారెడ్డి నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నా స్థానికంగా బ్యూటీపార్లర్లో శిక్షణ తీసుకున్నాను. ఫ్రీలాన్స్ బ్యూటీషియన్గా పనిచేస్తూ నెలకు రూ.30వేలకు పైగా సంపాదిస్తున్నా. ఈ రంగంలోకి రావడంతో తమ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఇంతకు ముందు ప్రైవేటుగా పనులు చేసుకునేదాన్ని. ఇంటర్ వరకు చదువుకున్నాను. – సమ్రీన్ బేగం, బ్యూటీషియన్, జహీరాబాద్ ఆసక్తితో శిక్షణ బ్యూటీషియన్ రంగంపై ఆసక్తి ఉండటం వల్ల శిక్షణ తీసుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో ఇటు వైపు అడుగులు వేస్తున్నా. – స్వాతి, జహీరాబాద్
- 
      
                   
                                 కేటగిరీల వారీగా ఓటరు జాబితాకలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు కేటగిరీల వారీగా ఓటరు జాబితా రూపొందించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి, అదనపు అధికారి లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు అదనపు కలెక్టర్ మాధురితో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఎల్ఓలు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా కేటగిరీ ఏ ఓటర్ల ధృవీకరణ పూర్తయ్యాక కేటగిరీ బీ, సీ, డీలను ఏకు లింక్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా దశలవారీగా ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.
- 
      
                   
                                 వదలని వర్షం.. రైతుకు కష్టంనేల వాలుతున్న పత్తి పంటసంగారెడ్డి జోన్: పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. తెల్ల బంగారంగా పిలువబడే ఈ పంటను జిల్లాలో అత్యధికంగా రైతులు సాగు చేస్తుంటారు. కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అయితే ఈసారి పత్తికి కాలం కలిసి రాలేదనే చెప్పాలి. వానాకాలం సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. తీరా పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3.87 లక్షల ఎకరాల్లో సాగు ఈ వానాకాలం సీజన్లో 3.87 లక్షల ఎకరాలకుపైగా రైతులు పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే విత్తనాలు వేసిన సమయంలో సరైన విధంగా వర్షాలు కురవకపోవడంతో పంట ఎదుగుదల లోపించింది. కాయలు కాసిన తర్వాత కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచి రంగుమారి దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పత్తి పంట ఏరేందుకు సిద్ధంగా ఉంది. పత్తితీత సమయంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వర్షానికి పత్తి నేల రాలుతోంది. పంట దెబ్బతినడంతో పాటు నాణ్యత లోపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బరువు కూడా తగ్గిపోతుందని వాపోతున్నారు. ఎకరా విస్తీర్ణంలో పత్తి పంట వేసిన నాటి నుంచి పంట తీసి మిల్లుకు తరలించే వరకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవుతోంది. ఎకరాలో పంట బాగా పండితే 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో అందుకు భిన్నంగా కేవలం 5 క్వింటాళ్ల లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. పంట సాగుకు చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంట చేతికొచ్చే సమయంలో ఆగం తేమ శాతం ఆధారంగా మద్దతు ధరపత్తి పంటను కొనుగోలు చేసేందుకు జిల్లాలో 22 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాల్కు రూ. 8,110 చొప్పున మద్దతు ధరను నిర్ణయించారు. సీసీఐలో అమ్ముకునేందుకు తప్పనిసరిగా 8 నుంచి 12 తేమ శాతం లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే అమ్ముకునేందుకు వీలు ఉండదు. తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరను నిర్ణయించనున్నారు.
- 
      
                   
                                 ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు చేస్తారా?మెదక్జోన్: బస్సు ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు గుర్తుకువస్తాయా..? అని ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. శనివారం మెదక్ ఐబీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదాలు చోటు చేసుకోగానే హడావుడిగా తనిఖీలు చేసే అధికారులు ఆ తర్వాత మరిచిపోవటం ఎంతవరకు సమంజసం అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రైవేట్ వాహనాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2047 వరకు వికసిత్ భారత్ మోదీ లక్ష్యమని గుర్తు చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నాయకులు నందారెడ్డి సిద్దిరాములు, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని తెలిపారు. గన్నీ బ్యాగులతో పాటు హమాలీలను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు ఆరబెట్టి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం రమేశ్, తహసీల్దార్ పర్వీన్ షేక్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, ఏపీఎం రాజశేఖర్, సొసైటీ డైరెక్టర్ రాములు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశువులకు టీకాలు తప్పనిసరి పటాన్చెరు టౌన్: గాలికుంటు నివారణ టీకాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వసంత కుమారి సూచించారు. శనివారం అమీన్పూర్ మండలంలోని వడక్పల్లి, కిష్టారెడ్డిపేటలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏటా ప్రభుత్వం గాలి కుంటు వ్యాధి రాకుండా పశువులకు ఉచితంగా టీకాలను అందిస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం వచ్చేనెల 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి ప్రదీప్కుమార్, సహాయకుడు సత్యనారాయణ పాల్గొన్నారు. వైద్యానికి మూలం ఆయుర్వేదం సంగారెడ్డి టౌన్: ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనారోగ్య సమస్యలతో ఇతర దేశాల నుంచి మన దేశంలోని ఆయుర్వేద ప్రకృతి వైద్యశాలలకు వస్తున్న ప్రజలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎంఎన్ఆర్ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలను అభినందించారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయసేవలను అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షుడు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, ఎంఎన్ఆర్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలిసంగారెడ్డి జోన్: ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం రక్తదానంతో పాటు పోలీస్ అధికారులకు వ్యాసరచన పోటీలు, పరేడ్గ్రౌండ్లో ఓపెన్హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆయుధాలపై అవగాహనతో పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీ, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రక్తదానం చేసిన పలువురిని ఎస్పీ అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సుమారు 114 యూనిట్ల బ్లడ్ను సేకరించడం గొప్ప విషయమన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ పరితోష్ పంకజ్
- 
      
                   
                                 దాచుకున్న మా డబ్బులు ఇవ్వరా?● టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ● తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొంత డబ్బులు రాక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయి పడ్డ ఐదు విడతల కరువు భత్యం విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులు పదవీ విరమణ పొంది 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారు దాచుకున్న పీఎఫ్ డబ్బులు వారికి రావాల్సిన ప్రయోజనాలు ఈరోజు వరకు చేకూరలేదని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అనురాధ, ఇక్బాల్ పాషా, ఫణి రాజ్, ఫజులుద్దీన్, రఘునాథరావు, శివాజీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 రోడ్డు విస్తరణ సర్వే షురూజోగిపేట(అందోల్): పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి మాసానిపల్లి చౌరస్తా వరకు ఇరువైపులా సర్వే నిర్వహించారు. రోడ్డు మద్య నుంచి ఇరువైపులా 35 మీటర్లు చొప్పున మొత్తం రోడ్డు 70 మీటర్లుగా వేసేందుకు అధికారులు కొలతలు చేపట్టారు. రోడ్డు మధ్యలో డివైడర్తో పాటు ఇరువైపులా మురికి కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు వంద ఇళ్ల వరకు కూల్చి వేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీతో పాటు, నూతన తరగతి గదులు కూడా చాలా వరకు కూల్చివేయక తప్పదని అంటున్నారు. కాగా రోడ్డు విస్తరణతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగు పడే అవకాశం ఉంది.
- 
      
                   
                                 మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుమంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పాటును అందిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ గార్డెన్లో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.అక్షయపాత్ర సేవలు అమోఘం కంది(సంగారెడ్డి): విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఆధ్యాత్మికతను పంచుతున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని మంత్రి దామోదర కొనియాడారు. శనివారం మండల కేంద్రంలోని హరేకృష్ణ కల్చరల్ సెంటర్లో చేపట్టిన మహా నరసింహ హోమం, ఆలయం గర్భాలయ యంత్ర స్థాపనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్షయ పాత్రలో విద్యార్థులకు తయారు చేస్తున్న భోజనం, వాటిలో వినియోగిస్తున్న బియ్యం తదితర వస్తువులు, కిచెన్ షెడ్డును పరిశీలించారు. విద్యార్థులకు భోజనం సరఫరా చేయనున్న రెండు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.
- 
      
                   
                                 ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఆహుతయ్యాక అలర్ట్!పటాన్చెరు కేంద్రంగానే ప్రైవేట్ ట్రావెల్స్ కార్యకలాపాలుమామూళ్ల మత్తులో రవాణాశాఖ అధికారులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రయాణికుల ప్రాణాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నప్పటికీ రవాణాశాఖ అధికారులు ఇన్నాళ్లు కళ్లు మూసుకున్నారు. కర్నూలులో వేమూరి కావేరి బస్సు దుర్ఘటన జరిగి 19 మంది ప్రాణాలు పోయాక, ఇప్పుడు తనిఖీల పేరుతో హడావుడి చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శనివారం ముత్తంగి టోల్ప్లాజా సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. కాగా పటాన్చెరు కేంద్రంగానే ట్రావెల్స్ బస్సులు నడుస్తాయి. వందల సంఖ్యలో నిత్యం ఇక్కడి నుంచే బెంగుళూరు, ముంబై, ఏపీలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుంటాయి. కర్నూలులో ప్ర మాదానికి గురైన బస్సు కూడా పటాన్చెరు నుంచే ప్రారంభమైన విషయం విధితమే. పటాన్చెరుతో పాటు, బీరంగూడ, లింగంపల్లి వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంటాయి. రవాణాశాఖ కార్యాలయం ఉన్నప్పటికీ.. రవాణా శాఖకు సంబంధించి పటాన్చెరులోనే రవాణాశాఖ కార్యాలయం ఉంది. మో టార్ వెహికిల్ ఇన్స్పెక్టర్తో పాటు, పలువురు సహాయ అధికారులు ఈ కార్యాలయంలో పనిచేస్తుంటారు. వీరు నిత్యం రూట్ చెక్లో భాగంగా రోడ్డుపై వాహనాలను తనిఖీలు చేయాలి. కానీ ఈ ఏనాడు ఈ బస్సుల వైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సునే ఉదాహరణగా తీసుకుంటే.. ఈ బస్సు కూర్చుని ప్రయాణించే సీట్లతో మాత్రమే అనుమతి ఉంది. కానీ స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసి నడుపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీన్ని బట్టి చూస్తే ఎన్ని బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో భధ్రతా పరమైన లోపాలతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆయా ట్రావెల్స్ యాజమాన్యాలు రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉండటంతో పాటు, రవాణాశాఖ అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెపుతుంటారనేది బహిరంగ రహస్యం. దీంతో ఈశాఖ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా శనివారం జరిగిన తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొనట్లు తెలిసింది. తమ విధుల్లో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుస్తున్నా కన్నెత్తి చూడని వైనం
- 
      
                   
                                 ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేయాలికౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయుడ్ని డిప్యుటేషన్పై పంపకుండా సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండలంలోని కన్నారం ఉన్నత పాఠశాలలో ఫిజికల్సైన్స్ బోఽధించే ఉపాధ్యాయుడు మా కొద్దంటూ విద్యార్థులు ఽఈనెల 17న ధర్నా చేయగా మంగళవారం ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓ పాఠశాలలో విచారణ చేశారు. ఈ విషయమై బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మహిపాల్రెడ్డి, విఠల్, నారాయణ, యాదాగౌడ్, యాదుల్, పోచయ్య తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయుడు శ్రీకాంత్గౌడ్ ఓ సంఘంలో జిల్లా పదవిలో ఉన్నాడని అతని పలుకుబడితో డిప్యూటేషన్ వెళ్లేందుకు పైరవీలు చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో విధులు నిర్వహించిన పాఠశాలల్లో సైతం పాఠాలు చెప్పకుండా యూనియన్ కార్యకలాపాలు చేస్తూ తోటి ఉపాధ్యాయులతో గొడవలు పెట్టుకోవడం పరిపాటిగా మారిందన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం చేస్తున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కన్నారం గ్రామస్తుల డిమాండ్
- 
      
                   
                                 2న కార్తీక వన భోజనాలుసంగారెడ్డిటౌన్ : రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 2న కార్తీక వన భోజనాలు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి జిల్లాలోని వీరశైవ లింగాయత్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. అనంతరం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ధనంజయ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పాటిల్, కోశాధికారి గోవురాజు, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ర్యాకల్లో సంచార సైన్స్ల్యాబ్ ప్రదర్శననారాయణఖేడ్: ఖేడ్ మండలం ర్యాకల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం శాస్త్ర సంచార ప్రయోగశాల ప్రదర్శన( మొబైల్ సైన్స్ ల్యాబ్)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ ప్రయోగాలను ప్రదర్శించి వాటి తయారీని వివరించారు. 8వతరగతి చదువుతున్న నిఖిల్ తయారుచేసిన ఫ్యాన్ను జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తిలకించి సదరు విద్యార్థిని అభినందించారు. నాగల్గిద్ద ఎంఈఓ మన్మథకిశోర్, ప్రధానోపాధ్యాయులు గోపాల్, రీసోర్స్పర్సన్లు వినయ్కుమార్, ధన్సింగ్యక్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు నర్సింహులు పాల్గొన్నారు. కార్మికులకు బీమా చేయించాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీలోని ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ చేయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో బుధవారం గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులకు కష్టపడి పనిచేసిన ప్రతి నెలా రెగ్యులర్గా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.18 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు సబ్బులు, నూనెలు, యూనిఫాం ఇవ్వాలని కోరారు. కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు వేతనాలు వచ్చిన ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సత్తయ్య, దశరథ్ నాయకులు మహేశ్, పోచయ్య, శంకర్, విజేందర్, భీమయ్య, ఇమ్మానియేల్, నిరంజన్, రవి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఘనంగా సదర్ ఉత్సవంరామచంద్రాపురం(పటాన్ చెరు): రామచంద్రాపురం పట్టణంలో యాదవ సంఘం, సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను అలంకరించి వాటితో విన్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ బి.పుష్ప తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 చివరి గింజ వరకు కొంటాం● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంనారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం వరి ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ మండలంలోని సంజీవన్రావుపేట, తుర్కపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో, నిజాంపేట్ మండలంలోని జంబికుంట, రాంరెడ్డిపేట్, మునిగేపల్లి గ్రామాల్లో కల్హేర్ మండలం మహదేవుపల్లి, నిజాంపేట మండలం రాంరెడ్డిపేట్, మునిగేపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. గతంలో క్వింటాల్కు 7 కిలోల వరకు తరుగుపేరిట తీసేవారని, ఇప్పుడు అలా జరగకూడదని ఆదేశించామని చెప్పారు. మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా డబ్బులు జమ అవుతాయని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్లు బీఆర్ఎస్ పాలనలో రైసుమిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకుని పనిచేశారని సంజీవరెడ్డి ఆరోపించారు. ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్ అలీ, నాయకులు దత్తుగౌడ్, సాయాగౌడ్, గౌస్చిస్తీ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పోలీసుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంమంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి జోన్: ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవలందించే పోలీసుల ఆరోగ్య సంరక్షణే ప్రతీ ఒక్కరి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కొరకు నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శిబిరాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, జిల్లా వైద్యాధికారి నాగనిర్మల, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 హామీలన్నీ అమలు చేస్తాంసిద్దిపేటరూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్, పరిశ్రమల శాఖ మంత్రి జి.వివేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సిద్దిపేట నియోజకవర్గం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పథకాలను నెమ్మదిగా అమలు చేస్తుందన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి వర్గల్(గజ్వేల్): ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని వెద్యులకు మంత్రి వివేక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని బుధవారం రాత్రి మంత్రి వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పీహెచ్సీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోగా, సకాలంలో తాము పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రికి అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, తహసీల్దార్ రఘువీర్రెడ్డి, ఎంపీడీవో మశ్చేందర్, వైద్యాధికారి దీప పాల్గొన్నారు. మంత్రి జి.వివేక్ కలెక్టరేట్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
- 
      
                   
                                 ఊపందుకున్న ఆలు సాగుఇప్పటికే వర్షాలతో ఆలస్యమైన సాగు విత్తన సబ్సిడీ లేదు ఆలుగడ్డ విత్తనానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీని అందించడం లేదు. శీతల గిడ్డంగి ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే రైతులకు 40% మేర సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. రైతులు వ్యక్తిగతంగా లేక గ్రూపుగా వచ్చినా ఏర్పాటు చేసుకోవచ్చు. అధిక వ్యయం కారణంగా రైతులు ముందుకు రావడం లేదు. – పండరీ, జిల్లా ఇన్చార్జి ఉద్యానవన అధికారి, సంగారెడ్డిజహీరాబాద్: జిల్లాలో ఆలుగడ్డ పంట విస్తృతంగా సాగవుతోంది. పక్షం రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో రైతులు భూములను దున్ని ఆలుగడ్డ పంట వేసే పనులు చేపట్టారు. దీంతో సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాధారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచే విత్తనం వేసుకునే పనులు ప్రారంభించేవారు. ఇటీవలి వరకు వర్షాలు కురవడంతో విత్తనం వేసుకునే పనులు ముందుకు వెళ్లాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సుమారు 3వేల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. జహీరాబాద్ ప్రాంతంలోనే 90% మేర సాగు జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనే 90% మేర పంట సాగుకానుంది. ప్రతి ఏటా రైతులు సంప్రదాయకంగా ఆలుగడ్డ పంటను సాగుచేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 10% మేర పంట సాగయ్యింది. ఎర్ర నేలల్లో మాత్రమే సాగువుతోంది. పాడు, రేగడి మట్టి కలిగిన భూములు ఇంకా దున్నడానికి వీల్లేకుండా చిత్తడిగా ఉన్నాయి. వర్షాల కారణంగా భూముల్లో అధికంగా తేమ కలిగి ఉండటంతో దున్నకానికి అనుకూలంగా లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంట సాగు డిసెంబర్ మొదటివారం వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. 80 రోజుల్లోనే పంట చేతికి అందివస్తుంది. వ్యవసాయ బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటంతో పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో ఆలుగడ్డ పంట అధికంగా సాగుకానుంది. ఆకాశంలో విత్తనం ధర గతంతో పోల్చిచూస్తే ఈ ఏడాది ఆలుగడ్డ విత్తనం ధరలు ఆకాశంలో ఉన్నాయి. క్వింటాల్ ధర రూ.3,600లు పలుకుతోంది. ఇంతమేర విత్తనం ధర ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు మాత్రం క్వింటాల్కు రూ.400 నుంచి రూ.500 మేర అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఒకేసారి దిగుబడులతో ధర పలికేనా! రైతులంతా పంట సాగు ఒకేసారి చేస్తుండటంతో దిగుబడులు కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. దీంతో పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధరలు లభిస్తాయా లేదా అనే ఆందోళన రైతాంగాన్ని వెంటాడుతోంది. అయినా ఆలుగడ్డ పంట సాగువైపే రైతులు మొగ్గుచూపుతున్నారు.
- 
      
                   
                                 నిబంధనలకు తూట్లు?శివ్వంపేట(నర్సాపూర్): అనుమతులు లేకుండా పేద, మధ్య తరగతి ప్రజలు ఏదైనా నిర్మాణ పనులు చేపడితే అంతే అధికారులు వెంటనే స్పందించి ప్రతాపం చూపిస్తారు. కానీ, బాగా పలుకుబడి ఉండి నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణ పనులు చేస్తున్న బడా వ్యాపారులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్, టూరిజం కోసం పనులు చేస్తున్నా సంబంధిత అధికారులు కిమ్మనకుండా ఉండటం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.బండరాళ్లను పేల్చి.. చెట్ల తొలగింపు మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామ పరిధిలోని పట్టా భూములు సర్వే నం.26, 27, 32లోని సుమారు 40 ఎకరాలను కమర్షియల్గా మార్చేందుకు హోటల్, టూరిజం పేరిట రెండు నెలల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. నాలా కన్వర్షన్ చేయకుండానే భారీ నిర్మాణ పనులు చేస్తున్నారు. పచ్చని చెట్లతో నిండిపోయిన ప్రాంతాన్ని వాల్టా చట్టానికి విరుద్ధంగా భారీ చెట్లను తొలగించి రోడ్ల నిర్మించారు. పెద్ద బండరాళ్లను కంప్రెషర్తో పేల్చివేస్తుండటంతో సమీప రైతులు ఇబ్బందులు పడుతున్నారు.హోటల్, టూరిజం రిసార్టుల నిర్మాణాల కోసం బండరాళ్ల పేల్చివేత, చెట్ల తొలగింపు నాలా కన్వర్షన్ లేకుండానే పనులు చోద్యం చూస్తున్న అధికారులుముమ్మరంగా పనులు పచ్చని చెట్లను నేలమట్టం చేసి రోడ్లు వేయడంతోపాటు హోటల్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 40 ఎకరాల్లో హోటల్, టూరిజం కోసం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాళ్ల పేల్చివేతకు మైనింగ్, చెట్ల నరికివేతకు అటవీ, నాలా కన్వర్షన్కు రెవెన్యూ, నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- 
      
                   
                                 కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకొండపాక(గజ్వేల్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన మర్వాడి దేవదానం(33) డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ వృత్తి సరిగా కొనసాగకపోవడంతో మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో కుటుంబ పోషణ విషయంలో తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కూతురు శారీ ఫంక్షన్ కోసం చేసిన అప్పుల విషయంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. రోళ్లపాడ్లో గుర్తు తెలియని మృతదేహం వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని రోళ్లపాడ్ గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జోగిపేట ఎస్ఐ పాండు వివరాల ప్రకారం... గ్రామ శివారులోని మంజీరా నదిపై ఉన్న చెక్డ్యాం వద్ద మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో అటుగా వెళ్లిన వారు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని వెలికితీశారు. మృతి చెందిన వ్యక్తికి 20 నుంచి 30 ఏళ్ల ఉంటాయని, తెల్లచొక్కా, నీలంరంగు ప్యాకెట్ ఉన్న చొక్కా ధరించి ఉన్నట్లు తెలిపారు. ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు అక్కన్నపేట(హుస్నాబాద్): ఈతకు వెళ్లిన యువకుడు నీటి గుంతలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని జనగామ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఎండీ.చాంద్ పాషా( 21), గౌస్, మైబుల్, షాదుల్లా స్నేహితులు. సరదాగా హుస్నాబాద్ నుంచి వెళ్లి నిండుకుండలా జలసవ్వడితో ఉన్న గుంత పక్కనే కూర్చొని మద్యం తాగారు. ఈ క్రమంలో చాంద్ పాషా ఈత కొట్టేందుకు నీటి గుంతలోకి దిగాడు. కొద్దిసేపటికీ బయటకు రాకపోవడంతో గల్లంతు అయినట్లు పోలీసులకు స్నేహితులు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ ప్రశాంత్తో పాటు హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గల్లంతు అయిన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- 
      
                   
                                 గుంతను తప్పించబోయి..చిన్నశంకరంపేట(మెదక్): కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొర్విపల్లి వద్ద చోటుచేసుకుంది. బుధవారం మెదక్ వైపు నుంచి వస్తున్న సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రాంరెడ్డిపేటకు చెందిన ఆవుసుల సాయిబాబా కుటుంబ సభ్యులతో కలిసి వర్గల్ హాస్టల్లో తమ కూతురును దింపేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొర్విపల్లి వద్ద మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద గుంతను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న పాప కంటికి దెబ్బతగలగా, మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.
- 
      
                   
                                 వేగంగా దూసుకొచ్చి ..డివైడర్ను ఢీకొట్టిన కారుజిన్నారం (పటాన్చెరు): మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో మెదక్ బాలనగర్ జాతీయ రహదారి బొంతపల్లి దోమడుగు గ్రామాల మధ్య కారు అజాగ్రత్తగా మితిమీరిన వేగంతో దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టింది. కాగా ఘటనలో కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కారును వదిలేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
- 
      
                   
                                 భారీగా గంజాయి పట్టివేతతూప్రాన్: కారులో తరలిస్తున్న సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా... నాగపూర్కు చెందిన నిందితుడు చాంద్పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు కారులో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ చేసే 100 కిలోల ఎండు గంజాయిని నాగపూర్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు తన కుటుంబ సభ్యులను కారులో ఎక్కించుకొని వస్తున్నారు. మార్గమధ్యలో టోల్ప్లాజాల వద్ద కారును ఆపకుండా వస్తున్నారు. దీంతో అప్పటికే సౌత్జోన్ టాస్క్ఫోర్స్ డీసీపీ శ్రీనివాస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో తూప్రాన్ టోల్ప్లాజా వద్ద వాహనంతో కాపు కాశారు. గంజాయి కలిగిన కారు టోల్ప్లాజా వద్ద ఆపకుండా స్టాఫర్ను ఢీకొని అతివేగంగా వెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని అడ్డం పెట్టడంతో నిందితులు ప్రయాణిస్తున్న కారు పాలీసుల వాహనంను ఢీకొని బోల్తాపడింది. కారులోంచి మంటలు చెలరేగాయి. టోల్ప్లాజా సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం కారు నుంచి బ్యాగుల్లో దాచిన సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసుల సహకారంతో పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 
      
                   
                                 మంత్రి వివేక్కు హరీశ్ రావు కౌంటర్గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, వారు చేసిన అప్పులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5వేల కోట్లు మిత్తి చెల్లిస్తుందన్నారు. దీంతో మిగిలిన నిధులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. దీనికి స్పందించిన హరీశ్రావు మంత్రి అబద్దాలు చెబుతున్నారని, కావాలంటే తాను లెక్కలు చెబుతానన్నారు. దీనికి వివేక్ బదులిస్తూ పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించారా? అని లబ్ధిదారులను అడిగారు. పదేండ్లు రేషన్కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 16లక్షలకు పైగా రేషన్కార్డులు ఇచ్చామన్నారు. మధ్యలో హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షలపైగా రేషన్కార్డులు ఇచ్చామని , తప్పు అయితే ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు. ఇందుకు మంత్రి వివేక్ గత ప్రభుత్వం రేషన్కార్డులు ఇచ్చి ఉంటే జిల్లాలో 26వేల రేషన్కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఇస్తుందన్నారు. అనవసరంగా రూ. లక్ష కోట్లు కాళేశ్వరంపై ఖర్చు పెట్టి అసలైన పథకాలకు నిధులు లేకుండా ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు.
- 
      
                   
                                 పత్తి విచ్చిన అప్పుల కత్తి!సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : పత్తి పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పత్తి..కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన చేలల్లో దిగుబడి మరింత దారుణంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నామమాత్ర దిగుబడులతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం కష్టమని, తమ రెక్కల కష్టం వృథా అయిందని ఆందోళన చెందుతున్నారు. కాగా, వ్యవసాయశాఖ మాత్రం ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే వాస్తవంగా ఆరు క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తితీత పనులు ప్రారంభించారు. దీపావళి పండుగ నుంచి ఈ పత్తి ఏరడం వేగవంతమవుతోంది. 3.48 లక్షల ఎకరాల్లో సాగు.. పత్తి పంటల అత్యధికంగా సాగయ్యే జిల్లాల్లో సంగారెడ్డి ప్రధానమైనది. ఈ పంట అత్యధికంగా సాగవుతున్న జిల్లాలో సంగారెడ్డి మూడో స్థానంలో ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజనులో 3.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వ్యవ సాయశాఖ అంచనా వేసినట్లు ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున 3.48 లక్షల ఎకరాలకు సుమారు 2.79 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడులు వస్తాయని ఆశాఖ లెక్కలు వేసింది. ఈ సీజనులో ఈ మేరకు పత్తి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికార యంత్రాంగం భావిస్తోంది. అధిక వర్షాలే కారణం.. ఈసారి ఖరీఫ్ సీజనులో భారీ వర్షాలు కురిశాయి. ఒకే రోజు 25 సెం.మీలకు మించి వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పత్తి చేలల్లో రోజుల తరబడి వరద నిలిచిపోయింది. దీంతో మొక్కలు చాలావరకు మురిగిపోయాయి. పత్తి మొక్కకు కింద భాగంలో ఉన్న పత్తికాయలు నీటిలో నానిపోయాయి. దీనీ ప్రభావం పత్తి దిగుబడిపై పడిందని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి కాయదశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు కురిశాయి. దీంతో పత్తి దిగుబడి తగ్గుతుందని రైతులు అప్పట్లోనే ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు దిగుబడి పూర్తిగా పడిపోవడంతో రైతులు అనుకున్నదాని కంటే ఎక్కువ దిగుబడి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వలస కూలీలు రాలే ప్రతీ ఏటా వచ్చే వలస కూలీలు రామంటున్నారు. మీ దగ్గర దిగుబడి రావడం లేదు. మేము వచ్చి పత్తి తీసినా మాకు గిట్టుబాటు రాదంటున్నారు. ఇతర కూలీల కోసం ప్రయత్నం చేస్తున్నా. – బగిలి బక్కన్న, తాటిపల్లిపత్తితీతకు కూలీలేరి?మునిపల్లి(అందోల్): పత్తీతీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్న కూలీలు సకాలంలో దొరకపొవడంతో చేతికొచ్చిన పత్తి నేల రాలిపోతోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆటోల్లో ఉదయం వచ్చి సాయంత్రం 6 గంటలకే పత్తి తీసి వెళ్లే కూలీలు ఆటో కిరాయి రాను పోను ఇచ్చి కిలోకు రూ.13 చొప్పున ఇస్తామంటున్నా కూలీలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా వచ్చే వలస కూలీలు కొందరు ఈసారి కూడా వచ్చి ముందే పత్తితీత పనులు నిర్వహిస్తామని డబ్బులు తీసుకున్నారు. వారి సొంత గ్రామాలకు వెళ్లిన తర్వాత పత్తితీత పనులకు రావడం లేదని తీసుకున్న అడ్వాన్సు డబ్బులను సైతం తిరిగి పంపిస్తున్నారని కొందరు రైతులు చెబుతున్నారు. పత్తితీత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఏం చేయాలో తోచక రైతులు దిగాలు పడుతున్నారు.
- 
      
                   
                                 మంటగలుస్తున్న మానవత్వంవర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. పచ్చని సంసారం.. కకావికలం వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తున్కిబొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది. మృత్యురూపమెత్తిన చిన్న కూతురు అన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తున్కిబొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.పసిపిల్లలతో.. బాల్నర్సయ్య కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిల్చిందని బాల్నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు.ఆస్తి కోసం దారుణం తల్లిని చంపి.. కూతురు, అల్లుడు కటకటాల్లోకి మీనాజీపేటలో ఉదంతం.. దిక్కుతోచని స్థితిలో కుటుంబం
- 
      
                   
                                 గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025అంతర్రాష్ట్ర చెక్పోస్టు మూసివేతజహీరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టును అధికారికంగా మూసివేశారు. సంబంధిత శాఖ సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలంలోని మాడ్గి వద్ద ఈ చెక్పోస్టును నిర్వహిస్తూ వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్ల క్రితమే మూసివేసినా రాష్ట్రంలో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని మూసివేసేందుకు సానుకూలత వ్యక్తం చేయకపోవడం వల్లే కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెక్పోస్టుల మూసివేతకు సానుకూలంగా ఉండటంతో అందులోభాగంగా జహీరాబాద్ చెక్పోస్టును మూసివేశారు. సరిహద్దు చెక్పోస్టులను మూసివేస్తున్నట్లు, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రవాణ కమిషనర్ అధికారికంగా ప్రకటించడంతో రవాణశాఖ జిల్లా అధికారులు చెక్పోస్టును సందర్శించి మూసివేయించారు. జిల్లా రవాణశాఖ కమిషనర్ వెంకట రమణ సమక్షంలో అధికారులు చెక్పోస్టు బోర్డులను, బారికేడ్లను తొలగించారు. చెక్పోస్టులో ఉన్న కంప్యూటర్లు, రికార్డులు, ఇతర ఫర్నీచర్ను డీటీఓ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా చెక్పోస్టు మూసివేసినట్లు బ్యానర్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ వ్యవస్థ నడుస్తోందని, అందులో ఎలాంటి సర్వీసునైనా ఆన్లైన్ విధానం ద్వారా ప్రజలు, వాహనదారులు పొందవచ్చన్నారు.
- 
      
                   
                                 నాగపురిలో రాష్ట్ర కూటుల నాటి శాసనంచేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి గ్రామంలో రాష్ట్ర కూట కాలం నాటి శాసనం ఉందని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పరిశీలించిన సమయంలో పోచమ్మ దేవాలయం పక్కన వేపచెట్టు కింద చెట్ల మధ్యలో రాళ్లతో కట్టిన చిన్న దేవాలయం కనిపించిందన్నారు. దేవాలయ రాళ్లు పరిశీలించగా ఆలయానికి వాడిన ఒక పొడవాటి రాయిపై అక్షరాలు కనిపించాయని, రాయికి సున్నం వేసి ఉండటం వల్ల అక్షరాలు సరిగా కనిపించడం లేదన్నారు. కనిపించిన అక్షరాల లిపిని బట్టి ఇది 8 నుంచి 10వ శతాబ్దం నాటి లిపి అని, అనగా రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు సహకరిస్తే ఆ శాసనాన్ని శుభ్రపరిచి అక్షరాలను చదివితే చరిత్ర, శాసన కాలం అందులో పేర్కొన్న వివరాలు తెలుస్తాయన్నారు.చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్
- 
      
                   
                                 పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులుకలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.24 లక్షల సబ్సిడీకి డీపీసీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ వర్గాల యువత పరిశ్రమల స్థాపనలో ముందుకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రా మెటీరియల్స్ సరఫరా, భూకమతాల మంజూరు, విద్యుత్ కనెక్షన్లు, ఇతర అనుమతులపై వచ్చిన దరఖాస్తులను సమీక్షించి, ఫైళ్లను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, ఎకై ్సజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 మంత్రి వివేక్ సభలో నిలిచిన విద్యుత్ సరఫరా● సెల్ఫోన్ వెలుతురులో చెక్కుల పంపిణీ ● కొద్దిసేపు గందరగోళం గజ్వేల్: పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సెల్ఫోన్ లైట్ల వెలుతురులో సాగింది. రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మంత్రి వివేక్, మెదక్ కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి పట్టణంలోని ఐవోసీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ప్రసంగించారు. ఇంతలోనే కరెంటు పోయింది. దీంతో మంత్రితో పాటు వేదికపైన ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు వేచి ఉన్నా కరెంటు రాకపోవడంతో వివేక్ చివరకు సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 204 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, కొందరికే సెల్ఫోన్ లైట్ల వెలుతురులో మంత్రి అందించారు.
- 
      
                   
                                 శభాష్ పోలీస్..జహీరాబాద్ టౌన్: ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడారు. ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... మండలంలోని బుర్దిపాడ్కు చెందిన ఏ.సంతోష్రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా భార్య నాగరాణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లలు దీపక్రెడ్డి, అక్షయలతో కలిసి జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులో దూకేందుకు అక్కడికి వెళ్లింది. వారిని చూసిన స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎస్ఐ.కాశీనాథ్ వెంటనే కాస్టేబుళ్లు శివరాజ్, మోహన్రాజ్లను ప్రాజెక్టు వద్దకు పంపించారు. వారితో మాట్లాడి స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించిన మహిళ కాపాడిన పోలీసులు
- 
      
                   
                                 అంత్యక్రియలకు వెళ్లి స్నానం చేస్తుండగా..హవేళిఘణాపూర్(మెదక్): స్నానం చేసేందుకు వెళ్లిన బాలుడు మునిగిపోగా, అతడిని కాపాడే ప్రయత్నంలో మరొక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పేరూర్ గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ అంత్యక్రియలకు కృష్ణ(16), చింతకింది భీమయ్య(48) వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్నానం చేసేందుకు మంజీరా వాగు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో స్నానం చేస్తూ కృష్ణ నీటమునిగాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో భీమయ్య కూడా నీటమునిగి మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు పుష్కలంగా ఉండటంతోపాటు అక్కడ నది లోతుగా ఉందని పోలీసులు తెలిపారు. అస్థికలు కలుపడానికి వెళ్లి.. పుల్కల్(అందోల్): అస్థికలు కలుపడానికి వెళ్లిన వ్యక్తి కాలు జారి నదిలో పడిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మిర్జాగూడకు చెందిన దండారియ ధరంసింగ్, మదయ్య సూరజ్సింగ్ బంధువుల అస్థికలు కలుపడానికి సోమవారం సింగూరు ప్రాజెక్టుకు వెళ్లారు. అస్థికల క్రతువు పూర్తయిన తర్వాత మదయ్య సూరజ్ సింగ్(52) స్నానానికని ప్రాజెక్టు దిగువభాగంలో బండరాళ్లపై నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలి జారి నీటిలో పడిపోయాడు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నీరు రావడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో రెండు రోజుల నుంచి కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద గల్లంతైన సూరజ్సింగ్ కోసం మత్స్యకారుల సహాయంతో వెతుకుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ విశ్వజన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మంజీరా వాగులో పడి ఇద్దరు మృతి
- 
      
                   
                                 వైద్యంలో విప్లవాత్మక మార్పులుహుస్నాబాద్: నాలుగు జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న హుస్నాబాద్లో వైద్య పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలో రూ.82 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 250 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో ఎనిమిదిమంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని, నెల రోజుల్లో 38 మంది రానున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు వైద్యపరంగా ఎవరూ ఆందోళన చెందవద్దని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాదిరిగా అన్ని రకాల శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందుతాయన్నారు. జిల్లా కేంద్రాల్లో తప్ప 250 పడకల ఆస్పత్రి హుస్నాబాద్లోనే ఏర్పాటు కానుందని తెలిపారు. అందుకనుగుణంగా నర్సింగ్ కళాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మినీ స్టేడియంను విస్తరించి స్విమ్మింగ్పూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పట్టణంలో అర్బన్పార్క్తోపాటు మహాసముద్రం గండి సుందరీకరణ కోసం రూ.10 కోట్ల మంజూరుకు జీవో వస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుంచి హుస్నాబాద్కు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణ భూ సేకరణకు రైతులు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డి తదితరులున్నారు. నెలరోజుల్లో 38 మంది వైద్యులను నియమిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్
- 
      
                   
                                 జోరుగా జూదంవిచ్చలవిడిగా బొమ్మ బొరుసు జూదంపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అలవాటు పడ్డ వ్యక్తులు ఇప్పుడు కొత్తగా బొమ్మ, బొరుసు ఆటకు తెరలేపారు. ఐదు నుంచి పదిమంది గ్రూపులుగా ఏర్పడి రహస్య ప్రదేశాలు, రాత్రి పొద్దు పోయాక ఆటలో నిమగ్నమవుతున్నారు. చీకట్లో క్యాండిల్స్, ఫోన్ టార్చ్లైట్ మధ్య బొమ్మ బొరుసు ఆడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఒక్క ఎనగండ్లలోనే ప్రతిరోజు 10 గ్రూపులు ఈ ఆట ఆడుతున్నట్లు సాక్షి నిఘాలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది అయితే తెల్లవారితే గాని ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బొమ్మ బొరుసు ఆటలో డబ్బులు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని రాత్రి పెట్రోలింగ్తోపాటు ఆట ఆడే వారు, వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత మహిళలు డిమాండ్ చేస్తున్నారు.● బొమ్మ బొరుసుతో జేబులు ఖాళీ ● రాత్రి 10 దాటితే గుంపులుగా ఆట ● ఎనగండ్లలో వేలల్లో పందెం ● కానరాని పోలీసుల నిఘా!కొల్చారం(నర్సాపూర్): జూదంపై టాస్క్ఫోర్స్ పోలీసులు వరుస దాడులతో బెంబేలెత్తిన జూదరులు, ఇప్పుడు కొత్త ఆటకు తెర లేపారు. రాత్రి పది దాటితే గ్రూపులుగా ఎక్కడికక్కడ మొబైల్ లైట్ వెలుతురులో బొమ్మ, బొరుసు ఆడుతూ వేళల్లో పందెం కాస్తున్నారు. మండలంలోని ఎనగండ్ల గ్రామంలో ఆడుతున్నట్లు సాక్షి నిఘాలో వెల్లడైంది. మండలంలో ఇటీవల రంగంపేట, ఎనగండ్ల గ్రామాల శివారులో విచ్చలవిడిగా జూదం ఆడిన చాలా కుటుంబాలు వీధిన పడిన ఘటనలున్నాయి. దీంతో ఆ కుటుంబాల సభ్యులు జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో, ఎస్పీ ఆధ్వర్యంలో జూదం ఆట కట్టించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా సమాచారంతో జూదం ఆడుతున్న ప్రదేశాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సదరు జూదరులపై కేసులు సైతం నమోదు చేశారు. దీంతో గత నెల రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో జూదం తగ్గుముఖం పట్టింది.
- 
      
                   
                                 భార్య కాపురానికి రావడం లేదని..ఉమ్మడి జిల్లాలో ఐదుగురు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పార్థిగల్ల శివరాజ్(29) మూడేళ్ల క్రితం శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన అఖిలతో వివాహమైంది. కొంత కాలంగా సంసారం విషయంలో ఇంట్లో గొడవలు జరగగా భార్య అఖిల తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శివరాజ్ ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు తలుపులు పగులగొట్టి మెదక్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మద్యం మత్తులో.. మద్యం మత్తులో వ్యక్తి.. ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన కుమార్(34) రెండేళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం మెదక్ మండలం పాతూర్ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూలీ పనికి వెళ్లొస్తానని చెప్పిన కుమార్ మందు తాగా వచ్చి నిత్యంలాగే ఇంట్లో పడుకున్నాడు. ఉదయం చూసేసరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. గమనించిన భార్య నిర్మల కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇంట్లో గొడవపడిన మహిళ.. పాపన్నపేట(మెదక్): నదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏడుపాయల్లో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... రామాయంపేట మండలం కోమట్పల్లికి చెందిన రేణమ్మ (45) సోమవారం ఇంట్లో గొడవపడి ఏడుపాయలకు వచ్చింది. మొదటి బ్రిడ్జి దగ్గర మంజీరా నదిలో దూకింది. కాగా మంగళవారం సాయంత్రం నదిలో ఆమె శవం కనిపించడంతో పోలీసులు ఆమె భర్త మల్లేశ్కు సమాచారం అందించారు. పాలడుగులో పశువుల కాపరి...వట్పల్లి(అందోల్): పశువుల కాపరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని పాలడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీహరి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన హరిజ అశోక్(50)కు భార్య అపురూపతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం సంసార విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పిల్లలను తీసుకొని భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో అశోక్ గ్రామంలో పశువుల కాపరిగా పనిచేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. సోమవారం తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు బంధువులకు సమాచారం అందించారు. మృతుని అక్క శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి పురుషాంగం ప్రదేశంలో, కాళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
- 
      
                   
                                 సాగు.. బాగువాణిజ్య పంట అయిన ఆయిల్పామ్ సాగు వైపు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మార్కెట్లో వంటనూనెకు అధిక డిమాండ్ ఉండటంతో మన దేశంలో పండించేందుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.52 వేల సబ్సిడీతో ఒక్క రైతుకు 12 ఎకరాలకు వరకు ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్:మెదక్ జిల్లాలో 5 లక్షల పైచిలుకు భూములుండగా వాటిలో సుమారు 4 లక్షల వరకు వరి, మరో 40 వేల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కాగా మన దేశంలో వంటనూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ప్రతి ఏటా లక్ష కోట్లు వెచ్చించాల్సి వస్తోందని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పామ్ సాగుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించి ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నాయి. ఈ మేరకు ఎకరాకు రూ. 52 వేల సబ్సిడీ ఇస్తూ ఒక్కో జిల్లాకు టార్గెట్ పెట్టారు. దీంతో హార్టికల్చర్ అధికారులు రైతులను సాగుకు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీ ఇలా.. ఆయిల్ పామ్ పంట సాగు చేశాక 4 ఏళ్ల తరువాత పంట చేతికి వస్తుంది. అప్పటి వరకు ఒక్క ఎకరాకు నాలుగేళ్ల వరకు రూ. 52 వేల సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం సబ్సిడీని అందిస్తోంది. ఎకరంలో 57 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క ధర రూ. 213 కాగా రూ.12,141 అవుతుంది. ఇందులో రైతు వాటాగా ఒక్కో మొక్కకు రూ. 20 చొప్పున 1,140 మాత్రమే చెల్లించాలి. మిగతా రూ. 11,001 సబ్సిడీని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. డ్రిప్ కోసం ఎకరాకు రూ.20 వేల సబ్సిడీ, ఏడాదికి ఎకరాకు రూ. 4,200 చొప్పున నాలుగేళ్లకు మొక్కల సంరక్షణకు 16,800, ఎరువులకు కలిపి మొత్తం ఎకరాకు నాలుగేళ్లలో రూ. 52 వేల సబ్సిడీ వస్తుంది.2,500 ఎకరాలు టార్గెట్ ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1,300 ఎకరాల్లో సాగుకు రైతులు ఆన్న్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. 530 ఎకరాల్లో సాగు పూర్తికాగా, ఇంకొందరు పంట సాగులో నిమగ్నమయ్యారు. కాగా ఒక్క రైతు 12 ఎకరాలకు మాత్రమే డ్రిప్పై సబ్సిడీ ఉంటుంది. ఆయిల్పాం సాగుకు అధిక సబ్సిడీ ఎకరాకు రూ. 52 వేల ప్రోత్సాహం 40 ఏళ్లపాటు దిగుబడి జిల్లాలో 530 ఎకరాల్లో సాగులక్ష్యం పూర్తి చేస్తాం ఈ ఏడు జిల్లాకు 2,500 ఎకరాలు టార్గెట్ విధించారు. ఈ పంట సాగు చేసేందుకు రైతులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 530 ఎకరాలు పూర్తయింది. మార్చి వరకు లక్ష్యం పూర్తి చేస్తాం. – ప్రతాప్సింగ్, హార్టికల్చర్, జిల్లా అధికారి
- 
      
                   
                                 తల్లిదండ్రులు మందలిస్తారనే..శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కొంతన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బాడిగే మల్లేశ్కు ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రోజా(16) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. కొన్నాళ్ల నుంచి దొంతి గ్రామానికి చెందిన ప్రశాంత్తో ఫోన్లో మాట్లాడుతుండగా తండ్రికి తెలిసి మందలించాడు. ఈ నెల 19న తల్లిదండ్రులు ఊరికి వెళ్లడంతో రోజా ఇంటి వద్ద ఉండటంతో ప్రశాంత్ వచ్చి మాట్లాడగా కాలనీవాసులు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారనే భయంలో ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                 పేకాట స్థావరాలపై ఉక్కుపాదంఉమ్మడి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జూదం ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. చేగుంట(తూప్రాన్) /కల్హేర్(నారాయణఖేడ్)/న్యాల్కల్(జహీరాబాద్): పేకాట ఆడుతున్న పలువురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి చేగుటంలో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 8 మందిని అరెస్టు చేసి, ఏడు సెల్ఫోన్లు, రూ.58 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కల్హేర్ మండలంలోని మాసాన్పల్లిలో పేకాట ఆడుతున్న 8 మందిని, సిర్గాపూర్ మండలం కడ్పల్ తండా సమీపంలో 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యాల్కల్ మండలలోని ముర్తుజాపూర్ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5,770 నగదుతో పాటు పేకాట ముక్కలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్లో 55 మంది..కంగ్టి(నారాయణఖేడ్)/ రామచంద్రాపురం(పటాన్చెరు)/ జహీరాబాద్ టౌన్: కంగ్టి మండలంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని, తెల్లాపూర్లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రూ.3, 36,500, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 85,550 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వినయ్కుమార్ తెలిపారు.
- 
      
                   
                                 సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలుదుబ్బాకటౌన్: రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు జాతీయ నూనె గింజల పథకం కింద పొద్దు తిరుగుడు రకం తిల్హన్ టెక్ ఎస్యుఎన్హెచ్ – 1 విత్తనాల 2.50 కేజీలకు సబ్సిడీ పోను రూ. 85.20 కే ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్బీఈజీ–47 శనగ రకాలు, సీటీ – 4260 మొక్కజొన్న రకం విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. పాస్బుక్, ఆధార్ కార్డు జీరాక్స్తో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ నరేశ్, ఏఈవోలు ప్రవీణ్ ఉన్నారు.ఏడీఏ బాబు నాయక్
- 
      
                   
                                 వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలిమిరుదొడ్డి(దుబ్బాక): గుంతలమయమైన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అందె జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు డిమాండ్ చేశారు. మిరుదొడ్డి నుంచి అందె, ఇక్కడి నుంచి కొండాపూర్ మీదుగా దుబ్బాక మండలం తిమ్మాపూర్, అందె గ్రామం స్టేజీ వరకు ఉన్న రోడ్లకు మరమ్మతులు చేట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జేఏసీ సభ్యులు మిరుదొడ్డి తహశీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రానికి పలు పనుల నిమిత్తం ప్రయాణికులు, రైతులు, కళాశాలలు, పాఠశాలలకు విద్యార్థులు, తదితరులు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. అందె నుంచి మిరుదొడ్డి వరకు కంకర తేలి రోడ్డు గుంతలమయంగా మారిందని, దీంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల సమస్యకు పరిష్కారం చూపకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు లింగం, ప్రవీణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు సోమేశ్వర్రెడ్డి, భైరయ్య, సత్యం, రాజేందర్, యాదగిరి, కరుణాకర్, సాయికుమార్రెడ్డి, చందు, రాములు, నాగేశ్వర్రెడ్డి, రాజ్కుమార్, శ్రీనివాస్, నర్సింగరావు, కుమార్, కృష్ణ, బాలకనకయ్య తదితరులు పాల్గొన్నారు.లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
- 
      
                   
                                 భూ సేకరణ వేగవంతం చేయాలిసంగారెడ్డి జోన్: జిల్లాలో ఏర్పాటు కానున్న నిమ్జ్, టీజీఐఐసీ కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్లలో జరుగుతున్న టీజీఐఐసీ, నిమ్జ్ భూసేకరణ పనుల పురోగతిపై ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, టీజీఐఐసీ, నిమ్జ్ అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. నిమ్జ్ ప్రాజెక్టు మొదటి దశ ఏర్పాటుకు ఇప్పటివరకు 1,501 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్కు వివరించారు. మిగిలిన భూమిని సైతం త్వరలోనే సేకరించి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...భూసేకరణకు అవసరమైన నిధులు టీజీఐఐసీ తక్షణం చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భూసేకరణకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇప్పటివరకు టీజీఐఐసీ, నిమ్జ్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీల ప్రకారం పరిహారం అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓలు, టీజీఐఐసీ ప్రతినిధులు, నిమ్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య
- 
      
                   
                                 పోలీసు అమరుల త్యాగం మరువలేం● కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ ● అమరులకు నివాళులర్పించిన అధికారులు సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగం విస్మరించలేనిదని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ ఎస్పీతోపాటు అధికారులు హాజరై ఘనంగా నివాళులర్పించి అమరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పోలీస్ అంటేనే ధైర్యానికి చిరునామా అని, విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలు ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్య సాహసాలే కీలకమని చెప్పారు. అమరుల కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్రావు, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, సైదా నాయక్, ప్రభాకర్, వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండిఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పేద వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ఆస్పత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహ్మారెడ్డి నాయకులు అవుటి శంకర్ పాల్గొన్నారు. ఖేడ్ ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖేడ్ ప్రాంతంలో ఆయా రూట్లలో పలు బస్సులు నడపాల్సిన గ్రామాలను గురించి వారు చర్చించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో దీపావళిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు లక్ష్మిపూజ నిర్వహించారు. పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి శివాలి జోహ్రి శ్రీవాస్తవ ఆమె తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఒరిగామి ప్రదర్శన చేసి రెండు సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించారు. ఈ తాజా రికార్డుతో, శివాలి మొత్తం 21 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు చేరుకుని దేశంలోనే అత్యధిక సంఖ్యలో గిన్నిస్ రికార్డులు కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచింది. గతంలో శివాలి 19 గిన్నిస్ రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, పలువురు అధ్యాపకులు, వి ద్యార్థులు శివాలిని అభినందించారు. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి న్యాల్కల్(జహీరాబాద్): రైతులకు సకాలంలో విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండలానికి 350 బస్తాలు శనగ విత్తనాలు, 5 క్వింటాళ్ల కుసుమ విత్తనాలు వచ్చాయని వెల్లడించారు. విత్తనాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో రైతు వేదిక వద్దకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విత్తనాలను న్యాల్కల్లోని రైతు వేదికల్లో రైతులకు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ, ఏఈఓలు సాయిలు, హీనా, రైతులు పాల్గొన్నారు. నర్సాపూర్: విద్యుత్ సమస్యలను గుర్తించేందుకే తమ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టిందని మెదక్ డీఈ బాషా, ఏడీఈ రమణరెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలో ప్రజా బాట కార్యక్రమాన్ని డీఈ ప్రారంభించారు. ప్రజాబాటలో పలు సమస్యలను గుర్తించామని, వాటిని రెండు విభాగాలు విభజించామని చెప్పారు. బడ్జెట్తో కూడుకున్న సమస్యలకు నిధులు రాగానే పరిష్కరిస్తామన్నారు. బడ్జేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రమణరెడ్డి తెలిపారు. పలు వీధుల్లో కండక్టర్ వైరు పాతబడిందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పప్పు ధాన్యాల సాగు పెంచాలిజిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఝరాసంగం(జహీరాబాద్): నూనె గింజలతో పాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో అధిక దిగుబడులు ఇచ్చే పప్పు దిను సుల వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. మండలానికి మంజూరైన 10 క్వింటాళ్ల కుసుమ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విత్తనోత్పత్తి కార్యక్రమాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అధికారుల సూచనలు సలహాలు పాటించి పంటల్లో అధిక దిగుబడులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్, ఏఈఓలు, రైతులు, పాల్గొన్నారు.
- 
      
                   
                                 శనగ సాగు తరుణమిదే!● యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు ● 20 వేల ఎకరాల్లో సాగు అంచనా ● ఇప్పటికే ప్రారంభమైన విత్తన నాట్లు జహీరాబాద్ టౌన్: పప్పు దినుసులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కంది తర్వాత రబీలో రైతులు శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంట సాగుకు ఇదే సరైన తరుణం కావడంతో రైతులు అందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శనగ, జొన్న, వరి, కుసుమ, గోధుమ తదితర పంటలను రబీలో సాగు చేస్తుంటారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు ఈ పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు నాటడం ప్రారంభించారు. నల్ల రేగడి భూముల్లో పంట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయనిపుణులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో అధికంగా సాగు.. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు అనుకూల సమయం కావడంతో విత్తనాలు విత్తుకోవచ్చు. తర్వాత వేస్తే దిగుబడులు తగ్గుతాయి. విత్తనం విత్తుకోవడంలో ఆలస్యమైతే పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పూత రాలిపోతుంది. మంచు ఆధారంగా పండే పంట, నల్లరేగడి నేలల్లో తేమను ఉపయోగించుకుని మొక్కులు పెరుగుతాయి. చౌడు నేలలు పనికిరావు. పూత, కాత సమయల్లో సరిపడ నీరు అందించినా సరిపోతుంది. విత్తన రకాలివే.. కేఏకే 2, జేజీ 11,శ్వేత 2, జ్యోతి, కేఏకే –2, క్రాంతి, అన్నెగిరి, తదితర విత్తన రకాలు మేలైనవి. స్వల్పకాలిక పంట అయినందున విత్తన రకాలను బట్టి 85–100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 40 కిలోల విత్తనాలు సరిపోతుంది. ఎకరాకు 6 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. 30 నుంచి 35 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసి కలుపు నివారించుకోవచ్చు. విత్తే ముందు ఫ్లూకోరాలిన్ 45% మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. పంటకు పచ్చ, రబ్బరు పురుగు బెడద అధికంగా ఉంటుంది. ఎండు తెగుళ్లు, వేరు తెగుళ్లు సోకుతాయి. విత్తనాలు. తెగుళ్ల నివారణకు అందుబాటులో ఉన్న వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి.
- 
      
                   
                                 పంట ఆరబోసేదెలా?● టార్పాలిన్లు లేక ఇబ్బందులపాలవుతున్న రైతులు ● అద్దెకు తెచ్చుకుంటున్న రైతులపై అదనపు భారం గతంలో మాదిరిగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు ఇవ్వకపోడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సీజన్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.రెండు వేల నుంచి మూడున్నర వేలవరకు భారం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయంపేట(మెదక్): పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికిగాను ప్రస్తుత పరిస్థితుల్లో టార్పాలిన్లు అత్యవసరం. గతంలో ప్రభుత్వం 50% రాయితీపై వాటిని సరఫరా చేసింది. గత నాలుగైదేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం ఆరబోస్తున్న రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దైపె టార్పాలిన్లు అందించే వారిని ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయశాఖ ద్వారా టార్పాలిన్లు సరఫరా చేసింది. ఎనిమిది అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్ల అసలు ధర రూ.2,500 కాగా, రైతులకు రూ.1,250 కే అందజేసింది. రెండు, మూడేళ్లపాటు ఈ పథకం కొనసాగగా, పెద్ద సంఖ్యలో రైతులు వాటిని కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయగా, గత నాలుగేళ్ల క్రితం ఈ పథకం రద్దయింది. రైతన్నలకు అదనపు ఖర్చు ఆంధ్రప్రదేశ్నుంచి వచ్చిన వ్యాపారులు కొందరు జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో టార్పాలిన్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా పరిధిలో 80 వరకు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని అద్దెకు ఇస్తున్నారు. రైతుల ఆధార్ కార్డులు తనఖా పెట్టుకుని టార్పాలిన్లు ఇస్తూ ఒక్కోదానికి రోజూ రూ.25 నుంచి రూ.30 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికిగాను సాధారణంగా ప్రతీ రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతీ రోజు రూ.300 వరకు భారం పడుతోంది. పంట నూర్పిడి చేయడం, ఆరబెట్టడం, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడానికి రైతులకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన రైతులపై టార్పాలిన్ల అద్దె కోసం రూ.ఆరు వేల వరకు ఖర్చవుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
- 
      
                   
                                 రూ.వేలు ఖర్చవుతున్నాయిప్రతీ ఏటా పంటల సీజన్లో టార్పాలిన్ల అద్దెకోసం రూ.ఆరు వేల వరకు వేలు ఖర్చవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలి. ఇప్పటికే సమస్యల్లో కూరుకుపోయిన తమకు అదనపు భారంగా మారింది. –లాల్య నాయక్, చౌకత్పల్లి తండా ఉచితంగా సరఫరా చేయాలి ప్రతీ రైతుకు ప్రభుత్వమే ఉచితంగా టార్పాలిన్లు సరఫరా చేయాలి. ఇవి అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలనుంచి అద్దెకు తెచ్చుకుంటున్నాం. ఈ భారాన్ని తమపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కంలియా నాయక్, దంతేపల్లి తండా గతంలోనే రద్దయిందిరైతులకు సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీ పథకం నాలుగేళ్ల క్రితమే రద్దయింది. పథకాన్ని పునరుద్ధరించాలని చాలామంది రైతులు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి మంజూరైతే ఇస్తాం. –రాజ్నారాయణ, ఏడీఏ, రామాయంపేట
- 
      
                   
                                 నూనె గింజల ఉత్పత్తిని పెంచాలిమెదక్ కలెక్టర్ రాహుల్రాజ్రేగోడ్(మెదక్)/పాపన్నపేట(మెదక్): నూనె గింజల ఉత్పత్తులను పెంచాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లోని రైతువేదిక కార్యాలయంలో మంగళవారం నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ అధికారి, రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. పొద్దుతిరుగుడు 93%, శనగ విత్తనాలు 50% రాయితీతో ఎంపిక చేసిన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ప్రతీ రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నూనెగింజల ఉత్పత్తి ద్వారా స్థానిక సాధికారతను సాధించి దిగుమతులను తగ్గించుకోవచ్చని తెలిపారు.
- 
      
                   
                                 26 కిలోల గంజాయి పట్టివేతపటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయక్ రెడ్డి వివరాల ప్రకారం... ఆటోలో గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో కలిసి ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నిశాద్ వీరేంద్ర కుమార్గా గుర్తించారు. దర్యాప్తులో నిందితుడు ఒడిశాకు చెందిన ఘెను అనే వ్యక్తి గంజాయి ఇస్తాడని, అది తీసుకెళ్లి చెప్పిన ప్రదేశంలో ఇస్తే రూ. 50 వేలు ఇస్తానని చెప్పడంతో డబ్బుకు ఆశపడి చేసినట్లు తెలిపాడు. పట్టుబడిన 26.4 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఆటో, సెల్ఫోన్ను సీజ్ చేశారు. నిందితుడు వీరేంద్ర కుమార్ను రిమాండ్కు తరలించారు.
- 
      
                   
                                 ఫైనాన్స్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్యనంగునూరు(సిద్దిపేట): ఫైనాన్స్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బద్దిపడగలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు... గ్రామానికి చెందిన అవేటి వినోద్ కుమార్ (28) ఆరు నెలల కింద ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో రూ.50 వేలు చెల్లించి రూ .4.50 లక్షల లోన్తో డోజర్ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అది సరిగా నడవకపోవడంతో ఈఎంఐలు కట్టలేదు. దీంతో డబ్బులు కట్టాలని ఫెనాన్స్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. అతనికి భార్య రేఖ, కూతురు కీర్తన, కుమారుడు అక్షిత్ ఉన్నారు. కడుపునొప్పి భరించలేక.. మునిపల్లి(అందోల్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుదేరా ఏఎస్ఐ ఎం. రవి వివరాల ప్రకారం... మండలంలోని ఇబ్రాహీంపూర్ గ్రామానికి చెందిన ఎండీ దుదేకుల మదార్ పాషా (42)కు కొంత కాలంగా కడుపునొప్పి వస్తోంది. దీంతో ఆయన తరచు మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఆదివారం కడుపునొప్పి రావడంతో తాగిన మత్తులో వ్యవసాయ పొలం దగ్గర ఉన్న చింతచెట్టుకు తాడుతో చెట్టుకు ఉరివేసుకున్నాడు. అప్పులు తీర్చలేక... మెదక్ మున్సిపాలిటీ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకుల కథనం మేరకు... మెదక్ పట్టణంలోని పెద్ద బజార్ వీధికి చెందిన నరేశ్చారి(40) కులవృత్తిపై ఆధారపడి భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. నిత్యం బంగారం ధరలు పెరుగుతుండటంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీనికి తోడు కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నరేశ్ చారి తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో.. వెల్దుర్తి(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేడ్చల్మె నాగరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటో ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు.
- 
      
                   
                                 హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టుజహీరాబాద్ టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. తమిళనాడు మధురై జిల్లా పరిమల్పట్టికి చెందిన పుతురాజు పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్నాక్స్, కారబుంది తయారు చేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మణికంఠ పట్టణంలోని హమాలీ కాలనీలో నివాసం ఉంటూ ఆయన కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. తాను వ్యాపారం చేస్తున్న ప్రాంతాల్లో పుతురాజ్ బిజినెస్ చేస్తున్నాడని కక్షపెంచుకున్న మణికంఠ శనివారం కత్తితో దాడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
- 
      
                   
                                 అరచేతిలో సమగ్ర సమాచారంవ్యవసాయంలో రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు నేరుగా అందించేందుకు ప్రభుత్వం సాంకేతికతను తీసుకొస్తుంది. పంటల సాగు, చీడ, పీడల గురించి పూర్తి సమాచారం రైతులు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్ ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు అందించే లింక్ ద్వారా చేరవచ్చు. గ్రామాల్లో ఇప్పటికే రైతులకు ఈ చానల్పై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ నిపుణులు ఆన్లైన్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు. – మెదక్ కలెక్టరేట్ రైతులు వారికి కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే పొందవచ్చు. పంటలకు తెగుళ్లు, క్రిమికీటకాలు సోకినప్పుడు రైతులు ఈ ఛానల్ ద్వారా కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రస్తుతం రైతులు ఆశించిన స్థాయిలో వ్యవసాయ సమాచారం లేకపోవడంతో పంటల్లో దిగుబడులు కోల్పోతున్నారు. చీడ,పీడలతో పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రైతులకు ఒకేసారి సమాచారం పొందడానికి ఈ డిజిటల్ వ్యవసాయ పరిజ్ఞానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పంటల పూర్తి సమాచారం రైతులు తెలుసుకోవచ్చు. ఏఈఓల ద్వారా చేరవచ్చు మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు రైతులను ఈ ఛానల్లో లింక్ ద్వారా చేర్చుతున్నారు. పంటలకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు. అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. సమయం, ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ఏ పంటకు ఎంత సబ్సిడీ ఇస్తుంది. ఏ సీజన్లో ఏ పంట సాగుచేస్తే ప్రయోజనం ఉంటుంది. వాతావరణ సమాచారం, విత్తనం నాటు వేయడం, కోత తీయడం పద్ధతులతోపాటు సస్యరక్షణలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తల గురించి సమాచారం పొందవచ్చు. సీజన్ల వారీగా పంటలు సాగు చేసి, చీడ, పీడలను ఽఅధిగమించి రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు. అందుకోసం వాట్సాప్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయశాఖలో సాంకేతిక విప్లవం
- 
      
                   
                                 పనులు త్వరగా పూర్తి చేయాలిఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణా లు పాటించాలని సదరు కాంట్రాక్టర్కు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఆదివారం అక్బర్పేట – భూంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులు, పీహెచ్సీ ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూబీహెచ్కే దాసరి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. తదుపరి పనులను త్వరలోనే ప్రారంభించాలన్నారు. ఆయన వెంట నాయకులు జన్నారెడ్డి, శ్రీనివాస్, జనార్దన్, రమేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. హెల్ప్..హెల్ప్ పొదల్లో హైవే హెల్ప్లైన్ బోర్డు కౌడిపల్లి(నర్సాపూర్): హెల్ప్లైన్ బోర్డుకు సహాయం కావాల్సి వచ్చింది. జాతీయ రహదారులపై అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1033 నంబర్బోర్డు ముళ్ల పొదల్లో చిక్కుకుంది. దీంతో వాహనదారులకు నంబర్ కనిపించడం లేదు. మండల కేంద్రమైన కౌడిపల్లి సమీపంలో బ్రిడ్జి వద్ద 765డి జాతీయ రహదారి సైడ్రేలింగ్ పక్కన హెల్ప్లైన్ నంబర్ బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు పెరిగిపోవడంతో నంబర్ కనిపించడం లేదు. ఈ ఉచిత టోల్ఫ్రీ నంబర్తో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాలు, ఇంథనం అవసరం, అంబులెన్స్ ఇతర అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు ఫోన్ చేసినట్లయితే ప్రభుత్వం వారికి సేవలు కల్పింస్తుంది. బోర్డు చుట్టూ ముళ్లపొదలను తొలగించి నంబర్ కనిపించేలా చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం ములుగు(గజ్వేల్): అక్రమంగా తరలిస్తున్న గోవులను వంటిమామిడి వద్ద రాజీవ్రహదారిపై ఆదివారం బీజేపీ, గోరక్షక్, బజరంగ్దళ్ నాయకులు అడ్డుకున్నారు. ఒడిశా నుంచి కొందరు వ్యక్తులు ఓ కంటైనర్ వాహనంలో 150 గోవులను హైదరాబాద్కు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ ఆధ్వర్యంలో వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ములుగు ఎస్ఐ విజయ్కుమార్ గోవులతో ఉన్న వాహనాన్ని స్వాధీన చేసుకున్నారు. గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్ఐ గోవులను అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గోశాలకు తరలించారు. విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధం హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని స్కూల్ తండా పంచాయతీ పరిధి లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాలో నివాసముంటున్న పూల్య నిత్యంలాగే వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి పూరిగుడిసెలో ఉన్న నిత్యావసర వస్తువులు, నగదు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితుడు పూల్య తెలిపాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నరేశ్ సందర్శించి వివరాలు సేకరించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను కోరారు. దొంగ అరెస్ట్మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని హనీ బేకరీ తాళం పగులగొట్టి సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ మహేశ్ వివరాల ప్రకారం... దర్యాప్తులో భాగంగా పోలీసులు కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన శరత్గా గుర్తించారు. నిందితుడు గతంలో కూడా ఓ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు.
- 
      
                   
                                 ప్రాణం తీసిన సెల్ఫీ సరదామంజీరాలో పడి యువకుడు మృతికొల్చారం(నర్సాపూర్): ప్రమాదవశాత్తు యువకు డు మంజీరా నదిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ కాకినా డకు చెందిన నీల సత్తిబాబు కుమారుడు నాని బాబు (21) స్నేహితులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం ఏడుపాయలకు కారులో వచ్చారు. దర్శనం చేసుకున్న అనంతరం సాయంత్రం స్నానాల కుంటలోకి దిగారు. అతను సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. లోతుగా ఉండటంతో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో బయటకి తీయగా అప్పటికే మృతి చెందాడు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం జిన్నారం (పటాన్చెరు): గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సై హనుమంతు వివరాల ప్రకారం... గడ్డపోతారం పట్టణ పరిధిలోని చౌదరిగూడెం గ్రామానికి చెందిన పాండురంగ చారి (45) శనివారం గ్రామంలోని లింగం చెరువులోకి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించగా ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి.. వట్పల్లి(అందోల్): మంజీరా నదిలో దూకి అత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ మండలం రోళ్లపాడ్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాములు కుటుంబంతో ఇస్నాపూర్లో ఉంటున్నాడు. పెద్ద కుమారుడు జగన్(17) శంకర్పల్లిలోని ప్రభుత్వ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 16న ఉదయం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి చింతకుంట మంజీరా బ్రిడ్జి వద్ద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నదిలో వరద ప్రవాహం ఉండటంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ఆదివారం కొల్చారం మండలం పైతర గ్రామ శివారులోని మంజీరా చెక్డ్యాం వద్ద నదిలో మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహా న్ని బయటకు తీసి పెద్దగొల్ల జగన్గా గుర్తించారు. చెరువులో పడి వ్యక్తి... మెదక్ మున్సిపాలిటీ: చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని దాయర వీధికి చెందిన అదరాసి మహేశ్(28) గోసముద్రం చెరువులో స్నానం చేసేందుకు ఈనెల 18న వెళ్లాడు. తిరిగి రాక పోగా ఆదివారం చెరువులో శవమై కనిపించాడు. మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- 
      
                   
                                 బాణాసంచా ధరలు.. పేలుతున్నాయ్సంగారెడ్డి క్రైమ్: దీపావళి అంటేనే సిరుల పండుగ. దీప కాంతులు, బాణాసంచా వెలుగుల మధ్య పండుగను జరుపుకుంటారు. పట్టణంలో దీపావళి సందడి మొదలైంది. వేడుకలకు బాణాసంచా వేదిక అవుతుండగా వాటి కొనుగోళ్లు మార్కెట్లో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మండే మార్కెట్, మహిళా ప్రాంగణం ఎదురుగా, పీఎస్ఆర్ గార్డెన్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. పట్టణంలో చిన్నారులకు ఎంతో ఇష్టమైన చిచ్చుబుడ్లకు, తారాజువ్వలకు భారీ డిమాండ్ పెరిగింది. అలాగే కాకరవొత్తులు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కోసం అటు పిల్లలు ఇటు పెద్దలు ఆనందం కోసం వెచ్చించక తప్పడం లేదు. ఆ కారణంగానే దుకాణాలకు వెళ్లే వినియోగదారులపై ధరల మోత మోగుతోంది. టపాకాయల అమ్మకాలు లేక సతమతమవుతున్న వ్యాపారులు ఇదే అదునుగా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 20% ధరలు పెరుగుదల గత సంవత్సరంతో పోలిస్తే టపాకాయలకు ఈసారి ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో ఏకంగా 20 నుంచి 30% మేర ధరలు పెంచారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు టపాసులు కొనుగోలు తగ్గించారు. పట్టణంలో టపాకాయల ధరలు చిచ్చుబుడ్ల బాక్సు ధర రూ.200 నుంచి 600, తౌజెండ్ వాలా రూ. 600 నుంచి 1500, 5 తౌజెండ్ వాలా రూ. 3వేల నుంచి 3500 వరకు, భూచ్రకాలు బాక్స్ సైజును బట్టి రూ.50 నుంచి 300, 30 షార్ట్స్ రూ. వెయ్యి నుంచి 2 వేలు, రాకెట్లు బాక్సు ధర రూ.150 నుంచి 1500, మిర్చి ప్యాకెట్ ధర రూ.50 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే వీటి ధరలో 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే గతంతో పోలిస్తే విక్రయాలు కూడా భారీగా పడిపోయాయని పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే పెరిగిన ధరలు విక్రయాలు భారీగా తగ్గాయి మార్కెట్లో చిన్న పిల్లలకు అటు యువతకు నచ్చేలా అన్ని రకాల టపాకాయలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది దుకాణాల సంఖ్య పెరగడంతో విక్రయాలు భారీగా తగ్గాయి. దీంతో ఆశించిన మేర లాభాలు రావడం లేదు. – ఆకాశ్, దుకాణదారుడు, సంగారెడ్డి
- 
      
                   
                                 యువతి అదృశ్యంనర్సాపూర్ రూరల్: యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నర్సాపూర్ మండలం తిరుమలాపూర్లో శనివారం జరిగింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొమ్మల లక్ష్మి కూతురు తులసి (19) రోజులాగే తాను పనిచేస్తున్న మార్ట్కు వెళ్తున్నానని శనివారం ఉదయం ఇంట్లో చెప్పి బయలుదేరింది. రాత్రి 10 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తల్లి బొమ్మల లక్ష్మి తన కూతురు నారాయణపూర్కు చెందిన బలిజ రాజు అపహరించుకుపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటో డ్రైవర్కు గాయాలు చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన మాసాయిపేట మండల శివారులోని 44వ జాతీయ రహదారి బంగారమ్మ దేవాలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... చేగుంట నుంచి హైదరాబాద్ వైపునకు వెళుతున్న ట్రాలీ ఆటోను వెనకాల వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రహ మాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అత డ్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                 మంచి అవకాశంరాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన వాట్సాప్ ఛానల్ చాలా బాగుంది. రైతులకు కావాల్సిన పూర్తి సమాచారం ఇందులో దొరుకుతుంది. ఏ సీజన్లో ఎలాంటి పంటలు వేయాలి. ఎలాంటి మందులు ఎంత మోతాదులో వాడాలి. పంటల సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు వంటి అంశాలపై సూచనలు పొందవచ్చు. – శ్యామ్, రైతు,తొగిట, హవేళిఘనాపూర్ అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో 76 క్లస్టర్లు ఉన్నాయి. ఆయా క్లస్టర్ల పరిధిలోని ఏఈఓల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులంతా ఛానల్లో చేరేలా కృషి చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 30శాతం రైతులు ఈ ఛానల్లో చేరారు. రైతులంతా ఛానల్లో చేరి అవసరమైన వ్యవసాయ సమాచారం పొందాలి. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, మెదక్
- 
      
                   
                                 వృద్ధురాలిపై పైసాచిక దాడివట్పల్లి(అందోల్): డబ్బుల కోసం కన్న తల్లిని కర్రలతో కొట్టగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో ఇద్దరు కొడుకులు, నలుగురు మనవళ్లను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు పంపించారు. ఆదివారం సీఐ అనిల్కుమార్, ఎస్ఐ లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని మర్వెళ్లి గ్రామానికి చెందిన చాకలి బసమ్మ(80) ఈనెల 1వ తేదీన అరుగుపై పడుకొని కిందపడి అనారోగ్యానికి గురైదని 3వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 4న ఆమె మృతి చెందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. కాగా వృద్ధురాలికి ఛాతి, ఇతర భాగాల్లో రక్తపు గాయాలై మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. దీంతో జోగిపేట సీఐ అనిల్కుమార్ గ్రామానికి వెళ్లి కుమారులను విచారించగా తమ తల్లి పోషణ విషయంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతోపాటు రైతుబంధు, పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డామని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు చాకలి బసయ్య, చాకలి వెంకయ్యతో పాటు మనువళ్లు అంబయ్య, నర్సింహులు, మోహన్, రాజు మద్యం మత్తులో వృద్ధురాలిని కర్రలతో కొట్టి చంపినట్లు నేరం అంగీకరించారు. పథకం ప్రకారం అరుగు పైనుంచి పడి అనారోగ్యానికి గురైందని అందరిని నమ్మించామని తెలిపారు. డబ్బుల కోసం..
- 
      
                   
                                 ట్రాక్టర్ ఢీకొని.. మహిళ మృతిచిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కామారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన ఇందూర్ సాలవ్వ(50) శనివారం ధాన్యం ఆరబెట్టేందుకు కూలిపనులకు వెళ్లింది. అదే గ్రామానికి చెంది న రైతు భాగయ్య బంధువు ఆవుసులపల్లి గ్రామాని కి చెందిన కుంట స్వామి ట్రాక్టర్లో ధాన్యం తీసుకువస్తూ రివర్స్ చేస్తున్న క్రమంలో మహిళను గమనించకుండా ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే గాంఽధీ ఆస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాహనం ఢీకొని కూలీ.. మనోహరాబాద్(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... పటాన్చెరు మండలం పెద్దకంజర్లకు చెందిన మన్నె దశరథ (38) కూలీ పని కోసం శనివారం మండలంలోని కాళ్లకల్కు వచ్చాడు. రాత్రి శివారులో దీపక్ దాబా వద్ద జాతీయ రహదారి –44పై రోడ్డు దాటుతున్న క్రమంలో కంటైనర్ ఢీకొట్టడంతో లారి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చికిత్స పొందుతూ వ్యక్తి.. చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన బెన్ని కుమార్ (58) మెదక్ ఇరిగేషన్ కార్యాయలంలో విధులు ముగించుకుని అదే గ్రామానికి చెందిన నిఖిల్ స్కూటీపై వస్తున్నారు. గవ్వలపల్లి చౌరస్తా వద్ద టీవీఎస్ ఎక్స్ఎల్ అడ్డుగా రావడంతో అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో బెన్నికుమార్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడ్ని మేడ్చల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
- 
      
                   
                                 జాడలేని కొనుగోలు కేంద్రాలుకొనుగోలు కేంద్రాలను ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారని సోయా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో దళారులు సోయా పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – జహీరాబాద్ టౌన్: జిల్లాలో వరి,పత్తి, కంది,మొక్కజొన్న తర్వాత వేలాదిమంది రైతులు సోయాబీన్ పంటను సాగు చేశారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 80 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. జిల్లాలోనే జహీరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో పంటను వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. కాత పూత దశలో కూడా భారీ వర్షాలు కురవడంతో పంటల దిగుబడిపై ప్రభావం చూపింది. ఏర్పడిన నష్టాన్ని ధర రూపంలో అయినా తీరనుందని రైతులు ఆశతో ఉన్నారు. అయితే పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు.కనీస మద్దతు ధర రూ.5,328కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో క్వింటాల్కు రూ 4.892 ఉండగా 2025–26 ఏడాదికి రూ.5.328గా నిర్ణయించింది. కోతలు ప్రారంభంకావడంతో మార్కెట్కు పెద్ద మొత్తంలో ధాన్యం వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు బదులు వ్యాపారులు రూ.4 వేలకు లోపే పంటను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల కొంతమంది రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. గతేడాది జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఝరాసంగంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఉత్పత్తిలో నాలుగవంతే కొనుగోలు చేయడం వల్ల మిగిలిన పంటను మార్కెట్లో వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. జహీరాబాద్ డివిజన్లోని గంగ్వార్, కోహీర్, మొగుడంపల్లి వద్ద ప్రైవేట్ వ్యక్తులు నారింజ రైతు మిత్ర సంఘం పేరుతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సోయాబీన్ పంటను కొంటున్నారు. వీరు కూడా క్వింటాల్కు రూ.4 వేల లోపే ధాన్యం తీసుకుంటున్నారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగాయని, వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి పడిపోయిందని. తీవ్రంగా నష్టపోతున్నందున అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అన్నదాతల ఎదురుచూపులు మద్దతు ధర క్వింటాల్కు రూ.5.328 రూ.4 వేల లోపే కొంటున్న వ్యాపారులు నష్టపోతున్న సోయా రైతులు
- 
      
                   
                                 అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఉద్యోగంజహీరాబాద్: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్ఫూర్తితోనే తాను గ్రూప్ –1లో విజయం సాధించగలిగానని జహీరాబాద్ పట్టణానికి చెందిన సాహితి పేర్కొన్నారు. గ్రూప్–1లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా నియమితులైన సందర్భంగా మాల సంఘాల ఆధ్వర్యంలో ఆమెను ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితి మాట్లాడుతూ...తాను చిన్ననాటి నుంచి ఉపాధ్యాయుడైన తన తండ్రి శ్రీనివాస్ ద్వారా అంబేడ్కర్ గురించి తెలుసుకుని ఆయన పట్టుదల, స్ఫూర్తితోనే కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించగలిగానన్నారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. సామాజిక బాధ్యతగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పాఠశాలలకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఉచితంగా అందించి తనవంతు తోడ్పడతానని హామీనిచ్చారు. గ్రూప్–1 విజేత సాహితి
- 
      
                   
                                 వేధిస్తోన్న బాండ్ పేపర్ల కొరతసంగారెడ్డి జోన్: జిల్లాలో స్టాంప్ బాండ్ పేపర్ల కొరత ఏర్పడింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి అవసరాల మేరకు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ల వద్ద లభించే బాండ్ పేపర్లు గత కొన్ని రోజుల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అటు సాధారణ ప్రజలతోపాటు దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా బాండ్ పేపర్లు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటుండటంతో తమ పనుల్లో ఆలస్యం అవుతుందని పలువురు చెబుతున్నారు. వివిధ రకాల పనులకు ఇబ్బందులు బాండ్ పేపర్ల కొరత ఏర్పడటంతో వివిధ రకాల పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూములు, ఇండ్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, కుల ధ్రువీకరణ, వివిధ రకాల పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు, లీగల్, నోటరీ, అమ్మకాలతోపాటు ఇతర పనులకు పేపర్లను వినియోగిస్తుంటారు. రూ.20, రూ.50, రూ100ల బాండ్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. అయితే వారి వారి అవసరాలను బట్టి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా రూ.20, రూ.100 ల పేపర్లు వినియోగిస్తుంటారు. ప్రతీరోజు జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణతోపాటు ఇతర ప్రాంతాల్లోని స్టాంప్ వెండర్ల దుకాణాలకు వస్తుంటారు. పేపర్ల కొరత ఉండి లభ్యం కాకపోవడంతో తమ పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. రెండు నెలలుగా వేధిస్తున్న కొరత రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి ప్రజల అవసరం మేరకు బాండ్ పేపర్లను సరఫరా చేస్తారు. కానీ గత రెండు నెలలుగా అవసరం మేరకు సరఫరా లేదు. దీంతో తమ పనులను వాయిదాలు వేసు కుంటున్నారు. ఇక స్టాంప్ బాండ్ పేపర్లు కొరతతో పేపర్లను నోటరీ చేసి సాధారణ ధర కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు.ఆన్లైన్లో నమోదు చేసి అమ్మకాలు గతంలో బాండ్ పేపర్లను ఆఫ్ లైన్లో ఇష్టారీతిగా అమ్మకాలు చేసేవారు. అయితే గత రెండున్నరేళ్ల నుంచి బాండ్ పేపర్ల అమ్మకాలను ఆన్ లైన్లో నమోదు చేసుకుకుని అమ్ముతున్నారు. బాండ్ పేపర్ అమ్మాలంటే కొనుగోలు దారుల పేరుతోపాటు బాండ్ పేపర్ ఎందుకు అవసరమైందో పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే అమ్ముతున్నారు. బాండ్ పేపర్లను పారదర్శకంగా అమ్మేందుకు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. భూ క్రయవిక్రయాలతో పాటు ఇతర పనులకు వినియోగం దొరకని రూ.20,రూ.100ల పేపర్లు పెండింగ్ లో వివిధ రకాల పనులు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- 
      
                   
                                 సమస్యల పరిష్కారానికి కృషిజిన్నారం(పటాన్చెరు): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. ఆదివారం గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారం ప్రకృతి నివాస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మేరకు కాలనీని సందర్శించానన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరించారు. వెంటనే సమస్యల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి, సొసైటీ సభ్యులు వీణాచిన్న, తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు
- 
      
                   
                                 చేపపిల్లల పంపిణీకి సర్వం సిద్ధంనారాయణఖేడ్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువుల నీటితో పూర్తిగా నిండి కళకళలాడుతున్నాయి. కాగా ప్రభుత్వం మత్స్యకారుల లబ్ధికోసం ‘మత్య్స భరోసా’పథకం కింద చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు సిద్ధమైంది. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రంలో మత్య్స భరోసా పథకాన్ని ఇటీవల ప్రారంభించి చేపపిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో వారంలోపు చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత నెలలోనే చేపపిల్లలను వదలాలని భావించినా భారీ వర్షాలు కురవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం అమలు మరింత ఆలస్యం అయ్యింది. జిల్లాలో 234 మత్స్యకార సంఘాలు జిల్లాలో 1,135 నీటి వనరులు ఉండగా రిజర్వాయర్లు 3, శాశ్వత నీటి వనరులు 79, సీజనల్ నీరు నిల్వ ఉండే చెరువులు 1,025 ఉన్నాయి. 12,889 మంది సభ్యులతో 234 మత్స్య సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. 8,200 మిల్లిమీటర్ల సైజు వరకు గల చేపపిల్లలను వదలనున్నారు. కట్లరోహు, పెద్దపిల్ల, బంగారు తీగ, మృగాల, కొర్రమీను తదితర రకాల చొప్పున సుమారు 3.50కోట్ల చేపపిల్లలను వదలనున్నారు. మత్స్య భరోసా కింద లబ్ధి ప్రభుత్వం మత్య్సకారులను సంక్షేమం కోసం మత్య్స భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టింది. మత్స్యశాఖ పరిధిలో జరిగే అభివృద్ధి, సంక్షేమం, రాయితీ ప్రోత్సాహకాలు అన్నీ మత్య్సభరోసా కింద అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాథమిక మత్స్య సహకార సొసైటీల్లో ఉన్న బేస్త, గంగపుత్రులు, ముదిరాజ్, మత్స్యకార్మికుల కుటుంబాలకు ఈ పథకం కిందనే లబ్ధి చేకూర్చనున్నారు.చెరువు వద్ద సైన్బోర్డు భారీ ఎత్తున మత్స్య భరోసా కార్యక్రమం కింద చేపపిల్లలు వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని యోచించింది. భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసింది. దసరా పండగలోగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినా స్థానిక ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చింది. పథకం కింద ప్రతీ చెరువు వద్ద ప్రత్యేకంగా రూపొందించిన సైన్ బోర్డును ఏర్పాటు చేస్తారు. సైన్ బోర్డుపై రెవెన్యూ గ్రామం, చెరువుపేరు, చెరువులో వదిలే చేపపిల్లల సంఖ్య, చెరువు ఏ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నదనే వివరాలను పొందుపరుస్తారు. మత్స్య భరోసా కింద అమలు ఈసారి 3.50 కోట్ల చేప పిల్లల పంపిణీ ప్రతీ చెరువు వద్ద పూర్తి వివరాలతో బోర్డులు3.50కోట్ల చేపపిల్లల పంపిణీ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు సంసిద్ధంగా ఉన్నాం. మత్స్యశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేపట్టాం. వారంలోపు మంత్రి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మత్స్యకారుల సంక్షేమం కోసం సుమారు మూడున్నర కోట్ల వరకు చేప పిల్లలను వదలనున్నాం. – మధుసూదన్, జిల్లా మత్స్యశాఖ అధికారి, సంగారెడ్డి
- 
      
                   
                                 రవాణశాఖ చెక్పోస్టులో ఏసీబీ సోదాలుజహీరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని రవాణశాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరిహద్దు రవాణ శాఖ చెక్పోస్టుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. అందులోభాగంగా జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై గల చెక్పోస్టులో ఆదివారం ఉదయం వరకు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ విలేకరులతో మాట్లాడుతూ...చెక్పోస్టులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో రూ.42,300 నగదు దొరికిందని వివరించారు. ఇందుకు సంబంధించి ఏఎంవీఐ కిరణ్కుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈ నగదును రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏఎంవీఐ ప్రైవేటు వ్యక్తిని డ్రైవర్గా పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.రూ.42,300 నగదు స్వాధీనం


