breaking news
Sangareddy District News
-
సింగూరు ఖాళీ చేయొద్దు
అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయకుండానే మరమ్మతులకు అవకాశం ఉన్నందున, మొత్తం ఖాళీ చేయకుండా మరమ్మతుల విషయాన్ని పరిశీలించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అసెంబ్లీలో కోరారు. ప్రాజెక్టు ద్వారా జంట నగరాలతో పాటు ఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాకు తాగునీరు అందుతోందన్నారు. వర్షాకాలంలో పుష్కలంగా నీళ్లు చేరినా దిగువకు వదిలారని పేర్కొన్నారు. మరమ్మతుల కోసం పూర్తిగా ఖాళీ చేస్తే సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నారు. 1.60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఖేడ్ నియోజకవర్గంలో రోడ్లకు నిధులు మంజూరైనా, అటవీశాఖ అనుమతులు రాని కారణంగా చేపట్టని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు పంచాయతీలతో కొత్త మండలాలు ఏర్పాటు చేయగా, 14 పంచాయతీలు ఉన్న తడ్కల్ను మండల కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. -
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులేవి?
జహీరాబాద్: ఎమ్మెల్యే మాణిక్రావు సోమవారం అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నా ఇప్పటి వరకు వాటిని మరమ్మతులు చేయించలేదన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జహీరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లను మరమ్మతులు చేయించాలని విన్నవించినట్లు పేర్కొ న్నారు. అయినా ఇప్పటివరకు రోడ్ల మరమ్మతులు ప్రారంభించలేదన్నారు. వెంటనే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రజలు, వాహన చోదకుల ఇబ్బందులను దూరం చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయానికి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరు పడకల నుంచి 30 పడకల ఆస్పత్రిగా పెంచాలని కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాణిక్రావు -
నకిలీ ఓసీలతో నయాదందా!
యథేచ్ఛగా విద్యుత్ కనెక్షన్ల జారీ ● రూ.లక్షల్లో దండుకున్న అధికారులు ● ముగ్గురు ఏఈలు, మరో ఏడుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ● కొనసాగుతున్న అంతర్గత విజిలెన్స్ విచారణ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ కనెక్షన్ల జారీలో అధికారుల అవినీతి వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు (ఓసీ)లు సృష్టించి అపార్టుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, విల్లాలు, భారీ నివాస భవనాలకు విచ్చల విడిగా విద్యుత్కనెక్షన్లు జారీ చేశారు. కొన్నింటికి ఈ సర్టిఫికేట్లు లేకుండానే నిబంధనలకు విరుద్దంగా కనెక్షన్లు కట్టబెట్టారు. ఈ వ్యవహరంలో ఆశాఖలోని కొందరు అధికారులు రూ.లక్షలు దండుకున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి ఈ భారీ అక్రమాలకు తెరలేపడంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండిపడింది. నిబంధనల ప్రకారం ఓసీ ఉంటేనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి. కానీ నకిలీ ఓసీలు సృష్టించి కనెక్షన్లు ఇచ్చేశారు. ప్రధానంగా సంగారెడ్డి డివిజన్ పరిధిలో ఇస్నాపూర్, పటాన్చెరు డివిజన్ పరిధిలోని పటాన్చెరు రూరల్, అమీన్పూర్ మండలాల్లో ఈ నకిలీ ఓసీల దందా ఎక్కువగా సాగినట్లు తెలుస్తోంది. మునిపల్లి మండలంలోనూ ఈ నకిలీ ఓసీలతో విద్యుత్ కనెక్షన్లు జారీ వ్యవహరం వెలుగు చూసింది. ఈ దందాలో సంబందిత మండలాల్లోని ఆపరేషన్ విభాగంలోని లైన్ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, ఏఎల్ఎంలు కూడా ఈ వసూళ్ల దందాలో భాగస్వామ్యులుగా ఉన్నారు. షోకాజ్ నోటీసులు.. ఈ నకిలీ ఓసీలతో విద్యుత్ కనెక్షన్లు జారీ చేసిన వ్యవహరాల్లో ప్రస్తుతానికి మూడు మండలాల అసిస్టెంట్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మరో ఏడుగురు లైన్మెన్లు, ఏఎల్ఎంలు, ఇతర సిబ్బందికి కూడా ఈ నోటీసులు ఇచ్చారు. నిర్ణీత సమయంలోగా వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు జారీ అయిన అధికారుల్లో ఒకరిద్దరు పదవీ విరమణ చేసినట్లు తెలుస్తోంది. ఓ అఽధికారి తన రిటైర్డ్మెంట్కు దగ్గరలో ఉన్నప్పుడు అందినంత దండుకుని పదవీవిమరణ చేసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ సైతం.. విద్యుత్శాఖ డిస్కంకు, మరోవైపు ప్రభుత్వ ఆధాయానికి రూ.కోట్లలో గండిపడటంతో ఈ నకిలీ ఓసీల వ్యవహరంపై డిస్కం సీరియస్గా తీసుకుంది. దీనిపై ఆశాఖ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విభాగం అధికారులు ఈ నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లతో జారీ అయిన విద్యుత్ కనెక్షలపై విచారణ చేపట్టారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. ఎన్ని నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయానే దానిపై హెచ్ఎండీఏ, ఇతర సంస్థలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయితే మరికొందరు అధికారుల అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. నిబంధనల ప్రకారం చర్యలు నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లతో విద్యుత్ కనెక్షన్లు జారీ వ్యవహరంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఈ విజిలెన్స్ విభాగం క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తోంది. సంబంధిత అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారు ఇచ్చే వివరణ, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి. – సుధీర్కుమార్, పర్యవేక్షక ఇంజనీర్, విద్యుత్శాఖ -
నష్టాల సాగు
● భారీ వర్షాలతో పంటలకు నష్టం ● యూరియా కోసం ఇబ్బందులు ● పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి ● విత్తనోత్పత్తికి నాణ్యమైన విత్తనాలు ఈ ఏడాది రైతులకు తీవ్ర నిరాశేజిల్లాలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎంతో ఆశతో మంచి లాభాలు వస్తాయనుకొని పంటలు సాగుచేసిన రైతన్నకు ఈ ఏడాది కలిసి రాక తీవ్ర నిరాశే మిగిలింది. పండుగలా సాగాల్సిన సాగు అధిక వర్షాలతో అన్నదాతలకు నష్టాలను మిగిల్చింది. – సంగారెడ్డి జోన్ 7లక్షల ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో 7లక్షల 24 వేల 432.07 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. వరి 1,57,496, చెరుకు 22,462.38, సోయాబీన్ 60,706, కందులు 74,813.24తో పాటు ఇతర పంటలు సాగవుతున్నాయి. గతేడాది కంటే ప్రస్తుత ఏడాది పత్తి పంట సుమారు 20వేల ఎకరాల విస్తీర్ణంలో అధికంగా సాగు చేశారు. అలాగే చెరుకు పంట సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. చిరు ధాన్యాల సాగు మాత్రం తగ్గింది. 19 వేల ఎకరాల్లో నష్టం సీజన్ ప్రారంభం నుంచి ముగిసే వరకు వర్షాలు దంచికొట్టాయి. మూడు విడతల్లో 21,119 మంది రైతులకు సంబంధించి 19,557.39 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లింది. 33 శాతం పైబడి పంట పాడైతేనే ఆ పంట నష్టంగా గుర్తించారు. పలు చోట్ల పంట పొలాలు నీట మునగడంతో పాటు కోతకు గురయ్యాయి. తగ్గిన దిగుబడులు కురిసిన అధిక వర్షాలతో పంటలకు తెగుళ్లు విపరీతంగా సోకాయి. వాటి నివారణకు అనేక సార్లు మందులు పిచికారీ చేశారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం 6 క్వింటాల్ కు మాత్రమే పరిమితమైంది. దిగుబడులు తగ్గడంతో పాటు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతులకు గుదిబండగా మారాయి. పత్తి తీత సమయంలో కురిసిన వర్షాలకు బరువు తగ్గిపోయింది. దీంతో కూలీల రేట్లు పెరిగిపోయాయి. అందుబాటులోకి యాప్లు రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంట అమ్ముకునేందుకు వీలుగా కపాస్ కిసాన్ యాప్ను అందు బాటులోకి తీసుకువచ్చారు. అన్నదాతలకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునేందుకు యాప్ ను ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొత్త పథకాల అమలుకు శ్రీకారం సేంద్రియ పంటల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా జాతీయ సహజ సేంద్రియ సాగు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఆర్థిక సాయం అందించనుంది. నేషనల్ మిషన్ ఆన్ ఈ డబుల్ ఆయిల్ పథకం ద్వారా కుసుమ, నువ్వులు, పొద్దు తిరుగుడు, సోయా తదితర నూనె గింజల సాగు పెంచేందుకు రైతులకు ఉచితంగా విత్తనాలు అందించి ప్రోత్సహించనుంది. నారాయణఖేడ్లో రూ.1.95 లక్షల నిధులతో మట్టి పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేసింది. 18 శాతం అధికంగా నమోదు ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు కురవాల్సిన వర్షం కంటే 18 శాతం అత్యధికంగా వర్షం కురిసింది. జూలైలో 7, ఆగస్టు 131, సెప్టెంబర్ లో 52, అక్టోబర్లో 44 శాతం అత్యధికంగా వర్షపాతం కురవగా జూన్, నవంబర్లో మాత్రం తక్కువగా నమోదైంది. పంట నష్టం వివరాలు విడత రైతులు ఎకరాలు మొదటి 4706 5548.01 రెండవ 15,590 6797.38 మూడవ 823 7,212 యూరియా కోసం క్యూ లైన్లు, ఆందోళనలు పంటల సాగులో వినియోగించే యూ రియా కోసం ఈ సంవత్సరం రైతులు పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వానాకాలం సీజన్లో 38 వేల మెట్రిక్ టన్నుల అవసరాన్ని గుర్తించారు. యూరియా కోసం పలుచోట్ల ఆందోళనలు సైతం చేపట్టారు. క్యూలైన్లలో పడిగాపులు పడ్డారు. -
కార్మికులకు ఆరోగ్య భద్రత
సంగారెడ్డి: కార్మికుల ఆరోగ్య భద్రత మున్సిపాలిటీ ప్రథమ లక్ష్యమని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక మున్సిపాలిటీలో ఐదు కొత్త ట్రాక్టర్లు ప్రారంభించడంతో పాటు సిబ్బందికి ప్రమాద బీమా పాలసీ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని మోడల్ సిటీగా సంగారెడ్డి తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, ఎలక్ట్రికల్, ఆఫీస్కు సంబంధించి సుమారు 400 మందికి పైగా సిబ్బందికి ప్రమాద బీమా పాలసీల పంపిణీ చేశారు. అదే విధంగా రూ.40లక్షలతో ఐదు కొత్త ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ ద్వారా రూ.10లక్షల ఇన్సూరెనన్స్ చేయించడం రాష్టంలోనే తొలిసారి అని, అందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆధునిక పద్ధతులతో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతినెలా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఔట్ సోర్సింగ్ సిబ్బంది 5వ తేదీలోగా జీతాల చెల్లింపు చేస్తున్నామన్నారు. అ లాగే కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం మున్సిపల్ నుంచి ఇవ్వాల్సిన అన్ని రకాల వస్తువులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ డీఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ సాజిద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.కొత్త ట్రాక్టర్లను ప్రారంభిస్తున్న నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య మోడల్ సిటీగా సంగారెడ్డిని తీర్చిదిద్దుతాం మున్సిపాలిటీకి కొత్తగా ఐదు ట్రాక్టర్లు సిబ్బందికి ప్రమాద బీమా సౌకర్యం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య -
ముక్కోటికి ముస్తాబు
సంగారెడ్డి టౌన్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శనం కల్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి పట్టణంలోని బాలాజీ దేవాలయం, పట్టణ శివారులోని వైకుంఠపురంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ విద్యుత్ కాంతులతో అలంకరించారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం వైకుంఠపురం ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ సత్తయ్యగౌడ్, టౌన్ సీఐ రామానాయుడు, ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి, ఆల య కమిటీ సభ్యులు ఉన్నారు. విద్యుత్ కాంతుల్లో వైకుంఠపురం ఆలయం -
ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్
ప్రమాదంలో వ్యక్తి మృతి నర్సాపూర్ రూరల్: ట్రాక్టర్ను ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం.. శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన మస్కూరి గోపాల్ (43) ట్రాక్టర్ డ్రైవర్. రోజు లాగే సంగారెడ్డిలో ట్రాక్టర్ డ్రైవింగ్ డ్రైవింగ్ పనులు ముగించుకుని ఆదివారం సాయంత్రం బైక్పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నర్సాపూర్ – వెల్దుర్తి రహదారిలోని బ్రాహ్మణపల్లి శివారులో ముందు వెళుతున్న ట్రాక్టర్ను వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం మేరకు... చేగుంట మండలంలోని చిన్న శివనూర్ గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్సాయి(21), మండలంలోని రామంతపూర్ శివారులో ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా తనతోపాటు పని చేసే కుక్కదువ్వు ప్రవీణ్, మధ్యప్రదేశ్కు చెందిన కుల్ధీప్లతో కలిసి బైక్పై ఆదివారం రాత్రి 10 గంటలకు విధులు ముగిసిన తర్వాత మేడ్చల్కు పనినిమిత్తం వెళుతున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి మండలంలోని జీడిపల్లి శివారులోకి రాగానే జాతీయ రహదారిపై ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపై పడి పోయారు. ఈ ప్రమాదంలో హేమంత్సాయి అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన కుల్ధీప్, ప్రవీణ్లను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్.. చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాలు ఇలా... మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన పొన్నమల్ల నరేందర్(52) సిద్దిపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే రోజువారీగా విధులకు హాజరయ్యేందుకు ఈనెల 26న ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్జకుంట వాగు బ్రిడ్జి వద్ద కుక్క అడ్డురావడంతో బైక్పై నుంచి కిందపడి గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
కుటుంబ కలహాలతో మేసీ్త్ర ఆత్మహత్య
మనోహరాబాద్(తూప్రాన్): జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీనివాస్, భార్య రేఖతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కాగా వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో చిన్న కుమారుడు ప్రేమ వ్యవహారంలో కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాస్(45) ఆదివారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. కాగా అతని గురించి వెతకగా సోమవారం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. హవేళిఘణాపూర్(మెదక్): ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన ఇమ్మడి నర్సింహులు(60) ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. దీంతో అవి ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు చెప్పగా వారు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఎంకవ్వ, కుమారుడు ఉన్నాడు. -
పరిశోధనలపై కృత్రిమ మేధస్సు ప్రభావం
పటాన్చెరు టౌన్: విద్య, పరిశోధన రంగంలో కృత్రిమ మేధస్సు ప్రభావం అమితంగా ఉంటుందని రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ మల్లేశం అన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్న్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ మల్టీ డీసీప్లినరీ రీసెర్చ్పై జరుగుతున్న జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యా పరిశోధనలో కృత్రిమ మేధస్సు, సాంకేతికత చాలా ప్రభావం చూపుతోందన్నారు. పరిశోధకులకు కావలసిన భాష అనువాదం, ఉత్తర ప్రత్యుత్తరాలు, కంటెంట్ను సృష్టించడం, తెలివైన క్యూటరింగ్ సిస్టమ్స్ కావచ్చు ఇంకా అనేక రంగాలపై ఏఐ ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమం కళాశాల అధ్యాపకులు డాక్టర్ పూనం, డాక్టర్ మల్లిక, డాక్టర్ బి.సుజాత, డాక్టర్ మంజు, డాక్టర్ ఆర్ శివదీప్తి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ షరీఫ్, విద్యార్థులు లెక్చరర్లు , పరిశోధకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ మల్లేశం -
మోసపోయాం.. న్యాయం చేయండి
బెజ్జంకి(సిద్దిపేట): అధిక వడ్డీ ఆశ చూపించి మోసగించిన వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పించాలని మండలంలోని బేగంపేటకు చెందిన పలువురు బాధితులు సోమవారం సిద్దిపేట సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... రెండేళ్ల క్రితం కరీంనగర్కు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి గ్రామంలో ఉన్న బంధుత్వాన్ని ఆసరా చేసుకుని పరిచయాలతో ప్రతి నెల వడ్డీ వస్తుందని, పెట్టుబడి పెట్టాలని నమ్మించి సుమారు రూ. 8కోట్లు తీసుకున్నాడని తెలిపారు. కొన్ని నెలలు వడ్డీ ఇచ్చి మానేశాడని, కరీంనగర్లో వారి ఇంటికి వెళితే తాళం వేసి ఉందని చెప్పారు. అప్పులు తెచ్చి, భూములు, బంగారం తాకట్టు పెట్టి డబ్బులిచ్చామని తెలిపారు. మోసగించిన సురేశ్ ఆచూకీని గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరారు.సీపీకి బేగంపేట బాధితుల వేడుకోలు -
యథేచ్ఛగా కబ్జా!
రైతులకు సాగు నీరు అందించేందుకు నిర్మించిన తపాస్పల్లి రిజర్వాయర్ కాలువల భూములు, వాటి వెంట ఉన్న రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇదే అదునుగా భావించిన కొందరు ఆక్రమించి సాగు కూడా చేస్తున్నారు. అయినాపూర్ శివారులో రోడ్డును ఆక్రమించి అడ్డుగా సిమెంట్ పలకలతో గోడ సైతం నిర్మించారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. – కొమురవెల్లి(సిద్దిపేట) తపాస్పల్లి రిజర్వాయర్.. కాలువల భూములు, రోడ్ల ఆక్రమణ చేర్యాల, కొమురవెల్లి, బచ్చన్నపేట, కొండపాక మండలాల రైతులకు సాగునీటిని అందించేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తపాస్పల్లి రిజర్వాయర్ను నిర్మించింది. ఈ రిజర్వాయర్ నుంచి రైతులకు నీరు అందించేందుకు అనుసంధానంగా రిజర్వాయర్కు ఎడమ, కుడి భాగంలో డీ1, డీ2, డీ3 , డీ4 కాలువల నిర్మాణాన్ని చేపట్టి భూ నిర్వాసితులకు సైతం నష్టపరిహారం చెల్లించారు. అయితే కాలువల నిర్మాణం పూర్తవడంతో ప్రతి సంవత్సరం నీటిని కూడా విడుదల చేస్తున్నారు. కాగా కొంత కాలంగా సాగు, తాగు నీటి అవసరాలు, బహుల ప్రయోజనాల కోసం చేపట్టిన తపాస్పల్లి రిజర్వాయర్ కాలువలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారులు దృష్టి సారించక పోవడంతో రిజర్వాయర్ కాలువలను కబ్జా చేస్తున్నారు. డీఈఈ కార్యాలయం జనగామ, ఈఈ కార్యాలయం స్టేషన్ఘనపుర్ , ఎస్ఈ కార్యాలయం హన్మకొండ, సీఈ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండటంతో దూరభారం పెరిగి అధికారుల పర్యవేక్షణ లోపించింది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు కాలువలకు అనుకోని ఉన్న భూమిని, రోడ్లను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. ఈ తంతు గడిచిన మూడేళ్లుగా సాగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో కబ్జాలు తపాస్పల్లి రిజర్వాయర్కు అనుసంధానంగా ఉన్న కాలువలు పోసాన్పల్లి, అయినాపూర్, గౌరాయపల్లి, మర్రిముచ్చాల , కిష్టంపేట గ్రామాల మీదుగా కాలువలు వెళుతున్నాయి. కొంత మంది యథేచ్ఛగా కాలువ భూములు, రోడ్లను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. మరి కొంతమంది రోడ్డును ఆక్రమించి అడ్డుగా సిమెంట్ పలకలతో ప్రహరీని కట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.అయినాపూర్ శివారులో కాలువ రోడ్డుకు సిమెంట్ పలకలతో అడ్డుగా కట్టిన గోడ పంటలు సాగు చేస్తున్న వైనం మూడేళ్లుగా సాగుతున్న తంతు చోద్యం చూస్తున్న ఇరిగేషన్అధికారులుపలు మార్లు ఫిర్యాదు చేశాం తపాస్పల్లి రిజర్వాయర్ కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయని ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి కాలువ భూములను కాపాడాలి. కాలువ వెంట ఉన్న రోడ్ల ఆక్రమణను అరికట్టాలి. – దండ్యాల వెంకట్ రెడ్డి, అయినాపూర్చర్యలు తీసుకుంటాం కాలువ భూములు ఆక్రమణకు గురైనట్లు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డీఈఈ కార్యాలయం జనగామలో ఉండటంతో పర్యవేక్షణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తపాస్పల్లి రిజర్వాయర్ను సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని ఉన్నతాధికారులకు విన్నవించిన ఫలితం లేదు. – అంజయ్య, ఇరిగేషన్ డీఈ -
షట్టర్ల తాళాలు పగులగొట్టి..
రూ.2.95 లక్షల నగదు, 9 తులాల వెండి ఆభరణాల చోరీ కొల్చారం(నర్సాపూర్): మెదక్ – జోగిపేట రహదారిపై ఉన్న దుకాణాల్లో నాలుగు షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగ రూ.2.95 లక్షల నగదు, 9 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మండలంలోని ఎనగండ్ల గ్రామపంచాయతీ దుంపలకుంట చౌరస్తాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్, బాధితుల కథనం ప్రకారం... దొంగ తాను వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్తో షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. మణికంఠ మొబైల్ షాపులో రూ.70వేల నగదుతో పాటు 20 వేల విలువైన ఫోన్లు చోరీ చేశాడు. పక్కనే ఉన్న మల్లికార్జున డ్రెస్సెస్లో రూ.15వేల నగదుతో పాటు పదివేల విలువైన వస్త్రాలను దొంగిలించాడు. మహేశ్వర మెడికల్ స్టోర్లోకి వెళ్లి కౌంటర్లో ఉన్న రూ.30వేల నగదు, నాలుగు తులాల పట్టా గొలుసులు ఎత్తుకెళ్లాడు. రోడ్డుకు మరో పక్కన ఉన్న వీరభద్ర కిరాణంలో దొంగ కౌంటర్లో దాచిన రూ.1.80 లక్షల నగదుతో పాటు 5 తులాల పట్టా గొలుసులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి చిత్రం రికార్డయింది. ఘటనా స్థలాన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి రాజశేఖర్ సందర్శించి, క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. -
పులి జాడ కోసం అన్వేషణ
సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లా తొగుట అటవీప్రాంతంలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలపడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. బస్సాపూర్ డంపింగ్ షెడ్ ప్రాంతం, తొగుట మండలం గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల, వర్ధరాజ్పల్లి పరిధిలో పెద్దపులి సంచరించినట్ల ఫారెస్ట్ అధికారులు పాదముద్రల ద్వారా ప్రాథమికంగా పులిగా నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ పద్మజారాణి మాట్లాడుతూ..గ్రామానికి చెందిన స్థానికుడు పెద్దపులి కనిపించినట్లు తెలపడం ద్వారా ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సంబంధిత గ్రామాలకు వెళ్లి పంట పొలాల్లో పరిశీలించినట్లు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించామని, మూడు రోజులుగా జాడను గుర్తించడానికి పులి సంచరించిన ప్రాంతాల్లో 15 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పులిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి 45మంది ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది 24గంటలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గొర్రెల కాపరులు, పశువుల కాపరులు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. డ్రోన్ కెమెరాలతో కూడా అటవీ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తడోబా టైగర్ రిజర్వ్ (ఎన్టీసీ) నుంచి ఇద్దరు నిపుణులు నేడు సిద్దిపేటకు రానున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, త్వరలోనే పులి జాడను గుర్తిస్తామని డీఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. 15 కెమెరాలతో నిఘా ఆరు టీంలు, 45 మంది సిబ్బందితో పెట్రోలింగ్ నేడు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి నిపుణుల రాక డీఎఫ్ఓ పద్మజారాణి -
దారి కోసం రైతుల ఆందోళన
చిన్నశంకరంపేట(మెదక్): పంట పొలాలకు దారి ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... శంకాపూర్ గ్రామ రైతుల పొలాలకు అడ్డంగా ఓ రియల్టర్ పలకలు ఏర్పాటు చేసి గేట్పెట్టి తాళం వేశాడు. దీంతో వెనకవైపు పొలాలు ఉన్న రైతులకు దారిలేకుండా పోయింది. రహదారికి ఆనుకుని భూములు కొనుగోలు చేసిన రియల్టర్ వెనకవైపు రైతులను కూడా తమ భూములు అమ్మాలని కోరడంతో రైతులు అమ్మేందుకు ముందుకు రాలేదు. దీంతో వెనకవైపు రైతులు వెళ్లకుండా తాను కొనుగోలు చేసిన భూముల చుట్టూ పలకలు ఏర్పాటు చేశాడు. గేట్ పెట్టడంతో పాటు తాళం వేయడంతో రైతులకు దారిలేక దున్నకాలకు ట్రాక్టర్ వెళ్లలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ గ్రేసిభాయి అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. పంటల దున్నకాలు పూర్తిచేసుకుని వరి నాట్లు వేసేవరకు తాళం తీయిస్తామని, తిరిగి యజమానికి అప్పగించాలని చెప్పారు. రైతులు మాత్రం తమకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.నచ్చజెప్పిన తహసీల్దార్ -
మత్స్యకారులకు తీరని అన్యాయం
హత్నూర(సంగారెడ్డి): మత్స్యకారులకు సమయానికి చేపపిల్లలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలోని హత్నూర శివారు పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే మత్స్యకారులకు సొంత డబ్బులు వెచ్చించి చేప పిల్లలు కొనుగోలు చేశారని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం బంద్ చేసి యాదవులను మోసం చేశారన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టకుండా ప్రజలను మోసం చేస్తూ రెండేళ్లుగా కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులను విమర్శించడమే లక్ష్యంగా సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్, సర్పంచ్లు ఎల్లయ్య, శోభారాణి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకరరావు, నాయకులు రవి, నరేందర్, మేరాజ్, రవీందర్ గౌడ్, వెంకటేశం, ఆంజనేయులు, భిక్షపతి, వీరేందర్, సత్యం, అధికారులు పాల్గొన్నారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
సకల సౌకర్యాలతో..
కేజీబీవీల్లో మెరుగైన వసతులున్యాల్కల్(జహీరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏక రూప దుస్తులు, రుచికరమైన భోజనం, విద్యా బోధన వంటి సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. దీంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన, బాలికలకు భద్రత, డిజిటల్ తరగతులు, హాస్టల్ వసతి కల్పిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం విడతల వారీగా మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించింది. అంతేకాకుండా విద్యార్థినులకు బంకర్ బెడ్లను సైతం అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు వరం.. జిల్లా వ్యాప్తంగా 22 కేజీబీవీలు ఉన్నాయి. దాదాపు 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తుండగా.. ఇందులో 17 విద్యాలయాలు ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతున్నాయి. జిల్లాల్లో ఉన్న కేజీబీవీల్లో ప్రస్తుతం 6వేల మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ ఆంగ్లంలో విద్యాబోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, హాస్టల్ వసతి వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తూ మెరుగైన విద్యనందిస్తుంది. అయితే ఆయా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు బెడ్లు లేకపోవడంతో నేలపైనే నిద్రపోతూ ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చలి కాలంలో చలి తీవ్రతతో నిత్యం నరకయాతన పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యార్థులందరికీ బంకర్ బెడ్లు, బెడ్ షీట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం విద్యార్థినులకు వరంగా మారినట్లయింది. విద్యాలయాలల్లో ఎంత మంది విద్యార్థినులున్నారు? ఏయే విద్యాలయాల్లో వాటిని ఏర్పాటు చేయవచ్చు? వంటి వివరాలను జిల్లా అధికారులు సేకరించి రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం పంపించారు. అధికారులకు నివేదికలు.. 20 కేజీబీవీల్లోని 2,888 విద్యార్థినులకు బంకర్ బెడ్లు అవరమని జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. అయితే అందులో బంకర్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు 16 విద్యాలయాల్లో మాత్రమ సౌకర్యాలున్నాయని నివేదించారు. దీంతో బంకర్ బెడ్ల కాంట్రాక్ట్ను తీసుకున్న తోషిభా కంపెనీ ఆయా విద్యాలయాలకు వాటిని సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 11 కేజీబీవీలకు బెడ్లను పంపిణీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన 5 కేజీబీవీలకు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. బంకర్ బెడ్ల పంపిణీ పూర్తయితే విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి. ఉన్నత విద్యతో పాటు రుచికరమైన భోజనం బంకర్ బెడ్లు పంపిణీకి శ్రీకారం తొలగనున్న విద్యార్థినుల ఇబ్బందులు -
మా భూములు వదులుకోం
న్యాల్కల్(జహీరాబాద్): ప్రాణాలైనా ఇస్తాం, కానీ మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను మాత్రం కాలుష్య కారక పరిశ్రమలకు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రజలు స్పష్టం చేశారు. మండల పరిధిలోని మల్గి గ్రామంలో కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా టీపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్, ప్రతినిధులు లక్ష్మి తదితరులు మాట్లాడుతూ.. ఫినాల్, మెఽథనాల్ లాంటి కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని గాలి, నీరు, పంట పొలాలు, మంజీరా నది కలుషితమవుతుందని తెలిపారు. అవి ఏర్పాటు కాకుండా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాల గురించి ప్రజలకు వివరించారు. వచ్చే నెల 3న గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనంతరం పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్గౌడ్తో పాటు షౌకత్ అలీ, మంగళ, మారుతి, సంజీవరెడ్డి, సిద్దన్న పాటిల్, అజీమోద్దీన్, రాజు, మహేశ్రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేసంగారెడ్డి: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ఆస్తులు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లారని కొనియాడారు. బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కాంగ్రెస్పై దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నాయకులు ఫొటోలు మార్ఫింగ్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి కుట్రను గ్రహించాలని హితవు పలికారు. కరెన్సీ నోట్ల మీద గాంధీ ఫొటో తీసేయాలని మోదీ, అమిత్షా కుట్ర చేస్తున్నారన్నారు. గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబ చరిత్ర దేశంలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నెహ్రూ కేబినెట్లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి, సమస్త కులాలు, మతాల ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని రాజ్యాంగం రాశారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, సీడీసీ రామ్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్, బుచ్చిరాములు, నర్సింహారెడ్డి, నాయకులు కూన సంతోష్, కిరణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాలుష్య కారక పరిశ్రమలకు ఇవ్వం ఏకగీవ్రంగా తీర్మానించిన మల్గి గ్రామస్తులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
పెద్దశంకరంపేట(మెదక్): నూతన సర్పంచ్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలో ఇటీవల నూతనంగా గెలిచిన పలువురు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అధ్వర్యంలో హరీశ్రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా ఆయన నూతన ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు సురేశ్గౌడ్, సత్యనారాయ ణ, అంజయ్య, రవీందర్, కృష్ణ, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా మారుతిరెడ్డి నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది మారుతిరెడ్డిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖతో పాటు తన నియామకానికి కృషి చేసిన వారికి మారుతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి సంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పా ల్గొని మాట్లాడారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. న్యాయబద్ధమైన ఉద్యమానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జిల్లా అవుట్ సో ర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు ప్రకాశ్నాయక్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయా ల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం జిల్లా జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మనోహరాబాద్(తూప్రాన్): వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివా రం మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన పలు పార్టీల నాయకులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు వెంకటేశ్గౌడ్, పాలాట సర్పంచ్ సాయిగౌడ్, సీనియర్ నాయకులు పురం మహేశ్, అర్జున్, భిక్షపతి, కుమార్గౌడ్, నాగభూషణం, పర్శరాంగౌడ్, కృష్ణగౌడ్, సాయి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం: సీఐటీయూ పటాన్చెరు టౌన్: ఐక్య పోరాటాల సారధి సీఐటీయూ అని సంఘం జిల్లా కోశాధికారి రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగిన సీఐటీయూ కా ర్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు శేషగిరి, త్రిమూర్తులు, జయకుమార్, చంద్రకిరణ్ సింగ్, శ్రీనివాస్, నారాయణ, రాజు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాది 41 హత్యలు..
జిల్లాలో గత ఏడాది 60 హత్యలు జరగగా ఈ ఏడాది 41 జరిగాయి. కిడ్నాప్లు గత ఏడాది 90 కేసులు నమోదు కాగా ఈ ఏడాదికి 125కు పెరిగాయి. కిడ్నాప్ కేసులు పెరగటం ఆందోళన కలిగించే అంశం. ఆవేశం, అత్యాశ, అనుమానంతో జిల్లాలో ఈ ఏడాది క్షణికావేశంలో దారుణ హత్యాఘటనలు చోటు చేసుకున్నాయి. 248 ఇసుక అక్రమ రవాణా కేసులు గత రెండేళ్లుగా అక్రమ ఇసుక రవాణా కేసుల సంఖ్య పెరుగుతుంది. 2023లో 23, 2024లో 45, 2025లో 248 కేసులు నమోదయ్యాయి. గతంలో కంటే మూడింతల మేర కేసులు నమోదు అవుతున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు. 490 సైబర్ క్రైమ్.. ఈ ఏడాది 490 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రూ.34.64 కోట్లు కోల్పోగా బాధితుల ఫిర్యాదులతో రూ.7.03 కోట్ల హోల్డ్ చేశారు. 1264 పేకాట కేసులలో ఈ ఏడాది రూ.78,46,693 సీజ్ చేశారు. గతేడాది కంటే ఏడాది సైబర్ కేసులు తగ్గగా పేకాట కేసులు మాత్రం పెరిగాయి. పెరిగిన గంజాయి కేసులు గతేడాది 34 కేసులు నమోదు కాగా 508.71 కేజీల గంజాయిని సీజ్ చేసి 79 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడాది 43 కేసులలో 786.635 కేజీల గంజాయిని సీజ్ చేసి, 88 మందిని అరెస్టు చేశారు.రోడ్డు ప్రమాదాలు, మరణాలు గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాల సంఖ్య తగ్గింది. జరిగిన ప్రమాదాల్లో పలు చోట్ల కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందటంతో వారి బంధువులు, గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గతేడాది 958 రోడ్డు ప్రమాదాల్లో 433 మంది మృత్యువాత పడగా, 1011 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ఏడాది 917 రోడ్డు ప్రమాదాల్లో 423 మంది మృత్యువాత పడ్డారు. 895 మంది గాయాలపాలయ్యారు. -
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జిల్లాలో గత ఏడాది కంటే ఈసారి క్రైమ్ రేట్ తగ్గింది. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 8,344 కేసులు నమోదు కాగా, ప్రస్తుత సంవత్సరం 8,255 కేసులు నమోదయ్యాయి. ఇందులో సాధారణ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే సమానంగా ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 28% తగ్గాయి. చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి–65పై సుమారు 80 మంది పోలీస్ సిబ్బందిని వివిధ బృందాలుగా విభజించి నాకాబందీ చేపట్టారు. – సంగారెడ్డి జోన్జరిగిన పలు ఘటనలు మునిపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రవి గ్రామంలో చిన్న గొడవ కావడంతో ఫిబ్రవరి 25న భార్య శోభ, తల్లి లక్ష్మితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుదేరా గ్రామ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మత్యువాత పడ్డారు. ఆగస్టు 25న ఒడిశా నుంచి రెండు కార్లలో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా సంగారెడ్డి డీటీఎఫ్ టీమ్ పట్టుకుంది. ఒక కారులో 69.5 కేజీలు, మరో కారులో 53.3 కేజీల గంజాయిని కంది మండలంలోని చేర్యాల గ్రామ శివారులో పట్టుకున్నారు. నిందితులు అబ్దుల్ వహాబ్ సయ్యద్, ఉమాకాంత్ సబర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు గత సంవత్సరం కంటేఒక శాతం తగ్గిన క్రైమ్ రేటు గతేడాది 8,344 .. ఈసారి 8,255 కేసులు పెరిగిన వాహన తనిఖీలు,డ్రంకెన్ డ్రైవ్లు గతం కంటే పెరిగిన 11 గంజాయి కేసులు -
సంతోషంగా ఉంది
గదుల్లో చాపలు పర్చుకొని నిద్రపోతున్నాం. ముఖ్యంగా చలి కాలంలో చలి తీవ్రతతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం బంకర్ బెడ్లు పంపిణీ చేస్తుండడం సంతోషంగా ఉంది. – సోనీ, విద్యార్థిని, కేజీబీవీ న్యాల్కల్ బంకర్ బెడ్లు మంజూరయ్యాయి జిల్లాలో 22 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 16 కేజీబీవీలకు బంకర్ బెడ్లు మంజూరయ్యాయి. ఈ పాఠశాలలకు బెడ్లను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 11 కేజీబీవీలకు పంపిణీ చేశాం. మిగిలిన వాటికి సైతం పంపిణీ కొనసాగుతుంది. – సునీత ఖన్నా, జీసీడీఓ, సంగారెడ్డి -
క్రీడాకారులను ప్రోత్సహించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కే.రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్లో ఆర్కే ఫౌండేషన్ సహకారంతో అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. విన్నర్స్, రన్నర్, సెమీఫైనల్లో చోటు దక్కించుకున్న జట్టుకు నగదు బహుమతి అందజేశారు. -
నడుచుకుంటూ వెళ్తుండగా..
బైక్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చేగుంట(తూప్రాన్): బైకు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వడియారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వడియారం గ్రామానికి చెందిన గుండ్ల సిద్ధిరాములు(59) వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్దిరాములు తలకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. డివైడర్ను ఢీకొట్టి.. కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కంది శివారులోని మామిడిపల్లి చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం... చౌటకూర్ మండలం వెండికోల్కు చెందిన చాకలి సాయిలు(50) ఆదివారం మామిడిపల్లిలోని బంధువుల ఇంటి వద్దకు వచ్చి తిరిగి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. కంది(సంగారెడ్డి): గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం... ఆదివారం శేరిలింగంపల్లికి చెందిన అజ్జు నాన్(25) తన స్నేహితుడైన జహీర్తో కలిసి బైకుపై కందిలో గల దాబాకు వస్తున్నారు. ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్ వద్ద వెనుక నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన అజ్జు నాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పురిటి నొప్పులు అధికమవడంతో..
● వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ప్రసవం ● అంబులెన్స్ సిబ్బంది చర్యలు కొండపాక(గజ్వేల్): పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 అంబులెన్సు సిబ్బంది మహేందర్, రమేశ్ ఇంట్లోనే సుఖ ప్రసవమయ్యేలా చర్యలు చేపట్టగా ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఈ ఘటన కొండపాకలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డెర కాలనీకి చెందిన లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వెళ్లగా పురిటినొప్పులు అధికమవ్వడంతో అంబులెన్సు కాల్ సెంటర్ వైద్యుడు శ్రీకాంత్ సూచనల మేరకు మహిళకు ప్రసవ మయ్యేలా వైద్యం చేశారు. ఇదివరకే లక్ష్మికి ఇద్దరు కూతుర్లుండగా ప్రస్తుతం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా తల్లీబిడ్డను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో సుఖ ప్రసవం అయ్యేలా కృషి చేసిన అంబులెన్సు సిబ్బందిని కుటుంబీకులు అభినందించారు. -
వంటల పోటీలకు స్పందన కరువు
జహీరాబాద్ టౌన్: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఆదివారం పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి వంటల పోటీలకు స్పందన కరువైంది. జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పోటీలు మొక్కబడిగా జరిగాయి. మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధికారులు ఈ పోటీలు నిర్వహించారు. పోషకాహారంలో సమతుల్యత, పరిశుభ్రతకు సంబంధించి జరిగిన పోటీలకు స్పందన అంతంత మాత్రంగా వచ్చింది. జిల్లా స్థాయి పోటీలకు కేవలం జహీరాబాద్ పట్టణ పరిసర గ్రామాల నుంచి 8 పాఠశాలలకు చెందిన భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. జిల్లాలోని ఇతర పాఠశాలల నుంచి పోటీల్లో ఎవరూ పాల్గొనలేదు. మొక్కుబడిగా పోటీలను నిర్వహించి ముగ్గురికి నగదు బహుమతులను అందజేశారు. పట్టణంలోని యూపీఎస్ నం–3 పాఠశాలకు మొదటి బహుమతి, బాలుర ఉన్నత పాఠశాలకు రెండో బహుమతి, బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలకు మూడో బహుమతి అందజేశారు. -
అక్రమంగా మట్టి తరలింపు
వాహనాలు సీజ్ మనోహరాబాద్(తూప్రాన్): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో టీఎస్ఐఐసీ అధికారులు, టిప్పర్లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, టీఎస్ఐఐసీ మేనేజర్ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కొండాపూర్ పరిశ్రమల వాడ స్థలం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక హిటాచీని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. కాగా జోనల్ మేనేజర్ అనురాధ, కమిషనర్ దినేశ్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరిశ్రమల వాడలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ చర్యలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బతుకులు గొయ్యి పాలాయె..
ముగ్గురిని మింగిన వంతెన గుంత ● మూడు కుటుంబాల్లో తీరని విషాదం ● శోక సంద్రమైన నర్సాపూర్ గ్రామం నారాయణఖేడ్: వంతెన కోసం తవ్విన గొయ్యి మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో రాత్రి సమయంలో ద్విచక్రవాహనం నేరుగా గొయ్యిలోకి దూసుకెళ్లి ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నిజాంపేట– నారాయణఖేడ్– బీదర్ 161బీ జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. విస్తరణలో భాగంగా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని డబుల్బెడ్రూం ఇళ్ల సమీపంలో పెద్ద వంతెన నిర్మించడానికి భారీ గోయ్యిని తవ్వారు. లోతుగా తవ్విన గొయ్యిలో నీళ్లు సైతం చేరాయి. పక్కనుంచి మళ్లింపు రోడ్డు వేసి గొయ్యి చుట్టూ రాత్రుల్లో మెరిసేలా రేడియంతో కూడిన దిమ్మెలు, రిబ్బన్ కట్టారు. తవ్విన మట్టిని ఇరువైపులా పోశారు. నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్న మల్లేశ్ (24), జిన్న మహేశ్ (23) తమ బంధువును నారాయణఖేడ్లో వదిలేందుకు శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. బంధువును వదిలి ఒక ద్విచక్రవాహనాన్ని అతడివద్దే ఉంచి, ముగ్గురూ మరో ద్విచక్ర వాహనంపై నర్సాపూర్కు బయలు దేరారు. వంతెన కోసం తవ్విన గొయ్యిలోకి వాహనం దూసుకెళ్లి అందులో పడగా ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో జిన్న మల్లేశ్, జిన్న మహేశ్ వరుసకు సోదరులు కాగా అవుటి నర్సింహులు మల్లేశ్కు బావ అవుతారు. నర్సింహులు వివాహితుడు కాగా మిగిలిన ఇద్దరు అవివాహితులు. ఆందోళనతో తండ్రి ఆరా.. గోయ్యిలో మృతదేహాలు బంధువును నారాయణఖేడ్లో విడిచి పెట్టి రావడానికి వెళ్లిన వారు గంటలు గడిచినా తిరిగి రాకపోవడంతో ప్రమాదమేమైనా జరిగిందా? అనే అనుమానంతో మహేశ్ తండ్రి భూమన్న మరొకరితో కలిసి నారాయణఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. ప్రమాద బాధితులు లేకపోవడంతో గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనుమానంతో వంతెన కోసం తవ్విన గొయ్యిలోకి టార్చిలైటు వేసి చూడగా అందులో వాహనం, మృతులు కనిపించారు. పోలీసులు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను గొయ్యిలోంచి తీశారు. నర్సాపూర్లో విషాద ఛాయలు లక్ష్మి, భూమన్న దంపతులకు మహేశ్ ఒక్కడే కుమారుడు కాగా అవివాహితుడైన అతను ఖేడ్లో ఇంటర్ చదువుతున్నాడు. వీరమణి, విఠల్ దంపతులకు కుమారుడు మల్లేశ్, ముగ్గురు కూతుళ్లు సంతానం. కాగా ఓ కూతురును అదే గ్రామానికి చెందిన అవుటి నర్సింహులుకు ఇచ్చి వివాహం చేశారు. ప్రమాదంలో ద్విచక్ర వాహన మెకానిక్గా పనిచేస్తున్న కుమారుడు మల్లేశ్ తోపాటు అల్లుడు నర్సింహులు మృతి చెందారు. నర్సింహులు వ్యవసాయం చేస్తూ జీవిస్తుండగా అతడి మృతితో భార్య మమత, రెండేళ్లు, ఏడునెలల వయస్సున్న కూతుళ్లు అనాథలయ్యారు. గోతిలోకి బైక్ దూసుకెళ్లడంతో మరణించిన సమీప బంధువులైన ముగ్గురి అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య నిర్వహించారు. మృతుల స్వగ్రామమైన ఖేడ్ మండలం నర్సాపూర్లో ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలకు తరలించడంతో గ్రామస్తులతో పాటు బంధువులు, సమీప గ్రామాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందు రోజు వరకు కళ్లముందు కదలాడిన యువకులు మరణించడం, ముగ్గురు అంత్యక్రియలు ఒకే సారి నిర్వహించడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చి, కంట తడిపెట్టించింది. -
స్వీయరక్షణకు ‘కలరిపట్టు’
గజ్వేల్రూరల్ : స్వీయరక్షణకు కలరీపట్టు ఎంతో దోహదం చేస్తుందని శివలింగు శ్రావణి, ఆంజనేయులు పేర్కొన్నారు. వరల్డ్ కలరీపట్టు ఫెడరేషన్ సహకారంతో కేరళకు చెందిన సీవీవీ కలరీ సంఘం ఫౌండర్ డాక్టర్ కృష్ణో ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఓ గార్డెన్లో కలరిపట్టుపై రెండ్రోజుల పాటు శిక్షణనిచ్చారు. ఈ శిక్షణకు గజ్వేల్, వరంగల్, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి , ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం తదితర జిల్లాల నుంచి సుమారు 20 మంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రావణి, ఆంజనేయులులు మాట్లాడుతూ... స్వీయరక్షణకు కలరిపట్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారతీయ ప్రాచీన కళలను భవిష్యత్ తరాలకు తెలియజేయడంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అతి ప్రాచీనమైన కలరిపట్టును నేర్చుకొని ఈ ప్రాంత విద్యార్థులకు దాని ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు ఆసక్తిగల వారికి నేర్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అఫీషియల్ ట్రైనర్ ఉమేశ్ గురుకుల్, ఎగ్జామినర్ సబితాగురుకుల్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన శిక్షణార్థులు పాల్గొన్నారు. -
జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు
సంగారెడ్డి: మద్యాన్ని అరికట్టడానికి బదులు ఎకై ్సజ్ శాఖలో బెల్ట్ షాపుల అమ్మకాన్ని ప్రోత్సహించిన సీఐ సాగర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలె న్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నాయని, ఈ వ్యాపారంలో దాన్ని అరికట్టవలసిన అదే శాఖకు చెందిన ఒక ఉన్నత అధికారి బెల్ట్ షాపులని ప్రోత్సహస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని బట్టి ఆయనకు సదరు షాపుల నుంచి మామూళ్లు వెళ్తున్నాయని ఆరోపించారు. గ్రామాల్లో తాగుడు వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. వీరికి పట్టదా అని ప్రశ్నించారు. తక్షణమే గ్రామాల్లో నడుస్తున్న బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకొని అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పల్లె కిష్టయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో మత్తు పదార్థాలను వాడి తయారు చేసిన కల్లును ప్రజలకు తాపీ అనారోగ్యలకు గురి చేస్తున్న బడా వ్యాపారులకు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొట్టిగాళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో పలువురి చేరిక
సిద్దిపేటఅర్బన్: మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం హైదరాబాద్లోని హరీశ్రావు తన నివాసంలో యువకులకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతల కుమార్ ఆధ్వర్యంలో పయ్యావుల రాజయ్య, పయ్యావుల కొమురయ్య, పయ్యావుల యాదగిరి, భైరి యాదగిరి, చింతల రాజు, జంపల్లి దేవరాజు, జక్కుల శివ, జిట్ట పరశురాములు, జిట్ట రాజు, బాకీ మల్లేశం, బంగారు కనకయ్య, జిట్ట కర్ణాకర్, బుట్టి ప్రభాకర్, తదితరులు పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో.. మిట్టపల్లి, ఎల్లుపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు మాజీ పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. వీరికి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హరికృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లుపల్లి నుంచి కనకయ్య, ఉప సర్పంచ్ పెద్ద నర్సయ్య, మాజీ సర్పంచ్ పోచయ్య, వార్డు సభ్యులు కమలాకర్రెడ్డి, బాపురాజు, నాయకులు నరసింహారెడ్డి, దుర్గారెడ్డి, మల్లారెడ్డి, కనకయ్య, భూమయ్య చేరారు. మిట్టపల్లికి చెందిన ఇసాక్, సతీశ్, ఉదయ్, బాల్నర్సింహులు పార్టీలో చేరారు. -
బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులు
కొల్చారం(నర్సాపూర్): జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన కరాటే పోటీల్లో మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్ సాధించారు. రిజుంకీ శోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే ప్రతిభా పోటీలు నిర్వహించారు. విద్యార్థులైన అక్ష య, నిహారిక, వైష్ణవి బ్లాక్ బెల్ట్, నిఖిల్ బ్రౌన్ బెల్ట్, మనోజ్ గ్రీన్ బెల్ట్ సాధించారు. చిన్నగనాపూర్ పాఠశాలకు చెందిన కీర్తి, భవాని బ్రౌన్ బెల్ట్, సంధ్య, ప్రణవి పర్పుల్ బెల్ట్ సాధించారు. వీరందరూ పైతర గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ మల్లేశ్ వద్ద శిక్షణ పొందుతున్నారు. -
యాసంగికి మల్లన్న సాగర్ నీళ్లందించాలి
పెద్దగుండవెల్లి రైతుల డిమాండ్ దుబ్బాకరూరల్: యాసంగి సాగుకు మల్లన్న సాగర్ నీళ్లందించాలని పెద్దగుండవెల్లి రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పెద్దగుండవెల్లి రైతు వేదికలో రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మల్లన్న సాగర్ కాలువ పనులను పూర్తి స్థాయిలో చేయలేదని, దీంతో గత సంవత్సరం యాసంగిలో పంటలు ఎండిపోయాయని వాపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పొలాలను నీళ్లందించాలనే ఉద్దేశంతో కాలువలు తవ్వారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యాసంగికి నీళ్లు అందించకపోవడం వల్ల రెండు వేల ఎకరాల భూమి బీడు భూములుగా ఉంటున్నాయన్నారు. ఈ విషయాన్ని మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. కాలువ పనులు పూర్తి చేసి ప్రస్తుతం సాగు చేస్తున్న యాసంగి పంటలకై నా సాగు నీరందించాలని కోరారు. లేదంటే పలు గ్రామాల రైతులతో చర్చించి పెద్ద ఎత్తున సాగు నీటి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
బోరు వేయించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ టౌన్: కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కె.మాణిక్రావు ఆదివారం బోరు వేయించారు. గ్రామానికి చెందిన బేగరి రాములును పరామర్శించేందుకు ఇటీవల ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లారు. బోర్ల నుంచి నీరు పట్టుకోవద్దని కొంత మంది అభ్యంతరం చెబుతున్నారని గ్రామానికి వెళ్లినప్పుడు దళితులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మాణిక్రావు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు. దళితుల నీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల నాయకులు గ్రామంలో బోరు వేయించారు. రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చిన దుప్పిని తండా వాసులు రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దారి తప్పిన దుప్పి పిల్ల ఆదివారం కిషన్ తండా పరిధిలోని లాక్య తండాలోకి రాగా కుక్కలు వెంబడించాయి. దీంతో గిరిజనులు దానిని రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వారు దుప్పిని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించి పోచారం అభయారణ్యంలో వదిలేశారు. వ్యక్తికి తీవ్ర గాయాలు దుబ్బాకరూరల్: ఇంట్లో మంటలు చెలరేగి వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అక్బర్పేట – భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు... దుద్దెడ భిక్షపతి తన భార్య, కుమారుడితో కలిసి డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నాడు. భిక్షపతి మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న అతని భార్య, కుమారుడు మంటలు ఆర్పారు. కాగా భిక్షపతికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. చుట్టు ప్రక్కల వారు గమనించి పోలీసులకు, 108కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన భిక్షపతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య, కుమారుడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. జిన్నారం (పటాన్చెరు): అతివేగంగా నడుపుతూ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం లక్ష్మీపతిగూడెం బ్రిడ్జి నుంచి గురుకుల పాఠశాల వైపు అతివేగంగా, అజాగ్రత్తగా ఇన్నోవా వాహనం నడుపుతూ మూల మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
సిద్దిపేటకమాన్: హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... పట్టణంలోని సాజిద్పూరలో నివాసం ఉంటున్న అబ్దుల్ ఖదీర్ స్థానికంగా కొంత కాలంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గత నెల 23న అదే ప్రాంతానికి చెందిన ఫిరోజ్ మద్యం మత్తులో ఖదీర్ ఇంటి ముందు పడిపోయాడు. గమనించిన ఖదీర్ మానవత్వంతో పడిపోయిన అతడిని లేపి ఇంటికి వెళ్లమని సూచించాడు. దీంతో ఆగ్రహించిన ఫిరోజ్ చికెన్ సెంటర్లోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ, కోడిగుడ్ల ట్రేలను ధ్వంసం చేశాడు. దుకాణంలోని కత్తితో బాధితుడిని చంపుతానని వెంటపడటంతో అతడు పారిపోయాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలో సిద్దిపేట వన్టౌన్, టూటౌన్, తొగుట పోలీసు స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. పట్టణంలో నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. -
అటకెక్కిన ‘మన ఊరు– మనబడి’
మౌలిక వసతుల కల్పనకు ఏర్పాటైన పథకం హత్నూర(సంగారెడ్డి): విద్యాభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నామని పాలకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మౌలిక వసతులు కరువయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిధుల కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రూ. 19 కోట్ల మేర పెండింగ్ గత ప్రభుత్వం మన ఊరు– మన బడి పథకం కింద జిల్లాలోని 441 పాఠశాలలను ఎంపిక చేసింది. సుమారు నాలుగేళ్లు గడిచినా, భవన నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాలకు గత ప్రభుత్వం రూ. 63.96 కోట్లు కేటాయించింది. అయితే రూ. 45.61 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. చేసిన పనులకు సంబంధించి సుమారు రూ. 19 కోట్లు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంది. నిధుల కొరతతో జిల్లాలో కేవలం 180 పాఠశాల భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మన ఊరు– మనబడి, మన బస్తీ పథకంలో పాఠశాల భవన నిర్మాణాలు, మరమ్మతులు, వంటగది, మరుగుదొడ్లు, ప్రహరీ, భోజనశాల, గదిలో పిల్లలు కూర్చోడానికి డెస్కులు, గ్రీన్చాట్ బోర్డులు, ఉపాధ్యాయులకు టేబుల్ కుర్చీలు సమకూర్చాలి. కానీ నిధుల కొరతతో జిల్లాలో అసంపూర్తి భవనాలే దర్శనమిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లోనే విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. హత్నూర మండలంలో 20 పాఠశాలల్లో మన ఊరు– మనబడి కింద పనులు చేసినప్పటికీ, కేవలం మంగాపూర్, బోరపట్ల పాఠశాలల్లో మాత్రమే పూర్తిస్థాయిలో పనులు చేశారు. మిగితా 18 పాఠశాలలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
మద్యానికి బానిసై.. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దుబ్బాకరూరల్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రాజక్కపేట గ్రామంలో జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ కీర్తి రాజ్ తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన తొగుట చంద్రయ్య(69) భార్యతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి కూతురు, కుమారుడు కలరు. వీరికి వివాహాలు అయ్యాయి. కొంత కాలం నుంచి మద్యానికి బానిస కాగా అప్పుడప్పుడు మతి స్థిమితం లేకుండా ప్రవర్తించే వాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన చంద్రయ్య తిరిగి ఇంటికి రాలేదు. గ్రామ శివారులోని కాలువ ప్రక్కన గల రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడు. చుట్టు ప్రక్కల వారు గమనించి కుటుంబీకులకు, పోలీస్లకు సమాచారం అందించారు. పోలీస్లు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య లక్ష్మవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మెదక్ కలెక్టరేట్ : రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. శనివారం మెదక్కు వచ్చిన ఆయన సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఇతర జిల్లా అధికారులతో రోడ్డు భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇలంబర్తి మాట్లాడుతూ.. ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటించి వాహనాలు నెమ్మదిగా నడపాలన్నారు. అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, వాహనాల మెయింటెనెన్న్స్ లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించి, బ్లాక్ స్పాట్ల వద్ద రహదారి లోపాల సమస్యలు లేకుండా చూడాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించాలని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, డ్రంకెన్ డ్రైవింగ్ను నిషేఽధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా వర్క్షాప్లు, సీపీఆర్లపై శిక్షణ ఇవ్వాలన్నారు. రోడ్లపై తనిఖీలు, స్పీడ్ గన్లు, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని రోడ్డు భద్రత మాసంలో ర్యాలీలు, పోటీలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ... జిల్లాలో పకడ్బందీగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రహదారి, ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి -
హరిద్ర నది ఒడ్డున నాచగిరి
వర్గల్(గజ్వేల్): హరిద్రనది పరవళ్లు, ప్రకృతి రమణీయతలతో అలరారే సుప్రసిద్ధ నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం ఆంగ్ల సంవత్సరాది రోజు భక్తులతో పోటెత్తనున్నది. ఆ రోజున స్వామివారిని పదివేలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా. ఇందుకు అనుగుణంగా ఆలయ పాలకవర్గం తగు కార్యాచరణ సిద్ధం చేసింది. ఏర్పాట్ల వివరాలను ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ విజయరామారావు వెల్లడించారు. ఆంగ్ల సంవత్సరాది రోజున భక్తుల తాకిడితో జనం కిక్కిరిసిపోకుండా తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకునే ప్రతిభక్తునికి తీర్థంతోపాటు బెల్లం పొంగలి ప్రసాదం ఉంటుంది. అమ్మకం ప్రసాదాల కోసం రెండున్నర క్వింటాళ్ల పులిహోర, 8వేల లడ్డూలు, 2వేల వడ, 1500 అభిషేకం లడ్డూలు స్టాక్ ఉండేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. స్వామివారి అభిషేకం సమయం మినహాయించి, తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా భక్తులకు దర్శనం ఉంటుంది. పోలీసు బందోబస్తుతోపాటు, వివిధ సేవాసమితి బృందాల సేవలు వినియోగించుకుంటామని ఈ సందర్భంగా చైర్మన్, ఈఓ వివరించారు. -
లేగదూడను చంపితిన్న చిరుత
చేగుంట(తూప్రాన్): లేగదూడను చిరుత చంపితినింది. ఈ సంఘటన మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి పులిగుట్ట తండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పులిగుట్ట తండాకు చెందిన లక్ష్మి, కిషన్ దంపతులు పశువులను పెంచుకుంటూ జవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పశువులను మేతకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం కుంట సమీపంలో నీటిని తాగించేందుకు తోలుకెళ్తుండగా అడవి ప్రాంతం నుంచి వచ్చిన చిరుత పశువుల గుంపులోని లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తిన్నది. భయంతో కిషన్, లక్ష్మి తండాలోకి పరిగెత్తి తండావాసులకు విషయం చెప్పారు. తండావాసులు కుంట వద్దకు వెళ్లి చూడగ లేగదూడను చంపి సగం తినేసినట్లు గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, తండా వాసులంతా జాగ్రత్తగా ఉండాలని చాటింపు వేయించారు. -
చెరువులోకి ఆటో..
అడ్డొచ్చిన కోతులు వట్పల్లి(అందోల్): ఆస్పత్రికి వెళ్దామని ఆటోలో బయలుదేరిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. శనివారం అందోలు మండలం అన్నాసాగర్ వద్ద జరిగిన ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలివి. పెద్ద శంకరంపేట మండలం జంబికుంట గ్రామానికి చెందిన మామిడి విజయరావు (54)కు కొంతకాలంగా ఆరోగ్యం బాగా లేదు. దీంతో జోగిపేట ఆస్పత్రిలో చికిత్స చేయించుకుందామని మేనల్లుడైన మామిడి మహేశ్ ఆటోలో బయలుదేరాడు. అన్నాసాగర్ కట్టపైకి ఆటో చేరుకోగానే కోతుల గుంపు ఒక్కసారిగా వాహనం ముందుకు రావడంతో అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న విజయరావు నీటిలో మునిగిపోయాడు. ఆటో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. మామ కనిపించకపోయే సరికి నీటిలో వెతికాడు. దారిన వెళ్తున్న వారు నీట మునిగిన విజయరావును ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఆయన మృతి చెందడంతో జోగిపేట ఎస్ఐ పాండు, పోలీసు సిబ్బంది అంబులెన్స్లో మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.నీట మునిగి ఒకరి మృతి -
అర్హులకు డబుల్ ఇళ్లు పంపిణీ చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్ రూరల్: నెల రోజుల్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం నర్సాపూర్ చౌరస్తా వద్ద రాస్తారోకోకు దిగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పట్టణానికి 500 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 252 ఇళ్లు పూర్తి కాగా, మరో 248 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని పలుమార్లు కలెక్టర్, మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. ఫలితం లేకపోవడంతో ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూంలను అర్హులైన పేదలకు పంపిణీ చేయకుంటే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయీమోద్దీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, నాయకులు సత్యంగౌడ్, ప్రసాద్, ఆంజనేయులుగౌడ్, ఆనంద్, రాంచందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
తెలంగాణ తిరుమల.. బాలాజీ ఆలయం
దుబ్బాక: కలియుగ దైవం..కోరిన భక్తుల కొంగు బంగారం.. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయానికి నూతన సంవత్సరం సందర్భంగా(గురువారం) భక్తులు భారీగా తరలిరానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సంవత్సరం రోజు సుమారుగా 50 వేలకు పైగా భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన భూంపల్లి–అక్బర్పేట మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం, చౌదర్పల్లిలో స్వయంభువుగా వెలసిన దుబ్బరాజేశ్వర ఆలయం, చెల్లాపూర్ సోమేశ్వర ఆలయాలకు సైతం వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో ఆ ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
● మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోఅందుబాటులోకి ‘క్రిటికల్ కేర్’వైద్యం ● ట్రిబుల్ఆర్ నిర్మాణం దిశగా కీలక అడుగులు ● నిమ్జ్ భూసేకకరణపై అధికారయంత్రాంగం దృష్టి
సింగూరు ప్రాజెక్టు ప్రధాన కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభం కాలేదు. ఈ పనుల కోసం ఈ ఏడాది రూ.162 కోట్లు మంజూరైనప్పటికీ.. పనులు మాత్రం పట్టాలెక్కలేదు. ఈ పనులు పూర్తయితే తమ భూములకు సాగునీరు అందుతుందని చివరి ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రైతుల ఆశలు నెరవేరే దిశగా పనులు ప్రారంభం కాకపోవడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఈ ఏడాది పలు కీలక అభివృద్ధి పనులకు అడుగులు పడ్డాయి. రాష్ట్రాభివృద్దికి గేమ్ చేంజర్గా భావిస్తున్న ట్రిబుల్ఆర్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఈ ఏడాది కొలిక్కి వచ్చింది. ముంబై హైవే విస్తరణ పనుల ప్రగతి వేగం పుంజుకుంది. మెడికల్ కాలేజీకి అనుబంధ ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్ కేర్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్ని అభివృద్ది పనులు పట్టాలెక్కలేదు. ప్రధానంగా సింగూరు కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరైనప్పటికీ ఏడాదిగా పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలు శంకుస్థాపనలకే పరిమితమైంది. 2025 జిల్లాలో ప్రధాన అభివృద్ధి పనుల తీరుపై ఇయర్ రౌండప్ కథనం. అభివృద్ది దిశగా అడుగులు పడ్డాయి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే వినూత్నంగా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని బైపాస్రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ బంక్ను స్వయం సహాయక సంఘాల మహిళలే స్వయంగా నిర్వహిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు విజయవంతంగా నిర్వహించారు. ఈ బంక్ ఏర్పాటు చేయడంతో తమకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని వాహనదారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ బంక్ నిర్వహణ నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అంతర్గతంగా విచారణ జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయి. ఉత్తర భాగం 161 కి.మీలు నిర్మిస్తున్న ఈ రోడ్డు నిర్మాణం కోసం ఉమ్మడి మెదక్ జిల్లా పరిఽధిలో సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ ఆర్డీఓ (కాలా)లు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 111 గ్రామాల పరిధిలో 6,250 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈ ప్రక్రియ పూర్తయితే నిర్మాణం పనులకు టెండరు ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఒకటైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ఈ ఏడాది కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది. ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు ఈ పాఠశాలు మంజూరయ్యాయి. అయితే ఈ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపనలు ఈ ఏడాది జరిగినప్పటికీ.. నిధుల లేమి కారణంగా ఒక్క ఇటుక కూడా పడలేదు. నిర్మాణం పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఈ పాఠశాలల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుబాటులోకి వస్తుంది. ముంబై హైవే విస్తరణలో భాగంగా చేపట్టిన బీహెచ్ఈఎల్– లింగంపల్లి చౌరస్తా వంద నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది. దీంతో పటాన్చెరు వైపు నుంచి చందానగర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకముందు ఈ చౌరస్తాలో నాలుగు వైపుల కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం అయ్యేది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే వారు. -
బస్సు, టిప్పర్ ఢీకొని..
కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రమైన కందిలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.... మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పటాన్ చెరుకు వెళుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కంది చౌరస్తాలో ముందు వెళుతున్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు పదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. రామాయంపేట పరిధిలో నలుగురికి... రామాయంపేట(మెదక్): రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు...రామాయంపేటకు చెందిన విలేకరులు వెంకట్, రామారపు యాదగిరి బైక్పై నార్సింగి నుంచి రామాయంపేట వస్తుండగా, కేసీఆర్ కాలనీవద్ద జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తున్న శంకాపూర్కు చెందిన వల్లూరి రాములు తన బైక్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట్, యాదగిరికి తీవ్రగాయాలయ్యాయి. మరో సంఘటనలో మండలంలోని తొనిగండ్లకు చెందిన పిట్ల పోచయ్య బైక్పై వెళ్తుండగా, అతి వేగంగా మెదక్వైపు వెళ్తున్న స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ పోచయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో సంఘటనలో పట్టణానికి చెందిన టంకరి స్వామి కాలినడకన వ్యవసాయ పనులకు వెళ్తుండగా, సిద్దిపేట వైపు కేటీఎం స్పోర్ట్స్’ బైక్పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ స్వామిని ఆస్పత్రికి తరలించారు. ఈ మూడు కేసులకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.10 మందికి గాయాలు -
గాంధీ పేర్లు లేకుండా బీజేపీ కుట్ర
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ పేర్లు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మహాత్మాగాంధీ పేరును అవమానపర్చే విధంగా ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్ జీ పేరును పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు శివయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు. -
ఏడు వాహనాలు సీజ్
ములుగు(గజ్వేల్): నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు మార్గంలో వెళ్తున్న ఏడు వాహనాలపై పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ములుగు ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం... మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డుకు ప్రతినిత్యం కూరగాయలతో వచ్చే వాహనదారులు ఇష్టమొచ్చిన చోట వాహనాలను పార్కింగ్ చేయడం, తప్పుడు మార్గంలో మార్కెట్ యార్డుకు చేరుకుంటుండటంతో రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయంలో పలుమార్లు కూరగాయల వాహనదారులకు సమావేశం నిర్వహించి సరైన మార్గంలో మార్కెట్కు రావాలని, ఇష్టమొచ్చిన చోట పార్కింగ్ చేయరాదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా వాహనదారుల్లో మార్పు రాలేదు. శనివారం నింబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా పార్కింగ్ చేసి తప్పుడు మార్గంలో వస్తున్న 7 వాహనాలపై కేసునమోదు చేసి సీజ్ చేశారు. -
అథ్లెటిక్స్లో ప్రభాకర్కు రెండో స్థానం
పాపన్నపేట(మెదక్): మండలంలోని ఎల్లాపూర్కు చెందిన ప్రభాకర్ గౌడ్ కరీంనగర్లో శనివారం జరిగిన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో రెండో స్థానాన్ని పొందాడు. మెదక్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న ప్రభాకర్ గౌడ్ చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రతిభ కనబరిచేవారు. ఈ మేరకు కరీంనగర్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. మెదక్ పోలీసులు , గ్రామస్తులు ఆయనను ప్రశంసించారు. యువతి అదృశ్యం ఝరాసంగం(జహీరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... జునేగావ్ గ్రామానికి చెందిన రేణుక(19) ఈనెల 26న ఇంట్లో ఎవరికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మూడిళ్లలో చోరీ నర్సాపూర్ రూరల్: తాళం వేసిన మూడిళ్లలో దొంగలు చొరబడి నగదు బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... సునీత రెడ్డి కాలనీకి చెందిన షౌకత్ శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వేరే గ్రామానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలో ఉన్న రూ.11వేల నగదు, రెండున్నర గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే సీఎస్ఐ చర్చి సమీపంలో నివాసముంటున్న లంబాడి అనిత ఇంట్లో దొంగలు పడి రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మరోచోట జీకే మొబైల్ గల్లీలో నివాసముంటున్న మరాఠీ అవినాష్ ఇంట్లో చొరబడి రూ.5 వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలువ దారి కబ్జాకు యత్నం జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమ సమీపంలో గల కాలువ కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి, పరిశ్రమకు మధ్యలో ఉన్న కాలువ నుంచి వర్షం నీరు ప్రవహించేదని, కానీ టోటల్ ట్రిక్స్ పరిశ్రమ యాజమాన్యం కాలువ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కబ్జాకు గురైతే దారి కూడా లేకుండా పోతుందని పరిశ్రమ యజమాన్యంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆలయాల్లో పండుగ వాతావరణం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిలలో ప్రార్థనలు చేయనున్నారు. అందుకోసం జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీశ్వర కోటిలింగాల ఆలయం, వెంకటేశ్వర, సంతోషిమాత, సాయిబాబా ఆలయాల్లో పూజలు, సీఎస్ఐ చర్చిలలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హిస్తారు. దీంతో నూతన సంవత్సరం రోజున ఆలయాలు, చర్చిల వద్ద విద్యుత్ కాంతులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మేరకు ఆలయం, చర్చిల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ
ఝరాసంగం(జహీరాబాద్): ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కరాటే పోటీలో ఝరాసంగం మోడల్ స్కూల్ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టెనావతి శనివారం తెలిపారు. పోటీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు పాల్గొనగా స్నేహ రెడ్డి ద్వితీయ స్థానం సాధించారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. నిధులు కేటాయించండివక్ఫ్బోర్డు చైర్మన్కు ఎమ్మెల్యే వినతి నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో ముస్లింల సంక్షేమం కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఖేడ్ మైనార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని వక్ఫ్ భూమిలో ఉన్న షాదీఖానాకు రూ.50లక్షలు, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి మరో రూ.50లక్షలు, ఈద్గా కోసం 5 ఎకరాలు, ముస్లిం శ్మశానవాటిక కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. కాగా, చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహెర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, నాయకులు సంగన్న, పండరిరెడ్డి, మొయినొద్దీన్, మాజీద్, సుబుర్, అబిబుల్లా, హైదర్ నవాబ్, గౌస్ చిస్తి, ముకిత్, శాదుల్లా చిస్తీ, హఫీజ్ మదీనా, షఫీ ఖురేషి, మొయిన్ ఖురేషి, శకీబ్, అజీమ్, సల్మాన్ ఉన్నారు. నేడు గాంధీ చిత్రపటాలతో నిరసనలు జోగిపేట(అందోల్): పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న ఉపాధిహామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలతో నిరసన తెలియజేయాలని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉద్యాన మిషన్ ద్వారా సబ్సిడీ జిన్నారం (పటాన్చెరు): నీటి కుంట, జామ, టమాటా, నారు వంటి సాగుకు సంబంధించి ఉద్యాన మిషన్ కింద సబ్సిడీ కూడా ఇస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం గుమ్మడిదల పట్టణ కేంద్రానికి చెందిన కాసుశౌరి అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా నీటి కుంటతో సాగు చేస్తున్న కూరగాయలను పండించే పద్ధతులను రైతులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కూరగాయలతో పాటు జామ, ఆపిల్, బేర్ సాగు చేస్తున్న తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక రైతు కూరగాయలు, పండ్ల సాగు చేస్తున్న తీరును అభినందించారు. పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ డివిజన్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జీవాలకు టీకాలు తప్పనిసరి మనోహరాబాద్(తూప్రాన్): జీవాలకు సీజనల్ వ్యాధులు రాకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య సంచాలకుడు వెంకటయ్య అన్నారు. శనివారం మ ండలంలోని కాళ్లకల్లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జీవాలకు మందుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు సర్పంచ్ నవ్య నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూప్రాన్ ఉమ్మడి మండల పశు వైద్యాధికారి లక్ష్మి, ఉప సర్పంచ్ ప్రవీణ్, సిబ్బంది రవి పాల్గొన్నారు. -
పెళ్లి ఇష్టం లేదని..
పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య కొమురవెల్లి(సిద్దిపేట): పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని పోసాన్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ తోట మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పోసాన్పల్లి గ్రామానికి చెందిన కానుగంటి జ్యోతిరెడ్డి(24)కి కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తామన్నారు. దీంతో ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని శుక్రవారం క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్పాపన్నపేట(మెదక్): మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఎంకెపల్లి గ్రామానికి చెందిన బద్రి అంజయ్య, సలీం పాషా మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తుండగా పట్టుకొని, ట్రాక్టర్లను సీజ్ చేశామని చెప్పారు. -
కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం తప్ప, సంక్షేమ పథకాలపై ధ్యాస లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసి 37 వేల ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, ఈ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. గ్రామస్థాయిలో కొత్త సర్పంచ్లు రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సింగూరు మరమ్మతుల పేరుతో 30 నుంచి 40 వేల ఎకరాలకు సాగు నీరు వదులుతారో..? లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. కొత్తగా యూరియా యాప్ తెచ్చి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారి పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర మాజీ అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్రావు, నాయకులు రవి, రమేశ్, వీరేందర్, అర్జున్తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
పగటి పూట కరెంట్ సరఫరా చేయండి
రాయికోడ్(అందోల్): పగటి పూట కరెంట్ సరఫరా చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికోడ్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తుండటంతో భయాందోళనల మధ్య పొలాలకు వెళ్లాల్సి వస్తుందని వారు వాపోయారు. అడవి పందులు, విషపురుగుల భయంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. విద్యుత్ మోటారు స్టార్టర్లో తరచూ పాములు, తేళ్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తమ ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, ఉదయం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగటి పూట విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సబ్స్టేషన్లో విద్యుత్ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు.రాయికోడ్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన -
డివైడర్ను ఢీకొట్టిన తుపాన్
పటాన్చెరు టౌన్: తుపాన్ వాహనం డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కేరళ రాష్ట్రం నుంచి తుపాన్ వాహనంలో మధ్యప్రదేశ్కు 12 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ముత్తంగి వద్ద ఓఆర్ఆర్పై మేడ్చల్ వైపు వెళుతుండగా సుల్తాన్పూర్ సమీపంలో అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని డ్రైవర్ నడపడంతో డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 12 మంది ప్రయాణిస్తుండగా, హనుమత్ సింగ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్క అడ్డురావడంతో.. బైక్ అదుపుతప్పి.. కొమురవెల్లి(సిద్దిపేట): కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి హెడ్కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుజకుంట వాగు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చేర్యాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ రోజు లాగే విధుల నిర్వహణ నిమిత్తం సిద్దిపేట నుంచి ద్విచక్రవాహనంపై స్టేషన్కు వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో గురిజకుంట వాగు బ్రిడ్జి సమీపంలో అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో నరేందర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటకు తరలించారు. ఇది ఇలా ఉంటే నరేందర్ హెల్మెట్ ధరించి ఉంటే తలకు బలమైన గాయం తగిలి ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్కొల్చారం(నర్సాపూర్): ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాలు ఇలా.. మెదక్ వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గ్రామంలోని భాస్కర్ రెడ్డి మూలమలుపు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం ఒక్కసారిగా ట్రాక్టర్ డ్రైవర్ టాప్పై ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ ఒక్కసారిగా కిందికి దూకాడు. దీంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.బోల్తా పడి ఒకరికి తీవ్రగాయాలు -
స్నానం చేసేందుకు నీటిలోకి దిగి..
పాపన్నపేట(మెదక్): స్నానం చేసేందుకు నీటిలోకి దిగిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఏడుపాయల్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... అందోల్ మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కదులూరి ప్రసాద్ (16) తన స్నేహితులతో కలిసి మెదక్ చర్చికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఏడుపాయల్లోని రెండో బ్రిడ్జివద్ద స్నానం చేయడానికి నీటిలోకి దిగారు. ఈ క్రమంలో ప్రసాద్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా, తోటి స్నేహితులు రక్షించడానికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో భానుప్రసాద్ అనే మరో యువకుడు కూడా నీటిలో మునిగాడు. సమీపంలో ఉన్న మత్స్యకారుడు గమనించి నీటిలోకి దూకి భానుప్రసాద్ను రక్షించగా, ప్రసాద్ మాత్రం అప్పటికే నీటిలో మునిగి మృతి చెందాడు. ప్రసాద్ ఇంటర్ చదువుతున్నట్లు తెలిసింది. ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.యువకుడు మృతి -
రెండో రోజు జన జాతరే
మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులుమెదక్ కలెక్టరేట్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు రెండోరోజు ఘనంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మందితో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యువతీ, యువకులు సెల్ఫీలతో సందడి చేశారు. -
నడుచుకుంటూ వెళ్తుండగా..
హత్నూర( సంగారెడ్డి): ద్విచక్ర వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గుండ్ల మాచునూర్ గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హరే రామ్ సర్దార్ (44) కొంతకాలంగా కోవలెంట్ లేబరేటరీస్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి పరిశ్రమ సమీపంలో సంగారెడ్డి నర్సాపూర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి కార్మికులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. రెండు బైకులు ఢీకొని వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై పెద్ద చింతకుంట సమీపంలో చోటు చేసుకుది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... నర్సాపూర్కు చెందిన బంటారం భద్రప్ప (70) టీవీఎస్ మోటార్పై నర్సాపూర్ వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. దీంతో భద్రప్పకు తీవ్ర గాయాలు కాగా అంబులెనన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. అతడు మిర్చి బండి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతునికి భార్య శంకరమ్మ ఉంది. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు.. మరో ఘటనలో... బైక్ ఢీకొని కార్మికుడు మృతి -
వెనక్కి తగ్గేది లేదు
అమీన్పూర్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎస్టీపీ ఏర్పాటును వ్యతిరేకిస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎస్టీపీని అడ్డుకుంటాం. స్థానిక కాలనీవాసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే రానివ్వబోమని హామీ ఇచ్చారు. ప్రశాంతమైన గుట్టల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనివ్వబోం. స్థానికుడిగా ఈ ప్రాంతం జీవవైవిధ్యం,, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత నాపై ఉంది. –తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అమీన్పూర్లోని సర్వే నంబర్ 993లో ఎస్టీపీ నిర్మాణం ఆక్షేపణీయం. స్థానిక కాలనీవాసులకు దాంతో ఎలాంటి లాభం లేదు. అక్కడ స్టేడియం నిర్మిస్తే పట్టణ పౌరులకు ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు కొనసాగాలి. ఎస్టీపీ ఏర్పాటు సరైంది కాదు. –ఎం.రమేష్కుమార్, మోడీ కాలనీ మాజీ అధ్యక్షుడు -
వార్డు మెంబర్ ఆత్మహత్య
కొమురవెల్లి(సిద్దిపేట): గ్రామానికి మంచి చేద్దామని వార్డు సభ్యునిగా గెలిచిన ముచ్చట తీరకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని అయినాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 11 వార్డు సభ్యునిగా గెలిచిన దండు భానుచందర్(30) బుధవారం ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని మృతికి ఓ వివాహిత కారణమంటూ కుటుంబసభ్యులు సదరు మహిళ ఇంటి ఎదుట మృతదేహంతో నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి గజ్వేల్ ఏసీపీ నర్సింహులు చేరుకుని నచ్చజెప్పగా ఆందోళన విరమించారు. బాలిక అదృశ్యం పటాన్చెరు టౌన్: బాలిక అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ముత్తంగి పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక (16) ఈనెల 16న కిరాణా షాపునకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మౌలిక వసతులు కల్పిస్తా
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్ కాలనీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రమాకాంత్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్ రావు -
ప్రతిభ చాటిన ప్రార్ధిని
● లిటిల్ మిస్ ఇండియాలో రన్నరప్ ● రూ.3లక్షల నగదు పురస్కారం సిద్దిపేటజోన్: ఈనెల 21నుంచి 23వరకు ఒడిశా భువనేశ్వర్లో నిర్వహించిన కిట్ నన్ని పరి లిటిల్ మిస్ ఇండియా చాంపియన్ షిప్ పోటీల్లో సిద్దిపేటకు చెందిన ప్రార్ధిని రన్నరప్గా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 33 మంది పాల్గొన్నారు. వీరిలో కర్ణాటకకు చెందిన త్రిపాఠి మొదటి స్థానంలో నిలిచింది. మొదటి రన్నరప్గా మధ్యప్రదేశ్కు చెందిన ప్రాంజల్ శర్మ నిలువగా, రెండో రన్నరప్గా సిద్దిపేటకు చెందిన ప్రార్ధిని నిలిచింది. ఈ సందర్భంగా రూ.3లక్షల నగదు బహుమతితో పాటు కిట్ విద్యాసంస్థల్లో చదువుకుంటే రూ.9 లక్షల వరకు ఫీజు మినహాయింపు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ప్రార్ధినిని జిల్లా కళాకారులు అభినందించారు. ప్రార్ధినికి యూ ట్యూబ్ ఛానల్లో మంచి పేరుంది. కాగా ఆమె తండ్రి రాజేశ్ గాయకుడు. వేలేటి శైలజకు డాక్టరేట్ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట పట్టణానికి చెందిన వేలేటి శైలజ కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ‘‘జీ.ఎస్. మోహన్ రచనలు’’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందినట్లు ఇందిరానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆమె ప్రస్తుతం ఇందిరానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసుకొని డాక్టరేట్ సాధించిన శైలజ పరిశోధనకు మార్గదర్శకులుగా వ్యవహరించిన ఆచార్య రామనాథం నాయుడు, విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శరణప్ప, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పటాన్చెరు టౌన్: గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్ చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని అమేధ ఆస్పత్రి సమీపంలో ఈ నెల 23వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి పడి ఉన్నాడని, డయల్ 100కు ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో పడి ఉన్న వ్యక్తిని పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు గురువారం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏడుపాయల్లో వృద్ధుడు.. పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్గౌడ్ వివరాల ప్రకారం... కొన్ని రోజులుగా ఏడుపాయల పుణ్యక్షేత్రం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల చలి తీవ్రత పెరగడంతో తట్టుకోలేక మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగు చొక్కా ధరించి, తెల్లని గడ్డం కలిగి ఉన్నాడు. కాగా మృతుడు నల్లగొండ జిల్లాకు చెందిన అంజిరెడ్డిగా గుర్తించారు. -
29న విశ్రాంత ఉద్యోగుల సమావేశం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఈనెల 29న ఉదయం 10:30 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంఘం ఖేడ్ యూనిట్ అధ్యక్షుడు నర్సింహులు తెలిపారు. సమావేశానికి సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ హాజరవుతున్నారని చెప్పారు. యూనిట్ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులంతా హాజరుకావాలని కోరారు. అధికారులతో మాజీమంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్/చిన్నకోడూరు: వచ్చే యాసంగి నాటికి శాశ్వత పంట కాల్వల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారితో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళికలను చేపట్టకపోవడంతో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తన సొంత డబ్బులతో తాత్కాలిక కాల్వలు తీసి సాగు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి అవసరమైన భూసేకరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. ఇర్కోడ్, చందలాపూర్లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ చెక్ డ్యాం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈలు గోపాల్కృష్ణ, శంకర్, డీఈ చంద్రశేఖర్, అధికారులు శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నకోడూరు రైల్వేస్టేషన్ నిర్మాణంతో పాటు విఠలాపూర్ వరకు రైల్వేలైన్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సభ్యులు మల్లేశం, బాలమణి, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో కొబ్బరికాయలు, ప్రసాదాలు, పూజా సామగ్రి విక్రయించేందుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవాలయ అధికారి శశిధర్ పేర్కొన్నారు. ఈనెల 29న ఉదయం 10 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు చెప్పా రు. కాగా జనవరి 15, 2026 నుంచి జనవరి 14, 2027 వరకు విక్రయించేందుకు వేలం వేస్తు న్నామన్నారు. ఆసక్తి గల వారు ముందుగా రూ. 50 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. మెదక్ కలెక్టరేట్: నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత చట్టాలనే పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దేశవ్యాప్త నిరసనలో భాగంగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. -
కార్మికులపై కేంద్రం కక్ష
కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాల్గొన్నారు. -
చెరబడుతున్నారు..!
రామచంద్రాపురం మండలంలోని ఓ చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) 43.2 ఎకరాలు. ఈ ఎఫ్టీఎల్ను 14 ఎకరాలకు తగ్గించి 29 ఎకరాలకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో ఎకరం కనీసం రూ.10 కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన ఎఫ్టీఎల్ను 14 ఎకరాలు తగ్గిస్తే ఈ చెరువుకు ఆనుకుని ఉన్న రియల్ వ్యాపారులకు రూ.కోట్లలో కలిసి వస్తుందని ఈ ఎఫ్టీఎల్ కుదింపు వ్యవహారానికి అధికారులు తెరలేపారు. ఈ అక్రమాల్లో నీటిపారుదలశాఖతో పాటు, రెవెన్యూ, హెచ్ఎండీఏలోని కొందరు అధికారులు ఈ స్కెచ్ వేశారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మొత్తం ఎనిమిది మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. సంగారెడ్డి, కంది, హత్నూర, జిన్నారం, రామచంద్రాపురం, పటాన్చెరు, గుమ్మడిదల, అమీన్పూర్ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో 496 చెరువులు ఉన్నాయి. వీటన్నింటికి ఫైనల్ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ కొనసాగుతోంది. నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, హెచ్ఎండీఏ అధికారులు సంయుక్తంగా క్షేత్ర పరిశీలన చేసి చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్, సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. చెరువు విస్తీర్ణం అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన జియో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి ఫెనల్ నోటిఫికేషన్ను జారీ చేస్తున్నారు. రియల్ వ్యాపారులకు కలిసొచ్చేలా.. ఈ చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. చెరువులను కాపాడాల్సిన అధికారులే రియల్ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. రియల్ వ్యాపారులకు కలిసొచ్చేలా ఈ చెరువుల విస్తీర్ణం తగ్గిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రాపురం మండలంలోని ఈ చెరువు ఎఫ్టీఎల్ను కుదించినందుకు నీటిపారుదలశాఖలోని ఓ కీలక ఉన్నతాధికారి ఏకంగా రూ.అరకోటి, మరో అధికారికి రూ.30 లక్షలకు నజరానాగా ఒప్పందం కుదిరినట్లు ఆశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు రెవెన్యూశాఖ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముడుపుల వ్యవహారంలో ఒకరిద్దరు హెచ్ఎండీఏ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల ఫైల్ను ఆపినందుకు సంబంధిత ఉన్నతాధికారులపై రాజకీయ ఒత్తిళ్లు సైతం తెచ్చినట్లు సమాచారం. ఎఫ్టీఎల్ కుదింపు వ్యవహరంలో.. ఈ చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణంను కుదింపు వ్యవహారంలో హెడ్రామా కొనసాగింది. ఎఫ్టీఎల్ను 29 ఎకరాలకు కుదిస్తూ ప్రతిపాదనలు ఆశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడం గమనార్హం. ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఈ ప్రతిపాదనల ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించగా., ఇందులో అధికారుల జిమ్మిక్కులు వెలుగులోకి వచ్చింది. ఇలా ఇప్పటి వరకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన చెరువుల రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ చెరువు ఎఫ్టీఎల్ను 14 ఎకరాలు తగ్గించేందుకు స్కెచ్..? రియల్ వ్యాపారులకు రూ.కోట్లలో కలిసొచ్చేలా అధికారుల కుట్రలు రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు హెచ్ఎండీఏ చెరువుల పరిక్షణ ప్రక్రియలో జిమ్మిక్కులు -
శనిగరం.. సింగారం
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంపెళ్లి చేసుకుంటానని మోసం.. – అసిస్టెంట్ లైన్మెన్ అరెస్ట్ సిద్దిపేటకమాన్: పెళ్లి చేసుకుంటానని సంబంధం మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ రోజే వేరే అమ్మాయితో పారిపోయిన అసిస్టెంట్ లైన్మెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన పి.రామస్వామి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి కుటుంబ సభ్యులు గత నెలలో సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ యువతితో రామస్వామికి వివాహం నిశ్చయించారు. పెద్ద మనుషుల సమక్షంలో రూ.50లక్షలు కట్నం మాట్లాడుకుని అమ్మాయి తల్లిదండ్రులు రామస్వామికి రూ.51వేలు నగదు కట్నం కింద ఇచ్చారు. గత నెల 26న ఎంగేజ్మెంట్ ఉండగా అదే రోజు రామస్వామి తాను అంతకుముందు ప్రేమించిన వేరే అమ్మాయితో పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు తాము మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ ఆసిఫ్ దర్యాప్తులో భాగంగా రామస్వామిని శుక్రవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు.పత్తిమిల్లులో అగ్నిప్రమాదంగజ్వేల్రూరల్: పత్తిమిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బయ్యారం సమీపంలోని శివగంగ పత్తిమిల్లులోని మెషిన్ నుంచి నిప్పురవ్వలు చెలరేగి బెల్టు మంటల్లో కాలిపోయింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ. 70వేల ఆస్తినష్టం జరిగింది. కాగా మిల్లులోని పత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని నిర్వాహకులు తెలిపారు. బైక్ దొంగలు అరెస్ట్సంగారెడ్డి క్రైమ్: బైక్ను ఎత్తుకెళ్లిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ రాము నాయుడు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన బుయ్య రంజిత్ (24), మెదక్ జిల్లా రేగోడు మండలానికి చెందిన చాకలి రాజు(24), ఇద్దరు పట్టణంలోని పుట్పాత్పై ఉంటున్నారు. ఈ క్రమంలో బైకులను దొంగిలించాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 25తేదీన పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన పి.సురేశ్ రెడ్డి అపార్ట్మెంట్లో బైక్ను పార్కు చేసి పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. గురువారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్లారు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం వైకుంఠపురం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చిన ఇద్దరు అనుమానితులు రంజిత్, రాజులను అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బైకును స్వాధీనం చేసుకున్నారు.మండలంలోని శనిగరం జలాశయాన్ని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ, ఇటు రైతులకు అటూ మత్స్యకారులకు ఆపన్నహస్తంగా నిలుస్తుంది. చుట్టూ ఎత్తయిన పచ్చని గుట్టల మధ్య నిలిచిన నీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. రాజీవ్ రహదారికి చేరువలో ఉండటంతో పర్యాటకానికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే వర్షాకాలంలో వందల మంది పర్యాటకులు వస్తున్నారు. – కోహెడరూరల్(హుస్నాబాద్) నిండుకుండలా శనిగరం ప్రాజెక్ట్ఈ ప్రాజెక్ట్ వెనుక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం కాలంలో 1891లో మధ్యతరహ ప్రాజెక్ట్గా పునరుద్ధరించడానికి 560 సీర్లు(504 కిలోల బంగారం) ఖర్చు చేసి నిర్మించారు. చారిత్రక ఘనత కలిగిన ఈ జలాశయం నేడు బహుళ ప్రయోజనకారిగా మారింది. అందుకే స్థానికులు ఇప్పటికీ అత్యంత విలువైన బంగారు ప్రాజెక్ట్గా చెప్పుకుంటారు. ప్రాజెక్ట్ కట్టి 134 ఏళ్లు గడిచినా చెక్కు చెదరకుండా ఉంది. ఆ నాటి నిర్మాణాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. పర్యాటక హబ్గా మారడానికి ఉన్న ప్రధాన ఆకర్షణలో ఇది ఒకటిటూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ● పచ్చని ప్రకృతి ఒడిలో జలాశయం ● ఇప్పటికే రైతులకు, మత్స్యకారులకు జీవనోపాధి ● రాజీవ్ రహదారికి చేరువలో డెస్టినేషన్ ఎకో టూరిజానికి ప్రణాళిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో ఈ ప్రాతాన్ని ఎకో టూరిజం సర్క్యూట్లో భాగంగా అభివృధ్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యాటకుల కోసం వ్యూ పాయింట్లు, కాటేజీలు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం, గార్డెనింగ్ వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తే జిల్లాలోనే అత్యుత్తమ పిక్నిక్ స్పాట్గా మారుతుందని స్థానికులు కోరుతున్నారు.సాగుతో పాటు మత్స్య సంపద ఈ ప్రాజెక్ట్ 5,100 ఎకరాలకు సాగునీటిని అందించడమే కాకుండా 281 హెక్టార్ల విస్తీర్ణంలో మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది. చేపల ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడంలో అదనపు బలాలుగా నిలుస్తాయి. పచ్చని పొలాలు, మత్స్యకారుల చేపల వేట దృశ్యాలు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్నిస్తున్నాయి. పర్యాటకులు సైతం ఇక్కడికి వచ్చినప్పుడు తాజా చేపలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరగా పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తే సిద్దిపేట జిల్లాకే ఒక మైలురాయిగా నిలువనుంది. వసతులు కల్పించాలి పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బోటింగ్, పిల్లలకు ప్రత్యేక పార్కులు, వాకింగ్ ట్రాక్ లాంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. – గునిగంటి అజయ్, విద్యార్థి, శనిగరం సరదాగా గడపడానికి.. వీకెండ్లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో గడపడానికి బెస్ట్ స్పాట్. గుట్టల మధ్య అందమైన లొకేషన్ ఉంటుంది. ఇక్కడి పచ్చదనం ఆ మత్తడి దూకే జలపాతం చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. రాజీవ్ రహదారికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమించే వారు ఒక్కసారైనా చూడాల్సిన చోటు. – ద్యాగటి హరీశ్, పర్యాటక ప్రేమికుడువర్షాకాలంలో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నప్పుడు మత్తడి నుంచి నీరు పాలధారలా కిందకు దూకుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు. ఇక్కడి మత్తడి బండలు, ప్రాజెక్ట్ పరిసరాలు సెల్ఫీలకు ఫొటోషూట్లకు అనువుగా ఉండటంతో సోషల్ మీడియాలోనూ ఈ ప్రాంతానికి మంచి ప్రచారం లభిస్తుంది. హత్నూర(సంగారెడ్డి): నదిలో పడి గల్లంతైన పశువుల కాపరి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కాసాల గ్రామానికి చెందిన రేగళ్ల స్వామి(26) గురువారం గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతంలో పశువులని మేపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. సాయంత్రం పశువులు ఇంటికి వచ్చినా అతడు రాలేదు. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పశువుల కాపరి మృతదేహం లభించడంతో కుటుంబీకులు, గ్రామస్తులు బోరున విలపించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. మృతుడికి కొంతకాలంగా మూర్ఛ వ్యాధి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. -
కూల్చడం తప్ప.. కట్టడం తెలియదు
సర్కార్పై ఎమ్మెల్యే మాణిక్రావు ధ్వజంజహీరాబాద్: కోహీర్ మండలంలోని సజ్జాపూర్కు చెందిన బేగరి రాములుకు ఎమ్మెల్యే కె.మాణిక్రావు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. రాములుకు సంబంధించిన రేకుల ఇంటిని కూల్చి వేయించడంతో వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మాణిక్రావు బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయం కింద బాధితుడికి ఆర్థిక సహాయం అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే ఇంటిని కూల్చివేయించారని, కాంగ్రెస్ నాయకులకు కూల్చడం తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. బాధిత కుటుంబానికి నూతన గృహం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండి మోహన్, నామ రవికిరణ్, భూమయ్య, మచ్చేందర్, రవికిరణ్, రాజశేఖర్, సంపత్, నర్సింహులు పాల్గొన్నారు. -
ఎస్టీపీ వద్దే వద్దు
● బయోడైవర్సిటీ ప్రాంతంలో ఏర్పాటు సబబేనా..? ● అమీన్పూర్వాసుల ఆందోళన పటాన్చెరు: అమీన్పూర్ పరిధిలోని ఇసుకబావి ప్రాంతంలో కాల్వలో పారుతున్న మురుగునీటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ని సర్వే నంబర్ 993లో నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. స్థానికులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోనే గొప్ప జీవ వైవిధ్యం ఉన్న అమీన్పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో ఎస్టీపీని ఏర్పాటు చేయరాదని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి కాల్వలు, చెరువుల్లో మురుగునీరు కలవకుండా ఎస్టీపీలను ఏర్పాటు చేయడం మంచి ఆలోచనే కానీ.. మియాపూర్ మదీనగూడ ఆవాస ప్రాంతాల నుంచి తరలివస్తున్న మురుగును శుద్ధి చేసేందుకు ఇక్కడి స్థలాన్ని ఎంచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి కొండల్లో దాదాపు 40 రకాల సీతాకోక చిలుకలు, అనేక రకాల సరీసర్పాలతో గొప్ప జీవవైవిధ్యం కనిపిస్తుంది. విదేశీ పక్షలు ఇక్కడకు వలస వస్తాయి. ెనెమళ్ల సంఖ్య ఎక్కువే. ఆ కారణంగానే ఈ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ సైట్గా గుర్తించారు. సహజ సిద్ధంగా కొండల నడుమ ఏర్పడిన పెద్ద చెరువు పరిసరాలను బయోడైవర్సిటీ సైట్గా జాతీయ స్థా యిలో గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎస్టీపీతో ఈ ప్రాంతానికి లా భం లేకపోగా.. నష్టం వాటిల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీటి ఇన్టెక్ సంప్ను ఇసుకబావిలో ఏర్పాటు చేసి అమీన్పూర్ పట్టణ నడి బొడ్డును రెండు కిలోమీటర్ల మేర ఆ నీటిని తోడి తెచ్చి ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసి ఆ నీటిని మళ్లీ రెండు కిలోమీటర్ల మేర పైపుల్లో వాగులోకి తీసుకెళ్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. ఏ కారణం చేతైనా ఎప్పుడైన ఆ పైపులు పగిలిపోతే పరిస్థితి ఏమిటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వడ్డే శివరాజుపైనే అనుమానం!
రామచంద్రాపురం(పటాన్చెరు)/పటాన్చెరు టౌన్: గ్రేటర్ తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతిరావుపూలే కాలనీలో సంచలనం సృష్టించిన తల్లి, కొడుకు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రధాన అనుమానితుడు వడ్డే శివరాజును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివరాజు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం. అతను నోరు తెరిస్తే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. అతని ప్రవర్తన, అతనిపై ఉన్న కేసుల విషయాలపై ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. వడ్డే శివరాజు కొన్నేళ్లుగా చంద్రకళతో సహజీవనం సాగిస్తున్నట్లు వినికిడి. చంద్రకళతో పటు అందరితో తరుచుగా గొడవపడేవాడని సమాచారం. హత్య జరిగిన సమయంలో కొత్తవారు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? అన్న కోణంలోనూ పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. తల్లి, కొడుకు మృతదేహాల వద్ద లభించిన కత్తిపై ఉన్న వేలిముద్రలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చంద్రకళను, రేవంత్ను శివరాజు హత్యచేసి తాను మెడ కోసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. వడ్డే శివరాజును కఠినంగా శిక్షించాలి హత్యకు గురైన చంద్రకళ, రేవంత్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం చంద్రకళ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతురాలి అక్క శిరీష మాట్లాడుతూ కొంతకాలంగా తన చెల్లికి ఫోన్చేసి ఇబ్బంది పెట్టేవాడని, ఎవరు ఫోన్ చేసినా అనుమానించేవాడని తెలిపారు. శివరాజుకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా తన చెల్లెలు వెంటపడి ఇబ్బంది పెట్టేవాడని చెప్పింది. చంద్రకళ, రేవంత్లను శివరాజు హత్య చేశాడని తెలిపారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘తల్లి’ కొడుకు హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు గాంధీలో చికిత్స పొందుతున్న శివరాజుతల్లి, కుమారుడికి అంత్యక్రియలుపటాన్చెరు టౌన్: తెల్లాపూర్ జే.పీ కాలనీలో జరిగిన తల్లి, కుమారుడు జంట హత్య కేసులో మృతదేహాలకు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మరో పక్క బంధువులు మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లలేక స్థానికంగా ఉన్న ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు. -
మార్కెట్ లొల్లి వీడేనా?
● నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న టీపీసీసీ ● నేతల్లో చిగురిస్తున్న ఆశలు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పటాన్చెరు పాలకవర్గం నియామకం విషయంలో ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఈ ఏఎంసీ చైర్మన్ పదవిని తన అనుచరుడు శివానందంకు ఇవ్వాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్గౌడ్ ప్రతిపాదించారు. దీనిపై ఇక్కడి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అభ్యంతరం తెలిపారు. పర్స శాంరావు పేరును గూడెం సూచించారు. ఈ పదవి కోసం ఇద్దరి నుంచి ప్రతిపాదనలు రావడంతో ఈ నియామకం విషయంలో ఎటూ తేలకుండా పోయింది. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ చైర్మన్తో పాటు, డైరెక్టర్ పోస్టులను స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన వర్గీయులకు ఇప్పించాలని ప్రయత్నిస్తుండగా, ఎంపీ షెట్కార్ వర్గీయులు కూడా ఈ పోస్టులను ఆశిస్తున్నారు. దీంతో ప్రభుత్వం దాదాపు రెండేళ్లుగా పెండింగ్లో పెట్టింది. ఇక్కడ ఇరువర్గాల మధ్య సమన్వయం కుదిరితేనే ఈ పదవులు తేలే అవకాశాలున్నాయి. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను ఈ నెలాఖరు లోపు భర్తీ చేస్తామని ఇటీవల టీపీసీసీ అధినాయకత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పెండింగ్లోఉన్న నామినేటెడ్ పదవుల పంచాయతీ ఇప్పటికై నా ఓ కొలిక్కి వచ్చేనా..? అనే అభిప్రాయం హస్తం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో చాలా వరకు నామినేటెడ్ పదవుల నియామకాల విషయంలో ఎటూ తేలడం లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదవులు దక్కుతాయని ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నేతల మధ్య సమన్వయం లేని కారణంగా ఆ పార్టీ నాయకుల నామినేటెడ్ కల నెరవేరడం లేదు. ఒక టర్మే పూర్తయ్యేది.. జిల్లాలో మొత్తం ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, రాయికోడ్, జోగిపేట్, వట్పల్లి, జహీరాబాద్ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నియమించింది. కాగా ఏఎంసీల చైర్మన్, డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. అవసరమైతే ఒక ఏడాది పాటు పొడగించుకునేందుకు అవకాశం ఉంది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఈ పదవుల్లో ఎవరినీ నియమించకపోవడంతో ఒక టర్మ్ వృథా అయిందని ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికై నా అధినాయకత్వం జిల్లాల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను ఈనెలాఖరులోగా నియమిస్తామని ప్రకటించిన నేపథ్యంలో నేతల్లో ఆశలు రేకెత్తినట్లయింది.సదాశివపేట ఏఎంసీ చైర్మన్గా ఉన్న ఎస్.కుమార్ ఇటీవల ఆ పదవికి రాజీనామ చేసి సర్పంచ్గా పోటీ చేసిన విషయం విధితమే. ఇలా ఖాళీ అయిన ఈ పదవిని తన అనుచరుడు మస్కు నర్సింహారెడ్డికి అవకా శం కల్పిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు నర్సింహారెడ్డి భార్య మస్కు అలవేణిని నియమించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు మార్కెటింగ్శాఖ ద్వారా ప్రభుత్వానికి వెళ్లాయి. త్వరలోనే ఈ చైర్పర్సన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి. -
కక్ష సాధింపు చర్యలు సరికాదు
జహీరాబాద్: మండలంలోని సజ్జాపూర్లో బేగరి రాములు ఇంటి షెడ్డును కూల్చివేసిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచా రణ జరిపారు. బుధవారం బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనను అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామన్నారు. ఓటు వేయలేదనే ఉద్దేశంతో కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. బాధితులకు కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీస్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈనెల 30న గ్రామంలో సివిల్ రైట్స్డేను అధికారికంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం కోహీర్ మండల కేంద్రంలో బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన వెంట కమిషన్ సభ్యుడు రాంబాబు, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జి డీపీఓ జానకిరెడ్డి, డీఎస్పీ సైదా, సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్తో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
హైవేపై ప్రమాదాలకు చెక్
● సర్వీస్ రోడ్లు, ఆర్వోబీల నిర్మాణానికి నిధులు ● ప్రారంభమైన పనులు రామాయంపేట(మెదక్): 44వ జాతీయ రహదారిపై రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సర్వీస్ రోడ్లు, ఆర్వోబీల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. జిల్లా పరిధిలో కాళ్లకల్ నుంచి రామాయంపేట మండలం దామరచెరువు వరకు 55 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. అతివేగం, అజాగ్రత్త మూలంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలలో కనీసం పదిహేనుకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈమేరకు పోలీస్శాఖతో పాటు హైవే అధికారులు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. ప్రాధాన్యతాక్రమంలో సర్వీస్ రోడ్లు, ఆర్వోబీలు నిర్మించడానికి నిర్ణయించారు. ఈమేరకు కోమటిపల్లి, వల్లూరు, వడియారం వద్ద ఆర్వోబీలు మంజూరుకు ఎంపీ రఘునందన్రావు కృషి చేశారు. కోమటిపల్లి, వల్లూరు వద్ద జాతీయ రహదారిని ఆనుకునే సర్వీస్ రోడ్లు, వడియారం వద్ద ఆర్వోబీ నిర్మాణానికి ఇటీవల రూ. 44.17 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వల్లూరు వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈమేరకు సర్వీస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. వడియారం వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. త్వరలో కోమటిపల్లి జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రకటించారు. జాతీయ రహదారిపై ప్రధానంగా రామాయంపేట జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఆర్వోబీ మంజూరు విషయమై సంబంధిత శాఖ అధికారులకు, ఎంపీకి స్థానికులు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈజంక్షన్ వద్ద ఆర్వోబీ నిర్మిస్తే ప్రమాదాలు ఆస్కారం ఉండదు. ఇటీవల కలెక్టర్ రాహుల్రాజ్, ఇంజనీరింగ్ అధికారులు జంక్షన్ వద్ద రహదారిని పరిశీలించారు. -
ప్రాజెక్టుల సాధనకు ఉద్యమిద్దాం
● జహీరాబాద్ నుంచి ఖేడ్ వరకు పాదయాత్ర చేపడతా ● మాజీ మంత్రి హరీశ్రావు జహీరాబాద్: కాళేశ్వరం నుంచి జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా సాగు నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల సాధనకు ఆందోళన చేపడతానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం జహీరాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సర్పంచ్ల సత్కార కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రెండు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పాతర వేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నిలిపివేసిందన్నారు. జిల్లా మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వీటిని సాధించే నిమిత్తం జహీరాబాద్ నుంచి నారాయణఖేడ్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు వస్తే జహీరాబాద్లోని లక్ష ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రంగానికి 12 గంటలు కూడా కరెంట్ ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కోసం రూ.50 కోట్ల నిధులను కేసీఆర్ మంజూరు చేశారన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందని విమర్శించారు. కాంగ్రెస్ గూండాగిరి చేసినా, డబ్బులు పంచినా జహీరాబాద్ నియోజకవర్గంలో 52 సర్పంచ్ పదవులను దక్కించుకోగలిగామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే రేవంత్రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. జహీరాబాద్కు 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిని మంజూరు చేస్తే ప్రస్తుతం పనులు ఆగిపోయాయని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, సంజీవరెడ్డి, నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు పాల్గొన్నారు. -
డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్చేగుంట(తూప్రాన్): చేగుంటకు డిగ్రీ కళాశాల మంజూరయ్యేలా కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ హబ్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చొరవ చూపిస్తానని తెలిపారు. రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి రెండో విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా టు కాగానే 50 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఉచిత కరెంట్, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల దెబ్బతిన్న రోడ్ల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రిని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్రాజ్, సర్పంచ్ స్రవంతి, ఆర్టీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, మార్కె ట్ కమిటీ చైర్మన్ వెంగళ్రావు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్తో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి
నారాయణఖేడ్: గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పంచాయతీ పాలకవర్గాల లక్ష్యం కావాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు బుధవారం ఖేడ్లోని ఎంపీ నివాసంలో ఆయనను కలిశారు. ఈసందర్భంగా ఆయన వారిని సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి తనవంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, నాయకులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: బాలికల కోసం లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రసిక్షణ్ – స్వీయరక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఈఓ విజయ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 162 పాఠశాలల్లోని బాలికలకు 3 నెలలు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి, అర్హత గల మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాస్టర్లు కరాటేలో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ సాధించి ఉండాలన్నారు. మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 29 సాయంత్రం 5 గంటలలోగా కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పటాన్చెరు టౌన్: నట్టల నివారణ మందుతో మూగ జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా పశుసంవర్ధక సంయుక్త సంచాలకులు వసంతకుమారి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్లలో బుధవా రం నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామంలో 1,247 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు తెలిపారు. ఈ మందు ద్వారా మరణాలు తగ్గి, జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. జీవాల పోషకులు నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శైలేంద్ర జస్వాల్, పశు వైద్య సిబ్బంది సర్దార్, సాబేర్ శ్రవణ్ కుమార్, సుజాత, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: స్కూల్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఖేడ్ ఈ–తక్షిల పాఠశాల విద్యార్థులు లాస్యరెడ్డి, లలితాంబిక, మేరీ ఎంపికయ్యారని పాఠశాల కరస్పాండెంట్ శరత్కుమార్ తెలిపారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు చెప్పారు. వనపర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈసందర్భంగా విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు. కౌడిపల్లి(నర్సాపూర్): తునికి వద్ద గల డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఆరునెలల ఉచిత వ్యవసాయ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ దేవేందర్రెడ్డి, కోఆర్టినేటర్ జగదీశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీసం 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 25 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యవసాయ, అనుబంధ కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆరునెలల శిక్షణ కాలంలో ఉచితంగా విద్య, భోజనంతో పాటు క్షేత్రస్థాయిలో శిక్షణ, యువతీ, యువకులకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉంటుందన్నారు. అభ్యర్థులు జనవరి 15 వరకు బయోడేటాతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9989147966, 8466842278 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
అమృత్ పనుల్లో వేగం పెంచండి
దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం రాధాకృష్ణన్ జహీరాబాద్: జహీరాబాద్ రైల్వేస్టేషన్లో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం రాధాకృష్ణన్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. బుధవారం స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల తీరుపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో మరింత వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పలు రైళ్లు జహీరాబాద్ స్టేషన్లో ఆగే విధంగా చూడాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్, జిల్లా నాయకుడు సుధీర్ భండారీలు డీఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. బీదర్– కల్బుర్గి రైలును జహీరాబాద్ వరకు పొడగించాలని విన్నవించారు. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఓఎం నరేంద్రవర్మ, స్టేషన్ మేనేజర్ మాధవకృష్ణ పాల్గొన్నారు. -
బాధిత రైతులకు న్యాయం చేయండి
జిన్నారం(పటాన్చెరు): భూములు నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం గుమ్మడిదల మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యను హరీశ్రావుకు విన్నవించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 109లోని రైతుల భూములపై కొనసాగుతున్న వివాదంలో రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అలాగే, హరీశ్రావు దోమడుగు గ్రామస్తులు పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువుల ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
బ్యాడ్మింటన్లో మిస్బా ప్రతిభ
రామాయంపేట(మెదక్): గజ్వేల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ పోటీలో రామాయంపేటకు చెందిన మిస్బా రెండో స్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రశంసా పత్రంతో పాటు అవార్డు సొంతం చేసుకుంది. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న మిస్బా బ్యాడ్మింటన్ పోటీలో రాణిస్తూ పలుమార్లు ఎన్నో బహుమతులు గెల్చుకుంది. ఈమేరకు స్థానికంగా పలు పార్టీల నాయకులు ఆమెను ప్రశంసించారు. మార్కోస్ కమాండోగా ఆకునూరు యువకుడు చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ఆకునూరుకు చెందిన జక్కు చందు అనే యవకుడు మార్కోస్ కమాండోగా ఎంపికయ్యాడు. మూడేళ్ల క్రితం ముంబైలోని భారత నౌకాదళంలో చేరిన అతడు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్టాత్మక విభాగం మైరెన్ ఫోర్స్లో కమాండోగా ఎంపికయ్యాడు. దేశంలో అత్యంత కఠినమైనదిగా పేరొందిన గోవాలోని ఐఎన్ఎస్ మాండోవి వద్ద 8 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా చందును గ్రామస్తులు, యువత అభినందిస్తూ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 20 మందికి గాయాలు సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన రాజీవ్ రహదారి పొన్నాల శివారులో బుధవారం తెల్లవారు జామున జరిగింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 24 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్తుండగా మార్గమధ్యలో నాగులబండ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి స్వల్ప, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని హైదరాబాద్కు తరలించారు. ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్తో పాటు ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అదృశ్యం హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని మద్దుల్వాయి గ్రామానికి చెందిన గంగాపురం రాజయ్య తప్పిపోయాడని ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని కుటుంబీకులు హవేళిఘణాపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నల్లరంగు స్వెటర్ వేసుకొని ఉన్నాడని పేర్కొన్నారు. ఇతని ఆచూకీ తెలిస్తే సెల్: 81253 19325. 81870 60723లకు సమాచారం అందించాలని కోరారు. ఇంటి నుంచి వెళ్లి.. శవమై.. రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని రాయిసముద్రం చెరువు కట్ట సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భారతినగర్ డివిజన్ పరిధిలోని బొంబై కాలనీకు చెందిన సైమాన్(49) మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో డీమార్ట్ వద్ద తన వాహనం ఉందని, దానిని తెచ్చుకుంటానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం రామచంద్రారెడ్డినగర్ కాలనీ సమీపంలోని రాయిసముద్రం చెరువు కట్ట వద్ద సైమాన్ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
డిస్కౌంట్ పేరుతో భారీ మోసం
● స్టీల్, సిమెంట్ ఇస్తామని.. ● 5.68 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు బెజ్జంకి(సిద్దిపేట): బిగ్ డిస్కౌంట్లో స్టీల్, సిమెంట్ ఇస్తామని చెప్పి ఆన్లైన్ సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.5.68 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా... బహిరంగ మార్కెట్లో స్టీల్ టన్నుకు రూ.6వేలకు పైగా ఉండగా కేవలం రూ.4,025, సిమెంట్ బస్తా రూ. 200కు ఇస్తామని ఓ ప్రముఖ స్టీల్ కంపెనీ, బేగంపేట, హైదరాబాద్ పేరుతో ఆన్లైన్లో ఆఫర్ వచ్చింది. దీన్ని చూసిన మండలానికి చెందిన వ్యక్తి తక్కువ ధరకు లభిస్తుందని మూడు రోజుల క్రితం సైబర్ నేరగాళ్లకు చెందిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఖాతాల్లో 5.68లక్షలు జమ చేశారు. ఆ తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేశాడు. అనంతరం హైదరాబాద్లో ఉన్న అడ్రస్కు వెళ్లగా షాప్ ఉంది కాని, వీరు డబ్బులు పంపిన వ్యక్తుల చిరునామా మాత్రం కాకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. -
పరిశ్రమలో డ్రగ్ అధికారుల దాడులు
పటాన్చెరు టౌన్: మెడిబ్లూ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమలో డ్రగ్ అధికారుల దాడులు నిర్వహించి, రూ. 1.70 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ సంఘటన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు పరిశ్రమలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరిశ్రమలో అనుమతి లేకుండా వైద్య పరికరాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు రూ.1.70 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... వైద్య పరికరాల నిబంధనల ప్రకారం మెడికల్ డివైజెస్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ లైసెన్స్ కింద తయారు చేయాలన్నారు.అనుమతి లేకుండా వైద్య పరికరాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో బొల్లారం డ్రగ్ ఇన్న్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జిన్నారం డ్రగ్ ఇన్న్స్పెక్టర్ శ్రీకాంత్, పాశమైలారం ఇనన్స్పెక్టర్ వరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.రూ.1.70 లక్షల విలువైన ఉత్పత్తులు సీజ్ -
గ్రామ అభివృద్ధి కమిటీకి రూ.1.50లక్షల విరాళం
హుస్నాబాద్రూరల్: పల్లెను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ నిధుల కోసం చూడకుండా విరాళాల సేకరణకు నూతన పంచాయతీ ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం మండలంలోని గాంధీనగర్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని యువతకు అవగాహన కల్పించారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా సర్పంచ్ పోలు సంపత్, ప్రధాన కార్యదర్శిగా రాజ్కుమార్లతో పాటు పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామంలో ఎవరు మరణించినా వారి దహన సంస్కారాల కోసం రూ.5వేలు అందిస్తున్నారు. అభివృద్ధి కమిటీకి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఎన్ఆర్ఐలు డాక్టర్ రేణుక, కళ్యాణ్ రూ.1.50లక్షలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కత్తితో దాడి.. గొలుసు అపహరణ
సంగారెడ్డిటౌన్/కంది(సంగారెడ్డి): ఓ మహిళపై కత్తితో దాడి చేసి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ సత్యయ్యగౌడ్ కథనం ప్రకారం.. మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన మ్యాతరి జగన్(37), ర్యాపిడో డ్రైవర్ పని చేస్తూ ఇస్నాపూర్లో నివసిస్తున్నాడు. జల్సాలు చేస్తూ.. అప్పులు పెరిగిపోవటంతో వచ్చిన ఆదాయం చాలక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 22న కంది మండలం మామిడిపల్లికి చెందిన ఓ మహిళ(37) ఒంటరిగా మేకలు మేపుతుండటం చూసి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో మెడపై, కడుపులో పొడిచి గొలుసు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు సీసీఎస్ పోలీసుల సహకారంతో నిందితుడిని 24 గంటల లోపే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, బైకును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ను డీఎస్పీ నగదు రివార్డుతో సత్కరించారు. సమావేశంలో సంగారెడ్డి రూరల్ సీఐ క్రాంతికుమార్, ఎస్సై మధుసూదన్రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది తదితరులు ఉన్నారు. కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్టు -
కుష్ఠుపై సమరం
● వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు 31 వరకు సర్వే ● ఇంటింటికి ఆశ కార్యకర్తలునారాయణఖేడ్: కుష్ఠు నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2027 వరకు దేశంలో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలన దిశగా గ్రామాల్లో సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సర్వే ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కుష్ఠు అనేది చర్మ సంబంధిత వ్యాధి. దీనిని ప్రాథమిక దశలో గుర్తించక పోవడం వల్ల వ్యాధి తీవ్రరూపం దాల్చి అంగవైకల్యం వచ్చి మానసికంగా కుంగి పోతుంటారు. అంటు వ్యాధి కావడంతో సమాజంలో ఈ వ్యాధి సోకిన వారిని ఎవ్వరూ అక్కున చేర్చుకోలేక పోవడంతో విగత జీవులుగా మారి మరణానికి దగ్గరవుతున్నారు. రోగుల్లో ఉన్న భయానకమైన పరిస్థితులను తీర్చడానికి వారి పట్ల ప్రజలు, దగ్గరి వారు సైతం చూపిస్తున్న చిన్న చూపును దూరం చేసి వారికి అవగాహన కల్పించేందకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటి సర్వే వైద్య శాఖ అధికారులు ఆశ కార్యకర్తలతో ఇదివరకే సమావేశం నిర్వహించి ఇంటింటి సర్వేకు సంబంధించి మార్గదర్శకాలను వివరించారు. ఆ మేరకు గ్రామాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 34 పీహెచ్సీల పరిధిలోని 929 మంది ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరిపై హెల్త్ సూపర్వైజర్లు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మొదల్లో నిర్వహించిన సర్వేలో జిల్లా వ్యాప్తంగా 96 కొత్త కేసులను అధికారులు గుర్తించారు. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు తగు చికిత్సలు అందజేస్తున్నారు. ప్రస్తుతం కూడా వ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది.లక్షణాలు వ్యాధి సోకిన వారి చర్మంపై రాగి రంగులో మచ్చలు ఉండి స్పర్శ ఉండదు. నరాలు తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం లాంటివి కనిపిస్తాయి. దీర్ఘకాలం పుండ్లు మానకపోవడం, శరీర అవయవాలు రోజు రోజుకు కుంచించుకుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని పీహెచ్సీలో సంప్రదించాలి. వ్యాధి తీవ్రత బట్టి 1 నుంచి 5 మచ్చలు ఉంటే ఆరు నెలలు, లేదంటే ఆరు కంటే ఎక్కువ మచ్చలు ఉండి నరాలు ఉబ్బి ఉంటే ఎన్డీటీ 12 నెలల్లో ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించ చేయవచ్చు. చికిత్సతో పాటు రోగులకు కావాల్సిన అన్ని మందులను అందిస్తారు. చికిత్సలు పొంది మందులు వాడితే వ్యాధి తగ్గుముఖం పట్టి అందరిలాగే సాధారణ జీవనం కొనసాగించవ్చని వైద్యులు పేర్కొంటున్నారు.వ్యాధి సంక్రమణ కుష్ఠు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రి అనే క్రమి ద్వారా సంక్రమిస్తోంది. అపరిశుభ్రత ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్న, పెద్ద, మగ, ఆడ భేదం లేకుండా అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తోంది. లాలాజలం ద్వారా రోగితో సన్నిహితంగా ఉన్నా సోకుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలకు, వృద్ధులకు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. -
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సిద్దిపేటరూరల్: రిటైర్డ్ ఎంప్లాయీస్కు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు, సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నమల్ల రాములు మాట్లాడుతూ... 2024 మార్చి నుంచి పెన్షన్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, గత పీఆర్సీ డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
డబ్బా తొలగింపులో తీవ్ర ఉద్రిక్తత
నర్సాపూర్ రూరల్: పండ్ల దుకాణం డబ్బాను తొలగించే విషయంలో బుధవారం నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మురికి కాలువ నిర్మాణం కోసం నర్సాపూర్– మెదక్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో ఉన్న ఓ డబ్బాను తొలగించేందుకు జేసీబీతో మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో అక్కడికి వచ్చారు. దీంతో పట్టణంలోని ఖాజీ గల్లీకి చెందిన ఫరూక్ తన డబ్బాను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ డబ్బాతో జేసీబీకి అడ్డంగా పడుకున్నాడు. డబ్బాను తొలగించకుంటే మురికి కాలువ నిర్మాణం కాక మురికి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుందని అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి మాజీ కౌన్సిలర్లు సంఘసాని సురేశ్, గోడ రాజేందర్ చేరుకొని మురికి కాలువ నిర్మాణం పూర్తి కాగానే దానిపై స్లాబ్ వేసి ఫరూక్కు డబ్బా నిర్మించి ఇవ్వాలని అధికారులకు విన్నవించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం డబ్బాను తొలగించే పనులు ప్రారంభించారు. జేసీబీకి అడ్డుగా పడుకొని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక నచ్చజెప్పిన మాజీ కౌన్సిలర్లు -
మోదీ పాలనలోనే అభ్యున్నతి
గజ్వేల్రూరల్: ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి జరుగుతోందని హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ నుంచి సర్పంచ్లుగా గెలుపొందిన 11 మందికి రిమ్మనగూడలోగల ఓ ఫాంహౌస్లో బుధవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ వారిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయవాద భావజాలం గ్రామగ్రామాన విస్తరిస్తోందని, జాతీయవాదమే దేశానికి అతిపెద్ద బలమైన శక్తి అని అన్నారు. నాయకుడు కావాలంటే డబ్బు అవసరం లేదని, ప్రజలతో మమేకమై వారు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచి ఆదుకున్నప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. పార్లమెంట్లో ఉపాధి హామీ పథకం నూతన చట్టాన్ని తీసుకువచ్చి రైతులు, రైతు కూలీలకు మేలు చేకూర్చేలా చేశారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు కప్పర ప్రసాద్రావు, ఎల్లు రాంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ -
ఉత్తమ పాఠశాలగా ‘పీఎంశ్రీ జక్కాపూర్’
సిద్దిపేటరూరల్: మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, హైబిజ్ టీవీ సంయుక్తంగా అందజేస్తున్న ఉత్తమ పాఠశాల పురస్కారానికి జక్కాపూర్ ఉన్నత పాఠశాల ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం కొమ్మూరి పద్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే దిశగా ఈ అవార్డు అందజేస్తున్నారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. మంగళవారం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం డైరెక్టర్ ప్రీతిరెడ్డి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నట్టు చెప్పారు. సర్పంచ్ భానుచందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాట్ల లక్ష్మి, దొంతుల సుధాకర్, ఎన్నారై మోసర్ల మాధవరెడ్డి, మట్టె బాల్రెడ్డి, దుర్గం పరశురాములు ఉపాధ్యాయులను అభినందించారు. -
తగ్గిన క్రైం రేటు
● ఎస్పీ పరితోష్ పంకజ్ ● వార్షిక నివేదిక విడుదల సంగారెడ్డి జోన్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కమ్యూనిటీ పోలీసింగ్, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో వార్షిక క్రైమ్ నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2025 సంవత్సరంలో 8,255 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం తగ్గినట్లు తెలిపారు. హత్యలు 32 శాతం, ఆస్తి కోసం హత్యలు 19శాతం, అత్యాచార కేసులు 21 శాతం తగ్గగా, దొంగతనాల కేసులు 39శాతం పెరిగినట్లు వివరించారు. నార్కోటిక్ ఎనాలసిస్ బ్రాంచ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమన్వయంతో 43 ఎన్ డీపీఎస్ కేసులు నమోదు చేసి 786.63కిలోల గంజాయి, 1040 గ్రాముల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాల ద్వారా కోల్పోయిన రూ. 34.64కోట్లలో రూ.7.03కోట్లు హోల్డ్ చేశామన్నారు. గత సంవత్సరం కంటే రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాల శాతం సైతం తగ్గిందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, ప్రభాకర్, సైదా నాయక్, వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్పులకు అనుగుణంగా కులవృత్తులు
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి సదాశివపేట(సంగారెడ్డి): చెరువుల్లో చేపపిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని చెరువులో 56 వేల చేపపిల్లలను మత్స్యకారులు, పార్టీ నాయకులతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తి మారాలని సూచించారు. ప్రభుత్వం బలహీన వర్గాలకు మరింత న్యాయం చేయాలని గతానికి మించి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, మత్స్యశాఖ ఏడీ సుదర్శన్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మకమిటి చైర్మన్ ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ సందడి
జిల్లా కేంద్రంలో ముందస్తు క్రిస్మస్ సందడి నెలకొంది. సంగారెడ్డి పట్టణంలోని చర్చిలన్నీ ఇప్పటికే విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి. హాయ్ అంటూ పిల్లలకు గిఫ్ట్లు అందించే క్రిస్మస్ తాత(శాంతాక్లాజ్) బొమ్మలకు, మార్కెట్లో ట్రీకి, వివిధ రకాల స్టార్లు, బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. క్రిస్మస్ ట్రీ రూ.500 నుంచి రూ.3,000కు పైగా వరకు ధరలు ఉన్నాయి. వివిధ రకాల స్టార్లకు వాటి సైజ్ను బట్టి రూ.1,000 నుంచి 5,000 పైగా ధరలు ఉన్నాయి. పట్టణంలో ఎటు చూసినా క్రిస్మస్ సంబంధిత వస్తువుల కొనుగోలుదారులతో సందండిగా మారింది. – సంగారెడ్డి క్రైమ్ -
ఈ పోస్టు భలే హాట్ గురూ..!
ఖాళీగా ఉన్న డీపీఓ పోస్టు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖాళీ అయిన జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పోస్టు కోసం కొందరు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా నలుగురు అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ డీపీఓగా పనిచేసిన సాయిబాబపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా అధికార వర్గాలతో పాటు, ఇటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ప్రస్తుతం జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డికి తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ పోస్టు కోసం నలుగురు అధికారులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పోస్టు కోసం పోటా పోటీ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఓ డీఎల్పీఓ ఈ పోస్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని కలిసినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆ ప్రజాప్రతినిధి నుంచి లేఖ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నల్లగొడ, కరీంనగర్ జిల్లాల్లో పనిచేస్తున్న మరో ఇద్దరు డీఎల్పీఓలు కూడా ఈ పోస్టును ఆశిస్తున్నారు. అదేవిధంగా ఓ కేంద్ర మంత్రి వద్ద పని చేస్తున్న మరో అధికారి పేరు కూడా వినిపిస్తోంది. ఇలా ఈ డీపీఓ పోస్టు కోసం పోటాపోటీ నెలకొనడం ఆశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు సమీపంలో ఉంటుంది. హైదరాబాద్లో నివాసం ఉండే అధికారులు ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరోవైపు రియల్ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలు, ఎక్కువగా ఉంటాయి. వీటి అనుమతుల మంజూరు, అక్రమ నిర్మాణాలు, కార్యదర్శుల పోస్టింగ్లు ఇలా ఇక్కడ పనిచేస్తే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే భావన చాలా మంది అధికారుల్లో ఉంటుంది. దీంతో ఈ పోస్టుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నలుగురు అధికారుల తీవ్ర ప్రయత్నాలు జిల్లాలో కీలక ప్రజాప్రతినిధిని కలిసిన ఓ అధికారి కేంద్ర మంత్రి వద్ద పని చేస్తున్నమరో అధికారి కూడా.. నల్లగొండ, కరీంనగర్ నుంచి మరో ఇద్దరు యత్నం హైదరాబాద్ దగ్గర ఉండడంతో విపరీతమైన డిమాండ్ పదోన్నతుల ప్రక్రియ ముగిసిన వెంటనే.. గ్రామపంచాయతీల ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తయ్యాయి. దీంతో రెండేళ్లుగా కుంటుపడిన గ్రామ పంచాయతీల పాలన ఇప్పుడు గాడిన పడనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన జిల్లా పంచాయతీ అధికారి పోస్టును తక్షణం భర్తీ చేయడం అనివార్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే డీఎల్పీఓలను డీపీఓలుగా నియమించాలంటే పంచాయతీరాజ్ శాఖలో అధికారుల పదోన్నతులకు సంబంధించిన డీపీసీ ప్రక్రియ జరపాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేశాక పోస్టింగ్ ఇస్తారా? ఈలోగానే ఈ పోస్టును భర్తీ చేస్తారా? అనే అంశంపై చర్చజరుగుతోంది. -
పల్లె పాలన మరింత చేరువ
● తిరిగి ఉమ్మడి రాష్ట్ర విధానం అమలు ● చర్యలు చేపట్టిన ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లాలో 1,613 పంచాయతీలు నారాయణఖేడ్: పల్లె పాలన ప్రజలకు మరింత చేరువ చేసేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత క్రమంగా నిర్వీర్యంగా మారి అనంతర కాలంలో అప్రకటితంగా రద్దయిన గ్రామ పంచాయతీ స్థాయీ సంఘాలు మళ్లీ కార్యరూపం దాల్చనున్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం గతంలో మాదిరిగా ప్రతీ గ్రామంలో నాలుగు సంఘాల చొప్పున ఏర్పాటు అవసరం అని భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 613, మెదక్ జిల్లాలో 492, సిద్దిపేట జిల్లాలో 508 చొప్పున మ్తొతం ఉమ్మడి జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాభివృద్ధికి దోహద పడాలన్న లక్ష్యంతో ప్రతీ గ్రామ పంచాయతీకి నలుగురు చొప్పున ఏర్పాటు చేసిన స్థాయి సంఘాలు గడచిన పదేళ్ల కాలంలో కనుమరుగయ్యాయి. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సంక్షేమం పథకాలు, కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చేయడం లాంటి బాధ్యతలతో గతంలో ఈ సంఘాలు ఏర్పాటయ్యాయి. స్థాయి సంఘాల జోక్యాన్ని, ప్రమేయాన్ని సర్పంచ్లతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయంగా వ్యతిరేకించడంతో అప్పట్లో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశంపై పెద్దగా దృష్టి కేంద్రీకరించక పోవడంతో పల్లెల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించేందుకు పంచాయతీల్లో ఏర్పాటు చేసిన స్థాయి సంఘాలు పత్తాలేకుండా పోయాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పలు పంచాయతీల్లో స్థాయి సంఘ సభ్యులకు క్రమేనా గుర్తింపు లేకుండా పోయింది. ప్రభుత్వం నిర్దేశంచిన మార్గదర్శకాల ప్రకారం పంచాయతీల్లో శానిటేషన్ స్థాయి సంఘం, వీధిలైట్ల స్థాయి సంఘం, పచ్చదనం పెంపొందించడం, మొక్కల పెంపకం అభివృద్ధి స్థాయి సంఘం, అభివృద్ధి పనుల స్థాయి సంఘాలను ప్రతీ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సంఘం సభ్యులు గ్రామాల్లో జరుగుతున్న పనులు, పరిస్థితులను పర్యవేక్షించడం, పాలక వర్గానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీల్లో రూపొందించే అభివృద్ధి ప్రణాళికలో స్థాయి సంఘ సభ్యుల సిఫార్సులకు ప్రాధాన్యం కల్పించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల నిర్వహణకు సలహాలు, సూచనలు, స్ట్రీట్లైట్స్ పరిశీలన, విద్యుత్ పొదు పునకు సహకరించడం, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, పచ్చదనం పెంపొందించడం, ప్రజా అవసరాల పనులు, వార సంతలకు సంబంధించిన పర్యవేక్షణలో స్థాయి సంఘాల సభ్యులు భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. -
గ్రామైక్య సంఘం సేవలు అభినందనీయం
హత్నూర (సంగారెడ్డి): నస్తీపూర్ గ్రామైక్య సంఘం మహిళలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని డీఆర్డీఏ పీడీ జ్యోతి అభినందించారు. మంగళవారం మండలంలోని నస్తీపూర్ మహిళా గ్రామైక్య సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ... పంచాయతీ తీర్మానం చేసి స్థలం చూపిస్తే సంఘం భవన నిర్మాణానికి రూ.10లక్షల ఉపాధి హామీ పథకంలో ఇస్తామన్నారు. కొంతకాలంగా ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ మహేందర్, అదనపు పీడీ సూర్యారావు, కార్యదర్శి మౌనిక, కోశాధికారి అక్షయ, ఏపీఎం రాజశేఖర్, సీసీలు సావిత్రి, మహేశ్, వీఓఏ ప్రవీణ్, మాజీ అధ్యక్షురాలు సువర్ణ, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.డీఆర్డీఏ పీడీ జ్యోతి -
క్షమించే గుణం చాలా గొప్పది
● మంత్రి దామోదర రాజనర్సింహ ● జోగిపేటలో క్రిస్మస్ వేడుకలు జోగిపేట(అందోల్): అంకిత భావంతో సమాజ సేవ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం జోగిపేటలో క్రిస్మస్ వేడుకలను చిన్నారులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి ప్రారంభించారు. చర్చి ఫాదర్ విజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రతి మనిషిలో అన్ని గుణాలు ఉంటాయని, అందులో క్షమించే గుణం చాలా గొప్పదన్నారు. అన్ని మతాలు, విశ్వాసాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటేనని సూచించారు. యేసు ప్రభువు ఈ లోకానికి మంచి మార్గాన్ని చూపించారని చెప్పారు. తాను 2004వ సంవత్సరంలోనే జెరూసలాం వెళ్లి వచ్చానని గుర్తుచేశారు. రెండు వేల సంవత్సరాల క్రితం ఒక అద్భుతం జరిగిందని, మానవాళి ఏ రకంగా జీవించాలన్న సూచనలు చేసిన వ్యక్తి యేసు ప్రభువు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుందన్నారు. క్రిస్మస్ పండగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన క్రైస్తవులకు ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పలువురు మహిళలు కోలాటం ఆడి అలరించారు. స్వయంగా వడ్డించిన మంత్రి క్రిస్మస్ వేడుకలను హాజరైన క్రైస్తవ మహిళలు, పురుషులకు స్వయంగా మంత్రి దామోదర వడ్డించాడు. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చర్చి ఫాదర్లతో కలిసి భోజనం చేసారు. కార్యక్రమంలో అందోలు, జోగిపేట ఆర్డీఓ పాండు, ఇన్చార్జి తహసీల్దార్ మధుకర్రెడ్డి, కమిషనర్ రవీందర్, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ కౌన్సిలర్లు సురేందర్గౌడ్, ప్రవీణ్, ఆర్.సురేష్ పాల్గొన్నారు. -
నిమ్జ్కు భూములు ఇవ్వం
● తేల్చి చెప్పిన ఎల్గోయి రైతులు ● భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ ఝరాసంగం(జహీరాబాద్): నిమ్జ్ ప్రాజెక్టు కొరకు మిగిలిన కొద్ది భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ఎల్గోయి గ్రామ రైతులు తేల్చి చెప్పారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో భూమిని సేకరించేందుకు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రెండో విడతలో 103 మంది రైతులకు సంబంధించిన 195 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్ తిరుమలరావు సేకరించే భూముల వివరాలను సర్పంచ్ లక్ష్మీబాయి అధ్యక్షతన గ్రామసభ ద్వారా చదివి వినిపించారు. దీంతో రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే తమ గ్రామంలో 1800 ఎకరాల భూమిని ప్రాజెక్టు కొరకు అప్పగించామన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు సైతం ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. అభివృద్ధి కొరకు ఉన్న భూములు తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని అధికారులకు ప్రశ్నించారు. ఎవరు వచ్చినా భూములు మాత్రం ఇచ్చేది లేదన్నారు. ఇదిలా ఉండగా ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు సంతకాలు పెట్టకుండానే గ్రామ సభ నుంచి వెళ్లిపోయారు. జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
చివరి ఆయకట్టు వరకు సాగునీరు
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డికల్హేర్(నారాయణఖేడ్): నల్లవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి ఆదేశించారు. మంగళవారం నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్తో కలిసి యాసంగి పంటల కోసం సాగు నీటిని విడుదల చేశారు. అంతకుముందు గంగమ్మ పూజలు చేశారు. ప్రాజెక్టులో తెప్పోత్సవం నిర్వహించారు. జొన్న, మొక్కజొన్న, ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. సాగు నీటిని వాడుకునేందుకు సహకరించాలని కోరారు. నీటి సరఫరా చేసేందకు ఎప్పటికప్పుడు కాల్వల చుట్టూ తిరిగి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఈ ఎజాజ్ ఆహ్మద్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్లు పాటిల్ రవీందర్, గోవింద్నాయక్, నాయకులు కృఫ్ణమూర్తి, మోహన్రెడ్డి, జయరాజ్, బండారి సాయిలు, వీరచారి పాల్గొన్నారు. -
ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి
ములుగు(గజ్వేల్): పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని, రాష్ట్ర అవసరాలు తీరుస్తూనే ఎగుమతులు పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి సూచించారు. యువతను ఉద్యాన సాగువైపు మళ్లించేందుకు విశ్వవిద్యాలయంలో నైపుణ్యఅభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ములుగులోని కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ 11వ వ్యవస్థాపక దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవం పురష్కరించుకుని మంగళవారం నిర్వహించిన వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో ద్రాక్షసాగుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొల్లాపూర్ మామిడి, బాలానగర్ సీతాఫలం పంటలకు విశిష్టత దృష్ట్యా వీటిపై పరిశోధనలను ముమ్మరం చేయాలని, వీటి ఎగుమతుల ద్వారా రైతులకు ఆదాయం పెంచాలన్నారు.మహారాష్ట్రం తరహాలో.. మహారాష్ట్ర ప్రభుత్వం తరహా ఉద్యాన పాలసీలను ఇక్కడ కూడా అమలు చేయాలని సూచించారు. విత్తనాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు తదితర వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యాన వర్సిటీ వైస్ఛాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధిలో ములుగు విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగు 12 లక్షల ఎకరాలకు పైగా పెరగాలన్నారు. వర్సిటీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తదితర వాటిపై త్వరలోనే నూతన పరిశోధనలు ప్రారంభిస్తామన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం మాజీ వైస్ఛాన్స్లర్ డా.ఎస్.డి. శికమణి ప్రసంగిస్తూ కృతిమ మేధస్సు, ఆధునిక సాంకేతికతలు ఉద్యానరంగ ఉత్పాదకత పెంపులో కీలకంగా మారుతున్నాయన్నారు. ఈ సందర్బంగా రైతులతో పరస్పర చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమం సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి విశేష సేవలందించిన పలువురు బోధన, బోధనేతర సిబ్బందిని వైస్ ఛాన్స్లర్ దండ రాజిరెడ్డి అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, మాజీ వీసీ నీరజ ప్రపభాకర్, డీన్లు చీనానాయక్, లక్ష్మీనారాయణ, సురేష్కుమార్, శ్రీనివాసన్, రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర అవసరాలు తీరుస్తూనే ఎగుమతులు పెంచుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ములుగు వర్సిటీలో వ్యవస్థాపక, రైతు దినోత్సవం -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై రంజిత్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పెద్దచింతకుంటకు చెందిన విఠల పుష్ప భాగయ్య దంపతుల రెండో కుమారుడు వేణు (24) కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. 15 రోజులుగా ఒంటరిగా ఉంటూ మనోవేదన చెందుతున్నాడు. సోమవారం ఉదయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి రాత్రి వరకు తిరిగిరాలేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. అయినా జాడ తెలియరాలేదు. ఈక్రమంలో మంగళవారం గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో మహిళ ఆత్మహత్యదుబ్బాకరూరల్: అప్పుల బాధ, అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని గంభీర్పూర్లో జరిగింది. ఎస్ఐ కీర్తి రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..పెంబర్తి రాజవ్వ(59) బీడీలు చుడుతూ జీవనం సాగిస్తుంది. భర్త ఎల్లయ్య గొర్రెల కాపరి. వారికి నాలుగురు కుమార్తెలుండగా వారందరికీ వివాహాలు జరిపించారు. అయితే ఐదేళ్ల క్రితం చిన్న కూతురు వివాహాం కోసం చేసిన అప్పులు ఇంకా తీరలేదు, దీనికి తోడు అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. ఈ క్రమంలో రాజవ్వ తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఎవ్వరు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేగుంట(తూప్రాన్): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముప్పిడి స్వామి (43) లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుమారుడు రాజు ఓ అమ్మాయితో ప్రేమ విషయమై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన స్వామి మంగళవారం సబ్స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. అనారోగ్యంతో గృహిణి ఆత్మహత్య దుబ్బాకరూరల్: తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కీర్తి రాజ్ తెలిపిన వివరాలు.. దొడ్ల లక్ష్మి(49) మూడేళ్ల నుంచి తీవ్రమైన నడుము నొప్పి, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారుజామున ఇంటి ప్రక్కన ఉన్న మరో పాత ఇంటిలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన భర్త పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతురాలు కుమార్తె భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు
రామచంద్రాపురం(పటాన్చెరు): నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ సర్కిల్ పరిధిలోని బీమ్యాక్ సొసైటీ కాలసీవాసులతో జలమండలి ఎండి అశోక్రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీమ్యాక్ కాలనీవాసులు తాగునీటి కనెక్షన్ల కోసం జలమండలి అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అందుకు అధికారులు రూ.3.8కోట్ల చెల్లించాలని, ఇందులో రూ.86లక్షలు ఇంవ్రూవ్మెంట్ చార్జీలు కట్టాలని నోటీసులు ఇచ్చారన్నారు. దీంతో ఎండిని కలిసి చార్జీలు తగ్గించాలని కోరామని తెలిపారు. ఇందుకు సబంధించిన రూ.3కోట్ల డీడీని అందజేశామన్నారు. -
కొనుగోలులో ఈ పాస్ విధానం
యూరియా పంపిణీ కోసం ప్రత్యేక యాప్భూ రికార్డుల ఆధారంగా సరఫరా ● పక్కదారి పట్టకుండా ఉండేందుకే.. డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు నార్మల్గా కొనవచ్చు ● మొదటి రోజు పనిచేయని యాప్తో ఇబ్బందులుజహీరాబాద్: రైతులకు అవసరమైన యూరియా ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. రైతులు ఇక నుంచి యాప్ ద్వారానే యూరియాను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందు కోసం ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతులు ఏదో ఒక పంట వేసుకుంటేనే ఆయా పంటకు అవసరాన్ని బట్టి యూరియాను పొందే అవకాశం ఉంటుంది. గతంలో మాదిరిగా ఎంత పడితే అంత యూరియాను తీసుకునే అవకాశం ఉండదు. రైతులు ఏయే పంటలను సాగు చేసుకున్నారు, ఆయా పంటలకు ఎంత మేర యూరియా అవసరం ఉంటుందనే దాని ఆధారంగానే రైతులకు యూరియా అందజేస్తారు. పంటల ఆధారంగా ఏయే పంటకు ఎంత యూరియా అవసరం ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచనలు పరిగణలోకి తీసుకుని అంత మేర మాత్రమే సరఫరా చేసేందుకు నిబంధనలు తెచ్చారు. ఆయా జిల్లాలకు కేటాయించే యూరియా పక్కనే ఉన్న రాష్ట్రాలకు, పక్కనే ఉన్న జిల్లాలకు అక్రమంగా తరలుతోందని, దీంతో అవసరం ఉన్న రైతులకు అందకుండా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అవసరం కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నారనే ఉద్దేశంతో కట్టడి చేస్తోంది. రైతులకు యాప్ ద్వారా యూరియాను పొందేందుకు వీలుగా వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టింది. డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను మాత్రం గతంలో మాదిరిగానే కొనుగోలు చేసుకునే మినహాయింపు కల్పించారు. పంటను బట్టి యూరియా సరఫరా రైతులు వేసుకున్న పంటను బట్టి యూరియా ఎరువు సరఫరా చేస్తారు. యూరియా ఎక్కువగా కావాలనే ఉద్దేశంతో వేసిన పంటను కాకుండా మరో పంటను యాప్లో టిక్ చేస్తే పండించిన పంటను అమ్ముకునే సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న, సన్న కారు రైతులకు మాత్రం ఒకే విడతలో యూరియా అందించనుండగా, పెద్ద రైతులకు ఒకే సారి 20 నుంచి 30 బస్తాలు తీసుకెళితే ఇబ్బంది ఉంటుందని, వారికి రెండు లేదా మూడు విడతల్లో యూరియా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులు సైతం బుక్ చేసుకొని ఎరువు పొందే సౌలభ్యం కల్పించారు. ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం ఎంట్రీ చేస్తే భూ యజమానికి ఓటీపీ వస్తుంది. దాన్ని కౌలురైతు తెలుసుకుని ఎంట్రీ చేయాలి. యూరియి ఎరువుల బుకింగ్లో వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు కూడా బుక్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. పని చేయని యాప్తో ఇబ్బందులు యూరియా ఎరువులు పొందేందుకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ పూర్తి స్థాయిలో ఇంకా పని చేయని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నుంచి యాప్ను అమలులోకి తీసుకొచ్చారు. మొదటి రోజున జహీరాబాద్ ప్రాంతంలో యాప్ పని చేయక పోవడంతో రైతులు యూరియా పొందని పరిస్థితి ఏర్పడింది. వరి పంట ఉన్న ప్రాంతాల్లో మాత్రమే యాప్ పనిచేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెబుతున్నారు.మొక్కజొన్న పంటకు యూరియా వేస్తున్న కూలీలుఇంటి వద్ద నుంచే పొందే అవకాశం ప్రత్యేక యాప్ తెచ్చినందున రైతులు తమకు అవసరమైన యూరియాను యాప్ ద్వారానే బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చారు. సెల్ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం ఉంటే సరిపోతుంది. అంతే కాకుండా యూరియా నిల్వలు ఏయే దుకాణంలో ఎంత మేర ఉన్నాయనేది దీని ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిల్వలు కూడా చూసుకోవచ్చు. జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఉన్న నిల్వలను ఇట్టే తెలుసుకోవచ్చు. రైతుల వద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే డీలర్ల వద్దకు వెళ్లి యాప్ ద్వారా బుక్ చేసుకుని, ఓటీపీ ద్వారా యూరియాను పొందవచ్చు. -
క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
జహీరాబాద్ టౌన్: క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం పట్టణంలోని పస్తాపూర్ వద్ద గల ఫంక్షన్హాలులో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజౖరైన జహీరాబాద్ ఎంపీ.సురేష్ షెట్కార్ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజవకర్గంలోని 50 చర్చిల మరమ్మతులకు రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో భవనాలకు రంగులు వేయడం, డిజిటల్ లైటింగ్, అలంకరణ తదితర పనులు చేపడుతారన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ దేవూజా, తహసీల్దార్ దశరథ్, కోహీర్ తహసీల్దార్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
కెనాల్లో పడిన జింక
దుబ్బాకటౌన్: నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు కెనాల్లో పడిన జింకను (సాంబార్ డీర్) అటవీశాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ సమీపంలోని కెనాల్ లో చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం కెనాల్ మీదుగా వెళుతున్న రైతులు గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైతులు ఇచ్చిన సమాచారంతో స్పందించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్.కె హైమద్, బీట్ ఆఫీసర్లు వేణు జహంగీర్ కెనాల్ వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. చర్యలు చేపట్టి జింకను సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరిసర గ్రామాల్లో జింకల సంచారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా సహకరించాలని ప్రజలను, రైతులను కోరారు.సురక్షితంగా బయటకు తీసిన అధికారులు -
నీళ్లు లేని బావిలో పడిన వృద్ధుడు
దుబ్బాకటౌన్: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తు నీరు లేని బావిలో పడ్డారు. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధి చేర్వాపూర్ 6వ వార్డులో చోటుచేసుకుంది. స్థానికులు, దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్ల శివరాజయ్య అనే వృద్ధుడు వ్యక్తిగత పని నిమిత్తం సోమవారం దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున చేర్వాపూర్ శివారులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చి, నీరు లేని పాడుబడిన బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. బావిలోంచి అరుపులు విన్న అక్కడి స్థానిక రైతులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి నిచ్చెన, తాడు సహాయంతో బావిలోని వృద్ధుడిని జాగ్రత్తగా పైకి తీసుకువచ్చారు. అంబులెన్సులో దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వృద్ధుడి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు.కాపాడిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది -
డ్రైనేజీ సంపులోకి దిగి ఇద్దరు కార్మికులు మృతి
రామచంద్రాపురం(పటాన్చెరు): ఓ అపార్ట్మెంట్లో డ్రైనేజీ సంపు శుభ్రం చేయడానికి సంపులోకి దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. ఈ సంఘటన జీహెచ్ఎంసీ తెల్లాపూర్ పరిఽధి కొల్లూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన హరీశ్ సింగ్(25) సుమిత్ రుయిదాస్(22) జీవనోపాధి కోసం తెల్లాపూర్కు వలస వచ్చారు. వీరు ఆర్ఆర్ ఇంజనీరింగ్ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారు. కాగా కొల్లూరులోని బ్లాసమ్ హైట్స్ అపార్ట్మెంట్ సొసైటీ డ్రైనేజీ శుభ్రం చేసే పనులను ఆర్ఆర్ ఇంజనీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా సోమవారం రాత్రి సుమారు 11గంటల సమయలో హరీశ్సింగ్, సుమిత్ రుయిదాస్ కలసి డ్రైనేజీ సంపులోని నీటిని తొలగించే పనిని మొదలు పెట్టారు. నీటిని తొలగించిన తర్వాత సంపును శుభ్రం చేసేందుకు అర్థరాత్రి 12.30గంటల సమయంలో ఇద్దరు కలసి సంపులోకి దిగారు. వారు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అక్కడే ఉన్న సూపర్వైజర్ అతుల్ గట్టిగా కేకలు వేశాడు. దాంతో వెంటనే అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. వారి సహాయంతో అతుల్ నడుముకు తాడు కట్టుకొని సంపులోకి దిగే ప్రయత్నం చేశాడు. అతడు కూడా స్పృహ కోల్పోవడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతని పైకి లాగారు. అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సహాయంతో వారిద్దరిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. డ్రైనేజీ పనుల్లో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారా..? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కస్తూర్బాలో కుల వివక్ష
రామాయంపేట(మెదక్): నిజాంపేట కస్తూర్బా పాఠశాలలో కుల వివక్ష రాజ్యమేలుతోంది. స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) కుల వివక్ష చూపుతుండటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి నిరసన తెలిపారు. సోమవారం ఎంఈఓ యాదగిరి విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట మండలానికి చెందిన కస్తూర్బా పాఠశాల రామాయంపేట కస్తూర్బా స్కూలులోనే కొనసాగుతోంది. కొంత కాలంగా ఎస్ఓ వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థినులు నరకయాతన పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు దూషించడమే కాకుండా, కులంపేరుతో వివక్షకు గురిచేస్తున్నారు. విద్యార్థినులతో పనులు చేయిస్తూ.. ఇటీవల ఆ మండలానికి చెందిన 21 మంది విద్యార్థినులు పీఈటీతో కలిసి క్రీడల్లో పాల్గొనేందుకు నవంబర్ 20న ఉత్తర ప్రదేశ్కు వెళ్లారు. క్రీడోత్సవాలు పూర్తయిన అనంతరం అక్కడికి దగ్గరలో ఉన్న అయోద్యకు వెళ్లి తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు వారు ప్రసాదాలతోపాటు చేతులకు కట్టుకునే కంకణాలు తమ వెంట తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఎస్ఓ వేధింపులు అధికమయ్యాయి. వారు చేతులకు కట్టుకున్న కంకణాలు (దారాలు) బలవంతంగా తీసివేయించారు. పాఠశాలకు మంజూరైన ఫర్నిచర్, బీరువాలు, గిన్నెలు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర సామగ్రిని విద్యార్థినులతో మోయించారు. డీసీఎం నిండా వచ్చిన సామగ్రిని రెండో అంతస్తుకు విద్యార్థినులతోనే మోపించారు. దీంతో కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాలు ఇతరులకు చెబితే టీసీ ఇచ్చి పంపుతానని పలుమార్లు వారిని బెదిరింపులకు గురిచేశారు. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం శంకాపూర్ తండాకు చెందిన ఇద్దరు విద్యార్థినుల నానమ్మ మృతిచెందినా ఇంటికి పంపేందుకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వారి తండ్రి పీర్యా వాపోయారు. ఎస్ఓ తీరును నిరసిస్తూ కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విషయాన్ని డీఈఓకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిజాంపేట ఎంఈఓ యాదగిరి సోమవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు వెల్లడించిన వివరాలు ఉన్నతాదికారులకు నివేదిస్తామని తెలిపారు. కంకణాలు తీయించారు స్కూలు విద్యార్థినులు చేతులకు కట్టుకున్న కంకణాలను ఎస్ఓ బలవంతంగా తీయించారు. తలలో పూలు పెట్టుకున్నా దుర్భాషలాడుతున్నారు. విద్యార్థినులను ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్న ఎస్ఓపై చర్యలు తీసుకోవాలి. – పద్మ, శంకాపూర్ చర్యలు తీసుకోవాలి నిజాంపేట కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులను ఎస్ఓ తీవ్ర ఇబ్బందులపాలు చేస్తున్నారు. కుల వివక్షతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. టీసీ ఇచ్చి పంపుతానని తరచూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. ఎస్ఓపై చర్యలు తీసుకోవాలి. – గోపాల్, ఔసులపల్లి ఎస్ఓ ఇష్టారాజ్యం విద్యార్థినులకు నిత్యం వేధింపులు పాఠశాల ఎదుట తల్లిదండ్రుల నిరసన విచారణ చేపట్టిన ఎంఈఓ -
లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం
ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జోన్: జాతీయ మెగా లోక్ అదాలత్లో సోమవారం 1044 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 56 కేసులలో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.45.41 లక్షలు తిరిగి బాధితులకు ఇప్పించామన్నారు. అనంతరం సామాజిక న్యాయ పోరాటం చేసిన వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకుంటే నేరుగా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తం
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్ పటాన్చెరుటౌన్: విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘మోసాలకు పూర్తి విరామం’(ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్) పేరిట సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. బ్లాక్ మెయిల్, దోపిడీ, డేటా దుర్వినియోగానికి దారితీయొచ్చని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడారు. ఓటీపీ, పెట్టుబడి, పార్శిల్, డిజిటల్ అరెస్టు, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లతో మోసాల గురించి వివరించారు. పోస్టర్లు విడుదల చేశారు. నోడల్ అధికారి డీఎస్పీ కేవీ సూర్యప్రకాశ్, ప్రొఫెసర్ త్రినాథరావు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భద్రతా చర్యలు పాటించాలి
కలెక్టర్ ప్రావీణ్య హత్నూర(సంగారెడ్డి): ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్ ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హత్నూర మండలం బోరపట్ల గ్రామ శివారులోని ఎపటోరియా పరిశ్రమలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ మాధురి, మాక్ డ్రిల్ అబ్జర్వర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాయంత్రం పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి కార్మికుడు భద్రతా చర్యలను తప్పక పాటించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తరచూ పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు. బీహెచ్ఇయల్, పాశమైలారం ప్రాంతంలోని పరిశ్రమలలో కూడా ఇలాంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు, డీఎస్పీ ప్రభాకర్ , తాసిల్దార్ పర్వీన్ షేక్, పరిశ్రమ ఇన్చార్జి రాజా నరేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ప్రజావాణికి 17 దరఖాస్తులు సంగారెడ్డి జోన్: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 17 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి జిల్లాలోని 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, పెండింగ్ పనులు, భూసేకరణ తదితర అంశాలపై చర్చించారు. రహదారి అభివృద్ధి పనులు ఎంతో కీలకమన్నారు. ముందుగా రూపొందించిన పనులు చేపట్టాలని వివరించారు. పోస్టర్ ఆవిష్కరణ 100 వీకెండ్ వండర్ ఆఫ్ తెలంగాణ పేరుతో నిర్వహించే వినూత్న పోటీకి సంబంధించిన పోస్టర్ను యువజన క్రీడా విభాగం జిల్లా అధికారి ఖాసింబేగ్తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన దేవాలయాలు, తదితర 100 కొత్త ప్రదేశాలను గుర్తించి ఒక టేబుల్ బుక్ కాపీ రూపొందించడమే పోటీ లక్ష్యమన్నారు. -
ఉపాధిపై గ్రామసభలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ పథకానికి సంబంధించిన మార్పులు చేర్పులపై కూలీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకం పేరును వీబీ– జీ రాం జీ (వికసిత భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)గా ఖరారు చేసిన విషయం విదితమే. ఈ బిల్లు ఇటీవలే చట్టంగా మారింది. ఈ పథకంలో జరిగిన మార్పులపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీలందరిని ఈ గ్రామసభలకు పిలిచి పథకంలో కీలక అంశాలను వివరించనున్నారు. ఈనెల 26న ఈ గ్రామ సభలను పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. సభలు పకడ్బందీగా జరిపేందుకు సంబంధిత ఫొటోలను జియోట్యాగింగ్తో ఉపాధి హామీ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం గ్రామ సభల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. 1.98 లక్షల మంది రెగ్యులర్ కూలీలు జిల్లాలో 658 గ్రామాల పరిధిలో ఈ పథకం అమలవుతోంది. 2.08 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 3.72 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 1.98 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.74.38 కోట్ల మేరకు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 18 వేల పనులు చేపట్టారు. ఇందులో వివిధ రకాల సుమారు 14 వేల పనులు కొనసాగుతున్నాయి. ఈనెల 26న జిల్లా వ్యాప్తంగా ఈ సభల నిర్వహణ ? సన్నాహాలు చేస్తున్న అధికార యంత్రాంగం జిల్లాలో 3.72 లక్షల మంది ‘ఉపాధి’ కూలీలు మట్టి పనులకు ఇక మంగళం ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మట్టి పనులను పూర్తిగా తొలగించింది. ఈ పనులను ఎంపిక చేయవద్దని గత ఆర్థిక సంవత్సరం నుంచే ఆదేశాలు జారీ అయ్యాయి. చెరువుల్లో పూడిక తీత, కందకాలు తవ్వడం వంటి పనులను ఎంపిక చేయలేదు. దీంతో ఆశించిన మేరకు పనులు జరగలేదు. తాజాగా మారిన నిబంధనల మేరకు ఇకపై జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చెరువులు, కుంటల స్థిరీకరణ, భూగర్భ జలాలు పెంచే వాటర్షెడ్లు, కాలువల నిర్మాణం, నీటి బావుల తవ్వకం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం ఈ పథకం కింద చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను ఇకపై కూడా కొనసాగిస్తారు. ఇప్పటి వరకు ఒక కుటుంబానికి ఏడాదిలో వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు పనిదినాలను 125కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వ్యవసాయ పనులు జరిగే రెండు నెలల పాటు ఈ పథకం పనులను నిలిపివేయనున్నారు. రైతులకు కూలీల కొరత రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈనెల 24న జాబ్ మేళా
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన యువకులు మిషన్ ఆపరేటర్గా పని చేసేందుకు ఎవరెస్ట్ ఆర్గానిక్ కంపెనీలో ఆసక్తి కలిగిన వారు పూర్తి సర్టిఫికెట్లతో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 22న ‘114 మంది విద్యార్థులు.. ఒకే మరుగుదొడ్డి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. అందోల్ ఎంఈఓ బి.కృష్ణకు ఫోన్చేసి పాఠశాలలో టాయిలెట్లు, మరుగుదొడ్ల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే నివేదికను అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. పటాన్చెరు: అమీన్పూర్లో ఇండస్ర్యాలీ కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చెర నుంచి హైడ్రా అధికారులు విడిపించారు. కాలనీవాసులు ఫిర్యాదు మేరకు అధికారులు సోమవారం ఈ చర్యలు తీసుకున్నారు. కాలనీ సంఘం ప్రతినిధి వజ్రాల కోటిరెడ్డి మాట్లాడుతూ.. 2005లో వెంచర్ ఏర్పడిందని ఇటీవల భూ యజమాని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పార్కు స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు పార్కు జాగాలో నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి కల్హేర్: గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులు సమష్టిగా కృషి చేసి గ్రామాలను ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. సోమవారం కల్హేర్ మండలం కృష్ణాపూర్, బీబీపేట, మార్డి గ్రామాల్లో నూతన సర్పంచ్లు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతానని చెప్పారు. నర్సాపూర్లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడి డిమాండ్ జోగిపేట(అందోల్): విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం జోగిపేట కురుమ సంఘం ఆవరణలో అందోల్ డివిజన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా.. స్కాలర్షిప్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతుందన్నారు. దీంతో విద్యార్థులు రుణాల్లో చిక్కుకుని, చదువు మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలన్నారు. నూతన కమిటీ.. ఎస్ఎఫ్ఐ అందోల్ డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా బి.నిఖిల్ , కే.బుచ్చిబాబు ఉపాధ్యక్షులుగా కిశోర్, ఎన్.వైష్ణవి, కే.కీర్తన, కే.మీనాక్షి, సహాయ కార్యదర్శిగా దుర్గావరప్రసాద్, కే.కిశోర్, ఎం.మధు, కమిటీ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రభాకర్ పాల్గొన్నారు. -
రహదారి విస్తరణ పనులు వేగిరం
● నెల రోజుల్లో నివేదిక సమర్పించండి ● ఎంపీ రఘునందన్ రావు పటాన్చెరు టౌన్: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆర్అండ్ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు చేపడుతున్న 65వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై ఆరా తీశారు. బీహెచ్ఈఎల్ నుంచి రుద్రారం వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా సాగుతూ ఉండడంతో నిత్యం ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇస్నాపూర్, లక్డారం, రుద్రారం తదితర గ్రామాల పరిధిలో మంచినీటిని సరఫరా చేసే పైపులైన్లు ధ్వంసం కావడంతో కాలనీలకు మంచినీటి సరఫరా నిలిచిందన్నారు. ఈ కారణంగా తాగునీటి కొరత ఏర్పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తరణ పనుల్లో వేగం పెంచకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జాతీయ రహదారుల సంస్థ డీఈ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐ లాలు నాయక్, విద్యుత్ శాఖ డీఈ భాస్కర్, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యతతోనే గుర్తింపు
గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుతో పాటు తమలోని నైపుణ్యాన్ని చాటినప్పుడే గుర్తింపు లభిస్తుందని గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనితా అబ్రహం పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్, టాస్క్ ఆధ్వర్యంలో మహేంద్ర ప్రైడ్ క్లాస్రూమ్ ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు, ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ ముగింపు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లా డారు. ఉపాధి నైపుణ్య శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులకు సర్టిఫికెట్లను అందజేశారు. అదే విధంగా జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్, డాక్యుమెంటరీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యకు పరిష్కారం..
చిన్నశంకరంపేట(మెదక్): సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెను వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించారు మండలంలోని కామారంతండా సర్పంచ్ మోహన్నాయక్. సోమవారం తండాలో నూతన పాలకవర్గం సభ్యులతో ప్రత్యేక అధికారి శ్యామ్కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. కొంత కాలంగా మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయి తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న పంచాయతీ పరిధిలోని గోప్యాతండాలో బోరువేయించి బోరుమోటారును బిగించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బోరుమోటారు వద్ద పూజలు నిర్వహించి ప్రారంభించారు. తాగడానికి మంచినీరు పడటంతో తండావాసులు ఆనందం వ్యక్తం చేశారు. -
మల్కాపూర్ అభివృద్ధిపై ఆరా..
తూప్రాన్: మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని సోమవారం బీహార్ రాష్ట్రానికి చెందిన 60 మంది గ్రూప్వన్ అధికారుల బృందం సందర్శించింది. ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందిన అధికారుల బృందం ఐదు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మల్కాపూర్ను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో డంపింగ్ యార్డ్, రాక్ గార్డెన్, వివిధ భవన సముదాయాలను పరిశీలించారు. ఒకప్పుడు మారుమూల గ్రామంగా ఉన్న మల్కాపూర్ అనతి కాలంలోనే అభివృద్ధి సాధించిన తీరును మేకిన్ యువత బృందం సభ్యులకు వివరించారు. ఈ సదర్భంగా వారు గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎంపీఓ సతీశ్ కుమార్, ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, మేకిన్ యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.గ్రామంలో బీహార్ అధికారుల పర్యటన -
‘ఆలు’ పంటకు సస్యరక్షణ అవసరం
జహీరాబాద్ టౌన్: మండలంలోని రంజోల్ గ్రామ పరిధిలో రైతులు పండిస్తున్న ‘ఆలు’ పంటను సోమవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(టీఆర్వీకే)సంగుపేట శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ ఆలుగడ్డ పంటలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. అనంతరం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.నిర్మల, కే.అరుణ మాట్లాడుతూ... ఆలుగడ్డ పంటలో మట్టి ఎగదోసే పద్ధతి (ఎర్తింగ్ అప్) వల్ల దుంపకు సూర్యరశ్మి రక్షణ లభిస్తుందన్నారు. గాలి, నీటి ప్రసరణ సక్రమంగా అంది దుంప బాగా తయారవుతుందన్నారు. దుంత తొలుచు పురుగు, శనగ పచ్చ పురుగుల వల్ల పంటకు ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు. దీని నివారణకు లీటర్ నీటిలో 0.3 మి.లీ క్లోరంత్రినిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రంజోల్ ఏఓ ప్రదీప్కుమార్, ఉద్యోగులు శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ..
తృటిలో తప్పిన ప్రమాదం పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటలో సోమవారం గడ్డి లోడ్తో వెళ్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వివరాలు ఇలా.. మెదక్– బొడ్మట్పల్లి నుంచి గడ్డి లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి వేగంగా వెళ్లి కల్యాణ మంటపం పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి పోయింది. పక్కనే నివాసం ఉన్న కుటుంబీకులకు కొద్దిలో ప్రమా దం తప్పింది. వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సరఫరాను నిలిపివేశారు. అనంతరం నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి మృతి గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... శ్రీగిరిపల్లికి చెందిన పెద్దల కిష్టయ్య(54) ప్రజ్ఞాపూర్ శివారులోని రాజీవ్ రహదారిపై మొక్కజొన్న కంకులను విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దినచర్యలో భాగంగా పాతూరు మార్కెట్లో మొక్కజొన్న కంకులను కొనుగోలు చేసేందుకు శ్రీగిరిపల్లి నుంచి తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ శివారులోని రాణే పరిశ్రమ సమీపంలో టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న కిష్టయ్యను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న మరో కారును ఢీకొట్టింది. కిష్టయ్యను అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీటి తొట్టిలో పడి బాలుడు సంగారెడ్డి: మూడేళ్ల బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, చౌటకూరు మండలం శివంపేట గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన నయీం కుమారుడు మహమ్మద్ ఫైజల్ (3) ఇంటి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతకారు. ఈ క్రమంలో నీటి తొట్టిలో పడిన విషయాన్ని గమనించి వెంటనే బాలుడిని సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కాగా బాలుడు తండ్రి నయీం గతంలో అనారోగ్యంతో మృతి చెందాడు. సైకో కిల్లర్కు యావజ్జీవ ఖైదు రూ.60 వేల జరిమాన చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్కు రెండు హత్యకేసుల్లో యావజ్జీవ ఖైదుతో పాటు రూ.60 వేల జరిమాన విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్పీ శ్రీనివాస్రావు కథనం మేరకు... మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మల్లేశం 2024 అక్టోబర్లో ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నవీన్ అనే వ్యక్తితో కలిసి మద్యం తాగిన అనంతరం బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం వారం రోజుల్లో నిజామాబాద్కు చెందిన స్వామితో స్నేహం చేసి చిన్నశంకరంపేటకు తీసుకువచ్చాడు. మద్యం తాగిన అనంతరం మత్తులోకి జారుకోగానే బండరాయితో తలపై మోది హత్య చేశాడు. రెండు ఘటనల్లో మృతదేహంపై చెత్తకాగితాలు వేసి నిప్పుపెట్టాడు. కాగా ఎస్ఐ నారాయణగౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్ నిందితుడిని పట్టుకున్నారు. ఆధారాలతో కూడిన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. -
ప్రకృతిని పరిరక్షించాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో ఎన్జీసీ (నేషనల్ గ్రీన్ కార్ప్) ఆధ్వర్యంలో వేస్టేజ్ టూ యూజ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. విద్యార్థులు తయారుచేసిన పేపర్ బ్యాగులు, పర్యావరణ కాలుష్యం కాకుండా తయారు చేసిన రాకెట్, వెండ్ చైన్, బెడ్ లాంప్, రూల్స్, మెజర్మెంట్ పార్క్ ఏరియా, తులసి కుండి, మ్యూజికల్ గిటార్, వాటర్ క్లీనర్, బ్యాగ్లు వివిధ రకాల వస్తువులను ప్రదర్శించారు. ఉత్తమ ఎగ్జిబిట్స్ తయారు చేసిన విద్యార్థులను ప్రశంసించి, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్రెడ్డి, ఎన్జీసీ కోఆర్డినేటర్ రాజశేఖర్, పవన్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి -
బాధ్యతగా తొలి అడుగు
తొలిరోజు గణిత ల్యాబ్ను ప్రారంభించి.. గజ్వేల్రూరల్: సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. మండలంలోని బెజుగామకు చెందిన నక్కిర్త గోపాల్ సర్పంచ్గా గెలుపొందిన మరుసటి రోజు నుంచే గ్రామంలోని ఎస్సీ కాలనీలో బోరుమోటారుకు, ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు చేపట్టి అందరి మన్ననలు అందుకున్నారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్రామంలోని పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా గణితం ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.● పదవీ బాధ్యతలు చేపట్టిన పంచాయతీ పాలకవర్గాలు ● అనంతరం పలు అభివృద్ధి పనులు ప్రారంభం నూతనంగా గెలుపొందిన సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాల్లో నెలకొన్న పలుసమస్యలను పరిష్కరించారు. పర్వతాపూర్లో శ్రమదానం.. రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్లో సర్పంచ్ తార్యానాయక్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. చెత్తాచెదారాన్ని తొలగించిన అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. దంతేపల్లిలో సర్పంచ్ బాల్రాజు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం మొక్కలు నాటారు. గుంతలు పూడ్చి.. ఇబ్బందులు తీర్చి అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని చౌటపల్లి గ్రామంలో సర్పంచ్ పత్తిపాక లావణ్య, పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని మర్రికుంట కట్టపై పడిన గుంతలను పూడ్చే పనులను మొదలు పెట్టారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తొలిరోజు గుంతలను పూడ్చేందుకు ఈ పనులను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో నూతన పాలకవర్గంతో పాటు తదితరులు ఉన్నారు. పంచాయతీకి రూ.50 వేల విరాళంమిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి గ్రామాభివృద్ధికి తన వంతు సాయంగా సోమవారం రూ. 50 వేల చెక్కును సర్పంచ్ ఎలుముల మహేశ్వరికి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి, రాజేశ్, ఉప సర్పంచ్ కరుణాకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ భూమాగౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.అన్నదమ్ములను కలిపిన ఎన్నికలు కల్హేర్(నారాయణఖేడ్): గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నదమ్ములను కలిపాయి. మండలంలోని మాసాన్పల్లికి చెందిన లింగంపల్లి బాగయ్య, లింగంపల్లి సాయిలు సోదరులు. కుటుంబ గొడవలు ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరాయి. ఇద్దరు ఏళ్ల తరబడి విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో లింగంపల్లి సాయిలు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేశారు. దీంతో బాగయ్య, సాయిలు గొడవలు మరిచి ఎన్నికల్లో గెలుపు కోసం కలిసి పనిచేశారు. 12 ఓట్ల తేడాతో సాయిలు సర్పంచ్గా గెలిచారు. సర్పంచ్ల ప్రమాణ స్వీకారం అనంతరం బీఆర్ఎస్ నేతలు ఇద్దరిని సన్మానించారు. ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు సోదరులు కలిసిపోవడంతో గ్రామస్తులు అభినందించారు.కార్మికులకు బీమా పత్రాలు అందజేస్తున్న సర్పంచ్ అనూష మనోహరాబాద్(తూప్రాన్): ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. పంచాయతీ సిబ్బంది, కార్మికుల కృషితోనే పల్లెలు పరిశుభ్రంగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారు. అలాంటి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తనవంతు సహాయం అందించేందుకు మనోహరాబాద్ నూతన సర్పంచ్ అనూష ముందుకొచ్చారు. సోమవారం నూతన పాలకవర్గం కొలువుదీరడంతో పదిమంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తన సొంత డబ్బులతో రూ.10 లక్షల చొప్పున జీవిత బీమా చేయించి అందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. దీంతో కార్మికులు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
చేగుంట(తూప్రాన్): ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తాయని , రైతులు సాగు చేయాలని లీవ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజర్ అశోక్ అన్నారు. సోమవారం మండలంలోని చిట్టోజిపల్లి గ్రామంలో ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. 40 మంది రైతులు ఆయిల్పామ్ సాగు కోసం ముందుకొచ్చారన్నారు. డ్రిప్ కోసం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సిద్దిరాములు, తార, ఫీల్డ్ ఆఫీసర్ సుజాత పాల్గొన్నారు. -
మార్కెట్ ప్రకారమే పరిహారం ఇవ్వాలి
కంది(సంగారెడ్డి): ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ నుంచి సేకరించనున్న అసైన్మెంట్ ల్యాండ్కు బదులు ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించాలని భూ బాధితులు అధికారులను కోరారు. మండల పరిధిలోని చేర్యాల గ్రామంలో గల సర్వే నం.741లోని 120 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం సోమవారం ఆర్డీఓ రాజేందర్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భూ బాధితులు మాట్లాడుతూ... ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ రేటు కంటే అధికంగా చెల్లించాలని కోరారు. అలాగే ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ అభిప్రాయాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని ఆర్డీఓ తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, సర్పంచ్ చేవెళ్ల రేఖారెడ్డి, ఆర్ఐ రంగయ్య పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్
హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బూర్గుపల్లి గ్రామానికి చెందిన దాసరి సుమన్(25), గుండు బాలవర్థి(22), అర్కెల కుమార్ బైక్పై బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో శాలిపేట మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఎల్లారెడ్డి వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కిందపడిపోయిన సుమన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన గుండు బాలవర్థిని మెదక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వీరితో పాటు ఉన్న అర్కెల కుమార్కు తీవ్ర గాయాలు కాగా ఆయనను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ నరేశ్ చేరుకొని మృతదేహాలను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో నలుగురికి గాయాలు.. హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఫరీద్పూర్ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ముత్తాయిపల్లి గ్రామానికి చెందిన ఎండి.శైలాన్ సర్దన వైపు నుంచి ఎక్స్ఎల్ వాహనంపై తన పిల్లలను తీసుకొని స్వగ్రామం ముత్తాయిపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఫరీద్పూర్ శివారులోకి రాగానే సర్ధన గ్రామానికి చెందిన రమేశ్ బైక్పై వచ్చి ఢీకొట్టాడు. దీంతో రమేశ్కు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శైలాన్తో పాటు ఉన్న ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు కాగా మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు దెబ్బలు తగలడంతో బోరున విలపించారు.ఇద్దరు మృతి.. మరొకరికి గాయాలు -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చిన్నశంకరంపేట(మెదక్): మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని శక్తి వాహిణి వ్యవస్థాపకురాలు, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్లో నిర్వహించిన శ్రీ శక్తి సంఘం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో తమ శక్తిని చాటాలన్నారు. ఇదే సమయంలో నైతిక విలువలతో కూడిన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు మహిళా సాధికారత, నైతిక విలువలు, సామాజిక బాధ్యతతో అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. శ్రీశక్తి మాతగా గుర్తిస్తున్న సమాజంలో అదే స్థాయిలో గౌరవం పొందేలా నైపుణ్యతను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్పన, నార్సింగి సర్పంచ్ సుజాత గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయవాది మౌనిక -
కోమాలోకి వెళ్లాడని..
వైద్యుల నిర్లక్ష్యంతోసంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే పేషంట్ కోమాలోకి వెళ్లాడని ఆరోపిస్తూ అతడి తరపు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సదాశివపేట మండలం నాగ్సన్పల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఏంఆర్ఐ స్కాన్, ఇతర స్కాన్లు చేయడానికి అతడు సరిగా సహకరించడం లేదని, అతనికి వైద్యులు సెడేషన్ ఇంజక్షన్ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన కొద్దిసేపటికీ సదరు పేషెంట్ కోమాలోకి వెళ్లాడు. ఇదేమిటని రోగి బంధువులు డాక్టర్లను ప్రశ్నించగా.. 24 గంటల సమయం పడుతుందని చెప్పారు. ఆ లోపు అతడికి ఓసారి గుండె కొట్టుకోవడం ఆగినట్లు గమనించిన వైద్యులు వెంటనే సీపీఆర్ చేయగా మెలకువలోకి వచ్చాడు. అయితే వైద్యులు ఇచ్చిన ఇంజక్షన్తోనే తమ బంధువు కోమాలోకి వెళ్లారంటూ క్షతగాత్రుడి సంబంధీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రతాప్ గౌడ్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన -
విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
న్యాల్కల్(జహీరాబాద్): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు పెద్ద గొల్ల రాజు ఎప్పటిలాగే తనకున్న 10 గేదెలను మేపేందుకు పొలానికి తీసుకెళ్లాడు. ఒక గేదె మేత మేస్తూ పక్కనే ఉన్న చిన్నపాటి మడుగులో నీటిని తాగేందుకు వెళ్లింది. నీరు తాగే క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. గమనించిన రైతు మిగిలిన గేదెలను అటు వైపు వెళ్లకుండా అడ్డుకున్నాడు. విద్యుత్ స్తంభానికి గల సపోర్టు తీగ ద్వారా విద్యుత్ సరఫరా జరిగి గేదె మృతి చెందిందని తెలిపాడు. మృతి చెందిన గేదె విలువ 1.20లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. -
ఢిల్లీ పార్లమెంట్కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): మన నాయకుడిని తెలుసుకోండి పేరిట ఈనెల 25న ఢిల్లీలోని పార్లమెంట్లో జరిగే కార్యక్రమానికి మండలంలోని చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. పదో తరగతి చదువుతున్న శివచైతన్య ఎన్సీఈఆర్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీ పర్యటనకు ఎంపికయ్యాడు. పార్లమెంట్లో జాతీయ నాయకుల జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నాడు. గైడ్ టీచర్గా కిషన్ప్రసాద్ ఎంపికయ్యారు. తాళం వేసిన ఇంట్లో చోరీమూడు తులాల బంగారు ఆభరణాల అపహరణ కౌడిపల్లి(నర్సాపూర్): తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో చోటుచేసుకుంది. ఆదివారం ఎస్ఐ మురళి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ ఫాజిల్ శనివారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి చిలప్చెడ్ మండలంలోని ఫైజాబాద్లోని అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంట్లోకి కోతులు వెళ్లడంతో పక్కింటివారు చూసి, ఫోన్ చేసి చెప్పారు. దీంతో కంగుతిన్న అతను ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.20వేల నగదు చోరీ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోచోట బైక్.. కౌడిపల్లి మార్కెట్ సమీపంలోని ఓ ఇంట్లో సీతారాంతండాకు చెందిన డోజర్ డ్రైవర్ కెతావత్ గణేశ్ అద్దెకు ఉంటున్నాడు. శనివారం పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చి బైక్ను ఇంటి ఎదుట పార్క్ చేసి పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోతరాజుపల్లిలో రెండు దుకాణాల్లో.. రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు కొండపాక(గజ్వేల్): ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన మండలంలోని దుద్దెడ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... చేర్యాల పట్టణానికి చెందిన రవి, రజిత దంపతులు ద్విచక్ర వాహనంపై మధ్యాహ్నం సిద్దిపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రజిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురికి... కొండపాక(గజ్వేల్): ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలో ఆదివారం చోటు చేసకుంది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... సికింద్రాబాద్కు చెందిన గవ్వల రవి కుటుంబీకులతో కలిసి కొమురవెళ్లి మల్లన్న దర్శనం కోసం కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై ఉన్న చిన్న కిష్టాపూర్ క్రాస్ రోడ్డు వద్ద సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి కారును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. కారు వెనక సీట్లో కూర్చున్న సునీత, మిన్ను ప్రియ, శాన్వికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ కోదాటి మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రకృతి విలయాలను గుర్తించవచ్చు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జ్యోతిష్య శాస్త్రాల శ్లోకాలు నేటి సాంకేతికతకు ఎంతో దగ్గరగా ఉంటాయని హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గౌరీ నీలకంఠేశ్వర దేవాలయ ప్రాంగణంలో హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఆరవ జ్యోతిష్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి విలయాలను జ్యోతిష్య సంహిత ద్వారా ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. సైన్స్ ఆధారంగా నిరూపించబడిన ఎన్నో విషయాలు జ్యోతిష్య సంహితలో వందల సంవత్సరాల క్రితమే పొందుపరచబడి ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి భానుమతి, జ్యోతిష్య పండితులు ఉమాపతి రామేశ్వర శర్మ, నీలకంఠ సమాజం అధ్యక్షుడు కడవేర్గు నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం వ్యవస్థాపకుడు -
పాముకాటుతో యువతి మృతి
చేగుంట(తూప్రాన్): పాము కాటుతో యువతి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గంగాధర్ స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కూతురు అక్షయ(16) శనివారం రాత్రి పాముకాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆదివారం స్థానికులు ఆమె పాముకాటుకు గురైనట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్రంలో ఉండగానే ఆమె మృతి చెందింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో.. నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో శనివారం రాత్రి జరిగింది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... హవేళిఘణాపూర్కు చెందిన దండు శ్రీకాంత్ (33) కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో నివాసం ఉంటున్నాడు. కాగా మోటార్ వైండింగ్ మెకానిక్గా నర్సాపూర్లో పనిచేస్తున్నాడు శనివారం సాయంత్రం నర్సాపూర్లో పనులు ముగించుకుని బైక్పై తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ నుంచి అతివేగంగా వస్తున్న ఆర్టీసీ డిపో బస్సు నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై చిన్న చింతకుంట మూలమలుపు వద్ద అతడ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్కు తీవ్ర గాయాలు కాగా నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య మంజుల, ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ.. చేగుంట(తూప్రాన్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రం చేగుంటలో చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... చేగుంటకు చెందిన ఎల్ది శ్రీనివాస్(50) కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 10న రాత్రి ఇంట్లో యాసిడ్ తాగి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మంజీరా పైపులైన్ లీకేజీ..
శివ్వంపేట(నర్సాపూర్): మంజీర ప్రధాన పైపులైన్ నీటి లీకేజీతో బస్టాండ్ ప్రాంగణం చిత్తడిగా మారింది. తూప్రాన్– నర్సాపూర్ హైవేకు ఆనుకొని ఉన్న మండల కేంద్రమైన శివ్వంపేట బస్టాండ్ వద్ద మంజీర ప్రధాన పైపులైన్ నుంచి నీరు లీక్ అవుతుంది. దీంతో నీటితో చిత్తడిగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయం గురించి మంజీర నీటి సరఫరా ఏఈ సురేశ్ను వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.చిత్తడిగా మారిన బస్టాండ్ -
ప్రజాధనం వృథా
శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్రూంలుఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటిని అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లు పెట్టి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. సంగారెడ్డి మండలంలోని హనుమాన్ నగర్ గ్రామ శివారులో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో? లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ నిర్మాణ పనులు మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిపై దృష్టి సారించకపోవడంతో లక్షల రూపాయల ప్రజాధనం వృథాగా పోతుంది. నిర్మించిన ఇళ్లకు మరమ్మతులు చేసి పూరి గుడిసెల్లో ఉంటున్న పేదవారికి ఇస్తే మేలు జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపాలని మండలవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఆర్భాటంగా నిర్మించిన అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయకుండా వాటి నిర్మాణాలను సైతం పూర్తి చేయకుండా అలాగే వదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వం చేపట్టిన ఆ ఇళ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇల్లు లేని పేదవారు మాత్రం ఎప్పుడు ఇళ్లు ఇస్తారా అని కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికై నా ఇళ్లకు మరమ్మతులు చేసి పంపిణీ చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం మరమ్మతులు చేసి అందజేయాలి: లబ్ధిదారులు -
ప్రతిభ చాటి.. బహుమతులు గెలిచి..
ప్రశాంత్నగర్(సిద్దిపేట)/హవేళిఘణాపూర్(మెదక్): బాల చెలిమి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాలల కథల పోటీల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటినట్లు అక్షర సేద్యం ఫౌండేషన్ చైర్మన్ దుర్గయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని బాలచెలిమి కార్యాలయంలో ఉపాధ్యాయుడు వెంగళ నరేశ్, విద్యార్థి విశ్వతేజకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రియాజ్ నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థి గుగ్లోత్ పూజ రచించిన గోనె సంచి కథలు ఉత్తమ కథగా ఎంపికై నట్లు ఉపాధ్యాయుడు ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. కాగా ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల చెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కార్యదర్శి డాక్టర్ రావి శారద, డాక్టర్ రఘు, బాల సాహితీవేత్త అశోక్, పత్తిపాక మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘మీ డబ్బు.. మీ హక్కు’
క్లెయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందవచ్చుమెదక్ కలెక్టరేట్: బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర సంస్థల్లో ప్రజలు క్లెయిమ్ చేసుకోని వాటిని తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మీ డబ్బు – మీ హక్కు ’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జిల్లాలోని ఆయా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇన్సూరెన్స్ సంస్థల్లో మిగిలిపోయిన డబ్బులను సంబంధిత వారసులు పొందడానికి ప్రభుత్వం ఈనెల 23 న మెదక్ కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఆస్తులు యజమానులకు చేరేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ వంటి జాతీయ స్థాయి సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలు ఉమ్మడిగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. శిబిరంలో ఆస్తులు క్లెయిమ్ విధానంపై మార్గ నిర్దేశం చేయనున్నారు. బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్న పౌరులు ఉద్గం వెబ్సైట్ ద్వారా సులభంగా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లాలోని ఆయా బ్యాంకులు, ఇతర సంస్థల్లో మొత్తం రూ.20.61కోట్లు ఎవరి పొందలేని డబ్బులు ఉన్నట్లు లీడ్ మేనేజర్ బాపూజీ తెలిపారు. బ్యాంకుల్లో రూ.14కోట్లు , ఇతర సంస్థల్లో రూ.6.61 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 23న మెదక్లో నిర్వహించే శిబిరాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సౌత్హెడ్ ప్రత్యేక అధికారిగా రానున్నట్లు తెలిపారు. 23న ప్రత్యేక శిబిరం జిల్లాలో రూ. 20.61 కోట్లు -
ఓడినా.. మాటకు కట్టుబడి..
శివ్వంపేట(నర్సాపూర్): సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయినా.. కాలనీవాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. మండల పరిధిలోని దొంతి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సుశీల బాబుసుకుమార్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చింతల బస్తీలో నీటి ఎద్దడి ఉందని కాలనీవాసులు వారి దృష్టికి తీసుకొచ్చారు. కాగా జరిగిన ఎన్నికల్లో సుశీల బాబుసుకుమార్ ఓడిపోయినా ఇచ్చిన మాట ప్రకారం శనివారం రాత్రి చింతల్ బస్తీలో సొంత నిధులతో బోరుబావి తవ్వించారు. దీంతో పుష్కలంగా నీరు పడింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లాయక్, శ్రీనివాస్, వార్డు సభ్యులు సుజాత, మమత, కృష్ణ, రాములు, స్వామి ఉన్నారు.బోరుబావి తవ్వించిన అభ్యర్థి -
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు
మిరుదొడ్డి(దుబ్బాక): గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9 వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అల్వాల–చెప్యాల క్రాస్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ రఘునందన్రావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జనవరి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై న విద్యార్థులకు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వరకు ఉచిత భోజన వసతితో పాటు, విద్యాబోధన అందిస్తామన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
57 మందికి జరిమాన
పటాన్చెరు టౌన్ / సంగారెడ్డి క్రైమ్ / సిద్దిపేటకమాన్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు కోర్టులు జరిమానా విధించాయి. వివరాలు ఇలా... శనివారం పటాన్చెరులో నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్లో 20 మందిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా వారికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించారు. అలాగే సంగారెడ్డిలో నిర్వహించిన తనిఖీల్లో 13 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేటలో 24మందికి కోర్టు రూ.1,88,000 జరిమాన విధించిందని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెపారు. అక్రమ మద్యం స్వాధీనంహుస్నాబాద్రూరల్: అక్రమ మద్యాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మండలంలోని పొట్లపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు బండి మల్లేశం ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. సోదాల్లో రూ.6వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినా మళ్లీ అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ ఇద్దరికి రూ.లక్ష వరకు జరిమాన వేయాలని సిఫార్స్ చేసినట్లు చెప్పారు. గ్రామాల్లోని బెల్టు షాపుల్లో అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతదేహం కోసం గాలింపు హవేళిఘణాపూర్(మెదక్): ఔరంగాబాద్ చెరువులో ఓ వ్యక్తి పడి మృతి చెందాడన్న అనుమానంతో పోలీసులు ఆదివారం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఆడెపు బాబు(40) శుక్రవారం మేసీ్త్ర పని కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు వెతకగా అతడు వేసుకున్న దుస్తులు, చెప్పులు చెరువు ఒడ్డున ఉన్నట్లు గుర్తించారు.దీంతో పోలీసులు చెరువులో గాలింపు చేయించినా ఆచూకీ లభించలేదు. -
బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలసంగారెడ్డి: బీజేపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల ధ్వజమెత్తారు. ఆదివారం పనికి ఆహార పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఆదివారం సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం మహాత్మాగాంధీ పేరును తొలగించాలానే కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటికై నా బీజేపీ ప్రభుత్వం చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, రవి, ప్రవీణ్, నర్సింహారెడ్డి, మహేష్, తాహిర్, రాజు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మా.. దీవించమ్మా
పాపన్నపేట(మెదక్): దుర్గమ్మా.. మమ్ము దీ వించమ్మా అంటూ వేలాది భక్తులు ఆదివారం ఏడుపాయల వన దుర్గమ్మను వేడుకున్నారు. ఉదయం అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి బోనాలు తీసి, ఒడి బియ్యం పోసి భక్తులు మొక్కులు తీర్చుకున్నా రు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులు పరిష్కారం చేసుకోవచ్చని సంగారెడ్డి జిల్లా కోర్టు ఇన్చార్జి జయంతి అన్నారు. ఆదివారం నిర్వహించిన లోక్ అదాలత్లో వివిధ రకాల కేసులను పరిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకున్నారని, కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంలో వెళ్లే కేసులను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 4,248 కేసులు పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్జోన్: ఏళ్ల తరబడి కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, డబ్బు, విలువైన సమయాన్ని వృథా చేసుకోవటం కంటే రాజీమార్గమే ఇరువర్గాలకు ఎంతో మంచిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. లోక్ అదాలత్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 3,398 కేసులు రాజీ పడటం సంతోషకరమైన విషయం అన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లోక్ అదాలత్ ద్వారా చిన్నపాటి కేసులను రాజీ చేస్తున్నామని, దీనిని ప్రజలు ఉప యోగించుకోవటం సంతోషంగా ఉందన్నారు. కొల్చారం(నర్సాపూర్): మండలంలోని కొంగోడ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సర్పంచ్ దుబ్బగళ్ల స్వామి ఆదివారం కాంగ్రెస్లో చేరారు. నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, కొల్చారం సర్పంచ్ శేఖర్, పార్టీ సీనియర్ నాయకులు సామెల్, కుమార్ గౌడ్, దుర్గాగౌడ్, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు: తెలంగాణలో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ముత్తంగి పంచాయతీ పరిధిలో ఆదివారం నిర్వహించిన మల్లన్నస్వామి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ:సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సందీప్, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కొండెక్కిన కోడి ధర
వారంలో రూ. 50 పెరుగుదలసదాశివపేట(సంగారెడ్డి): కోడి కొండెక్కింది. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కిలోపై రూ. 50 పెరిగింది. దీంతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటి నుంచి ధరలు పెరగడం ప్రారంభం అయింది. వారం వారం రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచుతున్నారు. గత వారం క్రితం లైవ్ రూ. 130, డ్రెస్డ్ చికెన్ రూ. 200 నుంచి రూ. 240 పలకగా, ప్రస్తుతం లైవ్ రూ. 160, డ్రెస్డ్ రూ. 270, స్కిన్లెస్ రూ. 300 పలుకుతోంది. కిలోపై రూ. 50 మేర పెరిగింది. అయితే దీనికి కారణం కోళ్ల రేటు పెరగటమేనని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోళ్లు జిల్లాలోనే అందుబా టులో ఉండేవని, దీంతో ధరలు తక్కువగా ఉండేవంటున్నారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందంటున్నారు. రవాణా చార్జీలు తడిసి మోపడవుతుండటంతో చికెన్ రేటు పెరిగిందని చెబుతున్నారు. -
మహాత్మాగాంధీ పేరు తొలగించడం సరికాదు
పటాన్చెరు టౌన్: వలసల నివారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే, కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించడం సబబు కాదని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి మండిపడ్డారు. అదిష్టానం పిలుపు మేరకు ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారిపై నూతన చట్టం ప్రతులను తగల బెడుతూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ గారి పేరు తొలగింపుపై కాంగ్రెస్ పోరాడితే బీజేపీ మత ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, కాంగ్రెస్ నాయకులు సాయిలు ముదిరాజ్, యువరాజ్, జ్యోతిలక్ష్మి, శ్రీలేఖ, రతన్ సింగ్, ప్రభాకర్, రమేశ్, శ్రీనివాస్రాజు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెకు పట్టాభిషేకం
● ముస్తాబైన పంచాయతీలు ● 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశ నారాయణఖేడ్: పల్లెల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. గెలుపొందిన సర్ప ంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండేళ్లుగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగింది. సంగారెడ్డి జిల్లాలో 613 సర్పంచ్లు, 5,370 వార్డులు, మెదక్ జిల్లాలో 492 సర్పంచ్లు, 4,220 వార్డులు, సిద్దిపేటలో 508 సర్పంచ్లు, 4,508 వార్డులు ఉన్నాయి. కాగా కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కార్యదర్శుల జేబులకు చిల్లు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికే సమస్యల పరిష్కారం కోసం జేబుల నుంచి పెట్టుబడులు పెట్టిన పంచాయతీ కార్యదర్శులు తమకు బిల్లులు ఎప్పుడు వస్తాయన్న ఆందోళనలో ఉన్నారు. పాలకవర్గాలు లేకపోవడతో రెండేళ్ల పాటు భారం అంతా వారిపైనే పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో నిర్వహణ భారం ఎదుర్కొన్నారు. చెత్త ట్రాక్టర్కు డీజిల్ పోసేందుకు జేబులోంచి చెల్లించారు. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, వేతనాలు, పారిశుద్ధ్య పనులకు సైతం చెల్లించారు. గ్రామాన్ని బట్టి ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అప్పులు చేసి వెచ్చించారు. సవాల్గా మారిన సమస్యలు ఎన్నో ఆశలతో పంచాయతీలోకి అడుడు పెడుతున్న సర్పంచ్లకు సమస్యలు స్వాగతం పలుకుతు న్నా యి. రెండేళ్లు పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. పల్లెల్లో కొనుగోలు చేసిన చెత్త ట్రాక్టర్లో కనీసం డీజిల్ పోయించుకోలేని దుస్థితికి ఆర్థిక పరిస్థితి చేరింది. డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులతో పాటు ట్రాక్టర్ ఈఎంఐ చెల్లింపులు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, తాగునీటి సరఫరా, కరెంట్ మోటారు మరమ్మతులు.. తదితర సమస్యలన్నీ కొత్త సర్పంచ్లకు సవాల్గా మారాయి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లే క గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. బకాయి పడిన లక్షలాది రూపాయల పన్నులు వసూలు చేయా లి. చిన్న పంచాయతీలు, తండాల్లో సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. కొన్ని పంచాయతీల్లో రెండేళ్లుగా కిస్తీలు సైతం చెల్లించడం లేదు. దీంతో వడ్డీ భారం పడనుంది. -
ఓవరాల్ ఛాంపియన్ అల్గోల్
జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మైనార్టీ గురుకులాల జిల్లా స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 8 టిమ్రేస్ పాఠశాలలకు చెందిన 800 మంది విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు అండర్ 14, 17, 19 విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. అండర్ 14 ఓవరాల్ ఛాంపియన్షిప్గా సిద్దిపేట, అండర్ 17 ఓవరాల్ ఛాంపియన్ షిప్గా సంగారెడ్డి, అండర్ 19 ఓవరాల్ ఛాంపియన్ షిప్గా అల్గోల్ టీంలు నిలిచాయి. క్రీడా పోటీల ఓవరాల్ ఛాంపియన్గా అల్గోల్ నిలిచింది. వీరికి జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్, టౌన్ ఎస్ఐ వినయ్కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ షహనాజ్ బేగం, కళాశాల ప్రిన్సిపాల్ జమీల్, జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ప్రశాంత్గౌడ్, పీఈటీ అనిల్కుమార్తో పాటు జిల్లాలోని పలు గురుకులాల ప్రిన్సిపాల్స్, పీఈటీలు పాల్గొన్నారు. ముగిసిన జిల్లా స్పోర్ట్స్ మీట్ -
రైతు భరోసా ఏది?
● నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు ● పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు వర్షాకాలంలో ఎప్పుడు లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు నీటి వనరులు నిండుకుండలా మారాయి. భూగర్భజలాలు సైతం పెరిగి బోరుబావుల్లో పుష్కలమైన నీరు ఉంది. ఈ యాసంగిలో మాత్రం 3.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని చెప్పారు. మిగితా 22,186 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది యాసంగిలో 2,96,531 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 19,711 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. మెదక్జోన్: యాసంగి సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే రైతులు నారుమళ్లు (తూకం) పోసి పంటల సాగుకు సిద్ధమయ్యారు. అయితే రైతు భరోసా ఎప్పుడిస్తామనే విషయం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. జిల్లాలో 5 లక్షల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉండగా, వాటిలో ఏటా సుమారు నాలుగు లక్షల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. కాగా గడిచిన వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం సైతం అందలేదు. కాగా ఈ యాసంగి సీజన్లో అయినా సకాలంలో పంటలు సాగు చేసుకుందామంటే సాగుకు పెట్టుబడి కోసం ఎదురు చూపులు తప్పటం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఖర్చులు ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగు చేయాలనే తపనతో వివిధ కంపెనీలు చెప్పే మాయ మాటలు నమ్మి రైతులు అధికంగా విత్తనాలకే డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్క ఎకరాకు విత్తనాల కోసమే రూ. 5 వేల నుంచి మొదలుకొని రూ. 6 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇక దుక్కులు దున్నటం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు నివారణ మందులు, నాటుకు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు వస్తోంది. కాగా పెట్టుబడి సాయం సకాలంలో చేతికందితే వాటికి కొంత కలిపి పంటసాగుకు ఉపయోగించుకుందామని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ రబీ సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కాగా గతేడాది యాసంగి సీజన్లో మాత్రం డిసెంబర్ మొదటి వారంలోనే 2.65 లక్షల మంది రైతులకు రూ. 213.65 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి. కాగా అర్హుల జాబితాను ప్రభుత్వం సీసీఎల్ నుంచి తీసుకొని రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
మధ్యవర్తిత్వమే ఉసురు తీసింది
● దంపతులను బలిగొన్న స్నేహితుల మోసం, ఆర్థిక ఇబ్బందులు ● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూతురు ● జెజ్జంకిలో తీవ్ర విషాదం బెజ్జంకి(సిద్దిపేట): స్నేహితుడిని ఆదుకునేందుకు వహించిన మధ్యవర్తిత్వం దంపతుల ఆత్మహత్యకు కారణమైంది. ఈ ఘటన ఆదివారం బెజ్జంకి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నమ్మిన స్నేహి తుల మోసం, ఆర్థిక ఇబ్బందులతో వడ్లకొండ శ్రీహర్ష(33), భార్య రుక్మిణి (28) క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి కుమార్తె హరిప్రియకు తాపి ఉంటారన్న అను మానంతో సిద్దిపేట ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన శ్రీహర్ష బెజ్జంకిలో భార్య, కుమార్తెతో కలిసి అద్దెకు ఉంటూ రెడీమేడ్ డ్రెస్సెస్ షాపు నిర్వహిస్తున్నారు. శ్రీహర్ష స్నేహితుల వద్ద రూ.13 లక్షల అప్పుల వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్నాడు. దీంతో అప్పుల వారి ఒత్తిడి పెరగడం.. తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై భార్య, కూతురుతో సహా క్రిమిసంహారక మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తాను రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. భార్య రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీహర్ష కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కుమార్తె సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీహర్ష రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నమ్మిన మిత్రుల వల్లే నాకు ఈపరిస్థితి వచ్చిందని తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాల’ని సూసైడ్ నోట్లో రా సినట్లు సమాచారం. దంపతులిద్దరినీ ఒకే పాడేపై పెట్టి అంత్యక్రియలు నిర్వహించాలని నోట్లో వేడుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య పరిశీలించారు. మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శ్రీహర్ష, రుక్మిణి మృతదేహాలు -
అవార్డు కోసం కృషి
స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. జాతీయస్థాయికి కూడా ఎంపికయ్యేలా కృషి చేయాలని ఆయా పాఠశాలల కాంప్లెక్స్ హెచ్ఎంలు, పాఠశాలల హెచ్ఎంలకు సూచించాం. – వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి రూ. లక్ష ప్రోత్సాహం జిల్లాలో అధిక రేగింగ్ కలిగి పాఠశాలలను ఇటీవల జిల్లా బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. అందులో అన్ని అర్హతలు కలిగిన ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది. జహీరాబాద్ మండల పరిధిలోని గోవింద్పూర్, కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలు, అలాగే పటాన్చెరులోని శిశు విహార్, పలు ప్రైవేట్ పాఠశాలలు ఎంపికై న వాటిలో ఉన్నాయి. త్వరలో రాష్ట్ర బృందం వీటిని పరిశీలించనుంది. రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి వాటికి రూ.లక్ష స్కూల్ గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. -
ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాం
నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లపై ముఖ్యమంతి, మంత్రులు, సంబంధించిన ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాం. అ సమయంలో అధికారులు నామమాత్రంగా చిన్న ప్రకటన బోర్డులను తొలగించారు. గోపనపల్లి తండా నుంచి కొల్లూరు రింగ్ రోడ్డు వరకు ఉన్న రేడియల్ రోడ్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి కాకపోయినా మధ్యలో ర పకటన బోర్డులను ఏర్పాటు చేశారు. – ఈశ్వరగారి రమణ, తెల్లాపూర్, నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడుప్రభుత్వ ఖజానాకు గండి హోర్డింగ్ల వలన ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతుంది. దీనిపై అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రమాదకరంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లపై చర్యలు తీసుకోవాలి. హోర్డింగ్ల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – సురేష్ కుమార్, తెల్లాపూర్ -
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిజిన్నారం (పటాన్చెరు): పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం గడ్డపోతారం పట్టణ పరిధిలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు, అలాగే.. జిన్నారం పట్టణ పరిధిలోని రాళ్లకత్వ, రాళ్లకత్వ తండాలలో రూ.95 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు అంతర్గత మురుగునీటి కాల్వలు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. గడ్డపోతారం పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మహా పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్లు వెంకటరామయ్య, తిరుపతి, పంచాయితీరాజ్ డీఈ సురేష్ పాల్గొన్నారు. -
హోర్డింగ్ల దందా!
ఎక్కడ చూసినా అవే దర్శనం ● ప్రమాదాలకు ఆస్కారం ● ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ● పట్టించుకోని అధికారులురామచంద్రాపురం(పటాన్చెరు): జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలలో అక్రమ హోర్డింగ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నగర శివారు ప్రాంతాలైన తెల్లాపూర్, ముత్తంగి, అమీన్పూర్ డివిజన్లలో పురోగతి దిశగా సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో రియల్ వ్యాపారంతో పాటు అనేక వాణిజ్య సంస్థల హోర్డింగ్లకు మంచి డిమాండ్ వచ్చింది. రోడ్లు, ఇళ్లపై ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై గతంలో కొందరు మంత్రులకు సైతం ఫిర్యాదు చేశారు. రోడ్డ మధ్యలో చిన్నపాటి ప్రకటన బోర్డులను దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వందల సంఖ్యలో ఉన్నాయని అధికారులే చెబుతున్నా.. వీటిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్లను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ హోర్డింగ్ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతోంది. ప్రతి ఏటా లక్షలాది రూపాయల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. అధికారుల అండదండలు అక్రమ హోర్డ్ంగ్ల ఏర్పాటు దారులకు స్థానిక అధికారుల అండదండాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం రేడియల్ రోడ్డు డివైడర్పై అనేక ప్రకటన బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నామమాత్రం తొలగించి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన వాటి జోలికి వెళ్లకపోవడంతో అనేక అనుమానాలకు దారితీస్తుంది. వీటిపై విజిలైన్స్ అధికారులతో విచారణ చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలే కాని చర్యలేవి..? గత ప్రభుత్వం హోర్డింగ్లకు సంబంధించిన అనుమతులను పునరుద్ధరణ చేయవద్దని ఆదేశించింది. కానీ చూస్తుండగానే అనేక కొత్త హోర్డింగ్లు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ అక్రమాలే అని అధికారులే చెబుతున్నా..చర్యలు మాత్రం తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కాగా, రోడ్డు మధ్యలో, పక్కలో ఏర్పాటు చేసే హోర్డింగ్లపై ఉండే ప్లేక్స్లు ప్రమాదకారంగా మారుతున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు అవి చినిగి విద్యుత్ తీగలపై పడుతున్నాయి. పలు సందర్భాలలో రోడ్లపై పడిన దాఖలాలు ఉన్నాయి. -
ధైర్యంగా పని చేయండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ సర్పంచులు ధైర్యంగా పనిచేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని చెప్పారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను సంగారెడ్డిలో శనివారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. డబ్బులు పంచి గూండాయిజం చేసినా బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా ఎదుర్కొని సర్పంచులుగా విజయం సాధించారని చెప్పారు. మరో రెండేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ సర్పంచులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచులు ఐదేళ్లు పదవిలో ఉంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను తాను దగ్గరుండి చేయిస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు లేని చెక్ పవర్ సర్పంచులకే ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పడైనా అధికార పార్టీ 90 శాతం స్థానాలను గెలుచుకుటుందని, కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతానికి మించి సుమారు నాలుగు వేల సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందని హరీశ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్పంచులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. కొత్త సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు కొత్తగా సర్పంచులుగా ఎన్నికై న వారికి అవగాహన కల్పించేందుకు పార్టీ ఆధ్వర్యంలో త్వరలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి భవిష్యత్ ఉంటుందని, గెలిచిన వారికి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుసదాశివపేట(సంగారెడ్డి): పిల్లల భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, చిన్న వయసు నుంచే సరైన అవగాహన కల్పిస్తే ప్రమాదాల నుంచి తగ్గించవచ్చని జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం బడి పిల్లల భద్రత, రక్షణ ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సురక్షితమైన, భద్రమైన పాఠశాల వాతావరణానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు కృషి చేయాలన్నారు. పిల్లలకు రహదారి భద్రత, ఇంటి వద్ద, అపరిచితుల నుంచి జాగ్రత్తలు, సైబర్, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల వంటి ముఖ్య అంశాలపై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ రత్నయ్య, ఓఎస్సీ అవగాహన అధికారి కల్పన, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాలవ్య, ఎస్ఐ.కృష్ణయ్య, హెచ్ఎం జయసుధ, సీఆర్పీలు, రాజేశ్వర్, సరస్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఖైదీలకు సరైన ఆహారాన్ని అందించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర సంగారెడ్డి టౌన్: జైలులో ఖైదీలకు సరైన ఆహారాన్ని అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. శనివారం కంది లోని సెంట్రల్ జైలును తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలులోని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం వంటగది, భోజనశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. పుస్తకపఠనంపై దృష్టి పెట్టాలి సివిల్ జడ్జి అసదుల్లా షరీఫ్ జోగిపేట(అందోల్): విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగం తగ్గించి.. పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని జోగిపేట జూనియర్ సివిల్ జడ్జి, మండల సర్వీస్ కమిటీ చైర్మన్ మహ్మద్ అసదుల్లా షరీఫ్ పేర్కొన్నారు. శనివారం మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జోగిపేటలోని తెలంగాణ మైనారిటీస్ పాఠశాల, కళాశాలలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. జడ్జి షరీఫ్ మాట్లాడారు. విద్యార్థులకు చట్టాలపై ప్రాథమిక అవగాహన, ఆన్న్లైన్ మోసాలపై వివరించారు. అనవసర లింకులు ఫేక్ మెసేజ్లు నుంచి దూరంగా ఉండాలని సూచించారు. బాలల హక్కులు, విద్యహక్కు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్. శివప్రసాద్, సారా వెంకటేశం, జోగిపేట్ ఏఎస్ఐ అంజయ్య, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లీగల్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలిడిప్యూటీ కలెక్టర్ ప్రతిభ మునిపల్లి(అందోల్): భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె శనివారం సందర్శించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ సేవ ద్వారా భూ భారతికి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన నివేదిక తయారు చేయాలన్నారు. పూర్తి స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాభవానీ, ఆర్ఐ, సుభాష్, గ్రామ పాలన అధికారులు అంజన్ కుమార్, చంద్ర ప్రకాష్, నర్సింలు, శివగౌడ్, ధనుంజయలు పాల్గొన్నారు. వంటకాల ప్రదర్శన ఉత్సాహంగా ఫుడ్ ఫెస్టివల్ ఝరాసంగం(జహీరాబాద్): మండలంలోని బర్దిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకొన్నారు. శనివారం పాఠశాల విద్యార్థులు ఘుమఘుమలాడే వంటకాలను ఇంటి నుంచే తయారు చేసుకుని వచ్చి, ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. వివిధ రకాల వంటలు వాటిని ఆహారంగా తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులు వివరించారు. పలు రకాల వంటకాలను గుర్తించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణప్రియ, ఉపాధ్యాయులు జీవన్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల తనిఖీ
జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలంలోని పలు పాఠశాలలను శనివారం తనిఖీ కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రాయిపల్లి తండా, మన్నాపూర్ ప్రాథమిక పాఠశాలలను నోడల్ అధికారి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిమ్మల కిష్టయ్య, వాహబోద్దీన్లు తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, బోధన ప్రణాళిక, విద్యార్థుల హాజరు శాతం వంటి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఇన్చార్జి మంత్రిని కలిసిన కార్పొరేటర్ పటాన్చెరు టౌన్: స్థానిక డివిజన్లో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరయ్యాయని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం నిధుల మంజూరు పత్రంపై సంతకం చేయించేందుకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామిని హైదరాబాద్లో కలిశారు. గ్రేటర్కు మంజూరైన నిధుల్లో ఒక కోటి నిధులు ఖర్చు చేసేందుకు సంతకం తీసుకున్నట్లు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్, నవీన్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు. -
‘స్వచ్ఛ’ పాఠశాలలు!
● ఎస్హెచ్వీఆర్ కింద 8 స్కూళ్లు ఎంపిక ● త్వరలో రాష్ట్ర స్థాయి బృందం రాక ● రూ.లక్ష గ్రాంట్ ఇవ్వనున్న కేంద్ర సర్కార్న్యాల్కల్(జహీరాబాద్): పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత కలిగిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించడానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎస్హెచ్వీఆర్ (స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్) పేరుతో ప్రతియేటా జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు అందిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాదికి గాను జిల్లాలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యాయి. ఎనిమిది పాఠశాలల ఎంపిక జిల్లాలో 864 ప్రాథమిక, 187 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు, 22 కేజీబీవీలు, 10 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. అలాగే 109 గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, 500 వరకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వాటిలో తాగునీరు, మరుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా అమలు చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం రేటింగ్ ఇచ్చింది. పాఠశాలల పరిస్థితుల వివరాలను హెచ్ఎంలు యూడైస్ లాగిన్తో ఎస్హెచ్వీఆర్లో సెప్టెంబర్లోనే నమోదు చేశారు. -
మీ డబ్బు.. మీ హక్కు
ఆ ఆస్తులు నిజమైన ఖాతాదారులకే దక్కాలి: కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జోన్: జిల్లాలోని 17 బ్యాంకులలో 2,36,123 ఖాతాదారులకు సంబంధించి రూ.51.07 కోట్ల మేర క్లెయిమ్ చేయని ఆస్తులు ఉన్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్లో క్లెయిమ్ చేయని ఆర్థికపరమైన ఆస్తులు నిజమైన ఖాతాదారులకే అందించడమే లక్ష్యంగా మీ డబ్బు–మీ హక్కు ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ మాధురితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు ఖాతాదారులకే చెల్లించాలని కోరారు. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు రెండు కోట్లు ఖాతాదారులకు చెల్లించినట్లు తెలిపారు. డిసెంబర్ 31 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి 65పై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రేడియం స్టిక్కర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఆర్ అండ్ బీ ఈఈ రాంబాబు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విశాలాక్షి, డీటీఓ అరుణ, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.


