breaking news
Sangareddy District News
-
సీఎం సభ సైడ్లైట్స్
సంగారెడ్డి : లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంగారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో వచ్చి కంది ఐఐటీలో దిగారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా 3:20 నిమిషాలకు ఐబీ వద్దకు చేరుకుని నెహ్రూ, రాజీవ్గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రచార రథంలో సభాస్థలికి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి వెళ్లేందుకు జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ప్రచార రథం ఐబీలో నుంచి సీఎం వద్దకు తేవాలని తన అనుచరులకు చెప్తున్న క్రమంలోని రోడ్డు మొత్తం సీఎం కాన్వాయ్, పైలెట్ల వాహనాలతో జామ్ అయిపోయింది. ఈ క్రమంలో ప్రచార రథంలో సీఎం వెళ్లడం వద్దని పైలెట్లు కోరగా జగ్గారెడ్డి రథం వద్దని చెప్పారు. కాన్వాయ్లో వెళ్లాలా? ప్రచార రథంలో వెళ్ళాలా అని కొద్దిసేపు తటపటాయించిన సీఎం చివరికి ప్రచారరథంలోనే సభాస్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి వెంబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ 3:25 నిమిషాలకు అంబేడ్కర్ స్టేడియంకు చేరుకున్నారు. దాదాపు గంటసేపు మంత్రులు ప్రసంగించిన అనంతరం సరిగా 4:21 నిమిషాలకు సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగం ప్రారంభించి 40 నిమిషాలు మాట్లాడారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సీఎం రేవంత్ను శాలువాతో సత్కరించారు. సభావేదికపై నుంచి కిందికి వచ్చే క్రమంలో నాయకులు, ఉద్యోగ సంఘాలు, లబ్ధిదారులు వినతిపత్రాలు సీఎంకు సమర్పించారు. 5:30 తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. రోజంతా కండువాలతో సంగారెడ్డి జనసంద్రం సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా సంగారెడ్డిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, ప్రజలతో కిక్కిరిసింది. పంద్రాగస్టు వేడుకలు ముగిశాక 10 గంటలకు నుంచి గంటల 7 గంటల వరకు ఎటుచూసినా కాంగ్రెస్ శ్రేణులే కన్పించాయి. -
జీఓ 97 రద్దుకు ఒత్తిడి తేవాలి
సిద్దిపేటజోన్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓ97ను ప్రభుత్వం రద్దు చేసేలా అసెంబ్లీలో ఒత్తిడి చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మేకల అక్షయ్కుమార్ శనివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి సమస్య వివరించారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ వ్యవస్థ ఏడు దశాబ్దాలుగా ఉందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాచట్టం నుంచి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చట్టం పరిధిలోకి చేర్చడం వల్ల నిరుపేద విద్యార్థులకు పాలిటెక్నిక్ చదువు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి అభిప్రాయాలను సేకరించకుండా ప్రభుత్వం జీఓ 97 తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన హరీశ్రావు అసెంబ్లీలో ఇదే అంశంపై మాట్లాడుతానని, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జేఏసీ ప్రతినిధులు సాయి, మంజునాథ్, సాయి గణేశ్, మహేశ్, ఆర్షద్, మనిదీప్, అశ్విత్ ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేత -
చదువు, క్రీడలకూ ప్రోత్సాహం
నారాయణఖేడ్: విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ తహసీల్ గ్రౌండ్లో పట్టణంలోని గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఫ్లాగ్మార్చ్, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర అంశాలపై శనివారం పోటీలను నిర్వహించారు. ఒక్కో అంశానికి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు అవార్డులతోపాటు పాల్గొన్న పాఠశాలలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఖేడ్లో ఇండోర్, ఔట్డోర్ స్టేడియంల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ నగేశ్షెట్కార్, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, దారం శంకర్, డీఎస్పీ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, సీఐలు, ఎస్ఐలు, అధికారులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు శ్రీకాంతచారి జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీకాంతచారి చౌక్లోని ఆయన విగ్రహానికి ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని రేజింతల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద శనివారం జాతీయ పతాకావిష్కరణ జరగలేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను తప్పకుండా ఎగురవేయాలని నిబంధనలున్నా అధికారులు వాటిని పట్టించుకోలేదని పలువురు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఆవిష్కరించే వారని ఈసారి విస్మరించారని తెలిపారు. ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మను వివరణ కోరగా అక్కడ పని చేసే ఏఈఓ సెలవుల్లో ఉండటం వల్ల జెండాను ఎగుర వేయలేదని సమాధానమిచ్చారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చేగుంట(తూప్రాన్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం పులిగుట్ట తండాకు చెందిన మలోతు మున్నీ(40) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కూరగాయలు అమ్మడానికి తండా నుంచి వెళ్లింది. శనివారం మాసాయిపేట శివారులోని బంగారమ్మ అలయ సమీపంలో మహిళ మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు పులిగుట్ట తండా వాసిగా గుర్తించి బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు ఉన్నాయని, కావాలనే మున్నీని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని తండావాసులు ఆరోపిస్తున్నారు. భర్త వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పటాన్చెరు టౌన్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మహంకాళి దేవస్థానం సమీపంలో శుక్రవారం ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటం స్థానికులు గుర్తించి, అంబులెన్స్లో పటాన్న్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయని, మృతుడు బ్లాక్–చెక్ షర్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు. చికిత్స పొందుతూ కార్మికుడు.. పటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్లోని పార్థసారథి నగర్కు చెందిన వెంకటేశ్వర్లు(48) 13 ఏళ్లుగా రుద్రారంలోని ఎంఎస్ఎన్ కంపెనీలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వేడినీటి పైపువాల్ను విప్పుతుండగా, ఒక్కసారిగా ఒంటిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హైదరాబాద్లోని అపోలో డీఆర్డీవో కంచన్న్బాగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తుప్పు పట్టిన యంత్రాలతో పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుమారుడు వెంకట శ్రీచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రాధాన్యం
సంక్షేమానికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● సంగారెడ్డి వేదికగా స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ఊసే ఎత్తని సీఎం దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు: మంత్రి వివేక్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని త్వరలో మరో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యో గాలు కల్పించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. టూరిజం ప్రాజెక్టుగా సింగూరు: మంత్రి దామోదర సింగూరు ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా మార్చాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యా, వైద్య, ఆరోగ్య పరంగా దేశంలోనే అత్యున్నతస్థాయిలో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2005 అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సింగూరు కాలువ పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. ఆ కాల్వ ద్వారా పంటలకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1.68కోట్లతో సీసీ లైనింగ్, సింగూరు మరమ్మతులకు రూ.17 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 వేల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. విప్లవాత్మకమైన మార్పులతో స్మార్ట్ కార్డులు: మంత్రి ఉత్తమ్ నిరుపేదలకు అవసరమయ్యే ఆహార భద్రత కార్డు 10 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి 85% జనాభాకు 3.42కోట్ల మందికి ఒక కోటి ఆరు లక్షల కార్డులు ఇవ్వనున్నామని చెప్పారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ... ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీరుపై ఘాటైన విమర్శలు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం సాగింది. రాష్ట్రంలో 1.06 లక్షల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యాక్రమాన్ని సంగారెడ్డి వేదికగా సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో పలువురు లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి సుమారు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీని జిల్లా వాసులు గెలిపిస్తే..దేశానికి ప్రధానమంత్రి అయి.. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పొందుతున్న లబ్ధిని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హాయాంలో అమలైన డబుల్బెడ్రూం ఇళ్ల పథకం వైఫల్యాలను రేవంత్రెడ్డి ఎత్తి చూపారు. మాజీ సీఎం కేసీఆర్పై, మాజీ మంత్రి హరీశ్రావుపై ఘాటైన విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీపై హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులు ప్రతిపక్ష పార్టీల ట్రాప్లో పడొద్దని హితువు పలికారు. ఊసేలేని జిల్లా అంశాలు.. సీఎం పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తారని అందరూ భావించారు. అయితే ఈసారి సీఎం జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక్క హామీని కూడా ఇవ్వకపోవడం జిల్లా వాసులను ఒకింత నిరాశకు గురి చేసింది. సింగూరు జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ బహిరంగసభ వేదికగా సీఎం దృష్టికి తెచ్చినా కూడా..ఈ అంశంపై సీఎం ఎలాంటి హామీ గానీ, ప్రకటన కానీ చేయలేదు. జగ్గారెడ్డి పోటీపై.. నిర్మల పదవిపై సీఎం స్పష్టత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల పదవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఒకింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. రూ.వెయ్యి కోట్లు పెట్టినా ఇలాంటి సేవ చేసే నాయకుడు సంగారెడ్డికి లభించరని కితాబిచ్చిన సీఎం..జగ్గారెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టతనిచ్చారు. మరోవైపు నిర్మలరెడ్డి టీజీఐఐసీ పదవి అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. వీరిద్దరికి ఇచ్చే పదవులేవో ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఐఐటీహెచ్లో హెలీప్యాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో ఐబీ చౌరస్తాకు చేరుకుని అక్కడ దివంగత ప్రధానులు నెహ్రు, రాజీవ్గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఓపెన్టాప్ వాహనంలో సభా వేదిక వద్దకు ర్యాలీగా వచ్చారు. మాట్లాడుతున్న సీఎంయువతకు ఉద్యోగాలు: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ విదేశీ పెట్టుబడులు రాక, యువతకు 80 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం కల్పించనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. స్మార్ట్ రేషన్ కార్డు అంటే కార్డు మాత్రమే కాదు కుటుంబానికి గౌరవంతో పాటు ఆహార భద్రత, గ్రామానికి గుర్తింపు కార్డు అన్నారు. -
250 మంది యువకుల రక్తదానం
పటాన్చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు, కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతిని జీఎంఆర్, జీవీఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జీఎంఆర్ యువసేన, జీవీఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి పైగా యువకులు రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. బ్లాక్ ఆఫీస్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అభిమానులు, సన్నిహితులు, యువసేన సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, విజయ్కుమార్, భిక్షపతి, రామచంద్రారెడ్డి, పృథ్వీరాజ్, గూడెం సంతోష్ రెడ్డి, సందీప్ రెడ్డి, అశోక్, వెంకటేశ్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నారాయణఖేడ్: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నాగల్గిద్ద మండలం గూడూరు శివారులో శనివారం చోటు చేసుకుంది. నాగలిగిద్ద ఏఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆంజనేయులు సాగర్ (21) ఓ ఉపాధ్యాయురాలిని బైక్పై నాగల్గిద్ద గ్రామంలో దింపి అనంతరం తన గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు నుంచి నాగల్గిద్ద వైపు వస్తున్న ఆటో– బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైక్పై ఉన్న ఆంజనేయులు సాగర్కు తీవ్ర గాయాలు కాగా కుటుంబీకులు, స్థానికులు ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి మాణిక్ సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి.. పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున పటాన్చెరు బస్టాండ్ సమీపంలో ఇస్నాపూర్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని అంబులెనన్స్లో పటాన్న్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ పతాకాన్ని సంగీత ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేయడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో... సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ పరితోశ్ పంకజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్లో.. నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖేడ్ గాంధీచౌక్లో ఎంపీ సురేశ్ షెట్కార్, క్యాంపు కార్యాలయం, ఇందిరాచౌక్ వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ నగేశ్ షెట్కార్, శ్రీనివాస కళాశాల వద్ద మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, వివిధ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జెండాలను ఎగురవేశారు. జహీరాబాద్లో.. జహీరాబాద్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జహీరాబాద్లో ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై జాతీయ పతాకాలను ఎగురవేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.మాణిక్రావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. జాతీయ పతాకం తలకిందులుగా ఎగురుతున్న విషయాన్ని గమనించి సరైన దిశలో ఎగురవేశారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ దేవుజా, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ యూనూస్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ దశరథ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్రెడ్డి, మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ సాయిచరణ్, సీడీసీ కార్యాలయంలో చైర్మన్ ముబీన్లు జాతీయ పతాకాలను ఎగురవేశారు. జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్ సంగీత జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న ఎస్పీ పరితోశ్ పంకజ్, తదితరులు -
ఉత్తమ సేవలకు పురస్కారాలు
మెదక్ కలెక్టరేట్: పురస్కారాలు పొందిన అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో ఈ ఏడాది ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంత్రి వివేక్, కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి పురస్కారాలు అందజేశారు. శనివారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, వ్యవసాయ అధికారి దేవ్కుమార్, ఈడీఎం సందీప్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ హేమభార్గవికి పురస్కారాలు అందజేశారు. అలాగే కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల శాఖ అధికారి గఫార్ మియా, రాజేశ్వరీ, నాయబ్ తహసీల్దార్, పోలీస్ శాఖలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బందికి మొత్తం 40 మందికి పురస్కారాలు అందజేసినట్లు అధికారులు తెలిపా రు. రెవెన్యూ శాఖలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు, శివ్వంపేట తహసీల్దార్ కమలాద్రి, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, జూనియర్ అసిస్టెంట్ భవాని, సందీప్లతోపాటు జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి మొత్తం 80 మందికి పురస్కారాలు అందజేశారు. మరింత బాధ్యతతో పనిచేయాలి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రదానం -
సిగాచి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
పటాన్చెరుటౌన్: సిగాచి బాధిత కుటుంబాలకు మిగిలిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా చూడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొని, పలు కార్మికుల అంశాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను 2026 జూన్ నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పెంచినందుకు సుమారు 2 లక్షల మంది కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.కోటి పరిహారంలో మిగిలిన మొత్తాన్ని త్వరగా చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు లేని సుమారు 3 లక్షల మంది హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పటానన్చెరు, బొల్లారం, ఇస్నాపూర్ ప్రాంతాలకు ప్రభుత్వ స్థలంలో సొంత ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలని, కార్మికుల గృహనిర్మాణం కోసం టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వ ధరలకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎంకు వినతిపత్రం అందజేసిన నర్సింహారెడ్డి -
ఎన్జీటీ కేసు రద్దులో ప్రభుత్వం విఫలం
హుస్నాబాద్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్పై ఉన్న ఎన్జీటీ కేసును తొలగించి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచినా మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం ఏన్జీటీ కేసును రద్దు చేయించలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేసి ట్రయల్ రన్ చేసి నీళ్లు నింపామన్నారు. కాంగ్రెస్ నాయకులే ప్రాజెక్టు పూర్తి కావడం తట్టుకోలేక కొందరిని ఉసిగొలిపి కేసులు వేయించి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక ముందు పర్యావరణం, ఏన్జీటీ అనుమతులపై కోర్టుకు రావద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించాలని సూచించారు. కేసులు మీరే వేశారు, వాటిని పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపి ఆ క్రెడిట్ను మీరే తీసుకోవాలని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును నింపే బాధ్యత మంత్రి పొన్నందే.. మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ -
ప్రజాకాంక్ష నెరవేర్చేలా పాలన
సంగారెడ్డి జోన్: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి పాల్గొన్నారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతం ఆలపించారు. అదేవిధంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుకు భరోసాకు రూ.418 కోట్లు రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం సీజన్లో 3,60,464 మంది రైతులకు రూ.418 కోట్లు జమ చేశామని మంత్రి దామోదర వివరించారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే...‘‘రబీ సీజన్లో 33,540 రైతుల నుండి 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ. 405.73 కోట్లు చెల్లించాం. సన్నఒడ్లకు బోనస్ రూపంలో రూ.2.76 కోట్లు ఇవ్వనున్నాం. 2025–26లో రైతు బీమా పథకం ద్వారా 1,180 మంది రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున రూ.59 కోట్లను నామిని ఖాతాలో జమ చేశాం. ప్రజా ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జిల్లాలో రూ.275 కోట్లతో కొత్త 500 పడకల ప్రభుత్వాస్పత్రి పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.168 కోట్ల నిధులతో మెడికల్ కళాశాలతోపాటు హాస్టల్ భవనాలను నిర్మించి ప్రారంభించాం. రూ.34 కోట్ల నిధులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రహదారుల మరమ్మతులకు నిధులు జిల్లాలో హ్యమ్ పద్ధతిలో 318 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం రూ.685 కోట్లు మంజూరు కాగా, రూ.405 కోట్ల నిధులతో 188 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి’’అని మంత్రి వివరించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మంత్రి దామోదర రాజనర్సింహ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జహీరాబాద్ టౌన్: జనాభాలో సగం ఉన్న మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోల్ ఇండియా కంపెనీ మాజీ చైర్మన్ పీఎం. ప్రసాద్ పేర్కొన్నారు. వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్( వికాస్), కోల్ ఇండియా కంపెనీ ఆర్థిక సహాయంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని 370 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శనివారం పస్తాపూర్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరై ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా కంపెనీ సహకారంతో వికాస్ సంస్థ మహిళలకు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. కుట్టు మెషీన్లను సద్వినియోగం చేసుకుని కుటుంబ పోషణకు అండగా ఉండాలని సూచించారు. హయత్నగర్ సివిల్ జడ్జి, మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఫర్హీన్ దండా మాట్లాడుతూ మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 1600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్లు పంపిణీ చేశామని వికాస్ సంస్థ చైర్మన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్ పర్సన్ శిరీషరెడ్డి , ప్రాజెక్టు కోఆర్డినేటర్ కొత్తకాపు సురేందర్రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్రెడ్డి, సంస్థ డైరక్టర్లు రావినర్సింహారెడ్డి, సుగుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. కోల్ ఇండియా కంపెనీ మాజీ చైర్మన్ ప్రసాద్ 370 మందికి కుట్టు మెషీన్ల పంపిణీ -
ఇటు చూడరూ..
సీఎం సారు..కార్యరూపం దాల్చని మెట్రో పొడిగింపుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సంగారెడ్డికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్రేషన్కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి.. ఈ కార్యక్రమాన్ని లంచనంగా ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్నారు. సీఎం పర్యటనపై జిల్లా వాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. పారిశ్రామిక రంగంలో అభివృద్ధిలో ఉన్న జిల్లాలో ప్రధాన సమస్యలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. సీఎం తన పర్యటనలో ఈ ప్రధాన సమస్యలు పరిష్కరమయ్యేలా చొరువ చూపాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ప్రధానంగా సాగునీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ● సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు జరిగాయి. నిధుల సమస్య కారణంగా అప్పట్లో ఈ పనులు పట్టాలెక్కలేదు. ఈ ప్రభుత్వ హాయాంలో ఈ పథకాల ఊసే లేకుండా పోయింది. ఈ పనులు ప్రారంభించేందుకు చొరువ చూపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు, సంగారెడ్డి, మెదక్ జిల్లాకు సాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కాలువల ఆధునీకరణ పనులు కూడా వేగవంతం అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ● మెట్రోరైలును పటాన్చెరు వరకు పొడిగించే ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. మియాపూర్ – పటాన్చెరు కారిడార్ ఫేజ్–2 (ఏ) 13.4 కి.మీల పొడిగింపునకు సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి వెళ్లింది. కేంద్రం నుంచి అనుమతుల విషయంలో సీఎం ప్రత్యేక చొరువ చూపి.. పనులు ప్రారంభిస్తే జిల్లాకు మేలు జరుగుతుంది. సంగారెడ్డి నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్కు వెళ్లి వస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైలును సంగారెడ్డి వరకు పొడిగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ● సంగారెడ్డి – మదీనాగూడ వరకు ముంబై హైవే విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 29.35 కి.మీలు నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు రూ.1,297 కోట్లతో పనులు చేపట్టారు. ఈ పనులు నత్తనడకన సాగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులు వేగవంతం అయ్యేలా సంబందిత శాఖల అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ● రెడ్ క్యాటగిరి పరిశ్రమలు వదులుతున్న కాలుష్యంతో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా తయారవుతోంది. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల ఆగడాలకు చెక్ పడేలా ప్రత్యేక చర్యలకు సీఎం ఆదేశించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేనిపక్షంలో గాలీ, నీరు, సహజ సిద్ధమైన చెరువులు, భూగర్భ జలాలు కలుషితమై స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ● సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 54 మంది కార్మికుల భాదిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని రేవంత్రెడ్డి ఇచ్చిన హామి 13 నెలలైనా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. సగటను రూ.42 లక్షలు మాత్రమే అందాయి. తక్షణం వీరికి మిగిలిన రూ.58 లక్షల పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ● జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు అంశం తెరపైకి వస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ఈ బైపాస్రోడ్డు అనివార్యమవుతోంది. నత్తనడకన ముంబై హైవే విస్తరణ పనులు ఊసే లేని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు కాలుష్య కారక పరిశ్రమలతో ప్రజలు విలవిల.. సిగాచీ బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో అందని పరిహారం నేడు జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రాక -
జొన్న రైతు పంట పండింది
రూ.184.16 కోట్లు చెల్లించిన సర్కార్ ● గతానికి భిన్నంగా భారీగా కొనుగోళ్లు ● మార్కెట్ కంటే రెట్టింపు మద్దతు ధర నారాయణఖేడ్: జొన్న రైతుకు పంట పండింది. గతానికి భిన్నంగా ప్రభుత్వం భారీగా జొన్నలు కొనుగోళ్లు చేపట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కొనుగోళ్లు పూర్తయిన రెండు నెలల్లోపు రైతుల వారి వారి ఖాతాల్లో రూ.184.16 కోట్లను జమ చేశారు. జొన్న రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.3,699కు క్వింటాలుకు కొనుగోళ్లు చేపట్టింది. మార్కెట్ హెచ్చు తగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా కొనుగోళ్లను సైతం వేగవంతం చేసింది. మార్కెట్లో క్వింటాలుకు రూ.2వేల లోపే ధర పలుకగా కొనుగోలు కేంద్రాల్లో మంచి మద్దతు ధర లభించింది. జిల్లా మొత్తంలో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 21,159 మంది రైతులకు సంబంధించి రూ.184.16 కోట్ల విలువగల 49,775.6 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేశారు. భారీగా జొన్న సాగు యాసంగి సీజన్లో జిల్లాలో 91వేల ఎకరాల పైగా జొన్న పంటను సాగు చేశారు. దిగుబడులు కూడా అనుకూలంగా వచ్చాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోని గ్రామాల వ్యవసాయ క్షేత్రాలు జొన్న పంట సాగుకు అనుకూలంగా ఉండటంతో దిగుబడులు కూడా భారీగానే వస్తున్నాయి. ఎకరాకు కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయి. రైతులు తాము కుటుంబ అవసరాలకు కొంత దాచుకోగా మిగతా పంటను మద్దతు ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. గతంలో కొనుగోలు చేసిన పంటలకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాగా ఈ సారి మాత్రం రెండు నెలల్లోపు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరిగాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఖేడ్ డివిజన్లో అత్యధికంగా 12 జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా జహీరాబాద్లో 5, జొగిపేటలో 8, సంగారెడ్డిలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతగా రూ.67 కోట్లు విడుదల కాగా, రెండో విడతలో రూ.40 కోట్లు చివరి విడతలో రూ.77 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో రైతులందరికీ జొన్నల బకాయిలు చెల్లింపులు పూర్తి చేసి వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు మార్క్ఫెడ్ డీఎం రంజిత్రెడ్డి తెలిపారు.జిల్లాలో కొనుగోళ్ల తీరు.. సంవత్సరం కేంద్రాలు ఎంఎస్పీ రైతులు మెట్రిక్ టన్నులు రూ.కోట్లలో 2023–24 19 రూ.3,180 11066 21811 రూ.69.35 2024– 25 22 రూ.3,371 13224 31753 రూ.107.03 2025– 26 30 రూ.3,699 21159 49775 రూ.184.16 కొనుగోళ్ల కేంద్రంలో జొన్న సంచులు -
భక్తిశ్రద్ధలతో నాగులకట్ట వార్షికోత్సవం
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని పాతకెరీ నాగులకట్ట వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ ఓదెల మాణిక్రావు, రాజేశ్వరీ దంపతులు ఆధ్వర్యంలో వార్షికోత్సవం సందర్భంగా పూజారులతో నాగులకు అభిషేకం నిర్వహించారు, అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్కుమార్, పృథ్వీరాజ్, విష్ణువర్ధన్రెడ్డి, విఠల్, దుర్గా రాజేశ్, మల్లేశం, పాండు, నాగరాజు, పరుశరామం, శ్రీశైలం, సాయిరాం భక్తులు తదితరులు పాల్గొన్నారు. జోగిపేట, వట్పల్లి (అందోల్): జోగిపేట సమీపంలోని అన్నాసాగర్ దర్గా ఉత్సవాలు శనివారం నుంచి 17వ తేదీ వరకు కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హాజరుకానున్నారు. జిన్నారం (పటాన్చెరు): తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. జిన్నారం కస్తూర్భా గాంధీ కళాశాలలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణతో చేపట్టారు. హత్నూర(సంగారెడ్డి): అరబిందో పరిశ్రమ సహకారంతో పల్పనూరులో ఏర్పాటు చేసిన నాలుగు సోలార్ లైట్లను శుక్రవారం సర్పంచ్ బంటు రాయుడు ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నాలుగు సోలార్ లైట్లు అమర్చగా వాటిని ప్రారంభించడంతో ప్రజలకు చీకట్లో ఎంతో ఉపయోగపడినట్లు సర్పంచ్ తెలిపారు. అరబిందో పరిశ్రమ సహకారంతోనే పలు అభివద్ధి పనులు గ్రామంలో చేపడుతున్నట్లు తెలిపారు. ● యూరియా నిల్వలు పుష్కలం ● జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని రైతులు యూరియా కోసం ఎలాంటి ఆందోళన చెందవద్దని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2403 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. మార్క్ఫెడ్ వద్ద 1855 మెట్రిక్ టన్నులు, రిటైలర్ల వద్ద 548 మెట్రిక్ టన్నులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి ఎఫ్ఎస్ఎస్ యాప్ ద్వారా యూరియా విక్రయిస్తున్నామని చెప్పారు. ఎఫ్ఎస్ఎస్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులందరికి యూరియా అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ యూరియా స్టాక్ను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. రిటైలర్ కేంద్రాల వద్ద ఉన్న వలంటీర్లు, రైతు వేదికల వద్ద ఉండే ఏఈఓలు రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. రైతులకు బుకింగ్ చేయడంలో సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచుబొమ్మల తయారీకి మహిళా సంఘాలకు శిక్షణ అందిస్తున్నట్లు నాబార్డ్ మెదక్ జిల్లా ఏజీఎం కృష్ణతేజ తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని మహిళా సమైక్యా సభ్యులకు కొబ్బరిపీచు ఉత్పత్తుల తయారీపై ఆవగాహన కల్పించారు. మహిళా సంఘాల సభ్యులు ముందుకు వచ్చి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్కుమార్, కోఆర్టినేటర్ గోపిరెడ్డి, ఐకేపీ ఏపీఎం రాములు ఉన్నారు. -
యూరియా బుకింగ్ కష్టాలు
చిన్నశంకరంపేట(మెదక్): యూరియా బుక్ చేసుకునేందుకు రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని జంగరాయి గ్రామంలో శుక్రవారం యూరియా బుక్ చేసుకునేందుకు అన్నదాతలు పడుతున్న పాట్లు అంతాఇంతా కాదు. తీరా యాప్ ఓపెన్ అయిన నిమిషం లోపే 1790 బస్తాల యూరియా బుక్ అయి యాప్లో నిల్ చూపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం చిన్నశంకరంపేట, జంగరాయి పీఏసీఎస్లకు 560 బస్తాల చొప్పున, గవ్వలపల్లిలోని శ్రీరామలింగమేశ్వర ఫర్టిలైజర్ షాప్కు 670 బస్తాల యూరియా వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రేమ్ వర్క్ ఫార్మర్ యాప్లో యూరియా బుక్ చేసుకోవాలని ఏఓ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. అయితే యాప్ ఓపెన్ అయినా ఒక నిమిషంలోపే బస్తాలు అన్ని అయిపోయి యాప్లో నిల్ చూపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే యువకులే క్షణాల్లో యూరియా బుక్ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఉపయోగించడం రాని రైతులు రైతువేదికల వద్ద, ఫర్టిలైజర్ దుకణాల వద్ద ఇతరుల సహాయం కోసం ఎదురు చూశారు. అవసరం 38 వేలు.. వచ్చింది 13 వేలు చిన్నశంకరంపేట మండలంలో 19 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఇందుకు 38 వేల యూరియా బస్తాలు అవసరమని ఏఓ ప్రవీణ్కుమార్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 13 వేల యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని, త్వరలోనే మరిన్ని బస్తాలు వస్తాయని చెప్పారు. రైతులు ముందుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. క్షణాల్లో అయిపోతున్న వైనం ఆందోళన చెందుతున్న రైతన్నలు -
80 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
సంగారెడ్డి: చౌటకూర్లో 50 ట్రాక్టర్లతో తిరంగా ర్యాలీసదాశివపేట(సంగారెడ్డి): 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 80 అడుగుల జాతీయ జెండాతో పట్టణ పురవీధుల గుండా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల వేషధారణలో కనిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ, వైస్ చైర్పర్సన్ రేణుక, ఎస్ఐలు లక్ష్మారెడ్డి, కృష్ణగౌడ్, పాఠశాల చైర్మన్ నాగనాథ్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కమీషన్ల దందా
కాంగ్రెస్ హయాంలో రామాయంపేట, నిజాంపేట(మెదక్): కాంగ్రెస్ హయాంలో కమీషన్ల దందా కొనసాగుతోందని, దీంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆరోపించారు. నిజాంపేట మండలం చల్మెడ కమాన్ నుంచి నందగోకుల్ వరకు అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. బిల్లుల కోసం ఏకంగా ఎనిమిది నుంచి పది శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తుండటంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. కంకర పోసి వదిలేసిన ఈ రహదారిపై గుంతలు పడి ప్రయాణం ప్రమాదకరంగా మారిందన్నారు. నిజాంపేట నుంచి నస్కల్, నందగోకుల్, చల్మెడ కమాన్ వరకు 15 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణానికిగాను బీఆర్ఎస్ హయాంలోనే రూ. 13 కోట్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి రెండున్నరేళ్లు గడిచినా ఎందుకు పనులు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. ఈ విషయమై మెదక్ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నస్కల్ గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. నాలుగు కిలోమీటర్లు మాత్రమే తారు రోడ్డు నిర్మించారని, మిగతా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని చెప్పారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే మహా ధర్నా, పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, కల్వకుంట సర్పంచ్ కొండల్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ రంజిత్గౌడ్, మాజీ ఎంపీపీ సంపత్, పార్టీ సీనియర్ నాయకులు గౌస్, నర్సింలు, అబ్దుల్ అజీజ్, భాస్కర్రావు, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు. ఎనిమిది నుంచి పది శాతం కమీషన్లే.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి -
దొంగ అరెస్టు
హుస్నాబాద్రూరల్: చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఎస్సై లక్ష్మారెడ్డి, సీఐ శ్రీధర్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 5న మండలంలోని మహ్మదాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు కాసాని శివరాజు అదే గ్రామంలోని రవీందర్రెడ్డి ఇంటి సిమెంట్ రేకులను పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. కాగా బీరువాను సైతం పగులగొట్టి అందులోని రూ.40 వేలను దొంగిలించాడు. పోలీసులు విచారణ జరిపి, నిందితుడు శివరాజును పట్టుకొని, అతని వద్దనుంచి రూ.40వేలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పర్చారు. 70 తులాల వెండి, రూ.30వేల నగదు చోరీ వట్పల్లి(అందోల్): పట్టపగలు గుర్తు తెలియని దొంగలు తాళం వేసిన ఇంట్లో పడి వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన అందోల్ మండలంలోని అల్మాయిపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. జోగిపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి వీరమణి పొలం పనులకు వెళుతూ ఇంటికి తాళం వేసి వెళ్లింది. గమనించిన దొంగలు గేట్, మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న 70 తులాల వెండి ఆభరణాలు, రూ.30వేల నగదును దోచుకెళ్లారు. ఆమె కుమారుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చి చూసి తల్లికి విషయం చెప్పాడు. వెంటనే బాధితురాలు వచ్చి బీరువాను చెక్ చేయగా అందులో వెండి ఆభరణాలు, నగదు కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శుభ ముహూర్తాలొచ్చేశాయ్..
మోగనున్న పెళ్లి బాజాలు● రేపటి నుంచి సెప్టెంబర్ 11 వరకు.. ● కళకళలాడనున్న కల్యాణ మండపాలు ● ఒక్కటి కానున్న జంటలు ● ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు డిమాండ్ సంగారెడ్డి టౌన్/హత్నూర(సంగారెడ్డి ): శ్రావణమాసం వచ్చి శుభకార్యాలకు మంచిరోజులు తెచ్చింది. దాదాపు మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు రానున్నాయి. ఆదివారం నుంచి వివాహ వేడుకలు మొదలు కానున్నాయి. ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ శ్రావణంలో పెళ్లిళ్ల సందడి అధికంగా ఉండనుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో అభిషేకాలు, పవిత్రోత్సవాలు, ప్రత్యేక, కుంకుమ పూజలు నిర్వహించడానికి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. పట్టణాల్లో పెళ్లిళ్ల షాపింగ్ ఊపందుకుంది. దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వధూవరుల కుటుంబ సభ్యులు షాపింగ్ ప్రారంభించారు. వస్త్ర, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. భోజనాలు, క్యాటరింగ్, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, డెకరేషన్ల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖలు, ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటోగ్రాఫర్లు, టెంట్ హౌస్, వంట మేసీ్త్రలు, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, బజంత్రీలు.. ఇలా పెళ్లి వేడుకతో ముడిపడిన ప్రతి ఒక్కరికీ పని మొదలైంది. ఆర్థికంగా ఉన్నవారు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే వెడ్డింగ్ ప్లానర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సాధారణ, మధ్య తరగతి వారు కూడా తమ స్థాయికి తగ్గట్లు వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఆధునిక సెట్టింగులు.. కల్యాణ మండపాల్లో కళ్లు చెదిరే సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో అద్దెలు పలుకుతున్నా. ఆ సంబరమే వేరని వధూవరుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా మండపాలను తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంగళవాయిద్యాలకు గిరాకీ హిందూ సంప్రదాయంలో మంగళవాయిద్యాలు లేకుండా పెళ్లి వేడుక ఉండదు. నూతన వధూవరులను సిద్ధం చేసే సమయం నుంచి పెళ్లి పూర్తయి ఇంటికి వచ్చే వరకు మంగళవాయిద్యాలు తప్పనిసరి. బ్యాండు మేళాలు, ఆర్కెస్ట్రాలకు రూ.50 వేల నుంచి రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇక విందు భోజనాల సంగతి సరేసరి. ఎంత ఖర్చు పెట్టేందుకై నా వెనుకాడటం లేదు. ఎంచుకున్న మెనూను బట్టి ప్లేట్కు ఇంతని ధర నిర్ణయిస్తారు. వివాహాలు చేయి ంచే పురోహితులకు మంచి డిమాండ్ పెరిగింది. -
నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవాలి
వర్గల్(గజ్వేల్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక డిజిటల్ సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ డాక్టర్ బాలకిష్టారెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ‘అభ్యుదయ–2026’ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కావేరి వర్సిటీ చాన్స్లర్, కావేరి సీడ్స్ చైర్మన్ జీ.వీ.భాస్కర్రావు, మణిపూర్ వర్సిటీ చాన్స్లర్, తిరుపతి రావు, కావేరి వీసీ ప్రవీణ్రావుతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మారుతున్న వృత్తి ప్రపంచాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆవిష్కరణాత్మక, విమర్శనాత్మక ఆలోచనా విధానం, సమస్య పరిష్కార నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలన్నారు. జీ.వీ.భాస్కర్రావు మాట్లాడుతూ కావేరి వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆరోగ్యం, రిజిస్ట్రార్ డాక్టర్ బీ.శ్రీనివాసులు, డైరెక్టర్ హర్షరావు, డీన్లు, ఈడీలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
విద్యార్థులకు వంటల పోటీలు
జహీరాబాద్ టౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం వంటలు, ముగ్గులు, మెహిందీ పోటీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై పోటీలను ప్రారంభించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వంటల ప్రాముఖ్యతను సమాజంలో తెలియపరచాలన్నారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన 117 మంది విద్యార్థులు చిరుధాన్యాలతో ఘుమఘుమలాడే వంటలను తయారు చేసి ప్రదర్శించారు. అలాగే ముగ్గులు, మెహిందీ, వ్యాసరచన, దేశభక్తి పాటల పోటీలు కూడా నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్.హరికుమార్, డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
పట్టా భూమి కబ్జా చేస్తుండ్రు!
శివ్వంపేట(నర్సాపూర్): పదమూడేళ్ల క్రితం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూమిని అక్రమార్కులు భయభ్రాంతులకు గురి చేస్తూ కబ్జాకు పాల్పడుతున్నారని బాఽధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన చుక్క రాణి, శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ.. తాము 2013లో దొంతి గ్రామ పరిధి సర్వే నం.433లో 23 గుంటల భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూమిని పలువురు ఆక్రమించుకునేందుకు తమపై దాడులకు పాల్పడ్డారని దీంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. సదరు భూమిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ రెండు రోజుల క్రితం తమకు చెందిన భూమిలో కిరాయి రౌడీలను తీసుకువచ్చి పెన్సింగ్ కడీలను తొలగించారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
అధిక ధరలకు ఎరువుల విక్రయాలు
ఆగ్రో సేవా కేంద్రంలో అమ్మకాలు నిలిపివేయించిన అధికారులు రామాయంపేట(మెదక్): అధిక ధరలకు కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తున్న ఓ ఫర్టిలైజర్ దుకాణంపై వ్యవసాయ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేసి, అమ్మకాలను నిలిపివేయించారు. కాంప్లెక్స్ ఎరువుల ఽబస్తా ధర రూ.1350 ఉండగా, స్థానిక ఆగ్రో రైతు సేవా కేంద్రంలో రూ. 2120కి అమ్ముతున్నట్లు కొందరు రైతులు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ జరిపిన మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్ అమ్మకాలను నిలిపివేయించారు. ఈ విషయమై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహనం సీజ్ కోహెడరూరల్(హుస్నాబాద్): అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అభిలాష్ వివరాల ప్రకారం.. రామంచ నుంచి కోహెడకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాగా సింగరాయ పెట్రోల్ పంప్ దగ్గర బొలెరో వాహనంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. విచారణలో నిందితుడు తరలిస్తున్న ఇసుకకు సంబంధించిన ఎటువంటి అధికారిక అనుమతులు లేకపోవడంతో వాహనం సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. చిన్నశంకరంపేట(మెదక్): వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన రైతుకు ఫిట్స్ రావడంతో పొలంలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఖాజాపూర్ గ్రామ పరిధిలోని కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంసాని రామ్రెడ్డి(50) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పంటపొలంలో బోర్లపడి ఉన్నాడు. వెంటనే అతన్ని పైకిలేపి చూడగా ఫిట్స్తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. రామాయంపేట(మెదక్): మద్యం తాగి డీసీఎం నడిపిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈమేరకు అతన్ని నిజాంపేట పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. సదరు వ్యక్తికి న్యాయమూర్తి రూ. 10వేల జరిమానా విధించారని ఎస్ఐ రాజేశ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిద్దిపేటలో 73మందికి.. సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు వివరాలు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో 73మంది పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రూ. 5,49,500 జరిమానా, ఒకరికి పది రోజులు, ఇద్దరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. హత్నూర(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సిర్పుర గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని పీరియా తండాకు చెందిన మాలోతు గన్య (55)తన బైక్పై సిరిపురం నుంచి పీర్యతండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేవునిగుట్ట తండాకు చెందిన మడావత్ నవీన్ తన బైక్పై వస్తూ వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో గన్య ను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. -
పాలిటెక్నిక్ను విలీనం చేయొద్దు
గజ్వేల్రూరల్: పాలిటెక్నిక్ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని గజ్వేల్లోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో గల పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశముందని, దీంతో పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు ఉన్నత విద్య అయిన ఇంజినీరింగ్లో చేరే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పాలిటెక్నిక్ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై ఆటోడ్రైవర్ ఆత్మహత్య
శివ్వంపేట(నర్సాపూర్): మద్యానికి బానిసై ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగన్న గారి మహేశ్(50) ఆటో డ్రైవర్గా జీవనోపాధి పొందుతున్నాడు. కొంత కాలంగా అతడు మద్యానికి బానిసై అప్పులు చేశాడు. దీంతో నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో పలుమార్లు పెద్దలు నచ్చజెప్పినా అతనిలో మార్పు రాలేదు. గురువారం రాత్రి బాత్రూమ్కు వెళ్తున్నానని తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఇనుపరాడ్కు ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
రామాయంపేట(మెదక్): కరెంటు షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కాట్రియాల గ్రామానికి చెందిన మైలారం వెంకటయ్య(48) రైతు మృతదేహం ట్రాన్స్ఫార్మర్ సమీపంలో పడి ఉండగా సమీప రైతులు గుర్తించారు. అతని వంటిపై ఉన్న గాయాలను బట్టి కరెంటు షాక్తో మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బాల్రాజు తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ.. చేర్యాల(సిద్దిపేట): పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ఆకునూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల పద్మ(55) ఈ నెల 8న వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులే మేలు
న్యాల్కల్(జహీరాబాద్): ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను రైతులకు అందించడమే డిజిటల్ వ్యవసాయ పైలెట్ ప్రాజెక్ట్ ఉద్దేశమని ముంబై ఎస్బీఐ పౌండేషన్ అధికారులు అర్పిత శర్మ, ఎస్బీఐ ఏఆర్ఐఎస్ఏ ల్యాబ్ ప్రాజెక్ట్ హెడ్ జెల్ల సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని గంగ్వార్లో నిర్వహిస్తున్న డిజిటల్ వ్యవసాయ పైలెట్ ప్రాజెక్ట్ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిజిటల్ వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్గా గంగ్వార్ను ఎంపిక చేశామని, ఇక్కడ విజయవంతమైతే క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. రోబోటిక్ ద్వారా కలుపు తీత, చీడ పీడల నివారణ, వర్షం తదితర సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం వంటి వివరాలను వివరించారు. కార్యక్రమంలో బసంత్పూర్–మామిడ్గి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్, నారింజ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.గంగ్వార్లో డిజిటల్ వ్యవసాయ పైలెట్ ప్రాజెక్ట్ సందర్శన -
క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటాలి
డీఎస్వైఓ వీరారెడ్డి సిద్దిపేటజోన్: క్రీడల్లో నైపుణ్యాలను సాధించి ఉత్తమ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో రాణించి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా క్రీడల , యువజన శాఖ అధికారి వీరారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైదానంలో అండర్ –15 జూనియర్ ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట ఫుట్బాల్ అని అభివర్ణించారు. మంచి ఫిట్నెస్ సాధించాలని క్రీడాకారులకు సూచించారు. జిల్లా జట్టులో అక్షిత్, వర్షిత్, అక్షిత్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశ్, ప్రతినిధులు సాజిద్, కోచ్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల ఆందోళన
కొండపాక(గజ్వేల్): సర్టిఫికెట్లను ఇవ్వడంలో అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. మండలంలోని వెలికట్ట శివారులో గల శ్రీకృప ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ విద్య పూర్తయినా ఫీజు బకాయిలు ఉన్నాయంటూ యాజమాన్యం సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించే స్తోమత లేకనే ప్రభుత్వ కోటాలో కౌన్సిలింగ్ పద్ధతిలో కళాశాలలో చేరామని ఆవేదనకు గురయ్యారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో పైచదువుల కోసం దరఖాస్తులు చేసుకోలేకపోతున్నామన్నారు. కళాశాలలో చేరినప్పుడు యాజమాన్యం తీసుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఫార్మసీ విద్య పూర్తెనట్లుగా సర్టిఫికెట్ను అందించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడిన తర్వాతే సర్టిఫికెట్లను అందజేస్తామని చైర్మన్ మాట్లాడటం బాధాకరమన్నారు. ఈ విషయంపై చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల విషయమై ఈనెలలో జడ్జిమెంట్ రానుందని, దాని ఆధారంగా విద్యార్థుల సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
తాగారు.. చిక్కారు
పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులుపటాన్చెరు టౌన్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 809 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాల ముప్పు అధికంగా ఉండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రతి రోజు తనిఖీలు చేపడుతూ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని గుర్తిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో మద్యం తాగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తున్నారు. ఆగస్టు వరకు 809 కేసులు పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 809 కేసులు నమోదు కాగా, 653 కేసులను కోర్టుకు పంపించారు. విచారణ అనంతరం ఇప్పటివరకు 39 మందికి జైలు శిక్ష పడింది. అలాగే 653 కేసుల్లో మొత్తం రూ.8,63,500 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల డ్రైవర్తో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాగిన తర్వాత ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించాలని సూచిస్తున్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకు 809 కేసులు 653 కేసులు కోర్టుకు.. 39 మందికి జైలు శిక్ష రూ.8,63,500 జరిమానా -
చెక్కబొమ్మల కళాకారులకు చేయూత
జహీరాబాద్ టౌన్: చెక్కబొమ్మల కళాకారులకు ప్రభుత్వం చేయూత ఇవ్వనుందని సెర్ప్ పీఎం నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో చెక్కబొమ్మల కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగరాజు మాట్లాడుతూ.. చెక్కబొమ్మల తయారీదారులను గుర్తించేందుకు అలైఫ్ సంస్థ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి ఉపాధి కల్పించేందుకు జిల్లాలో యూనిట్ను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణం తదితర వసతులు కల్పిస్తామని, ఈ మేరకు రూ.కోటి మంజూరు అయ్యాయన్నారు. బొమ్మల తయారీ, మార్కెటింగ్ తదితర విషయాలపై శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సెర్ప్ కన్సల్టెంట్ ఇందు, అలైఫ్ ప్రతినిధులు మాధవి, డీపీఎం రమేశ్బాబు, ఏపీఎంలు విశేశ్వర్గౌడ్, బాగయ్యకుమార్, సీసీలు, వీఓఏలు, మెప్మా అధికారులు పాల్గొన్నారు. -
నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు
మెదక్ ఎస్పీ శ్రీనివాసరావుమెదక్జోన్: నేటి మొక్కలే రేపటి మహావృక్షాలని, నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించాలని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భావితరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతీ వ్యక్తి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ, అవి ఎదిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వన మహోత్సవాన్ని నిర్వహించి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, సీఐలు మహేశ్, జార్జ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐలు శైలందర్, రామకృష్ణ పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
దుబ్బాకటౌన్: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం ఎస్ఐ అరుణ్కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన బైండ్ల బాబు(38) పని నిమిత్తం దౌల్తాబాద్కు వచ్చాడు. పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో గ్రామ శివారులోని కల్వర్టు వద్ద బైక్ను అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. స్వగ్రామానికి వస్తుండగా కామారెడ్డి జిల్లా వాసి.. రామాయంపేట(మెదక్): రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై వై జంక్షన్వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్కు చెందిన జూపల్లి వెంకట్రావు (49) హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. రాత్రి స్కూటీపై తన స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు రిషి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్య మందలించడంతో.. భర్త ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని భాగీర్థిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ విఠల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండకాడి రాజు(40) మేసీ్త్ర పనులు చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో మద్యానికి అలవాటు పడటంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. కాగా మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య విజయ భర్తను మందలించింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిన అతడు పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పశువులు పైలం
వానాకాలం.. వ్యాధులతో పొంచి ఉన్న ముప్పు i నివారణకు చికిత్స తప్పనిసరి టేక్మాల్(మెదక్): వర్షాకాలంలో మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వ్యాధుల ముప్పు పొంచి ఉంది. పశువులు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బువాపు లాంటి వ్యాధులు రావడంతో పాటు ఈగలు, దోమల దాడి పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సకాలంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ.. వైద్యం చేయించాలని పశువైద్య అధికారులు సూచిస్తున్నారు. గాలికుంటు వ్యాధి ఈ వ్యాధి సోకితే పశువులు చాలా బలహీనంగా ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. వ్యవసాయ పనులు చేయడానికి ఎద్దులు సహకరించవు. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్లో ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. జబ్బవాపు.. తెల్లజాతి పశువుల్లో జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాధి సోకిన పశువులు అధిక జ్వరంతో బాధపడతాయి. మేత మేయకుండా పడుకొనే ఉంటాయి. జబ్బభాగం వాచి నల్లగా కనబడుతుంది. అక్కడ కండరాలు ఉబ్బి ఉంటాయి. సకాలంలో వైద్యం అందించకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. గొర్రెల్లో కాలి పుండ్ల వ్యాధి గొర్రెలు బురదలో తిరగడం వల్ల కాలి పుండ్లు వ్యాపిస్తాయి. గిట్టల మధ్య చర్మం మెత్తబడి వాచి చిట్లుతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి ముదిరితే గిట్టలు ఊడిపోతాయి. ఈ వ్యాధి సోకిన జీవాలకు 10 శాతం జింక్ సల్ఫేట్, లేదంటే ఐదు శాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూయాలి. గొంతువాపు సోకితే.. పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గొంతుపై, మెడకింద వాపు కనిపిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస తీసుకుంటుంది. గురుక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ, చివరకు అపస్మారకస్థితికి వెళ్లి చనిపోతాయి. -
ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి
అదనపు కలెక్టర్కు ఫిర్యాదుబెజ్జంకి(సిద్దిపేట): మండలంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్లో సిద్దిపేట అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్కు మంగళవారం బెజ్జంకి జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫ్యాక్టరీల కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వ్యవసాయ భూములు పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, డీఎస్పీ నాయకులు మహిపాల్రెడ్డి, లక్ష్మణ్, మహేందర్రెడ్డి, రూపేశ్, శ్రీనివాస్, సురేశ్, శేఖర్బాబు, సాయిక్రిష్ణ పాల్గొన్నారు. -
మృతదేహం ఆనవాళ్లు లభ్యం
దుబ్బాకరూరల్: గుర్తు తెలియని మహిళపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన దుబ్బాక మండలంలోని రామక్కపేట–లచ్చపేట గ్రామాల మధ్య ఈ నెల 9న జరిగిన విషయం విదితమే. కాగా పెట్రోల్ పోసి తగులబెట్టడంతో ఆనవాళ్లు గుర్తుపట్టలేక పోయారు. ఈ క్రమంలో తమ చిన్నమ్మ ఇంటి నుంచి వెళ్లి తప్పిపోయిందని అదే రోజు సాయంత్రం అక్భర్పేట – భూంపల్లి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన అధికం స్వామి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మృతురాలు కూతురు, కుటుంబీకులకు మృతదేహాన్ని చూపించారు. ఆనవాళ్లు గుర్తుపట్టి తన తల్లి విజయ(45)అని పోలీసులకు తెలిపింది. దీంతో మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కాగా విజయకు ఒక కూతురు ఉండగా ఆమెకు వివాహమైంది. విజయ భర్త పదేళ్ల క్రితమే మృతి చెందాడు. ఆమె భర్తకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కొడుకు, కూతురు ఉండగా ఆమె తన కొడుకు వద్ద ఉంటుంది. కాగా రెండో భార్య విజయ భూంపల్లిలోని డబుల్బెడ్రూంలో ఉంటూ బీడీలు చేస్తూ ఉండేది. మొదటి భార్య కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఆస్తి కోసం చంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
గీత కార్మికులకు ఇచ్చిన హామీలేమాయె?
చేర్యాల(సిద్దిపేట): కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ నెల 2 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర మంగళవారం మండలంలోని చుంచనకోట గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాత్రకు కల్లుగీత కార్మికులు స్వాగతం పలికి అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీతన్నల పెన్షన్ రూ.4వేలకు పెంచుతామని, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు చేసి నెల రోజుల లోపే ఇస్తామని ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాత్ర బృందం గోపి, వెంకట మల్లయ్య, వెంకన్న, చంద్రయ్య, అచ్చాలు, కరుణాకర్, ఉప్పలయ్య, బాల్నారాయణ, నాగేశ్వరరావు, సుధాకర్, జగన్, రాజేశ్, నవీన్, కౌన్సిలర్ ప్రసాద్, నాయకులు నర్సింహులు, కనకయ్య, సత్తయ్య, గణేశ్, క్రాంతి, సురేశ్, సిద్ధిరాములు, రాములు, సంజీవులు, అంజయ్య, వెంకటేశ్, మల్లేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు.చేర్యాలకు చేరిన గీతన్నల చైతన్య యాత్ర -
ఇద్దరు బైండోవర్
రూ.లక్ష చొప్పున జరిమానా అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని మైసమ్మ వాగుతండా గ్రామంలో మంగళవారం ఎకై ్సజ్ శాఖ అధికారులు తనిఖీలు చేసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న అక్కన్నపేటకు చెందిన ఒకరు, మైసమ్మవాగుతండాకు చెందిన ఒకరిని గుర్తించారు. ఎకై ్సజ్ శాఖ ఎస్ఐ దామోదర్ నేతృత్యంలో వారిని తహసీల్దార్ సింహాచలం మధుసూదన్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ములుగు(గజ్వేల్): డీసీఎంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. మంగళవారం వంటిమామిడి చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక డీసీఎంలో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లోని బహుదూర్పురకు చెందిన వాహన డ్రైవర్ అబ్దుల్ ఖలీల్, కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మహ్మద్ అబ్బాస్, ఆయూబ్, సోహెల్, మోహిన్లను విచారించగా ఎలాంటి అనుమతి లేకుండా పశువులను రవాణా చేస్తున్నట్లు వెల్లడైంంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పశువులను గోశాలకు తరలించామని ఏఎస్ఐ తెలిపారు. పటాన్చెరు టౌన్: తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని రోడ్ నం.5కి చెందిన శ్రీరాములు కుమారుడు వరుణ్ (13) మంగళవారం స్కూల్కి వెళ్తున్నానని చెప్పి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పనికి వెళ్లిన మహిళ.. పటాన్చెరు టౌన్: పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మహిళ ఆదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డియ భార్య మంజుల(34) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఈనెల 1న సాయంత్రం భర్త మద్యం తాగి ఇంటికి రావడంతో గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం పనికి వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పట్టణంలో వృద్ధుడు.. సంగారెడ్డి క్రైమ్: వృద్ధుడు అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల పకారం.. జహీరాబాద్ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన గంగరపు అడివయ్య(76), పట్టణంలోని శివాజీనగర్లో నివాసం ఉంటున్న తన కుమారుడు చంద్రన్న ఇంటికి ఈనెల 8న వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అదే రోజు ఉదయం కుమారుడితో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లొచ్చారు. సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గురు శిష్యులు గిన్నిస్ రికార్డు సాధించడం అభినందనీయం
ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర (సంగారెడ్డి): హత్నూర మండలానికి చెందిన గురు శిష్యులు ఇద్దరు గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం మండలానికి గర్వకారణమని ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన గురు శిష్యులు పోచయ్య, మహేశ్గౌడ్లను సునీతారెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇటీవల లండన్ దేశానికి చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ నిర్వహించిన కరాటే పోటీల్లో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించి మండలానికి మంచి గుర్తింపు తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉంటాఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు): కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి స్పష్టం చేశారు. రామచంద్రాపురం పట్టణంలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం పరిధిలోని ఇక్రిశాట్ సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ అధికారులతో, సదర్ ఏజెన్సీతో మాట్లాడి వారి వేతనం పెంచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, నాయకులు రాజేందర్రెడ్డి, రాజు, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలి రైతు స్వరాజ్య వేదిక నాయకులు సంగారెడ్డి: కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కౌలు రైతుల సమావేశం మంగళవారం శాంతినగర్ లోని టీపీటీఎఫ్ భవన్హాల్లో నిర్వహించారు. కౌలు రైతులకు వెంటనే 2011 చట్టం ప్రకారం గుర్తింపు కార్డులిచ్చి, ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ సంగీతకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి సాధన కమిటీ నాయకులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పి.శంకర్, టీపీజేఏసీ జిల్లా కన్వీ నర్ వై.అశోక్ కుమార్, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రంగా గౌడ్, మంజీర రైతు సంఘం అధ్యక్షుడు పథ్వీరాజ్ పాల్గొన్నారు. శ్మశానవాటిక బోర్డు ఏర్పాటుపై అభ్యంతరంసబ్ కలెక్టర్కు ఫిర్యాదు నారాయణఖేడ్: ఖేడ్లోని సాయిబాబా కాలనీ లో ఏర్పాటు చేసిన ముస్లిం శ్మశాన వాటిక బోర్డు విషయంలో స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు, కాలనీవాసులు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్రెడ్డి, మున్సిప ల్ కమిషనర్ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. బోర్డు ఏర్పాటు చేసిన స్థలానికి సంబంధించిన భూమి హక్కులు, రెవెన్యూ రికార్డులు, మున్సి పల్ అనుమతులు, ఇతర చట్టపరమైన అనుమతులపై విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు దశరథ్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, ప్రశాంత్, పట్నం మాణిక్, సాయేందర్, సుగుణాకర్ తదితరులున్నారు. -
బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ప్రమాదం వెంటాడటంతో గాలిలో కలిసిన కూలీల ప్రాణాలుజహీరాబాద్ టౌన్/సంగారెడ్డి క్రైమ్: సొంత ఊరులో పనులు లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చి బతుకు జీవుడా అంటూ సొంతూరుకు వెళ్తుంటే ప్రమాదం వెంటాడటంతో కూలీల నిండు ప్రాణాలు గాలిలో కలిపోయాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామ సమీపంలో 65వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రతీ రోజు జహీరాబాద్ ప్రాంతంలో కూలీ పనులకు వచ్చి తిరిగి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన నిర్మల,నిఖిత,తుల్జమ్మ,చంద్రకళ, రాధిక, శిల్ప, శోభ, రేఖ,శ్రీదేవి, కవిత, రేష్మలు ఆటో డ్రైవర్ దేవిదాస్తో కలిసి కోహీర్ గ్రామానికి వచ్చారు. సోయాబిన్ పంటలో కలుపు పనులు ముగించుకుని పాటలు పాడుకుంటూ తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. 65వ జాతీయ రహదారిపై సత్వార్ సమీపంలో వెనుకనుంచి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవారు కొంతమంది చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దేవిదాస్, కూలీలు శ్రీదేవి,రేఖ,కవిత,రేష్మలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన వారితో గాయపడిన వారి రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహమైంది. చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ భార్య నిఖిత మృతి చెందింది. విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చనిపోయిన వారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 65 నంబర్ జాతీయ రహదారిపై ప్రధానంగా కంది, ఇస్నాపూర్, సంగారెడ్డి(పోతిరెడ్డి పల్లి) చౌరస్తా, పెద్దాపూర్, జహీరాబాద్ అలాగే 161 నంబర్ జాతీయ రహదారి శివంపేట్, సుల్తాన్పూర్, చౌటాకూరు కూడలిలో రహదారులు డేంజర్ స్పాట్లుగా మారాయి. ఈ రహదారుల వద్ద ప్రమాదం జరిగిందని తెలిస్తే ప్రాణం పోయిందని కచ్చితంగా అనుకునే పరిస్థితి నెలకొంది. గ్రామాల నుంచి నిత్యం విద్యార్థులు, వ్యవసాయదారులు, అధికంగా పట్టణానికి రాకపోకలు కొనసాగిస్తుండటంతో నిత్యం ప్రధాన రహదారి చౌరస్తా దాటాల్సిందే. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాలు, పాదచారులు పెద్ద వాహనాల కింద పడి మృత్యువాత పడుతున్నారు. జిహీరాబాద్ ఆస్పత్రిలో మృతదేహాలుప్రమాద ఘటనలో క్షతగాత్రులు... -
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
చింత ప్రభాకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్సంగారెడ్డి: జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. తాము చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్కు సవాల్ విసిరారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడంతో కేసీఆర్, హరీశ్రావు జగ్గారెడ్డిపై కక్ష పెంచుకున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...చింత ప్రభాకర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తారు. సీలింగ్ భూమి రిజిస్ట్రేషన్, దళితుల భూములు, సదాశివపేటలో రోడ్ల కబ్జా, మాలకుంట కబ్జా తదితర అంశాలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో మహిళా కౌన్సిలర్ల పట్ల వ్యవహరించిన తీరుపైనా తప్పుపట్టారు. సదాశివపేటలో ఎక్కడికి రమ్మన్నా మేము అక్కడికి వస్తామని, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైల్
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఎంపీ సురేశ్ షెట్కార్ జహీరాబాద్: హైదరాబాద్–ముంబై బుల్లెట్ రైలును యథాతధంగా జహీరాబాద్ మీదుగానే నడపాలని ఎంపీ సురేశ్ షెట్కార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు మంగళవా రం ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఎంపీ సురేశ్ షెట్కార్ భేటీ అయ్యి వినతి పత్రం సమర్పించారు. ఢిల్లీ–హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ను మొదట ప్రతిపాదించిన విధంగానే సంగారెడ్డి, జహీరాబాద్, షోలాపూర్ మీదుగా కొనసాగించాల ని రైల్వే మంత్రిని కోరారు. ఇటీవల కాలంలో ఈ రూట్ను తాండూరు, వికారాబాద్ల మీదుగా మళ్లించడానికి వస్తున్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని షెట్కార్ మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ సిద్ధం చేసిన ప్రాథమిక సమ గ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ప్రకారమే అసలు రూట్కు కట్టుబడి ఉండాలని మంత్రిని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మూడు కారణాలను సైతం వివరించినట్లు తెలిపారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు
● మూడు ఆస్పత్రులకు నోటీసులు ● మెహర్ ఫిజియోథెరపీ క్లినిక్ సీజ్ సంగారెడ్డి: జిల్లా పరిధిలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మంగళవారం తనిఖీలు చేశారు. సంగారెడ్డి పట్టణంలోని 20 ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య సంస్థలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆస్పత్రుల్లో నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని మన, వెల్నెస్, పరి పేరుతో ఉన్న మూడు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. పోతిరెడ్డిపల్లిలోని మెహర్ ఫిజియోథెరపీ క్లినిక్ రెన్యూవల్ చేసుకోకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో నిబంధనల ప్రకారం క్లినిక్ను మూసివేశారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ఆస్పత్రులు, క్లినిక్లపై నిరంతరం తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. లలితాదేవి తెలిపారు. -
సీఎం సభకు భారీగా జన సమీకరణ
● పది మందికి రేవంత్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ● అధికారులు, నేతలతో మంత్రి ఉత్తమ్, జగ్గారెడ్డి సమీక్ష సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో ఈ నెల 15న జరుగనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగసభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఈ సభ ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి మంగళవారం సెక్రటేరియల్లో మంత్రి సమీక్షించారు. కలెక్టర్ ప్రతీక్జైన్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ...సీఎం ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జిల్లాలో ఉంటారన్నారు. ఈ సభా వేదికపై ఉమ్మడి జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక లబ్ధిదారుడి చొప్పున పది మంది లబ్ధిదారులకు సీఎం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఉత్తమ్ కలెక్టర్ను ఆదేశించారు. -
కాంగ్రెస్ హయాంలోనే జగ్గారెడ్డిపై కేసు
● హరీశ్రావు, బీఆర్ఎస్లకు ఎలాంటి సంబంధం లేదు ● సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గారెడ్డిపై మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పాస్పోర్టు కేసు నమోదైందని, బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేసి పెట్టిన కేసు కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో జగ్గారెడ్డి అరెస్టు అనేది చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందే తప్ప..ఇందులో హరీశ్రావుకు గానీ, బీఆర్ఎస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హరీశ్రావుపై జగ్గారెడ్డి చేసిన ఆరోపణలకు మంగళవారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో చింత ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. చేసిన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు జగ్గారెడ్డి ఎదుటి వారిపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ హోదా లేని జగ్గారెడ్డి ఈనెల 15న జరుగనున్న సీఎం రేవంత్రెడ్డి సభా వేదికపై కూర్చునే అవకాశం లేదనే చికాకు, ఒత్తిడిలో హరీశ్రావుపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల క్రితం జరిగిన రాహుల్గాంధీ సభ కోసం రూ.6.50 కోట్లు అప్పు తెచ్చానంటూ జగ్గారెడ్డి పలుమార్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్ మెప్పు కోసమే ఈ సభ ఏర్పాటు చేశారే తప్ప సంగారెడ్డి ప్రజల కోసం కాదనేది గుర్తుంచుకోవాలని వివరించారు. ఈ సభ పేరుతో ఏదైనా నామినేట్ పదవి కోసం సీఎం రేవంత్రెడ్డి వద్ద సింపతీ కొట్టేసే ప్రయత్నం జగ్గారెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
ఎస్పీ పరితోశ్ పంకజ్సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డులతో పాటు ప్రశంస పత్రాలు అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లలో వినియోగిస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసుల పరిష్కారానికి ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా నిర్ణీత గడువులోగా కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్గా గుర్తించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, వెంకటరెడ్డి, సైదా నాయక్, ప్రభాకర్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.4 లక్షల నిధులు మంజూరు చేయండి
● కలెక్టర్ ప్రతీక్జైన్కు ఎమ్మెల్యే వినతి ● ప్రభుత్వాస్పత్రి కరెంట్ కష్టాలపై ఎమ్మెల్యే సీరియస్ పటాన్చెరు: పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో విద్యుత్ సమస్యలు తొలగించేందుకు తక్షణమే రూ.4 లక్షల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కలెక్టర్ ప్రతీక్జైన్కు మంగళవారం విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తి రోగులు ఇబ్బందులు పడుతున్న ఘటనపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆస్పత్రి ఆర్ఎంఓ శ్రీనివాస్, వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్షించారు. ఆస్పత్రిలో విద్యుత్ సమస్య తలెత్తినా జనరేటర్ పనిచేయకపోయినా ఈ విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభించి, ఆస్పత్రిలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వైద్య సదుపాయాలు, రోగులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించేందుకు త్వరలోనే ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. -
రోడ్డు నిర్మించకుంటే ధర్నా చేస్తాం
పాపన్నపేట(మెదక్): మెదక్ –బొడ్మట్పల్లి ప్రధాన మార్గంలో కొత్తపల్లి బ్రిడ్జి పక్కన వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం చేయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆమె కొత్తపల్లి బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిపై, కనీసం అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గు చేటన్నారు. వారం లోగా రోడ్డు పనులు ప్రారంభించకుంటే భారీ ఆందోళన నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పదవిలోకి వచ్చి రెండేళ్ల తొమ్మిది నెలలు గడిచినా కొత్తపల్లి బ్రిడ్జిపై కనీసం అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. రోడ్డు లేకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కలెక్టర్, ఆర్అండ్బీ అధికారులు, ఎమ్మెల్యే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వీరి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్న్ వెంకటరామిరెడ్డి, కాశీనాథ్రావు, మాజీ సర్పంచ్లు శ్రీనాథ్రావు, మల్లేశం, నాయకులు సోములు, దుర్గయ్య, అనిల్రెడ్డి, బాబాగౌడ్, శ్రీనివాస్గౌడ్, రాము, సామేల్, మల్లేశం, చంద్రన్న ఉన్నారు. -
ఘనంగా హర్ ఘర్ తిరంగా
జిన్నారం (పటాన్చెరు): ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పట్టణ కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి హాజరై, నాయకులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటేష్, కో–ఆప్షన్ సభ్యులు నర్సింగ్ రావు, శ్రీనివాస్ యాదవ్, దుబ్బా శ్రీనివాస్, చిత్తారి యాదవ్, భిక్షపతి, రాజు, లక్ష్మణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
న్యాల్కల్ (జహీరాబాద్): ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సైదా నాయక్ సర్పంచ్లకు సూచించారు. మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంతు, ఎస్ఐ దోమ సుజిత్తో కలిసి ఆయా గ్రామాల సర్పంచ్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాల్కల్ మండలం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టాలన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని కోరారు. నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వాటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు కోసం గ్రామ పంచాయతీ నిధులను వినియోగించడంతో పాటు, దాతల ద్వారా విరాళాలు సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్లు శ్రీకాంత్ రెడ్డి, అశ్విన్ పాటిల్, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధాకర్, సుకుమార్, రమేష్, నాయకులు ప్రవీణ్ కుమార్, యాదవ రావు పాటిల్, మోహన్ రెడ్డి, నగేష్, షబ్బీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ సైదా నాయక్ సూచన -
రోడ్డు ప్రమాదంలో కారోబార్ మృతి
పాపన్నపేట(మెదక్): రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాపన్నపేటకు చెందిన ఆకుల కృష్ణ(40) స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కారోబార్గా పని చేస్తున్నాడు. బంధువుతో కలిసి బైక్పై పాపన్నపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో యూసుఫ్పేట శివారులో మెదక్ వైపు బైక్పై వెళ్తున్న ముస్లాపూర్ వాసులు ఢీకొట్టారు. దీంతో కృష్ణ బైక్ పైనుంచి ఎగిరి పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో మెదక్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి సైతం గాయాలయ్యాయి. మృతుడు కృష్ణకు భార్య, కూతురు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ అదుపుతప్పి.. జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.లవకుమార్ కథనం ప్రకారం.. కర్నాటక బీదర్ పట్టణంలోని మంగల్పేటకు చెందిన అమోస్(27) తల్లి అనిత, కూతురు సన్నిధితో కలిసి ఈ నెల 9న జహీరాబాద్ పట్టణ సమీపంలో హుగ్గెల్లి చౌరస్తా వద్ద గల కల్వరీ టెంపుల్కు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో పస్తాపూర్ శివారులో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో అమోస్తో పాటు అతడి తల్లి, కూతురుకు గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్లో వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమోస్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బీదర్కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కారు ఢీకొట్టడంతో గాయాలు మునిపల్లి(అందోల్): కారు ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్ఐ అరవింద్ కథనం ప్రకారం.. రాయికోడ్ మండలం జౌరంగా నగర్ గ్రామానికి చెందిన బేగరి నర్సింహులు తన బైక్పై సదాశివపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని కంకోల్ శివారులో కారు ఢీకొట్టడంతో అతడికి గాయాలయ్యాయి. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. నర్సింహులు అన్న నరేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ద్విచక్ర వాహనం పైనుంచి పడిన వ్యక్తికి .. మునిపల్లి(అందోల్): ద్విచక్ర వాహనం పైనుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. బుదేరా ఎస్ఐ అరవింద్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి పిల్లోడి గ్రామానికి చెందిన సాయిలు (30) పొల్కంపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 112కు సమాచారం రావడంతో రక్తపు మడుగులో ఉన్న సాయిలును ఏఎస్ఐ అంజయ్య, హోంగార్డులు సదాశివపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సాయిలు బంధువులకు సమాచారం ఇచ్చారు. -
స్మార్ట్కు శ్రీకారం..
ఇక్కడి నుంచే సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ఈనెల 15న బహిరంగ సభను నిర్వహించి.. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బహిరంగసభ నిర్వహించాలని తలపెట్టిన అంబేద్కర్ స్టేడియాన్ని సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ పరితోష్లు పరిశీలించారు. సభా వేధిక, సభకు హజరయ్యే వారికి కుర్చీలు, ఇతర సౌకర్యాలపై జగ్గారెడ్డి కలెక్టర్తో చర్చించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు.. ఇలా భద్రత పరమైన ఏర్పాట్లను ఎస్పీ పరితోశ్పంకజ్ పరిశీలించారు. సీఎం హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్లో జిల్లాకు రానున్న నేపథ్యంలో తారా డిగ్రీ కాలేజీ హెలీప్యాడ్ను కూడా సందర్శించారు. జిల్లాకు వచ్చిన 4.46 లక్షల స్మార్ట్ కార్డులు.. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు ప్రభుత్వం కార్డుదారులకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను అందించనున్నారు. ఏటీఎం కార్డు తరహలో ఉండే ఈ కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, కార్డు నెంబర్తో పాటు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే కార్డుదారుని కుటుంబసభ్యుల సమగ్ర వివరాలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 4.46 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఈ 4.46 స్మార్ట్ కార్డులు ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు చేరుకున్నాయి. భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు సీఎం సభకు భారీగా జన సమీకరణ చేయాలని ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వీలైనంత ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులను ఈ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ఈ సభకు జనసమీకరణ చేపట్టనున్నాయి. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలకు నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ సభకు తరలించే అవకాశాలున్నాయి. ఈనెల 15న జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్రెడ్డి లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీకి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లా నుంచిజన సమీకరణకు సమాయత్తం కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి అర్హులందరికీ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారందరికీ ప్రభుత్వం తెల్ల రేషన్కార్డులు పంపిణీ చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్రెడ్డిల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం, మంత్రులకు ఘన స్వాగతం పలుకుతాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన వారికి రేషన్కార్డులు అందలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నాం. – జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ -
నిర్మాణ రంగంలో ‘భారతి సిమెంట్’ రారాజు
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్సిద్దిపేటజోన్: సిమెంట్ వ్యాపారరంగంలో తిరుగు లేని సంస్థగా వికాట్ గ్రూపు భారతి సిమెంట్ ఎదుగుతుందని సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీమంజునాధ ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోల్చితే భారతి అల్ట్రా ఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తి అవుతుందన్నారు. అల్ట్రా ఫాస్ట్ స్లాబులు, ఫిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి సరైన ఎంపిక అని గుర్తు చేశారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్ ధరల కంటే రూ. 20 అధికంగా ఉంటుందని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా డీలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... భారతి సిమెంట్ సర్వీస్ చాలా వేగవంతంగా ఉంటుందని, అధికంగా అమ్మకాలు అవుతున్నట్టు పేర్కొన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సాంకేతిక సలహాలు, సూచనలను ఇచ్చి సహాయపడుతారన్నారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ. లక్ష ఉచిత ప్రమాద బీమా పత్రాలను సంస్థ ద్వారా పంపిణీ చేశారు. ఈ సమావేశంలో భారతి సిమెంట్ డీలర్ శ్రీకాంత్, సుమారు 50 మందికి పైగా తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
భర్త చేసిన అప్పులు తీర్చలేక..
భార్య బలవన్మరణంకొల్చారం(నర్సాపూర్): కట్టుకున్నవాడు వ్యసనాలకు లోనవడం..చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, తీవ్ర మనస్తాపానికి గురైన భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోరంపల్లి దుర్గయ్య–లక్ష్మి దంపతుల పెద్ద కూతురు కృష్ణవేణి(38)ని, అదే గ్రామానికి చెందిన డొంకెన కృష్ణతో 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా కృష్ణ ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరిగేవాడు. అక్కడక్కడ అప్పులు సైతం చేశాడు. కృష్ణవేణి కుటుంబ పోషణ కోసం కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కాగా భర్త చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురవుతూ తనలో తాను మదన పడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఉదయం పిల్లలు బయటకు వెళ్లగానే కృష్ణవేణి ఇంట్లోని దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వ్యాపారం నడవకపోవడంతో.. జహీరాబాద్ టౌన్: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. టౌన్ ఎస్ఐ.లవకుమార్ కథనం ప్రకారం.. ఐడీఎస్ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్న కచేరి తాజోద్దీన్(41)డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఫైనాన్స్లో అప్పు చేసి బొలెరో కొనుగోలు చేశాడు. వ్యాపారం లేక చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న ఎండీ. గౌసోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
భరత్ భూషణ్కు పీహెచ్డీ
పటాన్చెరు: ఇంటెలిజెంట్ ఐఓటీ నెట్వర్క్ ఆప్టిమైజేషన్పై పరిశోధన చేసిన ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి యన్నం భరత్ భూషణ్ పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించారు. ‘ఐఓటీ నెట్వర్క్లో ఉమ్మడి వనరుల కేటాయింపు, రద్దీ–అవగాహన హైబ్రిడ్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు’ అంశంపై ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినట్లు గైడ్ డాక్టర్ అపర్ణ తెలిపారు. మెటాహ్యూరిస్టిక్ అల్గారిథమ్లు, క్రాస్–లేయర్ ఆప్టిమైజేషన్, ఎడ్జ్–ఫాగ్–క్లౌడ్ కంప్యూటింగ్ సమన్వయంతో లేటెన్సీ తగ్గించి, నెట్వర్క్ జీవితకాలాన్ని పెంచినట్లు పేర్కొన్నారు. భరత్ను గీతం అధికారులు, అధ్యాపకులు అభినందించారు. పాపం చిన్నారి.. పాత తలుపుల రూపంలో కబళించిన మృత్యువు వెల్దుర్తి(తూప్రాన్): అప్పటి వరకు ఇంటి ముందు తోటి పిల్లలతో సరదాగా ఆడుకున్న చిన్నారి.. కాసేపటికే విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. పంచాయతీ కార్మికుడు యేసు కుమార్తె అలేఖ్య (7) సోమవారం ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో అక్కడే పక్కన ఉంచిన పాత తలుపు, డోర్ ఫ్రేమ్ను ఎక్కేందుకు చిన్నారి ప్రయత్నించింది. ఒక్కసారిగా ఆ తలుపు, ఫ్రేమ్తో సహా చిన్నారిపై పడటంతో ముఖాని కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను తూప్రా న్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకు న్న కుమార్తె అనూహ్యంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. భద్రాచల రామయ్య తలంబ్రాల పంపిణీ ప్రశాంత్నగర్(సిద్దిపేట): భద్రాచల సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలను సోమవారం, జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో భక్తులకు పంపిణీ చేశారు. సిద్దిపేట నుంచి 300 కిలోల గోటి తలంబ్రాలను భక్తులు భద్రాచలం ఆలయానికి పంపించగా, ప్రత్యేక పూజల అనంతరం భద్రాచలం నుంచి సిద్దిపేటకు 100కిలోల ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ ద్వారానికి స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ది చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రధాన ద్వారాలకు స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కోనేరు పక్కనున్న, కొండపైన కొలువైన స్వామివారి గర్భాలయాకు జీడిపల్లి వాసి దోమకొండ వెంకటరమణ స్టీల్ గ్రిల్స్ను ఏర్పాటు చేయించారు. ఆలయ అభివృద్ధికి దాతలు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఆలయ ఈఓ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు ధనుంజయ్శర్మ కోరారు. మర్రికుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని హనుమతండా గ్రామ పంచాయతీ పరిధి లో గల మర్రికుంట నుంచి కొంత మంది అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సోమవారం అక్రమ మట్టి తరలింపుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దూల్మిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి మాట్లాడుతూ.. ఓ ఇటుక వ్యాపారి తన స్వలాభం కోసం కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో చెరువులో నుంచి అక్రమంగా మట్టిని తీస్తున్నట్లు తెలిపారు. అధికారుల అండదండలతోనే మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములుసంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ. దేశం అభివృద్ధి చెందాలంటే దానంతట అదే అభివృద్ధి కాదని, వ్యవసాయరంగం ప్రధాన వనరు అన్నారు. ప్రస్తుతం వ్యవసాయరంగం కుచించుకుపోతుందని, స్వేచ్ఛ, వాణిజ్యం ఒప్పందాల పేరుతో విదేశాలతో మన భారత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందన్నారు. గుజరాత్కు చెందిన ఆదానీ, అంబానీలు ఈ దేశాన్ని ఏలుతున్నారని ఆరోపించారు. వీళ్లకు ఏది కావాలంటే అది మోదీ చేసి పెడుతున్నాడని, మన గనులు, మన బొగ్గు దోచిపెట్టడంతో పాటు బ్యాంకుల నుంచి కావలసిన రుణాలు అందిస్తున్నాడని ఆరోపించారు. కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజలు కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, సహాయ కార్యదర్శి యాద గిరి, వ్యకాస నాయకుడు అశోక్, యూనియన్ల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరిక
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు వడ్డే శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, బాబు గౌడ్, వాజీద్లు పాల్గొన్నారు. నర్సాపూర్: పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ మాత ఆలయంలో ఆషాఢం మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజల్లో భక్తులు, పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో న్యాయమూర్తి శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామిని నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి హేమలత కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక సిబ్బంది న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వాదం అందజేశారు. ఈ మేరకు ఆలయ విశిష్టత గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, పధాన అర్చకులు ధనుంజయ్శర్మ, విద్యాకర్చారి, జూనియర్ సహాయకులు నర్సింహారెడ్డి ఉన్నారు. ● జిల్లాలో ముగిసిన ‘సర్’ ప్రక్రియ ● మెదక్లో 18,691, నర్సాపూర్లో 24,230 ఓట్లు ● ఓవరాల్గా తగ్గిన 9 శాతం మెదక్జోన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారం సాయంత్రానికి ఈ ప్రక్రియ ముగిసింది. ఓవరాల్గా జిల్లాలో 42,921 ఓట్లను తొలగించారు. అందులో నర్సాపూర్లో నియోజకవర్గంలో 24,230 ఓట్లను తొలగించగా, మెదక్లో 18,691 ఓట్లు తగ్గాయి. ఈ లెక్కన ఓవరాల్గా 9శాతం ఓట్లు తొలగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాలన్నాయి. వీటి పరిధిలో 4,53,140 మంది ఓటర్లు ఉండగా, సర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటర్కు ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్ఓలు అందించారు. కాగా తిరిగి ఇచ్చినవి మాత్రం 4,10,219 మంది ఓటర్లు మాత్రమే. ఈ లెక్కన 42,921 మంది ఓటర్లు ఇవ్వలేదు. ఇందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 2,32,713 మంది ఓటర్లు ఉండగా 2,08,483 మంది మాత్రమే ఫారంలు తిరిగి ఇవ్వగా 24,230 ఓట్లు తొలగిపోయాయి. అంటే 89.51 శాతం మాత్రమే డిజిటలైజేషన్ అయింది. 10.49 శాతం మంది ఓటర్లు తగ్గారు. అలాగే మెదక్ నియోజకవర్గంలో 2,20,427 మంది ఓటర్లకు గానూ ఎన్యూమరేషన్ ఫారంలు తిరిగి ఇచ్చినవి 2,01,736 మంది మాత్రమే. అంటే18,691 మంది ఓట్లు తొలగిపోయాయి. దీంతో 91 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తికాగా 9 శాతం ఓట్లు తొలగిపోయాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కలిపి 9 శాతం ఓట్లు తొలగిపోయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేశాయి. రవీంద్రశర్మకు అవార్డు ప్రదానం తూప్రాన్: పట్టణానికి చెందిన సొమయాజుల రవీంద్రశర్మకు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సంఘం అధ్యక్షుడు శలాఖ రాజేశ్వరశర్మ ‘సహస్ర యాగ బ్రహ్మ’ బిరు దును ప్రదానం చేశారు. కార్యక్రమం రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడు మోత్కురి రామేశ్వరరావు సమక్షంలో నిర్వహించారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
కేబీఆర్ లైఫ్కేర్ ఆస్పత్రిలో తనిఖీలు
● ల్యాబోరేటరీ, స్కానింగ్ రూమ్ సీజ్ ● నిబంధనలు పాటించకుంటే చర్యలే ● జిల్లా వైద్యాధికారి లలితాదేవిసంగారెడ్డి: ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని, జిల్లా వైద్యాధికారి లలితాదేవి హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలోని కేబీఆర్ లైఫ్కేర్ ఆస్పత్రిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా. కె. లలితాదేవి, డా. దీప్తి, డా. ఎ. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. ఆసుపత్రి ల్యాబోరేటరీలో గడువు ముగిసిన కిట్లు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. గడువు ముగిసిన కిట్లను వినియోగించడం వల్ల పరీక్షా ఫలితాలపై ప్రభావం పడటంతో పాటు రోగుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున ల్యాబోరేటరీని అధికారులు సీజ్ చేశారు. అలాగే ఆసుపత్రిలోని స్కానింగ్, అల్ట్రాసౌండ్ విభాగం అనుమతి రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగుస్తున్నప్పటికీ, అనుమతిని పునరుద్ధరించేందుకు అవసరమైన దరఖాస్తు చేయనందున స్కానింగ్ సేవలు నిర్వహించకుండా అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు, రోగుల భద్రతా నిబంధనలు, చట్టపరమైన అనుమతులను పాటించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన మందులు, ల్యాబోరేటరీ కిట్లు లేదా ఇతర వైద్య సామగ్రిని వినియోగించడం, చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
ప్రతీ బిడ్డ ఆరోగ్యమే ప్రధానం
● 300 మంది గర్భిణులకు ప్రొటీన్ కిట్లు పంపిణీ ● నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కొల్చారం(నర్సాపూర్): ప్రతీ తల్లి ఆరోగ్యంగా ఉండటం, ప్రతీ బిడ్డ ఆరోగ్యంగా జన్మించడం సమాజ బాధ్యత అని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు, రంగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని 21 గ్రామాలకు చెందిన 300 మంది గర్భిణులకు ’ రాజన్న ఫౌండేషన్ ’ ఆధ్వర్యంలో మాతృదేవోభవ కానుక పేరిట ప్రొటీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. గర్భిణులకు అవసరమైన పోషకాహారం అందించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ‘‘మాతృదేవోభవ’’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రొటీన్ కిట్ల ద్వారా అందించిన పోలిక్ యాసిడ్ సిరప్లను, బలవర్ధకమైన పదార్థాన్ని ప్రతిరోజు తీసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణులతో కలిసి భోజనం చేసి, వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మధుసూదన్ రెడ్డి, వెంకట్ గౌడ్ , సంగమేశ్వర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీరాములు, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏసు రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణ, శ్రీశైలం పాల్గొన్నారు. -
ఘనంగా బండ్ల బోనాలు
నర్సాపూర్: నర్సాపూర్లో ఘనంగా ఘనంగా బండ్లు బోనాలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. పట్టణంలోని గ్రామ దేవతలు భూలక్ష్మమ్మ, దుర్గమ్మ, నల్లపోచమ్మకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. బండ్లు, బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఫలహారం బండ్లు ఏర్పాటుచేసి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవులరాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినీరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీయాదవ్, రఘువీరారెడ్డిలతో పాటు ఆయా పార్టీల నాయకులు కౌన్సిలర్లు వేర్వేరుగా పాల్గొని పూజలు చేశారు. -
బీరంగూడ గుట్టపై శతరుద్రాభిషేకం
పటాన్చెరు టౌన్: అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురవడం, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 మంది అర్చకులు, వేద పండితులు పాల్గొని స్వామివారికి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి దేవనాదం, ప్రధాన అర్చకులు ప్రహ్లాద, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
అనవసర లింక్లపై క్లిక్ చేయొద్దు
చిలప్చెడ్(నర్సాపూర్): మొబైల్స్లో వచ్చే అనవసర లింక్లను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల మాయలో పడొద్దని ఎస్ఐ నర్సింహులు పేర్కొన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల కేజీబీవీ విద్యార్థులకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్, షీటీం, పోక్సో తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. బ్యాంకు ఖాతా, ఓటీపీలు, వ్యక్తిగత వివరాల కోసం ఎవరైనా కాల్ చేస్తే, వారికి ఎలాంటి వివరాలు ఇవ్వొద్దని సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని, తప్పనిసరిగా వారికి ఫోన్ ఇవ్వాల్సి వస్తే తల్లితండ్రుల సమక్షంలోనే ఇవ్వాలన్నారు. మహిళలను, బాలికలను వేధింపులకు గురిచేస్తే షీటీంను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యుడు సూరి, ఉపాధ్యాయ సిబ్బంది కీర్తి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం
పటాన్చెరు టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని, లేనిపక్షంలో గుణపాఠం తప్పదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ హెచ్చరించారు. దేశవ్యాప్త ’జైల్ భరో’ పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలోని పీఎఫ్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పన్నెండేళ్లు గడుస్తున్నా.. ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసినట్లే.. లేబర్ కోడ్స్ను కూడా రద్దు చేసేవరకు కార్మిక లోకం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. అలాగే, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు సాగించిన పోరాటాల ఉధృతికి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఉపాధి కూలీల పొట్టకొట్టేలా ఉన్న ’వీబీ జీ రాంజీ’ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు మానిక్ మాట్లాడుతూ విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ. 42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు వాజిద్ అలీ, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, అర్జున్, జిల్లా కమిటీ సభ్యులు రాజు, శాంత్ కుమార్, సుధాకర్, శ్రీధర్, నాయకులు రామ్మోహన్ రెడ్డి, గంగాధర్, ఏడుకొండలు, భరత్ పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ -
అంతు చిక్కని అదృశ్యం
● జిల్లాలో పెరిగిన మిస్సింగ్ కేసులు ● దొరకని తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీసంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి జిల్లాలో 33 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై వరకు 416 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి, పటాన్చెరు పోలీస్ స్టేషన్న్లలో కేసులు అవుతున్నాయి. ఎక్కువగా మిస్సింగ్ కేసుల్లో ఒంటరి మహిళలు, విద్యార్థినులు, ఐటీ ఉద్యోగులు, వృద్ధులు ఉంటున్నారు. దీంతో పోలీసులకు వారి ఆచూకీ గుర్తించడం కష్టంగా మారుతోంది. జిల్లాలో పరిశ్రమలు విస్తరించడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందినవారు తమ గ్రామాల్లో ఉపాధి కరువై జిల్లాకు వలస వస్తున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ పట్టణానికి వచ్చే ఒంటరి మహిళలు, పిల్లలు, వృద్ధులు తమ వారి జాడ తెలియక అనాథలుగా మారుతున్నారు. కుటుంబ కారణాలతో ప్రేమ విఫలమై, ఒత్తిడి, ఉద్యోగం(జాబ్) లేక మరికొందరు అదృశ్యమవుతున్నారు. 24 గంటల్లో కేసు నమోదు చేస్తే.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలను ఉపయోగించి పోలీస్ అధికారులు చాలా వరకు 24 గంటల్లోనే మిస్సింగ్ కేసులను చేధిస్తున్నా.. మరికొందరి ఆచూకీ మాత్రం ఏళ్లు గడుస్తున్నా అంతు చిక్కడం లేదు. మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే కేసుల వివరాలు కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ వివరాల బోర్డు -
ఐబీ భవనాన్ని కూల్చిన వారిపై చర్యలు
కంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కందిలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఆర్ అండ్ బీ (ఐబీ) భవనాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సదరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు కలసి ఆర్ అండ్ బీ భవనం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆర్ అండ్ బీ అధికారుల నుంచి ఎలాంటి ఎన్ఓసీ తీసుకోకుండా భవనాన్ని ఎలా కూలుస్తారన్నారు. భవనాన్ని కూల్చివేసిన ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆర్ అండ్ బీ భవనంలో ఉన్న నాణ్యమైన టేకు కలప, ఇటుకలు, పునాది రాళ్లు, డోర్లు, కిటికీలు, రేకులు అన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భవనాన్ని ఇష్టారాజ్యంగా కూల్చివేసిన వాహనాలు, ఆ వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్గౌడ్, ఖాజాఖాన్, వడ్ల రవి, ఆనంద్రావు, కరీంఖాన్, జానీపాషా, ఆర్టీసీ నవాజ్, అర్జున్, సజ్జత్, బైండ్లనరసింహులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంది గ్రామస్తుల డిమాండ్ -
గోమారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ
శివంపేట (నర్సాపూర్): మండల పరిధిలోని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామైన గోమారంలో బోనాల ఉత్సవాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామాల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో గొడవ ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకుంటూ దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గొడవలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. ఎస్సై మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో అదనపు పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి నారాయణఖేడ్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి పేర్కొన్నారు. ఖేడ్లో ఆదివారం నిర్వహించిన సంఘం డివిజన్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీ సీపీఎస్ రద్దును పూర్తిగా మర్చిపోయారన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి డీఏ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరారు. ప్రీ ప్రైమరీ బడుల్లో కొత్త నియామకాలు పూర్తి చేయాలన్నారు. సంఘం రాష్ట్ర సేవ కో– కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా, డివిజన్ బాధ్యులు వినయ్, రాజయ్య, రాజశేఖర్, రతన్సింగ్, మశ్చందర్, మహేశ్, పద్మనాభం, రాజు, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
17న ముసాయిదా జాబితా
సంగారెడ్డి జోన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నారు. 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరిస్తారు. అనంతరం తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. జూన్ 25 నుంచి జిల్లావ్యాప్తంగా సర్ ప్రక్రియ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 14,57,436 మంది ఓటర్లు ఉన్నారు. రెండుసార్లు గడువు పెంపు ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు అందించేందుకు ఎన్నికల సంఘం రెండుసార్లు గడువు పెంచింది. గత నెల 24న చివరి తేదీ ఉండటంతో పది రోజులు గడువు పెంచుతూ ఆగస్టు 3 చివరి తేదీ ప్రకటించింది. మరోసారి 7 రోజులు పెంచుతూ ఆగస్టు 10 వరకు ఫారాలు సమర్పించేందుకు గడువునిచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారంతో ఫారాల స్వీకరణ గడువు ముగుస్తుంది. బోగస్ ఓట్లను ఏరివేసి, కచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితాను రూపకల్పన చేసేందుకు చర్యలు చేపట్టారు. 79.17% డిజిటలైజేషన్ పూర్తి జిల్లావ్యాప్తంగా 79.17% ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో 100% డిజిటలైజేషన్ పూర్తికాగా జహీరాబాద్లో 1.59, సంగారెడ్డిలో 8.18, పటాన్చెరులో 12.71% పెండింగ్లో ఉంది. జిల్లాలో ఇంకా 79,803 మందిని గుర్తించి ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. తగ్గనున్న 2,23,212 మంది ఓటర్లు జిల్లాలో 2,23,212 మంది ఓటర్లు తగ్గనున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 40,124 మంది మృతి చెందినట్లుగా గుర్తించారు. జహీరాబాద్లో అత్యధికంగా 9,683, నారాయణఖేడ్లో 5,359 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 27,891 మంది ఓటర్లను గుర్తించలేదు. 1,16,204 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నవారు 34,913గా తేలింది. ఫారాలు పోగొట్టుకొని, తమకు ఓటు హక్కు అవసరం లేదని, ఇతర కారణాలతో 4,079 మంది ఉన్నారు. మిగిలింది ఒక్కరోజే జహీరాబాద్ టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ మండలాల్లో దాదాపు పూర్తికావస్తుండగా మున్సిపల్లో మాత్రం వెనుకబడింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలున్నాయి. జహీరాబాద్ మండలంలో 37,224 ఓటర్లు ఉండగా 100%, ఝరాసంగం మండలంలో 37,363 మంది ఓటర్లు ఉండగా 99% న్యాల్కల్ మండలంలో 62 బూత్ల్లో 49,141 మంది ఓటర్లు ఉండగా 99.94%, కోహీర్ మండలంలో 44 బూత్లకు 37,885 ఓటర్లు 99.11%, కోహీర్ మున్సిపాలిటీలో 99.69%, జహీరాబాద్ మున్సిపాలిటీలో 73 బూత్లకు 79.742 మంది ఓటర్లకు 97%, మొగుడంపల్లి మండలంలో 99.88% పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. సవాల్గా మారిన 79,803 ఓటర్ల డిజిటలైజేషన్ గత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో ఉన్న 79,803మంది ఓటర్లు డిజిటలైజేషన్ అధికారులకు సవాల్గా మారింది. ఇప్పటివరకు వీరి ఆచూకీ గుర్తించలేకపోయారు. వీరందరూ ఇతరప్రాంతాల్లో ఉన్నారా లేదా, మృతి చెందారా లేదా, ఓటు హక్కు వద్దు అనుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో పటాన్చెరులో 54,489, సంగారెడ్డి 20,827, జహీరాబాద్లో 4,487 మంది ఆచూకీ తెలియలేదు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిశ్రమల్లో ఇతర ప్రాంతాల వారు ఉండటంతో ఫారాలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. పెరుగనున్న పోలింగ్ కేంద్రాలు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాన్ని రేషనలైజేషన్ చేస్తున్నారు. అవసరమైన చోట కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 1,633 కేంద్రాలు ఉండగా రేషనలైజేషన్ అనంతరం కొత్తగా 16 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ లెక్కన 1,649 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. నేటితో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ పూర్తి 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు కొత్తగా ఏర్పాటు కానున్న 16 పోలింగ్స్టేషన్లు పూర్తికావస్తున్న ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పెండింగ్లో 2,843 పత్రాలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడానికి ఒక్క రోజు మిగిలింది. పత్రాలు ఇవ్వని వారు వెంటనే సమీప బీఎల్ఓలకు ఇవ్వాలి. రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకారించాలి. మండలాలో్ల్ డిజిటలైజేషన్ ప్రక్రియ బాగుండగా మున్సిపల్లో కొంత వెనుకబడింది. ఇంకా 2,843 పత్రాలు పెండింగ్లో ఉన్నాయి. –పి.దశరథ్,తహసీల్దార్ ,జహీరాబాద్ -
ఉన్నత చదువులకు ఓపెన్ యూనివర్సిటీ
అడ్మిషన్ గడువు సెప్టెంబర్ 9వరకు..సిద్దిపేటఎడ్యుకేషన్: గృహిణులు, ఉద్యోగులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి ఉన్నత చదువుల కలను సాకారం చేసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనియర్సిటీ ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అడ్మిషన్లకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ.. అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 9వరకు పొడిగించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ డిప్లమాలకు అడ్మిషన్లు ఉన్నట్లు చెప్పారు. ఆధార్కార్డ్, మార్కుల జాబితాలు, ధ్రువపత్రాలతో పాటు రెండు పాస్ ఫొటోలతో ప్రాంతీయ విద్యా కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. -
మానవత్వం చాటిన దుబ్బాక ఎమ్మెల్యే
మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అచేతనంగా పడి ఉన్న క్షత్రగాత్రులకు సపర్యలు చేసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి క్రాస్ రోడ్డు శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. భూంపల్లి గ్రామానికి చెందిన బోయిని చంద్రయ్య దంపతులు ఆదివారం భూంపల్లి నుంచి, చేగుంట మండలంలోని బోనాల కొండాపూర్కు ఎక్సెల్పై బయలుదేరారు. ఈ క్రమంలో భూంపల్లి క్రాస్ రోడ్డు దాటిన తర్వాత చిన్న వాగు బ్రిడ్జిపై వాహనం అదుపుతప్పి కిందపడటంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పడి ఉన్న దంపతులను అటుగా వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి గాయాలపాలైన దంపతులకు మంచినీరు తాగించి సపర్యలు చేశారు. వెంటనే అంబులెన్సును రప్పించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆసుపత్రికి ఫోన్ చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా వైద్యులను ఆదేశించారు. -
విద్యార్థుల మధ్య ఘర్షణ
సీపీఎస్ను రద్దు చేయాలిఆందోళనకు దిగిన తల్లిదండ్రులుపీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి మెదక్ కలెక్టరేట్: ఈ నెలాఖరులోగా సీపీఎస్ను రద్దుచేసి ఉపాధ్యాయులకు పాతపెన్షన్ను అమలు చేయాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్తోపాటు పీఆర్సీని అమలు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుభాష్ రెడ్డి, రఘుబాబు, నరేందర్ రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. జిన్నారం (పటాన్చెరు): ఇంటర్మీడియెట్, పదవ తరగతి విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఆందోళనకు దారి తీసింది. శనివారం గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిన్నారం పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. తిరిగి ఆదివారం ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. కాగా నచ్చజెప్పేందుకు వచ్చిన ఉపాధ్యాయుడిని సైతం విద్యార్థులు నెట్టి వేయడంతో కిందపడ్డాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఇరువర్గాల విద్యార్థులకు చదువుకునే వయసులో ఇలాంటి గొడవలు సరికాదని మందలించారు. దీంతో తమ పిల్లలపై తీవ్రంగా దాడి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. అయితే జరిగిన విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య, సీఐ రమణారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో సద్దుమనిగింది. కాగా ప్రిన్సిపాల్ ఇరువర్గాల మధ్య గొడవకు కారణాలు తేల్చేందుకు ఉపాధ్యాయులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఘర్షణకు బాధ్యులైన విద్యార్థులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
ప్రత్యేక అలంకరణలో రేణుక ఎల్లమ్మ
భక్తులతో కిటకిటలాడిన ఆలయం పటాన్చెరు టౌన్: ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా పటాన్చెరు శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బోనాలు ఎత్తుకుని భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారిని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మహేశ్ తెలిపారు. -
విద్యుత్ వైర్ చోరీ
అక్కన్నపేట(హుస్నాబాద్): ఓ వ్యవసాయ బావి వద్ద విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన మండల ంలోని రామవరం గ్రామంలో ఆదివా రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ఎడబోయిన గన్నారెడ్డి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న బావి వద్ద దొంగలు పడ్డారు. బోరు బావి వద్ద ఉన్న స్టార్టర్ వైర్, పీజును కట్ చేసి సుమారుగా 30మీటర్లకుపైగా విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మాచిరెడ్డిపల్లి శివారులోని గల్లా చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ వెంకటేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బేగారి మహేశ్ కుమార్ (25) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం గల్లా చెరువులో మృతదేహం తేలి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన జెగ్గం మహేందర్(30) గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈనెల 6న వర్గల్ నుంచి గజ్వేల్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని సంగాపూర్ మసీద్ వద్దకు రాగానే వర్షం వస్తుండడంతో రోడ్డుపై బైక్ అదుపుతప్పింది. దీంతో కిందపడడంతో తలకు గాయాలయ్యాయి. వెనకే వచ్చిన సమీప బంధువైన గుంటుపల్లి బాబు కిందపడి ఉన్న మహేందర్ను గుర్తించి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రాపురం(పటాన్చెరు): కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సీఐటీయూతోనే సాధ్యమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ఆదివారం భారతినగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీ ఫంక్షన్ హాలులో జరిగిన కిర్బీ పరిశ్రమ కార్మికుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిర్బీ పరిశ్రమలో చారిత్రాత్మక వేతన ఒప్పందం జరిగిందని తెలిపారు. తాజా ఒప్పందంతో 117 మంది క్యాజువల్ కార్మికులు పర్మినెంట్ కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.మల్లికార్జున్, జిల్లా కోశాధికారి కే.రాజయ్య, నాయకులు మాణిక్, రాజు తదితరులు పాల్గొన్నారు. కౌడిపల్లి: అట్రాసిటీ కేసులో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ ఆదివారం విచారణ చేశారు. కౌడిపల్లికి చెందిన ఓ వ్యాపారి తనను కులం పేరుతో దూషించాడని కూకుట్లపల్లికి చెందిన నీరుడి బాగయ్య ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు డీఎస్పీ కౌడిపల్లికి వచ్చి విచారణ చేశారు. ముగ్గురు మహిళా కార్మికులకు గాయాలు జహీరాబాద్ టౌన్: మహిళా కార్మికులతో వెళ్తున్న స్కార్పియో బోల్తాపడిన సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు ఇలా.. కోహీర్ మండలంలోని వెంకటాపూర్ వద్ద గల గ్లోబల్ గ్రీన్ కంపెనీలో పనిచేయడానికి జహీరాబాద్ పట్టణం నుంచి రోజూ మాదిరిగా కార్మికులు వెళ్తున్నారు. ఈ క్రమంలో మహిళా కార్మికులతో వెళ్తున్న స్కార్పియో ఆదివారం హుగ్గెల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. వాహనంలో ఉన్న ముగ్గు రు గాయపడ్డారు. ఓ మహిళ ఎడమచేతికి తీవ్ర గాయమైంది. వాహనదారులు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘గజ్వేల్ రన్నర్స్’ ప్రతిభ
గజ్వేల్రూరల్: హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన హాఫ్ మారథాన్ రన్లో గజ్వేల్ రన్నర్స్ పాల్గొని సత్తా చాటారు. ఎస్ఎంఏ(స్పైనల్ మస్క్యూలర్ ఆంట్రోపి)2026 రన్లో 20 మంది గజ్వేల్ రన్నర్స్ పాల్గొని ఎస్ఎంఏ బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ వ్యాయామాన్ని తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగమున్నెయ్యతో పాటు గజ్వేల్ రన్నర్స్ ప్రతినిధులు రమేశ్గౌడ్, జనార్దన్, మధుసూదన్రెడ్డి, లింగారెడ్డి, సత్యం, కిరణ్కుమార్, గోవర్ధన్రెడ్డి, నరేశ్గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్, రాజు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
● కొన్ని రోజుల క్రితం తండ్రి.. నేడు కొడుకు ● మృతుడు హైదరాబాద్ వాసి నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ – హైదరాబాద్ అటవీ ప్రాంతంలోని కొండాపూర్ టర్నింగ్ వద్ద చోటుచేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ మియాపూర్కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాగా తన స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ను చేసేందుకు బైక్లపై వచ్చారు. పార్క్ను చూసిన అనంతరం హైదరాబాద్కు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద షేక్ హాసిన్ మెహతా అతివేగంగా వెళ్లి రెయిలింగ్ను ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా తోటి మిత్రులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిన్నంటిన రోదన.. గతంలో భర్త, ఇప్పుడు కొడుకు మృతి చెందడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ మియాపూర్లో నివాసముంటున్న షేక్ మేరాబీకి ఒక కొడుకు. కొన్ని రోజుల క్రితం భర్త షేక్ సలీం మృతి చెందగా టైలరింగ్ పనిచేస్తూ కొడుకును మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తుంది. ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న ఆ తల్లికి కన్నీళ్లే మిగిలాయి. ఆమె రోధించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. డివైడర్ను ఢీకొట్టి ప్రభుత్వ టీచర్.. కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ వివరాలు.. కౌడిపల్లి మండలం సిరి తండాకు చెందిన రామచంద్రం(60) అదే మండలంలోని కూకుట్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాడు. శనివారం పనిపై మెదక్కు బైక్పై వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో కొల్చారం బస్టాండ్ సమీపంలోకి రాగానే బైక్కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో, రామచంద్రంను మొదట అంబులెన్స్లో నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోమాలోకి వెళ్లిన రామచంద్రం చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిటైర్మెంట్ కావాల్సి ఉంది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
హామీలను అమలు చేయాలి
నారాయణఖేడ్: కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ల పరిష్కారం కోసం చేపడుతున్న యాత్రకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆయన మండల కేంద్రమైన నిజాంపేటలో ఆదివారం సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కమలాగౌడ్, ఉపాధ్యక్షుడు ప్రతాప్గౌడ్, జిల్లా, స్థానిక సంఘం బాధ్యులు శివకుమార్గౌడ్, శ్రీనివాస్గౌడ్, భాస్కర్గౌడ్, ఎల్లాగౌడ్, దుర్గాగౌడ్, వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు. -
గీతన్నల చైతన్య బస్సుయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్హత్నూర(సంగారెడ్డి): కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 13న రాష్ట్ర బస్సుయాత్ర మండలంలోని దౌల్తాబాద్లోకి రానున్నదని, ఈ యాత్రను దిగ్విజయం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని దౌల్తాబాద్లో గీతన్నల చైతన్య యాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రమేశ్ గౌడ్తో కలిసి ఆశన్న గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బస్సు యాత్ర 13న దౌల్తాబాద్కు, అక్కడి నుంచి సంగారెడ్డికి చేరుతుందన్నారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశం గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, మండల నాయకులు ప్రభు గౌడ్, శేఖర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, చంద్రం గౌడ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెప్పుడో?
కో–ఆప్షన్ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జహీరాబాద్: మున్సిపల్ పాలక మండలి ఏర్పడి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఎన్నిక నిర్వహణ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా తగినంత కోరమ్ లేక సమావేశాలు వాయిదా పడ్డాయి. తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జహీరాబాద్ మున్సిపాలిటీ కో–ఆప్షన్ ఎన్నిక నిర్వహణ కోసం ఏప్రిల్ 4న సమావేశం నిర్వహించారు. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో కోరమ్ లేక సమావేశం వాయిదా పడింది. తిరిగి మే 23న ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చైర్మన్ యూనూస్ ప్రకటించారు. అయినా పలు కారణాల చేత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఇప్పటివరకు ఎన్నిక నిర్వహణకు తేదీ ఖరారు చేయలేదు. కోహీర్ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ ఎన్నిక నిర్వహణ కోసం మే 5న సమావేశం నిర్వహించారు. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో కోరమ్ లేక వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటించలేదు. భారీగా దరఖాస్తులు కో–ఆప్షన్ పదవుల కోసం ఆయా మున్సిపాలిటీల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. జహీరాబాద్ మున్సిపాలిటీలో 36 మంది దరఖాస్తులు చేసుకోగా, కోహీర్ మున్సిపాలిటీలో 22 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్తోపాటు మజ్లిస్ సభ్యులు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. జహీరాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురి వంతున ఎక్స్అఫీషియో సభ్యులను ఎన్నుకునే వీలుంది. కాంగ్రెస్కు స్వల్ప మెజార్టీయే జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 మంది కౌన్సిలర్లు ఉండగా, 15 స్థానాలను బీఆర్ఎస్, 14 స్థానాలను కాంగ్రెస్, 3 స్థానాల్లో బీజేపీ, రెండుస్థానాల్లో మజ్లిస్, రెండుస్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్కు ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉండగా, కాంగ్రెస్కు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. దీంతో మున్సిపాలిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 39 ఉంది. బీఆర్ఎస్కు ముగ్గురు సభ్యులున్న బీజేపీ, ఒక ఎక్స్అఫీషియో సభ్యుడిగా కలుపుకుని 19 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు మజ్లిస్, ముగ్గురు స్వతంత్రులు, ఒక ఎక్స్అఫీషియో సభ్యుడితో కలుపుకుని 20మంది సభ్యులు బలం ఉంది. ఎలాగైనా కాంగ్రెస్ పదవులను దక్కించుకుంటుందనే ఆశతో పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ సైతం పదవులపై ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ మద్దతుదారుల్లో ఒకరిని తమ వైపు తిప్పుకుంటే నాలుగు కో–ఆప్షన్ పదవులు దక్కించుకోవచ్చనే ఆశతో పావులు కదుపుతోంది. కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తిని సొమ్ముచేసుకోవాలనే భావిస్తోంది. ఇదిలాఉంటే కోహీర్ మున్సిపాలిటీలో 16 మంది సభ్యులకు గాను 8 పదవులను కాంగ్రెస్ దక్కించుకుంది. బీఆర్ఎస్ 5 పదవులను దక్కించుకుంది. అక్కడ ఒక ఎంఐఎం, ఒక స్వతంత్ర కౌన్సిలర్లతో కాంగ్రెస్ చైర్మన్ పదవి దక్కించుకుంది. నాలుగు కో–ఆప్షన్ పదవులు కాంగ్రెస్ కూటమికే దక్కనున్నాయి. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక ఆయా మున్సిపాలిటీల్లో ఆశావాహుల్లో తీవ్ర పోటీ కో ఆప్షన్ పదవులకు పోటీ కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అవకాశం దక్కనివారు, అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవడంతో పోటీ చేసే భాగ్యం కలగని వారు కో–ఆప్షన్ పదవిపై కన్నేశారు. అల్ప సంఖ్యాకులతోపాటు మాజీ కౌన్సిలర్లకు అవకాశం ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో అశావాహుల సంఖ్య అధికంగా ఉంది. జహీరాబాద్లో 36 మంది, కోహీర్లో 22 మంది కో–ఆప్షన్ పదవుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే అధికంగా కో–ఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో ఎంఐఎం ఒక్కో స్థానాన్ని ఆశిస్తోంది. అయితే తీవ్ర పోటీ నెలకొన్న కారణంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్ నేతలు బాధ్యత తీసుకునే విషయంలో అనాసక్తి చూపుతున్నారు. ఇదే జాప్యానికి కారణంగా చెబుతున్నారు. మహిళా స్థానాల కంటే జనరల్ స్థానాలపైనే అధిక పోటీ నెలకొంది. తార్మార్ టక్కర్ మార్ జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు ఒక ఓటు మాత్రమే అధికంగా ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా తార్మార్ టక్కర్ మార్ అనే పరిస్థితి ఎదురవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక అంత ఈజీగా లేదనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాచుకు కూర్చొంది. ఎక్కడ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తోంది. కాంగ్రెస్లో నెలకొన్న అసమ్మతిని తమ విజయానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఎన్నికల నిర్వహణకు సానుకూలంగా లేనందునే ఎన్నిక వాయిదా వేస్తూ వస్తోందనే విమర్శలున్నాయి. -
12న టీఐసీసీఐ అవగాహన సదస్సు
పోస్టర్ను ఆవిష్కరించిన నాయకులుప్రశాంత్నగర్(సిద్దిపేట): ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న అవగాహన సదస్సును విజయవంతం చేయాలని టీఐసీసీఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్, టీఐసీసీఐ జిల్లా కో–ఆర్డినేటర్ భూక్య భిక్షపతి నాయక్ అన్నారు. ఆదివారం టీఐసీసీఐ అవగాహన సదస్సు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన, లంబాడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, పారిశ్రామిక పథకాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. యువతలో వ్యాపార, పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేలా టీఐసీసీఐ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకులు అజ్మీర గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్, శంకర్ రాథోడ్ , శ్రీనివాస్ వినోద్ నాయక్, సంతోష్ నాయక్, బోజునాయక్, రాజు నాయక్, సంపత్ నాయక్, సోలో మాన్నాయక్, దేవేందర్ నాయక్, రాజు నాయక్, నవీన్ నాయక్, విటోబా పాల్గొన్నారు. -
మహిళా సంఘాల బలోపేతానికి కృషి
నారాయణఖేడ్: మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయన్నట్లు ఉమ్మడి జిల్లా సీ్త్రనిధి క్రెడిట్ సహకార సమాఖ్య డైరెక్టర్ హీనా బేగం తెలిపారు. ఆదివారం నాగల్గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామాన్ని సందర్శించి మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘాల మహిళా సంఘాలు, గ్రామస్తులు నూతనంగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకొని సన్మానించారు. హీనా బేగం మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు పొదుపును రెగ్యులర్గా కొనసాగించాలని, తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతీ మహిళా సంఘానికి సీ్త్రనిధి ద్వారా రుణాలు అందేలా చూస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రహీం, శంకర్, శివాజీరావు, యూసుఫ్, శాంతప్ప, జీతప్ప, గిరిజన నాయకులు లచ్చిరామ్, మహిళా సంఘాల నాయకులు శేఖమ్మ పాల్గొన్నారు. -
నేడు ‘జైల్ భరో’
ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ, ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు సోమవారం దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ నర్సింహారెడ్డి తెలిపారు. పటాన్చెరు జీహెచ్ఎంసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ..మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించి స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేశారన్నారు. అదే స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 10న జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ తోషిబా కార్మిక సంఘం నాయకుడు సుధాకర్రాజు, ఏషియన్ పెయింట్స్ హమాలీ కార్మిక సంఘం కార్యదర్శి రతన్సింగ్, వినోద్నాయక్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, యూత్ కాంగ్రెస్ నాయకుడు అక్షిత్రాజు తదితరులు పాల్గొన్నారు. -
15న భారీ భజన కార్యక్రమం
మెదక్ కలెక్టరేట్: వేల గొంతులు..ఒకే భజన, రామ భజన భక్తి పారవశ్యంతో యువతను చైతన్య పర్చడమే లక్ష్యమని రామభక్త భజన పరివార్ సభ్యులు తెలిపారు. రామభక్త భజన పరివార్ సభ్యులతో పాటు భక్తులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈనెల 15న మెదక్ పట్టణంలోని చమన్ వీధిలో గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భారీ ఎత్తున భజన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సమాజ ఐక్యతను చాటేలా ఈ భజన కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి శనివారం ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఐదో వారం 15న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భజన కార్యక్రమం ద్వారా హిందువుల ఐక్యత, ధార్మిక చైతన్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. రామభక్త భజన పరివార్ కరపత్రం విడుదల -
కొండెక్కిన కొబ్బరికాయ
● ఆందోళన చెందుతున్న భక్తులు ● శ్రావణమాసంలో అన్నీ పండుగలే.. ● ధరలు నియంత్రించాలంటున్న ప్రజలు సంగారెడ్డి క్రైమ్ / హత్నూర (సంగారెడ్డి): కొబ్బరికాయ ధరలు కొండెక్కాయి. ప్రస్తుత ఆషాఢ మాసంలో బోనాల సందడి మొదలైంది. భక్తులు ఆలయంలో కొట్టే కొబ్బరికాయ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో శ్రావణమాసం కూడా ప్రారంభం కానుంది. ఈ మాసం మొత్తం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలో ఎటు చూసినా బోనాల సందడి మొదలు కావడంతో స్థానిక భక్తులు సైతం నిరంతర భక్తిశ్రద్ధలతో దేవతలను కొలుస్తుంటారు. దీంతో హోమాలు, శుభకార్యాలు సైతం పెరిగాయి. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల ధరలు భారీగా పెరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక కొబ్బరికాయ రూ. 20 నుంచి రూ.30 ధర పలికితే, ప్రస్తుతం మార్కెట్ల్లో రూ. 35 నుంచి రూ.45 వరకు పలుకుతుంది. ఉత్పత్తి తగినంత లేకే.. ప్రస్తుతం కొబ్బరికాయల ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్లే ధరలు భారీగా పెరిగాయని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. మూడు నెలల్లో ఒక కొబ్బరికాయ రూ. 25 పలికితే ప్రస్తుతం కొబ్బరికాయ రెట్టింపు ధర పలుకుతోందని చెబుతున్నారు. దీంతో ఎండు కొబ్బరి రేట్లు సైతం అమాంతం పెరిగాయి. ప్రస్తుతం సంగారెడ్డి మార్కెట్లో నిత్యం 2వేల నుంచి 3వేల కొబ్బరికాయలు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొబ్బరికాయలు కొనాలంటే హడలి పోతున్నారు. మార్కెట్లో కొబ్బరికాయల ధర రూ. 40 పైనే పలుకుతుండడం భక్తులను భయపెడుతోంది. ఆషాఢం తర్వాత శ్రావణమాసంలో వచ్చేవన్నీ ముఖ్యమైన పండుగలే అవడంతో.. కొబ్బరికాయల ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవని పలువురు భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొబ్బరికాయల ధరలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. -
క్షేమంగా ఇళ్లకు చేరుకున్న బాలురు
వీడిన చిన్నారుల అదృశ్యం మిస్టరీ రామాయంపేట(మెదక్): జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన సుఖాంతమైంది. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారుల ఆచూకీని కనుగొన్న పోలీసులు కామారెడ్డిలో వారిని పట్టుకొని ఆదివారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక సీఐ సైదా తెలిపిన వివరాలు.. స్థానిక కేసీఆర్ (డబుల్ బెడ్రూం) కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు మొక్కొండ ధనుష్, ఆరె మనోజ్, షేక్ సమీర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కొంతకాలంగా వారు సక్రమంగా పాఠశాలకు వెళ్లకుండా ఆటపాటలతో గడుపుతున్నారు. బుధవారం అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతూ, దిగుతూ ఆడుకుంటుండగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి చూసి మీ తల్లిదండ్రులకు చెబుతానని, ఇంటికి వెళ్లిపొమ్మని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన ముగ్గురు బాలురు గురువారం రాత్రి కాలనీ నుంచి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం చిన్నారుల కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు తీవ్రంగా గాలించారు. వీరు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు కామారెడ్డిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి వారిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పిల్లలు సక్రమంగా స్కూలుకు వెళ్తున్నారా? లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్ఐ బాల్రాజు పాల్గొన్నారు. -
మోతాదు మించితే ముప్పే
దుబ్బాకటౌన్: ఎరువులను అధికంగా వినియోగిస్తే అనర్థాలు తప్పవంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇష్టం వచ్చినట్లు రసాయన ఎరువులను చల్లడం, పిచికారీ చేయడం, వరి పొలాల్లో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండటం, నేలలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో హైడ్రోజన్ సల్ఫైడ్ దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉందని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. పల్లవి రైతులకు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి నాట్లు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు 1,86,319 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ సీజన్లో జిల్లాలో వరి పంటలో హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజురీ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. వానాకాలం, వేసవిలో ఒకే పొలంలో ఏళ్ల తరబడి వరి సాగు చేయడంతో వరిలో ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం కనిపిస్తుంది. దీని వల్ల 30 నుంచి 50 శాతం వరకు పంట దిగుబడి రైతులు నష్టపోతున్నారు. దీంతో హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజురీ లక్షణాలను అధికారులు గుర్తించి, రైతుల సమస్యకు గల కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలను వివరిస్తున్నారు. నివారణ చర్యలు పొలంలో నీటిని 3 నుంచి 5 రోజుల పాటు పూర్తిగా తొలగించాలి. నేలకు గాలి తగిలేలా చేసి, 2–3 సెం.మీ. పలుచటి నీటి పొర మాత్రమే ఉండేలా చూడాలి. పొటాష్ ఎరువును సిఫార్సు మేరకు వినియోగించాలి. జింక్ లోపం ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. వేర్లు దెబ్బతినడం వల్ల పోషకాలు సక్రమంగా తీసుకోలేని పరిస్థితిని అధిగమించేందుకు 19:19:19, ఫార్ములా–4 ఎరువులను ఎకరానికి 600 నుంచి వెయ్యి గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి, 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయడం ద్వారా పంటను కాపాడుకోవచ్చు. రసాయన ఎరువులతో చౌడుగా మారుతున్న నేలలు -
డీసీఎం, స్కూటీ ఢీ.. ఇద్దరు దుర్మరణం
● 44వ జాతీయ రహదారి దండుపల్లి వద్ద ప్రమాదం ● మృతులు ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీలు తూప్రాన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవా రం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీలు తన్మన్ (20), కమలేశ్(22), విశాల్ ముగ్గురు స్నేహితులు. దండుపల్లి శివారులో ఏపీఎంఎల్ పరిశ్రమలో పని చేస్తూ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. సొంత పనులపై స్కూటీపై దండుపల్లికి వచ్చారు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ముందు ఉన్న తన్మన్, కమలేశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెనుకాల కూర్చున్న విశాల్ స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంను విశాల్ తన్మన్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను ఉత్తరప్రదేశ్లోని తమ సొంత గ్రామాలకు కుటుంబ సభ్యులు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బస్సు తల పైనుంచి వెళ్లడంతో.. పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం బుందిల్ గొల గ్రామానికి చెందిన ఒహిదుల్ ఇస్లాం, సమీనా బేగం (20)ను 8 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా బతుకుదెరువు కోసం వచ్చి సంగారెడ్డి జిల్లా..కంది మండలంలోని పెద్దనూరు గ్రామం ఉప్పుగడ్డ తండాలో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో ఇద్దరు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈనెల 7న సమీనా బేగం, మరో మహిళ షూర్జ బేగంతో కలిసి పరివార్ దాబా వద్ద ఆటో ఎక్కి ఇస్నాపూర్ మార్కెట్కు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో చివరకు కూర్చున్న సమీనా బేగం కళ్లు తిరిగి జాతీయ రహదారిపై పడిపోయింది. దీంతో గుర్తుతెలియని బస్సు ఆమె తల పైనుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.ఆటో ఢీకొని యువకుడి.. జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కోహీర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మనియార్పల్లి గ్రామానికి చెందిన బేగరి జగన్నాథం(23) వెంకటాపూర్ గ్రామంలోని వీఎస్టీ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని తన బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని వెంటనే జహీరాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మండలాల్లోనే ప్రజావాణి
నారాయణఖేడ్/సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి, ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఇటీవల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ప్రారంభించగా తాజాగా మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రజావాణి నిర్వహణ, విధివిధానాలపై ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రాల్లో వినతులు స్వీకరించటంతో ప్రజలకు దూరాభారంతోపాటు సమయం, ఖర్చులు ఆదా కానున్నాయి. నోడల్ అధికారిగా మండల పరిషత్ అధికారి మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ప్రతీ సోమవారం ఉదయం 10:00గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆయా మండలాల్లో విధులు నిర్వహించే తహసీల్దార్, ఎంపీడీఓ, విద్య, వైద్యం, వ్యవసాయ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్తు, త్రాగునీరుతోపాటు ఇతర మండల శాఖ అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. పకడ్బందీగా నిర్వహణ ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ నోడల్ అధికారి పర్యవేక్షణలో పకడ్బందీగా జరుగుతుంది. నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లతో పాటు హెల్ప్ డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు త్రాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కొరకు వీల్ చైర్, వైద్య శిబిరం తో పాటు ఇతర వసతులు కల్పించాలి. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, చిన్నపిల్లలతో ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహణ ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నోడల్ అధికారిగా ఎంపీడీఓకు బాధ్యతలు వేగవంతంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మండలస్థాయి అధికారులు హాజరయ్యేనా! మండల కేంద్రంలో ప్రజావాణికి అన్ని శాఖల మండల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ మండలంలో విధులు నిర్వహిస్తున్న పలు శాఖల అధికారులు గతంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలకు హాజరు కాకపోగా తమ కిందిస్థాయి సిబ్బందిని పంపించిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మండల అధికారులు పూర్తి స్థాయిలో హాజరు అవుతారా లేదో వేచి చూడాల్సి ఉంది. ఆన్లైన్లో ఫిర్యాదుల నమోదు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్తోపాటు ఒక సబ్ కలెక్టర్, 3 రెవెన్యూ డివిజన్, 25 మండల ప్రజా పరిషత్తు కార్యాలయాలున్నాయి. ప్రజావాణిలో దరఖాస్తులను ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్లో నమోదు చేస్తారు. ఫిర్యాదుతో పాటు సంబంధిత పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేసి, గ్రీవెన్స్ ఐడీ జారీ చేస్తారు. కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించాల్సి ఉంటుంది. -
సహకారంలో సందడి
సహకార సంఘాల్లో సందడి షురూవైంది. పీఏసీఎస్ (సహకార సంఘాలు) పాలకవర్గాలకు పదవులు ఆశిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సభ్యత్వాలు లేని నాయకులు ఆయా పీఏసీఎస్లలో కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ● ఈ పదవులు రావాలంటే ఆయా సహకార సంఘాల్లో సభ్యత్వం తప్పనిసరి ● లేని వారు కొత్తగా సభ్యత్వం తీసుకుంటున్న ఆశావహులు ● డీసీసీబీ, డీసీఎంఎస్ పదవుల కోసమూ కొందరు నేతల ప్రయత్నాలు పీఏసీఎస్ చైర్మన్ డైరెక్టర్ పదవులపై కాంగ్రెస్ నేతల గురిసభ్యత్వం ఉంటేనే చైర్మన్, డైరెక్టర్ పదవులకు అర్హత కావడంతో లేనివారు కొత్తగా సభ్యత్వాలు చేసుకుంటున్నారు. అవసరమైతే ఆయా పీఏసీఎస్ల పరిధిలో వ్యవసాయ భూమి లేకపోతే..కొనుగోలు చేసి మరీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. పీఏసీఎస్ పరిధిలోని గ్రామాల్లో తప్పనిసరిగా భూమి ఉండాల్సి ఉండటంతో ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 105 పీఏసీఎస్లున్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 54 ఉండగా, మెదక్లో 36, సిద్దిపేట 15 సంఘాలున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొన్ని సంఘాలు ఇతర జిల్లాల డీసీసీబీ పరిధిలో ఉన్నాయి. కేవలం 15 మాత్రమే ఉమ్మడి జిల్లా డీసీసీబీ పరిధిలో కొనసాగుతున్నాయి. ఒక్కో పీఏసీఎస్కు చైర్మన్తోపాటు, 13 మంది డైరెక్టర్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులను ప్రభుత్వం నామినేట్ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఈ పదవులపై గురి పెట్టారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పీఏసీఎస్లకు సంబంధించిన ఈ పోస్టులకు నామినేట్ చేయాల్సిన వారి పేర్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఆశాఖ మంత్రి వద్దకు పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ పదవులు ఎవరికి ఇవ్వాలనే పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇన్చార్జి మంత్రి ద్వారా ఈ ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. కాగా పీఏసీఎస్ల పాలకవర్గాల పదవీకాలం 2025 జనవరిలోనే ముగిసిన విషయం విదితమే. అప్పటి నుంచి అన్ని పీఏసీఎస్లకు సంబంధిత అధికారులు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం చాలారోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది. కానీ, ఇంతవరకు దానికి సంబంధించిన జీఓ రాలేదు. ఈ డీసీఎంఎస్ చైర్మన్, పాలకవర్గం పదవులను కూడా నామినేట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పదవి రేసులో జహీరాబాద్కు చెందిన అధికార పార్టీ నాయకుడి పేరు వినిపిస్తోంది. అలాగే అందోల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం ఆయన యూ.ఎస్. నుంచి తిరిగి వచ్చినట్లు అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద సహకార సంఘాల్లో నామినేటెడ్ సందడి అంతర్గతంగా కొనసాగుతోంది. మరోవైపు ఈ పదవుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు విచారణలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో మాత్రం ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. పర్సన్ ఇన్చార్జిలుగా ఉన్న సమయంలో కొత్త సభ్యత్వాలు తీసుకుంటే అవి చెల్లవని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పర్సన్ ఇన్చార్జిలు కేవలం ఆయా సంఘాల కార్యకలాపాలు కొనసాగించేందుకు తాత్కాలికంగా ఉంటారని చెబుతున్నారు. ఈ పర్సన్ ఇన్చార్జిలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం సహకార చట్టంలో లేదని పేర్కొంటున్నారు. ప్రధానంగా సభ్యత్వాలు ఇచ్చే అధికారం పర్సన్ ఇన్చార్జిలకు ఉండదని అంటున్నారు. జిల్లా కేంద్రం సహకారం బ్యాంకు (డీసీసీబీ) పాలక వర్గం పదవులపైనా నేతలు గురి పెట్టారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డీసీసీబీ చైర్మన్గా పని చేసిన చిట్టి దేవెందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
గురుకుల పాఠశాల తరలింపుపై..
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మిరుదొడ్డి(దుబ్బాక): ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలికల గురుకుల పాఠశాలను ఎలా తరలిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం మిరుదొడ్డిలోని గురుకుల బాలికల పాఠశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా.. దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారంలో ఉన్న పూలే బాలికల గురుకుల పాఠశాలను మిరుదొడ్డి మండల కేంద్రానికి తరలించారు. కాగా సరైన సౌకర్యాలు లేని పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన తెలుసుకున్న దుబ్బాక సీఐ రాజేశ్, మిరుదొడ్డి ఎస్ఐ సతీశ్తో పాటు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఆడుకోవడానికి సరైన ఆట స్థలం కూడా లేదని, పారిశుద్ధ్యం లోపించిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఇలాంటి పరిసరాల్లో తమ పిల్లలను ఎలా చదివించాలని ప్రశ్నించారు. కాగా ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ కరుణను వివరణ కోరగా.. శేరిపల్లి బందారంలో స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆర్అండ్బీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే మిరుదొడ్డి మండల కేంద్రానికి మార్చినట్లు వెల్లడించారు. కోతుల బెడద ఉన్నట్లు గుర్తించి వెంటనే పాఠశాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దుబ్బాక సీఐ రాజేశ్ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి విద్యార్థులను కలుసుకునేలా ప్రత్యేక చొరవ చూపడంతో ఆందోళన సద్దుమణిగింది. -
గణితం, సైన్స్పై అవగాహన
పటాన్చెరు టౌన్: ఇంటర్ విద్యార్థులకు గణితం, విజ్ఞాన శాస్త్రాలపై అవగాహన కల్పించడంతోపాటు జేఈఈ, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్జేసీ సంగారెడ్డి ఎస్ఓఈ బాలికల కళాశాలలకు చెందిన ఇంటర్ విద్యార్థులకు శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, ఈఏపీసెట్ పరీక్షలకు సన్నద్ధత వ్యూహాలు, గణితంలో సమయాన్ని ఆదా చేసే షార్ట్కట్స్, శాసీ్త్రయ సమస్యల పరిష్కార పద్ధతులు, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు నరసింహస్వామి, శివారెడ్డి శేరి, తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: ఎంపీ సురేశ్ షెట్కార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు పట్టణ ఆస్పత్రిలో రోగులకు, చిన్నారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ..పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో, లక్షలాది మంది కార్యకర్తల ఆకాంక్షలను గౌరవిస్తూ 2023లో తనకు వచ్చిన అసెంబ్లీ టికెట్ ను సైతం త్యాగం చేసిన వ్యక్తి ఎంసీ సురేశ్ షెట్కార్ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు రవి, ముదిరాజ్ సాయిలు, కార్మిక నాయకులు రాజు, శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు అక్షిత్, రమేశ్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలో ఈ నెల 9,10వ తేదీల్లో బోనాల పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ పేర్కొన్నారు. నలుగురు సీఐలతో పాటు సుమారు 70–90 మంది పోలీస్ సిబ్బందిని బోనాల బందోబస్తులో నియమించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఆటంకం లేకుండా మహిళా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మహిళా భక్తుల విషయంలో ఆలయాల వద్ద ఉన్న సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఆలయాల వద్ద పోలీసుల సహకారాన్ని తీసుకుని బోనాల వేడుకలను శాంతియుతంగా చేసుకున్నే విధంగా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం చిలప్చెడ్ (నర్సాపూర్): కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి, వారికి నష్టాన్ని కలిగించే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ఈ నెల 10న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శనివారం ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆటో ప్రచార జాత ప్రారంభించారు. ఉపాధి హామీలో భాగంగా కేంద్రం వాటా తగ్గించి, రాష్ట్రాలకు ఎక్కువ వాటా బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శేఖర్, రాజు, శ్యామయ్య, అంజయ్య, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. -
వడ్డెరల ఉపాధికి అనుమతులివ్వాలి
కొల్చారం(నర్సాపూర్): వడ్డెరల ఉపాధికి ప్రభుత్వం చట్టపరమైన అనుమతి ఇవ్వాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గ సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు ఓర్స ఈశ్వర్ అధ్యక్షతన శనివారం జిల్లా వడ్డెరల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాయిలు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి తండ్రుల వరకు, ప్రస్తుతం తమ కుటుంబాలు కూడా రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాయి కొట్టే వృత్తికి అడ్డంకులు ఏర్పడటంతో వడ్డెర కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రతీ మండలంలో అటవీశాఖ అధికారులు రాళ్లు కొట్టే తమ సంప్రదాయ వృత్తిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ వడ్డెరల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించి జీవనోపాధి కోసం అడవుల్లో ఉన్న అనుమతించదగిన బండలపై రాయి కొట్టుకునేందుకు చట్టబద్ధమైన అనుమతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డెరలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్గా జైపాల్ను, తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా గుంజ రేణుకను నియమించడం పట్ల వడ్డెర సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు -
అభివృద్ధికి నోచని మురికి వాడలు
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. దీంతో ప్రజలు అను నిత్యం అవస్థలు పడకతప్పడం లేదు. నిధులు కేటాయింపులు లేకపోవడం కూడా సమస్యకు కారణంగా ప్రజలు పేర్కొంటున్నారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లి, రామ్నగర్, శాంతినగర్, డ్రైవర్స్కాలనీ, ఫరీద్కాలనీ, కాంతారెడ్డికాలనీ, బాగారెడ్డినగర్, ఆర్యనగర్, ఐడీఎస్ఎంటీ కాలనీ, వెంకటరమణకాలనీ, గడిహరిజనవాడ, పస్తాపూర్, అల్లీపూర్, హరిజనవాడలతో పాటు పలు కాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రధానంగా రోడ్ల నిర్మాణాలు లేక పోవడంతో వర్షాకాలంలో ప్రజలు రోడ్లపై నడవాలన్నా నానాఅవస్థలు పడక తప్పడం లేదు. కొత్త పాలక మండలి వస్తే సమస్యలు తీరుతాయని ఆశించిన ప్రజలకు చివరకు నిరాశే కలుగుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా దర్శనమిస్తున్నాయి. బురదలో నుంచి రాకపోకలు సాగించాలన్నా ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల అధ్వాన స్థితిపై ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లు నిధులు కేటాయించాలంటూ అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. తన వార్డు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం లేదంటూ ఇటీవల 8వ వార్డు కౌన్సిలర్ సోని భర్త ఇర్మియా చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి నిధులను కేటాయించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. -
పాము కాటుతో మహిళ మృతి
కల్హేర్(నారాయణఖేడ్): ఇంట్లో నిద్రిస్తున్న మహిళ పాము కాటుతో మృతి చెందింది. ఈ ఘటన నిజాంపేట్ మండలం బాచేపల్లి కొత్త తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మారోనిబాయి వ్యవసాయ పనులు ముగించుకుని వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. దీంతో కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మరణించింది. దీంతో తండాలో విషాదం నెలకొంది. చికిత్స పొందుతూ వ్యక్తి.. పటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక, కరెంజ్పికు చెందిన విజయ్ కుమార్ (34) హైదరాబాద్ పాత బస్తీకి 18 ఏళ్ల క్రితం వచ్చి బంగారు ఆభరణాల తయారీ పని చేస్తున్నాడు. కాగా స్వగ్రామానికి గత నెల 17న వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి బయలుదేరి హైదరాబాద్కి వరుసకు సోదరుడైన బాలాజీతో కలిసి వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వస్తున్నారు. ఈ క్రమంలో రామేశ్వరంబండా కూడలిలో ద్విచక్ర వాహనం పైనుంచి విజయ్ కుమార్ జారిపడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించగా ఈనెల 7న చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లి.. పెద్దశంకరంపేట(మెదక్): చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన జంబికుంట శివారులో శనివారం చోటు చేసుకుంది. పెద్దశంకరంపేట ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి వివరాలు.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన పట్నం బాలయ్య(24) చేపలు పట్టి అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం నిజాంసాగర్ బ్యాక్వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. బ్యాక్వాటర్లో మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు బాలయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య వినోద సంఘటన స్థలానికి వెళ్లి తన భర్త బాలయ్య మృతదేహంగా గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. -
పంచవటిలో చండీరుద్ర మహాయాగం
యాగంలో పాల్గొన్న 7,450 మంది దంపతులు న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రాఘవాపూర్–హుమ్నాపూర్ గ్రామ శివారులో గల పంచవటి క్షేత్రంలో పుష్కరకాల చండీరుద్ర మహాయాగం కొనసాగుతోంది. లోక కల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పంచవటి క్షేత్రం పీఠాధిపతి శ్రీ కాశీనాథ్ బాబా పుష్కరకాల శత చండీరుద్ర మహాయాగానికి శ్రీకారం చుట్టారు. 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా యాగాన్ని నిర్వహించడం వల్ల అంతా శుభమే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయని అందుకే యాగాన్ని నిర్వహించేంందుకు శ్రీకారం చుట్టానని బాబా తెలిపారు. లోక కల్యాణార్థం 8 ఏప్రిల్ 2016లో యాగాన్ని పంచవటి క్షేత్రంలో ఆయన ప్రారంభించారు. యాగం ప్రారంభమై శనివారానికి 10 ఏళ్ల, 4నెలల, 19 రోజులు పూర్తయ్యాయి. మహాయాగం 2028లో పూర్తి కానుంది. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం క్షేత్ర ఆవరణలో నిర్వహించే యాగంలో ఇద్దరు చొప్పున దంపతులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 7,450 మంది దంపతులు యాగంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఎన్హెచ్–44పై నిఘా పటిష్టం చేయాలి
మల్టీ జోన్ –1 ఐజీ చంద్రశేఖర్రెడ్డితూప్రాన్: జాతీయ రహదారి–44పై నిఘాను మరింత పటిష్టం చేయాలని మల్టీ జోన్ –1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ టోల్గేట్ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల నిఘా, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) పనితీరును పరిశీలించారు. రహదారిపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఏటీఎంఎస్లోని ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాలు, వాహన వేగాన్ని గుర్తించే వీఏఎస్డీ రాడార్ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలు, వేరియబుల్ మెసేజింగ్ సైన్బోర్డులు తదితర వ్యవస్థలను ఐజీ పరిశీలించారు. అతివేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి ఈ–చలాన్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మనోహరాబాద్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ నరేందర్గౌడ్, ఎస్ఐ గంగారాజు, టోల్ గేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశ్రమ వ్యర్థ జలాలను అరికట్టండి
సంగారెడ్డి: చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు మంత్రి దామోదర రాజనర్సింహకు శనివారం సంగారెడ్డిలో వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన జలాలను సరిగ్గా శుద్ధి చేయకుండానే పైపుల ద్వారా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని వారు ఆరోపించారు. వర్షాలు కురిసే సమయాన్ని ఆసరాగా చేసుకుని వ్యర్థ జలాలను నదిలోకి వదులుతున్నారని దీనివల్ల మంజీరా నది కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిపై ఆధారపడిన రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. కాలుష్యం కారణంగా చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయని, ఈ నీటిని సాగుకు వినియోగిస్తే పంటలు దెబ్బతింటాయని వివరించారు. మంజీరా నది నీటిని తాగుకు వినియోగిస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంపై విచారణ చేపట్టాలని కోరారు. నది నీటినమూనాలను సేకరించి శాసీ్త్రయ పరీక్షలు నిర్వహించాలని, కాలుష్యానికి కారణమైనవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులవినతిపై స్పందించిన మంత్రి దామోదర వ్యర్థ జలాల విడుదలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠపురంలో మంత్రి దామోదర పూజలు సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. మంత్రి దామోదరకు శివంపేట గ్రామస్తుల వినతి -
క్షేత్రస్థాయిలో సాగు పరిశీలన
కౌడిపల్లి(నర్సాపూర్): క్షేత్రస్థాయిలో వ్యవసాయం చూసేందుకు, చూసి నేర్చుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యసంస్థ, వ్యవసాయ కళాశాలకు హైదరాబాద్ మధురానగర్కు చెందిన విజ్ఞానజ్యోతి పబ్లిక్స్కూల్కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం స్టడీటూర్కు వచ్చారు. దీంతో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఫీల్డ్ మేనేజర్ జగదీశ్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వివిధ రకాల పంటలు, కూరగాయాల సాగు, పాడిపరిశ్రమ, వర్మీకంపోస్ట్ ఎరువుల తయారీ తదితర విషయాలను చెప్పగా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు వరినాటు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గోపాలరావ్ మాట్లాడుతూ...విద్యార్థుల స్టడీటూర్లో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను విద్యార్థులకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు వరి, కూరగాయల సాగు, పశుపోషణ విధానం పరిశీలించారని తెలిపారు. -
బాలింతల కోసం ఫీడింగ్ సెంటర్లు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలింతల కోసం ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బేటి బచావో బేటి పడావో పథకం కింద జిల్లాలోని మెదక్, చేగుంట, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్లోని బస్టాండ్లలో ఈ సెంటర్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్లలో తల్లులు బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామని డీడబ్ల్యూఓ హేమభార్గవి తెలిపారు. వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. సంగారెడ్డి క్రైమ్: ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన శివరాత్రి రాజు(28), మూర్ఛ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఈ నెల 7న ఉదయం తన అన్నతో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. మందులు తీసుకొని వస్తానని చెప్పి బయటకు వెళ్లి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.అనారోగ్య సమస్యలతో వ్యాపారి ఆత్మహత్య సిద్దిపేటకమాన్: అనారోగ్య సమస్యలతో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన శివకృష్ణమూర్తి (70) స్థానిక శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటూ సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా ఆయన కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పని నిమిత్తం హైదరాబాద్ వెళుతున్నానని ఇంట్లో చెప్పి ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ క్రమంలోనే స్థానిక కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చెరువులో కృష్ణమూర్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం తరలించారు. -
ఫుట్బాల్లో మెదక్ ద్వితీయ స్థానం
మెదక్జోన్: అండర్–17 బాలికల ఫుట్బాల్ రాష్ట్రస్థాయిలో మెదక్ ద్వితీయ స్థానంలో నిలిచిందని ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు శనివారం తెలిపారు. మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) తరపున తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ తరపున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 బాలికల ఫుట్బాల్ కప్ పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించిందన్నారు. ఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టుతో తలపడి 2–0 స్కోర్తో రన్నరప్గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జట్టు కోచ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బొల్లం సత్తయ్య (55) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఢిల్లీ లోని ఆస్పత్రిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు 30 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో పని చేసిన సత్తయ్య ఢిల్లీలో ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పేకాట రాయుళ్ల అరెస్టు జహీరాబాద్ టౌన్: పేకాట ఆడుతున్న నలుగురిని జహీరాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఎస్ఐ.రాజేందర్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని అర్జున్ నాయక్ తండాలో కొంత మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు దాడి చేయగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ.4,050 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని, ఎక్కడైనా జూదం ఆడుతున్నట్లు తెలిసినట్లయితే 112 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. గంజాయి స్వాధీనం చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ ఎకై ్సజ్ డీటీఎఫ్ అధికారులు ఎండు గంజాయితో పాటు గంజాయి చాక్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా.. డీటీఎఫ్ బృందం శుక్రవారం అర్ధరాత్రి నార్సింగిలో తనిఖీలు చేపట్టారు. బీహర్కు చెందిన శివ్కుమార్ సాడ హమాలీగా పనిచేస్తూ తోటి కార్మికులకు గంజాయి విక్రయిస్తూ, అక్రమంగా మత్తుపదార్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 2 కిలోల గంజాయి, 150 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ జే.గోపాల్ తెలిపారు. ఎస్ఐ బాలయ్య, కానిస్టేబుళ్లు వహిద్, జీవన్, పుండరీకం, స్రవంతి పాల్గొన్నారు. -
‘నల్లవాగు’కు జలకళ
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు అలుగు పైనుంచి శనివారం భారీగా వరద నీరు ప్రవహించింది. ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలతో భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లకు చేరిందని ఏఈ మల్లేశ్ తెలిపారు. ఇన్ఫ్లో 4,260 క్యూసెక్కులు వరద నీరు వస్తుందని, ఔట్ఫ్లో 4,139 క్యూసెక్కులు నీరు అలుగు పైనుంచి పారుతుందని తెలిపారు. కుడి కాల్వ నుంచి 95 క్యూసెక్కులు, ఎడమ కాల్వ నుంచి 26 క్యూసెక్కులు సాగు కోసం విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు కింద 6 వేల ఎకరాల వరకు పంటలు సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో నిండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. -
రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లను విస్తరించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని భవానీ మందిరం, హనుమాన్ మందిరం వీధి రోడ్లను ముందుగా 40 అడుగులకు విస్తరించనున్నారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం సర్వే నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో రోడ్డు విస్తరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు కూడా రోడ్డు వెడల్పుకు అంగీకారం తెలిపారు. విస్తరణలో భాగంగా తాజాగా రోడ్డు వెంబడి ఉన్న దుకాణాల యాజమా నులకు మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రోడ్డు విస్తరణ పనులు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. మాస్టర్ ప్లాన్ అమలు జహీరాబాద్ పట్టణంలో సుమారు 1.25 లక్షల జనాభా ఉంది. 24 వార్డు ఉండగా ఐదు పంచాయతీలు విలీనంతో 37 వార్డులకు చేరుకుంది. 21.14 చదరపు కిలోమీటర్ల మేరకు పట్టణం విస్తరించింది. అమృత్ 2.0 పథకం కింద జహీరాబాద్ పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి 2024లో నిర్ణయించారు. పట్టణంలోని భవానీ మందిరం, హనుమాన్ మందిరం, లతీఫ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఆయా రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోడ్లను 40 అడుగుల వెడల్పు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కొన్ని కారణాల వల్ల ఇనాళ్లు జాప్యం జరింగింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు కౌన్సిల్ కూడా తీర్మానం చేయడంతో రోడ్ల విస్తరణకు మార్గం సుగమమైంది. దీంతో మున్సిపల్ అధికారులు రోడ్ల కొలతలు తీసుకుని 40 ఫీట్ల రోడ్డు కోసం వ్యాపారులకు నోటీసులిస్తున్నారు. రోడ్డు వెడల్పు కోసం సర్వే నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందిరోడ్డు వెడల్పు కోసం మున్సిపల్ అధికారి నిర్వహిస్తున్న సర్వే తొలగనున్న ట్రాఫిక్ ఇబ్బందులు మాస్టర్ ప్లాన్ అమలులో అధికారులు -
ముగ్గురు చిన్నారుల అదృశ్యం
రామాయంపేట(మెదక్): ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కేసీఆర్ కాలనీ (డబుల్ బెడ్రూం కాలనీ)కి చెందిన ఽమెక్కొండ ధనుష్, ఆరె మనోజ్, షేక్ సమీర్ స్నేహితులు. వీరు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు 13 ఏళ్లలోపు వారే. ముగ్గురు కలిసి గురువారం రాత్రి కాలనీలో ఆడుకుంటున్న క్రమంలో అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంతోపాటు అక్కన్నపేట రైల్వేస్టేషన్ పరిసరాల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎస్ఐ బాల్రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికై నా వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని స్థానిక సీఐ సైదా సూచించారు. -
హుండీలో అమెరికా కరెన్సీ
ఝరాసంగం(జహీరాబాద్): మొగలివనంలో వెలసిన కేతకి సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో అమెరికా కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. 52 నోట్ల డాలర్లు రాగా వాటి విలువ సుమారు రూ.5వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. వీటితోపాటు చిరిగిన నోట్లు, రద్దు చేసిన నోట్లు కనిపించాయి. అమెరికా నోట్లు కనిపించడంతో అమెరికా భక్తులు దర్శించుకున్నారా? లేదా మన దేశపు భక్తులే సమర్పించారా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 10 వరకు అవకాశం వర్గల్(గజ్వేల్): పీఎంశ్రీ వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు స్వీకరణ గడువు మరో మూడు రోజులు పొడిగించారు. ఏడో తేదీకి గడువు ముగియగా విద్యార్థుల ప్రయోజనం కోసం దీనిని ఈ నెల 10 వరకు పొడిగిస్తూ విద్యాలయ సమితి ఆదేశాలు జారీ చేసిందని ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతూ, తల్లిదండ్రులు ఉమ్మడి జిల్లా నివాసులై ఉండాలి. హెచ్ఎం ధ్రువీకరణ పత్రం, ఫొటోతో ఆన్లైన్లో గడువు తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. మెదక్జోన్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి న్యాయస్థానం జరిమానా విధించింది. వివరాలు ఇలా.. మెదక్ పట్టణంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరు పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి మొబైల్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. డీఐఈఓ రవీందర్రెడ్డి సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రెండు రోజులుగా అధ్యాపకులకు నిర్వహిస్తున్న మొదటి విడుత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా డీఐఈఓ రవీందర్రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు వివరించాలన్నారు. ప్రభావవంతమైన బోధనను చేసి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ విజయలక్ష్మి, దుబ్బాక ప్రిన్సిపాల్ చంద్రయ్య, డీఆర్పీలు అమరేందర్రెడ్డి,రాణి, దేవయ్య, శ్రీదేవి, సైదులు, శ్రీనివాస్ పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మెదక్రూరల్ సీఐ కృష్ణమూర్తి కేసు వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన మధు కొంత కాలంగా హవేళిఘణాపూర్ మండలం ఫరీద్పూర్, మెదక్ మండలం పాతూర్ గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో మండలంలోని మంభోజిపల్లి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న మధును పట్టుకొని విచారించగా చోరీలకు పాల్పడినట్లు నేరం అంగీకరించాడు. అతని వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. గతంలో ఇతనిపై పలు చోరీ కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో మెదక్రూరల్ ఎస్ఐ రాజు, పోలీసు సిబ్బంది నాగరాజు ఉన్నారు. బైక్ చోరీ నిందితుడు.. సిద్దిపేటఅర్బన్: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా.. సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు శుక్రవారం పెట్రోలింగ్ చేస్తుండగా పొన్నాల రాజీవ్ రహదారిపై ఓ వ్యక్తి బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకోగా మద్యం తాగి వాహనం నడుపుతున్నట్టు గుర్తించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా బీఏసీ రీడింగ్ 332 నమోదైంది. బైక్ను పరిశీలించగా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లేకపోవడంతో విచారించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేటలోని కోటిలింగాల గుడి ప్రాంతంలో దొంగిలించినట్టు అంగీకరించాడు. ఫింగర్ప్రింట్ డివైస్ ద్వారా పరిశీలించగా సిద్దిపేట పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు దేవరాజుగా గుర్తించారు. నిందితుడిపై ఐదు చోరీ కేసులు నమోదైనట్టు గుర్తించారు. బైక్ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
హక్కులపై అవగాహన పెంచుకోవాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పటాన్చెరు టౌన్: రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులపట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఇంద్రేశం, పెద్ద కంజర్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భూ హక్కులు, అటవీ హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు. సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలోని మహత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలల తనిఖీలను శుక్రవారం ఇంటెలిజెన్స్ అధికారి విజయ్చంద్రప్రసాద్రెడ్డి తనిఖీ చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కల్వకుంట, బైపాస్, కోత్లాపూర్లోని గురుకుల బాలికల, బాలుర బీసీ హాస్టల్ను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. బాలికల హాస్టల్లోని మరుగుదొడ్లు, కిచెన్, వాష్రూమ్లు, తరగతి గదులు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హాస్టల్ ప్రిన్సిపాల్కు ఆదేశించారు. జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు అబ్రహాం మాదిగ మాట్లాడుతూ..గుండెజబ్బు పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయించాలనే డిమాండ్తో ప్రారంభించిన ఉద్యమమే నేడు ఆరోగ్యశ్రీ పథకం అమలుకు దారి తీసిందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పథకాన్ని అమలు చేశారన్నారు. సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని కంబాలపల్లి,రేజింతల్ తదితర గ్రామాల్లో శుక్రవారం ఆటో ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి హత్నూర(సంగారెడ్డి): గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకతీతంగా సర్పంచులకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి తెలిపారు. మల్కాపూర్ గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్లో శుక్రవారం హత్నూర మండల సర్పంచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి మాట్లాడుతూ...గ్రామాల అభివద్ధి కోసం రాజకీయాలకతీతంగా సమన్వయంతో పనిచేసుకుని సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
నంగునూరు(సిద్దిపేట): ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాజగోపాల్పేట మధిర గ్రామం శివాజీ నగర్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గౌరబోయిన సంతోష్ (30) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పొలం దున్ని పైకి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. పొలంలో కిందపడ్డ సంతోష్పై ట్రాక్టర్ బోల్తా పడడంతో బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరిత, కూతుళ్లు నిత్య, శ్రీఅన్విక ఉన్నారు. -
జోగిపేట డాక్టర్ రమేశ్పై వేటు
జోగిపేట(అందోల్): జోగిపేట ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్)గా పనిచేస్తున్న డాక్టర్ రమేశ్ రోస్టర్ ప్రకారం 24 గంటలపాటు విధుల్లో ఉండాల్సి ఉండగా ఈ నెల 5న ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విధులు నిర్వహించి సంగారెడ్డికి వెళ్లిపోయి ఆయనకు బదులుగా ఆస్పత్రికి సంబంధంలేని డెంటల్ డాక్టర్ రవిని తన స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలే లీకు చేయడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వెంటనే డాక్టర్ రమేశ్ను సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తినడానికి వెళ్లినప్పుడు తన కోసం డాక్టర్ రవి వచ్చాడని, రాత్రి 9గంటల నుంచి ఉదయం వరకు విధులు నిర్వహించానని డాక్టర్ రమేశ్ చెబుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఇన్చార్జి కమిషనర్ ఆదేశానుసారం అధికారుల బృందం విచారణ చేపట్టారు. డెంటల్ డాక్టర్ ఎవరు? జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఒక డెంటల్ డాక్టర్ గత కొంత కాలంగా రిలీవర్ డాక్టర్గా కొనసాగుతున్నారు. సదాశివపేట ప్రాంతంలో డెంటల్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ రవి జోగిపేట ఆస్పత్రిలో రిలీవర్గా పనిచేస్తున్న విషయం ఆస్పత్రిలోని డాక్టర్లందరితోపాటు సూపరింటెండెంట్కు కూడా తెలిసి ఉంటుందని సిబ్బంది అంటున్నారు. కేవలం రమేశ్ డాక్టర్కు ఒక్కరికే రిలీవర్గా ఆయన పనిచేయడంలేదని ప్రస్తుతం ఆస్పత్రిలో పనిచేస్తున్న మరికొంతమందికి కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. మంత్రి దామోదర సీరియస్! ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తును ఆదేశించారు. పర్యవేక్షణ లోపంతోనే... ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంపై అధికారులు సీరియస్గా పరిగణిస్తున్నారు. ప్రతీరోజు డాక్టర్ల సంతకాల రిజిస్టర్ను పరిశీలించాల్సిన ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఈ వ్యవహరంతో తేలిపోయింది. ఆమె కూడా విధులకు సరిగ్గా హాజరుకాకుండానే రిజిస్టర్లో మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టినట్లుగా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డెంటల్ డాక్టర్ చాలా కాలంగా ఆస్పత్రి రిలీవర్గా పనిచేస్తున్న విషయం సూపరింటెండెంట్తోపాటు ఆర్ఎంఓకు సమాచారం ఉన్నా రమేశ్ డాక్టర్ను టార్గెట్ చేసి ఈ విషయాన్ని పత్రికా కార్యాలయాలకు లీకులు ఇచ్చారని తెలుస్తోంది. చాలాకాలంగా రిలీవర్ డాక్టర్గా రవి విధులు ఆస్పత్రి అధికారుల పర్యవేక్షణలోపమే కారణం ఆస్పత్రి ఘటనపై మంత్రి దామోదర సీరియస్ -
టీబీ రహిత సమాజంగా తీర్చిదిద్దాలి
శివ్వంపేట(నర్సాపూర్): టీబీ రహిత సమాజంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన అన్నారు. శుక్రవారం టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. టీబీకి సంబంధించిన అనుమానిత వ్యక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా స్క్రీనింగ్, ఎక్స్రే చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. టీం లీడర్ అవనీష్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్సీసీ కెడెట్లు సేవలందించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు సాయిసౌమ్య, సిబ్బంది ఉన్నారు. -
శిథిలావస్థలో ‘డబుల్ ఇళ్లు’
మరమ్మతుల కోసం నిధులు మంజూరు ● గత ప్రభుత్వంలో పుల్కల్లో నిర్మాణం ● లబ్ధిదారులను ఎంపిక చేసినా కేటాయించని ఇళ్లు ● నిరుపయోగంగా మారిన వైనం గత ప్రభుత్వ హయాంలో పుల్కల్ గ్రామంలో పట్లొల్ల మాణిక్ రెడ్డి వారసులు ఉచితంగా ఇచ్చిన భూమి సర్వే నం.199, 200, 201లో రెండెకరాల విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో 48 డబుల్ బెడ్రూంలు నిర్మించారు. ఒక్కో బ్లాకులో 12 ఇళ్లు ఉన్నాయి. కాగా అప్పుడే నిర్మాణాలు పూర్తి చేసి గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ వివిధ కారణాలతో ఇళ్లను కేటాయించలేదు. దీంతో నాలుగేళ్లుగా వృథాగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు, కిటికీలను, వాష్ రూంలో టైల్స్ కూడా అపహరించారు. ఈ ఇళ్లను కొందరు రైతులు వ్యవసాయ పనిముట్లకు వాడుకుంటుండగా మరి కొందరు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. లబ్ధిదారుల ఆందోళన గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇళ్లను కేటాయించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఓ లబ్ధిదారుడు నిరసన తెలియజేస్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురయ్యాడు. కాగా ఈ ప్రమాదంలో అతడి కాలుని పూర్తిగా తొలగించడంతో దివ్యాంగుడయ్యాడు. అయితే ప్రభుత్వం మారడంతో లబ్ధిదారుల జాబితాను మార్పు చేస్తారేమోనని గత ప్రభుత్వంలో ఎంపికై న లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో పాత ఇళ్లలో ఉండలేక కొందరు శిథిలావస్థకు చేరిన డబుల్ ఇళ్లలోనే ఉంటున్నారు. లబ్ధిదారులు మరమ్మతులు చేయడం కష్టమౌతుందని అధికారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా డబుల్ ఇళ్ల పంపిణీపై క్రెడిట్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తహతహ లాడుతున్నాయి. రూ.80 లక్షలతో ప్రతిపాదనలు నాలుగేళ్ల క్రితం నిర్మించి లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో డబుల్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లకు మరమ్మతులు చేసి లబ్ధిదారులకు కేటాయించాలని సంకల్పించింది. దీంతో మరమ్మతులకు అధికారులకు ఆదేశాలిచ్చింది. డబుల్ ఇళ్ల వద్ద సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, శౌచాలయాల నిర్మాణం, పేయింటింగ్ లాంటి పనులను గుర్తించి రూ.80 లక్షలతో ప్రతిపాధనలు పంపించారు. కాగా నిధులు మంజూరయ్యాయని, మరమ్మతులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అందజేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాగా వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించింది. – పుల్కల్(అందోల్) నా కుటుంబంలో ఎక్కువ మంది ఉంటాం. నాకు ఒక్క గది మాత్రమే ఉంది. ఆ గది కూడా ఇటీవల కురిసిన వానలకు ఉరుస్తుంది. దీంతో విధి లేక నా కుటుంబానికి గతంలో కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివాసం ఉంటున్నాం. కూలీ పని చేసుకొని బతుకుతున్నాం. –ఎండీ షాకీర్(లబ్ధిదారుడు) నేను నివాసముండే ఇల్లు ఇటీవల కాలిపోయింది. దీంతో ఇప్పటి వరకు రేకుల షెడ్డులో నా కుటుంబం నివాసం ఉంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో అప్పట్లో కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివాసముంటున్నాం. మాకు డబుల్ ఇల్లే దిక్కు. –పాండురంగం (లబ్ధిదారుడు) -
కల్తీ మద్యమే కారణం!
అల్లాదుర్గం(మెదక్): కల్తీ మద్యం తాగి వైన్స్ పర్మిట్ రూంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అల్లాదుర్గంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ వివరాల పక్రారం.. మండల పరిధిలోని చేవెళ్ల గ్రామానికి చెందిన రాయప్పగారి వీరన్న(48) గ్రామంలో వృద్ధురాలు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ గ్రామంలో బెల్టు షాపుల నిషేధం అమలులో ఉంది. దీంతో మద్యం దొరకకపోవడంతో తాగేందుకు రాత్రి అల్లాదుర్గంలోని ఓ వైన్స్కు వచ్చాడు. అక్కడ మద్యం తాగి కిందపడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న వీరన్నను చూసి వైన్స్ సిబ్బంది అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వీరన్న మృతి చెందినట్లు నిర్దారించారు. వైన్స్లో కల్తీ మద్యం తాగి తన తండ్రి మృతి చెందినట్లు కొడుకు మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రైలు జనరేటర్ బోగీలో మంటలు
జహీరాబాద్: కర్ణాటకలోని బీదర్ నుంచి బెంగళూర్ మీదుగా యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు (నె.16572) ఇంజన్ వెనుక బోగీలో ఉండే జనరేటర్ విభాగంలో కొద్దిపాటి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సాంకేతిక సిబ్బంది యంత్రాల సహాయంతో అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వేస్టేషన్కు రైలు చేరుకుంది. స్టేషన్లోకి రైలు వస్తున్న క్రమంలో స్టేషన్ సిబ్బంది పొగలు వస్తుండటం గమనించి రైలు సిబ్బందికి సమాచారం అందించారు. స్టేషన్లో రైలు ఆగిన తర్వాత సాంకేతిక సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. అనంతరం రాత్రి 7.25 నిమిషాలకు తిరిగి రైలు బయలుదేరి వెళ్లింది. రైలు నడుస్తున్న సమయంలో మంటలు లేచి ఉంటే కొంత తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేశారు. మంటలను అదుపుచేసిన సాంకేతిక సిబ్బంది జహీరాబాద్ స్టేషన్లో అరగంట పాటు నిలిచిన రైలు -
ఫ్లై ఓవర్ నిర్మించాలి
జహీరాబాద్: ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకుని 65వ జాతీయ రహదారిపై దిగ్వాల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు ఎమ్మెల్యే కె.మాణిక్రావు సూచించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో మాణిక్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్ సమావేశమయ్యారు. అనంతరం దిగ్వాల్ గ్రామాన్ని సందర్శించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిన విధానంపై పరిశీలించారు. అండర్ పాస్ విషయంలో పస్తాపూర్ వద్ద నిర్మించిన విధంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసి పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు తట్టు నారాయణ, వెంకటేశం, సంగమేశ్వర్, నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులతో ఎమ్మెల్యే మాణిక్రావు -
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తోపాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పలు మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) ట్యాంకులు నిండాయన్నారు. రైతులు ప్రధానంగా పత్తి, సోయాబీన్, కంది పంటలను సాగు చేస్తున్నా రని పేర్కొన్నారు. రైతులను పంటల వైవిధ్యం వైపు ప్రోత్సహిస్తున్నామని, ఆరుతడి పంటల సాగు చేపట్టేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని వివరించారు. -
సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిద్దాం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిద్దామని మహిళా జాగరణ సమితి అధ్యక్షురాలు లక్కిరెడ్డి విజయ అన్నారు. సిద్దిపేటలోని వ్యాస మహర్షి యోగా సొసైటీ, మహిళా జాగరణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళల సందడి, సంప్రదాయ వస్త్రధారణ, గోరింటాకు అలంకరణలు, కోలాటాలతో కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా లక్కిరెడ్డి విజయ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా విశిష్టమైన సంప్రదాయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళల్లో ఐక్యతను పెంపొందించి, కుటుంబ విలువలను బలోపేతం చేస్తాయని తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమారెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే యోగా, భారతీయ సంస్కృతి రెండూ అవసరమన్నారు. కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోరింటాకు మహోత్సవంలో పాల్గొన్న మహిళలు -
ఫ్లెక్సీ కడుతుండగా.. కరెంట్ షాక్
● యువకుడి మృతి ● మరో ఇద్దరికి గాయాలు నర్సాపూర్ రూరల్: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వద్ద చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన మల్పర్తి హర్షవర్ధన్(19)తో పాటు బోడ అఖిల్ బాబు, ఎండి ఇర్ఫాన్ ముగ్గురు కలిసి బోనాల సందర్భంగా శివాలయం వద్ద ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు హర్షవర్ధన్ కరెంట్ షాక్కు గురయ్యాడు. అతనితో పాటు ఉన్న బోడ అఖిల్ బాబు, ఎండి ఇర్ఫాన్ హర్షవర్ధన్ను కాపాడే ప్రయత్నంలో షాక్కు గురై గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి హర్షవర్ధన్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అఖిల్ బాబు, ఇర్ఫాన్ను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతునికి తల్లిదండ్రులతో పాటు అన్న, తమ్ముడు ఉన్నారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గడ్డి కట్ చేస్తుండగా కూలీ.. కౌడిపల్లి(నర్సాపూర్): పొలం గట్లపై గడ్డి కట్ చేస్తుండగా కూలీ కరెంట్షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని లింగంపల్లి పంచాయతీ ముడేరితండాలో చోటుచేసుకుంది. ఎస్ఐ అమరేందర్రెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన ముడావత్ సంతోష్(25) తండాకు చెందిన పరంలాల్ పొలంలో గడ్డి కట్ చేసేందుకు కూలీకి వెళ్లాడు. బు్ష్ కట్టర్తో బోర్ బావి పక్కన వరంపై గడ్డి కట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బోర్ కేబుల్వైర్ను గమనించకపోవడంతో బుష్ కట్టర్కు వైర్ తగిలి కరెంట్షాక్ వచ్చి సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా అన్న వదినల వద్ద ఉంటూ కూలీపనులు చేస్తున్నాడు. దీంతో తండాలో విషాదం నెలకొంది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమి త్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
డ్రాపౌట్స్కు ఓపెన్ స్కూల్ ఓ వరం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: చదువు మధ్యలోనే ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిదని, దీని ద్వారా తిరిగి చదువును కొనసాగించవచ్చని జిల్లా విద్యాధికారి రోహిణి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికతోపాటు బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...పదవ, ఇంటర్మీడియెట్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈ నెల 15 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లకు గడువు ఉందని తెలిపారు. ఓపెన్ స్కూల్లో జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8,714 అడ్మిషన్లను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్యం చేరుకునే దిశగా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,273 అడ్మిషన్లు జరిగాయన్నారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ వెంకటస్వామి, డీఈఓ కార్యాలయ ఏడీ శంకర్, సూపరింటెండెంట్లు సురేఖ,రాజు, వనిత, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రోహిణి -
రేవంత్రెడ్డిది ప్రచారార్భాటమే
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ నర్సాపూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప ప్రజలకిచ్చిన హామీల అమలులో ఆయన పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ విమర్శించారు. స్థానిక విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ...ప్రధానమంత్రి మోదీ రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తుండగా సీఎం రేవంత్రెడ్డి రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. అందరికీ రుణమాఫీ చేయలేదని, ఫసల్ భీమా పథకం అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మితేనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులేర్పడ్డాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారాయని ఆయన ఎద్దేవా చేశారు. రైతు సమస్యలతోపాటు పేద ప్రజల సమస్యలను పరిష్కరించని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మల్లేశ్గౌడ్ హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు సురేశ్, రమేశ్గౌడ్, ఆంజనేయులుగౌడ్, నారాయణరెడ్డి, జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ, ఇతర నాయకులు కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవలు మరింత బలోపేతం
సంగారెడ్డి జోన్: జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్తోపాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని కంకోల్, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దిపూర్, సుల్తాన్పూర్, నేరడిగుంట పీహెచ్సీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, జహీరాబాద్ ఎంపీహెచ్లను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా రంగంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. త్రాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పనులను పూర్తి చేయాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
తూప్రాన్: నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఐటీసీ కంపెనీ సహకారంతో మనోహరాబాద్ మండలం కూచారంలో, బంగారమ్మ టెంపుల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలు, 2 ఏఏన్పీఆర్ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించవచ్చని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు వెంకట రాజాగౌడ్, సందీప్ రెడ్డి, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, సర్పంచ్ చిత్ర, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మి నర్సింహ్మగౌడ్, పాలకవర్గ సభ్యులు, ఐటీసీ మేనేజర్ ఆనంద్, స్థానికులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు -
ఆమ్యామ్యాలు
అక్రమ కనెక్షన్లకు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్ల జారీలో కొందరు అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ)లు లేని నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు జారీ చేసిన వ్యవహారంలో గతంలో కొందరు అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. ఇంతజరిగినా కొందరు తీరు మార్చు కోవడం లేదు. ఓసీలు లేని నిర్మాణాలకు యథేచ్ఛగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఓసీలు లేని నిర్మాణాలకు కేటగిరీ మార్చి కనెక్షన్లు ఇస్తున్నారు. ఈ కనెక్షన్ల జారీల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనల ప్రకారం 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భవనాలు, అపార్టుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇతర నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి. తాత్కాలిక కనెక్షన్ల పేరుతో.. నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తున్నారు. టెంపరరీ కేటగిరీ కింద ఈ కనెక్షన్లు ఇస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఓసీలు లేని భవనాలకు టెంపరరీ కనెక్షన్ కూడా ఒక్కటే ఇవ్వాలి. ఎన్ని పోర్షన్లు ఉంటే అన్ని పోర్షన్లకు వేర్వేరుగా టెంపరరీ కనెక్షన్లు ఇవ్వకూడదు. కానీ ఆమ్యామ్యాలకు మరిగిన కొందరు అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలున్నాయి. ఓసీలు లేని భవనాలకు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఇచ్చినట్లు ఆశాఖలో ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి, ఇంద్రేశం, ఇస్నాపూర్ వంటి మున్సిపాలిటీలతోపాటు, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా విద్యుత్ కనెక్షన్లు..? నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని.. ఓసీలు లేక అంతస్తులకు తాత్కాలిక కనెక్షన్లు జిల్లాలో సుమారు 8.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. ఇందులో సుమారు 6.25 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. పట్టణీకరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో అనుమతిలేని నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి రాత్రికి రాత్రే అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు పొందేందుకు అక్రమార్కులు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పుతున్నారు. కబ్జాదారుల అవసరాన్ని కొందరు విద్యుత్ అధికారులు ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో దండుకుని విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఒకరు, అప్పులబాధ భరించలేక ఒకరు, జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇలా.. అనారోగ్యంతో ఒకరు.. ఝరాసంగం(జహీరాబాద్): మండల పరిధిలోని బిడెకన్నె గ్రామానికి చెందిన సంజీవరావు(55) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం సొంత పొలం వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సంధ్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో.. అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొల్లూర్ గ్రామానికి చెందిన అవుటి వీరన్న(50) చేసిన అప్పులు తీర్చలేక బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల5న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవితంపై విరక్తితో.. సిద్దిపేటరూరల్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని తోర్నాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మాసుల కుమార్ (35) మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం బాగాలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మండల్ రిజర్వేషన్లు సాధించుకుందాం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మండల్ స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లను సాధించుకుందామని, సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య చైర్మన్ శ్రీహరి యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక బీజేఆర్ చౌరస్తాలో మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీహరియాదవ్ మాట్లాడుతూ.. 1990 ఆగస్టు 7న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. మండల్ కమిషన్ సిఫారసులని ప్రస్తుత జనాభా నిష్పత్తి ప్రకారం అమలు చేసే వరకు పోరాడాలన్నారు. కార్యక్రమంలో పెరక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ, వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు బోయ రాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరే ఎల్లయ్య కురుమ, అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య యాదవ్ , వీరశైవ లింగ బలిజ సమాజం జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, యాదవ విద్యావంతుల వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ రాము యాదవ్ , నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ కొత్వాల్, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బీడీఎల్లో విద్యార్థుల పర్యటన
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఏఐడీఎస్ విద్యార్థులు భానూర్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)ను సందర్శించి క్షిపణి సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహన పొందారు. బీడీఎల్ అధికారులు మిలన్, కొంకుర్స్, ఇన్వర్, కొంకుర్స్–ఎం ట్యాంక్ విధ్వంసక క్షిపణులు, ఆస్ట్రా గగనతల క్షిపణి వ్యవస్థలపై వివరించారు. ఈ పర్యటనలో ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్, 30 మంది విద్యార్థులు, ఐదుగురు అధ్యాపకులు పాల్గొన్నారు. బీడీఎల్ హెచ్ఆర్ విభాగాధిపతి గంగయ్య బృందానికి స్వాగతం పలకగా, డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు. -
వేర్వేరు చోట్ల రెండు వాహనాలు బోల్తా
చేగుంట(తూప్రాన్): అదుపుతప్పి టమాటా లారీ బోల్తాపడింది. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు టమాటా లోడుతో వెళ్తున్న లారీ మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువచేసే టమాటాలు పాడయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. ట్రాఫిక్ను గుర్తించిన పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు. లోడుతో వెళ్తున్న లారీ.. శివ్వంపేట(నర్సాపూర్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు అతి సమీపంలో లారీ బోల్తా పడగా పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి చేగుంట నుంచి పటాన్చెరుకు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి తూప్రాన్– నర్సాపూర్ హైవే శివ్వంపేట పోలీస్ స్టేషన్ ఎదుట బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ పవన్ యాదవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా రెండు మీటర్ల దూరంలోనే ట్రాన్స్ఫార్మర్ ఉన్నదని తెలిపారు. అదుపుతప్పిన పైపుల లారీ చిన్నకోడూరు(సిద్దిపేట): అదుపుతప్పి లారీ రోడ్డు పక్కకు దూసుకుపోగా డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఇబ్రహీంనగర్, గోనెపల్లి రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. సిమెంట్ పైపుల భారీ లారీ మందపల్లికి వెళ్తుంది. ఈ క్రమంలో ఆ గ్రామాల మధ్య మూల మలుపువద్ద అదుపుతప్పి లారీ రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎవ్వరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
పీఆర్సీని ప్రకటించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయా పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ...గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా పాఠశాలల మూసివేతను ఆపాలని, సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 19న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. 29న చలో హైదరాబాద్ పేరిట జరిగే మహా ధర్నా ఉపాధ్యాయులు భారీ ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాయిలు,సైమన్, రాజు, షకీల్ అహ్మద్, సిరాజ్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక డిజిటల్ రేషన్ కార్డులు
సంగారెడ్డి జోన్: ప్రజా పంపిణీ వ్యవస్థను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు 20 ఏళ్ల తర్వాత అత్యధిక సాంకేతికతతో కూడిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధిత అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం చేతుల మీదుగా.... భద్రత ప్రమాణాలతోపాటు ఆకర్షణీయంగా ఏటీఎం కార్డుల సైజులో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం చేశారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డిలో పలువురు లబ్ధిదారులకు డిజిటల్ రేషన్కార్డులు అందించనున్నారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ–కేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు రేషన్ కార్డు లబ్ధిదారుల ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ–కేవైసీ పూర్తయితే స్మార్ట్రేషన్ కార్డులు పొందే వీలుంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 90% పైగా ఈ–కేవేసీ పూర్తయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15 వరకు 100% పూర్తయ్య దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంద్రాగస్టున సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా పంపిణీ త్వరితగతిన ఈ కేవైసీ పూర్తి చేసే దిశగా చర్యలు నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కాగితానికి స్వస్తి చెప్పి ఏటీఎం కార్డు తరహాలో రేషన్కార్డును రూపొందించారు. చినిగిపోకుండా, తడిసిపోకుండా ఉండేవిధంగా భద్రతా ప్రమాణాలతో రూపకల్పన చేశారు. కార్డుకు ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలు, కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు ముద్రించారు. మరోవైపు క్యూ ఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. సంబంధిత రేషన్ దుకాణాలకు వెళ్లి స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి. త్వరలో ఇదే కార్డుపై బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా రూపకల్పన చేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు 855 ఆహార భద్రతా కార్డులు 4,21,692 అంత్యోదయ కార్డులు 26,664 అన్నపూర్ణ కార్డులు 90 క్యూఆర్ కోడ్తో భద్రం జిల్లాలోని రేషన్ కార్డుల వివరాలు -
గ్రామస్తులకు వద్దు.. ఎకై ్సజ్కు పట్టదు
చిన్నకోడూరు(సిద్దిపేట): కంచే చేను మేసినట్లు అక్రమ మద్యాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమార్కులకే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో ప్రజలంతా ఏకమై మద్యపాన నిషేధం అమలు చేయడానికి తీర్మానించారు. అక్రమ బెల్ట్షాపులను మూసివేయించారు. ఎవ్వరూ అక్రమంగా మద్యం అమ్మవద్దని, అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి ప్రతిజ్ఞకు ఎకై ్సజ్ అధికారులు రక్షణగా ఉండాల్సింది పోయి అక్రమ మద్యం దుకాణాలకు అండగా నిలుస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులకు మొరపెట్టుకుంటే ఎకై ్సజ్ అధికారులు చూసుకుంటారని చెప్పి చేతులెత్తేశారు. మహిళల ఆవేదన రామంచ గ్రామంలో 17 బెల్ట్షాపులు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాలు జరపవద్దని 15 రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎకై ్సజ్, పోలీసు అధికారులకు తీర్మాన పత్రాలను అందజేశారు. కొద్దిరోజులు సజావుగానే సాగినా తిరిగి మద్యం అమ్మకాలు జోరు పెరిగిపోయింది. దీంతో గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. దీంతో పాలకవర్గం, గ్రామ పెద్దలు కలిసి ఎకై ్సజ్ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. బెల్ట్ దుకాణాలు మూసి వేయించాలని పోలీసులకు మొరపెట్టుకుంటే ఇది ఎకై ్సజ్శాఖ అధికారులు చూస్తారంటూ దాటవేసినట్టు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మద్యం షాపులను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ను వివరణ కోరగా ఇటీవలే తన దృష్టికి వచ్చిందని, వెంటనే గ్రామంలోని బెల్ట్ షాపులు మూసి వేయిస్తానని చెప్పారు. మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం అక్రమార్కులకే అధికారుల అండ రామంచ గ్రామస్తుల విమర్శలు -
క్షుద్ర పూజల ఆరోపణ అర్థరహితం
ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ టౌన్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలు అర్థరహితమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెస్స్(ఏఐ)యుగంలో శరవేగంతో ముందుకు వెళ్తున్న సమయంలో క్షుద్రపూజలు, చేతబడి, మూఢనమ్మకాల గురించి మాట్లాడం శోచనీయమన్నారు. ప్రభుత్వ కూలిపోవాలి, వర్షాలు అడ్డుకోవాలని హరీశ్రావు క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నాయకులు అర్థంలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. బాధ్యత పదవుల్లో ఉన్న నాయకులు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని శిశు గృహ, సఖి కేంద్రాలలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారి సంరక్షణకు తోడ్పడాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సఖి కేంద్రాన్ని ఆశ్రయించే వారికి న్యాయపరమైన సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవధ్యక్షుడిగా శ్రీనివాస్ షెట్కార్ నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ షెట్కార్, అధ్యక్షుడిగా కె.బాల్ ఎల్లయ్య, కార్యనిర్వహక అధ్యక్షుడిగా సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బాలయ్య, సాయాగౌడ్, కార్యదర్శిగా అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా జె.శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కృష్ణ, మహిళా కార్య దర్శిగా రేణుక, ముఖ్య సలహాదారుడిగా భూషణం, సలహాదారుడిగా నాగభూషణం, ప్రచార కార్యదర్శిగా యాదయ్య, కోశాధికారిగా పండరి ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడు సిల్వర్ చంద్రశేఖర్ సంగారెడ్డి: ముదిరాజ్ సమాజం ఐక్యంగా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో కూడా విశిష్ట స్థానం సాధించగలదని ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షుడు సిల్వర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ముదిరాజ్ సంఘం భవనంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 9న నిర్వహించనున్న బోనాల మహోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గణనీయమైన జనాభా కలిగిన ముదిరాజ్ సమాజం రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని చెప్పారు. యువత చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు ప్రచారం సరికాదు
నారాయణఖేడ్: అబద్ధాలు చెబుతూ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి హితవు పలికారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ హయాంలోనే బోరంచ, గూడూరు, శాపూర్ పథకాల ద్వారా నియోజకవర్గానికి తాగునీటిని అందించే ఏర్పాట్లు దశాబ్దాల కిందటే జరిగిందన్నారు. బీఆర్ఎస్ మిషన్ భగీరథ పేరిట పాత పైపులైన్లు, రోడ్లను తవ్వేసి కొత్తవి వేసి రోడ్లు పూడ్చకపోగా పైపులైన్లు అప్పుడే లీకవడం ప్రారంభించాయని మండిపడ్డారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు అత్యవసరమని 2016లోనే డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా తమ ప్రభుత్వం మరమ్మతులు చేయిస్తోందని తెలిపారు. అయినా నీటిసమస్య లేకుండా చూడటమే కాకుండా మున్సిపాలిటీ, గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా బోర్లు వేశామని చెప్పారు. బీఆర్ఎస్ నాలుగు విడతల్లో రూ.లక్ష రైతు రుణమాఫీ చేస్తే తమ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. వ్యవసాయ పనిముట్లు, రాయితీ విత్తనాలను బీఆర్ఎస్ సర్కారు నిలిపివేయగా రైతుభరోసా అమలు చేస్తూనే వాటిని పునరుద్ధరించామని గుర్తు చేశారు. భూపాల్రెడ్డికి అవగాహన లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగచర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, సీడీసీ మాజీ చైర్మన్ నర్సిహ్మారెడ్డి, తాహెర్అలీ, పండరీరెడ్డి, అశోక్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డి -
హరీశ్రావుపై ఆరోపణలు సరికాదు
నర్సాపూర్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తన హోదాను విస్మరించి మాజీమంత్రి హరీశ్రావుపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. గురువారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తారని, మాజీమంత్రి హరీశ్రావు తన వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడ క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. జయశంకర్కు నివాళులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సునీతారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
జయశంకర్ పోరాటస్ఫూర్తి మార్గదర్శకం
నారాయణఖేడ్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పోరాటస్ఫూర్తి ప్రతీ ఒక్కరికి మార్గదర్శకమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ క్యాంపు కార్యాలయ ఆవరణలో జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే ధారపోసిన మహనీయుడన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నగేశ్ షెట్కార్, కమిషనర్ ప్రశాంతి, కౌన్సిలర్లు జయంతిని నిర్వహించారు. జర్నలిస్టు కాలనీలో జయశంకర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, వివిధ ప్రభుత్వకార్యాలయాల్లో సంబంధిత అధికారులు చిత్రపటాలకు పూలమాలలు వేపి నివాళులర్పించారు. మలిదశ ఉద్యమంలో ప్రధాన పాత్ర జోగిపేట(అందోల్): తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా చిత్తశుద్ధితో తొలి, మలి దశ ఉద్యమాల్లో తనదైన పాత్రను పోషించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఒక్కరేనని అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు తెలిపారు. జయశంకర్ 92వ జయంతి సందర్భంగా జోగిపేటలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి సభకు వీరు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు తొట్ల రామకృష్ణ, రేఖాప్రవీణ్, జ్యోతి ప్రదీప్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాబ్ బుక్ చేసి.. ఆపై దొంగిలించి
సిద్దిపేటకమాన్: దూరప్రాంతాలకు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకుంటాడు. కారులో దర్జాగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో భోజనం చేయాలని, రెస్టు తీసుకోవాలంటూ నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకు వెళ్తాడు. అక్కడ డ్రైవర్ను ఏమార్చి కారుతో పరారవుతాడు. వాటిని ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తాడు. ఇదీ.. ఓ అంతర్రాష్ట్ర దొంగ స్టైల్. చివరికి పోలీసులకు చిక్కాడు. సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ గురువార ంఆ వివరాలను వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్కు చెందిన పెండ్యాల సుదర్శన్ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. 2019లో గజ్వేల్ పరిధిలోని ఓ రాజకీయ నాయకురాలి వద్ద డ్రైవర్గా పనిచేస్తూ రూ.50 వేలు దొంగిలించిన కేసులో తొలిసారిగా జైలు పాలయ్యాడు. జైలులో పరిచయమైన తోటి ఖైదీలతో చేతులు కలిపి బైటకు వచ్చాక వాహనాలను దొంగతనాలు ప్రారంభించాడు. ఈ కమ్రంలో జులై 2న ఎల్బీనగర్ ఫ్లైఓవర్ వద్ద సుదర్శన్ కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లడానికి వికారాబాద్ జిల్లాకు చెందిన అంగోత్ తుల్జా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అదేరోజు రాత్రి మల్లన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మంగోల్ ఎక్స్ రోడ్డు వద్ద డ్రైవర్ మూత్ర విసర్జన కోసం కారు పక్కకు ఆపగా అదే అదునుగా సుదర్శన్ కారుతో పరారయ్యాడు. దీంతో కారు డ్రైవర్ కుకునూర్పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సదర్శన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పలుచోట్ల కార్ల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.10 లక్షల విలువైన రెండు కార్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషిచేసిన సీఐ లతీఫ్, ఎస్ఐ బాలకృష్ణ, కానిస్టేబుళ్లు రమేశ్, రాజు, శివ, రాజేశ్, రత్నాకర్, చంద్రం, సిబ్బందిని ఆమె అభినందించారు. అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు రూ.10 క్షల విలువైన వాహనాలు స్వాధీనం వివరాలు తెలిపిన సీపీ రష్మీ పెరుమాళ్ -
వ్యసనాలకు బానిసై బలవన్మరణం
కొల్చారం(నర్సాపూర్): వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో రంగంపేటలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ హైమద్ మొహినొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల లింగం యాదమ్మల రెండో కుమారుడు వేముల కుమార్(29) ఒక ఫాస్ట్ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పనిచేసేవాడు. అయితే ఏడాదిగా పని మానేసి మద్యానికి బానిసయ్యాడు. దీనికి తోడు పెళ్లి సంబంధాలు రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర మనస్థాపానికి లోనవుతూ వచ్చాడు. బుధవారం రాత్రి భోజనం చేసి తన గదిలో పడుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు గది తలుపు తెరిచి చూడగా కుమార్ గదిలోని సీలింగ్కు చీరతో ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువతకు స్వయం ఉపాధి
మెదక్ కలెక్టరేట్: క్రిస్టియన్, మైనార్టీ సంక్షేమానికి నిరంతరం కృషి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిండమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబిత పేర్కొన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె గురువారం సీఎస్ఐ చర్చ్ను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మైనార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్రిస్టియన్ మైనార్టీలకు ఆర్థికాభివృద్ధి కోసం పథకాలు కేటాయించారన్నారు. ఇందుకోసం జూలై 3 నుంచి 31 వరకు 198 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఇందులో కుట్టు మెషీన్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ దరఖాస్తుల స్క్రీనింగ్ జరుగుతుందని ఈ నెల 11న రాష్ట్ర కార్యాలయానికి అర్హుల జాబితా అందిస్తే వారికి స్కూటీలు, కుట్టు మెషీన్లు, రూ.50వేల రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 200ల వరకు దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారం రోజుల్లో వాటిని పరిశీలించి రుణాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతకుముందు డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్తో సమావేశమై మైనార్టీ సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ఆమె వెంట జిల్లా మైనార్టీ ఇన్చార్జి అధికారి ఉపేందర్ తదితరులున్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత -
పొల్యూషన్ క్యాష్ బోర్డు
ఇలాగే లక్షల్లో చేపలు మృతి చెందిన చిట్కుల్ చెరువు ఇది. గతంలో ఇలాగే వర్షం నీటి మాటున రసాయన వ్యర్థాలు చెరువులోకి వదలడంతో చేపలన్నీ మృత్యువాత పడ్డాయి. దీనిపై హైకోర్టు కూడా సుమోటోగా విచారణ చేపట్టింది. బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశించి దాదాపు ఏడాది గడుస్తున్నా పీసీబీ అధికారులు బాధ్యులెవరో తేల్చలేదు. పైగా కాలుష్య కారక పరిశ్రమలు ఆ దరిదాపుల్లో లేవని నివేదిక ఇస్తూ ఏకంగా హైకోర్టునే పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోతే లక్షల్లో చేపలు ఎలా మృత్యువాత పడ్డాయో ఆ విభాగం అధికారులకే తెలియాలి. చనిపోయి నీళ్లల్లో తేలుతున్న ఈ వేలాది చేపలున్న ఈ చెరువు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం పెద్ద చెరువు. ఈ ఆదివారం వెలుగులోకి వచ్చింది. సమీపంలో ఉన్న రెడ్ క్యాటగిరీ పరిశ్రమలు వదలిన రసాయన వ్యర్థాలతో ఇలా సహజసిద్ధమైన ఈ చెరువు నీరు కాలకూట విషంగా మారి చేపలతోపాటు, అందులో ఉండే జీవజాలం మొత్తం నశించిపోయింది. చెరువునే నమ్ముకున్న మత్స్యకారులు తమ జీవనాధారం కోల్పోయారు. నెలవారీ మామూళ్లకే పరిమితమయ్యే కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ఎప్పటిలాగే నీటి శాంపిళ్లను సేకరించి..ల్యాబ్కు పంపారు. పరిశ్రమల యాజమాన్యాలు ల్యాబ్ అధికారులను సైతం ‘ప్రభావితం’చేయడం పరిపాటే కావడంతో.. చెరువులో నీరు తమ లాగే ’స్వచ్ఛంగా’ఉందనే నివేదిక వస్తుందనే అభిప్రాయం నెలకొంది. అందుకే పీసీబీని పొల్యూషన్ క్యాష్ బోర్డుగా కూడా అభివర్ణిస్తున్నారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : తరచూ వెలుగులోకి.. కాలుష్య కారక పరిశ్రమలు చేస్తున్న విధ్వంసాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఫార్మా, రసాయన పరిశ్రమలు వర్షం నీటిలోకి వదులుతున్న రసాయన వ్యర్థాలతో స్వచ్ఛమైన చెరువుల నీరు కాటకూట విషంగా మారి జీవకోటి మనుగడకు శాపంగా మారుతోంది. పైన పేర్కొన్న ఉదాహరణలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలను ‘ప్రభావితం’చేయగల బడా బాబులవే ఈ పరిశ్రమలు కావడంతో పీసీబీ వీటిపై కనీస చర్యలు చేపట్టడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది. నివేదికల పేరుతో దాటవేత జిల్లాలో పరిశ్రమల్లో రెడ్ క్యాటగిరీ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు సుమారు 800 వరకు ఉంటాయి. ఇందులో ఫార్మా, బల్క్డ్రగ్, కెమికల్ వంటి పరిశ్రమలున్నాయి. జెడ్ఎల్డీ (జీరో లిక్విడ్ డిస్చార్జి) ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని కాలుష్య జలాలు బయటకు రాకుండా పరిశ్రమలను నడపాల్సిన యాజమాన్యాలు ఇలా నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను ఇష్టానుసారంగా వదలడంతో ఈ విధ్వంసాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చే వరకు స్పందించని పీసీబీ అధికారులు నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. ల్యాబ్ రిపోర్టుల్లో అంతా స్వచ్ఛంగానే ఉన్నట్లు వస్తుండటం కూడా పలు ఆరోపణలు దారితీస్తోంది. దీంతో పీసీబీ చర్యలు చేపట్టిన దాఖలు కనిపించడం లేదు. రుద్రారం చెరువు ఘటనపై వివరణ కోసం ‘సాక్షి’ప్రతినిధి పీసీబీ కార్యాలయానికి ఫోన్ చేయగా..ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విజయలక్ష్మి అందుబాటులో లేరు. నీటి శాంపిళ్లను ల్యాబ్కు పంపామని తెలిపారు. పరిశ్రమల రసాయన వ్యర్థాలతో రుద్రారం చెరువులో చేపలు మృతి గతంలో చిట్కుల్ చెరువులోనూ ఇలాంటి ఘటనే.. హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టినా.. మారని తీరు చర్యలు చేపట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి మీనమేషాలు శాంపిళ్ల సేకరణ..ల్యాబ్ రిపోర్టుల పేరుతో దాటవేత.. విమర్శలకు దారితీస్తున్న పీసీబీ అధికారులు తీరు -
శతాధిక వృద్ధుడు..
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లి బతుకమ్మతండాకు చెందిన మెగావత్ పకీరనాయక్(104) బుధవారం రాత్రి అస్వస్థతకుగురై మృతి చెందా రు. తన పనులు తాను చేసుకుంటు ఆరోగ్యంగా ఉన్న అతను అస్వస్థతకు గురై మృతి చెందారు. అతనికి భార్య మాలి, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో పాటు అయిదు తరాలకు చెందిన మునిమనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. గురువారం అతని అంత్య క్రియలు తండాలో నిర్వహించారు. ఆయన తండావాసుల ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేశారని స్థానికులు కొనియాడారు. -
సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు
● ఇద్దరు కార్మికులు పురస్కారానికి ఎంపిక ● రామప్ప, గొల్లభామ చీరలకు అవార్డులు సిద్దిపేటజోన్: ప్రాచీన సంప్రదాయానుసారంగా కులవృత్తిలో దశాబ్దాలుగా ఇమిడిపోతున్న నేతన్నల శ్రమజీవన సౌందర్యానికి గుర్తింపు దక్కింది. వృత్తి నైపుణ్యాలతో అద్భుతమైన ప్రతిభ చూపిన ఇద్దరు చేనేత కార్మికులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇర్కోడ్ చేనేత సహకార సంఘానికి చెందిన హనుమంతు ఒకే చీరపై నేసిన ముత్యం పేట, గొల్లభామ చీరకు అవార్డు లభించింది. అదేవిధంగా సిద్దిపేట చేనేత సహకార సంఘానికి చెందిన వల్లకాటి అశ్విని నేసిన రామప్ప చీరకు కూడా అవార్డు దక్కింది. వీరిని చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. రూ.25 వేల నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించనున్నారు. ఏడేళ్లలో అవార్డు సొంతం మహిళగా వంటఇంటికే పరిమితం కాకుండా.. చేనేతపై చూపిన ఆసక్తి ఏడేండ్లలో అవార్డు అందుకునేలా చేసింది. ఒకప్పుడు బీడీలు చేసి జీవనోపాధి పొందిన అశ్విని చీరలను నేయాలనే ఆసక్తి మేరకు వృత్తి వైపు దృష్టి సారించింది. మొదట్లో గొల్లభామ, చీటికీ చీరలు నేసి, రామప్ప దేవాలయం ప్రశస్తి తెలిపే ప్రతిమలను చీరపై నేశారు. 20 రోజుల పాటు కస్టపడి రామప్ప చీర తయారు చేశారు. ప్రభుత్వం ఈ యేడు రాష్ట్రస్థాయి అవార్డుకు అశ్విని నేసిన చీరను ఎంపిక చేసింది. ఆసక్తి మేరకు.. చేనేత వృత్తిపై ఆసక్తి మేరకు నేను నేతపని మొదలు పెట్టా. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వృత్తి నైపుణ్యాలను సాధించి నేడు గొల్లభామ, రామప్ప చీరలు నేస్తున్నా. ప్రస్తుతం బతుకమ్మ అందాలను చీరల మీద వేయడానికి ప్రయత్నిస్తున్నా. అవార్డు రావడం సంతోషంగా ఉంది. – వల్లకాటి అశ్విని కొత్తగా ఉంటుందని.. చేనేత వృత్తినే జీవనాధారం చేసుకొని నలభై యేళ్లుగా బతుకు బండిని నడుపుతున్నా. మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతాల్లో యేళ్ల కొద్దీ చేనేత వృత్తి లో మెళకువలను నేర్చుకున్నా. గొల్లభామ, ముత్యంపేట చీరలు రెండు వేర్వేరుగా ప్రసిద్ధి పొందాయి. వాటిని ఒకే చీరలో నేసి కొత్తదనం అందించే ప్రయత్నం చేసిన. చీర నేయటానికి 20 రోజులు పట్టింది. నేను నేసిన చీరకు రాష్ట్ర అవార్డు రావడం ఆనందంగా ఉంది. – హనుమంతు, చేనేత కార్మికుడు -
జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక
పటాన్చెరు: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలనీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అభివర్ణించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ దేవతల బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్గౌడ్, కౌన్సిలర్ వెంకటేశ్, ఆంజనేయులు, సీనియర్ నాయకులు నరేందర్రెడ్డి, మేరాజ్ ఖాన్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చిట్కుల్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ -
ఉద్యాన పంటలతో అధిక లాభాలు
ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి ములుగు(గజ్వేల్): ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని, సాగు విస్తీర్ణం పెరగాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిదాయలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్.రాజిరెడ్డి అన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై ముల్కనూరు రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలోని 24 గ్రామాలలో ఇప్పటికే 750 మంది రైతులకు శిక్షణనిచ్చామన్నారు. రాజేంద్రనగర్ కూరగాయల రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త శ్రీనివాస్, పరిశోధకురాలు నిరోష, శాస్త్రవేత్తలు లావణ్య, సురేశ్కుమార్ తదితరులు ఎల్నినో ప్రభావం, నాణ్యమైన నారుమడి తయారీ, యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణనిచ్చారు. అనంతరం క్షీరసాగర్లో సర్పంచ్ బాల్రెడ్డి, ఉపసర్పంచ్ పరశురాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్ర ప్రదర్శనకు రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తరణి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు హక్కులు, అదేవిధంగా బాధ్యతలు కూడా ఉంటాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తరణి అన్నారు. స్థానిక బీసీ గురుకుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఽఆధ్వర్యంలో గురువారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యను ఆయుధంగా చేసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ రవికుమార్, టూటౌన్ సీఐ మురళి, అసిస్టింట్ ప్రిన్సిపాల్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరుటౌన్: ఒక యువకుడి ఇంటి ఎదుట గర్భిణి నిరసన వ్యక్తం చేసిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. పటాన్చెరు నాయికోటి బస్తీకి చెందిన శ్రవణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆయువతి ఆరోపించింది. దీంతో శ్రవణ్ కుటుంబ సభ్యులు 112కు ఫోన్ చేయడంతో పటాన్చెరు పోలీసులు వచ్చి యువతిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా గతంలో చందానగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైందని, కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. యువతికి సర్ది చెప్పడంతో వెళ్లిపోయిందని తెలిపారు. వివాహిత అదృశ్యం నర్సాపూర్రూరల్: వివాహిత అదృశమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని ఖాజీపేటకు చెందిన పల్లె నరేశ్ భార్య నందిని బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో నరేశ్, కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ తెలియరాలేదు. గురువారం భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నందిని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె పింక్ కలర్ చీర, బ్లౌజ్ ధరించి ఉందని, ఎవరికై నా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. రేషన్ బియ్యం పట్టివేత రామచంద్రాపురం(పటాన్చెరు): హైదరాబాద్ నుంచి గుజరాత్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాలశాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్న ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు, కొల్లూర్ పోలీసులు కలిసి కొల్లూర్ రింగ్రోడ్డుపై గురువారం ఒక లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో 335 క్వింటాళ్ల బియ్యాన్ని సాధ్వీనం చేసుకున్నారు. ఆ బియ్యం విలువ సుమారు రూ.10.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బియ్యాన్ని పటాన్చెరు సివిల్ సప్లయ్ గోదాముకు తరలించి లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో డీటీసీఎస్ అనూప్, ఎస్ఐ రాంబాబు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
తూప్రాన్: పొలానికి వెళ్లిన రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన మండలంలోని నర్సంపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జింక నాగార్జున(26) రోజూ మాదిరిగా గురువారం ఉదయం పొలం వద్ద కట్టేసిన గేదెలకు పాలు పితకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ తెగి పడిన విద్యుత్ తీగ కనిపించింది. కరెంట్ సరఫరా లేదని భావించి ఆ తీగను పక్కకు తొలగించడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప పొలంలో ఉన్న ఓ రైతు గమనించి నాగార్జున కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జింక శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఇద్దరు.. పెద్దశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో మండలంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. పెద్దశంకరంపేట శివారులోని గురుపాదగుట్ట వద్ద ఆదివారం రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పేటకు చెందిన ఆర్ఎంపీ తోట రవీందర్, మల్కాపూర్ గ్రామానికి చెందిన మునావత్ జైపాల్ హైదరాబాద్లో చికిత్స పొందు తూ మృతి చెందారు. తోట రవీందర్ బుధవారం రాత్రి బ్రెయిన్డెడ్ కాగా, జైపాల్ గురువారం గాంధీ ఆస్పతిల్రో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఒక ప్రమాదం రెండు కుటుంబాలలో తీవ్రవిషాదాన్ని నింపింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆర్ఎంపీ తోట రవీందర్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాహనం ఢీకొని... సదాశివపేటరూరల్(సంగారెడ్డి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఆరూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరూర్ శివారులోని గోల్డెన్ దాబా సమీపంలోని పబ్లిక్ టాయిలెట్స్ ఎదురుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డును దాటుతున్నాడు. ఇదే క్రమంలో సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, నలుపు రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసినవారు 87126 61833, 87126 56721 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. జైపాల్(ఫైల్)రవీందర్(ఫైల్) -
విభిన్నం వృత్తిలో నైపుణ్యం
Iబతుకు పోరులో బహుదూర బాటసారులు I పోటీని ఎదుర్కొంటూ ముందుకు I నేతన్నలకు పథకాలు అంతంతే భారతీయ సంస్కృతికి, సనాతన సంప్రదాయానికి నిలువుటద్దం మన చేనేత కళ. కాలం మారుతున్నా, ఆధునిక యంత్రాల పోటీ పెరుగుతున్నా.. నేతన్నల చేతి వేళ్ల నైపుణ్యం మగ్గాలపై నేసే వస్త్రాల వైభవమే వేరు. గద్వాల పట్టు, పోచంపల్లి, వెంకటగిరి వెలుగులు.. ఇలా ప్రతి నూలుపోగులోనూ ఒక అద్భుత చరిత్ర దాగి ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో స్వదేశీ స్ఫూర్తిని రగిల్చిన ఆగస్టు 7వ తేదీని పురస్కరించుకుని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కళను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సిద్దిపేటజోన్: మార్కెట్లో వస్తున్న సాంకేతిక మార్పులకు ధీటు గా నేతన్నలు విభిన్న డిజైన్లలో ముందుకు సాగుతున్నారు. పీతాంబరం, పట్టు, గొల్లభామ, రామప్ప, ముత్యం పేట, గొల్లభామ మామిడి బుట్టలు, లినెన్ చీటికీ, సికో గొల్లభామ, ఆర్ముర్ సిల్క్ లాంటి డిజైన్లలో చీరలు నేసి ఉనికి కాపాడే క్రమంలో నేతన్నలు తాపత్రయ పడుతున్నారు. అయితే రోజంతా పడిన కష్టానికి మాత్రం ఫలితం దక్కడం లేదన్న వ్యథ చేనేత కార్మికుల్లో ఉంది. దయనీయ స్థితి సిద్దిపేట చేనేతకు పెట్టింది పేరు. అంతర్జాతీయ స్థాయిలో గొల్లభామ చీరల అద్భుతమైన వృత్తి నైపుణ్యాలను పుణికి పుచ్చుకున్న సిద్దిపేట నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. అటు దశాబ్దాలుగా కులవృత్తిని నమ్ముకొని సాగుతున్న నేతన్నలు ఇటు ఇమడలేక, అటు ఎదగలేక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో చేనేతశాఖ రికార్డుల ప్రకారం..18 సొసైటీల్లో అధికారికంగా 2,900 మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ జియోట్యాగ్ నిబంధనల మేరకు జిల్లాలో 551 మంది ప్రభుత్వ తీఫ్ట్ సాయం పొందుతున్నారు.. ఈ లెక్కన వృత్తిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న వేలాది చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. అంతంతే.. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు అంతంత మాత్రమే.. కొన్ని పథకాల అమలు నామమాత్రంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గత 14 నెలలుగా త్రిఫ్ట్ పథకం సాయం అందడం లేదు. నేతన్న భరోసా పథకం, వ్యక్తిగత రుణాల మంజూరు, జియో ట్యాగ్ పెండింగ్, క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, చనిపోయిన నేత కార్మికుల బీమా డబ్బుల జాప్యం తదితర సమస్యలు చేనేత కార్మికులను వీడడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించి చేనేత పరిశ్రమలో పూర్వవైభవం తేవాలని నేతన్నల ఆకాంక్ష. -
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్/సంగారెడ్డి క్రైమ్: సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల బారినపడకుండా ఉండేందుకు సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్ మోసాలను గుర్తించే విధానం వంటి అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..సైబర్ మోసాలు, వివిధ రూపాలు వాటి నుంచి రక్షణ పొందే మార్గాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, సోషల్ మీడియా మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సైబర్ పత్రికపై అవగాహన కల్పించే పోస్టర్లను రూపొందించారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, పట్టణ సీఐ రామునాయుడు, సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల అధినేత సాల్మన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికారులకు సవాల్..!
హత్నూర (సంగారెడ్డి): అధికారులకు సవాలుగా...శిఖం భూముల్లో యథేచ్ఛగా వరి నాట్లు.. ఏకంగా 14 ఎకరాల్లో వరి సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. అయినా అధికారులు నామ్కే వాస్తేగా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటన హత్నూర మండలం బ్రాహ్మణగూడ గ్రామ శివారులోని అయ్యవారి చెరువు శిఖంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. అయ్యవారు చెరువు శిఖం 400 సర్వే నంబర్లో 62 ఎకరాల శిఖం భూమి ఉండగా 14 ఎకరాల్లో ఆరు బోర్లు వేసుకుని సొంతభూమి లాగా కబ్జాల కుసోని ప్రతీ ఏడు వరి సాగు చేస్తూ కొంతమంది లబ్ధి పొందుతున్నారు. ఫిర్యాదులు వస్తే నామ్ కే వస్తేగా శిఖం భూమి హద్దు బందులు హద్దు బంధువులు పాతి చేతులు దులుపుకున్నారు. ఆరు బోర్లు వేసి దర్జాగా శిఖం భూమిని అచ్చు కట్టి పొలంగా మార్చి వరి సాగు చేస్తూ ఏడాదికి రెండుసార్లు పంటలు పండిస్తూ ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఎకరాల్లో వరి సాగు తతంగం నడుస్తున్న ఇటు రెవెన్యూ అటు నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో ఏదో ఒకటి జరిగిందన్న లోలోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి శిఖం భూమిలో ఏకంగా 14 ఎకరాల వరి సాగు ఆరు బోర్లు వేసుకుని సాగుచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు విజ్ఞప్తి చేశారు. హద్దులు పాతినా పట్టించుకోని వైనం అయ్యవారి శిఖం భూమిలో 14 ఎకరాల్లో వరి సాగు చూసీచూడనట్లు వివరిస్తున్న అధికారులు ఇప్పటికే హద్దులు ఏర్పాటు చేశాం అయ్యగారి చెరువు శిఖం భూమి కబ్జాకు గురికావడంతో గతంలో హద్దులు పాతి చికం భూమిలో వరి సాగు చేయవద్దని చెప్పడం జరిగింది. 14 ఎకరాల్లో ఆరు బోర్లు, వరి సాగు చేయడానికి గుర్తించామని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయినా ప్రస్తుతం కూడా కొంతమంది 14 ఎకరాల్లో వరిసాగు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటాం. –శ్రీకాంత్ ఏఈ, నీటిపారుదల శాఖ -
మల్లుపల్లిలో గ్రామ కంఠం భూ వివాదం
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని మల్లుపల్లిలో గ్రామ కంఠం భూవివాదం రాజుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన తిప్పరమైన సాయికుమార్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎంపీఓ ఫహీం ఆధ్వర్యంలో బుధవారం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. గతంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు తనకున్న మూడు గుంటల భూమిలో రెండు గుంటల భూమిని స్వచ్ఛందంగా అప్పజెప్పినప్పటికీ, ప్రస్తుతం ఒక గుంట భూమిలో పశువుల పాకను ఏర్పాటు చేసుకున్నానని ఫిర్యాదుదారుడు సాయికుమార్ అధికారుల ముందు వాపోయాడు. ఎన్నికల సమయంలో సహకరించలేదన్న కారణంతో సర్పంచ్ కనకరాజు మిగిలిన తన భూమిని కూడా తీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన స్థలాన్నే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వాపోయాడు. అయితే గ్రామ అభివృద్ధి కోసమే గ్రామస్తుల సహకారంతోనే స్థలాన్ని సేకరిస్తున్నామని, ఇందులో ఎలాంటి కక్షపూరిత వ్యవహారాలు లేవని సర్పంచ్ కనకరాజు స్పష్టం చేశారు. అనంతరం ఎంపీఓ పహీం మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారులకు పూర్తి సమాచారాన్ని నివేదించి త్వరలో భూ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలపడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం సద్దుమణిగింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం -
అమ్మ దయ ప్రజలందరిపై ఉండాలి
నాగర్కర్నూల్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి పటాన్చెరు టౌన్: అమ్మ దయ ప్రజలందరిపై ఉండాలని నాగర్ కర్నూల్ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, కల్వకుర్తి కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి శ్రీనిధి పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి నీలం మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు బుధవారం వైభవంగా కొనసాగాయి. రెండోరోజు శ్రీ దుర్గాదేవి ఆలయంలో నిర్వహించిన పూజల్లో నాగర్ కర్నూల్ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, ఆమె భర్త హైకోర్టు న్యాయవాది దశరథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నీలం మధు ఏర్పాటు చేసిన ఫలహారం బండి ఊరేగింపులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ సుశీల జహీరాబాద్: తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని ఐసీడీఎస్ సీడీపీఓ సుశీల, జహీరాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శిరీషరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో బుధవారం అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..శిశువుల ఆరోగ్య సంరక్షణలో తల్లిపాల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. పుట్టిన గంటలోనే తల్లిపాలను ప్రారంభించాలన్నారు. తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలనే అందించాల్సిన అవసరాన్ని వివరించారు. కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని అనంతసాగర్లో ఉన్న ఎర్ర కాలువకు గండి పడటంతో పొలాల్లోకి వరద చేరుతోంది. దీంతో పంటపొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎర్రకాలువకు గండి పడటంతో నీటిని దారి మళ్లించడానికి రైతులు తమ సొంత డబ్బులు పెట్టి జేసీబీతో మొరం వేయించి మరమ్మతులు చేశారు. ప్రతీ ఏటా మోమిన్పేట చెరువులో నుంచి మల్కాపూర్ పెద్ద చెరువుకు ప్రవహించే ఎర్రకాలువ ప్రమాదకరంగా మారుతుండటంతో కాల్వకు గండి పడకుండా మరమ్మతులు చేయాల్సిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఎర్రకాలువ గండి పడకుండా పూర్తిస్థాయి మరమ్మతు పనులు చేపట్టాలని, కల్వర్టు నిర్మించి రైతులు పొలాలకు వెళ్లేందుకు దారిని బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. -
కొత్తరూపు
ఏడుపాయలకురూ.500 కోట్లతో మాస్టర్ ప్లాన్ఐదుశాఖల పరిధిలో..! ● ఎండోమెంట్ కమిషనర్తో చర్చించిన ఎమ్మెల్యే ● త్వరలో సీఎం దృష్టికి ఫైల్ ఏడుపాయల వనదుర్గామాత దేవస్థానంస్వయంభూగా వెలసిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ రూపురేఖలు మారబోతున్నాయి. అందుకోసం రూ.500 కోట్లతో ఓ ఏజెన్సీ నిర్వాహకులతో స్థానిక ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్తో చర్చలు జరిపారు. ఈ ఫైల్ త్వరలో సీఎం దృష్టికి వెళ్లనుంది. మెదక్జోన్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి శివారులోగల ఏడుపాయల వనదుర్గామాత ఆలయం రాతిగుహలో స్వయంభూగా వెలిసింది. ఇక్కడ మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. ప్రతీ ఏటా ప్రభుత్వం నుంచి రూ.2 కోట్ల నిధులు విడుదల చేసి రాష్ట్ర సర్కార్ తరఫున అమ్మవారికి ఎమ్మెల్యే పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే దసరా పండగను పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. మాఘ అమావాస్య రోజున పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిధిలో నిర్మించిన అద్దె రూములతోపాటు హరితహోటల్, ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన గదులు (రూములు) ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు సరిపడా సౌకర్యాలు లేవు. మారనున్న రూపురేఖలు! ఈ మాస్టర్ ప్లాన్ అమలుతో ఏడుపాయల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఏమాత్రం పెద్ద వర్షం కురిసి ఎగువభాగంలోని ఘనాపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లినా వరదనీటితో అమ్మవారి ఆలయం మునిగిపోతుంది. దీంతో భక్తుల కోసం రాజగోపురంలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. ఇది ప్రతీఏటా జరుగుతున్నతంతు. కాగా, మాస్టర్ప్లాన్లో భాగంగా రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు భారీ బ్రిడ్జిని నిర్మించి లిఫ్టు ఏర్పాటు చేయనున్నారు. అటు అమ్మవారి ఆలయం ముందు, ఇటు రాజగోపురం ముందు రెండు సైడ్లలో సుమారు 12 ఫీట్ల ఎత్తులో గోడను నిర్మించనున్నారు. దీంతో ఎగువభాగం నుంచి ఎంత పెద్ద వరద వచ్చినా, ఆలయంలోకి నీరు వెళ్లదు. దీంతో వరదలు వచ్చినా రాజగోపురం నుంచి భారీ స్థాయిలో ఏర్పాటు చేసే లిఫ్టు ద్వారా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయానికి పక్కనే ఒడిబియ్యం, బోనాలకు, కుంకుమార్చన కోసం ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రాజగోపురం సమీపంలో ప్రసాదాల కౌంటర్, ఆఫీస్గెస్ట్ హౌజ్, టాయిలెట్స్, వాష్రూముల నిర్మాణాలు, బట్టలు మార్చుకునే గదులు, అక్కడి నుంచి నదీ తీరం ఘనాపూర్ ప్రాజెక్టు వరకు గార్డెన్ నిర్మాణం, నదీ వైపున ఫెన్సింగ్ ఏర్పాటు, నదిపొడుగునా షవర్ల నిర్మాణాలు, అండర్గ్రౌడ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ స్థలాలు... అలాగే భక్తులు ఉండేందుకు ఏడుపాయలకు వచ్చే పాతరోడ్డు నాగ్సాన్పల్లి వైపున రెండు పార్కింగ్ స్థలాలు అందులో ద్విచక్ర, ఫోర్వీల్స్లకు సంబంధించిన పార్కింగ్ ఏర్పాటు, కాటేజీలు, మినీలాడ్జిల నిర్మాణం, అదేవిధంగా కొల్చారం వైపు నుంచి వచ్చే రూటులోనూ 2 పార్కింగ్ స్థలాలు, కాటేజీలు, మినీ లాడ్జిలు నిర్మించనున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావు ప్రైవేట్ ఏజెన్సీతో మాస్టర్ప్లాన్ సిద్ధం చేయించారు. సదరు ఏజెన్సీ నిర్వాహకులు పలు దఫాలుగా విజిట్ చేసి డ్రోన్ల సహాయంతో పలు నమూనాలను డిజైన్ చేసి రూ.500 కోట్ల ప్రాజెక్టుతో దీనికి కొత్త రూపురేఖలు తీసుకురావాలని నిర్ధారించారు. ఈ మాస్టర్ ప్లాన్ను సదరు ఎండోమెంట్ కమిషనర్ చర్చించి ఓకే చేసినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ సైతం పలుశాఖల అధికారులతో చర్చించారు. రేపో మాపో ఆ ఫైల్ సీఎం దగ్గరకు వెళ్లనుంది. రూ.500 కోట్లతో తయారు చేసిన ఏడుపాయల మాస్టర్పా్ల్న్లో ఐదుశాఖల ఉన్నతాధికారుల నుంచి పలు సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బీ, పర్యాటక, ఎండోమెంట్కు చెందిన అధికారులు ఇందుకు తగు సలహాలు సూచనలు చేసినట్లు సమాచారం. ఏడుపాయల అభివృద్ధికోసం రూ.500 కోట్లతో తయారు చేయించిన మాస్టర్ప్లాన్ను త్వరలో సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్తాను. ఈ ఆలయాన్ని సీఎం గతంలో స్వయంగా దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. నిధుల మంజూరుతో ఆధ్యాత్మికతోపాటు, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందనుంది. –డాక్టర్ రోహిత్రావు, ఎమ్మెల్యే, మెదక్ -
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా
వర్గల్(గజ్వేల్): లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన 290 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని బుధవారం వర్గల్ మండలం గౌరారం పోలీసులు పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కాగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ రహదారి మీదుగా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో గౌరారం ఎస్ఐ ఆరోగ్యం తన సిబ్బందితో పీఎస్ ఎదుట వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వస్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. సివిల్ సప్లైస్ అధికారి సాయిరవి సమక్షంలో పంచనామా నిర్వహించారు. లారీ యజమాని పలాడి చింతన్న సూచనలకు అనుగుణంగా హైదరాబాద్ తుక్కుగూడలోని ఓ గోడౌన్ నుంచి ఈ బియ్యం గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో లారీ డ్రైవర్ దాసా రామ్దేవ్ హజాభాయ్ వెల్లడించాడు. ఈ మేరకు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, స్వాధీనం చేసుకున్న 290 క్వింటాళ్ల బియ్యాన్ని నర్సన్నపేట శ్రీరామాంజనేయ అగ్రో ఇండస్ట్రీస్ గోదాముకు తరలించి భద్రపరిచామని సీఐ చెప్పారు. గడచిన నెలరోజుల్లో ఇది రెండో ఘటన కాగా గతనెల 14న ఇదే ప్రాంతం నుంచి గుజరాత్కు 294.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని గౌరారం పోలీసులు పట్టుకున్న విషయం తెల్సిందే. పోలీసుల తనిఖీలో పట్టుబడిన లారీ 290 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం -
నిండిన నల్లవాగు ప్రాజెక్టు
1,506 క్యూసెక్కుల నీరు ఔట్ఫ్లో నారాయణఖేడ్: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగుపై నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ఎగువన కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లో కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా ప్రవహించిన నీటితో నల్లవాగు ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,493 అడుగులు కాగా అర్థరాత్రి వరకు కురిసిన వర్షం వల్ల 1,493.5 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 1,506 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా..ఔట్ఫ్లో కూడా 1,506 క్యూసెక్కులు అలుగుపై నుంచి కిందకు ప్రవహిస్తోంది. కర్ణాటక ప్రాంతంలోని గుడుపల్లి గుట్టల్లో పుట్టిన నల్లవాగు దేశాయ్ వడ్గాం ప్రాంతం గుండా కంగ్టి మండలం నాగూర్(బి) వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. సిర్గాపూర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద ప్రాజెక్టు నిర్మితమై ఉంది. దీనికింద 6,060 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రాజెక్టు నిండటంతో ఆయకట్టు పంటల సాగుకు అనుకూలంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని వదలడం వల్ల పోచాపూర్, బీబీపేట్, ఖానాపూర్, మార్డి, కల్హేర్ గ్రామాల్లోని చెరువులను నింపుకొంటున్నారు. -
ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం
పటాన్చెరుటౌన్: విద్యార్థులకు తైక్వాండో పోటీలు స్వీయ రక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి అన్నారు. ఆర్జిన్ స్కూల్ వేదికగా సీబీఎస్ఈ సౌత్జోన్–1లో నిర్వహించిన పోటీలను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించే అవకాశాలను కల్పిస్తాయన్నారు. ఆ స్కూల్ చైర్మన్ ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు సీబీఎస్ఈ అబ్జర్వర్ దురై హాజరయ్యారు. ఆల్ఫా స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్లు వెంకటేశ్, రాంబాబు పోటీల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ పోటీలు 8వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్–నికోబార్ దీవుల నుంచి సుమారు 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జాతీయస్థాయి పోటీలకు సిద్ధం చేయడమే ఈ ఛాంపియన్షిప్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 5 రాష్ట్రాల నుంచి మూడు వేల మంది హాజరు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ


