breaking news
Sangareddy District News
-
ఫోన్ కొనివ్వలేదని అలిగి...
చేగుంట(తూప్రాన్): ఫోన్ కొనివ్వలేదని అలిగిన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం ప్రకారం.. చేగుంటకు చెందిన షేక్ ఆసిఫ్ (16) తనకు ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. వారు నిరాకరించడంతో అలిగిన ఆసిఫ్.. ఈనెల 4న ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి షాదుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్టుచేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ వి.నవీన్ తెలిపాడు. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి శివారు కటికె బండ వద్ద ఓ యువకుడు గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్, చేర్యాల పోలీసులు దాడి చేసి సోహెల్ పాషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 115 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. విచారించగా హైదరాబాద్ దూల్పేటలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపాడు. మందుబాబులకు జరిమాన సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా, పాత బస్టాంట్ వద్ద, బైపాస్లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వ హించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వారిని మంగళవారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీకి రూ. రెండు వేలు, ముగ్గురికి రూ.1500, మిగ తా ముగ్గురికి రూ.1000, చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో మూడు గేదెల మృత్యువాతపటాన్చెరు టౌన్: పటాన్చెరు మండలం రుద్రారంలోని పెద్ద చెరువులో మంగళవారం విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన గేదెలు మృతి చెందాయని, రూ. 4లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు మహేశ్ కోరాడు. చెరువులో విద్యుత్ స్తంభాలు ఉండటమే తరచూ గేదెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రూ.87.94 లక్షల వడ్డీలేని రుణాలు ఐకేపీ ఏపీఎం రుక్ష్మిణి తూప్రాన్: మండల మహిళా సమైఖ్యకు ప్రభుత్వం రూ.87.94 వడ్డీలేని రుణాలను మంజూరు చేసిందని ఐకేపీ ఏపీఎం రుక్ష్మిణి పేర్కొన్నారు. మంగళవారం మహిళా శక్తి సంబురాలు కార్యక్రమం నిర్వ హించారు. ఈ సంబురాలు గ్రామాల వారీగా ఈనె ల 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో మహిళ సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. -
డీఎస్ఆర్ పద్ధతితో ప్రయోజనం
చిలప్చెడ్(నర్సాపూర్): డీఎస్ఆర్ పద్ధతిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి రాజశేఖర్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని చండూర్ గ్రామంలో పలువురు రైతులు సాగు చేస్తున్న డీఎస్ఆర్ పద్ధతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ రాజశేఖర్గౌడ్ మాట్లాడుతూ.. సంప్రదాయంగా నాటే వరి పద్ధతి కంటే డైరెక్ట్ సీడెడ్ రైస్తో నీటి వినియోగం చాలా వరకు తగ్గుతుందన్నారు. నారు వేసే పద్ధతి ఉండకపోవడంతో, కూలీల శ్రమ తగ్గుతుంది. పైగా తక్కువ కాలంలో పంట చేతికి వస్తుంది. రసాయన ఎరువుల వినియోగం తక్కువగా ఉండడంతో నేల సారవంతమవుతుంది. ఈ పద్ధతి వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉంటుంది. గ్రీన్హౌస్ వాయువులను తగ్గించడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ కృష్ణవేణి, రైతు శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందాపూర్ గ్రామశివారులోని వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. వాటిలో నుంచి ఆయిల్, కాపర్ వైరు చోరీ చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం వ్యవసాయ పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు విషయం గమనించి ట్రాన్స్కో అధికారులకు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసిన విషయం తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. వ్యవసాయాధికారి రాజశేఖర్గౌడ్ -
అథ్లెటిక్స్లో విద్యార్థినికి 6 గోల్డ్ మెడల్స్
కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎర్రోళ్ల ప్రణీత అథ్లెటిక్స్ పోటీల్లో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించారని ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జూన్ 4న, 29న జిల్లా స్థాయిలో నిర్వహించిన రన్నింగ్, బ్రాడ్ జంప్ పోటీలో నాలుగు గోల్డ్ మెడల్స్ను సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై ందన్నారు. హైదారాబాద్లోని జింఖాన గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 60 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ దక్కించుకుందన్నారు. ఈసందర్భంగా ప్రణీతను ఫిజికల్ డైరెక్టర్ ఉప్పలయ్యతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. -
పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్
హుస్నాబాద్రూరల్: దేవేంద్రనగర్లో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి పది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా దేవేంద్రనగర్లోని పశువుల పాకలో పేకాట అడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకోని వారి నుంచి రూ.43 వేల నగదు, 9 సెల్ ఫోన్స్, 9 బైక్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి గజ్వేల్రూరల్: పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామశివారులో చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులతో పాటు వారి వద్దనుంచి 9,700 నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ పోలీసులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు, ఫామ్హౌస్లు, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఎవరైనా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే టాస్క్ఫోర్స్ అధికారులకు (8712667445, 8712667446)కు సమాచారం అందించాలని సూచించారు.రూ.43 వేల నగదు, 9 సెల్ ఫోన్లు, 9 బైక్స్ స్వాధీనం -
నిరవధిక సమ్మెకు సిద్ధం
జహీరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి సమ్మెకు పోతున్నట్లు టీవీఏసీ–జేఏసీ ప్రకటించింది. సమ్మెకు శాశ్వత ఉద్యోగులు సైతం సహకరించాలని కోరింది. విద్యుత్ ఉత్పత్తి నుంచి బిల్లుల వసూళ్ల వరకు అంతా ఆర్టిజన్లే చేస్తున్నా.. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జహీరాబాద్, పటాన్చెరు, జోగిపేట, సంగారెడ్డి డివిజన్లు ఉండగా 568 మంది ఆర్టిజన్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ బోర్డులో ఉన్న నిబంధనలనే అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారని, అయినా అమలు చేయక పోవడం వల్లే సమ్మె బాట పట్టాల్సి వస్తోందంటున్నారు. విధి నిర్వహణలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నా.. పట్టించుకోవడం లేదని, ఆర్థిక ఇబ్బందులతో పలువురు ఆత్మహత్యలకు సైతం పాల్పడినా న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. బోర్డు విభజన సందర్భంగా ఇస్తామని చెప్పిన వాటినే తాము అడుగుతున్నామని పేర్కొంటున్నారు. ఏపీఎస్ఈబీ రూల్స్ను అమలు చేయాలని, ఆర్టిజన్లు మరణిస్తే వారి సంతానానికి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే సంస్థ అన్నప్పుడే ఒకే రూల్ ఉండాలని, ప్రస్తుతం పర్మినెంట్ వారికి ఒక విధానం, ఆర్టిజన్లకు ఒక చట్టం అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సీనియారిటీని బట్టి బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, ఇండస్ట్రీయల్ యాక్టు ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులను పర్మనెంట్ చేయడం ద్వారానే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం లభిస్తుందంటున్నారు. నిరవధిక సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆర్టిజన్లు జిల్లా వ్యాప్తంగా ఆవిష్కరిస్తున్నారు. గోడలపై వాటిని అంటించి మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు.పర్మినెంట్ కోసమే ఆందోళన తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలనే డిమాండ్తో ఆందోళనకు వెళుతున్నాం. కరెంటు ఉత్పత్తి మొదలుకొని బిల్లుల వసూళ్ల వరకు అన్నీ ఆర్టిజన్ కార్మికులే చేస్తున్నా న్యాయం జరగడం లేదు. వివక్షతకు గురవుతున్నాం. పర్మినెంట్ చేయడం ద్వారానే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం ఉంటుంది. బోర్డు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నాం. ఉద్యమానికి శాశ్వత ఉద్యోగులు కూడా సహకరించాలి. – ఆయిదాల జైపాల్, తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడువిద్యుత్ సంస్థలో వెట్టి చాకిరి చేయడానికే తాము పుట్టినట్లు ఉందని ఆర్టీజన్ కార్మికులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం సామగ్రి, బ్లేడ్స్ ఓపెన్ కాని ఎల్బీ స్విచ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ప్రమాదాలకు గురైన కార్మికులకు కాళ్లు, చేతులు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు కరెంటు స్తంభాలపైనే ప్రాణాలు వదులుతున్నారని, పిల్లలు అనాథలు అవుతున్నారని వాపోతున్నారు. ఇంత కష్టపడి పని చేస్తున్నా సంస్థలో తగిన గుర్తింపు లే కుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.14 నుంచి ఆర్టిజన్ కార్మికుల ఆందోళన బాట ఆర్టీజన్స్ కన్వర్షన్తోనే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరం జిల్లా వ్యాప్తంగా పోస్టర్ల ఆవిష్కరణ -
ఒంటరి మహిళలే టార్గెట్
మెదక్ మున్సిపాలిటీ: బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడిన దొంగతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బదనపురం పెంటయ్య అలియాస్ ప్రేమ్, తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన కుమ్మరి శివకుమార్, ఇదే మండలం వట్టూరుకు చెందిన పాంబండ వరలక్ష్మిలతో కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. కల్లు దుకాణాల్లోకి ఒంటరిగా వచ్చే మహిళలను టార్గెట్ చేసుకున్నారు. వారికి మాయ మాటలు చెప్పి బాగా కల్లు తాగిస్తారు. మత్తులోకి జారుకోగానే వాళ్ల దగ్గర ఉన్న బంగారం నగలు, వెండి కాళ్ల కడియాలను దోచుకొని వెళ్లేవారు.ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో హవేళిఘణాపూర్ మండలం కూచన్పల్లికి చెందిన ఎరుకల ఎల్లవ్వ మెదక్ పట్టణంలోని ఒకటవ నంబర్ కల్లు దుకాణంలోకి వచ్చింది. ఆమె వద్ద ఉన్న బంగారం నగలు, కాళ్ల కడియాలపై వీరి దృష్టి పడింది. ఆమెకు బాగా కల్లు తాగించి మత్తులోకి జారుకోగానే తులం బంగారు గుండ్లు, 1.5 తులాల బంగారు కమ్మలు, 60 తులాల వెండి కడియాలను దోచుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా కుమ్మరి శివకుమార్ అదుపులోకి విచారించగా.. ఈ కేసులో వరలక్ష్మి, పెంటయ్యల ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితులపై నర్సాపూర్, గజ్వేల్, మనోహరబాద్లలో కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించామన్నారు. కేసును ఛేదించిన మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేశ్, పోలీసు బృందం అమర్, నర్సింలు, నిఖిల్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్ వ్యసనంతో చోరీలు ముగ్గురు దొంగల రిమాండ్ రూ.6లక్షల విలువైన సొత్తు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు -
టమాటా.. రైతులకు ఊరట
పెరుగుతున్న ధరలుగిట్టుబాటు అవుతున్న ధరలు కొన్ని రోజుల నుంచి టమాట ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో నాటిన తోటల నుంచి కోతలు వస్తున్నాయి. ప్రస్తుతం సగం కోతలు పూర్తి చేశారు. అయితే దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. ధర మాత్రం ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం బాక్స్ ధర రూ. 400 నుంచి రూ. 500 పలుకుతుంది. వారంతపు సంతలో టమాట కిలో రూ.40 నుంచి 50 అమ్ముతున్నారు. దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు ధరలు లేక నష్టపోయామని, అరకొరగా పంట ఉన్నప్పుడు ధరలు పెరిగాయని కంబాలపల్లికి చెందిన రైతు శ్రీనివాస్ వాపోయారు. కొందరు మాత్రమే పెరిగినఽ ధరలు పొందుతారని ఆయన పేర్కొన్నారు. -
బర్త్ సర్టిఫికెట్ జాప్యం చేస్తున్నారని..
జహీరాబాద్ టౌన్: తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఓ వ్యక్తి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట హల్చల్ చేశాడు. మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన బోయిని శేఖర్(35) తన కుమారుడు రాము బర్త్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్ జారీ చేయడం లేదని కోపంతో మద్యం తాగి పెట్రోల్ సీసాతో జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఎందుకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడంలేదంటూ అధికారులను నిలదీశాడు. కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్నవారు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్టేషన్కు తీసుకెళ్లారు. సర్టిఫికెట్ జారీ చేశాం శేఖర్ కుమారుడి బర్త్ సర్టిఫికెట్ పెండింగ్లో లేదని తహసీల్దార్ దశరథ్ పేర్కొన్నారు. సర్టి ఫికెట్ ఎప్పుడో జారీ చేశామని, మీ సేవలో ప్రింట్ తీసుకోవాల్సి ఉందన్నా రు. మీ సేవకు వెళ్లకుండా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడని ఆయన పేర్కొన్నారు.హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుజహీరాబాద్ టౌన్: నెల రోజుల వరకు టమాట పంట రైతులను ఆందోళనకు గురిచేసింది. బోరు బావులు, స్థానిక నీటి వనరులను వినియోగించుకొని సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోయారు. టమాట తెంపిన కూలీలు, మార్కెట్కు తరలించేందుకు రవాణా చార్జీలకే సరిపోయింది. కమీషన్ ఏజెంట్ల వద్ద 25 కిలోల బాక్స్ రూ.100కు అమ్మాల్సి వచ్చింది. సంతలో కిలో రూ.10కు అమ్ముకున్నారు. కొన్ని రోజుల నుంచి టమాట ధరలు పెరుగుతుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆదుకుంటుందని యాసంగిలో సాగు చేసిన టమాట పంట వల్ల రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. పంట దిగుబడి పెరగడంతో కొనేవారు కరువయ్యారు. వేల రూపాయల పెట్టిన పెట్టుబడి దక్కలేదు. జిల్లాలో సుమారు 537 ఎకరాల్లో టమాట పంట సాగవగ పడిపోయిన ధరల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. జహీరాబాద్ మార్కెట్కు లోకల్ టమాటతో పాటు మహారాష్ట్ర నుంచి టమాట వస్తుంది. డిమాండ్ కన్నా దాదాపు రెట్టింపు రావడం వల్ల ధరలు పడిపోవడానికి కారణమవుతోంది. ఒక్కసారిగా పంట చేతికి రావడంతో ధరలు పతనమయ్యాయి. కూలీలు, రవాణా చార్జీలు మీదపడుతున్నాయని కొంత మంది రైతులు పంటను పొలంలోనే వదిలేశారు.బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో చోరీనర్సాపూర్: నర్సాపూర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో చోరీ జరిగిందని ఎస్ఐ లింగం చెప్పారు. ఆ సంస్థలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న పూర్ణచందర్రెడ్డి ఈనెల 5న ఆఫీసుకు తాళం వేసి వెళ్లాడని, 7న ఉదయం తిరిగి ఆఫీసుకు వచ్చే సరికి తాళం పగులగొట్టి ఉంది. కౌంటర్లో ఉన్న రూ, 1500 ఎత్తుకు వెళ్లారు. పూర్ణచందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం -
యువతి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన నర్సాపూర్ మండలం అచ్చంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు కూతురు సురేఖ (19) పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. సోమవారం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. చాకలి ఆంజనేయులు అతని భార్య పోచమ్మ, ఇద్దరు కుమారులు సురేఖను ఇంటి వద్ద ఉంచి 7వ తేదీ సోమవారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సురేఖ ఇంటివద్ద లేదు. చుట్టుపక్కలతో పాటు బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించ లేదు. ఇంట్లో ఉన్న రూ 15 వేలు తీసుకెళ్లినట్లు తెలిపారు. తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జేబు దొంగకు దేహశుద్ధి నర్సాపూర్ రూరల్: జేబు దొంగను మహిళలు పట్టుకొని చితకబాదారు. ఈ సంఘటన నర్సాపూర్ బస్టాండ్లో మంగళవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ బస్టాండ్లో ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లతో కలసి హైదరాబాద్కు వెళ్లే బస్సు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో జేబులో ఉన్న డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్న దుండగుడిని మహిళలు చూసి పట్టుకొని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు అతను తప్పించుకొని పారిపోయాడు. తరచూ బస్టాండ్లో జేబుదొంగలు, డబ్బులతో పాటు బంగారు నగలు, సెల్ఫోన్లను అపహరిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. -
790 లైబ్రరీ పోస్టుల భర్తీ
నారాయణఖేడ్: రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న 790 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.రియాజ్ అహ్మద్ తెలిపారు. ఖేడ్ శాఖ గ్రంథాలయానికి రూ.60లక్షలతో విస్తరణ పనులకు ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత 25 ఏళ్లుగా గ్రంథాలయాల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తూ ఇప్పటికే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. కంగ్టిలో గ్రంథాలయ భవనం కోసం రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. జహీరాబాద్లో గ్రంథాలయానికి రూ.54 లక్షలు మంజూరుచేసి దానికి కేటాయించిన స్థలంలో గత ప్రభుత్వం ఆసుపత్రిని నిర్మించిందన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. ప్రతీ ఒక్కరూ రోజూ దినపత్రికలను చదవాలని, సైన్స్ను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. గ్రంథాలయంలో పుస్తకాల కోసం తనకోటాకు సంబంధించి రూ.5లక్షలు మంజూరు చేస్తానన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ..త్వరలో నిర్వహించనున్న ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నీట్ కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. నియోజకవర్గంలోని 15 పెద్దగ్రామాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ అంజయ్య, కార్యదర్శి వసుంధర, ఆర్డీఓ అశోకచక్రవర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, నాయకులు రమేశ్ చౌహాన్, వినోద్పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్ హామీ -
మండల పరిషత్ పునర్వ్యవస్థీకరణ
నారాయణఖేడ్: స్థానిక సమరానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ఆదేశాలు రావడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మండల ప్రజాపరిషత్తుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టారు. మండల ప్రాదేశిక స్థానాలు (ఎంపీటీసీ)ల ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఇదివరకే ఆదేశించారు. మండల ప్రజాపరిషత్తుల పునర్వ్యవస్థీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీలు.. ప్రతీ మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ(మండల ప్రాదేశిక) స్థానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటైనా చాలా ఎంపీటీసీలు పాత మండలాల పరిధిల్లోనే ఉన్నాయి. ఎంపీటీసీలు కూడా పాత మండలాల వారీగానే ఉన్నారు. జిల్లాలో పలు కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు పట్టణ కేంద్రాల సమీపంలోని ఆయా గ్రామాలు మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో మండలాల్లోని ఎంపీటీసీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పూనుకుంది. మండలాన్ని ప్రాతిపదికన తీసుకుని ఎంపీటీసీల సంఖ్యను కొత్తగా నిర్ణయించనుంది. రెండు తగ్గి.. రెండు జత కూడి.. జిల్లాలో 28 మండలాలుగా 26 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇటీవల అమీన్పూర్, జిన్నారం మండలాలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. దీంతో ఈ జిల్లా ప్రాదేశిక స్థానాలు తొలగిపోయాయి. ఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్, ఆందోల్ నియోజకవర్గంలో చౌట్కూర్లు కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఎన్నికల్లో నిజాంపేట్, చౌట్కూర్లలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు కొలువు దీరనున్నారు. గత ఐదేళ్ల క్రితం జిల్లాలో ఖేడ్ నియోజకవర్గంలో నాగల్గిద్ద, సిర్గాపూర్, ఆందోల్లో వట్పల్లి, జహీరాబాద్లో మొగుడంపల్లిలు కొత్త మండలాలుగా ఏర్పాటయి వాటిల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎన్నికయ్యారు. ఈసారికూడా జిల్లా లో 26 ఎంపీపీలు, 26జెడ్పీటీసీ స్థానాలు ఉండనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 271 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వీటి సంఖ్య పునర్వ్యవస్థీకరణలో పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లలో తలమునకలు త్వరలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కొత్త మండలాల్లోనూ కొలువుదీరనున్న పాలకవర్గాలు -
సిగాఛీ.. నిబంధనల్ని కాలరాసి
సిగాచీ పరిశ్రమకు ఎన్డీఎంఏక్యాజువల్ లేబర్తో పనులు చేయించింది● ఈ లేబర్ను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు కనీసం లేబర్ లైసెన్సే లేదు ● ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్న సిగాచీ పరిశ్రమ యాజమాన్యం ఆగడాలు ● మొక్కుబడి తనిఖీలకే పరిమితమైన కార్మికశాఖ అధికారులు ● ప్రమాదం జరిగాక నోటీసులు జారీ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా 44 మంది నిరుపేద కార్మికుల ప్రాణాలను బలిగొన్న సిగాచీ పరిశ్రమ యాజమాన్యం.. ఇటు కార్మిక చట్టాలను కూడా కాలరాసింది. రియాక్టర్లు, బాయిలర్లు.. వంటి కీలక యంత్రాల వద్ద సంబంధిత రంగాల్లో అన్ని అర్హతలున్న స్కిల్డ్ వర్కర్లతో పనిచేయించాల్సిన యాజమాన్యం అడ్డా కూలీ (క్యాజువల్ లేబర్)తో పరిశ్రమల్లో పనిచేయించినట్లు తేలింది. పైగా ఈ పరిశ్రమకు ఈ అడ్డాకూలీలను ఇద్దరు లేబర్ కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. అయితే ఈ కాంట్రాక్టర్లు ఇద్దరికీ కూడా కార్మిక శాఖ నుంచి కనీసం లైసెన్స్లు లేవని తేలింది. దీన్ని బట్టి చూస్తే అన్స్కిల్డ్ వర్కర్లతో కీలక యంత్రాల వద్ద పనులు చేయించడంతోపాటు, కనీస నిబంధనలు పాటించలేదనేది స్పష్టమవుతోంది. అన్ని అర్హతలున్న వారిని ఉద్యోగాల్లో నియమించుకుంటే అధికంగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందని కక్కుర్తి పడి అడ్డాకూలీలతో పనిచేయించినట్లు తేలింది. 85 మంది రోజువారీ కూలీలు, వర్కర్లే.. నిరుపేద కూలీల ప్రాణాలు గాలిలో కలిశాక కార్మిక శాఖ మేల్కొంది. పొట్టచేతపట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన అమాయక కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాక ఈ శాఖ అధికారులు మొద్దునిద్ర వీడారు. ప్రమాదం జరిగాక ప్రభుత్వానికి ఆశాఖ ఓ నివేదిక పంపింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 143 మంది కార్మికులు, ఉద్యోగులున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 85 మంది డెయిలీ వేజ్ లేబరే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 32 కంపెనీ ఉద్యోగులు ఉండగా, 26 మంది కాంట్రాక్టు వర్కర్లు ఉన్నట్లు గుర్తించారు. లైసెన్స్లేని కాంట్రాక్టర్ ద్వారా కూలీలు ఈ దుర్ఘటన జరిగిన నెలలో జూన్లో ఈ పరిశ్రమలో పని ఎక్కువగా ఉందని, ఇందుకోసం రోజువారీ కూలీలతో పనులు చేయించాలని పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం 20 మంది రోజు కూలీలను సరఫరా చేసేందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్, పది మంది కూలీలను సరఫరా చేసేందుకు మరో లేబర్ కాంట్రాక్టర్తో పరిశ్రమ యాజమాన్యం మాట్లాడుకున్నట్లు కార్మికశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్యాజువల్ లేబర్ను సరఫరా చేస్తున్న ఈ ఇద్దరు లేబర్ కాంట్రాక్టర్లకు కార్మిక శాఖ నుంచి ఎలాంటి లైసెన్స్ లేకపోవడం గమనార్హం. అంటే కనీసం లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్ ద్వారా కూడా రోజు వారీ కూలీలను పనిలో పెట్టుకోలేదంటే ఈ పరిశ్రమ యాజమాన్యం అలసత్వం ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కనీస సమాచారం లేదు ఈ ఫ్యాక్టరీని ఇటీవల నిజామాబాద్ జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో పనిచేస్తున్న విషయాన్ని యాదయ్య తాను ఆశాఖ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొనకపోవడం గమనార్హం. కేవలం కార్మికుల సంఖ్య, షిఫ్టులు, వంటి వివరాలు డిస్ప్లేబోర్డుపై పెట్టలేదని మాత్రమే నివేదికలో రాసానని యాదయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రమాద స్థలం అధ్యయనం పటాన్చెరు: ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా పరిశ్రమను మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఎంఏ) బృందం సందర్శించింది. ఈ బృందం సభ్యులు ప్రమాద స్థలాన్ని నిశితంగా పరిశీలించి అణువణువూ గాలించారు. ప్రమాద వివరాలను ఆ సమయంలో కొనసాగుతున్న ఉత్పత్తి తదితర అంశాలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఎంఏ కేంద్ర బృందం కమిటీ సభ్యులు, సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధ్యయనంతో పాటు పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో ఏ పరిశ్రమల లోనూ పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వ నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, పరిశ్రమల శాఖ, అగ్ని మాపకశాఖ, కార్మికశాఖ, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.10ఏ కింద నోటీసులు జారీ ఈ ప్రమాదం జరిగాక సిగాచీ పరిశ్రమ యాజమాన్యానికి సెక్షన్ 10–ఏ కింద నోటీసులు జారీ చేసినట్లు కార్మికశాఖ సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. యూ–1 ఫాంలో కార్మికులు, ఉద్యోగుల వివరాలివ్వాలని యాజమాన్యానికి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేఖ రాసింది. -
ఎన్యూమరేటర్లకు పారితోషికం చెల్లించాలి
నారాయణఖేడ్: గతేడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్లకు పారితోషికాన్ని చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్ జాదవ్ డిమాండ్ చేశారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా మంగళవారం ఖేడ్ మండలంలోని పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేచేసి 8 నెలలు గడుస్తున్నా పారితోషికాన్ని చెల్లించకపోవడం విచారకరమన్నారు. పీఆర్సీ రిపోర్టును తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల టైంటేబుల్ మార్చాలని, కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించి వారికి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. పాఠశాలల పర్యవేక్షణకోసం ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సంఘ ఖేడ్ మండల ప్రధానకార్యదర్శి శ్రీరామ్నాయక్, నాయకులు గంగామోహన్, మంగుబాయి, శోభారాణి, శంకర్రావు పాల్గొన్నారు. ప్రతి మహిళా కోటీశ్వరులు కావాలి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేశ్బాబు ఝరాసంగం(జహీరాబాద్): మహిళా సంఘాల్లోని ప్రతీ మహిళా కోటీశ్వరుల్ని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన ఝరాసంగం పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళా సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీయం టిక్యానాయక్, తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి నర్సాపూర్: బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పకడ్బందీగా పాటించాలని స్థానిక ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహిపాల్ సూచించారు. నర్సాపూర్లోని వైపర్ కాలేజీ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండలంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఎల్ఓలు తమకు కేటాయించిన బూత్ పరిధిలో కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, ఆర్ఐ ఫైజల్, ట్రైనర్లు లక్ష్మినారాయణ, ప్రసన్నకుమార్, శ్రీనివాస్యాదవ్, బీఎల్ఓలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మెదక్ జిల్లా జట్టు మెదక్ మున్సిపాలిటీ: ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మంచిర్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలకు జిల్లా జట్టు సభ్యుడు మంగళవారం మెదక్ నుంచి తరలివెళ్లారు. మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ జట్టుకు కోచ్గా జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి పి.భాగ్యమ్మను నియమితులయ్యారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కంది (సంగారెడ్డి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింలు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం మంగళవారం కందిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కార్పొరేట్లకు ప్రభుత్వాలు లాభం చేకూర్చుతున్నాయని ఆరోపించారు. రైతులు సాగు చేసిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని మండిపడ్డారు. 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు ,కర్షకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుజాత,నర్సింలు,ఆనంద్,షబానా,కాశమ్మ, మంజుల,సునంద,జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ వద్దే వద్దు
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటుతో ప్రభుత్వం రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని మండలంలోని రాళ్లకత్వ గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. పూర్తి రైతు ఆధారిత ప్రాంతమైన జిన్నారంను మున్సిపాలిటీగా మారిస్తే ఈ ప్రాంత ప్రజలు, రైతులకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద రైతులు సాగు చేసుకునేందుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను తిరిగి తీసుకునే ప్రయత్నంలో భాగంగా సర్వే నంబర్ 286 రైతులకు నోటీసులు జారీ చేసిందన్నారు. మా అభిప్రాయాలు తెలుసుకోకుండా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. గురు పౌర్ణమికి ముస్తాబు హత్నూర(సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూర మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు క్షేత్రాధిపతి సభాపతిశర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. వేడుకలకు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ‘భగీరథ’ నీటిలో వానపాములు నర్సాపూర్: మిషన్ భగీరథ నీరు కలుషితం అవుతోందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నల్లాల ద్వారా చేప పిల్లలు రాగా, సోమవారం పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని కొందరి ఇళ్లకు నల్లాల ద్వారా సరఫరా అయిన నీటిలో వానపాములు, ఇసుక వచ్చినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన నీరు రావాల్సి ఉండగా, కలుషిత నీరు రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ జీఓను ఉపసంహరించుకోవాలి రామాయంపేట(మెదక్): ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రామాయంపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ విగ్రహం వద్ద జీఓ ప్రతులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జీఓ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం బేషరతుగా ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఈ నారాయణనాయక్ బాధ్యతల స్వీకరణ మెదక్ కలెక్టరేట్: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణనాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఈ శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్లో విద్యుత్ శాఖ ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణ నాయక్ జిల్లాకు నూతనంగా నియమితులయ్యారు. ఈసందర్భంగా జిల్లాలోని డివిజనల్ ఇంజినీర్లు, ఏడీఈలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది ఎస్ఈకి స్వాగతం పలికారు. నూతన ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. -
జీపీఓలుగా మరో చాన్స్
సంగారెడ్డి జోన్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ)ని నియమించనుంది. అయితే అర్హత పరీక్షకు మరో అవకాశం కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గతంలో రెవెన్యూ వ్యవస్థ నుంచి ఇతర శాఖలకు కేటాయించిన పాత ఉద్యోగుల నుంచి జీపీఓ నియామకానికి దరఖాస్తులు స్వీకరించింది. ఇంటర్మీడియెట్, డిగ్రీతో పాటు రెవెన్యూ శాఖలో ఐదు సంవత్సరాలు పాటు పని చేసిన అనుభవం కలిగి ఉన్న వారికి అవకాశం కల్పించింది. గత ప్రభుత్వంలో జిల్లావ్యాప్తంగా 2022 ఆగస్టు 1న రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేస్తున్న సు మారు 700 మంది వీఆర్ఏలు, 250పైగా వీఆర్ఓలను 2023 ఆగస్టు 10న ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. 182 మంది ఉత్తీర్ణత జీపీఓ ఉద్యోగ నియామకానికి 250 మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, వారికి ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించారు. అందులో 182 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సమాచారం. వివిధ కారణాలతో పరీక్షకు హాజరుకాని వారికి మరోసారి అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాల నాయకులు ఇటీవల మంత్రిని కలిశారు. ఈమేరకు మరోసారి అర్హత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. త్వరలో ఉద్యోగులకు బాధ్యతలు! జిల్లాలో త్వరలో రెవెన్యూ శాఖలో జీపీఓలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అర్హత పరీక్ష రాసేందుకు మరోసారి అవకాశం కల్పించడంతో వీరితో పాటే ఉత్తీర్ణత పొందిన వారికి బాధ్యతలు అప్పగిస్తారా? లేదా ముందుగానే ఉత్తీర్ణత పొందిన వారికి అప్పగిస్తారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. హాజరు కాని వారికి మరోసారి అర్హత పరీక్ష రెవెన్యూ సంఘాల విజ్ఞప్తితో నిర్ణయం త్వరలో జారీ కానున్న అధికారిక ప్రకటన -
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
సంగారెడ్డి జోన్: ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురితో కలిసి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను అర్జీదారులకు వివరించాలన్నారు. ఇదిలాఉండగా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న తమకు గత నాలుగు నెలలుగా వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు కావటం లేదని ఉద్యోగులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వేతనాలు సమయానికి రాకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు చర్యలు తీసుకొని తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలు మంచి లాభాలు వచ్చే వ్యాపారాలు నిర్వహించి, ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందిస్తామన్నారు. అలా గే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదే శించారు. సమావేశంలో డీఆర్డీఏ జ్యోతి, అడిషనల్ డీఆర్డీఓ సూర్యరావు, జిల్లా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావిణ్య ప్రజావాణికి 46 వినతులు ఓపెన్ స్కూల్ వరం సంగారెడ్డి ఎడ్యుకేషన్: చదువు మద్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిదని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సోమవారం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానమన్నారు. ఈనెల 11 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని వెల్లడించారు. -
సింగూరు జలాలను విడుదల చేయాలి
బీకేఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి సంగారెడ్డి టౌన్: సింగూరు జలాలను వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట ఖర్చులు పెరగడంతో చెరకు పంటకు టన్నుకు రూ.500 చెల్లించాలని, జొన్నలు కొనుగోలు డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను తీర్చాలన్నారు. సమావేశంలో జిల్లా కోశాధికారి సదానంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి తదిరులు పాల్గొన్నారు. సీఐ విద్యాసాగర్కు సేవా పతకంసిద్దిపేటకమాన్: సిద్దిపేట త్రీ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ విద్యాసాగర్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 అతిఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికై నట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీఐని సోమవారం ఆమె అభినందించారు. ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీసు శాఖలో 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న విద్యాసాగర్ ఈ పథకావడం గర్వకారణమన్నారు. త్వరలోనే ఈ పతకం అందజేస్తామన్నారు. ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందిని గుర్తించి అవార్డులు, రివార్డులు, సేవా పతకాలు ఇస్తామన్నారు.తండ్రి మందలించారని.. తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యం హత్నూర( సంగారెడ్డి): తండ్రి మందలించడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన హత్నూర పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మంగాపూర్కు చెందిన గడ్డమీది వీరేశం, నిర్మల దంపతుల పెద్ద కుమారుడు అభిరాం దౌల్తాబాద్ లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఆలస్యంగా రావడంతో తండ్రి వీరేశం మందలించాడు. సోమవారం తెల్లవారుజామున అభిరాం ఇంట్లో నుంచి వెళ్లిపోయి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 83309 07363, 96528 87845, 97014 68493 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబీకులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో జింక హతంరామాయంపేట(మెదక్): దారి తప్పి అటవీప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన చుక్కల జింకను సోమవారం మండలంలోని లక్ష్మాపూర్ వద్ద కుక్కలు హతమార్చాయి. ఈ విషయమై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి ఖుద్బుద్దీన్ సంఘటనా స్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పశువైద్యుడు పోస్టుమార్టం నిర్వహించారు. -
ఈ పాపం ఎవరిది..?
పటాన్చెరు: సిగాచి పరిశ్రమలో అసలు ప్రమాదం ఎలా జరిగింది.. దానికి కారణాలేమిటి..? ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ సంగతేమిటి..?డ ఇలా పారిశ్రామికవాడలోని కార్మికులు, సంఘాల నేతలు ప్రమాదంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. పరిశ్రమలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ప్రమాదం జరిగిందని వారు భావిస్తున్నారు. ప్రధానంగా ఆ పరిశ్రమను స్థాపించిన నాటి పరిస్థితులే నేటికీ ఆ పరిశ్రమలో ఉన్నాయని నవీన సాంకేతిక పరిజ్ఙానాన్ని అనుసరించి పరిశ్రమను అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. బాయిలర్కు అనుసంధానమైన డ్రైయ్యర్కు నిబంధనల ప్రకారం ఉండాల్సిన దూరం లేదని చెబుతున్నారు. ఇంట్లో గ్యాస్ కుక్కర్కు ఉండే సేఫ్టీ నట్ లాంటి వ్యవస్థ డ్రైయ్యర్కు లేకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మొత్తం అయిదు చోట్ల ఎగ్జాస్ట్ హోల్స్ (ఆవిరి బయటకు వెళ్లే మార్గాలు) ఉండాలని, అలాంటి వ్యవస్థ లేని కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది వరకే ఓ కార్మికుడి కుటుంబీకుడు తన తండ్రి చెప్పినట్లు పాత సామగ్రి కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కనీసం ఫైర్ ఇంజన్ పరిశ్రమ చుట్టూరా తిరిగే విధంగా సెట్ బ్యాక్లు కూడా లేవు. అగ్నిమాపక శాఖ, విద్యుత్ అధికారులు, టీఎస్ఐఐసీ అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. పరిశ్రమలో ట్రాన్స్ఫార్మర్ను ప్రహరీగోడపై అమర్చి ఉండటాన్ని తప్పు పడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది ఉండే సెక్షన్ను డ్రయ్యర్ ఉన్న చోట పై అంతస్తులో ఉండటాన్ని కూడ తప్పు పడుతున్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలో ఉత్పత్తి చేస్తున్న పరిమాణానికి తగిన విధంగా ఏర్పాట్లు లేవని ఎప్పుడో 1989లో స్థాపించిన పద్దతిలోనే పరిశ్రమ ఇప్పటికీ పెద్ద మార్పులు లేకుండా కొనసాగుతుందని వివరించారు. అన్ని శాఖల వారి నిర్లక్ష్యం కారణంగానే ఆ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇతర యూనియన్ నేతలు మాట్లాడుతూ నిపుణులైన కార్మికులను కాకుండా అన్స్కిల్డ్ వర్కర్లను పని చేయించడం కారణంగా కూడా ప్రమాదానికి కారణమని విశ్లేషిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేందుకు హైలెవల్ కమిటీ, నిపుణుల కమిటీలు అధ్యయనం ఓ వైపు కొనసాగుతుండగా పారిశ్రామికవాడలో ప్రమాదానికి కారణాలపై చర్చించుకోవడం గమనార్హం. ‘సిగాచీ’ప్రమాదానికి కారణాలెన్నో.. అన్ని శాఖల నిర్లక్ష్యం కూడా.. నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేదు పారిశ్రామికవాడలో కార్మికుల చర్చోపచర్చలు -
చిచ్చురేపిన పచ్చగడ్డి●
వర్గల్(గజ్వేల్): పచ్చగడ్డి వేసిన పొలం చిచ్చురేపింది. భూ తగాదా వృద్ధుని ఉసురుతీసింది. వరుసకు కొడుకే హంతకుడయ్యాడు. పారతో దాడిచేసి హతమార్చాడు. రెండు రోజుల క్రితం (శనివారం) వర్గల్ మండలం వేలూరులో వృద్ధుడు రాయన్న నర్సయ్య హత్యకేసును గౌరారం పోలీసులు ఛేదించారు. సోమవారం నిందితుని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. గౌరారం సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ మహేందర్రెడ్డి ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. వేలూరు గ్రామానికి చెందిన రాయన్న నర్సయ్య(65), వరుసకు కొడుకై న చింతకింది రాజు(39) పొలాలు పక్కపక్కనే ఉంటాయి. వీరిద్దరి మధ్య భూతగాదాలు ఉన్నాయి. గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నర్సయ్య పొలం సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. రూరల్ సీఐ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ కరుణాకర్రెడ్డి, సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు, గొడవలు, భూవివాదాలు, పాత కక్షలు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపారు. హత్యకు పాల్పడిన వరుసకు కొడుకై న చింతకింది రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం సాయంత్రం వ్యవసాయపొలంలో పనిచేసుకుంటున్న రాజు వద్దకు నర్సయ్య వెళ్లి తన పొలంలో పచ్చగడ్డి ఎందుకు వేశావంటూ తిట్టాడు. కోపంతో రాజు తన చేతిలో ఉన్న పారతో మూడు, నాలుగుసార్లు మెడ, తలపై బాదడంతో నర్సయ్య చనిపోయాడు. ఈ మేరకు నిందితుడు రాజు నేరం అంగీకరించాడని, అతనిని అరెస్ట్చేసి సోమవారం రిమాండ్ చేశామని సీఐ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ఎస్ఐ కరుణాకర్రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. కాగా తనను చేరదీసి, అప్యాయంగా పెంచిన తాత నర్సయ్య హత్యకు గురవడంతో మనవరాలు శ్వేత అనాథగా మిగిలిపోయింది.● వృద్ధుడి ఉసురు తీసిన భూ తగాదా ● వరుసకు కొడుకే నిందితుడు ● వేలూరు వృద్ధుని హత్యకేసు ఛేదించిన పోలీసులు -
ఏమయ్యారో?
ఆ ఎనిమిది మంది● నేటికీ ఆచూకీ లభించని కార్మికుల జాడ ● సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి కుటుంబీకుల్లో ఆందోళన ● రాత్రింబవళ్లు కొనసాగుతున్న తవ్వకాలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడు రోజులు అవుతున్నా వారి ఆప్తుల జాడ లభించడం లేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. తమను ఆదుకోవాల్సిన పెద్ద దిక్కు జాడ తెలియక మనోవేదనకు లోనవుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆఖరి చూపునకు కూడా నోచుకోకుండా పోతున్నామని కుమిలిపోతున్నారు. వారం రోజులుగా సిగాచీ పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నారు. – పటాన్చెరు పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్పోటనంలో గల్లంతైన కార్మికుల కోసం వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత నెల 30న పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో 143 మంది పనిచేస్తున్నారు. ఆ సమయంలో పనిచేస్తున్న వారిలో గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పారు. ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ మాత్రం నేటికీ దొరకలేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. వారి కుటుంబీకులు మాత్రం పరిశ్రమ వద్ద గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు అధికారులు రాత్రింబవళ్లు సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి భౌతికకాయాల కోసం వెతుకులాట ముమ్మరం చేశారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మట్టి దిబ్బల కింద, బూడిద మట్టిలో అణువణువు వెతుకుతున్నారు. అయితే అక్కడ పని చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు, బాధితుల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది. రెండు రోజుల క్రితం వరకు ఆ శిథిలాల్లో అక్కడక్కడ మాడిపోయిన మాంసం ముద్దలు లభించాయి. కానీ ప్రస్తుతం అలాంటి మానవ అవశేషాలు ఏవీ లభించడం లేదు. వెతుకులాట ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరిందనే చెప్పాలి. పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో దాదాపు 700 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంత వేడికి శరీరాలు పూర్తిగా మాంసం ముద్దలుగా మారి బూడిదలో కానరాకుండా కలిసిపోయి ఉంటాయని భావిస్తున్నారు. పాలు అమ్ముతానని చెప్పి.. బండ్లగూడలో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన ఆస్టిన్ పాల ప్యాకెట్లు వేసే పని చేస్తానని ఇంట్లో వారికి చెప్పి ఈ పరిశ్రమలో చేరాడట. ఆ పరిశ్రమలో ప్రమాదం జరగిన రోజు కంటే రెండు రోజుల ముందే అక్కడ డ్యూటీలో చేరాడు. మూడో రోజే ప్రమాదం జరిగింది. నేటికీ ఆ యువకుడి ఆచూకీ లభించడం లేదు. ఆస్టిన్ కుటుంబ సభ్యులు కనపడిన ప్రతి అధికారి కాళ్లపై పడుతున్నారు. కనీసం అతడి మృతదేహం అయినా ఇప్పించాలని రోధిస్తున్నారు. ఆస్టిన్ తోడబుట్టిన చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆస్టిన్తో పాటు రాహుల్ కుమార్ శర్మ, వెంకటేష్, సిల్వరీ రవి, శివ్జీ కుమార్, విజయ్ కుమార్ నిషద్, ఇర్ఫాన్ అన్సారీల ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. -
వృద్ధురాలి మెడలో పుస్తెల తాడు తస్కరణ
చేర్యాల(సిద్దిపేట): బైక్పై తీసుకెళ్తానని నమ్మించి వృద్ధురాలి మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మండల పరిధిలోని తాడూరు క్రాస్రోడ్డు సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. తాడూరు గ్రామానికి చెందిన ఈరు సత్తమ్మ, యాదయ్య దంపతులు దైవదర్శనం నిమిత్తం మర్కూక్ వెళ్లి వచ్చే క్రమంలో తాడూరు క్రాస్రోడ్డు వద్ద బస్సు దిగారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై భర్త వెళ్లగా అక్కడే ఉన్న సత్తమ్మను అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నమ్మించి బైక్పై ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లాక బండి ఆపి వృద్ధురాలి మెడలోంచి పుస్తెల తాడు లాక్కుని వెళ్లారు. ఈ క్రమంలో సత్తమ్మ మెడకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ తెలిపాడు. -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం
తూప్రాన్: కార్మికుల సమస్యల సాధన కోసం ఈనెల 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యల సాధన కోసం ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్, మల్లేష్, నాగులు, భిక్షపతి, శ్రీనివాస్, నారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బదిలీలు, పదోన్నతులు కల్పించాలి
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరిమెదక్జోన్: ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులను కల్పించటంతో పాటు విద్యాశాఖలో ఇన్చార్జిల స్థానంలో రెగ్యులర్ డీఈఓ, ఎంఈఓలను నియమించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో రెగ్యులర్ ఉపన్యాసకుడు లేకపోవటంతో శిక్షణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నగదు రహిత వైద్య విధాన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్రెడ్డి, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కారెక్కిన కాంగ్రెస్ నాయకులు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు యూటర్న్ తీసుకున్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పట్టణానికి చెందిన జీవన్రావు, చిన్నశంకరంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మితో పాటు మరికొంతమంది తెలంగాణ భవన్కు తరలివెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరంతా గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారే కావడం గమనార్హం. పలు కారణాలతో ఉద్యమ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఇదిలాఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన చాలా మంది నేతలు పార్టీని వీడారు. ప్రస్తుతం వారంతా మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఈసందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్గౌడ్, బట్టి జగపతి, గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
బరువెంత..? ఎత్తెంత..?
చిన్నారులపై ప్రత్యేక దృష్టి ● అంగన్వాడీల్లో స్పెషల్ డ్రైవ్ ● సంపూర్ణ ఆరోగ్యం దిశగా కృషి ● ఒక్కో ప్రాజెక్టులో ఏక కాలంలో జిల్లాలోని సూపర్వైజర్లందరూ తనిఖీలు నారాయణఖేడ్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేది పేద పిల్లలు కావడంతో వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ పోషకాహార లోపాలను అధిగమించేలా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలో ఈ నెలాఖరు వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా అంగన్వాడీల బలోపేతం, పిల్లల ఆరోగ్యం పట్ల సంపూర్ణ శ్రద్ధ కనబరుస్తుండడంతో జిల్లా అధికారులు ఒక అడుగు ముందుకు వేసి.. జిల్లా మొత్తం స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. ఇటీవల అంగన్వాడీల పనితీరుపై ఆ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. పలు అంశాలపై కీలక సూచనలు చేశారు. చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగు పర్చడం, అవసరమైతే స్వయం సహాయక సంఘాలు, స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవడం గురించి సూచనలు చేశారు. పోషకాహార లోపం చిన్నారుల్లో తగ్గించి ప్రోగ్రెస్ రిపోర్ట్ విధానం అమలు చేయాలని సూచించారు. 3,250 మంది చిన్నారుల్లో పోషకాహార లోపం జిల్లాలో నారాయణఖేడ్, జోగిపేట, సదాశిపేట్, జహీరాబాద్, పటాన్చెరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో 0– 6 ఏళ్లలోపు చిన్నారులు 1,02,755 మంది ఉన్నారు. వీరిలో ఎస్ఏఎం (తీవ్ర పోషకాహారలోపం ఉన్న పిల్లలు) 627మంది ఉండగా ఎంఏఎం (తక్కువ పోషకాహారలోపం పిల్లలు) 2,623 మంది ఉన్నారు. అందరు చిన్నారులకు పోషణలోపం సమస్యలు దూరం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీనెల నమోదు ప్రతీనెల అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తులను అంగన్వాడీ టీచర్లు నమోదు చేస్తారు. ఈ వివరాలను ఎన్హెహెచ్టీఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి. దీని ఆధారంగా పిల్లల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని అధికారులు చర్యలు తీసుకుంటారు. తక్కువ తీవ్ర లోప పోషణ, తీవ్ర లోప పోషణ ఉన్న చిన్నారులకు గుర్తించి వారికి బాలామృతం ఫ్లస్ అందివ్వడం, ఒక గుడ్డుకు బదులు రెండు గుడ్లు అందిస్తారు. మరీ అనారోగ్య సమస్యగా ఉంటే చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అంగన్వాడీ టీచర్ సమీప పీహెచ్సీలో చికిత్సలు చేయిస్తారు. అంగన్వాడీల తనిఖీలు కాగా కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తు తీయడం, వివరాల నమోదు సక్రమంగా జరుగుతుందా లేదా అనే అంశాలపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ లలితకుమారి ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పరిధిలోని సూపర్వైజర్లందరూ సుమారు 50మంది వరకు నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడు రోజులపాటు అన్ని కేంద్రాలను తనిఖీ చేస్తారు. కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులు సూచించిన వివరాలన్నింటిని నమోదు సక్రమంగా చేశారా లేదా పరిశీలిస్తారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్ది సూచనలు, సలహాలు అందజేస్తారు. ఒక్కో ప్రాజెక్టులో మూడు, నాలుగు రోజుల చొప్పున జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని వందశాతం అంగన్వాడీ కేంద్రాలను నెలాఖరు వరకు తనిఖీలు చేపట్టనున్నారు.కేంద్రాలు తనిఖీ ఖేడ్ నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల సూపర్వైజర్లు తనిఖీలను ప్రారంభించారు. కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువు పరిశీలిస్తున్నారు. తాము కేంద్రాలకు వెళ్లి పర్యవేక్షిస్తున్నాం. – సుజాత, సీడీపీవో, ఐసీడీఎస్ ప్రాజెక్టు నారాయణఖేడ్ నెలాఖరు వరకు తనిఖీలు ఈ నెలాఖరు వరకు జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్లు క్రాస్ చెక్ చేస్తారు. పిల్లల బరువు, ఎత్తు నమోదు సక్రమంగా చేస్తున్నారా లేదా పరిశీలించి తగు సూచనలు సలహాలు అందజేస్తారు. ప్రత్యక్షంగా బరువు, ఎత్తు కొలిచి పరిశీలిస్తారు. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం. – లలితకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సంగారెడ్డితక్కువ బరువుతో నష్టం చిన్నారుల్లో వయస్సుకు తగ్గ బరువు, ఎదుగుదల తగ్గుదలతో తీవ్ర నష్టాలు వస్తాయి. పిల్లలకు పోషకాహారం అందుబాటులో లేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం చేసుకొనే సామర్థ్యం దెబ్బతినడం వారి పెరుగుదలను దెబ్బతీస్తూ తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గి త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతారు. మెదడు అభివృద్ధి, జ్ఞానాత్మక నైపుణ్యాలపై ప్రభావం పడుతోంది. ఇది అభ్యసన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
భద్రత.. పునరావాసం
కార్మికులకు వరం నమస్తేపథకం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అమలు గుర్తించిన కార్మికుల వివరాలు యాప్లో నమోదురామాయంపేట(మెదక్): మున్సిపాలిటీల పరిధిలో మరుగుదొడ్ల వ్యర్థాలను తొలగించే పాకీ పనివారు, సెఫ్టిక్ ట్యాంక్లు, మురుగు కాల్వలు, మ్యాన్హోల్స్ను శుభ్రపరిచే కార్మికులు, చెత్త ఏరుకునే వారి శ్రేయస్సు కోసం కేంద్రం ‘నమస్తే’అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో జాతీయ యాంత్రిక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ (నమస్తే) పథకం కింద గుర్తించిన కార్మికులను యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఆయా వృత్తుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల భద్రత, పునరావాసం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రత గౌరవంతో పాటు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకోవడం, వారికి పరికరాలు అందించడం, పునరావాసం కల్పించడం, ఆధునిక, సురక్షిత పద్ధతుల్లో వారికి శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ఈఽ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ కోవలోకి వచ్చే కార్మికులకు రక్షణ కల్పించేలా ఈ పథకం ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల పాలవుతున్నట్లు గుర్తించిన కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత మేరకు యంత్రాలను ఉపయోగించి వీరు పనిచేసేలా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు నమస్తే యాప్లో నమోదు చేస్తున్నారు.చెత్త ఏరుకునే వారు సైతం.. సాధారణంగా పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవితం వెళ్లదీస్తున్నాయి. వీరు డంప్యార్డులు, ఇతర ప్రదేశాల్లో చెత్తను సేకరించి దాన్ని అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరు సైతం తమ వివరాలు నమస్తే యాప్లో నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్లో వీరికి కేంద్రం తరపున పలు పథకాలు, పింఛన్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో 14 మంది చొప్పున మొత్తం 28 మంది కార్మికులను గుర్తించి వారి వివరాలు యాప్లో నమోదు చేశారు. నర్సాపూర్లో నలుగురిని గుర్తించారు. రామాయంపేటలో మాత్రం ఇంకా నమోదు కార్యక్రమం ప్రారంభం కాలేదు. -
క్రీడాభివృద్ధికి రూ.700 కోట్లు
హుస్నాబాద్: దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీస్ల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హుస్నాబాద్ మిని స్టేడియంను సందర్శించారు. స్ధానిక క్రీడాకారులు, విద్యార్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ..తమ ప్రభుత్వం మొదటి మంత్రివర్గ సమావేశంలోనే క్రీడా పాలసీని ప్రకటించిందని చెప్పారు. అంతర్జాతీయ స్ధాయిలో, ఒలింపిక్ గేమ్స్లో దేశం నుంచి ఒక్క బంగారు పతకాన్ని సాధించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. క్రీడల అభివృద్ధికి రూ.700 కోట్లు కేటాయించామని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో విద్యార్ధులు క్రీడల పట్ల ఆసక్తిని కనబరచడం సంతోషకర విషయమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్ష మేరకు హుస్నాబాద్లో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక సమస్యలు అధిగమించి క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో అన్ని రకాల స్పోర్ట్స్ కిట్లను అందిస్తామన్నారు. హుస్నాబాద్ క్రీడలకు పెట్టింది పేరు: పొన్నం హుస్నాబాద్ నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్ధులు, యువకులు ఉపయోగించుకోవాలన్నారు. కబడ్డీ కోర్టుకు రెండు మ్యాట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ధ చైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రతి నియోజకవర్గంలో క్రీడా సౌకర్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. అనంతరం మినీ స్టేడియంలో మంత్రులు, కలెక్టర్, ఇతర అధికారులు తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, క్రీడా ప్రాధికార సంస్ధ డైరెక్టర్ సోనీ బాలాదేవి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, తదితరులు ఉన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి హుస్నాబాద్కు స్విమ్మింగ్ పూల్ మంజూరు మంత్రి వాకిటి శ్రీహరి -
రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి
పటాన్చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పనిగంటలు పెంచుతూ తెచ్చిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. సోమవారం పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి కవ్వింపు చర్యగా పని గంటలు పెంచుతూ జీవో జారీ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చర్యతో శ్రమ దోపిడీకి చట్టబద్దత కల్పించినట్లేనని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు -
సాగుకు సింగూరు నీరు
వారం రోజుల్లో విడుదలకు ఏర్పాట్లు ● కాలువ సీసీ పనుల నిలిపివేత ● ఏడాదిగా బ్రష్ కటింగ్కే పరిమితం ● విరామంతో ఆయకట్టు రైతుల్లో వ్యతిరేకత పుల్కల్(అందోల్): రెండు పంటల విరామం అనంతరం సింగూరు కాలువల ద్వారా సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. వారంలో నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తామని రెండు పంటలకు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఎనిమిది నెలలుగా కాంట్రాక్టర్ కేవలం బ్రష్ కటింగ్ మాత్రమే చేశారు. అటు కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు నెమ్మదించడం.. ఇటు పంటలకు సాగు నీరు అందకపోవడంతో అధికారులను నాయకులు, రైతులు విమర్శించారు. దశాబ్ద కాలంగా పంట కాలువలపై ఆధారపడి సాగుచేసిన రైతులు బోరు మోటార్ల సాగుపై అంతగా ఆసక్తి చూపలేదు. స్థానిక ఎన్నికలపై ప్రభావం సింగూరు సాగునీటి కాలువలకు మరమ్మతుల పేరుతో ఏడాదిగా క్రాఫ్ హాలీడే ప్రకటించడంతో మూడు మండలాలలోని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కాలువ మరమ్మతుల్లో కాలయాపన.. ఇటు సాగునీరు అందించకపోవడంతో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎన్నికలపై ప్రభావం పడుతుందని గ్రహించిన అధికార పార్టీ నాయకులు వానాకాలం కాలువ మరమ్మతు పనులు ఆపి సాగు నీరు అందించాలని మంత్రి దామోదరను కోరారు. దీంతో మంత్రి ప్రాజెక్టు అధికారులు, స్థానిక నాయకులతో సమీక్షించి ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు. నాయకుల సూచనల మేరకు వారం రోజుల్లో ఆయకట్టుకు నీరివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పంటలకు మొండి చేయి మంత్రి దామోదర ప్రత్యేక చొరవతో కాలువలకు సీసీ పనుల చేయడానికి రూ. 168.30 కోట్ల నిధులను మంజూరు చేశారు. రూ. 138 కోట్లతో సీవెట్ అనే సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని పనులు ప్రారంభించింది. ఎనిమిది నెలల నుంచి రూ. కోటి వరకు ఖర్చు చేసి కాలువలకు కేవలం బ్రష్ కటింగ్ మాత్రమే పూర్తి చేశారు. సింగూరు ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్న కాలువలకు సీసీ మరమ్మతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేశారని రైతులు విమర్శించారు. రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వకపోవడం, సాగుకు నీరు ఇవ్వకపోవడంతో ఆయకట్టు రైతులు ప్రభుత్వ పని తీరును విమర్శించారు. ఓ దశలో గ్రామ సభలకు వచ్చిన ప్రజాప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
క్రీడలకు మరింత ప్రోత్సాహం
క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య సిద్దిపేటజోన్: సిద్దిపేట క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకట్ నర్సయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఫుట్బాల్ మైదానంలో జిల్లా జూనియర్ బాలికల జట్టు సెలక్షన్స్ ప్రక్రియను జిల్లా క్రీడా సమాఖ్య కన్వీనర్ సాయిరాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా జూనియర్ బాలికల జట్టును ఎంపిక చేసినట్లు సెలక్షన్స్ కమిటీ సభ్యులు అక్బర్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా 20మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు ఈనెల 8నుంచి ఆదిలాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సిద్దిపేట పట్టణానికి చెందిన వడ్లకొండ చైతన్యశ్రీ జాతీయ స్థాయి అండర్ –17 ఫుట్బాల్ ప్రాబబుల్స్కు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రటరీ సాజిద్ పాల్గొన్నారు. -
విద్యార్థులతోనే పాఠ్యాంశాలు చదివించాలి
మునిపల్లి(అందోల్): విద్యార్థినులతో ఒకటికి రెండు సార్లు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను చదివించాలని జీసీడీఓ (గల్స్ చైల్డ్ డెవలప్ మెంట్) అధికారి సుప్రియ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని తాటిపల్లి కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకు ముందు రికార్డులు, వంట గదులు, తాగునీటి సౌకర్యం, నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేరా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువులో ఒకరి కంటే ఒకరు పోటీపడి చదవాలన్నారు. అప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారని తెలిపారు. ప్రహరీగోడ, అదనపు తరగతి గదులు, ఇంటర్మీయెట్కు రెగ్యూలర్ అధ్యాపకులను ఏర్పాటు చేయడానికి జిల్లా అధికారులు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. -
మంచి ఫలితాలు సాధించేందుకే సదస్సులు
ఇంపాక్ట్ రీజినల్ అధ్యక్షుడు రాజేశ్వర్ అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఇంపాక్ట్ సంస్థ సంగారెడ్డి జిల్లా రీజినల్ అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం అల్లాదుర్గం కేజీబీవీ, ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపిక, పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ రీజినల్ కార్యదర్శి నర్సింహరెడ్డి, కోశాధికారి లావణ్య, సర్వీస్ కోఆర్డినేటర్ రమేశ్, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, ఎస్ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేట నిషేధం
జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కార్ప్ జాతికి చెందిన చేపలు పిల్లలను జూలై, ఆగస్టు నెలల్లో ఉత్పత్తి చేస్తాయని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, రంగనాయకసాగర్, అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టులలో లైసెన్స్ పొందిన మత్స్యకారులు రెండు నెలలు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా చేపల వేటకు వెళితే మత్స్యకారుల లైసెన్స్లు రద్దు చేయబడుతాయని తెలిపారు.వ్యక్తి అదృశ్యం చేగుంట(తూప్రాన్): వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన షౌకత్(44) చేగుంటలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతడి భార్య రుబీనాబేగం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యావరణహిత ఇటుకల తయారీ
ప్రదర్శించిన విద్యార్థులుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ పర్యవేక్షణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణహిత ఇటుక (ఎకో బ్రిక్స్)లను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రామకృష్ణ మాట్లాడుతూ..ప్రపంచాన్ని పీడిస్తు న్న పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతోపాటు ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్, కంపోస్ట్ ఎరువుపై ప్రజల్లో చైతన్యం కల్పించటమే ఈ ప్రదర్శన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవనీత, సునీత పాల్గొన్నారు. -
కంటైనర్లలో అంగన్వాడీ కేంద్రాలు
● నిర్మాణం, డిజైన్ అంశాలపై అధ్యయనం ● తక్కువ వ్యయం ఎక్కువ సౌకర్యాలుసంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించనున్నారు. అయితే కొన్నిచోట్ల ఈ భవనాలకు బదులుగా కంటైనర్లతో డిజైన్చేసి అందులో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కంటైనర్లతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అవసరమైన అన్ని హంగులను అందులో కల్పించనున్నారు. కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల కంటైనర్ కేంద్రాలను పరిశీలించనున్నారు. వ్యయం తక్కువ ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కొన్నిచోట్ల సరైన వసతులు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. కంటైనర్లలో సోలార్ ప్లేట్లు బ్యాటరీ బ్యాకప్తో నూతన కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు. ఈ విధంగా చేస్తే తక్కువ వ్యయంతో అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాచోట్ల కార్యాలయాలు, కౌంటర్లుగా కంటైనర్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. వందరోజుల ప్రణాళిక జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో 100 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నారు. దీంతో కేంద్రాలలో పౌష్టికాహారం సరఫరా, పర్యవేక్షణ నిర్వహణ మరింత బలోపేతం కానుంది. సరైన వసతులు లేని కేంద్రాల్లో సమస్యలు పరిష్కారం కానున్నాయి. పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని మరింత మెరుగుపరచనున్నారు. ఇప్పటికే బాలామృతం, పాలు, గుడ్డు తదితర వస్తువులు అందిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్న క్రమంలో పౌష్టికాహార నిపుణులతో చర్చించి, మహిళా సంఘాల సభ్యులతో ఇక్కడ కూడా పిల్లలకు అందించనున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సేవలను కూడా ఇందుకోసం వినియోగించుకోనున్నారు. గర్భిణులు, బాలింతలు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని బస్తీలు, పలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీకేంద్రాలు ఏర్పాటు చేసి, వాహనాల ద్వారా పౌష్టికాహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
శవమైనా దొరుకుతుందో లేదో..!
మనిషి ఎలాగూ ప్రాణాలతో దక్కలేదు ఆఖరి చూపుకోసం కనీసం తమవారి మృతదేహమైనా దొరుకుంతుందో లేదోనన్నఆందోళన సిగాచీ ఘటన బాధిత కుటుంబీకుల్లో వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగి నాలుగు రోజులవుతున్నా బాధిత కుటుంబాల్లో ఆవేదన అణుమాత్రం తగ్గలేదు. తమ వారి మృతదేహాలను ఇస్తే తీసుకెళ్లేందుకు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఇక ఆచూకీ తెలియని వారికోసం శవాగారం వద్ద నిద్రాహారాలు మాని ఆతృతగా పడిగాపులు కాస్తున్నారు. మార్చురీ వద్ద ఎవరిని కదిలించినా మనిషిని కోల్పోయామన్న పుట్టెడు దుఃఖం వారిని నిలువెల్లాకంపించివేస్తోంది. గురువారం పటాన్ చెరు మార్చురీ వద్ద కనిపించిన దృశ్యాలు.పటాన్చెరు/రామచంద్రాపురం(పటాన్చెరు)/పటాన్చెరు టౌన్: ఓవైపు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం మరోవైపు తిండీతిప్పలు లేకుండా రోదనలతో మనోవేదనతో మార్చురీ వద్ద వారు ఎదురుచూస్తూ కనిపించడం అందరినీ కలచివేస్తోంది. డీఎన్ఏ పరీక్షలు తర్వాతనే మృతదేహాలను తీసుకువెళ్లే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్షలు ఇచ్చి డీఎన్ఏ ఫలితాల కోసం కుటుంబీకులు ఇటు మార్చురీ వద్ద ఆటో హెల్త్ సెంటర్ వద్ద ఎదురుచూస్తున్నారు. ఎవరైనా వారిని పలకరిస్తే కన్నీటి పర్యంతమై గద్గద స్వరంతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కనీసం తమవారి మృతదేహాలైనా దొరుకుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తుస్తున్నారు.అల్లుడి మృతదేహం కోసం మామఉత్తరప్రదేశ్ చెందిన రాంజీ అవన్ తన అల్లుడు విజయ్కుమార్ కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. తన కూతుర్ని రాంజీకి ఇచ్చి పెళ్లి చేశానని ఆయన సిగాచీలో పనిచేసేవాడని వివరించారు. అల్లుడి మృతదేహం లభిస్తే తీసుకువెళ్లాలని ఎదురుచూస్తున్నానని వివరించారు. అల్లుడు మృతదేహం కోసం తన ఇంటి వద్ద బంధువులందరూ ఎదురుచూస్తున్నారని వాపోయారు.లభించని సీనియర్ మేనేజర్ మృతదేహంసిగాచీ పరిశ్రమల సీనియర్ మేనేజర్గా పనిచేసిన రవి మృతదేహం ఇంతవరకు లభించలేదు. మృతదేహం కోసం బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇస్నాపూర్లో స్థిరపడిన రవి కుటుంబం దుర్ఘటన జరిగినప్పట్నుంచీ ప్రతీరోజు మార్చురీ వద్దకు వచ్చి ఎదురుచూస్తున్నారు. రవి గతంలో ఈ పరిశ్రమలో పనిచేసి మానేసి మూడు నెలల క్రితమే చేరాడు.డీఎన్ఏ ఫలితం కోసం ఎదురుచూపులుసిగాచీలో పని చేసిన కార్మికుడు చోటేలాల్ కోల్ మృతదేహం కోసం ఆయన భార్య సంజు దేవి ఎదురుచూస్తున్నారు. తన భర్త కోసం ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. 90% కాలిపోయిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వీడియోను చూసి అక్కడికి వెళ్లి చూసింది. కానీ, ఆమె ఆశ నిరాశే అయింది. ఆ వ్యక్తి ఆమె భర్త కాదని పోలీసులకు చెప్పింది. మార్చురీ వద్ద డీఎన్ఏ పరీక్షలు చేయించుకుని ఫలితాల కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తోంది.తనయుడి కోసం తల కొట్టుకుని..కాళ్లు మొక్కుతా నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని తండ్రి రాందాస్ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమ ఎదుట తన తలను బండకు బాదుకున్నాడు. దీంతో వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స చేశారు. తన కుమారుడి పేరు జస్టిన్ అని బండ్లగూడలో ఉంటామని తన కొడుకు సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చాడని చెప్పాడు. పరిశ్రమలో ప్రమాదం జరిగిన రోజు నుంచి వెతుకుతున్నా కొడుకు ఆచూకీ మాత్రం దొరకడం లేదన్నారు. అధికారులు, నాయకులు తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. -
అదనపు పీపీగా చంద్రశేఖర్ పటేల్
నారాయణఖేడ్: సంగారెడ్డి సివిల్ జడ్జీ– సహాయ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కంగ్టి మండలం సిద్దంగిర్గా గ్రామానికి చెందిన న్యాయవాది చంద్రశేఖర్ పటేల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ పటేల్ జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ను ఆయన స్వగృహంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి మిఠాయి తినిపించారు. ప్రతిగా ఆయనను ఎంపీ సన్మానించి న్యాయవ్యవస్థలో న్యాయబద్ధత, ప్రజాసేవ ధ్యేయంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యులు రషీద్, ఖేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్అలీ, సిర్గాపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్చారి, నాయకులు కల్లయ్యస్వామి, శుక్లవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్ వేతనం చెల్లించాలివైద్య ఆరోగ్య శాఖ ఏఓకు వినతి సంగారెడ్డి: జిల్లాలో ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తోన్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు విడుదల చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సీఐటీయూ నాయకులు స్థానిక డీఎంఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో శ్రీవాణికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యాదగిరి మాట్లాడుతూ...ఎన్హెచ్ఎం పరిధిలో పని చేస్తున్న అర్బన్హెల్త్, ఏఎన్ఎం, స్టాఫ్నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులందరికీ 2 నెలల వేతనం పీఆర్సీ, ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రాజు, కోశాధికారి ఇమ్రాన్, ఉపాధ్యక్షుడు రాము, నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ గ్యారేజ్ సిబ్బందికి శిక్షణజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఆర్టీసీడిపోలో గ్యారేజ్ సిబ్బందికి గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. డిపో మేనేజర్ టి.స్వామి సిబ్బంది పలు సూచనలు సలహాలు అందించారు. మెరుగైన నిర్వహణ పద్ధతులు, సురక్షిత డ్రైవింగ్ కోసం అవసరమైన యాంత్రిక అవగాహన, వాటి నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వామి మాట్లాడుతూ...శిక్షణ తరగతులు నైపుణ్యాలను పెంచేందుకు, సిబ్బంది పనితీరు మెరుగుపరిచేందుకు సహాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అనుమానాలను ఆయన నివృతి చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు జగన్నాథ రథయాత్రసదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇస్కాన్ ప్రతినిధులు శ్రీరామదాసు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మధ్యాహ్నం రెండు గంటలకు దుర్గమ్మ మందిరం నుంచి బయల్దేరి శాస్త్రిరోడ్, బస్టాండ్, సుభాష్రోడ్, గాంధీచౌక్ మీదుగా సాయంత్రం 6 గంటలకు బసవసేవాసదన్ చేరుతుందని తెలిపారు. భక్తులు జగన్నా థ రథాన్ని లాగి దర్శించుకోవాలని కోరారు. రాత్రి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
శుక్రవారం
4-7-2025కార్మికుల ఆస్పత్రికి సుస్తీ డిస్పెన్సరీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. – 4లోపగలు కూలీ.. రాత్రి చోరీ చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సదానందం వెల్లడించారు. – 4లోSimultaneously Printed at Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal -
మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్
శ్లాట్ బుకింగ్తో సర్టిఫికెట్లు పొందే సదుపాయం● పారదర్శకంగా, వేగంగా సేవలు ● ఉమ్మడి జిల్లాలో 492 మీ సేవ కేంద్రాల్లో సదుపాయం నారాయణఖేడ్: పాలనను ప్రజలకు చేరువ చేయడంతోపాటుగా పలు పథకాల అమలు తీరును మరింత పారదర్శకంగా, సులభతరంగా, వేగంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు తమ పనులకోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవడం, ఇబ్బందులు పడటం లాంటి పరిస్థితులకు చరమగీతం పాడనుంది. అందులోభాగంగా మీసేవ కేంద్రాల్లో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 12 రకాల నూతన సేవలు మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి రాగా తాజాగా వివాహ రిజిస్ట్రేషన్ (మ్యారేజ్ రిజిస్ట్రేషన్), భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్స్ను పొందేందుకు అవకాశం కల్పించింది. వీటికోసం శ్లాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 492 మీసేవ కేంద్రాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 492 మీసేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 174, సిద్దిపేటలో 236, మెదక్లో 82 కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో మున్సిపాలిటీ పరిధిలోని ఒక మీసేవ కేంద్రం ద్వారా నెలకు సుమారు వెయ్యిమంది, గ్రామీణ ప్రాంతాల్లో 200 నుంచి 300 మంది వరకు సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకాలను ప్రవేశపెట్టిన సందర్భాల్లో రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డులు వంటి సదుపాయాలు కల్పిస్తే ప్రజలకు అందే సేవల సంఖ్య మరింతగా పెరుగుతుంది. వివాహ రిజిస్ట్రేషన్ ఇలా కొత్తగా మీసేవల్లో అమలు చేస్తున్న మ్యారేజ్ సర్టిఫికెట్ జారీకి శ్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారు. దరఖాస్తుదారులు పెళ్లి ఫొటోలు, చిరునామా రుజువు, వయస్సు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆమోదించిన అనంతరం సర్టిఫికెట్ను ప్రత్యక్షంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం జారీ చేస్తుంది. మార్కెట్ వాల్యూసేవలు కూడా మీసేవ కేంద్రం లేదా ఆన్లైన్లో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించాలి. దీంతో భూమికి సంబంధించి తాజా మార్కెట్ వాల్యూ పొందవచ్చు.మీసేవ ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ సేవలు ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన వివాహ సర్టిఫికెట్, మార్కెట్ విలువ సర్టిఫికెట్లను శ్లాట్ బుకింగ్ సేవలను మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలు వినియోగించుకోవచ్చు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజల నుంచి అధిక రుసుము వసూలు చేయకుండా కేంద్రాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించాలి. అధిక వసూళ్లు లేదా ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం. – ఉదయ్కుమార్, ఈ– జిల్లా మేనేజర్, మీసేవ, సంగారెడ్డి కొత్తగా 12 రకాల సేవలు ఇటీవల ప్రభుత్వం మీసేవ ద్వారా కొత్తగా 12 రకాల సేవలను అదనంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తు, మైనార్టీ సర్టిఫికెట్స్, ఎడ్యుకేషన్ గ్యాప్ సర్టిఫికెట్స్తోపాటు కొత్తగా వివాహ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలు తదితరాలను అదనంగా అందుబాటులోకి తీసుకు వచ్చారు. మీసేవ ద్వారా ఆర్టీఏ, పాన్, ఇసుక బుకింగ్ వంటి సేవలు కూడా అందుతున్నాయి. భూమి, అపార్ట్మెంట్ విలువల అంచనాలను 24గంటల్లో ఆమోదించేలా చర్యలు చేపడుతున్నారు. ఇకపై టీ–ఫైబర్, అదనపు కియాస్క్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల వెల్లడించారు. -
ఉద్యాన పంటలు సాగు చేయాలి
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావుజహీరాబాద్: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసుకుని లబ్ధి పొందాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు సూచించారు. కోహీర్ మండలంలోని పిచరాగడి గ్రామంలో ఉద్యాన పంటల సాగుపై గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. అరటి, బొప్పాయి, అల్లం, ఆయిల్పామ్ను సాగు చేసుకున్న వారిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ అందిస్తోందన్నారు. డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, శైలజ, దక్షిణ భారత నెటాఫిమ్ ఆగ్రోనమిస్ట్ ఎ.సుబ్బారావు, ఉద్యాన అధికారి సునీత, వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్లు ఉద్యాన పంటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. -
డీఎన్ఏ ద్వారా 11 మంది గుర్తింపు
ఒకరిని బిహార్కు చెందిన కుటుంబ సభ్యులకు అప్పగింత పటాన్చెరు టౌన్: సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో మరణించి గుర్తుపట్టలేని స్థితిలో పటాన్చెరు మార్చురీలో ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షల ద్వారా 11 మందిని గుర్తించారు. డీఎన్ఏ పరీక్ష నివేదికలు వచ్చిన 11 మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. అందులో బిహార్కు చెందిన పూజా కుమారికి తన భర్త నాగ పాశ్వాన్ (29) మృతదేహాన్ని గుర్తించి అప్పగించారు. అదేవిధంగా తక్షణ సహాయం కింద రూ.లక్ష అందజేశారు. నాగపాశ్వాన్ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా బిహార్కు పంపించే ఏర్పాట్లు చేశారు. -
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రకృతి వ్యవసాయంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎన్ఏఏఆర్ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.బాలకృష్ణ తెలిపారు. గురువారం మండలంలోని డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఎస్సీ రైతులకు ప్రకృతి, సేంద్రియ వ్యసాయంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఏఏఆర్ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకం పెరిగిందని, దీంతో భూసారం తగ్గుతుందని తెలిపారు. రైతులు తప్పనిసరిగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. పశువులు, కోళ్లు ఎరువుతోపాటు జీవామృతం, బీజామృతం ఎరువులుగా వాడాలన్నారు. కార్యక్రమంలో కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ, నల్కర్ కేవీకే శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, శ్రీకాంత్, ఉదయ్కుమార్, భార్గవితోపాటు రాయిలాపూర్, తునికి, పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 40మంది ఎస్సీ రైతులు పాల్గొన్నారు. రైతుల శిక్షణలో సైంటిస్ట్ డాక్టర్ ఎం.బాలకృష్ణ -
రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం
కంది మండలం చేర్యాల గేటు వద్ద ఘటనకంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ రావు(54) సంగారెడ్డి పట్టణంలోని చాణిక్యపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. మూడు రోజులుగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విధులు ముగించుకొని బుధవారం రాత్రి సంగారెడ్డికి కారులో బయలు దేరాడు. ఈ క్రమంలో కంది మండలం చేర్యాల గేటు వద్ద జాతీయ రహదారిపై రాజేశ్వర్ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఎస్సై కుటుంబంలో తీవ్ర విషాదం ఎస్సై మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతునికి భార్య గాయత్రి తోపాటు ఓ కుమారుడు, కుమార్తె ఉంది. ఆరు నెలల క్రితం ఎస్సైగా ప్రమోషన్ పొందిన రాజేశ్వర్ ఫిలింనగర్కు వారం రోజుల క్రితమే బదిలీపై వెళ్లారు. కొత్త పోస్టింగ్లో చేరిన కొన్ని రోజులకే ఎస్సై మృతి చెందడం తోటి సిబ్బందిని కలచివేసింది. ఎస్సై అంత్యక్రియల్లో అదనపు ఎస్పీ సంజీవ రావు, డీఎస్పీ సత్తయ్య గౌడ్, సీఐలు క్రాంతి కుమార్, రమేష్, సంతోష్తోపాటు రూరల్ ఎస్సై రవీందర్ పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు సహకరించాలి
● డీఎస్పీ నరేందర్గౌడ్ చిరుత పులి అలజడి కల్హేర్(నారాయణఖేడ్): మండలంలో చిరుత పులి సంచారం కలంకలం రేపింది. గురువారం కృష్ణాపూర్ శివారులో పాదముద్రలు వెలుగుచూశాయి. కొంత కాలంగా కృష్ణాపూర్, ఖానాపూర్(కె), బీబీపేట్, రాపర్తి, నాగధర్, కడ్పల్, తదితర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తోంది. నల్లవాగు కాల్వ పక్కన పాదముద్రలు కనిపించడంతో కాంట్రాక్టర్ నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఈఈ పవన్కుమార్, ఇరిగేషన్ అధికారులు పాదముద్రలు పరిశీలించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత సంచారంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. మొబైల్ క్యాంపు ఏర్పాటు చేయాలి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న బీడీ మహిళా కార్మికుల కోసం మొబైల్ క్యాంపులను యథావిధిగా కొనసాగించాలి. అవసరమైన అంబులెన్న్స్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలి. –మల్లేశం( హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు) తూప్రాన్: నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎస్పీ నరేందర్గౌడ్ పేర్కొన్నారు. గురువారం పోలీస్ డివిజన్ పరిధిలోని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్ నిర్వాహకులతో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దాబాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. రాత్రి 12 గంటల లోపు హోటళ్లు, దాబాలు మూసివేయాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దాబాల్లో మద్యం సిట్టింగ్లకు అనుమతి లేదని, నిర్వాహకులతో పాటు తాగిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ సీఐలు రంగాకృష్ణ, జాన్రెడ్డి, వెంకటరాజాగౌడ్, ఎస్ఐలు శివానందం, లింగం, చైతన్యరెడ్డి పాల్గొన్నారు. -
కమలాపూర్లో వ్యక్తి హత్య
పెద్దశంకరంపేట(మెదక్): వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని కమలాపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తోట సుధాకర్(43) ఆటో నడుపుకుంటూ గ్రామంలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతడికి గతంలో వివాహం కాగా భార్య చనిపోయింది. వీరికి దివ్యాంగుడైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం రాత్రి సుధాకర్ ఇంటిముందు నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు తలపై పదునైన ఆయుధంతో దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. ఘటనాస్థలాన్ని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ.రేణుకారెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్రెడ్డి, శంకర్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి తోట మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తలపై పదునైన ఆయుధంతో దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రసన్నకుమార్ -
కార్మికుల ఆస్పత్రికి సుస్తీ
● సమస్యల సుడిగుండంలో డిస్పెన్సరీలు ● మందుల జాడ కరువు ● బీడీ కార్మికులకు అందని వైద్యం ● స్పందించని అధికార యంత్రాంగం సిద్దిపేటజోన్: బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం పరిశ్రమలపై ఆధారపడి ఉన్న కార్మికుల సంఖ్య 60వేలు కాగా, అనధికారికంగా వీరికి మూడింతలున్నట్లు వినికిడి. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల కోసం అనారోగ్య సమస్యలు వస్తే వైద్యం కోసం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆస్పత్రులు(డిస్పెన్సరీ)లు ఏర్పాటు చేసింది. అరకొరగా మందులు, సిబ్బంది ఖాళీలు, మూలనపడ్డ అంబులెన్స్, గ్రామాల్లో కానరాని వైద్య శిబిరాలు వెరసి కార్మిక వైద్యం గాడితప్పుతోంది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నియోజకవర్గ పరిధిలోని అత్యధిక గ్రామాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఆయా ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలకు సంబంధించిన కార్ఖానాల్లో జిల్లాలో లక్ష పైచిలుకు మహిళా బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం బీడీ చుట్టే క్రమంలో తంబాకు ప్రభావం వల్ల మహిళలు అనారోగ్యం బారినపడే ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు క్షయ, దగ్గు దమ్ము, ఆస్తమా లాంటి వాటిన పడి బాధపడుతున్నారు. వీరికి ఉచితంగా వైద్యం అందించే క్రమంలో సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. మందులు, సిబ్బంది కొరత డిస్పెన్సరీలో అవసరమైన మందులు ఉండటం లేదు. జ్వరం, కీళ్ల నొప్పులు, దగ్గు, లాంటి రోగాల మందులు మాత్రమే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు మందులు ఇచ్చే ఫార్మాసిస్ట్ పోస్టుతోపాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏడు పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో ఇక్కడి వైద్యురాలిపై అదనపు పనిభారం పడుతోంది. దుబ్బాకలోనూ ఇదే పరిస్థితి. ఉన్న వైద్యుడు రెండు రోజుల పాటు డిప్యుటేషన్పై ముస్తాబాద్ వెళ్లడంతో నాలుగు రోజులే అందుబాటులో ఉంటున్నాడు. ఉన్న ఒక ఫార్మాసిస్ట్ సిద్దిపేట నుంచి డిప్యుటేషన్ పైవచ్చి పనిచేస్తున్నాడు. పదవీ విరమణ జరుగుతున్న నియామకం లేకపోవడంతో కార్మిక ఆస్పత్రుల్లో ఖాళీల ప్రభావం వైద్యంపై పడుతోంది. పత్తా లేని వైద్య శిబిరాలు బీడీ కార్మికులకు మొబైల్ వైద్య సేవలు పత్తా లేకుండా పోయాయి. సిద్దిపేట, దుబ్బాక డిస్పెన్సరీ పరిధిలోని గ్రామాల్లో షెడ్యూల్ మేరకు అంబులెనన్స్ ద్వారా వైద్య సేవలు అందించాలి. కొన్నేళ్లుగా వైద్య శిబిరాల జాడ లేదు. డ్రైవర్ పోస్టు ఖాళీగా ఉండటంతో సిద్దిపేట ఆస్పత్రిలో అంబులెన్న్స్ మూలన పడింది. ఆయా డిస్పెన్సరీల్లో నెలకొన్న సమస్యలపై డాక్టర్ లకీ్ష్మ్ప్రసన్న వివరణ కోరగా.. సిద్దిపేట ఆస్పత్రిలోని సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిక అందజేశానని తెలిపారు. నియామకాలు లేకపోవడంతో ఖాళీల సమస్య ఉందన్నారు. పురాతన వాహనం, డ్రైవర్ పోస్ట్ ఖాళీ వల్ల మొబైల్ క్యాంపు ఏర్పాటు సమస్యగా మారిందన్నారు. సిద్దిపేట పట్టణంలో డిస్పెన్సరీ, ఆస్పత్రిలో ఉన్న మందులు -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నగదు, నగలు అపహరణతూప్రాన్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం... పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా నివాసం ఉంటున్న కిచెన్గారి కృష్ణ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.లక్ష నగదు, అర తులం బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్టీంతో వేలిముద్రలు సేకరించారు. కాగా బాధితులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
చీట్ ఫండ్
డిపాజిట్ చేసి మోసపోయిన బాధితుడుమెదక్జోన్: చిట్ఫండ్ కంపెనీల్లో సామాన్యులు డిపాజిట్లు చేసి మోసాలకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా సమీపంలో కొందరు ఆదర్శ్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో చిట్ఫండ్ కంపెనీ పెట్టారు. అయితే హవేళిఘనాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన కటికె షబ్బీర్ 2019లో తన చెల్లెలు నశ్రిన్ పేరుపై ఈ కంపెనీలో రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. 10 సంవత్సరాలు అంటే 2029 నాటికి రూ.1,85,361 అవుతుందని నిర్వాహకులు చెప్పడంతో నమ్మాడు. కానీ 2020లో కంపెనీని మూసేసి ఉడాయించారని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. చిట్ఫండ్ మోసాలపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : తపస్ వెల్దుర్తి(తూప్రాన్): జీఓ 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని తపస్ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుబాషి భాస్కర్, జిల్లా బాధ్యులు రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సంఘం సభ్యత్వ నమోదు చేపట్టి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆర్థిక భారం లేని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోచయ్య, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల రిమాండ్ నంగునూరు(సిద్దిపేట): పేషీలకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గురువారం కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఎస్ఐ అసీఫ్ వివరాల మేరకు... నంగునూరు మండలం ఘణపూర్కు చెందిన బోడ తిరుపతిరెడ్డిపై 2019లో, అలాగే మద్దూర్ మండలం బెక్కల్కు చెందిన ఆరే ఉప్పలయ్యపై రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులు కోర్టు పేషీలకు హాజరు కాకుండా తిరుగుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిని కరీంనగర్లోని జిల్లా జైలుకు తరలించారు. నూతన టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాలి గజ్వేల్రూరల్: ప్రభుత్వం టూ వీలర్ మెకానిక్లకు నూతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని ఆ సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఓ గార్డెన్లో గజ్వేల్ టూ వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి టూ వీలర్స్ అసోసియేషన్ పతాకం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్కుమార్, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్రెడ్డి, గజ్వేల్ అధ్యక్షుడు అనిల్, మాజీ అధ్యక్షులు ధన్రాజ్ సింగ్, వెంకటేష్, ముఖ్య సలహాదారు నర్సింలు, సభ్యులు పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్కు స్పల్ప గాయాలు అల్లాదుర్గం(మెదక్): సబ్ రిజిస్ట్రార్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. వివరాలు... హైదరాబాద్ మహిదీపట్నంకు చెందిన మహ్మద్ నిజామోద్దిన్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి కారులో వెళ్తుండగా ముస్లాపూర్ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆయనకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. -
ట్రాన్స్ఫార్మర్ జెంపర్ సరిచేస్తుండగా..
విద్యుదాఘాతంతో రైతు మృతికౌడిపల్లి(నర్సాపూర్): విద్యుదాఘాదంతో రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని భుజిరంపేట పీర్యతండా పంచాయతీ మన్యతండాలో గు రువారం జరిగింది. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం... మన్యతండాకు చెందిన రైతు పాత్లోత్ బన్సీ (బన్సీలాల్)(38) గురువారం ఉదయం కూకుట్లపల్లి శివారులోని తన పొలంలో వరి నారుకు మందు పిచికారీ చేస్తుండగా నీళ్లు లేకపోవడంతో బోరు మోటార్ను ఆన్ చేశాడు. అది నడవకపోడంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద జెంపర్ సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయా డు. గమనించిన పక్క పొలంలోని రైతు కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు వచ్చి చూడగా బన్సీలాల్ అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు ఉన్నారు. -
బయో పాండ్లో చేపపిల్లల విడుదల
సిద్దిపేట జోన్ : పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జంతుశాస్త్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బయో పాండ్లో 1500 చేపపిల్లలు వదిలినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సునీత తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న ఫిషరీస్, జంతుశాస్త్ర విద్యార్థులకు చిన్ననీటి వనరులలో చేపల పెంపకంపై అవగాహన కల్పిస్తామన్నారు. చేపలకు సరైన ఆహారం అందిస్తూ, వ్యాధుల నుంచి రక్షించడానికి అవసరమైన పద్ధతులను తెలుపుతూ అధిక రాబడి వచ్చే విధంగా అన్ని విషయాలను విద్యార్థులకు తెలుపుతామని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు డా.ఎం.మధుసూదన్రెడ్డి, డా. జగదీశ్వరాచారి, రామ్కుమార్, చక్రవర్తి, వెంకటేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పగలు కూలీ.. రాత్రి చోరీ
● నలుగురు నిందితుల అరెస్టు ● పదిరోజుల క్రితం మండల కేంద్రంలో చోరీ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ కొమురవెల్లి(సిద్దిపేట): చోరీ కేసులో నలుగురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కొమురవెల్లి పోలీస్స్టేషన్లో ఎస్ఐ రాజు, చేర్యాల సీఐ శ్రీనుతో కలిసి హుస్నాబాద్ ఏసీపీ సదానందం వివరాలు వెల్లడించారు. గత నెల 24న మండల కేంద్రంలో పోతుగంటి కొమురెల్లి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బీరువా పగులగొట్టి 4తులాల బంగారు, 22 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా కొమురవెల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బిజిలి సురేష్, అంగడి జంపయ్య, దాసరి అశోక్, ముదగాని సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి 9 తులాల బంగారం, 22తులాల వెండి ఆభరణాలు, సెల్ఫోన్, మూడు ద్విచక్రవాహనాలు, ఒక ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న అనరెడ్డి రవి, కూజ నర్నయ్య పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని తెలిపారు. ఏడాదిగా ఈ ముఠా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ నేరెడ్మెట్ ప్రాంతంలోని వినాయకనగర్లో ఉంటూ ఉదయం కూలీ పని చేస్తూ రాత్రి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 18 దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులపై పలు కేసులున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాజు, కానిస్టేబుల్ రమేష్ అభినందించారు. -
మార్చురీ వద్ద పడిగాపులు
విలపిస్తున్న బాధిత కుటుంబాలురామచంద్రాపురం/పటాన్చెరు టౌన్: సిగాచీ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలు తమ వారి మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు. పటాన్చెరు ఆస్పత్రి ప్రాంగణంలో మార్చురీ వద్ద బాధిత కుటుంబీకులు బుధవారం ఎదురు చూస్తూ కనిపించారు. మృతదేహాలను వెతుకుతూ కన్నీటి పర్యంతమయ్యారు. సర్పంచ్ సాయంతో విమానంలో వచ్చి... జుమ్రత్మియా జార్ఖండ్ నుంచి పటాన్ చెరు ఆస్పత్రికి వచ్చారు. ఆయన కుమారుడు ఇటీవల పరిశ్రమలో కార్మికునిగా చేరాడని ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు. అయితే తన కుమారుని భౌతికకాయం మార్చురీలో ఉందంటే వచ్చినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ సహకారంతో మంగళవారం పటాన్చెరుకు విమానంలో చేరుకున్నాడు. బుధవారం సాయంత్రం వరకు కూడా మృతదేహం ఆయనకు ఇవ్వలేదు. ఈ సందర్భంగా జుమ్రత్ మియా అధికారులతో మాట్లాడుతూ తన కుమారుడు భౌతికకాయాన్ని ఇప్పించాలని అధికారులు వేడుకున్నారు. పనిచేసి నెల రోజులే.. శివ్ జీ అనే కార్మికుడు బీహార్ నుంచి వచ్చి ఈ పరిశ్రమలో నెల రోజులు కూడా పనిచేయలేదు. అంతలోనే ప్రమాదం జరిగి అనంత లోకాలకు వెళ్లాడనీ శివ్జీ తండ్రి శంభు బిందు రోదిస్తూ చెప్పాడు. భౌతిక కాయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. తరలి వచ్చిన బెంగాల్ గ్రామస్తులు అసీం తుండు అనే కార్మికుడి జాడ కోసం హరిరాజ్ పూర్ గ్రామానికి చెందిన వారు కదిలి వచ్చారు. ఆ కార్మికుడి కోసం తాము రెండు రోజులుగా వెతుకుతున్నామని చెప్పారు. అధికారులు తమకు అసీం భౌతికకాయాన్ని ఇప్పటివరకు చూపలేదని వాపోయారు. మిన్నంటిన రోదనలు పటాన్ చెరు మార్చురీ వద్ద తమ వారి భౌతిక కాయాలను తీసుకెళ్తూ కుటుంబీకులు బోరును విలపించారు. పరిశ్రమలో డీజీఎంగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులు భౌతిక కాయాన్ని చూసి శోక సంద్రంలో మునిగిపోయారు. అధికారులు భౌతికకాయాలను గుర్తించిన వారికి తక్షణం ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు ఇచ్చి వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపిక
న్యాల్కల్(జహీరాబాద్): జాతీయ ఉత్తమ సేవా అవార్డుకు మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో గల చర్చి పాస్టర్ ప్రశాంత్ బెంజిమెన్ ఎంపికయ్యాడు. బుధవారం ఈ మేరకు హైదరాబాద్లో అవార్డు సెలెక్షన్ కమిటీ జాతీయ చైర్మన్ నల్లా రాధాకృష్ణ ఎంపిక పత్రాన్ని ఆయనకు అందజేశారు. సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో సేవారత్న అవార్డును అందజేయనున్నారు. నిస్వార్థంగా స్వచ్ఛంద సేవ, సంఘ సేవలను కుల, మతాలకు అతీతంగా అందిస్తున్నందుకు గాను ఎంపిక చేసినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారు. -
మహిళ అదృశ్యం
సంగారెడ్డి క్రైమ్: మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... అందోల్ మండలం మాసన్పల్లి గ్రామానికి చెందిన రోయ్యల అనసూజ(50) అనారోగ్యం నిమిత్తం ఈనెల 1న ఉదయం పట్టణంలోని బాలాజీనగర్లో నివాసించే తన కుతురు నాగలక్ష్మి ఇంటికి వచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కిక్ బాక్సింగ్లో సత్తా చాటిన విద్యార్థులు
జగదేవ్పూర్(గజ్వేల్): కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయిలో జగదేవ్పూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని ప్రిన్సిపాల్ స్లీవరాజ్ తెలిపారు. బుధవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. గత నెల 28, 29 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో 46 కిలోల విభాగంలో 8వ తరగతి చదువుతున్న ఆర్ చందన సిల్వర్ మెడల్, 32 కిలోల విభాగంలో 8వ తరగతి చదువుతున్న జ్యోష్న్ట సిల్వర్ మెడల్, 50 కేజీల మ్యూజికల్ పామ్ విభాగంలో ఇంటర్ విద్యార్థి మధులత బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను, పీఈటీ చారిని ఉపాధ్యాయుల బృందం అభినందించింది. -
6న ఫుట్బాల్ జట్టు ఎంపిక
సిద్దిపేటజోన్: సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6న జిల్లా జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్టు సభ్యుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి అక్బర్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక ఫుట్బాల్ మైదానంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు బాలికల జూనియర్ జట్టు కోసం ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ ఫొటోలతో ఈనెల 6న ఉదయం హాజరుకావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9న ఆదిలాబాద్లో జరగనున్న జూనియర్ బాలికల చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9885 789008, 9989 484657 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సాజిద్, తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన కంటైనర్
ప్రమాదంలో వ్యక్తి మృతిరామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా... మండలంలోని అక్కన్నపేటకు చెందిన కొత్తేనుగు లక్ష్మీనారాయణ (55) కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లివద్ద ఉన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. బుధవారం వ్యక్తిగత పనుల కోసం అక్కన్నపేట గ్రామానికి బైక్పై వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్తున్న క్రమంలో బిక్కనూరు చర్చి సమీపంలో జాతీయ రహదారిపై వెనుకనుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. -
వీవోఏ ఆత్మహత్య కారకులను శిక్షించాలి
మెదక్ మున్సిపాలిటీ: వీఓఏ పద్మ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి, విచారణ జరిపి డబ్బులు రికవరీ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నాగమణి మాట్లాడారు. పోడ్చన్పల్లి వీవోఏ పద్మ రాసిన సూసైడ్ నోట్లో నిజం ఉందన్నారు. ఆమె చావుకు కారణమైన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే వారి ద్వారానే డబ్యులు రికవరీ చేయించాలన్నారు. అధికారులు పద్మను బెదిరించి భయబ్రాంతులకు గురిచేసి ఐదేళ్లుగా డ్వాక్రా గ్రూపు నుంచి డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. కానీ అసలు విషయం గ్రామ ప్రజలకు తెలియదన్నారు. డబ్బులు స్కాంలో బ్యాంకు, ఆడిట్ అధికారులతోపాటు ఏపీఎం ప్రమేయం ఉందని గుర్తు చేశారు. లక్షల రూపాయలు దండుకొని కుంభకోణాన్ని పద్మమీదకు నెట్టారని మండిపడ్డారు. జిల్లాలో 517 గ్రామ సమైక్య సంఘాలు, 13,079 డ్వాక్రా గ్రూపులు, 1,56,942 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపించాలన్నారు. విచారణ జరిపి డబ్బులు రికవరీ చేయాలి సీఐటీయూ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు -
విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఇవ్వాలి
సిద్దిపేటఅర్బన్: ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు కామన్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ కె.హైమావతి సూచించారు. బుధవారం సాయంత్రం అర్బన్ మండలం మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి డైలీ స్టాక్ రిజిష్టర్ను తనిఖీ చేసి రోజువారీగా తీసుకునే సామగ్రిని తూకం వేసి పరిశీలించారు. విద్యార్థులు భోజనం చేసే సమయంలో వంట సిబ్బంది తప్ప వార్డెన్ కానీ ఇతర సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కామన్ మెనూ ప్రకారం బ్రేక్ఫాస్ట్లో పులిహోర, మధ్యాహ్నం చికెన్ కర్రీ, సాయంత్రం టీ, టమాటా పప్పు, పప్పుచారు చేసినట్టు వంట సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టమాటా పప్పు రుచి మెరుగుపరచాలని, ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఒక్కో విద్యార్థికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తోందన్నారు. ప్రిన్సిపాల్ నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్టడీ అవర్ కొనసాగుతుండటంతో ప్రతి తరగతి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి శ్రద్ధగా చదువుకోవాలని, ఆటలు బాగా ఆడాలన్నారు. గురుకులంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదుల్లో వెలుతురు సరిగా లేదని, ట్యూబ్లైట్లు మరిన్ని ఏర్పాటు చేసి, ఫ్యాన్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కామన్ మెనూను అమలు చేయాలి కలెక్టర్ కె.హైమావతి మిట్టపల్లి గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ -
రూ.4 వేలతో 4 పుణ్యక్షేత్రాల యాత్ర
డిపో మేనేజర్ రఘు దుబ్బాకటౌన్: దుబ్బాక నుంచి అరుణాచల గిరి ప్రదర్శణకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని దుబ్బాక డిపో మేనేజర్ రఘు బుధవారం తెలిపారు. ఈ నెల 9న సాయంత్రం 3 గంటలకు దుబ్బాక నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదర్శణాంతరం తిరుపతి దర్శణం ఉంటుందని పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2 వేలు ఉంటుందని చెప్పారు. టికెట్ బుకింగ్ కోసం 9959 226271, 7382 829973 నంబర్లకు సంప్రదించాలని కోరారు. శ్రీనివాసమూర్తికి డాక్టరేట్ ప్రదానం సదాశివపేట(సంగారెడ్డి): పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితుడు, పురోహితుడు దైవజ్ఞ శ్రీనివాసమూర్తి పంతులుకు చెన్నయ్కు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. గతనెల 28న చైన్నైలోని మైలాపూర్లోని భారతీయ విద్యాభవన్లో జరిగిన సభలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాసమూర్తి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. 20 ఏళ్లుగా పురోహితునిగా జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను పట్టాను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వీసీ, మాజీ జడ్జి కే.వెంకటేషన్, చీఫ్ జనరల్ మేనేజర్ హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ ఆటమిక్ ఎనర్జీ ఎన్ సెల్వరాజన్, ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ గణేషన్, ప్రముఖులు పాల్గొన్నారు. జూదరుల అరెస్ట్ పాపన్నపేట(మెదక్): నాగ్సాన్పల్లి శివారులో మంగళవారం రాత్రి జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామ శివారులోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్పై కానిస్టేబుల్స్తో కలిసి దాడి చేశారు. జూదం ఆడుతున్న వారి అరెస్ట్ చేశారు. ఒకరు పారిపోయారు. వారి నుంచి రూ.74,350 నగదు, తొమ్మిది సెల్ఫోన్లు, రెండు కార్లు, 5 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. మేకల దొంగలు అరెస్ట్ వర్గల్(గజ్వేల్): మేకలను అపహరిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మల్లారెడ్డిపల్లిలో నాలుగు మేకల చోరీ కేసులో హైదరాబాద్కు చెందిన నీరజ్కుమార్, నరేష్కుమార్, మాఖన్ విశాల్సింగ్లు మూడు నెలల క్రితం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించగా, ఇదే కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం వర్గల్ కమాన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా హైదరాబాద్కు చెందిన సూర్యవంశీ రాహుల్, ధరంకార్ గోపాలకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. మేకల షెడ్లను వెతికేందుకు గౌరారం వచ్చినట్లు, గౌరారంతో పాటు తొగుట పోలీస్స్టేషన్ల పరిధిలో మేకలను దొంగిలించినట్లు అంగీకరించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించారు. -
సబ్సిడీ కందుల బ్యాగులు పంపిణీ
హుస్నాబాద్: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. బుధవారం పట్టణంలోని రైతు వేదికలో సబ్సిడీపై కందుల బ్యాగులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల సాగు చేయడం వల్ల ఎకరానికి 6క్వింటాళ్ల పైగా దిగుబడి వస్తుందన్నారు. మార్కెట్లో పప్పు దినుసులకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో భూములు ఎక్కువగా ఉన్న రైతులు ఆయిల్ పామ్ను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని వరికి ప్రత్యామ్నాయంగా లాభభసాటి పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చెర్మన్ చందు, డైరెక్టర్లు యాదవ రెడ్డి, బిక్యానాయక్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
స్నేహితుడి ఆచూకీ కోసం..
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తరచూ గేట్ల మూసివేతతో ప్రజల అవస్థలు
రైలు వచ్చిన ప్రతిసారి గేట్లు మూసివేస్తుండడంతో దారిన వెళ్లే వాహన చోదకులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్, కోహీర్ల మీదుగా హైదరాబాద్, సికిందరాద్ల నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లి, లాతూర్ ప్రాంతాలతో పాటు బెంగుళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు రాక పోకలు సాగిస్తున్నాయి. గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఆయా మార్గాలలో రైలు వచ్చిన ప్రతిసారి గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ నుంచి జహీరాబాద్, కోహీర్ల మీదుగా పర్లీ తదితర ప్రాంతాలకు అను నిత్యం 36 రైళ్ల వరకు రాక పోకలు సాగిస్తున్నాయి. దీంతో తరచూ రైల్వే గేటు మూసిఉంచడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
రైల్వే శాఖ ప్రతిపాదన
● జహీరాబాద్, కోహీర్లలో అండర్ బ్రిడ్జిలు/ ఫ్లైఓవర్లు నిర్మాణాల కోసం పరిశీలన ● కొనసాగుతున్న సాయిల్ టెస్టింగ్ పనులు ● శాశ్వతంగా తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులుజహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో ఎనిమిది వంతెనల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదించింది. కాపలాదారు గేట్లను మూసేసి మ్యాన్ పవర్ను తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వేగేట్ల వద్ద సాయిల్ టెస్టింగ్ పనులను చేపట్టింది. మెర్క్యూరీ ఈ కాం అనే ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వారి ఆధ్వర్యంలో రైల్వే గేట్ల వద్ద డ్రిల్లింగ్ పనులు చేపట్టి సాయిల్ టెస్టింగ్ కోసం శాంపిళ్లను సేకరిస్తోంది. అధికంగా రద్దీ ఉండే జహీరాబాద్–బీదర్ రహదారిపై కుష్టు నివారణ కేంద్రం వద్ద గల రైల్వే గేటు, కోహీర్ పట్టణంలో తాండూర్ రహదారిపై ఉన్న రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జిని నిర్మించాలా లేక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలా అనే దానిపై రైల్వే శాఖ ఇంకా ఒక నిర్ణయానికి రాలేనట్లు తెలిసింది. అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు అనుకూలంగా లేనట్లయితే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించే విషయాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రజల వైపు నుంచి మాత్రం ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలనే డిమాండ్ ఉంది. కోహీర్–నాగిరెడ్డిపల్లి రహదారిపై ఉన్న గేటుతో పాటు పైడిగుమ్మల్ వెళ్లే దారిలో ఉన్న గేటు వద్ద అండర్ బ్రిడ్జిలను నిర్మించనుంది. కోహీర్–పోతిరెడ్డిపల్లి రహదారిపై ఉన్న గేటు వద్ద అండర్ బ్రిడ్జిని నిర్మించడమా లేక నాగిరెడ్డిపల్లి గేటు వద్ద నుంచి సర్వీస్ రోడ్డు నిర్మించి అనుసంధానం చేయడమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. హుగ్గెల్లి–పిచరాగడి గేటు వద్ద, న్యాల్కల్ మండలంలోని మెటల్కుంట, బసంత్పూర్ గేట్ల వద్ద అండర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇప్పటికే నాగిరెడ్డిపల్లి, పైడిగుమ్మల్ వెళ్లే గేట్లతో పాటు కోహీర్ రైల్వేగేటు వద్ద సాయిల్ టెస్టింగ్ పనులను పూర్తి చేసింది. మిగిలిన రైల్వే కాపలాదారు గేట్ల వద్ద సాయిల్ టెస్టింగ్ పనులను నిర్వహించనుంది. సాయిల్ శాంపిళ్ల సేకరించి ఏయే ప్రాంతాల్లో ఎంత మేర తవ్వకాలు జరిపితే గట్టిదనం వస్తుంది, ఎంత లోతులో రౌతు లభిస్తుంది, ఇందు కోసం ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే దానిపై స్పష్టత వస్తుంది. తదనంతరం అంచనాలతో నిర్మాణం పనులకు ప్రతిపాదించనుంది. 8 వంతెనల నిర్మాణం! -
బతికి వస్తేనే మాకు బతుకు
నా భర్త రాజేష్ కుమార్ చౌదరీ సిగాచిలో లేబర్గా పని చేస్తున్నాడు. పొట్టచేత పట్టుకొని నగరానికి వలస వచ్చాం. అనుకోని ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడటంతో ఎమి చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశాం.ఆయన జీతంతోనే కుటుంబం గడుస్తోంది. ఐసీయూలో ఉన్న ఆయన బతికి తిరిగి వస్తేనే మాకు బతుకు ఉంటుంది. – సనాపతి, బీహర్ దేవుడా కనికరించు దేవుడా ఒక్కసారి కనికరించు... నా భర్తను క్షేమంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపు. గత జూలై 16న ధర్మరాజ్తో వివాహం జరిగింది. ఎనిమిది నెలల క్రితం నేను ఆయనతో కలిసి వచ్చి గృహిణీగా ఉంటున్నాను. సంవత్సరం తిరగక ముందే దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. సిగాచి పేలుడులో నా భర్త గాయాలపాలయ్యాడు. ఐజీయూలో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్న. – కశ్మీరా కుమారీ, బీహర్ కళ్ల ముందే కకావికలం సోమవారం ఉదయం 9.30 తరువాత సిగాచిలో పేలుడు సంభవించింది. స్టోర్ అసిస్టెంట్ ఆఫీసర్గా ఉన్న నేను కంపెనీ భవనం బయట ఉన్నాను. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డాను అంతలోనే పెద్ధ ఎత్తున మంటలు, దట్ట మైన పొగ భవన శిథిలాలు ఎగిరి వచ్చి తగలడంతో శరీరానికి గాయాలయ్యాయి.ప్రమాదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. మూడు రోజులుగా చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. –యశ్వంత్, విజయవాడ -
గణేశ్ గడ్డ హుండీ ఆదాయం రూ 28.17 లక్షలు
పటాన్చెరు టౌన్: రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేశ్గడ్డ దేవస్థానంలో హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ ఈఓ లావణ్య సమక్షంలో లెక్కింపు జరిగింది. 105 రోజులకు గాను రూ.28 లక్షల 17 వేలు వచ్చినట్లు ఈఓ లావణ్య , జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం హుండీ ఆదాయం రూ.లక్షా ఇరవై వేలు వచ్చిందని, వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి వెచ్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్, అయ్యప్ప, సతీష్, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పటాన్చెరుటౌన్: భద్రతా చర్యలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్చెరు డివిజన్ పరిధిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుందన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలిసీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు సంగారెడ్డి ఎడ్యుకేషన్: సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు. పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి రూ.50 లక్షలు, గాయపడి, వారికి రూ10 లక్షలు చెల్లించాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు కష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘సిగాచీ’ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రమాదానికి కారణమైన సిగాచీ పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామచంద్రపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. చికిత్స పొందుతున్న అనేక మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వారిని వెంటనే మెరుగైన వైద్య సేవల కోసం నగరంలోని ప్రముఖ ఆసుపత్రులకు తరలించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం నష్టపరిహారాన్ని మరింత పెంచాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాణిక్యం, నాగేశ్వరరావు, మధు, జయరాం తదితరులు పాల్గొన్నారు. -
అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు
మూడు రోజులుగా నరకయాతన ● ‘సిగాచీ’ పేలుడు మిగిల్చిన పెనువిషాదంఅయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డిక్యాంపులో బిక్కుమంటూ.. బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్క్లో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్క్కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. -
రూ. కోటి పరిహారం ఇవ్వాలి
తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలి: జాన్వెస్లీరామచంద్రాపురం: పాశమైలారం ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రమాద స్థలాన్ని సీపీఎం బృందం పరిశీలించింది. అనంతరం జాన్వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. శాశ్వత వైకల్యం కల్గిన వారికి రూ.50 లక్షలు..గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర నేతలు రమేష్, వెంకటేశ్, జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
రూ. కోటి పరిహారం ఇవ్వాలి
తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలి: జాన్వెస్లీరామచంద్రాపురం: పాశమైలారం ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రమాద స్థలాన్ని సీపీఎం బృందం పరిశీలించింది. అనంతరం జాన్వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. శాశ్వత వైకల్యం కల్గిన వారికి రూ.50 లక్షలు..గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర నేతలు రమేష్, వెంకటేశ్, జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
● సీఎం హామీని నెరవేర్చాలి ● జిల్లాలో 450 మంది సర్వశిక్ష అభియాన్ సిబ్బంది ● అదనపు బాధ్యతలతో ఇబ్బందులు ● క్రమబద్ధీకరించి వేతనాలు పెంచాలి మునిపల్లి(అందోల్): కాంట్రాక్టు పద్ధతిలో ఎస్ఎస్ఏ (సమగ్ర శిక్షణ అభియాన్) పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల తమ కొలువు ఎప్పుడు ఊడిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ నిర్వహణ కోసం ప్రతీ ఏటా తమ లైసెన్స్ను రెన్యూవల్ చేసుకోవడంతో ఒక సంవత్సరం ఉద్యోగం చేసేందుకు వీలుంటుంది. ఇదే ఆసరాగా చేసుకున్న ఉన్నతాధికారులు చెప్పిన ప్రతీ మాట వినడంతో పని భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ పరిధిలోనే సమగ్ర శిక్ష అభియాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులతో సమానంగా పూర్తిస్థాయిలో పని చేస్తున్నా వేతనం మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 85 పాఠశాల క్లస్టర్లలో... 85 పాఠశాల క్లస్టర్లకు గాను 107 మంది సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, మెసేంజర్లు, టీటీఐ (పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్) పని చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు పాఠశాలలు, అదనపు తరగతి గదులు ఆన్లైన్లో విద్యార్థుల వివరాల నమోదు చేస్తారు. ప్రశ్నపత్రాల అందజేత, పాఠశాలల పరిశీలన, మధ్యాహ్న భోజన తనిఖీ, ఉపాధ్యాయులు, సెలవుల్లో ఉంటే వారి స్థానంలో విధులు నిర్వహించడం వంటి పనులు చేస్తుంటారు. చాలీ చాలని వేతనాలతో... ఎస్ఎస్ఏలో పనిచేసే వారికి తగిన వేతనం లేక నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. 2021లో పీఆర్సీ ప్రకారం వీరికి రూ.19,500 వేతనం ఇస్తున్నారు. పీఎస్ఎస్ఎ (తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్) తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో హన్మకొండలో దీక్ష శిబిరానికి వచ్చి తాను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సంగతిని వీరు గుర్తు చేస్తున్నారు. అయితే సీఎం ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని కోరుతూ 2024 నవంబర్లో 30 రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కార్మికులకు రక్షణేది?
● పరిశ్రమల్లో కానరాని భద్రత ● శ్రమ దోపిడీకి గురవుతున్న వలస కార్మికులు ● ప్రభుత్వ రక్షణ పథకాలు దూరమే నారాయణఖేడ్: పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ఘోర పేలుడు విస్పోటనం జిల్లా వాసులను తీవ్రంగా కలచివేసింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో కూడా రక్షణ చర్యలు లేవనే చర్చ కొనసాగుతోంది. జిల్లాలో పత్తి మిల్లు, చెరుకు ఫ్యాక్టరీ, రైస్మిల్స్, కంకర క్రషర్, ఫ్లోర్మిల్, ఇటుక బట్టీలు, బోరుమోటార్ల డ్రిల్లింగ్, గృహనిర్మాణ రంగం తదితర పరిశ్రమలు సాగుతున్నాయి. స్థానికేతరులు తక్కువ వేతనానికి వస్తుండటంతో వారినే తీసుకుంటున్నారు. హక్కుల గూర్చి అడగకపోవడం, ఎక్కువ పనిగంటలు పని చేస్తుండటంతో యజమాన్యాలు వారినే పనిలో కుదుర్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో పనులు చేయిస్తుండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం పటాన్చెరు ఘటన నేపథ్యంలో వలస కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వలస కార్మికులే అధికం జిల్లాలోని పరిశ్రమల్లో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బెంగాళ్ తదితర రాష్ట్రాల వలస కార్మికులు వచ్చి పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అక్కడి కాంట్రాక్టర్లు కార్మికులను ముఠాలుగా తీసుకొచ్చి ఇక్కడ పనుల్లో నియమిస్తున్నారు. యాజమాన్యాల నుంచి నిత్యం పని ఒత్తిడి, శ్రమదోపిడీ, సకాలంలో వేతనం, సరుకులు ఇవ్వకుండా వేధించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరక్షరాస్యులు కావడంతో చట్టాలపై అవగాహన లేకపోవడం, రక్షణ అంశాలు తెలియక దోపిడీని ఎదుర్కోలేకపోతున్నారు. రసాయన ప్రదేశాల వద్ద పని చేస్తున్న కార్మికులకు కనీసం సేఫ్టీ షూస్, హెల్మెట్లు, గాగుల్స్, అప్రాన్ తదితర రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కంకర క్రషర్ యంత్రాల వద్ద పనిచేస్తున్న కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోని కారణంగా దుమ్ము ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అసువులు బాస్తున్నారు. ఓ ఫ్లోర్మిల్లో ఓ మహిళ పడి తల, మొండెం వేరైన ఘటన ఆరేళ్ల క్రితం ఖేడ్లో చోటు చేసుకుంది. ప్రమాదాలు జరిగి మరణం సంభవించిన సందర్భాల్లో బాధితులకు ఎంతో కొంత ముట్టజెప్పి కేసు కాకుండా తప్పుకుంటున్నారు. పరిశ్రమలపై అధికారులు తనిఖీలు లేకపోవడంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతుంది. కనీస నిబంధనలు పాటించాలి షెడ్యూల్ పరిశ్రమలైన వీటిలో చట్ట ప్రకారం ఐదేళ్ల కోసారి వేతనాలు పెంచాలి. సేఫ్టీ రక్షణతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలి. బోనస్ ఇవ్వాలి. షూ, అఫ్రాన్, మాస్క్, హెల్మెట్ సదుపాయాలు కల్పించాలి. 20 రోజులకు ఒకసారి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. న్యాయపరమైన పనిగంటలు, ఆరోగ్యం, వృత్తి భద్రత కల్పించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలి. యూనిఫాం, గుర్తింపుకార్డు జారీ చేయాలి. ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించాలి. ప్రమాద బీమా కల్పించాలి. రవాణా ఏర్పాటు, క్యాంటీన్ సదుపాయం ఉండాలి. ప్రయోజనాలూ కల్పించరుకేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజీబీవై) లో నైపుణ్యంలేని సహా కార్మికులకు జీవిత బీమా రక్షణ కల్పించాలి. పీఎం సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) కార్మికులకు ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం బీమా రక్షణ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన ద్వారా పదవీ విరమణ తర్వాత కార్మికులు పెన్షన్ పొందే సదు పాయం. పీఎం శ్రమ యోగి మాన్–ధన్ (పీఎం–ఎస్వైఎం) అసంఘటిత కార్మికులకు, నైపుణ్యం లేని కార్మికులతో సహా ఒక పెన్షన్ పథకం. కానీ ఏవీ వీరికి అమలు చేయడం లేదు. -
ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి..
తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేగుంట(తూప్రాన్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మక్కరాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. చేగుంట అదనపు ఎస్ఐ బిక్యానాయక్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎరగొల్ల ఎల్లం(36) ఇంటి నిర్మాణం కోసం దాదాపు ఎనిమిది లక్షల అప్పు చేశాడు. తీర్చే మార్గం కనిపించక నిత్యం బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో జూన్ 30న తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు నార్సింగి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సుచిత్రలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఎల్లం మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో గొడవలతో మనస్తాపానికి గురై.. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో చోటు చేసుకుంది. గత నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం విధితమే. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దొంతి అక్షయ(15) తల్లిదండ్రులు ఇంట్లో తరుచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో ఇంట్లో గొడవలతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్షయ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో యువకుడు హవేళిఘణాపూర్(మెదక్): యువకుడు ఆత్మహత్య చేసున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జోగెల్లి కుమార్(34) కొంత కాలంగా మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం కుమార్ తాగిన మైకంలో ఇంటికి వచ్చి తండ్రి పోచయ్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో గ్రామ శివారులో ఉన్న గుట్టవద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అక్కడికి వెళ్లి చూసేలోపే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. క్రిమి సంహారక మందు తాగి రైతు.. రామాయంపేట(మెదక్): అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని సుతారిపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల స్వామి (35)కి భార్య లావణ్యతోపాటు ముగ్గురు కుమారులున్నారు. తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పులతో కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. రెండు రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఆలయాల్లో దొంగతనం
మద్దూరు(హుస్నాబాద్): రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... దూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి, బెక్కల్ గ్రామాల్లోని దుర్గమ్మ ఆలయాల్లోకి చొరబడి హుండీ పగులగొట్టి సుమారు రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఇటీవల పలు ఆలయాలు, ఇండ్లలో దొంగలు చోరీలకు పాల్పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నర్సాపూర్లో బైక్ చోరీ నర్సాపూర్ రూరల్: పట్టణంలో పార్క్ చేసిన బైక్ను దొంగిలించారు. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణంలోని మారుతీనగర్లో దుప్తల భరత్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ముందు బైకును పార్క్ చేశాడు. ఈనెల 15న గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకపోవడంతో మంగళవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కబ్జాపై తహసీల్దార్కు ఫిర్యాదు కొండపాక(గజ్వేల్): ప్రభుత్వం గౌడ సంఘాలకు కేటాయించిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడంటూ మంగళవారం గౌడ సంఘం సభ్యులు తహసీల్దార్ శ్యామ్కు వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని జప్తినాచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొండపాక శివారులోని సర్వే నం.150లో సుమారు నాలుగెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. ఈ భూమిని 30 ఏళ్ల కిందట ప్రభుత్వం గౌడ సంఘం అభ్యున్నతి కోసం ఈత, తాటి వనాల పెంపు కోసం కేటాయించింది. ఎకై ్సజ్ శాఖ అధికారులు ఉపాఽధి హామీ పథకంలో భాగంగా ఈత, తాటి మొక్కలను నాటారు. ఇటీవల వాటిని తొలగించి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని, చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కుక్కల దాడిలో 26 మేకలు మృతి జహీరాబాద్: కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో 26 మేకలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన మునావర్ పటేల్కు చెందిన మేకలు తన వ్యవసాయ క్షేత్రంలో ఉంచారు. సోమవారం ఆరు వీధి కుక్కలు రక్షణ వలయంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కింది వైపు నుంచి షెడ్డులోకి చొరబడి మేకలపై దాడిచేసి చంపివేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. సుమారు రూ.1.50లక్షల మేర నష్టపోయినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు. నిన్న భార్య.. నేడు భర్త మరణంలోనూ వీడని బంధం తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన భర్త రమేష్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య సోమవారం మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామానికి చెందిన దాసరి రమేష్, స్వప్నలు భార్యాభర్తలు. సోమవారం చేగుంట మండలం మక్కరాజ్పేట్లో శుభకార్యానికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. కాగా తూప్రాన్ మండలం శివారులో వీరి స్కూటీని కారు ఢీకొట్టగా స్వప్న (29) అక్కడిక్కడే మృతి చెందింది. రమేష్ (31)కు తీవ్ర గాయాలవ్వడంతో గాంధీలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఒకే రోజు గ్రామంలో భార్యాభర్తల అంతిమయాత్ర నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. -
పూజ గదిలో మంటలు
కల్హేర్(నారాయణఖేడ్): పూజ గదిలో మంటలు వ్యాపించి ఇంటితోపాటు బంగారం, వెండి వస్తువులు, నగదు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం సిర్గాపూర్ మండలం నల్లవాగులో జరిగింది. గ్రామానికి చెందిన చిల్లెల నాగయ్య కుటుంబం నిత్యం ఇంట్లో పూజ గదిలో పూజలు చేస్తారు. దీపం వెలిగించి కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. దీపం కారణంగా ఇంట్లో మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి నారాయణఖేడ్లోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పింది. ప్రమాదంలో ఇంటి కప్పు, 8 తులాలకు పైగా బంగారం, 26 తులాల వెండి వస్తువులు, బట్టలు, రూ.1.98 లక్షలు నగదు కాలిపోయింది. పిల్లి దీపం పడేయడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. ఇంటితోపాటు బంగారం, నగదు దగ్ధం సిర్గాపూర్ మండలంనల్లవాగులో ఘటన -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
పోలీస్ ట్రైనింగ్ అకాడమి ప్రిన్సిపాల్ మధుకర్స్వామి దుబ్బాక: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమి కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్స్వామి అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో అఖిలరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు వాట్ నెక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఎక్కువగా సెల్ఫోన్లు చూస్తున్నారని, అవసరముంటే తప్పా వాడకూడదన్నారు. గుట్కాలు , డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోద్దని సూచించారు. విద్యార్థుల నడవడికను వారి తల్లిదండ్రులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలరాజ్ ఫౌండేషన్ అధినేత, కూకట్పల్లి ఎస్ఐ తౌడ సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు చింత రాజు, నల్ల శ్రీనివాస్, సభ్యులు రవి, సాగర్, మహేష్, ప్రవీణ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం
టేక్మాల్(మెదక్): అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ దొరికింది. ఈ ఘటన మండల కేంద్రంలోని టేక్మాల్లో మంగళవారం జరిగింది. ఎస్ఐ రాజేష్ వివరాల ప్రకారం... పాప్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రావుగారి మహేష్(15) టేక్మాల్ బీసీ హాస్టల్లో ఉంటూ ఉన్నత పాఠశాలలో 10వ తగరగతి చదువుతున్నాడు. నిత్యం మాదిరిగానే సోమవారం హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి కనిపించకపోగా హాస్టల్కి వెళ్లలేదు. బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మహేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని ఎలకుర్తి గ్రామశివారులో వెళ్తున్న మహేష్ను గమనించి గ్రామస్తులు మాజీ సర్పంచ్ శ్వేతాచంద్రశేఖర్రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బీసీ హాస్టల్ వార్డెన్ బాబు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి మహేష్ను హాస్టల్కు తీసుకువెళ్లాడు. ఫ్లైఓవర్ కింద మృతదేహం రామచంద్రాపురం(పటాన్చెరు): మృతదే హం లభ్యమైన ఘటన రామచంద్రాపురం పట్టణంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ జగన్నాథ్ కథనం ప్రకారం.. పట్టణంలోని లింగపల్లి చౌరస్తాలోని ప్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయస్సు 50 నుంచి 60ఏళ్ల మధ్య ఉండవచ్చు అని తెలిపారు. పక్కనే ఉన్న టీ దుకాణం వద్ద పదిరోజులుగా టీ తాగుతున్నట్లు దుకాణ యాజమాని తెలిపారు. మృతుని ఒంటిపై ఎర్రని చొక్క, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మోటార్ ఆన్ చేస్తుండగా..
విద్యుదాఘాతంతో రైతు మృతి అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పంతుల్తండా గ్రామ పరిధిలోని దుబ్బతండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... తండాకు చెందిన భానోతు కిష్టు అలియాస్ కీచు(51)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న ఎకరంలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు పోతుంటారు. కొన్ని రోజులుగా ఇంటి మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఇంటి ఆవరణలో నిర్మించిన సంపులో చిన్న మోటార్ను బిగించారు. దానిని ఆన్ చేస్తుండగా షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందాడు. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న కిఘ్ఠ మృతి చెందడంతో తండావాసులు రోదిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో వ్యవసాయ కూలీ.. చిన్నశకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన నార్సింగి కాస్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వంజరి నర్సింహులు(32) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వద్ద పనులు చేసేందుకు జీతం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పొలం పనులకు వచ్చిన నర్సింహులు బోరు మోటారు స్టార్టర్ వద్ద కరెంటు వైర్లు సరిచేస్తున్న క్రమంలో విద్యుత్షాక్కు గురయ్యాడు. నర్సింహులును గమనించి అదే పొలంలో ట్రాక్టర్ నడుపుతున్న స్వామి ఘటన స్థలం వద్దకు రాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఈ విషయం మృతుడి బంధువులతో పాటు పోలీసులుకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వెంకటమమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య వరం
శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ హుస్నాబాద్: హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కావడం గ్రామీణ విద్యార్థులకు ఓ వరం లాంటిందని వీసీ, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ అన్నారు. తాత్కాలికంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఉమ్మాపూర్ మహాసముద్రం గండి వద్ద కళాశాలకు 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. భవన నిర్మాణానికి రూ.29.02 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఏఐ కోర్సులకు గాను ఒక్కో కోర్సుకు 60 సీట్ల చొప్పున 240 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం సీట్లు కేటాయించామన్నారు. ప్రతి కోర్సుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించారని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్.. కళాశాలలో చేరేందుకు కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం జూన్ 28 నుంచి జూలై 7 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 6 నుంచి 10వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. 13న మాక్ కౌన్సెలింగ్, 14, 15వ తేదీల్లో ఆప్షన్ల మార్పు, 18న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 18 నుంచి 22 వరకు సెల్ఫ్ రిపోర్టు, 22న ఫైనల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్, వైస్ చాన్సలర్, ఓఎస్డీ డాక్టర్ హరికాంత్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్స్ తిరుపతి రెడ్డి, అశ్విని పాల్గొన్నారు. -
భూ తగాదాలో అడ్డొస్తున్నాడని హత్య
కల్హేర్(నారాయణఖేడ్): భూ తగాదాలో అడ్డొస్తున్నాడని హత్య చేసిన కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 29న సిర్గాపూర్ మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో హత్య జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం కంగ్టీ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కుర్మ సాయిగొండ, కుర్మ రమేష్ కుటుంబం మధ్య భూ తగాదాలు ఉన్నాయి. మృతుడు కార్పట్ల జైపాల్, రమేష్ ఇద్దరు స్నేహితులు. రమేష్కు సహకరిస్తూ భూ తగాదా విషయంలో తలదూర్చుతున్నాడనే ఉద్దేశంతో సాయిగొండ జైపాల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైపాల్, రమేష్ పొలం వద్ద పశువులకు నీరు తాపుదామని వెళ్లారు. వీరితో మార్గమధ్యలో ఘర్షణకు దిగి సాయిగొండ, అతని కొడుకులు హన్మగొండ, రాజు, పండరి, భార్య కిష్టవ్వ, కోడళ్లు కవిత, వసుధ, డాకుగొండ కలిసి గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో జైపాల్ అక్కడికక్కడే మరణించాడు. రమేష్కు తీవ్ర గాయలయ్యాయి. రమేష్ తల్లి మణెమ్మ, గ్రామస్తులు చూసి కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయారు. నిందితులను రిమాండుకు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ వెంకట్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 8 మంది నిందితుల అరెస్టు, రిమాండ్ కంగ్టీ సీఐ చంద్రశేఖర్రెడ్డి -
మంత్రి సీతక్కకు సన్మానం
నారాయణఖేడ్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మంగళవారం హైదరాబాద్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, సీనియర్ నాయకులు అశోక్ ఉన్నారు. -
బెజుగామలో బయటపడ్డ సతిశిల
గజ్వేల్రూరల్: శిలలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని, ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామలో ఇటీవల జైన తీర్థంకరుల శిల్పాలు వెలుగుచూడగా, తాజాగా ఇదే గ్రామంలో అపూర్వ సతిశిలతో పాటు శూలరోహణ ఆత్మాహుతి, ఇతర వీరగల్లులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శిల్పంలో వీరుడు తలపై పెద్దసిగతో, చెవులకు జూకాలు, మెడలో కంటె, జంధ్యం, హస్తభూషణాలు, నడుమున దట్టి, వీరకాసె, చేతులలో ఈటెతో, డాకాలు సాచి, యుద్ధానికి సిద్ధమై ఉన్నాడని తెలిపారు. ఈ వీరునికి కుడిపక్క పెద్ద ధమ్మిల్లంతో, చెవులకు జూకాలతో, మెడలో హారం, చేతులలో ఈటెతో శత్రువును చంపుతున్న వీరనారి నిలబడి ఉందన్నారు. వీరునికి ఎడమవైపున పెద్ద ధమ్మిల్లంతో, జూకాలతో, మెడలో హారంతో, ఎడమచేత కమండలం పట్టుకొని కనిపిస్తున్న సీ్త్ర ఆ వీరుని సతి అని పేర్కొన్నారు. కుడిపక్కన ఈటెతో శత్రువుని చంపుతున్న ఆ నారీమణి కూడా వీరపత్నే అయి ఉండవచ్చని చెప్పారు. ఈ వీరునికి ఇద్దరు భార్యలున్నట్లు తెలుస్తుందన్నారు. అక్కడ జరిగిన పోరులో భర్తతోపాటు పోరాడిన భార్య కూడా చనిపోగా, మిగిలిన మరో భార్య భర్తతో పాటు సతీసహగమనం చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సతిశిల కల్యాణి చాళుక్యుల కాలానికి చెందినదని చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ పరిశీలనలో చరిత్రకారుల బృందం వెంట గ్రామస్తులు నాంపల్లి స్వామి, శ్యామ్కుమార్, కళాధర్లు పాల్గొన్నారు. -
దిద్దుబాటేది?
పారిశ్రామికవాడల్లో ప్రమాదాలు అరికట్టే చర్యలు శూన్యంపటాన్చెరు: మనం అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు..జీవితంలో ఎదురైన అనుభవాలు, ప్రమాదాల నుంచి మనం ఏదోక గుణపాఠం నేర్చుకుంటుంటాం. అయితే పటాన్చెరు పారిశ్రామిక వాడలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పరిశ్రమల యాజమాన్యాలు గుణపాఠం నేర్వడం లేదు. పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో శ్రమజీవులు పిట్టల్లా రాలి పోయిన ఘటనే అందుకు నిదర్శనం. కార్మికులంతా ఔట్సోర్సింగే... సిగాచీలో కార్మికులందరూ ఔట్సోర్సింగ్ వారే కావడం విశేషం. కార్మికులకు తాము చేస్తున్న పనికి వేతనం వస్తే చాలనే పరిస్థితి నెలకొంది. బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చి ఇక్కడ పరిశ్రమల్లో పని చేయిస్తున్నారు. ప్రమాదకర యంత్రాలపై ఏమాత్రం నైపుణ్యంలేని అన్స్కిల్డ్ లేబర్తో పని చేయిస్తున్నారు. అదేమంటే నిపుణుల కొరత ఉందని స్థానికులెవరూ పరిశ్రమల్లో పని చేసేందుకు ముందుకు రావడం లేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కారణాలు ఏమైనా పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల వివరాలేవీ ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవన్నీ తప్పుడు నివేదికలే అయి ఉంటున్నాయి. అధికారుల తనిఖీలు కూడా సరిగ్గా చేయడం లేదని తెలుస్తోంది. గతంలో జరిగిన ప్రమాదాలివే.. ఇదే పరిశ్రమలో 2002లో ప్రమాదం జరిగింది. అప్పుడు ఒకరు మృతి చెందారు. తర్వాత ఏరిస్లో భారీ ప్రమాదం జరిగి కార్మికులు మృతి చెందారు. పాశమైలారంలో చైతన్య క్లోరైడ్స్, రాంటస్ పరిశ్రమలో భారీ ప్రమాదాలు జరిగాయి. రాంటస్లో జరిగిన ప్రమాదంలో మంటలార్పిన మూడు రోజులకు ముగ్గురు కార్మికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. ఇక జయవిజయ అల్లాయిస్ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో అక్కడికక్కడే ఆరు మంది కార్మికులు చనిపోయారు. వీరుపాక్ష రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. 2023లో గడ్డ పోతారంలో మైలాన్ పరిశ్రమలో రసాయన డ్రమ్ములు పేలిన ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. తర్వాత లీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఏడాదిలోనే పాశమైలారం ఎంఎస్ఎన్లో ప్రమాదం జరిగింది. ఇలా ప్రతీసారి ఏదో ఒక పరిశ్రమలో ఏదో ఒక ప్రమాదం కార్మికులను పొట్టనబెట్టుకుంటోంది. కొన్ని పరిశ్రమల్లో అయితే జరిగిన ప్రమాదాలు సైతం వెలుగులోకి రావడం లేదు. చనిపోయిన వారి కుటుంబసభ్యులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండకపోవడంతో పరిశ్రమల యాజమాన్యానికి కలిసివస్తోంది. మృతుల కుటుంబాలకు సదరు కాంట్రాక్టర్ ద్వారా ఎంతోకొంత సొమ్మును ముట్టజెప్పి వారి నోళ్లను నొక్కేస్తున్న ఘటనలు కోకొల్లలు. -
డ్రగ్స్పై నిఘా పెంచాలి
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై నిఘా పెంచాలని సీపీ అనురాధ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీసు కమిషనరేట్లో పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసుల్లో శిక్షల శాతం పెంచాలన్నారు. ఆత్మహత్యలకు గల కారణాలు గుర్తించి నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులతో కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 కాల్స్పై అలసత్వం వహించవద్దన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు రవీందర్రెడ్డి, నరసింహులు, సదానందం, రవిందర్, శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్గౌడ్, కిరణ్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, దుర్గ, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.గంజాయి పట్టివేతరామచంద్రాపురం (పటాన్ చెరు): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీధర్ మాలిక్ జీవనోపాధి కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు వలస వచ్చాడు. ఇక్కడ లేబర్ క్యాంపులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో తన గ్రామం నుంచి గంజాయి తీసుకొచ్చి లేబర్ క్యాంపులో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.గంజాయి నిందితులకు జైలుజహీరాబాద్ టౌన్: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జహీరాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం... ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా గంపవరానికి చెందిన పవన్ కుమార్ (36), అనిమేశ్ మండల్ (26) 10 కిలోల ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా 2019లో పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. జిల్లా అదనపు కోర్టులో వాదనలు జరిగిన అనంతరం జడ్జి సోమవారం నిందితులకు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 25 వేల జరిమానా విధించారు.వృద్ధురాలిని నమ్మించి.. చైన్ స్నాచింగ్తూప్రాన్: వృద్ధురాలి మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయిన ఘటన మున్సిపల్ పరిధిలోని పడాల్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెప్యాల లలిత (68) కొందరు మహిళలతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షలకు వచ్చింది. తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఆటో స్టాండు వద్ద నిలుచుంది. ఈ క్రమంలో ఓ యువకుడు వచ్చి ‘అమ్మ ఇక్కడ ఉన్నవా.. మీ కోసం మీ ఇంటికి వెళ్లాను. అక్కడ మీరు లేరు. మీకు పింఛన్ వచ్చింది’ అని నమ్మబలికాడు. రెండు పాస్ ఫొటోలు, ఆధార్ కార్డు కావాలని అడిగాడు. వృద్ధురాలు ఆ యువకుడి మాటలు నమ్మి ఫొటోలు లేవని తెలిపింది. ఆధార్కార్డుపై ఉన్న ఫొటోను చూసి ఇందులో నీ మెడలో నగలు లేవు.. ఫొటో తీయించుకువస్తాను నీ మెడలోని గొలుసు ఇవ్వమని అడిగాడు. దీంతో నమ్మిన వృద్ధురాలు ఆధార్కార్డుతో పాటు గొలుసు ఇచ్చింది. అవి తీసుకెళ్లిన యువకుడు ఎంతకు తిరిగిరాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
సంగారెడ్డి క్రైమ్: కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణంలోని రుక్మిణి థియేటర్ వద్ద గల డ్త్రెనేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించి మేనేజర్ వెంకటేశం పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో పట్టణంలోని విజయ్నగర్ కాలనీకి చెందిన కడమంచి దుర్గాప్రసాద్ (23)గా గుర్తించారు. ఇతడు వృత్తిరీత్య కూలీ పనులు చేసుకుంటున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ చిన్నారి.. జహీరాబాద్ టౌన్: చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబంతో జహీరాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. జూన్ 22న ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మణ్ రెండవ కుమార్తె షరోని(7) గాయపడింది. ప్రమాదవశాత్తు దీపం చిన్నారిపై పడి మంటలు అంటుకున్నాయి. కుటుంబ సభ్యులు చూసి మంటలను ఆర్పేలోపు గాయాలయ్యాయి. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. -
సెంట్రల్ బ్యాంకులో చోరీకి యత్నం
వెల్దుర్తి(తూప్రాన్): బ్యాంకులో చోరీకి యత్నించి అలారం మోగడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఆదివారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు బ్యాంక్ వెనకవైపు స్టోర్ రూం గోడకు కన్నం చేసి ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో బ్యాంకును అనుక్షణం పర్యవేక్షించే ఐవీఎస్ టీం అలర్ట్ అయి అలారం మోగడంతో దుండగులు గోడకు వేసిన కన్నం ద్వారా పరారయ్యారు. అదే సమయంలో డయల్ 100 ద్వారా పోలీసులను అలర్ట్ చేయడంతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, క్లూస్ టీం, బ్యాంక్ మేనేజర్ సుమన్ భాగే, సిబ్బందితో ఘటనా స్థలాన్ని సందర్శించి వేలిముద్రలు సేకరించారు. నిందితులిద్దరూ ముఖానికి మాస్కులు ధరించినట్లు తెలిసింది. చోరీలో ఇద్దరు దుండగులే పాల్గొన్నారా? లేక బయట ఎవరైనా కాపలాగా ఉన్నారా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ వెంట తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, వెల్దుర్తి ఎస్సై రాజుతో పాటు మనోహరాబాద్, శివంపేటకు చెందిన పోలీస్ సిబ్బంది ఉన్నారు. గతంలో కూడా ఓ యువకుడు చోరీకి ప్రయత్నించగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కేసు నమోదు చేశారు. గోడకు కన్నం చేసి లోనికి వచ్చిన దుండగులు అలారం మోగడంతో పరారీ -
సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... శభాష్ పల్లి గ్రామానికి చెందిన పానగారి సుధాకర్(28) ఆదివారం భార్యాపిల్లలను కొత్తపేట గ్రామంలో అత్తగారి ఇంటి వద్ద దింపాడు. అక్కడి నుంచి బైక్పై నర్సాపూర్కు వెళ్లి ఓ ఫర్టిలైజర్ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశాడు. రుస్తుంపేట గ్రామ శివారులో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నేను తప్పు చేయలేదు నా పిల్లలు దూరమవుతున్నారంటూ సెల్ఫీ వీడియోను తన స్నేహితుడికి వాట్సప్ చేశాడు. అతడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. శివ్వంపేట పోలీసుల సహకారంతో లొకేషన్ ఆధారంగా కుటుంబ సభ్యులు వెళ్లేలోపు గుర్తించిన స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ నాలుగేళ్ల క్రితం గ్రామంలో జరిగిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. కేసు ట్రయల్కు రావడంతో శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈఘటన మండలంలోని రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గుండారెడ్డి(30) జూన్ 18న ఉదయం కారు డ్రైవింగ్కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద కుటుంబ సభ్యులు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. సోమవారం అతడి అన్న శ్రీనివాస్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపూర్ పట్టణంలో వృద్ధుడు నర్సాపూర్ రూరల్: వృద్ధుడు అదృశ్యమైన ఘటన నర్సాపూర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణంలోని సునీతా రెడ్డి కాలనీకి చెందిన ఎర్రోళ్ల మల్లయ్య (75) అనే వృద్ధుడు ఈ నెల 27న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మల్లయ్య కుమారుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె..
నేడు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంబురాలు ఏర్పాట్లు చేశాం రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగో స్నాతకోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. 267 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేయనున్నాం. రోజురోజుకు పెరుగుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం నేపథ్యంలో విద్యార్థులకు ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. విశ్వవిద్యాలయంలో పరిశోధనల(రీసెర్చ్)లో విస్తృత అవకాశాలున్నాయి. విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న కొట్యాల బోధన కళాశాలలో వాణిజ్యపరమైన ఉద్యాన పంటల మోడల్ ఉద్యాన క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. –డాక్టర్ దండా రాజిరెడ్డి, విశ్వవిద్యాలయం, వైస్ ఛాన్స్లర్ ● కార్యక్రమానికి హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ● పట్టాలు అందుకోనున్న 267 మంది విద్యార్థులు ములుగు(గజ్వేల్): నిత్యం విద్యార్థులు వివిధ అధునాతన పరిశోధన అంశాలపై సందడిగా కనిపించే సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవ సంబురానికి సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్నాతకోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పటాన్చెరు ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్ హాజరు కానున్నారు. 2014లో విశ్వవిద్యాలయం ఏర్పాటు శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీఎస్హెచ్యూ) 2014లో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఏర్పాటు చేశారు. 2019లో సిద్దిపేట జిల్లాలోని ములుగులో అప్పటి సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఎస్కేఎల్టీఎస్హెచ్యూకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 పరిశోధన స్థానాలు, 4 బోధన కళాశాలలు, ఒక కృషి విజ్ఞానకేంద్రం, మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం తనదైన శైలిలో ఇప్పటికే అనేక విజయాలను సాధించింది. విద్యాబోధన, విస్తరణ పరిశోధన రంగాల్లో విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలు, ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలు, శాసీ్త్రయ సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. ఉద్యాన విద్య, విస్తరణ పరిశోధనలకు ఆదరణ పెరుగుతోంది. ఈ రంగంలో అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో అధిక శాతం విద్యార్థులు ఉద్యాన బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నాలుగో స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ మొదటి స్నాతకోత్సవం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నిర్వహించారు. రెండో స్నాతకోత్సవాన్ని ములుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, మూడో స్నాతకోత్సవాన్ని ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం ఆడిటోరియంలో చేశారు. నాలుగో స్నాతకోత్సవాన్ని రాజేద్రనగర్లో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 267 మంది విద్యార్థులు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. అందులో 158 మంది బ్యాచిలర్స్ ఆఫ్ హార్టికల్చర్, 55 మంది బ్యాచిలర్స్ ఆఫ్ ఫారెస్ట్రీ, 38 మంది మాస్టర్స్ హార్టికల్చర్, 11 మంది మాస్టర్స్ ఫారెస్ట్రీ, 5 మంది పీహెచ్డీ హార్టికల్చర్ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నారు. అలాగే 13 మందికి గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేయనున్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు
● ప్రమాదంలో భార్య మృతి ● భర్తకు తీవ్రగాయాలు తూప్రాన్న్ /మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ సమీపంలో సోమవారం చేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం... మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన దాసరి రమేశ్, స్వప్న(29) దంపతులు యాక్టీవాపై చేగుంట మండలం మక్కరాజ్పేటలో స్వప్న పెద్దనాన్న ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆదివారం వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వస్తున్న క్రమంలో 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పటాన్చెరు టౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం..ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రలకు మెరుగైన వైద్యంతోపాటు రూ.50లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే గూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజి ఇక్బాల్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎన్నడూ కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి..ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ. 50 లక్షలపరిహారం ఇవ్వాలి ఒకరికి ఉద్యోగం కల్పించాలి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం -
వృక్ష ప్రేమికుడు విశ్వమోహన్ కన్నుమూత
జహీరాబాద్: నాలుగు దశాబ్దాలపాటు సర్పంచ్గా పని చేసిన కాలంలో రహదారికి ఇరువైపులా చెట్లు పెంచి వృక్ష ప్రేమికుడిగా ప్రశంసలందుకున్న విశ్వమోహన్(88) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కోహీర్ మండలంలోని గొటిగార్పల్లి గ్రామ సర్పంచ్గా పనిచేసిన ఆయన పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు సర్పంచ్గా కొనసాగిన ఆయన తాండూర్ క్రాస్ రోడ్డు నుంచి గొటిగార్పల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల పొడువు ఉన్న రహదారికిరు వైపులా మొక్కలు నాటించారు. అవిప్పుడు మహా వృక్షాలయ్యాయి. -
అర్జీల పరిష్కారానికి ఎదురుచూపులు
● ప్రజావాణిలో వాపోతున్న అర్జీదారులు ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు సంగారెడ్డి జోన్: తమ సమస్యల పరిష్కారానికి ఎదురు చూపులు తప్పటం లేదని అర్జీదారులు వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేసినా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ పద్మజారాణి హాజరై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రజావాణి సమస్యలు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇంటి నంబరు చూపించడం లేదు: రాజు, సదాశివపేట తమ ఇంటి నంబరు రికార్డులతోపాటు ఆన్లైన్లో చూపించడం లేదని అధికారులు చెబుతున్నారు. 2005 వరకు ఇంటికి సంబంధించిన పన్ను కట్టాను. మా నాన్నమ్మ మృతి చెందడంతో పన్ను కట్టేందుకు వెళితే మీ ఇంటి వివరాలు అందుబాటులో లేవని చెబుతున్నారు. కుల ధ్రువపత్రాలు అందించాలి: బొప్పల బాబు, తోలుబొమ్మలాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమకు తమ కుల ధ్రువ పత్రాలు అందించాలి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త కులాల జీవో ఉన్నప్పటికీ తమకు పత్రాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో తమ పిల్లలకు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమకు పత్రాలు అందించాలి. -
సీసీఆర్టీ శిక్షణకు 10 మంది టీచర్లు
● ఈనెల 3 నుంచి ఢిల్లీలో సీసీఆర్టీ శిక్షణ తరగతులు ● 15 రోజుల పాటు నిర్వహణన్యాల్కల్(జహీరాబాద్): విద్యార్థులకు పూర్తిస్థాయి లో అర్థమయ్యే వినూత్న విధానంలో బోధనా పద్ధతులపై ప్రదర్శించిన పలువురు ఉపాధ్యాయులకు న్యూ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో పది మంది ఉపాధ్యాయులను అధికారులు ఎంపిక చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి లోని రేజింతల్ ప్రాథమిక పాఠశాలకు చెందిన సఫియా సుల్తానా, ములుగు జిల్లా ఒడ్డెరగూడెం పాఠశాలకు చెందిన రాజేశ్కుమార్, మాన్సింగ్ తండా పాఠశాల కు చెందిన స్వప్న, మంచిర్యాల్ జిల్లా లోని ముల్కల్గూడ పాఠశాలకు చెందిన దిలీప్కు మార్, యాదగిరి జిల్లాలోని పాయిల్వాన్పూర్ పాఠశాలకు చెందిన రమేశ్, వికారాబాద్ జిల్లాలోని కన్కల్ పాఠశాలకు చెందిన ఈశ్వర్రావు, జగిత్యాల్ జిల్లాలోని తండ్రియాల్ పాఠశాలకు చెందిన విజయ్కుమార్, వర్షకొండ పాఠశాలకు చెందిన రమేశ్, మెదక్ జిల్లాలోని దంతెనపల్లి పాఠశాలకు చెందిన కవిత నిర్మల్ జిల్లాలోని సేవాలాల్ తండా పాఠశాల కు చెందిన ప్రవీణ్కుమార్ ఢిల్లీలో నిర్వహించే ప్రద ర్శనలకు ఎంపికై న ట్లు అధికారులు తెలిపారు. జాతీ య విద్యా విధానం 2020లో భాగంగా సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రం వీరికి ఈ నెల 3 నుంచి 19వ వరకు 15 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నాడు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృతి.. ఇదే తరహాలో ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో ఘటన.. -
పోలీసుల ఓవరాక్షన్
బాధిత కుటుంబాల పట్ల దురుసు ప్రవర్తన పటాన్చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు. అనిత, సంజీవ్లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది. -
పద్మ చావుకు కారణమెవరు?
నిధుల గోల్మాల్లో పాత్రదారులెవరో.. ● దాదాపు రూ.85 లక్షల కుంభకోణం ● బయటకు రాని బ్యాంకుఅధికారుల లీలలు ● బలవుతున్న అమాయకులు పాపన్నపేట(మెదక్): ‘వీఓఏ ఉద్యోగం చివరకు నా ప్రాణం మీదకు తెచ్చింది. బ్యాంకు, సెర్ప్ అధికారులు, తోటి ఉద్యోగులు కలిసి నా చావుకు కారణమయ్యారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని, నా ద్వారా డబ్బులు తీసుకున్నారు. చివరకు నన్ను దోషిగా నిలబెట్టారు. ఇంత జరిగినా ఇంకా చచ్చిపోలేదా? అన్నట్లు కొందరు నిలదీస్తుంటే ఎలా బతకాలి. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా. కలెక్టర్ గారు నా చావుకు కారణమైన వారిని మాత్రం వదలొద్దు. విచారణ జరిపి, నిందితులను గుర్తించి, నా ఆత్మకు శాంతి కలిగించండి’ అంటూ చివరిసారి లేఖ రాసి..ఉరి తాడుకు వేలాడింది.. పొడిచన్పల్లి వీఓఏ పద్మ. కానరాని అధికారులు పొడిచన్పల్లి వీఓఏ పద్మ ఆర్థిక నిందలు భరించలేక ఆత్యహత్య చేసుకొని 5 రోజులైంది. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని చివరి కోరిక కోరుతూ.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఇంత వరకు ఒక్క అధికారి కూడా కనీసం వారి ఇంటికి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. 18 ఏళ్లు సేవ చేసినా కనీసం సానుభూతి కరువైంది. చివరకు వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఆమె పేరును తొలగించి, జ్ఞాపకాలు సైతం చెరిపేశారని కొందరు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిధుల గోల్మాల్లో పాత్రదారులెవరు! పొడిచన్పల్లి గ్రామ సమాఖ్య పరిధిలో కొంత కాలం నుంచి జరిగిన సుమారు రూ.85 లక్షల కుంభకోణం రెండు నెలల క్రితం బయట పడింది. ఇందులో వీఓఏ పద్మతో పాటు బ్యాంకు అధికారులు, సెర్ఫ్ ఉద్యోగులు, సహచరుల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. కాగా తూతూ మంత్రంగా విచారణ జరిపిన అఽధికారులు సీసీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నా యి. అయితే సీ్త్రనిధి నుంచి నెలనెలా వస్తున్న రుణ రికవరీల డబ్బును కొంత మంది బ్యాంకు, సెర్ఫ్ అధికారులు వాడుకొని.. వాటిని చెల్లించడానికి డ్వాక్రా సంఘాల పేరిట సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు. వాటిని పద్మ ద్వారా మళ్లించి, సీ్త్రనిధికి జమ చేశారని పద్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నుంచి కూడా 18 చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయించి పద్మను బలిచేశారని వాపోతున్నారు. అసలు డ్వాక్రా రుణాలు మొదట గ్రూపు ఖాతాలోకి, తర్వాత సభ్యుల బ్యాంకు ఖాతాలోకి వెళ్లాల్సి ఉండగా, అధికారుల ప్రమేయం లేకుండా పద్మ ఎలా కాజేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నిధులు సైతం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలు లేకుండా ఆమె ఎలా మళ్లించుకుంటుందని అడుగుతున్నారు. పద్మ మరణానికి కారకులెవరు? డ్వాక్రా సంఘాల నిధుల గోల్మాల్లో ‘తిలా పాపం తలా పిడికెడు’అన్న చందంగా బ్యాంకు, సెర్ప్, తోటి ఉద్యోగుల పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిధుల గోల్మాల్ బయట పడగానే అధికారులంతా పద్మను బాధ్యురాలిని చేస్తూ నిధుల రికవరీ కోసం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. మరో వైపు కొంత మంది గ్రామస్తుల అవమానకర మాటలు, సంఘ సభ్యుల శాపనార్థాలు ఆమెను కుంగదీశాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర లేని డబ్బులు ఎలా చెల్లించాలనే ఆందోళన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయని అంటున్నారు. బాఽధ్యులను గుర్తించి శిక్షించాలి అమ్మ చివరి కోరిక మేరకు డ్వాక్రా రుణాల గోల్మాల్పై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపండి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోండి. మాకు అప్పులు తప్ప ఆస్తులు లేవు. మా అమ్మ అన్ని డబ్బులు తీసుకుంటే మా భూములు ఎందుకు అమ్ముకుంటాం. పెంకుటింట్లో ఎందుకు నివసిస్తాం. మేము చదివింది సర్కార్ బడిలోనే. మా అమ్మ చనిపోయి 5 రోజులు అయ్యింది. కనీసం చివరి కోరికకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. పోయిన మా అమ్మను తెచ్చి ఇవ్వకున్నా, పోయిన పరువును కూడగట్టుకోవాలని పరితపిస్తున్నాం. – నవీన్ రెడ్డి (మృతురాలి కొడుకు) -
భూ తగాదాలో స్నేహితుడి హత్య
కల్హేర్(నారాయణఖేడ్): భూ తగాదాలో స్నేహితుడు దారుణ హత్యకు గురయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ హన్మండ్లు, కుర్మ రమేష్ కుటుంబీకుల మధ్య దారి విషయంలో భూ తగాదా జరుగుతోంది. కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. భూ తగాదా విషయమై గ్రామంలో ఆదివారం ఉదయం పంచాయతీ జరిగింది. పంచాయతీలో సమస్య పరిష్కారం కాలేదు. మధ్యాహ్నం కుర్మ రమేష్, కర్పట్ల జైపాల్ కలిసి వ్యవసాయ భూమికి వెళ్లారు. రమేష్కు జైపాల్ సహకరిస్తున్నాడని ఇద్దరిని అంతం చేయాలని కుర్మ హన్మండ్లు కుటుంబీకులు పథకం రచించారు. అప్పటికే ఇద్దరి రాక కోసం మార్గమధ్యలో వేచిచేస్తున్నారు. ఇరువురి మధ్య మాటలతో గొడవ మొదలైంది. గొడ్డలి, మరణాయుధాలతో వారిద్దరిపై దాడి చేయగా దాడిలో జైపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. రమేష్కు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని కంగ్టీ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఐలు వెంకట్రెడ్డి, దుర్గ రెడ్డి, వెంకటేశం పరిశీలించారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. మృతుడు జైపాల్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మరొకరికి తీవ్ర గాయాలు సంగారెడ్డి జిల్లాలో ఘటన -
భవనం పైనుంచిపడి మేరిస్తీ మృతి
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడి తాపీ మేరిస్తీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మాసాయిపేటకు చెందిన కండ్లకోయ ఆనంద్(22) తాపీ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని శభాష్పల్లి గ్రామంలో శనివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుకర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి శివ్వంపేట(నర్సాపూర్): చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని మగ్దుంపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రశాంత్ ఆదివారం తెల్లవారుజామున ఇండ్ల ముందు నల్లాలకు బిగించిన మోటార్లతో పాటు కేబుల్ వైర్ల చోరీకి పాల్పడుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధరిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ దగ్ధం చిన్నశంకరంపేట(మెదక్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన ఘటన మండలంలోని ధరిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఈదురుగాలులు వీచడంతో పాటు స్వల్ప వర్షం మొదలైన కొద్దిసేపటికే ట్రాన్స్ఫార్మర్లో మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. సమీప నివాస గృహాల్లోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు అప్రమత్తమై వెంటనే విద్యుత్ సబ్స్టేషన్కు సమాచారం అందించడంలో సరాఫరాను నిలిపివేశారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయంపై ట్రాన్స్కో ఏఈ దినకర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైందని, సరఫరాకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాయీ బ్రాహ్మణులు సంఘటితం కావాలి సంగారెడ్డి: నాయీ బ్రాహ్మణులు సంఘటితమై ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని భారతీయ విద్యా మందిర్ స్కూలులో నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి అందరికీ ఆరోగ్యం, సౌందర్యాన్ని అందించిన ఘనత నాయీ బ్రాహ్మణులకు దక్కుతుందని గుర్తు చేశారు. అనంతరం నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో విషయ పరిజ్ఞానం కలిగినవాడు నాయీ బ్రాహ్మణుడని అన్నారు. సుకుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు నాగభూషణం, దత్తాత్రి, సత్యం, రాజారాం, కిరణ్, నర్సిహులు, రామ్ కిషన్, పట్టణ అధ్యక్షుడు మాణిక్ ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, కార్యదర్శి శ్రీశైలం, యువత కార్య దర్శి రాము, ఉపాధ్యక్షులు అనిల్ పాల్గొన్నారు. -
కారు బోల్తా.. బాలిక మృతి
పాపన్నపేట(మెదక్): కారు బోల్తాపడి బాలిక మృతి చెందింది. ఈ ఘటన ఏడుపాయల ఆలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన కొత్తూరి ప్రతిమ (17)ఇంటర్ పూర్తి చేసింది. కొంత కాలంగా నగరంలోని ఫతేనగర్ ప్రాంతానికి చెందిన గొల్ల చింటూ (17) ప్రతిమను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ విషయంలో ఇదివరకు రెండు , మూడు సార్లు ప్రతిమ కుటుంబీకులు అతన్ని మందలించారు. అయినా అతని తీరు మారలేదు. ఈ క్రమంలో శనివారం ప్రతిమ ఇంట్లో చెప్పకుండా చింటూతో వెళ్లింది. అతని స్నేహితులు మనోహర్, శివకుమార్తో కలిసి నలుగురు ఇన్నోవా కారులో ఏడుపాయలకు వచ్చారు. చింటూ కారు నడుపుతుండగా, ప్రతిమ, మనోహర్, శివకుమార్ వెనుక కూర్చున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భోజనం చేయడానికి పోతంషెట్పల్లి వైపు వెళ్తుండగా, ఏడుపాయల బస్టాండ్ సమీపంలో అతివేగంగా వెళ్తూ, కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. అటుగా వెళ్లినవారు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ప్రతిమ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చింటూ, మనోహర్, శివకుమార్లకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా తమ కూతురి చావుకు చింటూనే కారణమని మృతురాలి తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిమ మృతదేహం -
అడవి కాకర అధరహో
కిలో రూ.350 పలుకుతున్న వైనం మెదక్ కలెక్టరేట్: ఎన్నో ఔషధ గుణాలున్న అడవి కాకరకాయ ధరలు ప్రస్తుతం మార్కెట్లో అదరహో అనే స్థాయిలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న ధరను చూసి ప్రజలు అదిరిపోతున్నారు. మార్కెట్లో అప్పుడప్పుడు కనిపించే అడవి కాకరకాయలు చాలామందికి తెలియదు. రేటు ఎక్కువైతేనేం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి కాకర ప్రస్తుతం మెదక్ మార్కెట్లో కిలో రూ.350 ధర పలుకుతోంది. దీంతో వాటిని కొనాలని ఆశ ఉన్నప్పటికీ చాలా మంది కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇవి అటవీ ప్రాంతంలోనే పండుతాయి. కాబట్టే వీటికి అంత రేటు. ఆరోగ్యాన్నే కాదు మంచి రుచిని కలిగి ఉంటుంది. వీటిని అన్ని వయసుల వారు తినొచ్చు. వర్షాకాలంలో తింటే మరీ మంచిదని పెద్దలు చెబుతారు. వర్షాకాలంలో మొదలయ్యే జలుబు, దగ్గు, తుమ్ముల నుంచి రక్షిస్తుంది. కాకరతో బహుళప్రయోజనాలు ఉన్నాయి. -
కాలేజీకి రోడ్డు నిర్మించరూ?
నెలలు గడిచినా పూర్తి కాని పనులుహుస్నాబాద్రూరల్: హుస్నాబాద్కు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కావడం ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాలేజీ తరగతులను ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ప్రారంభించనున్నారు. 2017లో ప్రారంభమైన పాలిటెక్నిక్కు 2023 ఎన్నికల ముందు డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.90లక్షలను కలెక్టర్ మంజూరు చేసి టెండర్లు పిలిచారు. కానీ నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం మారడంతో రోడ్డు మంజూరు పనులు మళ్లీ మొదటికీ వచ్చాయి. కాలేజీ ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు కాలేజీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఈజీఎస్లో రూ.50లక్షల నిధులు మంజూరు చేయించారు. మార్చిలో కాలేజీ ముందు రెండు ట్రిప్పర్ల కంకర పోసిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. పాలిటెక్నిక్ అడ్మిషన్లు, ఇంజినీరింగ్ అడ్మిషన్లు జరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. కాలేజీ వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, లెక్చరర్లు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధికి బంధువు కావడంతో అధికారులు పనులు చేయాలని అడగడానికి వెనుకడుగు వేస్తున్నారు. -
శంకుస్థాపన ఘనం.. పనులు శూన్యం
పనులు ప్రారంభించాలి డబుల్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలి. కొమురవెల్లి దేవస్థానానికి ఈ రోడ్డు మార్గంలోనే వెళ్తుంటారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు వెళ్లడంతో రద్దీగా ఉంటుంది. సింగిల్ రోడ్డు కావడంతో రాత్రి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు దృష్టి సారించి పనులు వెంటనే చేపట్టాలి. – లింగాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, రామవరం గ్రామం త్వరలో ప్రారంభిస్తాం హుస్నాబాద్ మీదుగా రామవరం గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తాం. ఇటీవల కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినం. పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించాం. ఐదారు రోజుల్లో రోడ్డు విస్తరణ పనులు చేపడతాం. – రాహుల్, ఏఈ ఆర్అండ్బీ అక్కన్నపేట(హుస్నాబాద్): రోజురోజుకు వాహనాల సంఖ్య పెరగడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సింగిల్ రోడ్లు మాత్రమే ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తా నుంచి గౌరవెల్లి మీదుగా రామవరం గ్రామం వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనవరిలో రామవరంలో శంకుస్థాపన చేశారు. ఈ డబుల్ రోడ్డు నిర్మాణానికి సుమారుగా రూ.25కోట్ల నిధులు మంజూరు చేశారు. కాగా శంకుస్థాపన చేసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. అయితే హుస్నాబాద్ నుంచి రామవరం వరకు సుమారుగా 17కిలో మీటర్లు ఉంటుంది. కొమురవెల్లి దేవస్థానానికి దారి హుస్నాబాద్ మీదుగా గౌరవెల్లి గ్రామం నుంచి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి రోజు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. సింగిల్ రోడ్డు మాత్రమే ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలను పక్కకు తప్పించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గౌరవెల్లి గ్రామం రోడ్డంతా గుంతలమయంగా ఉంది. ఈ ఒక్క ఊరు దాటడానికే దాదాపు 20నిమిషాల సమయం పడుతుందని వాహనదారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. హుస్నాబాద్– రామవరం డబుల్ రోడ్డుకు మోక్షమెప్పుడో రూ.25కోట్లు నిధులు మంజూరు కన్నెత్తి చూడనీ అధికారులు -
మెరుగుబడినాయ్..
‘మన్ కీ బాత్’ వీక్షించిన మాజీ ఎంపీ బీబీపాటిల్ బీజేపీతోనే అభివృద్ధి రామచంద్రాపురం(పటాన్చెరు): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలో ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలసి ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పడు ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, మల్లేశ్, కిష్టన్న, లక్ష్మణ్గౌడ్, కృష్ణమూర్తి, శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.జహీరాబాద్ టౌన్: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ. బీబీపాటిల్ పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో 200 బూత్ లో ‘మన్ కీ బాత్’ను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన్ కీ బాత్’ద్వారా ప్రధా ని మోదీ అనేక విషయాలను ప్రజల్లోకి తీసు కెళ్లుతున్నారని చెప్పారు. మహిళా శక్తికి మోదీ కితాబు నారాయణఖేడ్: ‘మన్ కీబాత్’ కార్యక్రమంలో తెలంగాణ మహిళా శక్తికి ప్రధాని మోదీ ప్రత్యేక కితాబునిచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జన్వాడే సంగప్ప తెలిపారు. ‘మన్కీ బాత్’123వ ఎపిసోడ్ను ఖేడ్లో ఆయన కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలంలో మహిళాగ్రూపు మిల్లెట్ బిస్కెట్ల తయారీ గురించి ప్రస్తావించారన్నారు. -
మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 94901 29839 నంబర్ సంప్రదించాలని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘తపస్’ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట సుధాకర్జహీరాబాద్ టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట సుధాకర్ నియమితులయ్యారు. తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ ఆదివారం జహీరాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా తపస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోట సుధాకర్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తపస్ జిల్లా కార్యదర్శిగా నియమించడం పట్ల సుధాకర్ రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ రఘునందన్రావుకు ఎమ్మెల్యే గూడెం పరామర్శపటాన్ చెరు టౌన్: ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావును ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పరామర్శించారు. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో ఎంపీ రఘునందన్రావును ఆదివారం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి కృపతో త్వరితగతిన కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఉచిత వైద్య శిబిరానికి స్పందన భేష్న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని మెటల్కుంట గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. జహీరాబాద్లోని ప్రగతి నర్సింగ్హోమ్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) వారి ఆధ్వర్యంలో మెడ్ బ్రిడ్జి స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన రోగులు తరలి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. 250 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యు లు వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. శిబిరానికి జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి హాజరై మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల రోగులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు. ఈ సందర్భంగా వారికి డీడీఎస్ సభ్యులు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో విక్రమ్ ఆదిత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మకు ప్రత్యేక పూజలు
మునిపల్లి(అందోల్): వర్షాలు పడాలని సింగూర్ ప్రాజెక్టు సమీపంలో గ్రామస్తులంతా కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని బుస్సారెడ్డిపల్లి గ్రామస్తులు వర్షాలు పడాలని గ్రామంలో ఆయా దేవాలయాల్లో దేవతలకు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు. పంటలు మొలకెత్తి రోజులు గడుస్తున్నా వర్షాలు పడక పోవడంతో రైతులు ఆందోళన చెందిన గ్రామంలో దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. గంగమ్మకు నైవేద్యం పెట్టి గ్రామస్తులంతా అక్కడే భోజనం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. వానలు కురిపించు బీరప్పా! నారాయణఖేడ్: వర్షాలు కురియాలని కోరుకుంటూ ఖేడ్ మండలం రుద్రారం గ్రామ రైతులు ఆదివారం బీరప్పదేవుడి పండగను ఘనంగా నిర్వహించారు. భజనలతో గ్రామం నుంచి గ్రామ శివారులోని బీరప్ప ఆలయానికి వెళ్లి స్వామి వారికి ప్రత్యేకపూజలు చేశారు. అన్నప్రసాద వితరణ చేపట్టారు. వివిధ పార్టీల గ్రామనాయకులు ప్రభాకర్, శ్రీకాంత్రెడ్డి, సిందోల్ దశరథ్, రైతులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా, సమసమాజం రావాలన్నా అది కేవలం మార్కిస్ట్ సిద్ధాంతంతోనే సాధ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ఆదివారం కేవల్కిషన్ భవన్లో సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ...సమాజంలో సామాజిక అసమానతలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాల పేరిట, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజ య్య, మల్లేశం, మాణిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఆర్తో ట్రాఫిక్ సమస్యలు దూరం
రింగ్ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఖేడ్ పట్టణం చుట్టూ లింకురోడ్లను కలుపుతూ నిర్మిస్తున్న రింగురోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారంశంకర్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి, అవుటి శంకర్, జానీపటేల్లతో కలిసి రింగురోడ్డు పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని రహదారిని విస్తరించడంతోపాటు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు పట్టణం విస్తీర్ణం కూడా పెరిగనుందన్నారు. పేదల సంక్షేమానికి కృషి ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. నాయకులు కృష్ణ, దుర్గయ్య, తుకారాం, రాజేందర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
నారాయణఖేడ్ కోసం ఎంపీ, ఎమ్మెల్యే ప్రయత్నాలు
మారుమూల ఖేడ్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే మారుమూల పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దామోదరలను సైతం కలిసి ఖేడ్లో ఏర్పాటు చేయాలని కోరారు. కాగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరిని కలిసి జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం మారుమూలన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఖేడ్లో ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కోరారు. అందుకు అనువైన స్థలం కూడా ఉన్నట్లు వివరించారు. అందుకు మంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వెల్లడించారు. ఖేడ్ ఆర్డీఓ అశోక చక్రవర్తి, రెవెన్యూ అధికారులు ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్– బాచేపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. నవోదయ పాఠశాల ఏర్పాటుకు ఈ భూమి అనుకూలంగా ఉన్నట్లు అధికారులు నివేదిక సమర్పించారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
కార్యకర్త సురేశ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దామోదర వట్పల్లి(అందోల్): కాంగ్రెస్ కార్యకర్త తలారి సురేశ్ మరణం అతని కుటుంబానికే కాదు.. పార్టీకే తీరని లోటని, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. మండల పరిధిలోని మేడికుందా గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తలారి సురేశ్ అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందాడు. విషయం తెలిసిన మంత్రి ఆదివారం మృతుని ఇంటికి వెళ్లి సురేశ్ మృతిపట్ల నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుని తల్లిదండ్రులు, భార్య పిల్లలను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
‘నవోదయ’ం ఎక్కడ?
● మూడు ప్రాంతాల్లో స్థలాలు పరిశీలన ● నివేదికలు సమర్పించిన అధికారులు ● ఫైనల్ చేయనున్న జేఎన్వీ ● తాత్కాలికంగా విద్యా సంవత్సరం ప్రారంభం నారాయణఖేడ్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జవహార్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీ) మంజూరు చేసింది. రాష్ట్రానికి 9 కొత్త విద్యాలయాలను గతేడాది మంజూరు చేయగా అందులో సంగారెడ్డి జిల్లాకు ఒక విద్యాలయాన్ని కేటాయించారు. జిల్లాకు కేటాయించిన విద్యాలయం ఏర్పాటు విషయంలో ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంత విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు కేటాయించిన విద్యాలయం మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని విద్యాభిమానులు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. అందోల్ కోసం మంత్రి.. పటన్చెరు కోసం ఎంపీ ఆందోల్ నియోజకవర్గంలో నవోదయ ఏర్పాటు చేయాలన్న పట్టుతో మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఆందోల్ శివారులో 20 ఎకరాల స్థలాన్ని సైతం అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించారు. తన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో మంత్రి ఉన్నారు. కాగా మెదక్ ఎంపీ రఘునందన్రావు పటాన్చెరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న యోచనతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దల ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటుకు యత్నిస్తున్నారు. కాగా, అక్కడ కూడా అధికారులు స్థలాలను పరిశీలించారు. అమీన్పూర్ ప్రాంతంలో తగినంత స్థలం అందుబాటులో లేదని అధికారులు గుర్తించారు. జేఎన్టీయూలో తరగతులు.. రాష్ట్రానికి మంజూరైన నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. జూలై 14 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రణాళిక తయారు చేస్తున్నారు. జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం తరగతులను తాత్కాలికంగా ఆందోల్లోని జేఎన్టీయూలో ఏర్పాటు చేశారు. వచ్చేనెల రెండు లేదా మూడో వారంలో తరగతులను ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు పరిశీలించి గదులను సిద్ధం చేశారు. నిజాంపేట్– బాచేపల్లి మార్గంలో స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ, రెవెన్యూ అధికారులుతరగతులు ప్రారంభం.. జూలై రెండు లేదా మూడో వారంలో తరగతులు ప్రారంభిస్తున్నాం. ఆందోల్లోని జేఎన్టీయూలో తాత్కాలికంగా నవోదయ ఏర్పాటుకు భవనాలను పరిశీలించాం. ఈ విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రారంభం అవుతుంది. నవోదయ ఎక్కడ నిర్మించాలనే అంశం జేఎన్వీ (జనవహార్ నవోదయ విద్యాలయం) బృందం నిర్ణయించాల్సి ఉంటుంది. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి,సంగారెడ్డి -
మతోన్మాదుల కుట్రలు తిప్పికొట్టాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి సోషలిజం, సెక్యులర్ పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన వైఖరి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండా రవికుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నాయకత్వ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. భారతదేశం మత రాజ్యం కాకూడదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన పోటీ పడాలని రాజ్యాంగ స్ఫూర్తి వెల్లడిస్తుందన్నారు. దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని మతోన్మాద శక్తులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలందరూ తమకు నచ్చిన మతాన్ని ఆచరిస్తూనే లౌకిక భావనతో పరమత సహనాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జాబ్మేళా
నర్సాపూర్: పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో ఆదివారం జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జాబ్మేళా ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించామన్నారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు వస్తారని, 1,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. మొక్కలు నాటి సంరక్షించండి సంగారెడ్డిటౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి దేవిలాల్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఓ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీశాఖ అధికారి వేణుగోపాల్, పాఠశాల సిబ్బంది వేణు పాల్గొన్నారు. బేస్లైన్ టెస్టులు నిర్వహించాలి జహీరాబాద్ టౌన్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పరిక్షించేందుకు బేస్లైన్ టెస్టులు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మండలంలోని హుగ్గెల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలా బోధించాలి.. వారు ఏమి నేర్చుకోవాలనే దాని గురించి ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, టీచింగ్ డైరీ, యూనిట్ ప్లాన్ రాయాలని సూచించారు. ఐఎఫ్పీ ప్యానె ల్లను వాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక పాఠశాల కిచెన్, టాయిలెట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ మాణయ్య ఉన్నారు. పింఛన్ల మంజూరుకు చర్యలు నర్సాపూర్: అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి హేమలత చెప్పారు. శని వారం ఆమె పట్టణంలోని విజన్ వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వృద్ధులను అప్యాయంగా పలకరించారు. ఏమైనా ఇబ్బందులుంటే చెప్పాలని కోరారు. దీంతో పలువురు తమకు పింఛన్ రావడం లేదని, ఇప్పించాలని కోరారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వృద్ధులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యుత్ స్తంభాలనుపునరుద్ధరించాలి హవేళిఘణాపూర్(మెదక్): కొన్ని రోజుల క్రితం ఈదురుగాలులతో కిందపడిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని స్కూల్ తండా శివారులో పడిపోయిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ అధికారులు స్పందించి సకాలంలో చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, మాజీ సర్పంచ్ యశోద, వార్డు సభ్యులు రవి, సాయిలు, యామిరెడ్డి, దాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వల్లూర్లో ముదిరిన చేపల వివాదం
16 మంది ముదిరాజ్ల బైండోవర్చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం వల్లూర్లో ఏడాదిగా చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామస్తులు, ముదిరాజ్లకు వివాదం నడుస్తోంది. వల్లూర్ చెరువులో చేపలు పట్టేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను డీసీఎంలో ముదిరాజ్లు తీసుకురావడంతో గ్రామస్తులు అడ్డుకొని పోలీస్లకు అప్పగించారు. గతంలో పంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామసభలో అధికారులు ఇరువర్గాలతో చర్చించారు. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యశాఖ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే అర్హులని తేల్చిచెప్పారు. దీనికి గ్రామస్తులు కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇతరులు వస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. కాగా శనివారం డీసీఎంలో వలలతో ఇతర ప్రాంతానికి చెందిన మత్స్యకారులను చేపలు పట్టేందుకు రావడంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ ఇరువర్గాలను సముదాయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 16 మంది ముదిరాజ్లను బైండోవర్ చేశా రు. మరోవర్గానికి చెందిన వారిని సోమవారం బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు. -
ప్రణాళిక పనులు పక్కాగా సాగాలి
పట్టణ ప్రణాళిక పనులను ప్రారంభిస్తున్న నిర్మలారెడ్డి సంగారెడ్డి: పట్టణంలో వంద రోజుల ప్రణాళిక పనులు పక్కాగా జరగాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 32వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంతకిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, 32వ వార్డు ఇన్చార్జి సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సంతోష్, మాజీ కౌన్సిలర్ రామప్ప, అధికారులు పాల్గొన్నారు.టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి -
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై అనాసక్తి
● ముందుకు రాని లబ్ధిదారులు ● జిల్లాకు 14,518 ఇళ్లు మంజూరు ● ప్రారంభించినవి 5,023 మాత్రమే.. వారంలో 50 శాతం ప్రారంభిస్తాం మరో వారం రోజుల్లో 50 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నాం. లబ్ధిదారులకు వెంట వెంటనే బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో బేస్మెంట్ వరకు పూర్తయిన 286 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున బిల్లులు అందించాం. గ్రామాల్లో అధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది ఆషాడం అని ముందుకు రావడం లేదు. – చలపతిరావు, గృహ నిర్మాణ శాఖ పీడీహత్నూర(సంగారెడ్డి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకురావడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆసక్తి చూపడం లేదు. జిల్లాకు 14,518 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం 5,023 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. 286 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తి కావడంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు రూ. లక్ష చొప్పున జమ చేశారు. అయితే 15 రోజుల క్రితం వరకు జిల్లాలో కేవలం 2,000 మంది మాత్రమే ఇళ్లు కట్టుకోవడానికి ముందుకొచ్చారు. ఈ వారంలో 3,000 మంది లబ్ధిదారులు ముగ్గుపోయడంతో కొంత పురోగతి కనిపించింది. 60 గజాలలోపు ఇంటి నిర్మాణం చేపట్టాలనే నిబంధనతో కొంతమంది ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. మరికొందరు తమకు అనుకూలంగా ముగ్గుపోసుకొని ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అయితే వాటికి బిల్లు మంజూరు కాదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతిఒక్కరూ అధికారులు వచ్చి ముగ్గు పోసిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. అవగాహన కల్పిస్తున్న అధికారులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నారు. అయితే డబ్బులు లేక కొందరు, స్థలం అనుకూలంగా లేక మరికొందరు ముందుకు రావడం లేదు. ఇంకొందరు ఉన్న ఇంటిని కూల్చివేసి కొత్తది నిర్మించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి 94 ఇళ్లు మంజూరు కాగా, 50 మంది ఆర్థిక స్థోమత లేదని, ఇళ్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నామని అధికారులకు రాత పూర్వకంగా రాసిచ్చారు. -
అన్ని హంగులతో కోర్టు భవనం
జిన్నారం(పటాన్చెరు): మండల కేంద్రంలోని కోర్టు భవనాన్ని జిల్లా జడ్జి భవానిచంద్ర శనివారం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన భవనంలో వసతులపై ఆరా తీశారు. వినియోగదారుల కోసం ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఛాంబర్ హాల్లో ఫర్నీచర్, టేబుల్స్ వివిధ వసతులు ఏర్పాటుకు పలు సూచనలు చేశారు. కోర్టు భవనానికి కావాల్సిన అన్ని హంగులు, వసతులు పూర్తిచేసిన అనంతరం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్గౌడ్, నర్సాపూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, తహసీల్దార్ దేవదాస్, సీఐ నయిమొద్దీన్, ఎస్ఐ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్రావు రామాయంపేట(మెదక్): తూప్రాన్, మేడ్చల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని అగ్నిమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్రావు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఫైర్స్టేషన్ను తనిఖీ చేసి జిల్లా అధికారి వెంకటేశ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలో 19 జిల్లాల్లో సుమారుగా 70 అగ్నిమాపక కేంద్రాలున్నాయన్నారు. ఒక్కో కేంద్రంలో 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల విషయమై తమ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కొత్తగా మహదేవ్పూర్, కేసముద్రం పట్ట ణాలకు అగ్నిమాపక కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. మేడ్చల్ నుంచి నిజామాబాద్ వరకు జాతీ య రహదారిపై ఎక్కడా ఫైర్స్టేషన్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయ న్నారు. అంతకుముందు ఫైర్ పరికరాలను పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. -
సోలార్ ప్లాంట్లతో మహిళా సాధికారత
నర్సాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాల ప్రతినిధులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గ్రామీ ణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు తెలిపారు. పలుశాఖల అధికారులతో కలిసి నర్సాపూర్లోని దేవాదాయశాఖకు చెందిన భూములను శనివారం పరిశీలించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సబ్స్టేషన్కు పవర్ సరఫరా, తదతర అంశాల గురించి ఆరా తీశారు. స్థానికంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ను నాలుగు గ్రామాల మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారని చెప్పారు. కాగా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు, నాబార్డు ఏజీఎం రామారావు, కన్సల్టెంట్ రామకృష్ణ, తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ సంస్థ అధికారి రవీందర్ చౌహాన్, ఏడీఈ రమణారెడ్డి, దేవాదాయ ఈఓ శ్రీనివాస్, ఏపీఎం గౌరిశంకర్, ఏపీఓ అంజిరెడ్డి, సర్వేయర్ అభిలాష్ తదితరులు ఉన్నారు.సెర్ప్ చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు -
● రెవెన్యూ సదస్సుల్లో వచ్చినఅర్జీల్లో ఇవే అధికం ● ఆయా సర్వే నంబర్లోనిపట్టాదారులకు నోటీసులు ● భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూశాఖ కసరత్తు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భూభారతి అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయి. మూడో వంతు అర్జీలు ఈ కేటగిరికి చెందినవే ఉన్నాయి. వీటి పరిష్కారం రెవెన్యూశాఖకు సవాల్గా మారింది. టీఎం–33 మాడ్యుల్ కింద వీటిని పరిష్కరించేందుకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరించాలంటే ముందుగా ఆయా సర్వే నంబర్లో ఇతర పట్టాదారులకు నోటీసులు జారీ చేయాలి. ఆయా నంబర్లలలో గల్లంతైన భూమిని వెతకాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి పంచనామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలంటే తగిన సిబ్బంది అవసరం. అయితే చాలా మండలాల్లో రెవెన్యూ సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీఆర్ఓలను ప్రభుత్వం తిరిగి రెవెన్యూశాఖకు పంపాలని నిర్ణయించినప్పటికీ.. వారు ఇంకా పూర్తిస్థాయిలో రెవెన్యూశాఖకు రాలేదు. దీంతో ఉన్న సిబ్బందితోనే ఈ పక్రియను నిర్వహించాల్సి వస్తోంది. మూడో వంతు ఇవే.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పక్షం రోజుల క్రితం వరకు గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. జిల్లాలో మొత్తం 596 గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో రైతుల నుంచి 16,036 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్కు సంబంధించిన దరఖాస్తులే 5,324 రావడం గమనార్హం. అంటే వచ్చిన దరఖాస్తుల్లో 33 శాతం మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించినవే ఉన్నాయి. వీటి తర్వాత భూములకు వారసత్వ హక్కులు కల్పించాలని వచ్చిన అర్జీలు అధికంగా ఉన్నాయి. ఇలా సక్సేషన్ కోసం 1,412 దరఖాస్తులు రాగా, మ్యూటేషన్ల కోసం మరో 1,485 దరఖాస్తులు వచ్చాయి. నిషేధిత భూముల జాబితాల్లోంచి తమ భూమిని తొలగించాలని కోరుతూ వచ్చిన వినతులు 1,180 ఉండగా, అసైన్డ్ భూములకు సంబంధించినవి 767, మరో 2,290 దరఖాస్తులు సాదాబైనామాలు.. ఇలా అన్నిరకాల దరఖాస్తులు ఉన్నాయి. పోర్టల్లో నమోదు.. వచ్చిన దరఖాస్తులను భూభారతి పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆయా తహసీల్దార్లకు ఇచ్చిన ప్రత్యేక లాగిన్లో ఈ దరఖాస్తులను ఉంచుతున్నారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ కొంత ప్రహాసనంగా సాగుతోంది. ఒక్కో దరఖాస్తుకు సుమారు 20 నిమిషాలు పడుతోందని, సర్వర్ స్లోగా ఉంటే మరింత టైం పడుతోందని రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. అర్జీల పరిష్కారంపై దృష్టి భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పూర్తయిన మండలాల్లో ఆయా అర్జీల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. డాక్యుమెంట్లను పరిశీలించి సంబంధిత పట్టాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సైతం చేపడుతున్నారు. -
ఖేడ్లో నవోదయ ఏర్పాటుకు కృషి
ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల మిత్ర సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆందోల్ నవోదయ విద్యాలయం కోసం మంత్రి దామోదర, తన నియోజకవర్గంలో ఏర్పాటుకు ఎంపీ రఘునందన్రావు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అయినా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తామూ ఈ పాఠశాలలోనే చదువుకున్నామని, పాఠశాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమీకరిస్తామన్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించారు. రూ.40 లక్షలతో అవసరమైన పరికరాలున్న కొత్త అంబులెన్స్ను సమకూరుస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. వెద్యుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య తలెత్తొద్దు
కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధి కారులకు సూచించారు. శనివారం క్యాంపు కార్యా లయంలో మంజీరా బ్యారేజీ, సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కు సరఫరా అవుతున్న తాగునీటి వివరాలను, మంజీరా బ్యారేజ్ పరిస్థితి, నారింజ వాగు, సింగూర్ పరివాహాక ప్రాంతం వివరాలు, నూతనంగా చేపట్టిన చెరువులు, కుంటల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని గురుకుల సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లీకేజీలకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మిషన్ భగీరథ డీఈ రఘువీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కార్పొరేట్కు దీటుగా నిల‘బడి’న వైనం
● సత్ఫలితాలనిచ్చిన ‘బడిబాట’ కార్యక్రమం ● ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న ప్రవేశాలు ● దాతల వితరణ, టీచర్ల ప్రత్యేక కృషితో బడిలో చేరేందుకు మొగ్గు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు జోరందుకున్నాయి. అడ్మిషన్లు పెంచేందుకు అటు ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు ఇటు సదరు పాఠశాలల ఉపాధ్యాయులు ‘బడిబాట’పేరుతో చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. ఇదే ఊపును కొనసాగిస్తే జూలై చివరాఖరి వరకు ప్రవేశాలకు ఇంకా సమయం మిగిలి ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన ప్రవేశాల లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ప్రభుత్వ బడుల్లో దాతల వితరణలతో మెరుగుపడిన మౌలిక వసతులు, విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, పెన్నులు, స్కూల్ బ్యాగ్లు ఉచిత పంపిణీ వంటి అంశాలు అడ్మిషన్లు పెరిగేందుకు ఎంతగానో దోహదపడ్డాయి.ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇందులో మొదటి వరుసలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొదటి వరుసలో ఉంటుంది. ఈ పాఠశాల అంటే విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత క్రేజ్ అంటే...ఈ ఏడాది ఆరో తరగతిలో 180 సీట్లు ఉండగా 150 సీట్లు కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని విద్యార్థులకు కేటాయించగా...మిగిలిన 30 సీట్లకోసం ఏకంగా 340 దరఖాస్తులు వచ్చాయి. అందుకే ఈ పాఠశాలలో ప్రతీ ఏటా నో అడ్మిషన్ బోర్డు పెడుతుంటారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1,217 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటి? ఈ పాఠశాలలో పుస్తకాల్లోని చదువు మాత్రమే కాకుండా సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. డిజిటల్ విద్యా బోధన, గ్రంథాలయం, క్రీడాప్రాంగణం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సీటీ) ఆధ్వర్యంలో వివిధ భాషలలో శిక్షణ, కవిత్వం, ఆర్థిక, సామాజిక, తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. పాఠశాలకు సంబంధించిన నిర్వహణ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పోటీలు పడుతున్నారురామచంద్రాపురం(పటాన్చెరు): విద్యార్థులు పోటీపడి మరీ బడిలో చేరాలనుకుంటున్న పాఠశాలల్లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని జిల్లా పరిషత్ పాఠశాల ఒకటి. ఇందులో చేరాలంటే విద్యార్థులు ముందుగా పరీక్ష రాసి అందులో ప్రతిభ చాటాలి. ఈ స్కూల్లో ప్రతీ ఏటా టెన్త్ నూరుకు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తుండటంతోపాటుగా చదువులో వెనుకబడిన విద్యార్థులకు తెల్లాపూర్ నైబర్హూడ్ అసోసియేషన్ సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆధునిక పాఠశాల భవనం, ల్యాబ్, డిటిటల్ తరగతులతో విద్యాబోధన, వారానికి ఒకసారి లైఫ్స్కిల్పై ప్రత్యేక శిక్షణ, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుండటం ఈ స్కూల్ ప్రత్యేకతలు. దీంతో విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతేడాది 410మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 545 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టినప్పటికీ తమ పిల్లలకు ప్రవేశం కోసం వివిధ మార్గాల ద్వారా రికమండేషన్స్ చేయిస్తున్నారు. మోడల్ స్కూల్ లో అడ్మిషన్లు ఫుల్ ఝరాసంగం(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలంలోని మోడల్ స్కూల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధనతోపాటు వృత్తి విద్యా బోధన కూడా చేస్తుండటంతో విద్యార్థులు ఈ ప్రభుత్వ బడిలో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ పాఠశాలలో బోధిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఈ స్కూల్లో అడ్మిషన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. లక్ష్యానికిపైగా కస్తూర్బాలో అడ్మిషన్లు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో లక్ష్యానికిపైగా అడ్మిషన్లు ఉన్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పదో తరగతిలో 100% ఫలితాలు సాధిస్తుండటంతో 208 మంది బాలికలు వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నారు. సర్కారీ స్కూళ్లకు సలామ్..!ప్రత్యేక శ్రద్ధతో పెరిగిన ప్రవేశాలు న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మామిడ్గి ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. గతేడాది 129 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 140కి పైగా విద్యార్థులు ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ బడిలో టీచర్లతోపాటు దాతల సహకారంతో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ప్లేట్లు, పెన్నులు, బ్యాగ్లు వంటి వాటిని ఉచితంగా అందిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ బడిలో చేర్పేంచేందుకు ముందుకు వస్తున్నారు. ఇక డప్పూర్ పాఠశాలలో హెచ్ఎం జావీద్ ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఇల్లిల్లు తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అవగాహన కల్పించారు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. గతేడాది 70 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం 110 విద్యార్థులు చేరారు. ఇక హద్నూర్ పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా 40 మందికి పైగా విద్యార్థులు చేరారు. అదనంగా గంట సేపు బోధన నర్సాపూర్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధపెట్టి చదివిస్తుండటంతోపాటు ఆట పాటలు, సంస్కృతి సంప్రదాయాలను కూడా బోధిస్తుండటం గ్రామస్తుల్ని బాగా ఆకర్షించింది. పైగా ఈ గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకన్నా ఈ బడిలో చదివిన విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారు. దీంతో తమ పిల్లలను ఈ స్కూల్లోనే చేర్పించారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ అదనంగా గంట సమయాన్ని కేటాయించి పాఠాలు బోధించేలా చేశారు. ఉపాధ్యాయులు సొంత డబ్బులతోపాటు దాతల సహకారంతో విద్యార్థులకు అవసరమైన టై, బెల్టులు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీనెల స్లిప్ టెస్టులు పెడుతూ సీ గ్రేడ్లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధిస్తున్నారు. దీంతో గతేడాది 1 నుంచి 5వ తరగతి వరకు 33 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసించగా...ప్రస్తుతం 65 మంది విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఆరోవ తరగతి వరకూ అప్గ్రేడ్ చేస్తూ అధికారులు ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రకటించారు. -
పొలం తన పేరున కాక.. అప్పులు తీర్చలేక
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యహవేళిఘణాపూర్(మెదక్): అప్పు చేసి కొనుగోలు చేసిన పొలం తన పేరున కాకపోవడం, ఇంటి అవసరాలకు చేసిన అప్పులు పేరుకుపోవడంతో జీవితంపై విరక్తి చెందిన రైతు పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చీమల చంద్రయ్య (55) కొంతకాలం క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 20 గుంటల పొలం అప్పు చేసి కొనుగోలు చేశాడు. ఆ పొలం తన పేరున కాకపోవడంతో పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పురుగు మందు సేవించాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబీకులకు సమాచారం అందించగా, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే 108లో మెదక్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీకి తరలించేలోపే మృతిచెందాడు. పొలం కోసం, ఇంటి అవసరాల కోసం అప్పులు అయ్యాయని బాధపడుతూ ఉండేవాడని, కొనుగోలు చేసిన భూమి కూడా తన పేరునకాకపోవడంతో ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు కూడా సమర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రైతు చంద్రయ్య పేరున పొలం లేకపోవడంతో రైతుబీమా సైతం వర్తించిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రైలు పట్టాలపై యువతితూప్రాన్: రైలు పట్టాలపై యువతి బలవన్మరణంకు పాల్పడిన ఘటన శనివారం పట్టణ సమీపంలోని బ్రహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన శవర్తి నర్సవ్వ, శంకర్ దంపతుల మూడో కూతురు స్వర్ణ(24) కొన్నేళ్లుగా మనోహరాబాద్ మండలం రామాయిపల్లి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తుంది. ఈ క్రమంలోనే రోజు మాదిరిగా ఉద్యోగానికి వెళ్లిన యువతి ఇంటికి చేరుకుంది. అనంతరం తూప్రాన్లో పని ఉందని ఇంటి నుంచి బయల్దేరిన స్వర్ణ బ్రహ్మణపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు వస్తుండగా ఒక్కసారిగా దూకేసింది. దీంతో స్వర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది -
హెచ్ఎం సొంత నిధులు
కొండపాక(గజ్వేల్): దూర ప్రాంతాలనుంచి విద్యార్థులు తమ స్కూలు వచ్చేందుకు ఏడాది పాటు ఆటో ద్వారా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్రెడ్డి. దీంతోపాటుగా పాఠశాల ఆవరణలో ఆట వస్తువులు క్రీడా దుస్తులు, స్వచ్ఛమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, ఐఎఫ్బీ స్క్రీన్ ఎల్ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలకు అందమైన రంగులు వేయడం వంటి వాటి కోసం సుమారు రూ. 9లక్షలను తన సొంత డబ్బుల్ని ఖర్చుపెట్టి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. ఇక బడిబాట కార్యక్రమంలో ఇల్లిల్లూ తిరుగుతూ పాఠశాలలో లభించే వసతులు, సౌకర్యాల గురించి వివరించడంతో తమ పిల్లలను ఈ బడిలో చేర్పించేందుకు ముందుకు వచ్చారు. సుమారు 70 మందికిపైగా ప్రైవేట్ స్కూల్కు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులు ఈ బడిలో చదువుకుంటున్నారు. -
పోలీసుల అదుపులో కొమురవెల్లి చోరీ నిందితుడు!
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించిన నిందితుడిని కొమురవెల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన నిందితుడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చి పక్కగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని పోతుగంటి కొమురవెల్లి ఇంట్లో బుధవారం చోరీ జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యా దు చేసిన విషయం తెలిసిందే. అయితే విషయమై ఎస్ఐ రాజును వివరణ కోరగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. బంధువుల ఇంటికి వెళ్తూ...బైక్ అదుపుతప్పి కొడుకు మృతి తల్లికి తీవ్ర గాయాలు హత్నూర(సంగారెడ్డి): బంధువుల ఇంటికి వెళ్తూ బైక్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. హత్నూర మండలం గోవిందరాజు పల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హత్నూర మండలం సికిందలాపూర్ గ్రామానికి చెందిన కురుమ దానయ్య(42) అతడి తల్లి వీరమ్మతో కలిసి ఉదయం మెదక్ జిల్లా సోమక్కపేటలో ఉండే బంధువుల ఇంటికి బైక్పై బయల్దేరారు. సరిగ్గా గోవిందరాజు పల్లి గ్రామ శివారులో చేరుకునేసరికి బైక్ అదుపు తప్పి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందగా వీరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న పశువుల కాపరులు వీరిని చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వీరమ్మను చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దానయ్య మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 108 అంబులెన్స్లో ప్రసవంతల్లీ బిడ్డా క్షేమం వర్గల్(గజ్వేల్): గజ్వేల్ మండలంలో ఓ గర్భిణిని ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. వర్గల్ మండలం గౌరారం వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పిడిచేడ్ గ్రామానికి చెందిన పుల్ల కల్యాణికి నెలలు నిండటంతో పురుటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం గజ్వేల్లోని మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఫిట్స్ రావడంతో అక్కడి వైద్యులు గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో శనివారం ఉదయం ఆమెను 108 అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పురుటినొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై ఆమెకు ప్రసవం చేశారు. తల్లీ, మగశిశువు క్షేమంగా ఉన్నారని వారిని తిరిగి గజ్వేల్ ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. మద్యం తాగి వ్యక్తి మృతికౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కంచన్పల్లిలో శనివారం అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన వివరాలిలా ఉన్నా యి. కంచన్పల్లి గ్రామానికి చెందిన నీలబోయిన నర్సింహులు(48) ప్లంబర్ పనిచేస్తుంటా డు. కాగా మద్యానికి బానిసై భార్య లావణ్య, తల్లి క్యాతమ్మతో గొడవ పడి కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్య, తల్లితో గొడవపడి బయటకు వెళ్లి అతిగా మద్యం తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి నిద్రపోయాడు. నర్సింహులును భోజనానికి లేపితే ఎంతకూలేవకపోవడంతో అనుమానమొచ్చిన భార్య తరచి చూడ గా భర్త మృతి చెందినట్లు గుర్తించింది. మృతుడి తమ్ముడు మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
● నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ● సిబ్బందిని అభినందించిన జిన్నారం సీఐ నయీముద్దీన్ హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీను (25) హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించి నిందితుడిని రిమాండ్కు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాసాల గ్రామ శివారులోని ఇప్పలకుంట సమీపంలో ఓ గుర్తుతెలియని కాలిపోయిన మృతదేహాన్ని ఈనెల 25న పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని కాసాల గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీనుగా గుర్తించారు. హత్యకు గురైన శ్రీను అతని బంధువైన దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఎరుకలి మల్లేశం కంపెనీలో పనిచేసేవాడు. గతంలో వీరిద్దరూ దొంగతనం కేసులో నేరస్తులుగా ఉండటంతోపాటు ఇతర తగాదాల్లో కూడా ప్రమేయం ఉంది. ఒక విషయంలో వీరిద్దరి మధ్యా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈనెల 25న వీరిద్దరికీ కోర్టులో కేసు ఉండటంతో శ్రీను ఈనెల 24న బీరంగూడ నుంచి దౌల్తాబాద్కు వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం తాగుతున్న సమయంలో పథకం ప్రకారం మల్లేశం వెంటతెచ్చుకున్న బ్లేడుతో శ్రీనుపైదాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శ్రీను మృతదేహాన్ని మల్లేశం గ్రామశివారులోని ఇప్పలగుంట సమీపంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో మల్లేశంను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. త్వరితగతిన హత్య కేసును ఛేదించిన హత్నూర పోలీస్ సిబ్బందిని సీఐ నయీముద్దీన్ అభినందించారు. -
ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి మరీ..
నారాయణఖేడ్: విద్యార్థుల అడ్మిషన్లకోసం ప్రతీ ఏటా పోటీ నెలకొనే స్కూళ్లలో ఖేడ్లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఒకటి. పాఠశాలలో సాయంత్రం సమయంలో హెచ్ఎం మన్మథకిషోర్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గంటసేపు క్లాసులు, చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ప్రత్యేకంగా బోధిస్తుండటంతో ఈ స్కూల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సహకారంతో ఈ స్కూల్లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ శిక్షణ కొనసాగుతోంది. ఇదే పాఠశాలకు చెందిన హిందీ ఉపాధ్యాయు డు చంద్రశేఖర్ ఆచార్య సేవోద్గం ఫౌండేషన్ ద్వారా 800 మందికి బ్యాగులు, ఇంగ్లిష్ డిక్షనరీలు, నెట్డాటా సంస్థ సహకారంతో 4 ల్యాప్టాప్లు, లయన్స్క్లబ్ సౌజన్యంతో క్రీడాసామగ్రి, మార్చి ఫాస్ట్ డ్రెస్లు, ఇతర దాతర సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్సులు, గుర్తింపు కార్డు లు ఉచితంగా అందజేస్తున్నారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి,జక్కుల యాదగిరి సౌజన్యంతో రూ.3లక్షల విలువైన మినరల్ వాటర్ప్లాంటు ను విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో ఇటీవలే ఏర్పాటు చేశారు. న్యాయవాది అనుపమారెడ్డి సహకారంతో తరగతి బోధనలో ఉపాధ్యాయులకు ఉపయోగపడే సౌండ్సిస్టమ్ను ఇచ్చారు. దీంతో ఈ ఏడాది అడ్మిషన్లు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది 800 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది మరో 850 మంది అడ్మిషన్లు పొందారు. ఇక ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా 150 మంది విద్యార్థులు ఈ స్కూల్లో ప్రవేశాలు తీసుకున్నారు. -
మట్టి రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
జిన్నారం (పటాన్చెరు): అక్రమ మట్టి రవాణాపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. రాళ్లకత్వ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 286లో కొంతకాలంగా అక్రమార్కులు ప్రభుత్వ భూముల నుంచి మట్టి రవాణాకు పాల్పడుతున్నారు. తహసిల్దార్ దేవదాస్, ఎస్ఐ నాగలక్ష్మి శనివారం మట్టి రవాణా చేస్తున్న భూములను పరిశీంలించారు. అనంతరం గ్రామస్తులను కలిసి మట్టి రవాణపై ఆరా తీశారు. ప్రభుత్వం నిరుపేద రైతులు వ్యవసాయం చేసేందుకు అసైన్డ్ భూములను ఇచ్చిందన్నారు. అలా కాకుండా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాను ఆపాలని లేకపోతే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
కోనాయిపల్లి గ్రామస్తుల తీర్మానం
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి(పీబీ) గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు స్కూలుకు పంపించవద్దని తీర్మానించుకున్నారు. గ్రామానికి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రాకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలోని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ఇదే గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 20 మందికి పైగా విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. వాలంటీర్కు గ్రామస్తులే వేతనం గ్రామస్తులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఒక వాలంటర్ను కూడా నియమించి ప్రతీ నెల రూ.5వేల చొప్పున వేతనం గ్రామస్తులే అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లిష్లో బోధన, ప్రత్యేక యూనిఫాం, వివిధ రకాల క్రీడలు తదితర విభాగాల్లో శిక్షణనిస్తుండటంతో విద్యార్థులు ఈ సర్కారు బడికి ఆకర్షితులయ్యారు. ఫలించిన బడిబాట పాఠశాలల పునఃప్రారంభానికి ముందు నుంచే ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణతోపాటు బడిబాట కార్య క్రమం చేపట్టింది. ఉపాధ్యాయులు విద్యార్థులను బడిలో చేర్చుకునేందుకు ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తుల ద్వారా సత్ఫలితాలు సాధించారు. -
బడుల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం
నారాయణఖేడ్: పాఠశాలల తనిఖీకోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. ఖేడ్లో శనివారం నిర్వహించిన సంఘం డివిజన్స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యుటీ ఈవో, ఎంఈవో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలని, అవసరమైనచోట్ల కొన్ని అదనపు పోస్టులను మంజూరు చేసి ప్రత్యేక యంత్రాంగం ద్వారానే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్, సీనియారిటీ సమస్యలతోపాటు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శులు నరేశ్, ఏశప్ప, హరిసింగ్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి సర్వం సిద్ధం
ప్రభుత్వ ఆదేశాలతో.. ప్రభుత్వ ఆదేశాలతో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ముందస్తు ప్రణాళికతో నర్సరీలు ఏర్పాటు చేశాం. ఒక్కో నర్సరీలో 6 వేల వరకు మొక్కలను పెంచాం. మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. సమృద్ధిగా వర్షాలు పడిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలతో మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. – అశోక్ కుమార్, ఏపీఓ, జహీరాబాద్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంకు కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు వనమహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో జూలై నుంచి వన మహోత్సవంను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పనుల్లో నిమగ్నమైంది. జహీరాబాద్ టౌన్: అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాలుష్యం పెరిగి వాతావరణంలో సమత్యుం లోపిస్తుంది. వేసవిలో ఎండలు మండుతున్నాయి, సరైన సమయంలో వానలు పడక రైతులు అవస్థలు పడుతున్నారు. సమస్యను అధిగమించడానికి గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలోని ప్రతి పంచాయతీకో నర్సరీనికి ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో 26 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఒక్కో నర్సరీలో 6 వేల వరకు పెంచారు. ప్రతీ పంచాయతీలో 3 వేల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో 19.50 లక్షల మొక్కలను నాటనున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, అటవీ భూములు, ఊరు వాడ, రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్నారు.ఇవీ నర్సరీల్లో మొక్కలు ఆహ్లాదాన్ని పంచే, నీడ, ఫల సాయం అందించే మొక్కలను పంపిణీ చేసి నాటనున్నారు. దానిమ్మ, జామ, మునగ, అల్లనేరేడు, బొప్పాయి, బాదం, ఉసిరి, ఈత, మందారం, గులాబీ, జాస్మిన్, గుల్మోహర్, కానుగ, వేప,చింత, గన్నేరు, మేంది, జామ, మునుగ, మామిడి, కరివేపాకు తదితర రకాల మొక్కలు నాటేందుకు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. 19.50 లక్షల మొక్కలునాటాలని లక్ష్యం ప్రతీ పంచాయతీలో మూడు వేలు.. నర్సరీలో 6 వేల వరకుమొక్కల పెంపకం వన మహోత్సవానికి యంత్రాంగం సిద్ధం -
త్వరలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనులు
● ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు: నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు కోసం భూమి కేటాయింపులు 90% పూర్తయ్యాయని..త్వరలో ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శ్మశాన వాటిక పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నూతన ఎస్టీపీ ప్లాంట్ల కు సంబంధించి వివాదాలకు తావు లేకుండా భూ కేటాయింపులు చేశామన్నారు. నియోజకవర్గ పరిధి లోని తిమ్మక్క చెరువు, మేళ్ల చెరువు, ఉసికే బావి, ఇక్రిశాట్, గండిగూడెం, బచ్చుగూడెం, అమీన్పూర్ పరిధిలోని చెరువుల సమీపంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 1,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రజల కోసం 3 ఎకరాల విస్తీర్ణంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీల కోసం 1.71కోట్లతో నిర్మించిన శ్మశాన వాటికలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సమావేశంలో జలమండలి ఎస్టీపీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ పద్మజ, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
అండర్పాస్ బ్రిడ్జి నిర్మించండి
ఎంపీ రఘునందన్రావుకు రుద్రారం గ్రామస్తులు వినతి పటాన్చెరు టౌన్: పటాన్చెరు మండలం రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయం వద్ద దేవాలయం సమీపంలో అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని రుద్రారం నాయకులు, గ్రామస్తులు మెదక్ ఎంపీ రఘునందన్ రావును కోరారు. ఈ మేరకు గ్రామస్తులు హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ రఘునందన్రావు అక్కడ అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని స్థానిక నాయకులు తెలిపారు. నేడు జాబ్మేళాసంగారెడ్డి టౌన్ : జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 28 శనివారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అనిల్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫ్లిప్కార్ట్, పూస్కల్ ఆగ్రో టెక్లో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని చెప్పారు. జిల్లా ఉపాధి కార్యాలయం పాత వెలుగు కార్యాలయంలో జరిగే ఈ మేళాకు సకాలంలో హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు 08455–271010లో సంప్రదించాలని కోరారు. సమస్యలతోవిద్యార్థుల సతమతంయూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి సంగారెడ్డి ఎడ్యుకేషన్: సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో యూఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం హాస్టల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2025 విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల హాస్టళ్లలో మాత్రం కనీస వసతులు కల్పించలేదని దీంతో విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. విద్యార్థుల బాగోగులు పట్టించుకోని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించి ‘చలో కలెక్టర్’కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. టెన్త్ సప్లిమెంటరీఫలితాలు విడుదలసంగారెడ్డి ఎడ్యుకేషన్: పది సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లా లో 195 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 109 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 117 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 61 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 78 మంది విద్యార్థులకు 48 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా మొత్తంగా ఉత్తీర్ణత శాతం 55.90గా నమోదైంది. రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించి జూలై 7వ తేదీ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన అప్లికేషన్ ఫారం, హాల్ టికెట్ జిరాక్స్, ప్రింట్ మెమోను జతచేసి పాఠశాలలనే సమర్పించాని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. నేడు ఆస్పత్రి అభివృద్ధి సమావేశంనారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రి సలహా సంఘం సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.జి.రమేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆస్పత్రి సమావేశ మందిరంలో మధ్యా హ్నం 2గంటలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు. రైతుఖాతాల్లో రూ.113,37 కోట్లు జమ జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు భరోసా పథకం కింద జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతులకు రూ.113.37 కోట్ల నిధులు జమ అయినట్లు ఏడీఏ భిక్షపతి శుక్రఓవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మట్టి మాఫియా!
రూటు మార్చినఆ చెరువుల్లోంచే నల్లమట్టి అక్రమ రవాణా మట్టిమాఫియా కేంద్రంగా రాళ్లకత్వ జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ శివారులోని 286 సర్వే నంబర్లలో అక్రమార్కులు నాలుగు గ్రూపులుగా ఏర్పడి మట్టి మాఫియా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. శివానగర్ ఎల్ఈడీ పార్క్ తదితర పరిశ్రమలకు మట్టి రవాణా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అర్ధరాత్రి సాగుతున్న మట్టి రవాణా వ్యవహారాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా భయాందోళనకు గురి చేయడమే కాకుండా దర్జాగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మట్టి మాఫియాతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ వ్యాపారం సాగుతుందని చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడి : మట్టి మాఫియా రూటు మార్చింది.. అక్రమ దందాను మూడు ప్రొక్లయినర్లు..ఆరు టిప్పర్లుగా కొనసాగించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ముంబై జాతీయ రహదారి (ఎన్హెచ్.65) పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రహదారిపై డిజైన్ లోపాన్ని సరిచేయడం కోసం సదాశివపేట మండలం నందికంది వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. ఈ ఫ్లైఓవర్ కోసం అవసరమైన మట్టి కోసం నందికంది చెరువులోంచి 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకెళ్లేందుకు నీటిపారుదలశాఖ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. అయితే ఇదే చెరువు నుంచి వేరే వాళ్లు అక్రమంగా మట్టిని తవ్వుతున్నారు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో ఈ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. తమకున్న రాజకీయ పలుకుబడిని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమ దందాకు తెరలేపారు. ఎవరైనా చూస్తే జాతీయ రహదారి కోసం మట్టిని తవ్వుతున్నారనుకుంటారు. వాస్తవానికి నేషనల్ హైవే పనుల కంటే ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిపోతున్న మట్టే ఎక్కువగా ఉంటోంది. కొండాపూర్ మండలంలో కూడా పలు చెరువుల నుంచి ఇదే తరహాలో సహజ సంపద దోపిడీకి గురవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా.. ఇటుకబట్టీలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం చెరువుల్లో మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు అంత ఈజీగా రావు. దీంతో ఇలా ముంబై జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మట్టిని తవ్వుతున్న చెరువుల నుంచే మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ అక్రమార్కులకు రాజకీయ అండదండలుండటంతో అధికారులు చూసీచూడనట్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి పగలు తేడా లేకుండా.. ఈ మట్టి అక్రమ రవాణా రాత్రి, పగలు అనే తేడా లేకుండా సాగుతోంది. భారీ ప్రొక్లయినర్లు ఈ చెరువులోంచి నల్లమట్టిని తవ్వి జిన్నారం మండలంలో పలుచోట్ల ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు, భారీ వాహనాల్లో ఈ నల్లమట్టి తరలిపోతుండటం గమనార్హం. ఈ చెరువులో ఒక్కోరోజు అర్ధరాత్రి వరకు కూడా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ..ఇటు పోలీసులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అనుమతులు ఇచ్చిన నీటిపారుదలశాఖ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నల్లమట్టి టిప్పర్లు నందికంది నుంచి పొత్తిరెడ్డిపల్లి చౌరస్తా.. కంది..ముత్తంగి మీదుగా జిన్నారం మండలంలోని ఇటుకబట్టీలకు రవాణా అవుతోంది. ఈ దందాలో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న వారికి రాజకీయ అండదండలుండటంతో ఇటు పోలీసులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నందికంది చెరువు నుంచి నల్లమట్టి అక్రమ రవాణాపై స్థానికులు పలుమార్లు నీటిపారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.ఫిర్యాదులు వచ్చాయి కానీ: నందికంది చెరువు నుంచి మట్టిని తవ్వుకునేందుకు నేషనల్ హైవే పనుల కోసం అనుమతి ఇచ్చాము. ఈ చెరువులో వేరే వాళ్లు కూడా నల్లమట్టిని తవ్వుతున్నారనే ఫిర్యాదులు మాకు వచ్చాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పరిశీలించాము. కానీ, అక్కడ అలాంటి తవ్వకాలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. ఇకపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. – మహేశ్, నీటిపారుదలశాఖ ఏఈ, సదాశివపేట యథేచ్ఛగా ఇటుక బట్టీలకు తరలింపు నందికంది చెరువునుకొల్లగొడుతున్న అక్రమార్కులు మట్టి టిప్పర్లు సీజ్కొండాపూర్ (సంగారెడ్డి): అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసి కొండాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... నాలుగు రోజులుగా మండల కేంద్రంలోని చెరువులో మట్టిని గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు రాత్రి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తూతూ మంత్రంగా రైతు పేరు మీద ఇరిగేషన్ విభాగంలో అనుమతులు తీసుకున్నారు. గ్రామంలో మట్టిని వేరే గ్రామానికి తరలించడం ఏంటని నిలదీసి టిప్పర్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్ టిప్పర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. -
మంజీరా మరమ్మతుకు 3.5కోట్లు
నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి మండలంలోని మంజీరా డ్యామ్ ను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జంట (హైదరాబాద్, సికింద్రాబాద్) నగరాలకు తాగునీరు అందించే మంజీరా డ్యామ్కు ఎలాంటి పగుళ్లు లేవన్నారు. మంజీరా డ్యామ్ మరమ్మతుల కోసం రూ.3.5 కోట్లు కేటాయించామని తెలిపారు. అనంతరం డ్యామ్ను పరిశీలించారు. ఆర్డీవో రవీందర్రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ పటాన్చెరు డివిజన్ జనరల్ మేనేజర్ మాణిక్యం, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
సంగారెడ్డి టౌన్: పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్ర శుక్రవారం ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. పట్టణంలోని నటరాజ్ థియేటర్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూరీ జగన్నాథుని రథయాత్రను అందంగా అలంకరించి, భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందోత్సవాల మధ్య రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్ పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. నేటి యువతరానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళలు, ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
గుంతలమయంగా రోడ్లు
● మరమ్మతులకు నోచుకోని వైనం ● ప్రమాదాలకు గురవుతున్నవాహనదారులు హత్నూర(సంగారెడ్డి): ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. ఈ రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మండల కేంద్రం నుంచి జోగిపేటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. హత్నూరలో సుమారు 200 మీటర్ల వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్యాల వెళ్లే ప్రధాన రహదారితో పాటు దౌల్తాబాద్ నుంచి నాగుల్దేవులపల్లి వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హత్నూర నుంచి నవాబుపేట వెళ్లి రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. మల్కాపూర్ నుంచి పటాన్చెరు వెళ్లే ప్రధాన రహదారి సైతం గుంతలమయంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆ రోడ్డుపై వెళ్లాలంటే భయం హత్నూర నుంచి సిరిపురం వరకు బైక్పై వెళ్లాలంటే ఎప్పుడు ఏ గుంతలో పడి ప్రమాదం సంభవిస్తోందనని భయంగా ఉంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయాలి. – ప్రవీణ్గౌడ్, హత్నూర నిధులు రాగానే మరమ్మతులు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయిస్తాం. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే గుంతలు ఏర్పడిన రహదారులకు మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తాం. – రవీందర్, ఆర్అండ్బీ, డీఈ● -
మతోన్మాద శక్తుల అభివృద్ధే బీజేపీ ధ్యేయం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్పొరేట్, మతోన్మాద శక్తుల అభివృద్ధే బీజేపీ ధ్యేయమని, ప్రజా సంక్షేమం మరిచి ప్రజల మధ్య విద్వేషాలను పెంచడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో సీపీఎం సంగారెడ్డి, మెదక్ జిల్లా నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం చుక్కా రాములు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వర్గాలకు వ్యతరేకంగా చట్టాలను రూపొందిస్తూ, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూరేలా వ్యవహారిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత, గిరిజనుల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం, రాజయ్య, సాయిలు, రాంచందర్, నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్, యాదగిరి పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చుక్కా రాములు -
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పంచాయతీ కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో వారిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పంచాయతీ సిబ్బంది వేతనాలకు బడ్జెట్ కేటాయించి.. గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని కూడా రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. జీవోనంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి దశరథ్,యూనియన్ నాయకులు సంజీవ్, శేఖర్, రాములు, నగేష్, మైపాల్, యాదమ్మ, అశోక్, నర్సింలు తదితరులున్నారు. -
ఎల్వోసీ అందజేత
నారాయణఖేడ్: కల్హేర్ మండలం మాసానిపల్లికి చెందిన పొన్నం యాదగిరికి అత్యవసర వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల మంజూరుకు సంబంధించి ఎల్వోసీ ఉత్తర్వు జారీ అయింది. శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బాధితుడి కుటుంబీకులకు ఎల్వోసీని అందజేశారు. మాజీ సర్పంచి గోపాల్ పాల్గొన్నారు. రాయికోడు మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డికి రూ.54 వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఖేడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్ లబ్ధిదారుడి కుటుంబీకులకు అందజేశారు. నాయకులు సాగర్ షెట్కార్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిరెడ్డి పాల్గొన్నారు. కార్మికుల సేవలు అభినందనీయం నారాయణఖేడ్: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారు జామునుంచే విధుల్లో చేరి కార్మికులు అందించే సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు కాస్మోటిక్ కిట్లు దోహదపడతాయన్నారు. అనంతరం పలు వార్డుల్లో జరుగుతున్న పనులు, నీరు నిల్వ ఉన్నచోట్ల దోమలు ప్రబలకుండా ఆయిల్బాల్ వేయడం, యాంటీ లార్వా ద్రావణం పిచికారీ పనులను శానిటరీ అధికారి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం నారాయణఖేడ్: సంస్కృతి, సంప్రదాయ విద్యతోనే సేవా కార్యక్రమాలు సాధ్యమవుతాయని ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి అన్నారు. ఖేడ్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో దాత జక్కుల యాదగిరి రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంటును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీ శిశుమందిరాలు విద్యార్థుల్లో దేశభక్తి, ఆధ్యాత్మికత, నైతిక విలువలను పెంపొందిస్తుండటం గొప్ప విషయమన్నారు. రిటైర్డ్ హెచ్.ఎం రామకృష్ణ, పాఠశాల కమిటీ బాధ్యులు నారాయణ, వీరేశలింగం, చంద్రశేఖర్, శ్రీశైలం, జ్ఞానేశ్వర్, శివరాజ్, సంగమేశ్వర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంహత్నూర( సంగారెడ్డి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులను త్వరితగతిన కొనసాగించాలని ఎంపీడీవో శంకర్ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన హత్నూరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కోసం శుక్రవారం ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ...అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం ముగ్గు పోసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఈఓ యూసుఫ్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేశ్, నాయకులు కిష్టయ్య, మధుసూదన్ గౌడ్, నరేందర్, సాయికుమార్ లబ్ధిదారులు పాల్గొన్నారు. వర్షాలు కురవాలని గంప జాతర న్యాల్కల్(జహీరాబాద్): వర్షాలు కురవాలని కోరుతూ శుక్రవారం మండలంలోని చినిగెపల్లి వాసులు గంప జాతర కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం గ్రామస్తులు భాజా భజంత్రీలతో గ్రామం నుంచి సమీపాన గల చెరువు వద్దకు గంపలతో నైవేద్యాలు తీసుకుని తరలివెళ్లారు. అక్కడ గంగా మాతకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. -
పుణ్యక్షేత్రాలకు బయలుదేరిన బస్సులు
నారాయణఖేడ్: రాష్ట్రంలోని 10 పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకుని వచ్చేలా ఖేడ్ నుంచి ప్రత్యేకంగా ఒక ఎక్స్ప్రెస్, ఒక సూపర్ డీలక్స్ బస్సు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఖేడ్ నుంచి బయలుదేరాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఆయా బస్సులకు డ్రైవర్లు పూజలు నిర్వహించగా ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మెనేజర్ కృష్ణమూర్తి జెండా ఊపి పంపించారు. బస్సులు 36 గంటలపాటు ప్రయాణించి 10 పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామగుండం, మిడ్మానేరు డ్యాం, వరంగల్, సిద్దిపేట, మెదక్, ఏడుపాయలను దర్శించుకుని శనివారం సాయంత్రం తిరిగి ఖేడ్కు చేరుకోనున్నాయి. స్థానిక ఆర్టీసీ డీఎం మల్లేశయ్య, అసిస్టెంట్ మెనేజర్ నర్సింహులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ దశరథ్, నెహ్రూ, బీరయ్య, పాండు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
రమణీయం.. రథోత్సవం
జిన్నారం(పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పూరి జగన్నాథుని రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. శుక్రవారం రథోత్సవ వేడుకలకు పట్టణ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాజీ జెడ్పీటీసీ బాల్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు హనుమంత్ రెడ్డి, బీరప్ప యాదవ్, గోపాలమ్మ, రమణయ్య, నాయకులు వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. హెచ్ఎండీఏ ప్లాట్లు ఇవ్వాలికంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కందిలోని సర్వే నంబర్ 656లో హెచ్ఎండీఏ లేఅవుట్ కోసం తీసుకున్న భూముల యజమానులకు ప్లాట్లను ఇవ్వాలని బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం హెచ్ఎండీఏ లేఅవుట్ కోసం తమ నుంచి భూములు తీసుకుందని తెలిపారు. ఎకరాకు 600 గజాల ప్లాటును ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న అధికారులు ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. కాలయాపన చేయకుండా వెంటనే ప్లాట్లను భూములు కోల్పోయిన వారికి చేయాలని కోరారు. ఈపీఎఫ్పై కార్మికులకు అవగాహన జిన్నారం(పటాన్చెరు): కార్మికుల జీవితాలకు ఈపీఎఫ్ భద్రత కల్పిస్తుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీధర్రావు అన్నారు. శుక్రవారం బొల్లారం పారిశ్రామికవాడలో మైలాన్ పరిశ్రమ కార్మికులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. కార్మికులు ఈపీఎఫ్ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులకు తప్పనిసరిగా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధి సత్యనారాయణ, వంశీ పాల్గొన్నారు. -
చెరువులో పడి వృద్ధురాలి మృతి
● కుమారులు సరిగా చూడటం లేదనా.. ● అనారోగ్య సమస్యతో ఆత్మహత్యనా?అక్కన్నపేట(హుస్నాబాద్): చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన గురువారం సాయంత్రం మండలంలోని అంతక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పూదరి కనకవ్వ(70)కు నలుగురు కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు కరీంనగర్లో ఉంటున్నాడు. మిగిలిన కుమారుల వద్ద ఆమె ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కుమారులు సరిగా పట్టించుకోకపోవడంతో పాటు అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అనార్యోగ సమస్య తట్టుకోలేకనా? లేక కుమారులు సరిగా చూడటం లేదని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. వృద్ధురాలి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సాక్షి ఎస్ఐ విజయ్భాస్కర్ను సంప్రందించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నామని తెలిపారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య కౌడిపల్లి(నర్సాపూర్): వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తునికిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎతిరాజుల సుశీలకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు నర్సాపూర్లో నివాసం ఉంటున్నాడు. కాగా చిన్న కొడుకు యాదగిరి(32) తునికిలో తల్లి వద్ద ఉంటున్నాడు. మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. తల్లి కూలీపనులు చేస్తూ పోషిస్తుంది. పలుమార్లు మద్యం సేవించి తల్లితో సైతం గొడవపడేవాడు. గురువారం తల్లి గ్రామంలోకి వెళ్లొచ్చేసరికి ఇంట్లో యాదగిరి ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య పదేళ్లక్రితం చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేయూత.. ఉపాధి
● డిజిటల్ పద్ధతిలో నెలవారీగా చెల్లింపులు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న అతివలుసంగారెడ్డి టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలు ప్రవేశపెడుతున్నాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు వివిధ ఉపాధి అవకాశాలు లభించేలా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు అందిస్తున్నారు. మహిళలకు కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, కోళ్ల పరిశ్రమ, డెయిరీ పామ్, వివిధ చిన్న తరహా వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని మహిళా సంఘాల ద్వారా లబ్ధి పొందుతూ జీవనోపాధి పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సీ్త్రనిధి ద్వారా ఈ సంవత్సరంలో రూ.83 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. జిల్లాలో 25 మండలాలు, 365 గ్రామ సంఘాల్లో 10,016 మంది సభ్యులకు సీ్త్ర నిధి బ్యాంకు ద్వారా రుణాలిచ్చారు. సీ్త్ర నిధి నుంచి రుణాలు పొంది స్వయం ఉపాధి పొందడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. సభ్యులు తీసుకున్న రుణాలకు ప్రతి నెల ఆన్లైన్లో నేరుగా చెల్లించే అవకాశం కల్పించడంతోపాటు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు సీ్త్ర నిధి ద్వారా రూ.83 కోట్ల రుణాలుమహిళలు సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘంలోని సభ్యులకు సీ్త్ర నిధి ద్వారా రుణాలిస్తూ వ్యాపారాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. తీసుకున్న డబ్బులను ప్రతి నెల ఆన్లైన్లో సకాలంలో చెల్లిస్తున్నారు. మహిళలకు మరింత అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. వంద శాతం రుణాలు అందజేశాం. – శ్రీనాథ్, సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్ -
చేపల కోసం వెళ్లి.. స్తంభాన్ని ఢీకొట్టి
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతికొమురవెల్లి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రం శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సార్ల రామ్చరణ్(16) అదే గ్రామంలో 10 వతరగతి చదువుతున్నాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులుతో కలిసి కొమురవెల్లి చెరువులో చేపలు పట్టడానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. చెరువులో చేపలు పడకపోవడంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కొమురవెళ్లి నుంచి తిమ్మారెడ్డిపల్లి వెళ్లే రోడ్డులో ఎదురుగా వస్తున్న బొలోరో వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న రామ్చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.గుర్తు తెలియని వాహనం ఢీకొని.. కంది(సంగారెడ్డి): వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... కందికి చెందిన కోస్కే వినోద్ కుమార్ గౌడ్(22) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కందిలో దాబాకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో పటాన్ చెరు వైపు నుంచి సంగారెడ్డికి వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ కుమార్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు కింద పడి కార్మికుడు.. పటాన్చెరు టౌన్: ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నేపాల్కు చెందిన మూసారహు సాదే (55) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం వచ్చి పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వాష్ రూమ్కి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కిందపడి తలకి గాయమైంది. తోటి కార్మికులకు చెప్పగా ఇస్నాపూర్లో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగోల్లో గుర్తు తెలియని మృతదేహం కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం మండలంలోని మంగోల్ గ్రామంలో కనిపించింది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... గ్రామంలో 15 రోజులుగా గుర్తు తెలియని వృద్ధుడు భిక్షాటన చేస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి బస్టాప్ వద్ద పడుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. -
లోన్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు
సైబర్ నేరస్తుడి అరెస్ట్ చేర్యాల(సిద్దిపేట): లోన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ ఎల్.శ్రీను, ఎస్ఐ పి.నీరేష్ కేసు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుగొండ మండలానికి చెందిన పిల్లెల శ్రీకాంత్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంక్షేమ సంఘం పేరిట వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందులో చేరేలాగా చేసిన శ్రీకాంత్ జాతీయ రియల్ ఎస్టేట్ సంఘం నుంచి రుణాలు వస్తాయని, అందుకు సభ్యత్వ రుసుము రూ. 25 వేలు చెల్లించాలని గ్రూపులో పోస్ట్ చేశాడు. ఇది నిజమేనని నమ్మిన మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు లోన్ కావాలని వాట్సాప్లో అడిగాడు. వెంటనే అతనికి ఫోన్ చేసి సభ్యత్వ రుసుము రూ.25వేలు పంపించాలని శ్రీకాంత్ కోరాడు. సదరు వ్యక్తి గూగుల్పే ద్వారా రూ.25 వేలు రెండు విడతల్లో పంపించాడు. ఫోన్చేస్తే ఎత్తకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు నేరస్తుడిని అరెస్టు చేశారు. -
గాయపడ్డ నెమలికి చికిత్స
శివ్వంపేట(నర్సాపూర్): గాయపడిన నెమలికి అటవీ సిబ్బంది చికిత్స చేయించారు. గురువారం మండల పరిధిలోని గోమారం గ్రామ శివారులో వెంకట్రెడ్డికి చెందిన పౌల్ట్రీ పామ్ వద్ద ఓ నెమలి గాయపడి ఉండగా గుర్తించిన రైతు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శివ్వంపేట ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రీధర్కుమార్, బీట్ అధికారి శ్రీవల్లి గాయపడిన నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నెమలికి నర్సాపూర్లో పశు వైద్యశాలలో చికిత్స చేయించి అడవిలో వదిలిపెట్టారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య గజ్వేల్రూరల్: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాదగారి రేగొండకు భార్య మంజులతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజు మాదిరిగానే భార్యాభర్తలు వ్యవసాయ పొలానికి వెళ్లారు. మంజుల పొలంలో పనిచేస్తుండగా, రేగొండ సమీపంలోని చింతచెట్టుకింద పడుకున్నాడు. మంజుల కొద్దిసేపటి తర్వాత రేగొండ వద్దకు వెళ్లి చూడగా పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించింది. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవాలిమాజీ సర్పంచ్ స్వరూప చిలప్చెడ్(నర్సాపూర్): ఆర్టీసీ బస్ సేవల్ని గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు వినియోగించుకోవాలని మాజీ సర్పంచ్ స్వరూప సూచించారు. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ చిలప్చెడ్ మండలం గౌతాపూర్ గ్రామానికి రాగా, గ్రామస్తులు దానిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ...గతంలో గ్రామానికి బస్ సౌకర్యం ఉండేదని కొద్దికాలంగా గౌతాపూర్తోపాటు, పలు గ్రామాలకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయన్నారు. దీనిపై ఆర్టీసీ సేవల్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను, పలుమార్లు కోరడంతో తిరిగి గ్రామానికి బస్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విఠల్, భీమయ్య, రమేశ్నాయక్, యాసిన్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ మెదక్ మున్సిపాలిటీ: పేకాట ఆడుతున్న వారి ని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజారెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా రు. వారి నుంచి 5 మొబైల్స్, రూ. 8,765 నగదు ను స్వాధీనం చేసుకుని మెదక్ టౌన్ ఎస్ఐకి అప్పగించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దాడి చేసినట్లు తెలిపారు. తూప్రాన్లో.. తూప్రాన్: పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రంగాకృష్ణ వివరాల ప్రకారం... అల్లాపూర్ సమీపంలో ఓ వెంచర్లో పేకాటాడుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10700, మూడు బైకులు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రణాళిక.. ప్రహసనం
కానరాని కార్యాచరణ – ఎక్కడి చెత్త అక్కడే● మున్సిపాలిటీల్లో తాండవం చేస్తున్న సమస్యలు ● విఫలమైన అధికారులు ● ఇబ్బందులు పడుతున్న ప్రజలుజోగిపేట(అందోల్): పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో గల పార్కు పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఈ పార్కు మున్సిపల్ కార్యాలయం ప్రక్కనే ఉండటం గమనార్హం. గాంధీ పార్కుకు తాళం వేయడం వల్ల అందులో చెత్త పేరుకుపోయింది. జోగిపేట–అన్నాసాగర్ వెళ్లే రహదారి ప్రక్కనే చెత్త పేరుకుపోయింది. వంద రోజుల ప్రణాళిక తూతూ మంత్రంగా నిర్వహించారని పలువురు ఆరోపిస్తున్నారు. 20 వార్డులను టార్గెట్ చేసి పనులు చేపట్టినా పారిశుధ్యం, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు. ప్రణాళిక అమలేది? మెదక్ మున్సిపాలిటీ: మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ మొక్కుబడి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనంతరం వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పట్టణంలోని చెరువులు, ఎంఎన్ కెనాల్ పారిశుద్ధ్య లోపంతో కంపుకొడుతున్నాయి. మల్లం చెరువు కట్టపై చెత్త పేరుకుపోయింది. ఎంఎన్ కెనాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలు, చెత్తతో నిండిపోయి కంపు కొడుతోంది. కాలనీల్లోని మురుగు కాల్వలు సైతం ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పురపాలికల్లో వందరోజుల ప్రణాళిక సరిగా అమలవ్వడం లేదు. వెరసి మురుగునీటి కాలువల అపరిశుభ్రత, చెత్త తరలింపులో నిర్లక్ష్యం, మురుగు గుంతలు, దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు, తదితర పనులు చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు పకడ్బందీ ప్రణాళికతో మున్సిపాలిటీల్లో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వృద్ధి చెందుతున్న దోమలు నర్సాపూర్: మున్సిపాలిటీలో మురికి కాలువల శుభ్రం, పిచ్చి మొక్కలు తొలగింపు, భగీరథ పథకం నీటి ట్యాంకుల క్లోరినేషన్ చేయడం తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆ పనులను సక్రమంగా చేపట్టక పోవడం గమనార్హం. పిల్లల పార్కులోని మిషన్ భగీరథ ట్యాంకు నీరు లీకవుతుంది. వాల్వుల వద్ద మురికి కూపంగా తయారైంది. సునీతారెడ్డి కాలనీలో డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురికి నీరు నేలపై పారి పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో దోమలు పెరగుతున్నాయని కాలనీవాసులు చెప్పారు దుబ్బాక: మున్సిపాలిటీలోని 20 వార్డులలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం డ్రైనేజీ శుభ్రం చేసే పనులు కూడా సరిగా చేయడం లేదు. వార్డులలో ప్రజలకు తడి,పొడి చెత్త, వానాకాలంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూ.20 కోట్ల నిధులు వస్తే సమస్యలు తీరుతాయని, అవి లేకే సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉన్న సమస్యలు అధికారులు నోటీఫై చేసుకుంటున్నప్పటికీ అవి ఎంత వరకు పరిష్కారం అవుతాయో.. చూడాలని ప్రజలు వాపోతున్నారు. పారిశుధ్య పనుల్లో నిర్వహణ లోపం.. అవగాహన కల్పిస్తే.. ఇలా చేస్తారా? రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నామమాత్రంగా ప్రణాళిక నిర్వహిస్తున్నారు. మొత్తం యాక్షన్ప్లాన్లో 50 అంశాల్లో పారిశుద్ధ్యం ఒకటి. తడి, పొడి చెత్తపై మాత్రం అవగాహన కూడా కల్పించడం లేదు. పలుచోట్ల చెత్తను బహిరంగంగా తగలబెడుతున్నారు. పారిశుద్ధ్యంపై కాలనీలు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ మున్సిపల్ పరిధిలో అమలు కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇళ్లు కూలగొట్టి రోడ్డున పడేశారు
● పెట్రోలు డబ్బాతో దివ్యాంగుడి ఆందోళన ● డబుల్ బెడ్రూం నుంచి వెళ్లిపోవాలని లబ్ధిదారుల ఒత్తిడి గజ్వేల్రూరల్: రోడ్డు వెడల్పులో తమ ఇండ్లను తొలగించిన గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోకుండా తాత్కాలికంగా డబుల్ బెడ్రూంలను కేటాయించి చేతులు దులుపుకున్నదని బాధితులు పేర్కొన్నారు. పెట్రోల్ డబ్బా పట్టుకొని ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ దివ్యాంగుడు ఆందోళనకు దిగాడు. ఈ ఘటన గజ్వేల్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో రోడ్డు వెడల్పులో భాగంగా గత ప్రభుత్వ పాలనలో 19 మందికి చెందిన ఇళ్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమవగా, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి బాధితులకు నచ్చజెప్పి సంగాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోకి పంపించారు. అక్కడ మొదటి అంతస్తులో ఇళ్లు కేటాయించారు. కానీ, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రౌండ్ఫ్లోర్లోకి మార్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 9 మంది బాధితులకు ఉండేందుకు అనుమతించారు. కాగా డబుల్ లబ్ధిదారులు వచ్చి ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నా రని, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధిత దివ్యాంగుడు నాగరాజు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టెను చేతిలో పట్టుకొని ఆందోళనకు దిగాడు. సమాచారం తెలుసుకున్న సీఐ సైదా ఘటనా స్థలానికి వెళ్లి నచ్చ జెప్పారు. బాధితులందరిని పోలీస్స్టేషన్కు తరలించారు. నాగరాజు మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో తమ ఇండ్లను తొలగించారని, ప్రస్తుత ప్రభుత్వం ఆదుకొని గూడు కల్పించాలని కోరాడు.