Sangareddy District News
-
రోడ్లపైనే వడ్లు
కనిపించని కల్లాలు.. రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్న రైతులు ● కల్లాల కొరతతో నానా అవస్థలు ● వాహదారులకు తప్పని ఇబ్బందులు ● నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం ● పట్టించుకోని అధికారులు చిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై పోసిన పంట కుప్పలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పంటను ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడంతో రైతులు తారు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. చేతికొచ్చిన పంట దిగుబడుల్లో తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపై ధాన్యం ఆరబెడుతున్నారు. ధాన్యం కుప్పలు రోజుల తరబడి ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. వాహనదారులకు ముప్పు.. యేటా సీజన్ రాగానే రైతులు రోడ్లపై ఇరువైపులా పంట కుప్పలు పోయడంతో రహదారులు కల్లాలుగా మారాయి. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రాత్రి పూట వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. నిత్యం పలువురు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కానీ కల్లాలు లేకనే రోడ్లపై పంటను ఆరబెట్టాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కలగానే కల్లాలు.. గతంలో ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీపై కల్లాల నిర్మాణానికి దరఖాస్తులను స్వీకరించింది. కొన్ని గ్రామాల్లో పూర్తయినా బిల్లులు రాలేదని, కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయని రైతులు వాపోతున్నారు. గత మూడేళ్లుగా కల్లాల పథకం నిలిచిపోవడంతో అర్హులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు రైతుల కష్టాలు గుర్తించి పథకాన్ని పునరుద్ధరిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టొద్దు దుబ్బాక : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు రోడ్లపై పోయకుండా కల్లాల్లో ఆరబెట్టుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యాన్ని రోడ్లపై పోయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇప్పటికే రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలను వాహనాలు ఢీ కొట్టి మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. రోడ్లపై ధాన్యం పోసి రైతులు ప్రమాదాలకు కారణం కావొద్దన్నారు. ఇప్పటికే రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దంటూ రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రోడ్లపై ధాన్యం పోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి రైతులు సహకరించాలని సీఐ కోరారు. –సీఐ శ్రీనివాస్ -
అధికారుల నిర్లక్ష్యం.. సంచారం లేని వాహనం
కలెక్టరేట్ ఆవరణలో నిరుపయోగంగా 104 వాహనాలు సీజనల్ వ్యాధుల కాలంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వారధిలా ఉన్న 104 సంచార వాహనాలు మూలనపడ్డాయి. కలెక్టరేట్లోని ఐదు వాహనాలు నిరుపయోగంగా మారాయి. చిన్నపాటి మరమ్మతులు చేసే వీటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తుప్పు పట్టి పనికి రాకుండాపోతున్నాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు
నర్సాపూర్ : పింఛన్ కోసం వృద్ధులు నానా పాట్లు పడుతున్నారు. నర్సాపూర్కు చెందిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు స్థానిక పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రతి నెల పింఛన్లను పంపిణీ చేస్తారు. కాగా పోస్ట్ ఆఫీసు వద్ద నీడ, కూర్చునేందుకు బెంచీలు లాంటి వసతులు లేకపోవడంతో ఎండలోనే నిలబడ్డారు. అరుగులపై , చెట్టు కింద కూర్చొని నిరీక్షించారు. అధికారులు కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. మంగళవారం మార్చి నెల పింఛన్ ఇస్తున్నారని తెలిసి వచ్చామని వృద్ధులు చెప్పారు. ఈ విషయమై స్థానిక పోస్ట్ మాస్టర్ హరిప్రసాద్ను వివరణ కోరగా సోమవారం సాయంత్రం ఫండ్ వచ్చిందని, ఈరోజే పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. -
ఆరోగ్య పరిరక్షణకు ‘రుతు ప్రేమ’
కోహెడరూరల్(హుస్నాబాద్): మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రుతు ప్రేమ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీఓ దేవకీదేవి అన్నారు. మండలంలోని సముద్రాల గ్రామంలో రుతుప్రేమ కార్యక్రమంలో భాగంగా మెన్స్ట్రువల్ కప్, క్లాత్ప్యాడ్ల వినియోగంపై మహిళకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ మనుగడను శాసించేది రుతుచక్రమని రుతు చక్రం లేకపోతే జీవనమే లేదని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కెమికల్స్ కలిగిన ప్యాడ్ వల్ల మహిళల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా ప్రమాదమేనని అన్నారు. క్లాత్ ప్యాడ్స్ మెన్ స్ట్రువల్ కప్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మెన్స్ట్రువల్ కప్ 8 నుంచి 10 ఏళ్ల వరకు వాడొచ్చని ఇవి సురక్షితమైనవని, ఆరోగ్యకరమైనవని అన్నారు. నెలనెలా ప్యాడ్స్ కొనాల్సిన అవసరం లేదని, అలా ప్రతీ మహిళకు ఏటా రూ.1,200 వరకు ఆదా అవుతుందన్నారు. అనంతరం మహిళలు, యువతులకు ఉచితంగా మెన్ స్ట్రువన్ కప్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సెట్విన్ కో ఆర్డినేటర్ అమీనా, ఇన్చార్జి ఎంపీఓ శోభ, పంచాయతీ కార్యదర్శులు నిహారిక, నజియా, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు. డీపీఓ దేవకీదేవి -
అరుదైన ‘వీరగల్లు’ శిల్పాలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోని గౌరయపల్లి గ్రామంలో పులివేట వీరగల్లుల రాతి శిల్పాలు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వాటిని పరిశీలించి 17 శతాబ్దానికి చెందినవిగా పేర్కొన్నారు. కన్నడ భాషలో హళిబేటె అని పిలిచే ఈ పులివేట వీరగల్లుల శిలా రూపాలు తెలంగాణలో మూటకోడూర్, నిజామాబాద్, గోనేపల్లి, అమ్మనబోలు వంటి ప్రదేశాల్లో గతంలో లభించాయని పేర్కొన్నారు. గ్రామం మీద పెద్ద పులిదాడి చేసిన సమయంలో వీరుడు వాటితో పోరాడి ప్రజల్ని కాపాడి మరణం పొందిన సందర్భంగా వేసిన వీరశిలలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు రాతి శిల్పాల్లో రెండు పులితో వేటాడుతున్నవి, మూడవది శైవ భక్తుడు తన సిగముడిని వంచిన వెదురుగడకోసకు కట్టుకొని అంజలిపట్టి యోగా సనం కుర్చున్నట్లు తెలిపారు. వీటి శిల్పశైలీని బట్టి రాష్ట్ర కుటుల కాలం నాటి శిల్పాలుగా పేర్కొన్నారు. ఆయన వెంట కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన హరగోపాల్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వెలుగులోకి పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీనివాస్ -
కోతలు మొదలు.. ధాన్యం బారులు
కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు సంగారెడ్డి జిల్లాలో ఇటీవలె ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వరి కోతలు ప్రారంభం కావడంతో సంగారెడ్డి, కంది పరిసర ప్రాంతాల్లోని రైతులు ఇప్పుడిప్పుడే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దానితో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలతో ట్రాక్టర్లు బారులు తీరాయి . – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
వరి కోత యంత్రం దహనం
కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వ్యక్తులు వరి కోత యంత్రంకు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలోని మంగోల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లగిశెట్టి వెంకటేశం, ఎస్డీ జహీర్ కలిసి కొన్నేళ్ల కిందట అప్పులు చేసి వరి కోత యంత్రంను కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి వరకు మద్దూరి నారాయణరెడ్డి వరి పంటను కోసి సమీపంలో మరి కొందరి రైతుల పంటను కోసేది ఉండటంతో యంత్రంను నారాయణరెడ్డి బావి వద్దే ఉంచారు. మరుసటి రోజు వెళ్లే సరికి యంత్రం పూర్తిగా కాలిపోయి ఉంది. వ్యవసాయ బావి యజమానికి, గ్రామస్తులకు సమాచారం అందించారు. వరి కోత యంత్రంను దహనం చేసేందుకు డిజిల్ ట్యాంకరుపై ఎండుగడ్డిని వేసి నిప్పంటించగా డిజిల్ ట్యాంక్ పేలి కాలిపోయినట్లుగా నిర్ధారించారు. సుమారు రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ విషయమై కుకునూరుపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పుస్తెలతాడు అపహరణ
కొమురవెల్లి(సిద్దిపేట): మహిళ మెడలో పుస్తెల తాడు అపరించుకెళ్లిన ఘటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో మంగళవారం చోటు చేసుకుంది. చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన వనపర్తి భాగమ్మ ఆలయ పరిసరాల్లో కిరాణం, జనరల్ స్టోర్ను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. రోజూ మాదిరిగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వామి వారిని దర్శించుకొని వచ్చి షాప్ను ఓపెన్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మెడలోంచి ఐదు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. దీపం అంటుకొని ఇల్లు దగ్ధం తొగుట(దుబ్బాక): దీపంతో ఇల్లుకు నిప్పంటుకొని కాలిబూడిదైన ఘటన మండలంలోని కాన్గల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నాయిని ఎల్లవ్వ ఉదయం ఇంట్లో దేవుడి చిత్రపటం వద్ద దీపం వెలిగించి బయటకు వెళ్లింది. ఈ ప్రమాదవశాత్తు దీపం కిందపడి బట్టలకు మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని గమనించిన గ్రామస్తులు అప్రమత్తమై సిద్దిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలార్పివేశారు. ఈ ఘటనలో రూ.3 వేలు నగదు, బట్టలు, బియ్యం, వంట సామగ్రితోపాటు కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు చేయించుకున్న దర్వాజ లు, కిటికీలు కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య వర్గల్(గజ్వేల్): కడుపునొప్పి భరించలేక తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం అంబర్పేటలో చోటు చేసుకుంది. గౌరారం పోలీసుల కథనం మేరకు.. అంబర్పేటకు చెందిన మన్నె శ్రీనివాస్, రేణుక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి ఏడాదిన్నర కిందట వివాహం కాగా చిన్న కూతురు జ్యోతి(17) మెదక్ జిల్లా కూచారం కస్తూర్బా గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇటీవలె ఫస్టియర్లో 439 మార్కులు సాధించింది. సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటుంది. కొంత కాలం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న జ్యోతి మంగళవారం సాయంత్రం నొప్పి తాళలేక గ్రామ సమీప తోటలో మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మందలించాడని యువకుడు మద్దూరు(హుస్నాబాద్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రేబర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బచ్చల చంద్రకాంత్(24) కొద్ది రోజులుగా ఏ పని చేయకుడా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బలరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్(20) మంగళవారం మధ్యాహ్నం ఇంటి పరిసరాల్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా మర్కూక్ పాఠశాల ఉపాధ్యాయులు మర్కూక్(గజ్వేల్): రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా మర్కూక్ పాఠశాల ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మండలంలోని దారకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్య, ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఓంకార్ రాధాకృష్ణ గురువారం ఎంపికయ్యారని మండల విధ్యాధికారి వెకట్రాములు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్లో 641 మంది దరఖాస్తు చేసుకోగా 27న రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ వారు హైదరాబాద్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. 152 మంది ఎంపికయ్యారని మర్కూక్ మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారని తెలిపారు. పాఠశాలల ఉపాధ్యాయుల వారికి అభినందనలు తెలిపారు. -
ప్రత్యేక శిబిరం.. ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం
నర్సాపూర్ రూరల్: మండలంలోని అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ ప్రత్యేక శ్రద్ధతో వేసవి శిబిరం నిర్వహిస్తున్నాడు. 24 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో తన పాఠశాలలో చదువుకుంటున్న పేద మధ్య తరగతి పిల్లలను ప్రైవేటు పాఠశాలలు దీటుగా చదివించాలన్న లక్ష్యంతో తానే చొరవ తీసుకొని ఈ శిబిరాన్ని ప్రారంభించాడు. సుమారు 40 మంది విద్యార్థులు ఈ శిబిరానికి హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. శిబిరంలో గణితం, ఇంగ్లిష్, తెలుగు, చేతి రాతతో పాటు సంస్కతీ సాంప్రదాయాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. వేసవి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు రావడంతో ఇతర ఉపాధ్యాయులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. హెచ్ఎం లక్ష్మీనారాయణ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా శిబిరం కొనసాగిస్తున్నాడు. విద్యార్థులు సైతం శ్రద్ధతో శిబిరానికి వచ్చి శిక్షణ పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సేవలు అభినందనీయం: ఎంఈఓ తారా సింగ్ అచ్చంపేట పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ సేవలు అభినందనీయం. విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ శిబిరాన్ని పలుమార్లు సందర్శించాను. ఇతర ఉపాధ్యాయులు సైతం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. ప్రైవేటుకు దీటుగా విద్య : లక్ష్మీనారాయణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన కల్పించాలన్న లక్ష్యంతోనే అచ్చంపేట పాఠశాలలో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాను. అచ్చంపేట గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ఉండేందుకు గణితం, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతి సాంప్రదాయాల శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని ఈ శిబిరంలో వెలికి తీసి వారిని ప్రయోజకులను చేసేందుకు కృషి చేస్తున్నా. ఆట, పాటలు, డ్రాయింగ్, ఉపన్యాస, వ్యాస రచన, క్విజ్, జనరల్ నాలెడ్జ్ లో సైతం శిక్షణ ఇస్తున్నాం. అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహణ గణితం, ఇంగ్లిష్, తెలుగు చేతి రాతతోపాటు సంస్కృతి సంప్రదాయాలపై శిక్షణ హెచ్ఎం లక్ష్మీనారాయణను అభినందిస్తున్న గ్రామస్తులు -
‘బసవ జయంతి’కి సీఎం రేవంత్కు ఆహ్వానం
జహీరాబాద్ టౌన్: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించే విశ్వగురువు మహా మానవతావాది మహాత్మ బసవేశ్వరుడి జయంతి వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రీయ బసవదళ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు ఈ సంఘం తెలంగాణ అధ్యక్షుడు శంకర్పాటిల్, ఎంపీ సురేశ్ షెట్కార్, లింగాయత్ సమాజ్ నాయకులతో వెళ్లి హైదరాబాద్లోని సీఎం నివాసంలో రేవంత్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ...బసవేశ్వరుడి 892వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధికారికంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లాతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్ల నుంచి రాష్ట్రీయ బసవదళ్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యేకల్హేర్(నారాయణఖేడ్): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీబీపేట్లో పీఎసీఏస్ ఆధ్వర్యంలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జొన్నలను ఈ కేంద్రాల్లో కొనుగోలు చేయడం ద్వారా రైతులు మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. ధరణిలో తప్పుల కారణంగా ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టం తెచ్చిందని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నరేందర్రెడ్డి, పీఎసీఏస్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ గుండు మోహన్, నాయకులు వినోద్ పాటిల్, కిషన్రెడ్డి పాల్గొన్నారు. మేడేను జయప్రదం చేయండిసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు పటాన్చెరు టౌన్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రామికభవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 1886 మే 01న అమెరికాలోని చికాగోలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె జరిపితే కార్మిక వర్గం పై ఆనాటి పాలకులు కుట్రలు కుతంత్రాలతో విచ్ఛిన్నం చేసిందని, ఆ పోరాటంలో నలుగురు కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జయరాం, దుర్గా, చంద్రకిరణ్సింగ్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయీబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలిసంగారెడ్డి: నాయీబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని సర్పంచుల ఐక్య వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు అందోల్ కృష్ణ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చౌటకూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దశబ్దాల తరబడి నాయీబ్రహ్మణులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వృత్తి జీవనంలోనే జీవితాలు వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో నాయీబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు. -
చేయూతపై చిగురిస్తున్న ఆశలు
కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తు ● దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యం ● మూడేళ్ల తర్వాత మంజూరు సంగారెడ్డి జోన్: కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేయా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలలో వివిధ పథకాలతో పాటు పింఛన్ల కోసం అధికంగానే దరఖాస్తు చేసుకున్నారు. అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న సెర్ప్ కొత్తగా మంజూరు చేసే పింఛన్లలో మొదటగా దివ్యాంగులతోపాటు వితంతువులకు అందించేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారి జాబితాలను పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు సిద్ధం చేయనున్నారు. జిల్లాలో 1,55,837 మంది పింఛనుదారులు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి చేయూత పథకం ద్వారా ప్రతి నెలా పింఛను అందిస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత కార్మికులు, డయాలసిస్, చేనేత వారికి పింఛన్ అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016లను అందిస్తుంది. ఈ మేరకు జిల్లాలో వివిధ కేటగిరీలలో 1,55,837 మంది చేయూత ద్వారా రూ.36,15,19,230లు లబ్ధిపొందుతున్నారు. ఆయా లబ్ధిదారులకు పోస్టాఫీసుతోపాటు బ్యాంకుల ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయి. జిల్లాలో పింఛన్ వివరాలు దివ్యాంగులు 14,465 వృద్ధులు 59,083 వితంతువులు 70,673 ఒంటరి మహిళలు 7,475 చేనేత కార్మికులు 683 కల్లుగీత కార్మికులు 813 బీడీ కార్మికులు 112 ఇతరులు 2,533 మూడేళ్లుగా కొత్త పెన్షన్లు లేవు అర్హులైన వారు చేయూత పథకం లబ్ధిపొందేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 2022 ఆగస్టు 31న నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు కాలేదు. దీంతో వందల మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నారు. తాజాగా పెన్షన్ల మంజూరు ప్రక్రియ ఊపందుకోవడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు గతంలో పింఛను వచ్చేదని గత కొన్నేళ్లుగా రావటం లేదని, అన్ని అర్హతలు కలిగి ఉన్నా పింఛను మంజూరు కావటం లేదని తదితర కారణాలతో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న సందర్భాలున్నాయి. త్వరితగతిన మంజూరు చేయాలని పింఛనుదారులు కోరుతున్నారు. -
నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోండి
న్యాల్కల్(జహీరాబాద్): ఇందిరమ్మ ఇళ్లను నిబంధనల ప్రకారమే నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లబ్ధిదారులకు సూచించారు. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని లేకుంటే ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారని వివరించారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, అనంతరం సమీపంలోని మిషన్ భగీరథ పంప్హౌస్ను పరిశీలించారు. వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున మండలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్కు సూచించారు. ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉందా?అని అడిషనల్ కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీఓ వనజ, ఏపీఓ రంగారావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు
శాంతి సమావేశంలో ఎస్పీ పరితోశ్ పంకజ్జిన్నారం(పటాన్చెరు): చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. జిన్నారం మండల కేంద్రంలోని తాబేలుగుట్ట శివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విగ్రహధ్వంసం ఘటనపై మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో ఇరువర్గాల సమక్షంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు. విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేసినట్లు సీసీటీవీ ఆధారంగా ఈ సమావేశంలో నిర్ధారించారు. విగ్రహ ధ్వంసం ఘటనలో 28 మందిపై కేసులు నమోదు చేయగా 18 మందిని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..పటాన్చెరు ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా ఉండేదని ఇటువంటి ఘటనతో ఈ ప్రాంతం వెనకబడటమేకాకుండా అభివృద్ధికి భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని చూసి వాస్తవాలు తెలుసుకోకుండా విద్వేషాలు రెచ్చగొట్టవద్దని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దాడికి సంబంధం లేని కొందరి వ్యక్తులను అరెస్ట్ చేశారని వారిని విడుదల చేయాలని స్థానిక నాయకులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐలు నయీముద్దీన్, నరేశ్, జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి, స్థానికనాయకులు మాజీ జెడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
సొంత విత్తనంతోనే మనుగడ
● ప్రపంచ విత్తన వారోత్సవంలో విత్తన శాస్త్రవేత్త గౌరీ శంకర్ ● ప్రదర్శనకు అరుదైన విత్తన రకాలు ● జన్యుమార్పిడి హైబ్రీడ్ రకాలతో ముప్పు ● అధికంగా విత్తనాలు ప్రదర్శించిన మహిళా రైతులకు ప్రోత్సాహకాలు ఆకట్టుకున్న అరుదైన విత్తన ప్రదర్శన అంతర్జాతీయ విత్తన వారోత్సవాలను పురస్కరించుకుని మహిళా రైతులు ప్రదర్శించిన అరుదైన చిరుధాన్యాల రకాలు ఆకట్టుకున్నాయి. జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాలకు చెందిన రైతులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న రైతులకు సంబంధించి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఝరా సంగం మండలంలోని బిడకన్నె గ్రామానికి చెందిన జడల చంద్రమ్మ 58 విత్తన రకాలు ప్రదర్శించి మొదటి బహుమతి అందుకుంది. న్యాల్కల్ మండలంలోని గుంజోటి గ్రామానికి చెందిన కర్నె నర్సమ్మ 56 విత్తన రకాలను ప్రదర్శించి రెండో బహుమతి, ఝరాసంగం మండలంలోని పొట్పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మ 55 విత్తన రకాలను ప్రదర్శించి మూడో బహుమతిని అందుకున్నారు.జహీరాబాద్: నేడు ప్రపంచం అంతా వ్యవసాయం, ఆహార వ్యవస్థలలో పోగొట్టుకున్న విత్తనాలు, పద్ధతులను మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని విత్తన శాస్త్రవేత్త గౌరీ శంకర్ పేర్కొన్నారు. సొంత విత్తనాలతోనే వ్యవసాయ మనుగడ ఆధారపడి ఉందన్నారు. మనం సొంత విత్తనాలు దాచుకోవడం, వాటి విశిష్టతను ప్రపంచం మొత్తం గుర్తిస్తోందని తెలిపారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్లోని డీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రపంచ విత్తన వారోత్స కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ పద్ధతులు కాపాడుకుంటూ వస్తోన్న డీడీఎస్ మహిళల నుంచి స్ఫూర్తిని అందుకుని అందరూ ఈ వీరి బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దివ్య మాట్లాడుతూ...చాలా దేశాల్లో విత్తనాలు దాచుకునే హక్కులు లేవన్నారు. జన్యుమార్పిడి విత్తనాలతో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రదర్శనకు అరుదైన రకాలు దేశీయ విత్తనాలలో అరుదైన రకాలైన అత్తా కోడళ్ల జొన్నలు, నల్ల తొగరి, బుర్క తొగరి, తెల్ల శనగలు, నల్ల బెబ్బర్ల వంటి అంతరించిపోతున్న అరుదైన విత్తనాలను ప్రదర్శించారు. వీటితోపాటు కొర్ర, సజ్జ, సామ, మినుము, పెసర, సామ, ఉలవ, గడ్డి నువ్వు, తైద, పచ్చజొన్న, ఎర్రజొన్న తదితర రకాలు ప్రదర్శలో ఉంచారు. 58 రకాల ప్రదర్శించా తనవద్ద నిల్వచేసి పెట్టుకున్న 58 రకాల విత్తనాలను ప్రదర్శనకు పెట్టాను. అందులో అరుదైన రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఏటా విత్తనాలు వేసుకుని పంట వచ్చాక వాటిలో నాణ్యమైనవి ఎంపిక చేసి విత్తనంగా నిల్వ చేస్తాను. –చంద్రమ్మ, రైతు,బిడకన్నె రెండెకరాల్లో అనేక రకాలు రెండెకరాల్లో 55కు పైగా రకాల చిరుధాన్యాలను పండిస్తున్నా. వాటినే విత్తనాలుగా ఉపయోగించుకుంటున్నాను. రైతులు తన దగ్గరకు వచ్చి విత్తనాలు తీసుకెళ్తారు. వానాకాలం, యాసంగి విత్తనాలు నిల్వపెట్టుకుంటాను. –మొగులమ్మ, రైతు, పొట్పల్లి సొంత పొలంలో సాగు చేస్తున్నా తనకు ఉన్న సొంత పొలంలో చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, కూర గాయలు సాగు చేస్తున్నా. 60 రకాల వరకు విత్తనాలు, 15 రకాల వరకు దేశీ కూరగాయలు పండిస్తున్నా. న్యాల్కల్, హద్నూర్ తదితర అంగళ్లకు వెళ్లి కూరగాయలు అమ్ముకుంటున్నా. విత్తనాలు నిల్వపెట్టి సాగు చేస్తున్నా. మిగతావి తోటి రైతులకు ఇస్తున్నా. –నర్సమ్మ, రైతు–గుంజోటి -
భూ భారతిపై అవగాహన ఉండాలి
● ఖేడ్లో ఆర్వోఆర్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● సాదాబైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలు: కలెక్టర్ క్రాంతి నారాయణఖేడ్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్తగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన ఏర్పరుచుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్లో మంగళవారం నిర్వహించిన భూ భారతిపై అవగాహన సదస్సుకు కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోగా భూ భారతి పోర్టల్ ద్వారా దర ఖాస్తులు చేసుకోవాలన్నారు. నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కారమవు తాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డీఓ, కలెక్టర్కు అధికారాలు కల్పించారని చెప్పారు. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకుంటే సీసీఎల్ఎతో పాటు ల్యాండ్ ట్రిబ్యునల్కు సైతం అప్పీల్ చేసుకునే అవకాశముందని తెలిపారు. రుణమాఫీ, ఇళ్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నవడ్లకు బోనస్, లబ్ధిదారులకు సన్నబియ్యం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతీ సంవత్సరం ప్రదర్శనకు రికార్డులు జోగిపేట(అందోల్)/వట్పల్లి (అందోల్): ప్రతీ గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి ఏటా గ్రామాల్లో రికార్డులను ప్రదర్శనకు ఉంచుతారని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో పరిపాలనా అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించారు. ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భార తి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించదని తెలిపారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడతాయని చెప్పా రు. అనంతరం జోగిపేట, వట్పల్లిలో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడుతూ...భూముల సరిహద్దులను సైతం జీపీఎస్ సిస్టమ్తో భూభారతి ద్వారా హద్దులు తెలుసుకునేందుకు వీలుందన్నారు. భూ భారతిలో రికార్డుల సవరణ, మ్యూటేషన్కు ముందే మ్యాప్ తయారు చేయడం, పాసు బుక్కులోనే భూమి పటం వంటి నూతన అంశాలు ఉన్నా యని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఖేడ్ ఆర్డీఓలు, అశోక చక్రవర్తి, పాండు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, డీఎస్పీ వెంకట్రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్
రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్ రావు అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్నగర్లో జరుగుతున్న జాతీయస్థాయి కలరిపయట్టు క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేరళలో పుట్టిన కలరిపయట్టు క్రీడకు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇప్పటికీ అనేక మంది ఈ క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. చిన్ననాటి నుంచే ఈ క్రీడలో శిక్షణ అందిస్తే ఎంతో రాణిస్తారని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.మెదక్ ఎంపీ రఘునందన్ రావు -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు
తొగుట(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిలువేరి నరేశ్ గౌడ్(30) తల్లిదండ్రులు లక్ష్మీ, వెంకట్ గౌడ్ అనారోగ్యం (పక్షపాతం)తో కొన్నేళ్లుగా బాధపడుతున్నారు. తల్లిదండ్రులు మంచం పట్టడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు, కుటుంబం అవసరాల కోసం అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మద్యానికి బానిసై పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురై నరేశ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకట్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
తాటి ముంజల బజ్జీ.. క్రేజీ
● హుస్నాబాద్ నోరూరిస్తున్న బజ్జీలు ● ఇష్టంగా తింటున్న కల్లు ప్రియులు ● రూ.100కి ఆరు చొప్పున విక్రయం ● ఎండాకాలంలో తాటి ముంజలతోశరీరానికి చల్లదనంహుస్నాబాద్: బజ్జీలు రకరకాలుగా ఉంటాయి. సామాన్యంగా బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీ లు, హెగ్ బజ్జీలు పేర్లే విన్నాం. ఇక్కడ మాత్రం ముంజకాయల బజ్జీలు ఫేమస్. ఈ బజ్జీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకవు. కేవలం భగ భగ మండే ఎండాకాలంలో ముంజల సీజన్లోనే దొరుకుతాయి. పచ్చి ముంజలతోపాటుగా తాటి ముంజల బజ్జీలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు. హుస్నాబాద్ పట్టణ శివారులోని పందిల్ల రోడ్డామ్ సమీపంలోని హుస్నాబాద్, సిద్దిపేట హైవేలోని తాటి వనంలో ఆంజనేయులు కల్లు తాగే వారి కోసం స్టఫ్ దుకాణం నడిపిస్తున్నాడు. ఇతడు అమ్మే వాటిలో తాటి ముంజల బజ్జీలు ఫేమస్. బజ్జీలు చాలా రుచికరంగా ఉంటాయి. ఆంజనేయులు దగ్గర కల్లు ప్రియులు రోడ్డు నుంచి వెళ్లే వారు కొనుక్కుంటారు. తాటి వనంలో అమ్మే స్టఫ్కు బదులుగా ముంజల బజ్జీలను ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. ఈ తాటి ముంజలను శనగపిండిలో కారం, ఉప్పు, సోడా వేసి కలుపుతాడు. తర్వాత ముంజలను పిండిలో ముంచి నూనె కడాయిలో వేస్తాడు. సామాన్యంగా బజ్జీలను ఎలా తయారు చేస్తారో అదే విధంగా ముంజలను బజ్జీలుగా తయారు చేస్తాడు. ఎర్రగా బాగా కాలిన తర్వాత బజ్జీలను తీసి అమ్ముతుంటాడు. రూ.100కి ఆరు చొప్పున అమ్ముతాడు. మోదుగాకులో పెట్టి మరీ ఇస్తాడు. కల్లు ప్రియులు కల్లు తాగుతూ లోట్టలు వేసుకుంటూ తింటున్నారు. కల్లు తాగని వారు ఇంటికి తీసుకెళ్తారు. ఆర్డర్ పై కూడా ముంజల బజ్జీలు తయారు చేసి ఇస్తున్నాడు ఈ ఆంజనేయులు. ముంజుల విక్రయం ఎక్కువే..ఎండాకాలంలో పండ్ల రసాలు, జ్యూస్లు, నిమ్మరసం తాగితే శరీరానికి మంచిది. కడుపులో చల్లగా ఉంటుంది. ఈ రసాలు ఏ కాలంలోనైనా దొరుకుతాయి. కానీ ఎండాకాలంలో తాటి ముంజకాయలకు భలే గిరాకీ ఉంటుంది. తాటిముంజలు తింటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కడుపులో చల్లగా ఉండి శరీరానికి మంచిదని చాలా మంది తాటి ముంజలను అమితంగా ఇష్టపడుతారు. చిరు వ్యాపారులు తాటి గెలలను గీత కార్మికుల నుంచి కొనుగోలు చేసి ముంజలు తీసి అమ్ముతుంటారు. రూ.100కి 12 చొప్పున విక్రయిస్తుంటారు. -
మేలుకో.. ధ్రువపత్రం ముందే తీసుకో
సెలవులని ఆలస్యం చేయొద్దు● విద్యార్థులకు ఇదే సరైన సమయం ● సెలవులు ముగిస్తే మీ సేవాకేంద్రాల వద్ద పెరగనున్న రద్దీ ● ధ్రువపత్రాల జారీలో ఆలస్యం అయ్యే అవకాశం ● ముందే జాగ్రత్త పడితే మేలుఇటీవల పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలు 63,877 పదో తరగతి 10,388 ఇంటర్ ఫస్ట్ ఇయర్ 6,153 సెకండియర్ 5,572 మొత్తం 85,990 మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు ఉన్నత తరగతుల్లో చేరేందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన ధ్రువ పత్రాలు పొందడానికి ఇదే మంచి సమయం. వేసవి సెలవులు ముగియగానే విద్యార్థులందరూ ఒకేసారి సర్టిఫికెట్ల కోసం మీసేవల వద్దకు గుమిగూడుతారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో మీ సేవలో దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యమవుతుంది. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ప్రతీ దరఖాస్తు పరిశీలించడంతో ధ్రువపత్రాల జారీ జాప్యం జరుగుతుంది. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవుల్లోనే నూతన విద్యా సంవత్సరానికి కావాల్సిన ధ్రువ పత్రాల కోసం దరఖాస్తు చేసుకొని తీసుకోవడం ఉత్తమం. ప్రతీ విద్యార్థికి అవసరం విద్యార్థులకు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు, స్కాలర్షిప్లకు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కుల, ఆదాయ, స్థానిక ధ్రువపత్రాలు తప్పనిసరి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 1 నుంచి 10 తరగతుల విద్యార్హత సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు. ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలతోపాటు విద్యాపరంగా గ్యాప్ ఉంటే దానికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసే పత్రం అవసరం ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు తమ పరిధిలోని ఠాణా నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ, నివాస ధ్రువపత్రాలను అవసరం మేరకు ప్రతీ సంవత్సరం తీసుకోవాల్సి వస్తుంది. 22న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. త్వరలో పదో తరగతి ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పై చదువులు చదవడానికి విద్యార్హత పత్రాలతోపాటు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. దరఖాస్తు ఇలా చేసుకోవచ్చు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్, రేషన్కార్డులతోపాటు బోనఫైడ్లు, ఫొటోలు జత చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులు ఆధార్, రేషన్కార్డుతోపాటు న్యాయవాది అఫిడవిట్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల హామీ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఈ విద్యార్థుల కుటుంబాలకు 100 చదరపు అడుగుల స్థలం కూడా ఉండకూడదు. మండల రెవెన్యూ అధికారి, ఉప తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం దరఖాస్తును ఆన్లైన్ ద్వారా రిపోర్టును తహసీల్దార్ లాగిన్కు చేరవేస్తారు. అన్ని పత్రాలను తహసీల్దార్ పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం చేస్తారు. అనంతరం సంబంధిత విద్యార్థి దరఖాస్తు ఫారమ్లో ఇచ్చిన ఫోన్ నంబర్కు మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ వచ్చిన వెంటనే మీ సేవా ద్వారా విద్యార్థులు ధ్రువ పత్రాలను పొందవచ్చు.రెండు రోజుల్లో అందిస్తాం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం రెండు రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తున్నాం. అత్యవసరమైతే తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మణ్బాబు, తహసీల్దార్, మెదక్ -
తల్లీకూతురు అదృశ్యం
పటాన్చెరు టౌన్: తల్లీకూతురు అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కోటేశ్వర్ రావు కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్కు చెందిన సమీర్ రాణా బతుకుదెరువు కోసం రెండు నెలల కిందట వచ్చి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మంజీరా స్కూల్ సమీపంలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 26న డ్యూటీకి వెళ్లిన సమీర్ రాణా రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య కీయా రాణా, కూతురు సేయా(6) కనిపించలేదు. స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య, కూతురి అదృశంపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నా భర్త ఆచూకీ తెలపండి హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన మైలి శ్రీను 16 నుంచి నుంచి కనిపించడం లేదని, తెలిస్తే ఆచూకీ తెలపాలని అతడి భార్య లత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరైనా ఆచూకీ లభిస్తే హవేళిఘణాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
మెరుగైన వైద్య సేవలతోనే గుర్తింపు
ములుగు(గజ్వేల్) : గ్రామీణ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే వైద్యులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్. నందకుమార్రెడ్డి అన్నారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం మెడికల్ కళాశాలలో చైర్మన్ డాక్టర్.యాకయ్య అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్య విద్య గ్రాడ్యుయేషన్తో నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పరిశోధన, ఉత్తమ పద్ధతి, పురోగతితో జ్ఞానం, నైపుణ్యత పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. గ్రాడ్యుయేట్ వైద్యులు నిత్య విద్యార్థిగా భావిస్తూ ఆరోగ్య నిపుణుల సలహాలను స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్రెడ్డి, సీఈఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.కేఎన్ఆర్ యూహెచ్ఎస్వైస్ ఛాన్స్లర్ డాక్టర్.నంద కుమార్రెడ్డి -
అవగాహన ఒప్పందంపై సంతకాలు
ములుగు(గజ్వేల్) : ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వ విద్యాలయం, హైదరాబాద్కు చెందిన శ్రీ ఫౌండేషన్ మధ్య సోమవారం పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ములుగు విశ్వ విద్యాలయ వైస్ ఛాన్స్లర్ డాక్టర్. దండా రాజిరెడ్డి, శ్రీ ఫౌండేషన్ ప్రతినిథి శ్రీనివాస్రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతులు, మహిళలు, యువతకు వినూత్న శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా శక్తివంతం చేయడంలో శ్రీ ఫౌండేషన్ దోహదపడుతుందన్నారు. అంతే కాకుండా ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి పరిశోధన ప్రాజెక్ట్లు, ఆన్– ఫామ్ ట్రయల్స్, విస్తరణ కార్యకలాపాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, లక్ష్మీనారాయణ, కుమార్, రాజశేఖర్, శ్రీనివాసన్ అనితాకుమారి, వీణాజోషి, తదితరులు పాల్గొన్నారు. -
పొన్నంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ పట్టణానికి చెందిన చొప్పరి లింగయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో పని చేయలేక స్వదేశం రావడానికి చేతిలో డబ్బులు లేక అక్కడే ఉండిపోయాడు. స్వదేశానికి రావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయం చేయాలని కోరాడు. స్పందించిన మంత్రి టికెట్కు డబ్బులు ఇచ్చి ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ చైర్మన్ వినోద్కుమార్ను లింగయ్య దగ్గర పంపించి భరోసా కల్పించి ఇంటికి పంపించాడు. సోమవారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. చెక్డ్యాం ధ్వంసం చేశారని రైతుల ఆందోళన బెజ్జంకి(సిద్దిపేట) : శనిగరం ప్రాజెక్టు నుంచి ముత్తన్నపేట, దాచారం గ్రామాలకు సాగునీరు వచ్చే కాల్వ చెక్డ్యాం ధ్వంసం చేయడంపై ఆగ్రహించిన ముత్తన్నపేట రైతులు సోమ వారం నర్సింహుపల్లె శివారులోని వైట్ ఫీల్డ్ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేశారు. వ్యర్థ జలాలు కాల్వలోకి వదలడానికి కంపెనీ వారే కాల్వ, చెక్ డ్యాంలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాల్వ నీటిని కాలుష్యం చేసేలా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేసి రైతులు వెనుదిరిగి వెళ్లారు. -
చికిత్స పొందుతూ బాలుడు మృతి
● వైద్యం వికటించడం వల్లేచనిపోయాడని కుటుంబీకుల ఆరోపణ ● మా తప్పేమీ లేదన్న వైద్యులుసిద్దిపేటజోన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు సోమవారం మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే బాలుడు చనిపోయాడని బాలుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక పట్టణానికి చెందిన అనిల్, భవానీ దంపతుల 8 నెలల బాలుడు(నిహాన్)ను ఆదివారం సాయంత్రం పట్టణంలోని సంరక్ష పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో తెమడ(బ్రాంకిటిస్ న్యూమేనియా)గా గుర్తించి ఐసీయూలో చేర్పించి చికిత్స ప్రారంభించారు. సోమవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం వికటించడం వల్లే బాబు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం తెల్లవారు జామున నర్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే పల్స్ రేటు పడిపోయి బాబు చనిపోయాడని తల్లి భవానీ విలపిస్తూ పేర్కొంది. బ్రాంకిటిస్ న్యూమేనియాతో బాధపడుతున్న బాబుకు చికిత్స అందిస్తుండగా సోమవారం పరిస్థితి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండగా సీపీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, ఇందులో మా తప్పు ఏమీ లేదని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. -
100 శాతం పరిష్కారం
● భూభారతితో రైతులకు మేలు ● అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించం ● ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ● చట్టంలో కొన్ని సవరణలు చేయాలి ● ఎంపీ రఘునందన్ రావు హత్నూర(సంగారెడ్డి): భూ సమస్యల పరిష్కారం విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్లో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కేసీఆర్ తెచ్చిన ధరణి వల్ల ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, వంద శాతం భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ చట్టం పనిచేస్తుందన్నారు. భూదాన్ చట్టం కూడా సరిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. భూదాన్ చట్టాన్ని మరింత పటిష్టంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. దేశంలోని సివిల్ కోర్టుల వద్ద ఐదువేల కోట్ల కేసులు పెండింగ్లో ఉంటే మూడు వేల కోట్ల కేసులు భూ సమస్యలే ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. ఐదు లక్షల విలువ ఉన్న భూమి సమస్యలను ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం అవుతుందన్నారు. ఉచిత న్యాయ సేవ కూడా రెవెన్యూ శాఖ ద్వారా రైతులకు అందిస్తామన్నారు. తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన మండల కేంద్రమైన హత్నూరలో తహసీల్దార్ నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. హత్నూర అంబేద్కర్ గురుకుల కళాశాలలో రూ.63 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లు, రూ.2కోట్లతో నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాలలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.పదేళ్లు సొల్లు కబుర్లు చెప్పావా?అసెంబ్లీ సమావేశాలను సొల్లు కబుర్లు అని సంబోధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేశారని విమర్శించారు. అసెంబ్లీని కించపరిచిన కేసీఆర్.. మరి పదేళ్ల మీ పాలనలో సొల్లు కబుర్లు చెప్పారా అంటూ నిలదీశారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. -
మొక్కలేని సంకల్పం!
మొక్కలు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న మట్టి బ్యాగులు హత్నూర మండలం మధుర గ్రామ నర్సరీలోని చిత్రమిది. సరైన సమయంలో బ్యాగుల్లో విత్తనాలు వేయకపోవడం, అవసరం మేరకు నీళ్లు పట్టకపోవడంతో సగానికి పైగా మొక్కలు మొలకెత్తలేదు. నిజానికి ఒక్కో బ్యాగులో రెండేసి విత్తనాలు వేస్తారు. ఒకటి మొలక రాకపోయినా.. ఇంకో విత్తనం మొలకెత్తుతుంది. కానీ నిర్వహణ లోపం కారణంగా బెడ్లలో సగానికిపైగా బ్యాగులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఒక్క మధుర గ్రామంలోని నర్సరీదే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నర్సరీల్లోనూ ఇదే పరిస్థితే నెలకొంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డినర్సరీల్లో మొక్కల పెంపకం విషయంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా డిసెంబర్ చివరి వారం వరకు పాలిథిన్ కవర్లలో మట్టిని నింపి (బ్యాగ్ ఫిల్లింగ్) చేసి విత్తనాలు పెట్టుకుంటే జర్మినేషన్ 100 శాతం ఉంటుంది. కానీ అప్పట్లో గ్రామపంచాయతీల కార్యదర్శులకు సర్వే, ఇతర పనుల పేరుతో ఈ నర్సరీలను పట్టించుకోలేదు. డిసెంబర్ నెలాఖరులోగా విత్తుకోవాల్సి ఉండగా, చాలా నర్సరీల్లో ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా విత్తనాలు వేసుకోలేదు. ఇప్పుడు మొక్కల జర్మినేషన్ తగ్గడానికి ఆలస్యంగా విత్తుకోవడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ నర్సరీల నిర్వహణను కూడా కొన్ని గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొందనే వాదన కూడా ఉంది. 38 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం కాగా.. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా 38 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 619 చోట్ల ఉన్న నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇందులో సుమారు 19 లక్షల మొక్కల కోసం కొత్తగా విత్తనాలు వేసుకోగా, గత ఏడాది నాటకుండా మిగిలిపోయిన మరో 19 లక్షల మొక్కలను ఈ ఏడాదికి సిద్ధంగా ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే జర్మినేషన్ తగ్గడంతో ఈసారి వనమహోత్సవానికి సరిపడా మొక్కలు పెరగడం ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్మినేషన్ 11 శాతం తగ్గిందంటున్న అధికారులు 40 శాతానికి మించి నాటుకోలేదని అనధికారిక అంచనా నర్సరీల నిర్వహణను గాలికొదిలేసిన గ్రామ కార్యదర్శులు వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం కావడం ప్రశ్నార్థకమే గతంలో మాదిరిగానే.. గత ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో ఏటా వర్షాకాలంలో విరివిగా మొక్క లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా లక్షల్లో మొక్కలు నాటినప్పటికీ.. వందల్లో కూడా మొక్కలు పెరగకపోవడంతో ప్రజాధ నం చాలా మట్టుకు వృథా అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వనమహోత్సవం పేరుతో వర్షాకాలం రాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అయితే గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు కూడా సరైన నిర్వహణ లోపం కారణంగా ప్రజాధనం వృధా అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సరిపోను మొక్కలను సిద్దం చేస్తున్నాంఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమానికి 38 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాం. ఈ మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. అయితే ఈసారి కొన్ని నర్సరీల్లో మాత్రమే జర్మినేషన్ తగ్గినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం. లక్ష్యానికి సరిపోను మొక్కలను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ -
చిరు ధాన్యాల భాండాగారం
● 40 గ్రామాల మహిళా రైతుల విత్తనాల ప్రదర్శన ● డీడీఎస్ సంఘాల సభ్యులు చిరుధాన్యాలే సాగు నేటి నుంచి విత్తన వారోత్సవాలుజహీరాబాద్: మహిళా రైతులు తమ పొలాల్లో నాటుకునేందుకు సొంత విత్తనాలే వాడుతారు. పంట చేతికి రాగానే అందులోని నాణ్యమైన పంటను విత్తనంగా సేకరించి నిల్వ పెట్టుకున్నారు. విత్తనాలు వేసే సమయానికి వాటిని బయటకు తీస్తారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) సంఘంలోని మహిళా రైతులు తమకు అవసరమైన మేరకు ప్రతి ఏటా చిరుధాన్యాల విత్తనాలు నిల్వ పెట్టుకుంటారు. ఎంపిక చేసుకున్న విత్తనాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు గాను బూడిద, వేపాకు కలిపి ఈత బుట్టల్లో పోసి మట్టితో మూసి వేస్తారు. విత్తనాలు పెట్టే సమయంలో వాటిని బయటకు తీసి ఉపయోగిస్తారు. సుమారు 50 నుంచి 70 రకాల వరకు విత్తనాలను నిల్వచేసి పెట్టుకుంటారు. సాయిజొన్న, పచ్చజొన్న, తీపి జొన్న, గుండు జొన్న, తోక జొన్న, సజ్జ, కొర్ర, తైద, సామ, శనగ, ఆర్గులు, పెసర, మినుము, అవిశ, కందులు, కోడి సామ, ఎవ్వలు ఇలా అనేక రకాల విత్తనాలను సేకరించి పెట్టుకుంటారు. ఆయా పంటలన్నీ వర్షాకాలంలో వర్షాధారంగా, యాసంగిలో తేమ ఆధారంగా పండే పంటలను సాగు చేసుకుంటారు. నేడు ప్రపంచ విత్తన వారోత్సవం 29న (మంగళవారం) డీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ విత్తన వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ చివరి వారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విత్తన వారోత్సవంగా జరుపుకొంటారు. అందులో భాగంగా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామంలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఉ. 11.30 గంటలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 40 గ్రామాల నుంచి మహిళా రైతులు తమ వద్ద ఉన్న పలు రకాల చిరుధాన్యాల విత్తనాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎంపికయిన ఉత్తమ రైతులకు బహుమతులను అందజేస్తారు.మాచ్నూర్లో విత్తన బ్యాంకుఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో డీడీఎస్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. ఈ విత్తన బ్యాంకులో 60 రకాల వరకు విత్తనాలు రైతులకు అన్ని రకాలు కలిపి సుమారు 20 క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచుతారు. అవసరం అయిన రైతులు విత్తన బ్యాంకును సంప్రదించి విత్తనాలు పొందుతారు. పంట చేతికి రాగానే విత్తన బ్యాంకులో రైతులు తీసుకున్న విత్తనాన్ని తిరిగి అందజేస్తారు. 10 కిలోల విత్తనం పొందితే తిరిగి ఇచ్చే సమయంలో 15 కిలోలు అప్పజెపుతారు. -
భూములు లాక్కుంటే మేమెట్లా బతకాలి..?
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● గుమ్మడిదలలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం ● భూసేకరణ వేగవంతం చేసిన అధికారులు ● భూమికి భూమి ఇవ్వాలి.. లేదా ప్రత్యామ్నాయం చూపాలి ● బాధిత రైతుల డిమాండ్ మినీ ట్రాక్టర్తో మందులను పిచికారి చేసే విధానంపై నిర్వహించిన ప్రదర్శన వ్యవసాయ భూములు లాక్కోవద్దు ఎన్నో ఏళ్లుగా మేమంతా భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం పార్కు పేరిట మా భూములు కావాలంటుంది. ముందుగా మాకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. వేరేచోట భూములు ఇచ్చినా సరే.. లేదంటే రోడ్డున పడతాం. భద్రయ్య, రైతు, గుమ్మడిదల భూమికి భూమి ఇవ్వాలి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రైతులకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఈ భూముల్లో ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు పారిశ్రామిక వాడ ఏర్పాటు పేరిట రైతుల భూములు సేకరిస్తున్న ప్రభుత్వం.. బాధిత రైతులకు న్యాయం చేయాలి. రవీందర్, రైతు, గుమ్మడిదల జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో కాలుష్యరహిత ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు నిర్ణయం రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. గుమ్మడిదలలో సర్వే నంబర్ 109లో 157.29 ఎకరాలలో ఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ విషయమై అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల గ్రామ సభను ఏర్పాటు చేశారు. టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి భూసేకరణపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అయితే.. భూములు తీసుకుంటున్న అధికారులు.. భూమికి బదులు భూమి ఇస్తారా..? లేక ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపుతారా? అనేది ప్రకటించలేదు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘‘మా తాతల కాలం నుంచి భూములను నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీయల్ పార్కు పేరిట మా భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. భూములు లాక్కుంటే మేం ఎట్లా బతకాలి. భూమికి భూమి ఇవ్వాలి. లేదా అన్నారం పరిధిలోని సర్వే నంబర్ 261లో వెయ్యి గజాలు చొప్పున పట్టాలు చేసి ఇవ్వాలి’’అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా బతుకుదెరువునిచ్చిన భూములను అప్పగించేందుకు మాత్రం వారు వెనుకడుగు వేస్తున్నారు.బాధిత రైతులకు న్యాయం చేస్తాం గుమ్మడిదల మున్సిపాలిటీలో గ్రీన్, ఆరెంజ్ జోన్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో పార్కు ఏర్పడితే కాలుష్య రహిత పరిశ్రమలను స్థాపిస్తామని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి కేంద్రబిందువుగా ఉంటుందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. – ఆర్డీఓ రవీందర్ రెడ్డిన్యూస్రీల్ -
లారీ డ్రైవర్పై కేసు నమోదు
నర్సాపూర్ రూరల్: చిన్నచింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై లింగం ఆదివారం తెలిపారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని బైక్పై నుంచి రోడ్డుపై పడిన ముగ్గురిపై నుంచి లారీ దూసుకెళ్లిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు మాల గోపాల్ అతడి కుమారుడు అనుదీప్, తోడళ్లుడు కూతురు సహస్ర మృతి చెందారు. వీరికి మృతికి కారణమైన సూర్యాపేటకు చెందిన లారీ డ్రైవర్ చంద్రబాబును అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గడ్డి మోపులు దగ్ధం నర్సాపూర్ రూరల్: గడ్డి మోపులతో వెళ్తున్న ట్రాక్టర్కు మంటలు అంటుకున్న ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బ్రాహ్మణపల్లి గిరిజన తండాకు చెందిన రమేశ్ నాయక్ ట్రాక్టర్లో గడ్డి మోపులను లోడ్ చేసుకొని గ్రామంలోకి వస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్య్కూట్తో మంటలు చెలరేగి అంటుకున్నాయి. రమేశ్ నాయక్ చాకచక్యంగా వ్యవహరించి ట్రాలీ హైడ్రాలిక్ లేపడంతో కాలుతున్న గడ్డిమోపులు రోడ్డుపై పడ్డా యి. దీంతో బ్రాహ్మణపల్లి రోడ్డులో ఇరువైపు లా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గడ్డిమోపులు కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి జహీరాబాద్ టౌన్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మొగుడంపల్లి మండలం గుడ్పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గుడ్పల్లికి చెందిన వడ్డె నాగన్న (55) రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కరెంట్ సరఫరా జరగడంలేదని సర్వీస్ వైర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిరాగ్పల్లి పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొట్టినతుఫాన్ వాహనం ● కూలి పనులకు వెళ్లొస్తూ ఇద్దరు మృతి నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం నంగు నూరు మండల రాంపూర్ క్రాస్రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోహెడ మండలం బస్వాపూర్కు చెందిన తాడెం సారయ్య (36), అదే గ్రామానికి చెందిన బండోజు గణేశ్ సిద్దిపేటలో కూలి పనులు ముగించుకొని రాత్రి మోటర్ సైకిల్పై స్వగ్రామానికి బయలు దేరారు. ఇదే సమయంలో వరంగల్ మీటింగ్కు నుంచి సిద్దిపేట వైపునకు తుఫాన్ వాహనం వెళ్తుంది. మార్గమధ్యలో రాంపూర్ క్రాస్ వద్దకి రాగానే తుఫాన్ వాహనం బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సారయ్య అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడు రమేశ్ను రాజపాల్పేట ఎస్ఐ ఆసీఫ్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను పోలీస్ వాహనంలో సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కుక్కను తప్పించబోయి.. మృత్యుఒడికి
బైక్ అదుపుతప్పి పడిపోవడంతో వ్యక్తి మృతి చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి శివారులో చోటు చేసుకుంది. పేట ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన సందిగల్ల ఎల్లం(48) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం మడూర్ నుంచి మెదక్ బయలుదేరిన ఎల్లం గవ్వలపల్లి దాటిన తర్వాత మెదక్ రోడ్డుపై కుక్క అడ్డుగా రావడంతో తప్పించేందుకు ప్రయత్నించాడు. బైక్ అదుపుతప్పి పడిపో వడంతో గాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చల్లని పొదరిల్లు
మండు వేసవిలోనూ కూల్ కూల్.. ● చెక్కు చెదరని గడీల ఇల్లు, పెంకుటిళ్లు ● తాతల కాలం నాటి ఇళ్లనుకాపాడాకుంటున్న వారసులు ● సీజన్ ఏదైనా ఆహ్లాదకరం ● పర్యావరణహితం..పాతకాలం నాటి భవనం ఎండలు మండిపోతున్నాయి.. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.. వేడిమిని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు.. చాలా మంది ఇంట్లోనే ఉంటూ ఏసీలు, కూలర్లు వాడుతూ చల్లదనాన్ని పొందుతున్నారు. ఇవి ఎంత వాడినా న్యాచురల్గా వచ్చే గాలి వేరు. ప్రస్తుతం కొన్ని ఇళ్లు ఎంత ఎండ కొట్టినా చల్లదనాన్ని పంచుతున్నాయి. మట్టి గోడలతో నిర్మితమైన అతి పురాతన ఇళ్లు, ఇంటి పైకప్పులో పేర్చిన కలప, చెక్క వంటి వాటితో ఇళ్లు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. పెంకుటిళ్లు కూడా ఎన్నేళ్లు అయినా చెక్కు చెదరకుండా కూల్గా ఉంటాయి. కొందరైతే తాతల కాలం నుంచి వచ్చిన ఇళ్లను రూ.లక్షలు ఖర్చు చేసి మోడ్రన్ ఇల్లుగా మార్చుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి ఎలాంటి వాతావరణంలోనైనా చల్లదనాన్ని పంచే ఇళ్లపై ప్రత్యేక కథనం..పర్యావరణ హితం.. ఆ ఇల్లు చిన్నకోడూరు(సిద్దిపేట): పర్యావరణ హితం.. వాతావరణ అనుకూలం లక్ష్యంగా మట్టి, ఇసుక, సిమెంట్, డంగ్ సున్నంతో కలిసి చేసిన ఇంటి నిర్మాణం ఆహ్లాదాన్ని అందిస్తుంది. మండు టెండలో సైతం చల్లదనాన్ని ఇస్తుంది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన కొండం లక్ష్మారెడ్డి రిటైర్డ్ ఉద్యోగి. తన ఇంటిని వినూత్న రీతిలో నిర్మించారు. కేరళ ప్రాంతంలో అధికంగా ఇలాంటి ఇళ్ల నిర్మాణాలు ఉంటాయి. తెలంగాణలో మొదటి సారిగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ ఇళ్లు ఏడాది కాలం పాటు వర్షాకాల, శీతాకాల, వేసవికాలాలకు అనుగుణంగా ఉంటుంది. తక్కువ డబ్బులతో వాతావరణ, వాయుకాలుష్యం నుంచి రక్షణ కలిపిస్తుంది. ఏసీలు, కూలర్లు అవసరం లేదు. ఆరోగ్యపరంగా ఇంటి నిర్మాణం బహుళ ప్రయోజనం. మోడ్రన్ పెంకుటిల్లు సొబగులు అద్ది.. చల్లగా తీర్చిదిద్ది రూ.లక్షలు వెచ్చించి ఇంటిని పునర్నిర్మాణం సిద్దిపేటరూరల్: ఎండాకాలం పెంకుటిల్లును మించిన చల్లదనం ఉండదు. ఇలాంటి క్రమంలో ఎంతమంచి బిల్డింగ్ కట్టుకున్నా ఎండాకాలం వేడిని నుంచి సాధారణ ఉపశమనం పొందడం వీలుకాదు. అలాంటి ఇబ్బందులను తొలగించుకుంటూ చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన కోటగిరి యాదగిరి గౌడ్, కొత్తపల్లి చంద్రం పాత ఇల్లునే అందంగా నిర్మించుకొని మోడ్రన్ పెంకుటిల్లుగా మార్చుకున్నారు. బయట నుంచి చూస్తే పెంకుటిల్లు మాత్రమే కాని లోపికి వెళ్లి చూస్తే ఇంద్రభవనం, బిల్డింగ్ వంటి అనుభూతిని పొందేలా అధునాతన పద్ధతిలో నిర్మించుకున్నారు. తన తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఇల్లు కాబట్టి దానిని కూల్చేందుకు మనసు రాక రూ.40 లక్షలకు పైగా వెచ్చించి మోడ్రన్ ఇంటిని నిర్మించారు. చల్లని గాని, వెలుతురు వచ్చేలా విశాలమైన గదులు, బెంగుళూరు పెంకులు, టేకు కర్రతో, అందమైన కళాకృతులతో తలుపులు బిగించారు. ప్రస్తుతానికి ఇల్లు పెంకుటిల్లా.. భవంతి ఇల్లా అన్నట్లుగా చూపరులను ఆకర్శిస్తుంది. ఎండాకాలం అయినా చల్లని వాతావరణం కలిగి ఉండడం విశేషం. -
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తల్లిదండ్రులు సహకారం అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్ చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. బాల్యం నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచాలన్నారు. అనంతరం విజేతలకు సొంత నగదు రూ.2 లక్షలతో బహుమతులు అందజేశారు. మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహ గౌడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అరవ రామకృష్ణ, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రేణుక, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్స్కు దారి
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఆదివారం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం చౌరస్తా వద్ద ఎల్కతుర్తికి వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది. దీంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ యువ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా ఉన్న బారీ కేడ్లను తొలగించి, దారి ఇవ్వండి అని వాహనాలకు చెబుతూ అంబులెన్స్ వెళ్లేలా చేశారు. అక్కడ ఉన్న వారు అందరూ యువకులను అభినందించారు. – ఫోటో : సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్, సిద్దిపేట -
బైక్ను ఢీకొట్టిన కారు
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు హత్నూర(సంగారెడ్డి): బైక్ను కారు బలంగా ఢీకొట్టడంతో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో దౌల్తాబాద్ హత్నూర రోడ్డుపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్ కథనం మేరకు.. మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం అజమర్రి గ్రామానికి చెందిన అమృత, కుమారుడు కృపాకర్, కోడలు అనూష, రెండేళ్ల మనవరాలుతో కలిసి కుమారుడి బైక్పై దౌల్తాబాద్ వైపు వెళ్తున్నారు. దేవులపల్లి శివారులోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమృత(45) అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు కృపాకర్, కోడలు అనూష, రెండేళ్ల మనవరాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పుట్టిన రోజు నాడే బాలుడి అంత్యక్రియలు
చిలప్చెడ్(నర్సాపూర్): ఆనందంగా జరగాల్సిన ఆరేళ్ల బాలుడి పుట్టిన రోజు వేడుకలకు బదులుగా అంత్యక్రియలు జరిగాయి. బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు కేరళకు వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా చిలప్చెడ్ మండలంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన కొండారెడ్డిగారి దిలీప్ రెడ్డి, చందనల కుమారుడు నవీన్రెడ్డి(6) పుట్టిన రోజు ఆదివారం ఉంది. బాలుడి జన్మదిన వేడుకలు కేరళలోని వయనాడ్లో చేసేందుకు తల్లిదండ్రులు, మిగితా కుటుంబ సభ్యులు 23న విహారయాత్రకు వెళ్లారు. శనివారం వయనాడ్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి నవీన్రెడ్డి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులు చిట్కుల్ చేరుకోగానే బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరగాల్సిన నవీన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు, అదే కుటుంబ సభ్యుల రోదనలతో అంత్యక్రియలు జరిగాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి బాలుడికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. వేడుకలు జరిపేందుకుకేరళ వెళ్లిన కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్పూల్లో పడి మృతి చిలప్చెడ్ మండలంలో విషాదం -
అయ్యో ట్రాన్స్‘ఫార్మర్లు’
● రాయపోలు మండలంలోట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ● కరువు కాలంలో ఇదేందనిరైతుల ఆందోళనదుబ్బాకటౌన్ : అసలే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీళ్లు అందక రైతులు నానా తంటాలు పడుతున్నారు. దీనికి తోడు రాయపోల్ మండలంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగలు హల్చల్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాయిల్స్ దొంగిలించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాయిల్స్ దొంగిలించి రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మంగళవారం అర్థరాత్రి మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి దానిలోని కాయిల్స్, ఆయిల్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 50 వేల విలువ గలవి ఎత్తుకెళ్లారని విద్యుత్ అధికారులు చెప్పారు. పంటలు చివరి దశకు వచ్చాయని ఈ సమయంలో నీటిపారుకం ఎంతో అవసరమని రైతులు రోదిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో దొంగల ముఠా అరెస్టు ఐదు నెలల కిందట రాయపోల్ మండల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తొగుట సీఐ లతీఫ్ ఆధ్వర్యంలో రాయపోల్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు. అయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు ఆగకపోవడంతో రైతులు భయందోళనకు గురవుతున్నారు.వ్యవసాయం చేసేదెట్లా.. ట్రాన్స్ఫార్మర్ దొంగలు రైతులను ఆగమాగం జేస్తుర్రు. నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. ఉన్న నీళ్లతో పంట పండిదామంటే ఇప్పుడు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇట్లయితే వ్యవయసాయం ఎట్లా చేయమంటారు. అధికారులు దొంగలను పట్టుకోవాలి. – నిరుడి మల్లమ్మ, మహిళా రైతు -
ఎన్నేళ్లు ‘గడీ’చినా చెదరని ఇల్లు
మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో మండు వేసవిలో చల్లదనం పంచుతుంది దొర వారి గడీల ఇల్లు. సుమారు 400 ఏళ్ల కిందట మర్పడగ గోపాల్ రెడ్డి అనే దొర ఎకరం స్థలంలో ఈ గడిని కేవలం సుమారు రూ. 500తో నిర్మించినట్లు ఆయన వారసత్వంగా వస్తున్న కుటుంబ సభ్యులు చెప్పారు. మీటర్ వెడల్పు గోడల మందంతో ఒక అంతస్తు వరకు మట్టి ముద్దలతో గోడలను నిర్మించారు. పై కప్పులో మొత్తం విలువైన టేకు దూలాలతో పాటు కలపను పేర్చారు. కలపపై వేప ఆకులను పరిచి వాటిపై అర పీట్ మందంతో మట్టిని అమర్చారు. మట్టిపై నుంచి కుమ్మరి గూన పెంకులతో కప్పేశారు. దీంతో ఎంతటి వేసవి కాలం అయినా చల్లగానూ, మరీ ఎంతటి చలి, వర్షాకాలం అయినా వెచ్చగా ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎకరం స్థలంలో నిర్మించిన ఆ ఇంటిలో ఆరు కుటుంబాలు నివసించేలా గదులను నిర్మించారు. ఏసీలు లేకున్నా చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నట్లు ప్రస్తుతం ఆ ఇంటిలో నివసిస్తున్న శశిరేఖా దేవి, లక్ష్మీ నర్సమ్మ, శ్రీమతి, నిర్మల వెల్లడిస్తున్నారు. తమ పిల్లలు హైదబాద్లో స్థిరపడ్డారని, ప్రతీ వేసవి సెలవుల్లో తమ మనవళ్లు, మనవరాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి వేసవి అయిపోయే ఇక్కడే ఉంటారని తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో తమ కుటుంబ సభ్యులు రానున్నారని, వారితో ఈ ఇంటి చల్లదనాన్ని ఆస్వాదిస్తామని చెప్పుకొచ్చారు. -
నమాజ్ కోసం వెళ్లి బాలుడు అదృశ్యం
పటాన్చెరు టౌన్: బాలుడు అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్కి చెందిన హమీద్(11) శనివారం నమాజ్కి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బాలుడి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. బాలుడి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి వెళ్లి మహిళ శివ్వంపేట(నర్సాపూర్): మహిళ అదృమైన ఘటన మండల పరిధి చండీ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సందిగాని కల్యాణికి ఆరేళ్ల కిందట వివా హం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాదిగా చండీ గ్రామంలోని అమ్మగారి ఇంటి వద్ద ఉంటుంది. 26న ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లి కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య
మద్దూరు(హుస్నాబాద్): పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ షేక్ మహబుబ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడపట్ల బాలరాజు(29) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదేళ్లుగా బాలరాజుకు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఎక్కడా కుదరకపోవడంతో మానసింగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. 23న తమ్ముడు బోడపట్ల రాజేందర్కి పెళ్లి కావడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంటుబ సభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మనస్తాపంతో వివాహిత కొండపాక(గజ్వేల్): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. కుకునూరుపల్లి మండలంలోని కోనాయిపల్లికి దున్నపోతుల కలవ్వ (36) కొన్నేళ్ల కిందట భర్తతో విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో కలిసి కోనాయిపల్లిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. 26న రాత్రి తల్లి కిష్టవ్వ, పిల్లలతో కలిసి భోజనం చేసి వేసవి కాలంలో కావడంతో అందరూ కలిసి ఇంటి బయట నిద్రించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కలవ్వ మనస్తాపానికి గురై రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తమ్ముడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
స్కార్ఫ్, కర్చిఫ్లే శ్రీరామరక్ష
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జిల్లాలో వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అత్యవసర పనుల మీద ఎవరైనా మధ్యాహ్నం బయటకు వస్తే మాడు పగిలేలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండ నుంచి రక్షణ పొందేందుకు మహిళలు చున్నీలు, స్కార్ఫ్లు ముఖానికి చుట్టుకుంటుంటే పురుషులు కర్చ్చిఫ్లు, రుమాళ్లు కట్టుకుని బయటకు వస్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుండటంతో ‘సాక్షి’తన కెమెరాతో క్లిక్ మనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డిన్యూస్రీల్ -
పాలన ఇక పారదర్శకం
● మేరీ పంచాయతీ యాప్తో సమగ్ర సమాచారం ● నిధులు, ఖర్చులతో పాటు పనుల వివరాలు ● అభివృద్ధి పనులకు ముందస్తు ప్రణాళికలు ● జిల్లాలో గ్రామ పంచాయతీలు 633 పంచాయతీ పూర్తి సమాచారం గ్రామపంచాయతీకి సంబంధించి పూర్తి సమాచారం యాప్లో పొందుపరుస్తారు. యాప్లో ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామపంచాయతీలను ఎంచుకోవాలి. పంచాయతీకి సంబంధించిన పూర్తి అంశాలు కనిపిస్తాయి. పంచాయతీలో నివసిస్తున్న జనాభా, ఓటర్లు, నివాసం ఉంటున్న ఇండ్ల సంఖ్య, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చేపట్టిన నిధుల ఆడిట్ వివరాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ యాప్లో మరిన్ని వివరాలు అప్డేట్ కానున్నాయి. సంగారెడ్డి జోన్: మారుతున్న పోటీ ప్రపంచంలో కాలానికి అనుగుణంగా సాంకేతికతను వినియోగిస్తూ అభివృద్ధిపథం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ని 633 గ్రామపంచాయతీల సమగ్ర సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మేరీ పంచాయతీ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్లో గ్రామ పంచాయతీల స్వరూపంతోపాటు అన్ని రకాల వివరాలు పొందుపరచనున్నారు. పంచాయతీకి సంబంధించిన అన్ని రకాల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ నిధులు ఎంత మేర ... మేరీ పంచాయితీ యాప్ ద్వారా గ్రామ పంచాయతీ పాలకమండలి (సర్పంచ్ ఉప సర్పంచ్తోపాటు వార్డు సభ్యులు), సంబంధిత పంచాయతీ కార్యదర్శి వివరాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు విడుదల చేసిన వివిధ రకాల నిధులు ఎంత మేర విడుదల చేశారు? విడుదల అయిన నిధులతో ఏయే రకాల పనులు చేపట్టారు? ఎంత మేర ఖర్చు పెట్టారు? అనే విషయాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతోపాటు పంచాయతీ కార్మికులకు అందించిన వేతనాలు, తదితర ఖర్చుల వివరాలను పొందుపరచనున్నారు. పనుల్లో తగ్గనున్న అవినీతి గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పాలను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే మేరీ పంచాయతీ యాప్ ద్వారా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మంజూరైన నిధులతో చేపట్టిన పనులు, ఖర్చు చేసిన వాటి వివరాలు లభ్యమవుతాయి. ఖర్చు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయడంతో పాలనలో పారదర్శకత మెరుగు పడనుంది. దీంతో చేపట్టిన పనుల్లో నాణ్యతతో పాటు అవినీతికి పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఏ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి? వాటిలో ఉన్న నిల్వలు అనే వివరాలు లభ్యమవుతాయి. అభివృద్ధి పనులు యాప్లో నమోదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు సంబంధించి సిద్ధం చేసిన ప్రణాళికలు సైతం అందుబాటులో ఉంటాయి. గ్రామ పంచాయతీలో ఏ పనులు చేపట్టబోతున్నారు? పంచాయతీ పరిధిలో ప్రతిపాదించిన పనుల వివరాలు, కేటాయించిన నిధుల వివరాలు తెలుసుకోవచ్చు. ఏడాది కాలానికి సంబంధించిన ఖర్చుల వివరాలను అంచనా వేసి ఈ యాప్లో నమోదు చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకునే సౌకర్యం మేరీ పంచాయతీ యాప్ ద్వారా పాలనలో పారదర్శకత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో యాప్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పంచాయతీకి కేటాయించిన నిధులతో పాటు ఖర్చుల వివరాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు వివరాలు అందుబాటులో ఉంటాయి. –సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, సంగారెడ్డి -
కేతకీ భక్తజన సంద్రం
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. భక్తుల సౌకర్యం కోసం ధర్మదర్శనంతోపాటు ప్రత్యేక దర్శనం, వీఐపీ దర్శనాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ శివారుద్రప్ప, పాలకమండలి కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.అమావాస్య పూజలు చేసిన భక్తులు -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడదాం
ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర (సంగారెడ్డి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడతామని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం సునీతారెడ్డి పూలమాలలు వేసి వరంగల్ సభకు వెళ్లే వారికి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చడం లేదన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తామని స్పష్టం చేశారు. వరంగల్ రజతోత్సవ సభ ప్రభుత్వానికి చెంప పెట్టన్నారు. గ్రామాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సభకు ప్రజలు తరలిరావడం ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వం ఎన్నడూ ముందుకు సాగదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి. పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పలు గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఉగ్రవాదుల పిరికిపంద చర్య
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ సంగారెడ్డి రూరల్: ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆదివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేకే భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ... ఉగ్రవాదులు జరిపిన కాల్పులను ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల, రాజకీయ పార్టీలు, యువత ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దేశంలో సైనిక వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఆర్మీని నిఘా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ప్రజలతోపాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను 50 లక్షల ఎక్స్్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి నాయకులు సాయి, శివ, ప్రశాంత్ శ్రీకాంత్, సురేష్, ప్రవీణ్, దేవదాస్, అమీర్ పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాకు మరమ్మతులు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని రాజారాంతండా గ్రామపంచాయతీ పరిధి లోని సాధుతండాలో తాగునీటి సరఫరాకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకులో 40కి పైగా పైపులు వేసి నీటిని వాడుకోవడానికి గిరిజనులు పడుతున్న తంటాలపై ‘తాగునీటికి తండా వాసుల తంటా’శీర్షికన గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. రెండు ప్రధాన పైపులు వేసి వాల్వ్లు బిగించడంతోపాటు ఇంటింటికీ ఫ్లో కంట్రోల్ వాల్వ్లు బిగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచా యతీ రాజ్ అధికారుల సమన్వయంతో నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు రూరల్ వాటర్ సప్లై కంగ్టి ఏఈ జైపాల్ తెలిపారు. రేపు వట్పల్లిలో భూ భారతి సదస్సువట్పల్లి(అందోల్): మండల కేంద్రమైన వట్పల్లిలో ఈ నెల 29న మంగళవారం ఉదయం 11 గంటలకు వట్పల్లిలోని వెంకటఖ్వాజా దర్గా ఫంక్షన్ హాల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ అవగాహన సదస్సుకు కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, అందోలు ఆర్డీఓ పాండు, మండల ప్రత్యేక అధికారితోపాటు ఇతర శాఖల అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ముందుగా చెల్లిస్తే 5 శాతం పన్ను రాయితీఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆస్తిపన్నును ఈ నెల 30వ తేదిలోపు చెల్లించి 5% పన్ను రాయితీ పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక ఏడాదికి చెందిన పన్ను అడ్వాన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఏటా ప్రజలు సహకరించడంతో నారాయణఖేడ్ ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికై దన్నారు. ప్రజలు పన్ను చెల్లింపు ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి రాయితీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాంపియన్షిప్కు కల్పన మునిపల్లి(అందోల్): 54వ రాష్ట్ర హ్యాండ్ బాల్ సీనియర్ మహిళల చాంపియన్ షిప్ పోటీలకు బుదేరా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని బి.కల్పన ఎంపికై ంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బీబీఏ సెకండియర్ చదువుతున్న బి.కల్పన ఈ నెల 29న సికింద్రాబాద్లో జింఖానా గ్రౌండ్, 30న ఆదిలాబాద్లోని మందమర్రి సింగరేణి స్కూల్ గ్రౌండ్ వేదికగా జరిగే క్రీడాపోటీల్లో కల్పన పాల్గొంటారు. భగీరథా.. తాగునీరు వృథా జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మిషన్భగీరథ పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. అస్తవ్యస్తంగా పైపులైన్ను ఏర్పాటుచేయడంతో లీకేజీ ఏర్పడి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు వృథాకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉగ్రవాదులను శిక్షించాలిడీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనపటాన్చెరు టౌన్: ఉగ్రదాడులకు పాల్పడ్డ తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు హరినాథ్రెడ్డి, హాసన్లు డిమాండ్ చేశారు. కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ దగ్గర ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. -
కుట్టు.. ఆదాయం పట్టు
చేతి నిండా పనితో మహిళలు ● పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుడుతూ ఉపాధి ● వేసవిలో మహిళలకు ఆర్థిక భరోసా ● ఆదాయం పొందుతున్న మహిళలు సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇంటి వద్దనే ఉంటూ వివిధ రకాల పథకాల రూపంలో స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తూ..స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల (యూనిఫాం) తయారీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది. దీంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఈ వేసవిలో ఇంట్లోనే ఉంటూ దుస్తులు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. విద్యార్థుల కొలతలు తీసుకుని ఇంటి వద్దనే ఉంటూ బాలబాలికల దుస్తులను కుడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు ఇప్పటికే కుట్టు పనులు ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో.... యూనిఫామ్లు కుట్టే ప్రక్రియను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,95,235 మంది సభ్యులుండగా, మహిళా సంఘాలు 18,208 అందులో 25 మండలాల్లోని 695 గ్రామాల్లో గ్రామ సంఘాల్లోని మహిళలున్నారు. అందులో ప్రస్తుతం 948 మంది దుస్తులు కుడుతున్నారు. మహిళా సంఘం సభ్యులు ప్రతి ఒక్కరూ కుట్టే దుస్తులను ఆన్లైన్లో నమోదు చేయిస్తారు. ఆన్లైన్ విధానంలోనే వారికి డబ్బులను అందజేస్తున్నారు. అయితే మహిళా సంఘాల సభ్యులు కుట్టిన దుస్తులను అధికారులు పాఠశాలలకు అందజేయనున్నారు. ఆ సమయనికల్లా అందజేత... పాఠశాలలను తెరిచే సమయానికి అందించాలని జిల్లాలోని అన్ని పాఠశాలలకు దుస్తులు చేరే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. సంగారెడ్డితోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో మహిళలు ఉపాధి పొందుతున్నారు. ప్రతీఒక్కరు రోజుకు 10 జతల చొప్పున ఈ సభ్యులంతా కలసి రోజులో 7,584 జతలు యూనిఫాం దుస్తులు కుడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో కుట్టిన ప్రతీ యూనిఫాం జతను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. గడువులోపు అందిస్తాం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని స్వయం సహాయక సంఘ సభ్యులు ఉపయోగించుకోవాలి. మహిళలకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. పాఠశాలలు ప్రారంభం నాటికి దుస్తులు కుట్టడం పూర్తవుతుంది. గడువు లోపే అన్ని పాఠశాలలకు యూనిఫాం దుస్తులను అందిస్తాం. –జంగారెడ్డి, జిల్లా అదనపు డీఆర్డీవో -
18 ఏళ్లు నిండిన వారికి సైటీబీ పరీక్షలు
జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సంగారెడ్డి: క్షయ వ్యాధి సోకిన వారితో ఉండే 18 ఏళ్లు నిండిన వారందరికీ సైటీబీ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి వెల్లడించారు. సంగారెడ్డి మార్క్స్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పరీక్షా కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధి ఉన్న రోగులతో కాంటాక్ట్ అయిన 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఈ సైటీబీ నిర్ధారణ పరీక్ష చేసి లేటెంట్ టీబీ వ్యాధిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సైటీబీ పరీక్షలు సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి సీహెచ్ అరుణకుమారి, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శశికర్, సూపర్ వైజర్ శ్రీనివాస్, సీహెచ్ నర్సారెడ్డి, డాక్టర్ కరుణకుమారి పాల్గొన్నారు. -
ఏమైనా ఇబ్బందులున్నాయా!
రోగులను ఆరా తీసిన న్యాయమూర్తి జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని శనివారం సీనియర్ సివిల్ జడ్జి జి.కవితాదేవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవలే గద్వాల్ నుంచి జహీరాబాద్కు బదిలీపై వచ్చిన కవితాదేవి ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియదిరిగారు. రోగులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. మహిళా వార్డుకు వెళ్లి గర్భిణీలతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. దత్తగిరిలో శాంతి ర్యాలీ ఝరాసంగం(జహీరాబాద్): పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శనివారం రాత్రి ఆశ్రమంలో మహామండలేశ్వర్ డా.సిద్దేశ్వర్ స్వామి, వైదిక పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. -
భూ భారతితో అధికార వికేంద్రీకరణ
పటాన్చెరు: భూ భారతి (భూమి హక్కుల చట్టం–2025)ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం, బీరంగూడలో శనివారం నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు, మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...భూ భారతి చట్టంతో అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. పారదర్శకత జవాబుదారీతనమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. ఈ చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరాలని ఆకాక్షించారు. భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రైతులు, ప్రజల మేలు కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివరించారు. పూర్తిస్థాయి అవగాహన కోసమే... ఈ చట్టంపై పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపా రు. ప్రభుత్వం భూ భారతి చట్టంతోపాటు, నియ మ నిబంధనలు ఒకేసారి తయారు చేసిందని, రికార్డుల నిర్వహణ, సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామ,పౌతి వంటి అంశాలను వివరించా రు. జిల్లా స్థాయిలో రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు అందిస్తామన్నారు. ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆర్డీవో రవీందర్రెడ్డి, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం మండలాల తహసీల్దారు లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు రైతు సంఘ నాయకులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి అమీన్పూర్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. అమీన్పూర్లో శనివారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అమీన్ పూర్ మండలం పరిధిలోని 993 సర్వే నంబర్ ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన భూములలో బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుర్తించిన ప్రభుత్వ భూముల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డిఓ రవీందర్రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ క్రాంతి వల్లూరు -
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పలు పరిశ్రమలు వాతావరణంలోకి విష వాయువులను విడుదల చేశారు. దీంతో పారిశ్రామిక వాడ ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. విషవాయువులు లీఫార్మా పరిశ్రమ నుంచి విడుదలైనట్లు స్థానికులు గుర్తించారు. నిత్యం ఉదయం సాయంకాల వేళలో పరిశ్రమ గొట్టాల నుంచి విషవాయువులను విడుదల చేస్తున్నారని వీటిని పీల్చడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య పాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. పీసీబీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై ఇప్పటికై నా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
28న భూ భారతి అవగాహన సదస్సు
హాజరుకానున్న మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ హత్నూర (సంగారెడ్డి): ఈ నెల 28న భూ భారతి చట్టంపై దౌల్తాబాద్ సమీపంలో జరగనున్న అవగాహన సదస్సుకు జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహ హాజరవుతున్నట్లు తహసీల్దార్ పర్వీన్ షేక్ వెల్లడించారు. హత్నూర తహసీల్దార్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పర్వీన్షేక్ మాట్లాడుతూ... హత్నూర తహసీల్దార్ నూతన భవన నిర్మాణం కోసం మంత్రులు శంకుస్థాపన చేయనున్నారన్నారు. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో రూ.రెండు కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డార్మెటరీ భవనం కూడా మంత్రులు కలెక్టర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. భూ భారతి అవగాహన సదస్సుకు మండలంలోని అన్ని గ్రామాల రైతులు హాజరు కావాలని కోరారు. 29న డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాజహీరాబాద్ టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అస్లాం ఫారూఖీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే జాబ్మేళాలో ఎంఆర్ఎఫ్, ముత్తూట్ ఫైనాన్స్, ఎంఎస్ఎన్ లేబోరేటరీస్, పేటీఎం తదితర కంపెనీల హెచ్ఆర్లు, ,మేనేజర్లు హాజరవుతున్నారని చెప్పారు. 500పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు జాబ్ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9959845076 నంబర్ను సంప్రదించాలన్నారు. కీబోర్డ్ వాయిద్యంలో గిన్నిస్ రికార్డ్రామచంద్రాపురం(పటాన్చెరు): భారతీనగర్ డివిజన్ పరిధిలో ఎంఐజీ కాలనీ చెందిన వాగుల మధురవాణి, ఆమె కుమార్తెలు పెర్లి క్రిస్టీన్, క్యాథీలకు కీబోర్డ్ వాయిద్యంలో గిన్నిస్బుక్ రికార్డ్ను సాధించారు. ఈ సందర్భంగా శనివారం పటాన్చెరు ప్రభుత్వ మైనార్టీ కళాశా ల వైస్ప్రిన్సిపాల్ మధురవాణి మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్లో విజయవాడకు చెందిన హలేల్ సంగీత పాఠశాల నిర్వాహకులు అగస్టీన్ ఆధ్వర్యంలో 1,046 మంది ఒకేసారి కీబోర్డ్ ప్లేయింగ్ ప్రదర్శనను చేపట్టారన్నారు. ఈ ప్రదర్శనలో తనతో పాటు తన కుమార్తెలు క్రిస్టీన్, క్యాథీలు కూడా పాల్గొన్నారు. ఈ వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ కావడంతో గిన్నీస్ బుక్ వారు పరిశీలించి రికార్డుల్లోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ను ఈనెల 14న హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నట్లు తెలిపారు. ఈదురు గాలులు.. భారీ వర్షం నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమైంది. వర్షం వల్ల మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. కోతలు కోసిన వరి పొలాల్లో నీరు నిలవడంతో నష్టం సంభవించనున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని భూమయ్య కాలనీలో విద్యుత్ వైర్లపై రేకులు ఎగిరి పడటంతో రెండు గంటలపాటు సరఫరా నిలిచిపోయింది. జిన్నారం మండలంలో.. జిన్నారం (పటాన్చెరు): ఉమ్మడి జిన్నారం, గుమ్మడిదల మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం ప్రభావంతో మండుటెండల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. -
ర్యాంకర్లను సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ టౌన్: ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంక్లు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే కె.మాణిక్రావు ఘనంగా సన్మానించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ గురుకుల కళాశాలలకు చెందిన ఐదుగురుకి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశే ఖర రావు దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, అందులో చదివిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంక్లు సాధిస్తున్నారని కొనియాడారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ, నాయకులు మోహీయోద్దీన్, తులసీదాస్గుప్త, విజయ్కుమార్, అలీ, జాఫర్ అలీలు పాల్గొన్నారు. -
ఉగ్రదాడులను ఉపేక్షించం
సదాశివపేట(సంగారెడ్డి): ఉగ్రదాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించేదిలేదని, హిందువుల సహనాన్ని పరీక్షించొద్దని హిందూ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సదాశివపేటలో హిందూ జేఏసీ ప్రతినిధులు శనివారం భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేవాలయాల కమిటీ సభ్యులు యువకులు భారీ ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీ పట్టణంలోని ప్రభుమందిరం నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ...ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఆశ్రయమిస్తున్న బంగ్లాదేశ్లు హద్దులు దాటాయని ఇక ఇలాంటి ఘటనలకు ప్రతి చర్యలు తప్పవన్నారు. హిందువులంతా ప్రపంచ శాంతిని కోరేవారని తెలిపారు.సదాశివపేటలో హిందూ జేఏసీ శాంతి ర్యాలీ -
ఆర్టీసీకి జవసత్వాలు!
ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం జహీరాబాద్ టౌన్: ఆర్టీసీలో డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. శాశ్వత నియామకాల ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు డ్రైవర్ల సమస్యను అధిగమించి ఆర్టీసీని బలోపేతంతో చేసే చర్యలకు సంస్థ ఉపక్రమించింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున్న రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం చేపట్టి వారికి శిక్షణనిస్తున్నారు. త్వరలో వీరంతా విధుల్లో చేరనున్నారు. నియామకాలు నిలిచిపోవడంతోనే... ఆర్టీసీలో చాలాకాలంగా నియామకాలు లేకపోవడంతో క్రమంగా డ్రైవర్ల కొరత పెరుగుతూ వచ్చింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉన్న వారిపై పనిభారం పెరిగిపోతోంది. డ్రైవర్ల కొరత కారణంగా సకాలంలో బస్సులు నడవక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు బస్సు సర్వీసులు రద్దు కూడా అవుతున్నాయి. వేసవిలో రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో కొత్త డ్రైవర్లు వస్తే కొంత సమస్య తొలగిపోనుంది. కాంట్రాక్టు పద్ధతిలో నియామకం ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి, ఖేడ్,మెదక్, సిద్దిపేట, ప్రజ్ఞాపూర్ డిపోలు ఉండగా మొత్తం 585 బస్సులున్నా యి. మెదక్ రీజియన్లో 119 మంది డ్రైవర్ల అవసరం ఉంది. ఇప్పటికే 70 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో భర్తీ చేయనున్నా రు. భారీ వాహనాల డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి డ్రైవర్లకు 3 నెలలపాటు శిక్షణనిస్తున్నారు. వీరికి నెలకు జీతం రూ.22 వేలు చెల్లించనున్నారు. -
ఓరుగల్లుకు గులాబీ దండు
ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 202525గులాబీ శ్రేణులు, జిల్లా ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేశారు. వారం పది రోజులుగా ఆ పార్టీ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడు తూ... ఈ సభను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ముందునుంచి బీఆర్ఎస్కు కంచుకోటగా నిలుస్తోంది. ఎల్కతుర్తికి సమీప జిల్లాల నుంచి తరలించే సంఖ్యకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడి నుంచి జనాలను తరలించేందుకు హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లనున్న పార్టీ శ్రేణులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఓరుగల్లు భారీ బహిరంగసభకు తరలివెళ్లేందుకు గులాబీ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో జనాలను ఈ సభకు తరలించేందుకు ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సభకు జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ అభిమానులు ఆదివారం ఉదయం బయలుదేరనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేల మందిని తరలించాలని ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు నాయకులు ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. వీటికితోడు ప్రైవేటు వాహనాల్లో కూడా ఈ సభకు తరలివెళ్లాలని భావిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు.. సంగారెడ్డి జిల్లాకు బహిరంగసభ స్థలం చాలా దూ రం. ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలు ఎక్కువ దూరం ఉంటాయి. అయినప్పటికీ వీలైనంత ఎక్కువ సంఖ్యలో జన సమీకరణ చేయాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. కాగా, ఉమ్మడి మెదక్ గులాబీ పార్టీకి మంచి పట్టున్న జిల్లా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో కూడా ఈ పార్టీ తన పట్టును నిలుపుకున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏమాత్రం తగ్గకుండా జన సమీకరణ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఈ బాధ్యతలను తీసుకున్నారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ బాధ్యతలను గ్రామాల వారీగా నియమించిన ఇన్ చార్జిలకు అప్పగించారు. మండలాలు, పట్టణాల వారీగా పర్యవేక్షకులను నియమించుకున్నారు. న్యూస్రీల్హరీశ్రావు దిశానిర్దేశం.. నియోజకవర్గానికి ఐదు వేల చొప్పున తరలింపు జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తి పక్షం రోజులుగా ప్రణాళిక.. ప్రచారంఎల్కతుర్తి బహిరంగసభను విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ నాయకులు గత పక్షం రోజులుగా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టారు. స్వయంగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు గోడలపై రాతలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మండలాలు, పట్టణాల వారీగా పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు జరిపారు. ఆయా మండల కమిటీలు, పట్టణ కమిటీల్లోని బాధ్యులకు ఈ జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ : ఒకరి మృతి
రామాయంపేట(మెదక్): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన రామాయంపేట పట్టణ శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్కు చెందిన వంక లింగం (55) బైక్పై రాత్రి రామాయంపేట వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై నుంచి దామరచెరువు తండా వైపు బైక్ను మలుపు తిప్పగా, వేగంగా హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై లింగం అక్కడికక్కడే మృతి చెందాడు. యాక్టీవాపై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ బాల్రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పటాన్చెరు టౌన్: బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. పటాన్చెరు బస్టాండ్ వద్ద శనివారం 42 నుంచి 45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది కనిపించాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఉంటే పటాన్చెరు పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎనిమిదేళ్లుగా రొట్టెల విక్రయం
మాది మాసాయిపేట మండలం, చెట్ల తిమ్మాయిపల్లి గ్రామం. నేను ఎనిమిదేళ్ల నుంచి తూప్రాన్ పట్టణంలో రోడ్డు పక్కన రోటీ సెంటర్ను నిర్వహించుకుంటున్న. రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రొట్టెలు చేసి అమ్ముతుంటా. కిలో పిండికి ఏడు నుంచి ఎనిమిది రొట్టెలు వస్తాయి. కిలోకు రూ.55 ఖర్చు అయితే ఒక్కో రొట్టె రూ.15 లెక్కనా రూ.105 నుంచి రూ.120 వరకు వస్తాయి. రోజుకు 60 రొట్టెల వరకు అమ్ముతా. ఖర్చులు పోగ రూ.500 రూ.600 వరకు ఆదాయం లభిస్తుంది. – సునీత, రొట్టెల తయారుదారు, తూప్రాన్ రోజు 2 రొట్టెలు తింటాను ఆరోగ్యానికి జొన్న రొట్టెలు మంచివి. రోజు రాత్రి రెండు రొట్టెలు తింటాను. ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లో రొట్టెలు తయారు చేసుకోలేని వారికి ఈ రోడ్డు సైడ్ జొన్న రొట్టె కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాయామంతోపాటు జొన్న రొట్టె ఆహారంగా తీసుకోవడంతోపాటు వాటిలో ఉండే పోషకాలు ఉండటం శ్రేయస్కరం. – చెలిమిల బాబు, తూప్రాన్ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్న ఐదేళ్లుగా తూప్రాన్లో నివాసం ఉంటున్నాను. ఆయుర్వేద ఆస్పత్రి ఎదుట తోపుడి బండి ఏర్పాటు చేసుకొని జొన్న రొట్టెలు విక్రయిస్తున్న. నిత్యం సుమారు 60 నుంచి 70 రొట్టెలు రూ.15 చొప్పున అమ్ముతాను. ఖర్చులు పోను రోజుకు రూ.500 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. నెలకు ఖర్చులు పోను రూ.15 వేల నుంచి రూ.17 వేలకు వరకు మిగులుతాయి. కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది. – రుక్మీణి, రొట్టెల వ్యాపారి, తూప్రాన్ఆహార నియంత్రణతోనే సాధ్యం ఆహార నియంత్రణతోనే ఊబకాయం, మధుమేహం అదుపు చేసుకోవచ్చు. సమతుల ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేస్తే ఈ సమస్యలను అధిగమించొచ్చు. బయట లభించే జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలు, చాట్ బండార్ పదార్థాలు, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఊబకాయం అంటే ఉండాల్సిన శరీర బరువు కంటే 20 శాతం ఎక్కువగా ఉండటం. – డాక్టర్ అమర్సింగ్, సీహెచ్సీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ● -
లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ అవసరం
గజ్వేల్రూరల్: విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలిగినపుడే లక్ష్యాన్ని చేరుకోగలమని సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్, నిజాం ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ టామ్ చెరియన్ అన్నారు. శనివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ అనిత అబ్రహం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుమితరాయ్, మరో అతిథి జార్జ్ మార్షల్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. అనంతరం టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సీపీడీసీ సభ్యులు నరేశ్బాబు, లక్ష్మణ్, శైలజ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి అదరగొట్టె
జొన్న రొట్టె..పోషక ఆహారంపై ప్రజల దృష్టి ● మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం ● మహిళలకు వరంగాజొన్న రొట్టె కేంద్రాలు ● ఒక్కో రొట్టె రూ.15 లెక్కన విక్రయం ● రోజుకు సగటునరూ.500 సంపాదన ● జిల్లా వ్యాప్తంగా సుమారు200 కుటుంబాలకు ఆధారంతూప్రాన్ మండలం ఘనపూర్లో సాగు చేస్తున్న తెల్లజొన్న పంటతూప్రాన్: జొన్న రొట్టె ఒకప్పుడు పేదల ఆహారం క్రమ క్రమంగా వరి భోజనానికి ప్రజలు అలవాటు పడటంతో జొన్నల కొనుగోలు క్రమక్రమంగా తగ్గిపోయింది. కాలక్రమేణ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతుండటంతో మళ్లీ జొన్న రొట్టెల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలో జొన్న రొట్టెల తయారీ కేంద్రాలు పెరిగాయి. పలు గిరిజన మహిళలు వాటిని తయీరు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహిళలకు ఉపాధిగా జొన్న రొట్టె.. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కుంటుంబాలు జొన్న రొట్టె తయారీని ఉపాధిగా మల్చుకున్నారు. ఇందులో గిరిజన మహిళలు అధికంగా కనిపిస్తారు. రోజుకు సగటున రూ.500 సంపాదిస్తున్నారు. రుచి, ఆరోగ్య విలువలు కలగలిసి ఉండటంతో ఇవి రోడ్డు మార్గంలోని ప్రయాణికులను, ఇతర ప్రజానీకాన్ని ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో ఎందరో మహిళలకు ఇది ఉపాధిగా మారింది. తూప్రాన్, మెదక్, చేగుంట, రామాయంపేట, నర్సాపూర్, తదితర రోడ్డు పక్కన తోపుడు బండ్లపై ఇవి లభిస్తున్నాయి. ఈ రొట్టెలను తయారు చేసి విక్రయిస్తూ వందలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇందులో అనేక గిరిజన తండాలకు చెందిన మహిళలు ఉన్నారు. జొన్న రొట్టె పోషక విలువల సమ్మేళనం జొన్న రొట్టెలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఇది నెమ్మదిగా గ్లూకోజ్ను విడుదల చేస్తుంది. 100 గ్రాముల జొన్న పిండిలో 10.4 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. మానవ శరీరానికి ప్రతి రోజూ అవసరమైన ఫైబర్లో 40 శాతం సమకూరుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఐరన్, కాల్షియం, విటమిన్ బీ, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలం చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడుతాయి. మధుమేహాలకు ఇది చక్కటి ఆహారం. కడక్.. సాఫ్ట్ రోటీలు కడక్, సాఫ్ట్ రొట్టెలను అప్పటికప్పుడే సిద్ధం చేసి ఇస్తారు. జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడవదు. దీనిని సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. తయారీ ఇలా.. జొన్న పిండిని కలపడానికి వేడి నీళ్లను ఉపయోగించాలి. నీళ్లు మరిగేటప్పుడు కాస్త నూనె, రుచికి సరిపడా ఉప్పు కలిపితే రొట్టెకు పగుళ్లురావు. కలిపిన పిండి ముద్దపై పది నిమిషాలు తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. వీటిని చపాతీ కర్రతో కాకుండ చేత్తో చేస్తేనే చక్కగా వస్తాయని రొట్టెలు తయారు చేసే మహిళలు చెబుతున్నారు. కాగా కొందరు యంత్రాల సహాయంతో వివిధ రకాలు, మొక్కజొన్న. తెల్లజొన్న, రాగిజొన్న, గోధుమ రొట్టెలు తయారు చేస్తూన్నారు.యంత్రంతో క్షణాల్లో రొట్టెలు నా పేరు కవిత. మాది తూప్రాన్. రొట్టెల తయారీ కోసం అప్పు చేసి రూ.3 లక్షల వ్యయంతో యంత్రం కొనుగోలు చేశాను. యంత్రం ద్వారా రొట్టెలతో పాటు వివిధ రకాల పిండి వంటలు చేస్తున్నాను. జొన్నరొట్టె, మొక్కజొన్న రొట్టె, రాగి జొన్నరొట్టె, గోధుమ రొట్టెలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నెలకు ఖర్చులు పోను రూ.15 వేల నుంచి రూ.20 వేల ఆదాయం వస్తుంది. దీనిద్వారా ఉపాధి లభిస్తుంది. – కవిత, రొట్టెల తయారుదారు, తూప్రాన్ వ్యాయామం.. సమతుల ఆహార లోపం వ్యాయామం, సమతుల ఆహారం మానవుడికి ఆరోగ్యాన్ని పంచుతాయి. అవి కొరవడటంతో ఊబకాయులు పెరిగిపోతున్నారు. మితిమీరిన ఆహారం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, వ్యాయామం లేకపోవడం తదితర కారణాలతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతున్నాయి. ఊబకాయం అందరినీ వేధిస్తున్న సమస్యగా మారింది. దీంతో మంచి ఆరోగ్యానికి వాకర్స్, ఊబకాయులు, మధుమేహం ఉన్న వాళ్లు జొన్న రొట్టెలను జోరుగా విక్రయిస్తున్నారు. -
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన తుడం సుధాకర్(35)తో నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామానికి చెందిన అరుణకి నాలుగేళ్ల కింట వివాహమైంది. మూడేళ్లుగా హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో చల్మెడ గ్రామంలో తెలిసిన వారి వద్ద అవసరానికి అప్పులు చేశారు. ఏడాది కిందట అరుణ తల్లిదండ్రులు మృతి చెందడంతో జప్తిశివనూర్ గ్రామానికి వచ్చి జీవిస్తున్నారు. చల్మెడలో ఎకరం, జప్తిశివనూర్లో మరో ఎకరం పొలం ఉండగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. పెళ్లి జరిగి నాలుగేళ్లు అయినా పిల్లలులేరు. దీనికి తోడు శుక్రవారం చల్మెడ గ్రామంలో అప్పు ఇచ్చిన వారు జప్తిశివనూర్కు వచ్చి అప్పుకట్టాలని అడిగి వెళ్లారు. మనస్తాపానికి గురైన సుధాకర్ శనివారం కోత మిషన్ వస్తుందని చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య అరుణ పోలీస్లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. భార్య కళ్లెదుటే ఉరేసుకొని భర్త సంగారెడ్డి క్రైమ్: భార్య కళ్లెదుటే భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన మన్నె వినోద్ (25) స్థానికంగా ఆటో డ్రైవర్. నాలుగేళ్ల కిందట కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మౌనిక వృత్తిరీత్యా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. భర్త మీద కోపంతో మౌనిక 3న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 24న తన భర్త నిత్యం వేధిస్తున్నాడని కొండాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి భార్యను అతడి వెంట సంగారెడ్డిలోని ఇంటికి పంపించారు. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. తీవ్ర మనోవేదనకు గురై వినోద్ భార్య కళ్లెదుటే గదిలోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు చోరీ
జహీరాబాద్ టౌన్: మండలంలోని మల్చెల్మ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నం.3లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. అంగన్వాడీ కేంద్రం తలుపులను గుర్తు తెలియని దొంగలు పగులగొట్టి 17 ట్రేల గుడ్లు, 4 పప్పు ప్యాకెట్లు, 6 లీటర్ల పాలు, బాలమృతం ప్యాకెట్లను ఎత్తుకెళ్లారు. అంగన్వాడీ టీచర్ మధుమతి శనివారం కేంద్రం వద్దకు వెళ్లగా తలుపులు పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా సరుకులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీచర్ తెలిపారు. పిచ్చి కుక్క దాడిలో ఏడుగురికి గాయాలు మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. దొరికినవారిని దొరికినట్లు ఏడుగురిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మిరుదొడ్డిలో శుక్రవారం రాత్రి ఓ పిచ్చి కుక్క యువకుడితోపాటు, ముగ్గురు బాలురు, ఇద్దరు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఇందులో చిన్నారి ఫక్కీరుగల్ల లోకేశ్, పుల్లూరి ప్రశాంత్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొగుళ్ల రాజు, ఎం.ఎల్లవ్వ, పెద్ద కుర్మ సత్తవ్వ, మనోజ్ కుమార్, ర్యాకం భానోదయ్ మిరుదొడ్డి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. కాగా గ్రామంలో తిరుగుతున్న పిచ్చి కుక్కను గుర్తించిన గ్రామస్తులు శనివారం ఉదయం చంపేశారు. ఊరిలో కుక్కలను కట్టడి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు వరి పంట దగ్ధం బెజ్జంకి(సిద్దిపేట): ప్రమాదవశాత్తు వరి పంట దగ్ధమైన ఘటన మండలంలోని పెరుకబండలో చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పులు చెలరేగి గ్రామానికి చెందిన గౌరి నర్సయ్య వరి పంట దగ్ధమైంది. అది గమనించిన రైతు నీళ్లు చల్లి మంటలార్పివేశారు. మూడు ఎకరాల వరి పొలంలో సుమారు 5 గుంటల వరకు దగ్ధమైంది. తమ వరి పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలిగించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికై నా తొలగించాలని కోరారు. మహిళ అదృశ్యం రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణానికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు శనివారం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన మతం ఎల్లవ్వ, ఆమె కూతురు మతం రాజేశ్వరీ ఐదు నెలల కిందట వరంగల్ నుంచి రామాయంపేటకు వచ్చి తల వెంట్రుకల వ్యాపారం చేసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన రాజేశ్వరీ తిరిగి రాలేదు. బంధువుల వద్ద, ఇతర చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఎల్లవ్వ శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. -
పౌష్టికాహారంతోనే పిల్లల ఎదుగుదల
దౌల్తాబాద్(దుబ్బాక): పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం చాలా ముఖ్యమని తహసీల్దార్ చంద్రశేఖర్, సీడీపీవో ఎల్లయ్య చెప్పారు. స్థానిక అంగన్వాడీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను ఏఆర్ గార్డెన్స్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎంపీడీఓ వెంకటలక్ష్మ మ్మ, మెడికల్ ఆఫీసర్ నాగరాజు, రిలయన్స్ జిల్లా కోఆర్డినేటర్ రాజలింగం, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటప్రసాద్, బ్లాక్ కోఆర్డినేటర్ శాంసన్, రిలయన్స్ ప్రతినిధులు భాస్కర్, సరిత, నాగరాజు సూపర్వైజర్ గిరిజ, చంద్రకళ, అంతుల్, రేణుక, స్వరూప, రాజేశ్వరి, గీత తదితరులు పాల్గొన్నారు. -
ఈతకెళ్లి నీట మునిగి యువకుడు మృతి
మద్దూరు(హుస్నాబాద్): ఈతకు వెళ్లి బావిలో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సలాఖపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చేర్యాల పట్టణంలోని పెద్దమ్మగడ్డకు చెందిన బింగి అఖిల్(19) మండలంలోని మర్మాముల గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న పండుగకు వచ్చాడు. శనివారం ఉదయం మర్మాముల పక్క గ్రామమైన సలాఖపూర్ గ్రామంలోని గూడ శ్రీనివాస్రెడ్డి రైతుకు చెందిన వ్యవసాయ బావిలోకి బంధువులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత సరిగా రాక నీట మునిగాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ షేక్ మహబూబ్ ఘటనా స్థలానికి చేరుకొని గజతగాళ్ల సాయంతో అఖిల్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
షాపింగ్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
● ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ ● కిందపడ్డ వారిపై నుంచి వెళ్లిన లారీ ● తండ్రితోపాటు కుమారుడు,మరో చిన్నారి మృతి ● నలుగురికి గాయాలు ● నర్సాపూర్ మండలంలో ఘటననర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తితోపాటు అతడి కుమారుడు, సమీప బంధువైన చిన్నారి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన మాల గోపాల్(32), భార్య పూజ, కూతురు ఆద్యశ్రీ, కుమారుడు అనుదీప్(5), అతడి తోడళ్లుడి కూతురు సహస్ర(8) ఐదుగురు కలిసి శనివారం ఒకే బైక్పై ఇంటి నుంచి బయలు దేరి నర్సాపూర్లో షాపింగ్ చేసేందుకు వెళ్తున్నారు. అలాగే కౌడిపల్లి మండలం కంచన్పల్లికి చెందిన దుంపల కరుణాకర్ భార్య వరలక్ష్మీతోపాటు నర్సాపూర్ నుంచి తమ గ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట గేట్ సమీపంలోకి రాగానే రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపాల్ బైక్పై ఉన్న వారందరూ కిందపడ్డారు. వీరి వెనుకాలే మెదక్ నుంచి వస్తున్న లారీ గోపాల్, అనుదీప్, సహస్ర మీది నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. గోపాల్ భార్య పూజ ఎడమ కాలు విరుగగా, కూతురు ఆద్యశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్పై ఉన్న కరుణాకర్, వరలక్ష్మీకి స్వల్ప గాయాలయ్యా యి. స్థానిక ఎస్ఐ లింగం ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని అదుపులోకి తీసుకున్నారు.కూలి పనులు చేస్తూ కుటుంబ పోషణ మృతుడు మాల గోపాల్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతోపాటు కుమారుడు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గోపాల్ తోడళ్లుడు సుధాకర్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మండలం బొంతపల్లి గ్రామంలో ఉంటున్నాడు. ఇతడి కూతురు సహస్ర పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో వెంకట్రావ్పేటలోని బంధువుల ఇంటికొచ్చి మృత్యువాత పడింది. -
ఇంటర్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య
హుస్నాబాద్రూరల్: ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన దండవేణి శ్రీనివాస్, లావణ్య దంపతులకు కూతురు సంజన (16), కుమారుడు ఉన్నారు. సంజన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో సంజన ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెంది మానసిక ఒత్తిడికి లోనైంది. శనివారం తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోకి వెళ్లిన సోదరుడు ఉరేసుకున్న అక్కని చూసి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఎస్ఐ మహేశ్ను వివరణ కోరగా విద్యార్థిని ఆత్మహత్య విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.హుస్నాబాద్లో ఉరేసుకున్న విద్యార్థిని -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
వట్పల్లి(అందోల్): బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని బిజిలీపూర్ గ్రామానికి చెందిన డప్పు గీత(15) అందోలు రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వార్షిక పరీక్షల అనతరం పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఈనెల 18న రాత్రి తన కుటుంబీకులతో కలిసి భోజనం చేసి అందరూ నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారు జామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు లేచి చూసే సరికి కూతురు కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కళాశాలకు వెళ్లిన విద్యార్థి.. జహీరాబాద్ టౌన్: కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... పట్టణంలోని అహ్మద్నగర్కు చెందిన ఎండీ షమీమ్కు ఇద్దరు కొడుకులు, ఐదుగురు ఆడపిల్లలు. ఐదో కూతురు షాహీదా ఖుతున్(20) స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 23న అక్క ఆయేషా ఖుతున్తో కలిసి కళాశాలకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మహిళల రక్షణకు పెద్దపీట
● సమావేశంలో సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సీపీ అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం పోలీసు కమిషనరేట్లో హుస్నాబాద్ డివిజన్ పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్ డాటా ప్రకారం క్రైమ్ రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన టెక్నాలజీ ఉపయోగించడం, నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. రౌడీలు, అనుమానితులను తనిఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై రైతులు ధాన్యం ఆరబెట్టకూడదని సూచించారు. అడవిపందుల నుంచి పంట రక్షణ కోసం చుట్టూ కరెంటు వైర్లు ఏర్పాటు చేస్తున్నారని రైతులను పిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను విచారణ చేసి త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐలు శ్రీనివాస్, శ్రీను, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీట మునిగి వ్యక్తి మృతి పాపన్నపేట(మెదక్): దర్శనానికి వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికెల్ గ్రామానికి చెందిన వీరస్వామి (40) తన భార్యాపిల్లలతో కలిసి బంధువుల విందులో పాల్గొనడానికి ఽఽశుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు చెక్డ్యాంలో స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఏడుపాయల్లో మృతదేహం గుర్తింపు ● కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం ● అనంతరం పూడ్చివేసిన పోలీసులు హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మహేశ్(37)ను గత నెల 26న నగల కోసం తీసుకొచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పాపన్నపేట మండలం ఏడుపాయల శివారులోని మొదటి బ్రిడ్జి వద్ద హత్య చేసినట్లు అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి మహేశ్ మృతదేహంగా గుర్తించారు. శవం కుళ్లిపోయి ఉండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూడ్చివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. వ్యక్తి మృతదేహం లభ్యం చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... చేగుంట శివారులోని మక్కరాజీపేట బ్రిడ్జీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలు తెలియలేదు. మృతుడు గోధుమరంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. కోల్డ్ స్టోరేజీ గోదాం ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్టు కొండపాక(గజ్వేల్): అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంలో అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ కథనం ప్రకారం... కొండపాక మండలంలోని మర్పడ్గ గ్రామ శివారులో సిద్దిపేటకు చెందిన వ్యాపారులు అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంను ఏర్పాటు చేశారు. ఈనెల15న కోల్డ్ స్టోరేజీ పక్కన భూమిని కౌలుకు తీసుకున్న రైతు రాజయ్య ఖరీఫ్ సీజన్ పనుల కోసం పత్తి పొరకకు నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా కోల్డ్ స్టోరేజీ గోదాంలోకి ప్రవేశించి రూ. 1.50 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలో నిర్వాహకుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ ఫిర్యాదు మేరకు రాజయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అరటి పండ్లను ఇవ్వడం లేదన్న కక్షతో గోదాం పక్కన పత్తి పొరకకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. రాజయ్య పరారీలో ఉండటంతో శుక్రవారం అరెస్టు చేశారు. -
కష్టాల ‘విజయ’కు ఊరట
● సాత్విక భవిష్యత్తుకుఎమ్మెల్యే హరీశ్ రావు భరోసా ● ఆయన చొరవతో వ్యాపారి చేయూతసిద్దిపేటజోన్: ఇటీవల విద్యార్థుల అవగాహన సదస్సులో తన తల్లి విజయ పడుతున్న కష్టం తలుచుకొని ఏడ్చిన సాత్వికకు దాతలు చేయూతనందిస్తున్నారు. సాత్విక ఆర్థిక పరిస్థితిపై సాక్షిలో ఈనెల 23న ప్రచురితమైన కష్టాల కడలిలో విజయ తీరం వైపు కథనానికి దాతలు ముందుకు వచ్చారు. సాత్విక కుటుంబ పరిస్థితుల గూర్చి ఆరా తీసిన ఎమ్మెల్యే హరీశ్ రావు చొరవతో ఆర్థిక సాయం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి చిన్నారి సాత్విక, తల్లి విజయను పిలిపించి వారితో కలిసి అల్పాహారం తిన్నారు. అనంతరం తన మిత్రుడి సహాయంతో హైదరాబాద్ వ్యాపారి తిరుమల్రెడ్డి ద్వారా రూ.2 లక్షల చెక్కును విజయకు అందించారు. అమ్మ ప్రేమ చాలా గొప్పదని, మంచిగా చదివి భవిష్యత్తులో ఉద్యోగం సాధిస్తే అమ్మ కష్టాలు తీరినట్టేనని సాత్వికతో ఎమ్మెల్యే ఆత్మీయంగా అన్నారు. భవిష్యత్తులో విద్యాపరంగా అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. -
నిజాయితీ చాటుకున్న కండక్టర్
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన పర్సును కండక్టర్ గుర్తించి డీఎంకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం మోడ్రన్ బస్టాండ్లో శుక్రవారం చోటు చేసుకుంది. సిద్దిపేట డిపో మేనేజర్ టి.రఘు వివరాల ప్రకారం... డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వస్తున్న క్రమంలో సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు నీరజ బస్సులో వస్తున్నది. ఆమె ముస్తాబాద్లో బస్సు దిగే క్రమంలో పర్సు మరిచిపోయింది. దీంతో సిద్దిపేటకు వచ్చిన తరువాత బస్సులో ఉన్న పర్సును కండక్టర్ వేణుగోపాల్ గుర్తించి డిపో మేనేజర్కు అందజేశాడు. అనంతరం పర్సులో ఉన్న 10గ్రాముల బంగారం, రూ.10వేలను సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్లో ప్రయాణికురాలికి డీఎం, స్టేషన్ మేనేజర్ బాలకిషన్, సెక్యూరిటీ సురేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికురాలు డీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఆర్టీసీ బస్సులో తాను ప్రయాణం చేయకుండా ఉంటే నష్టం జరిగేదని ఆమె పేర్కొన్నారు.పర్సును ప్రయాణికురాలికి అందజేసిన డీఎం -
త్వరలో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన
ఎస్డబ్ల్యూజీ కార్యదర్శి అలుగు వర్షిణిబెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర సాంఘీక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మనుచౌదరి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు పాలన అనుమతులు ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం నుంచి వచ్చినట్లు తెలిపారు. పది రోజుల్లో సంబంధిత భూమిని కలెక్టర్ అందిస్తారన్నారు. మే నెలలో 47 కోట్లు వెచ్చించి కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులకు ఈ కళాశాలలో 75 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణం పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు.. ఆపై కుటుంబ కలహాలు
వ్యక్తి ఆత్మహత్యమిరుదొడ్డి(దుబ్బాక): కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని అల్వాలలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ పరశురామ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పొగాకు స్వామి (31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. ఇటీవల అందినకాడికి అప్పులు చేసి రూ. 11 లక్షలతో బొలేరో వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనం కొన్న నాటి నుంచి సరైన గిరాకీలు లేక తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోయాడు. దీనికి తోడు ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య పాపన్నపేట (మెదక్): గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రమైన పాపన్నపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... పాపన్నపేట గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఉండటాన్ని శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి వయస్సు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఒంటిపై కుంకుమ రంగు షర్టు, నలుపు గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బట్టి, సుమారు పది– పదిహేను రోజుల క్రితం ఉరి వేసుకొని మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. మునిపల్లి(అందోల్): ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... ఈ నెల 23న ఉదయం శ్రీనివాస్(40) ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులో చెట్టుకు ఊరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో వ్యక్తి... రామాయంపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఝాన్సీలింగాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కల్వాల రాజు (35) మిషన్ భగీరథ వాటర్మెన్గా పనిచేస్తున్నాడు. తన భార్యతో గొడవ పడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అదే గ్రామంలో ఓ రైతు పంట చేను వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ఘటనా స్థలంలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరునర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నర్సాపూర్ – సంగారెడ్డి రహదారిలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై లింగం కథనం మేరకు... సంగారెడ్డి జిల్లా చౌటకురు మండల కేంద్రానికి చెందిన ఎల్లపోల్ల బాలరాజ్ (32) సొంత పనిపై హైదరాబాద్కు బైక్పై వెళ్లి తిరిగి నర్సాపూర్ మీదుగా స్వగ్రామానికి వస్తున్నాడు. నర్సాపూర్కు చెందిన చింతకుంట నవీన్ (26) బైక్పై సంగారెడ్డి వైపు నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వస్తూ ఎదురుగా వస్తున్న బాలరాజు బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బాల్రాజు అక్కడికక్కడే మృతి చెందగా నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు నవీన్ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మృతి చెందాడు. బాలరాజ్ భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలరాజుకు భార్య, పిల్లలు ఉన్నారు. మరో ఘటనలో వ్యక్తి.. చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పులిమామిడి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం దొంగల ధార్మరం గ్రామానికి చెందిన గఫార్(40) దౌల్తాబాద్కు బైకుపై డీజిల్ తీసుకురావడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో గాయపడిన అతడిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీలు
జోగిపేట సీడీపీఓ ప్రియాంక జోగిపేట(అందోల్): ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నట్లు జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ ప్రియాంక స్పష్టం చేశారు. అంగన్వాడీ దినోత్సవాన్ని 6,11,14,15,16 కేంద్రాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో 3 నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులను కేంద్రాలలో చేర్పించాలన్నారు. కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. చిన్నారులకు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కేంద్రంలో చిన్నారులకు ఫలితాల సర్టిఫికెట్లు అందించారు. -
మార్కెట్ ధర చెల్లించాలి
జిన్నారం (పటాన్చెరు): మార్కెట్ ధర ప్రకారమే రైతులకు న్యాయం చేయాలని, వారికి ఎదురయ్యే సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిన్నారం రైతులు విజ్ఞప్తి చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 109లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు వారు హాజరై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్రెడ్డి మాట్లాడుతూ....పారిశ్రామిక వాడ ఏర్పాటు నేపథ్యంలో మార్చి 7న భూసేకరణ ప్రారంభించామన్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు రైతుల నుంచి అభిప్రాయాలు అడిగితెలుసుకున్నారు. పారిశ్రామికవాడ ఏర్పాటయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధిలోకి వస్తుందన్నారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ...ఇప్పటికే 98 మంది రైతులు ఉన్నారని, రైతులందరూ వారి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలన్నారు. వీటిలో ఏవైనా తప్పులు ఉన్నా, ఎవరి పేరైనా రాకపోయినా, వాటిలో భూమి వివరాలు పడకపోయినా, ఒకవేళ రైతు చనిపోయిన, లేదా భార్య లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న రికార్డుల్లో మార్పులు చేర్పులు సరి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశం, ఆర్ఐ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.ప్రజాభిప్రాయ సేకరణలో జిన్నారం రైతులు -
‘ఉపాధి’ పనులు భేష్
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బేషుగ్గా ఉన్నాయని విదేశీ ప్రతినిధులు కితాబిచ్చారు. వివిధ దేశాలకు చెందిన 25మంది విదేశీ ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి మండలంలోని సూరారం గ్రామంలో శుక్రవారం పర్యటించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. గ్రామానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కూలీలతో మాట్లాడి పథకం అమలుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాలు, వేతన చెల్లింపులు,మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విదేశీ బృందానికి నీటి సంరక్షణ,పల్లె ప్రగతి కింద చేపడుతున్న పనులపై, సామాజిక తనిఖీపై వివరించారు.విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పథకం అమలు పద్ధతులను మెచ్చుకున్నారు.ప్రత్యేకించి డిజిటల్ మానిటరింగ్ విధానాలు,పారదర్శక చెల్లింపుల వ్యవస్థలు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను వారు ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో లేని ఈ ఉపాధి హామీ పథకం భారతదేశంలో మాత్రమే ఉందని మెచ్చుకున్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ,అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు కమిషనర్ శేషుకుమార్, ఎస్పీఎం మురళీ, పీడీ జ్యోతి,అదనపు డీఆర్డీఓలు బాలరాజు, జంగారెడ్డి,ఎన్జీవో ప్రతినిధులు వర్షిణి, పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.విదేశీ ప్రతినిధుల బృందం కితాబు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నారాయణఖేడ్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం దుదగొండ పంచాయతీ పరిధిలోని గట్లింగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల నెరవేరిందని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేదలకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు చెల్లించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బ్రహ్మానందరెడ్డి, రాజు, ఽమాజీ సర్పంచ్ ధన్రాజ్ పాటిల్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. అలాగే, ఖేడ్ మండలం ర్యాకల్లో 23న ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు మూడవరోజూ శుక్రవారం కొనసాగాయి. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. -
పాక్పై చర్యలు తీసుకోవాలి
పటాన్చెరు టౌన్: ఫహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ముస్లిం సమాజం మండిపడింది. మతం పేరిట మారణహోమం సృష్టించినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని వారంతా నినదించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో శుక్రవారం ముస్లిం సోదరులు నిరసనలు చేపట్టారు. హిందూ ముస్లిం మతకలహాలను సృష్టించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులు చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజులు చదివారు. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు ముస్లిం సమాజం వెన్నంటే ఉంటుందని మైనారిటీ నాయకులు మేరాజ్ ఖాన్, అబెద్, మునీరుద్దీన్, మీర్ ముహియుద్దీన్, నాసర్, కలీం పేర్కొన్నారు. కార్యక్రమంలో బాసిత్, ఇంతియాజ్, అన్వర్, మస్తాన్, అజీజ్, ఫైయజ్, గౌస్, నసీర్, సల్మాన్, సోఫీ, తదితరులు పాలొన్నారు.ఇస్నాపూర్ చౌరస్తాలో ముస్లిం సోదరులు -
మామిడి కాయకు కవర్
జహీరాబాద్ టౌన్: పెరిగిన పెట్టుబడులతో పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం జిల్లాలోని కొంత మంది రైతులు వినూత్న ఆలోచనలతో వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నారు. కొంచెం ఖర్చు ఎక్కువైనా మంచి ఆదాయం పొందుతున్నారు. చీడపీడల నుంచి రక్షణ, బరువు పెరిగి అధిక లాభాలు రావడానికి మామిడి కాయలకు కవర్లు కడుతున్నారు. సాధారణంగా కంటే కూడా కవర్లలో పెరిగే మధుర ఫలం నాణ్యతతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో రైతులకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. లాభాలు అనేకం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల మామిడి చెట్లు పూత పూసినా కాత నిలబడటం లేదు. 60 నుంచి 70 శాతం పిందె రాలిపోతోంది. ఈ పరిస్థితిలో పంటను కాపాడుకొని దిగుబడి పెంచుకోవడం రైతులకు కష్టమవుతోంది. కాయకు కవర్ కట్టే విధానం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మామిడి కాయ కోడిగుడ్డు సైజులోకి రాగానే కవర్లు కడతారు. దీని వల్ల తొడిమ వద్ద నల్లగా మసి రావడం, పురుగు పట్టడం, సొన కార డం లాంటివి తగ్గుతాయి. దీంతో పురుగు మందుల అవసరం చాలా వరకు ఉండదు. ఈదురు గాలులు, వడగండ్ల వానకు కాయలు రాలవు. మాములు కాయకంటే బరువు ఎక్కువగా ఉంటుంది. చూసేందుకు పండ్లు నీట్గా ఉంటాయి. చెట్టుపైనే పక్వానికి రావడం వల్ల అధిక ధర పలుకుతుంది. ఖర్చు ఎక్కువ మామిడి కాయలకు కవర్ కట్టడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువ. ఒక్కో బ్యాగ్కు రూ. 2.50 పైసలకు లభిస్తుంది. కట్టడానికి రూ.2.50 కూలీ ఖర్చు అవుతుంది. ఈ బ్యాగ్ లోపలివైపున నల్లరంగు, బయటవైపు గోధమ రంగులో ఉంటుంది. వీటిని కట్టడానికి ముందు కాయలను బట్టతో శుభ్రం చేయాలి. కాయ కింది భాగం నుంచి తొడిమ పైభాగంలో మూడు సెంటీమీటర్ల పైన కట్టాలి. అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల కలిగే లాభాల గురించి కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాల విద్యార్థులకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలంలోని రంజోల్ గ్రామ పరిధిలోని మామిడి తోటల వద్ద రైతులకు ప్రాక్టికల్గా కవర్లు కట్టడం చూపిస్తున్నారు. ఈ విధానం వల్ల కాయ బరువు పెరిగి రైతులకు అధిక లాభాలు వస్తాయనిచెబుతున్నారు.మధుర ఫలానికి రక్షణ వినూత్న విధానంలో సాగు పెరుగుతున్న కవర్ల వినియోగంపూత నుంచి కోత వరకు.. మామిడి చెట్లకు పూత వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగండ్ల వాన, ఈదురుగాలులు, చీడపీడల బెడద కారణంగా పంటకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు మ్యాంగో ప్రొటెక్షన్ బ్యాగ్స్(కాయలకు రక్షణ సంచులు)ను ఏర్పాటు చేస్తున్నారు. కాయలకు కవర్లు కట్టడం వల్ల పండ్లలో నాణ్యత ప్రమాణాలు పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. కవర్లను సబ్సిడీపై ఇవ్వాలి జహీరాబాద్ పట్టణ సమీపంలో గాయత్రి పామ్హౌస్లో సుమారు 30 ఎకరాల్లో మామిడి తోట ఉంది. సుమారు 4 లక్షల కవర్లు కట్టాం. మూడేళ్ల నుంచి కాయలకు కవర్లు కడుతున్నాం. మామూలు కాయకంటే కవర్ కట్టిన కాయ చాలా నీట్గా అధిక బరువు ఉంటుంది. కానీ కవర్ల ఖర్చు ఎక్కువ అవుతోంది. ఒక్కో కవర్ రెండు నుంచి మూడు రుపాయలకు లభిస్తుంది. కట్టడానికి కూలీల ఖర్చు కూడా అవుతుంది. ఈ బ్యాగ్లు హైదరాబాద్లో దొరకనందున ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఉద్యానశాఖ తరపున కవర్లు సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడే రైతులు ముందుకు వస్తారు. రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే సబ్సిడీపై కవర్లు ఇస్తున్నారు. ఈ జిల్లాలో కూడా ఇవ్వాలి. – హరీశ్, మామిడి రైతు, జహీరాబాద్ -
గాలికుంటు టీకాలు తప్పనిసరి: విజయ్
పటాన్చెరుటౌన్: పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గాలికుంటు టీకాలు తప్పని సరిగా వేయించాలని కేంద్ర పశుసంవర్థక శాఖ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. పటాన్చెరు మండలం నందిగామ గ్రామ సమీపంలోని గోశాలలో శుక్రవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ కుమార్ హాజరై వ్యాక్సినేషన్పై ఆరా తీయడంతోపాటు గోశాలలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శైలేంద్ర జస్వాల్, గోశాల కార్యదర్శి గిరిధర్, డాక్టర్ లు జితేందర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలనసంగారెడ్డి జోన్: ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన అందించటం సాధ్యమవుతుందని డీఆర్ఓ పద్మజారాణి పేర్కొన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణ అంశాలపై రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన సదస్సు శుక్రవారంతో ముగిసింది. కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. గ్రామసభల నిర్వహణ, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అందించడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్రపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 35 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మలేరియాపై జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సంగారెడ్డి: ప్రతీ ఒక్కరూ మలేరియాపై జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ప్రభుత్వాస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ...ఈగలు, దోమలు, అపరిశుభ్ర వాతావరణం లేకుండా ప్రతీ ఒక్కరు చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలపై నజర్
కొనుగోలు కమిటీల ద్వారా టెండర్లు ఇదిలా ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు సరఫరా అయ్యేలా దృష్టి పెట్టింది. సరుకుల కొనుగోళ్ల విషయంలో సొంత నిర్ణయాలకు అవకాశం లేకుండా చేసింది. ఈ–టెండర్ విధానాన్ని పాటించేలా సూచనలు జారీ చేసినట్లు సమాచారం. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా టెండర్లు పిలవాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కోడిగుడ్లు సరిగ్గా సరఫరా జరిగేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.జహీరాబాద్: ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాలు మొక్కుబడిగా నిర్వహించకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు కేంద్రాలకు వచ్చి పోవడంతోనే సరిపెట్టకుండా వారికి ఆటాపాట నేర్పించాలనే దానిపై దృష్టి పెట్టింది. అందుకే అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ఇటీవల ఉన్నతాధికారులతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. మంచి గ్రేడింగ్ ఉన్న కేంద్రాలకు అవార్డులను సైతం ఇవ్వనున్నట్లు పేర్కొంది. చిన్నారులు లేరనే సాకులతో కేంద్రాలను మూసివేయడం సరికాదని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకుని సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చుకునే అవకాశం ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నట్లయితే ఎక్కువ సంఖ్య వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలకు కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించింది. ప్రతీ కేంద్రంలో తప్పనిసరిగా 20 మంది సంఖ్య ఉండేలా నిర్వాహకులు చూసుకోవాల్సి ఉంటుంది. బడి బాట తరహాలోనే గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఐసీడీఎస్ అధికారులు, ఆయా కేంద్రాల నిర్వాహకులు ప్రయత్నాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేదనే భావన ఉంది. చిన్నారుల సంక్షేమంపై భారీగా ఖర్చు పెడుతున్నా అధికారులు సరిగ్గా పనిచేయడం లేదనే అపోహ ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీన్ని సరిచేసేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని యోచిస్తోంది. అందులోభాగంగానే జిల్లా సంక్షేమాధికారులు వారానికి కనీసం మూడు కేంద్రాలను అయినా సందర్శించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.పిల్లల సంఖ్య పెంచేలా చర్యలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి గ్రేడింగ్ విధానం అమలుకు నిర్ణయంఅంగన్వాడీ బాటతో సంఖ్య పెంచుతాం కేంద్రాలకు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకుగాను మే నెలలో అంగన్వాడీ బాట కార్యక్రమం చేపడతాం. కేంద్రం నిర్వాహకులు ప్రతీ ఇంటికి వెళ్లి చిన్నారుల గురించి ఆరా తీస్తారు. రెండేళ్లు నిండిన చిన్నారులను కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సంఖ్య తక్కువ ఉన్న పట్టణ ప్రాంతాల్లోని రెండు మూడు కేంద్రాలను ఎక్కువ ఉన్న ప్రాంతాలకు మార్పించాం. కేంద్రాల పనితీరుపైనే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతోంది. –లలితకుమారి, జిల్లా సంక్షేమాధికారి, సంగారెడ్డి -
నిద్రిస్తున్న యువకుడి పైనుంచి..
మర్కూక్(గజ్వేల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ యువకుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మర్కూక్ మండలంలోని కర్కపట్ల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ దామోదర్ వివరాల ప్రకారం... కర్కపట్ల గ్రామానికి చెందిన కరుణాకర్ (24) అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ వద్ద క్లీనర్గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ తన టిప్పర్ల ద్వారా ప్రతి రోజు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో గ్రామంలో నుంచి మట్టిని హైదరాబాద్కు తలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 12గంటల తర్వాత మూడు టిప్పర్లు, 2 జేసీబీల సహాయంతో కర్కపట్ల గ్రామానికి చెందిన గ్యార మల్లేశం ప్రభుత్వ భూమి నుంచి మట్టిని తరలిస్తున్నాడు. తన వద్ద క్లీనర్గా పనిచేస్తున్న కరుణాకర్ నిద్రరావడంతో కొద్దిసేపు పడుకుంటానని చెప్పి వెళ్లి పక్కన నిద్రిస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతో అజాగ్రత్తగా అతడి ఛాతీపై నుంచి టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కరుణాకర్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేన్నారు. రేణికుంట రోడ్డు ప్రమాదంలో... బెజ్జంకి(సిద్దిపేట): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట వద్ద గల రాజీవ్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బెజ్జంకి క్రాసింగ్కు చెందిన బి.నక్షత్రమ్మ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో బెజ్జంకిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్షత్రమ్మ భర్త ఆనందరెడ్డికి తీవ్ర గాయాలు కాగా, హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కొలిపాక మంజుల, బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఐలేని నవీన్రెడ్డిలకు కాలు ఫ్యాక్చరైంది. వీరు కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
హుస్నాబాద్: పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన వెంకటస్వామి తన ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం ఊరికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువతి అదృశ్యం నర్సాపూర్ రూరల్: యువతి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంచర్ల నారాయణ కూతురు కంచర్ల కృష్ణవేణి (19)ఈనెల 23న తల్లి చంద్రకళతో కలిసి నర్సాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వచ్చారు. తల్లి ఆస్పత్రి లోపల బంధువులను పరామర్శిస్తుండగా కృష్ణవేణి బయటకు వచ్చి కనపడకుండా పోయింది. చుట్టుపక్కల తల్లి, బంధువులు వెతికినా కనిపించలేదు. గురువారం తండ్రి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వరికోత.. కన్నీటి వెత
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు దుబ్బాకకు చెందిన కేసుగారి స్వామి. తనకున్న 12 ఎకరాల్లో ఈ యాసంగిలో వరి వేశాడు. తీరా వరి కోద్దామంటే వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు చేలలో నీరు నిలిచిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చైన్ హార్వెస్టర్తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 12 ఎకరాలు కోసేందుకు కామన్ హార్వెస్టర్తో 14 గంటలు పట్టేది. ఇప్పుడు చైన్ మిషన్తో కోస్తే 18 గంటలకు పైగా సమయం పట్టింది. వరి కోసి వడ్లను రోడ్డుపైకి తెచ్చి ట్రాక్టర్లో పోయాల్సి రావడంతో అదనంగా 5 గంటలకు పైగా సమయం ఎక్కువైంది. పైగా కామన్ హార్వెస్టర్కు గంటకు రూ.2 వేలు ధర ఉంటే చైన్ మిషన్కు రూ.3 వేలకు పైగా ఉంది. దీంతో రూ.26 వేలలో పూర్తి కావాల్సిన కోతకు రూ.50 వేలకు పైగా అంటే అదనంగా రూ.24 వేలు అదనపు భారం పడింది. ప్రతిసారి వడ్లు 20 ట్రాక్టర్లకు పైగా అంటే 350 క్వింటాళ్ల వరకు అయ్యేవి. ఇప్పుడు తక్కువయ్యాయి. ఇది ఒక్క రైతు స్వామిదే కాదు చాలామంది రైతులది ఇదే పరిస్థితి. చైన్మిషన్తో కోయించా.. వరుసగా వానలు పడటంతో కోత కొచ్చిన వరిపంట కోసేందుకు చాలా ఇబ్బందులు పడ్డా. వానలతో భూమి ఆరలేదు. మళ్లీ వాన వానలు వస్తుండటంతో ఎక్కువ డబ్బులు పోయినా ఉన్న పంటను దక్కించుకోవాలనే చైన్మిషన్తో కోయించా. నేనే కాదు రైతులందరూ చైన్మిషన్, ఫోర్వీల్తోనే కోయించుకుంటున్నారు. – గన్నె వెంకట్రాజిరెడ్డి, రైతు అకాల వర్షాలతో ఇబ్బందులు తీరా పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాలు రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నాయి. వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షాలతో కోసిన వడ్లు ఆరబోసేందుకు , వరి కోతలు కోసేందుకు కూడా అదనంగా ఖర్చులు అవుతున్నాయి. – రాధిక,జిల్లా వ్యవసాయ అధికారివరి కోసేందుకు నరకయాతన దుబ్బాక: అసలే యాసంగిలో భూగర్భజలాలు అడుగంటి బోర్లు వట్టిపోయి చాలా పంటలు ఎండిపోయాయి. ఇక పంట చేతికొస్తదనుకున్న దశలోనే జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్లతో వడ్లు చాలా వరకు వడ్లు రాలిపోవడంతో రైతులకు కనీస పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి దాపురించింది. పోగా మిగిలిన గింజలను కోద్దామంటే వారం పదిరోజులుగా వరుసగా పడుతున్న వానలకు పొలాలు ఆరక దిగబడుతుండటంతో కోతలకు ఇబ్బంది అవుతోంది. దీంతో వరి కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధర పెట్టి చైన్ మిషన్లతోనే కోతలు కోయించాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలోని ఒక్క దుబ్బాకనే కాకుండా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో వరి కోతలు కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో 45 శాతానికి పైగా వరికోతలు జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరిపంట వేయగా ఇప్పటి వరకు 45 శాతం వరకు అంటే సుమారుగా 1.45 లక్షలకు పైగా ఎకరాల్లో కోతలు కోయడం పూర్తయింది. ఇంకా 55 శాతం వరకు కోతలు కోయాల్సి ఉంది. కోసిన కోతల్లో 20 శాతం వరకు చైన్మిషన్లు, ఫోర్వీల్తోనే కోశారు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులపై అదనపు భారం పొలాలు దిగబడుతుండటంతో చైన్మిషన్తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్వెస్టర్కు గంటకు రూ.2వేలు ఉండగా చైన్ మిషన్ గంటకు రూ.3వేల నుంచి 3500 వరకు ధర చెల్లించాల్సి వస్తోంది. పొలాలు దిగబడుతుండటంతో వడ్లు పోసేందుకు ట్రాక్టర్లు రాలేని పరిస్థితి ఉంది. సాధారణంగా ఎకరం వరికోతకు టైర్ హార్వెస్టర్తో గంట 10 నిమిషాల నుంచి 1.20 పడుతుండగా చైన్ మిషన్తో ఎకరం వరికోసి వడ్లు బయట పోయాల్సి వస్తుండటంతో 2 గంటలకు పైగా సమయం పడుతోంది. అంతేకాకుండా చైన్మిషన్కు రేటు కూడా ఎక్కువ ఉండటంతో ఎకరానికి రైతుకు అదనంగా 5 నుంచి 6 వేల వరకు భారం పడుతోంది. రైతులు చైన్మిషన్తోనే కోయిస్తుండటంతో అవి దొరకక ప్రతిరోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులను కోలుకోకుండాచేస్తున్న అకాల వర్షాలు భూమిలో తేమతో దిగబడుతున్నహార్వెస్టర్లు చైన్మిషన్లతో వరి కోతలు ఎకరానికి రూ.5 వేలకు పైగాఅదనపు భారం జిల్లాలో ఇప్పటి వరకు 45 శాతం కోతలు -
ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేటకమాన్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణం రాంనగర్కు చెందిన మండల నరేశ్(32) కొన్నేళ్లుగా అస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకునే అతడికి ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మనస్తాపానికి గురై పట్టణ శివారు ఎర్ర చెరువు కట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు అతడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై లింగం కథనం ప్రకారం... నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి గూడ గిరిజన తండాకు చెందిన నేనావత్ జాంగిర్ నాయక్ (35) తనకు ఉన్న 20 గుంటల భూమితో పాటు ఇతరుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మతిస్థిమితం లేని వివాహిత.. కొండపాక(గజ్వేల్): మతిస్థిమితం లేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్ సీఐ.విద్యాసాగర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సిర్సనగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మి (56)కి కొన్ని నెలలుగా మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతుకుతున్న క్రమంలో ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా భూమి హద్దు కోసం పాతిన ఎత్తైన గనేట్ రాయికి ఉరేసుకొని చనిపోయింది. మృతురాలికి భర్త, కొడుకు, కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పులబాధతో యువకుడు.. తొగుట(దుబ్బాక): అప్పుల బాధతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఎల్లారెడ్డిసేటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మన్నె భాస్కర్ (29) డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు ఏళ్ల క్రితం భార్య మహేశ్వరి మృతి చెందింది. తీవ్ర మనోవేదనకు గురై పనికి వెళ్లకుండా ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటిపై ప్రైవేట్ ఫైనాన్స్లో రూ 3.25లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకురావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత.. జిన్నారం (పటాన్చెరు): అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం... మెదక్ జిల్లా రామయంపేటకు చెందిన రేష్మాబేగంను (30) కానుకుంట గ్రామానికి చెందిన ఎండి అహ్మద్ 2019లో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త అహ్మద్, అత్త భాను, బావ సలీం, చిన్న మామ పాషాలు కలిసి అదనపు కట్నం తీసుకురావాలని రేష్మ భేగంను మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో ఈనెల 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోమారు గొడవపడటంతో 22వ తేదీన పెద్దల సమక్షంలో మాట్లాడి ఒప్పించారు. దీంతో అత్తారింటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరు కొడుకుల మణికట్టుపై గాయపరిచి రేష్మా బేగం బెడ్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోఉన్న ఇద్దరి పిల్లలను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అత్తింటి వేధింపులతోనే మృతి చెందిందని సోదరుడు సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్య -
కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్కు సరుకుల లారీలను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయం నుంచి పంపించనున్నట్లు కేదారినాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఐదేళ్లుగా కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులను అందిస్తూ, యాత్రికులకు ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మే 2 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడికి వచ్చే భక్తులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, రాత్రి భోజనం అందించనున్నామని చెప్పారు. శుక్రవారం శరభేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, శివకళ్యాణం నిర్వహించి, లారీలను కేదార్నాథ్కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాంకాల నవీన్కుమార్, మధుసూదన్, రత్నాకర్, శరభయ్య, కాశీనాథ్, గంజి రాములు, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. నేడు వెళ్లనున్న సరుకుల లారీలు కేదారినాథ్ అన్నదానసేవా సమితి సభ్యులు వెల్లడి -
తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్పై కేసు నమోదు
మనోహరాబాద్(తూప్రాన్): తప్పుడు వార్తలు రాసిన యూట్యూబర్పై కేసు నమోదైంది. ఈ ఘటన హనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం ప్రకారం... మండలంలోని కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అక్రమంగా అనుమతులు ఇచ్చిందని, రెచ్చగొట్టేలా, ఓ యూట్యూబ్ చానల్లో పార్ట్ 1, పార్ట్ 2 పేరిట ఓబులేసు లింగంగౌడ్ అనే వ్యక్తి టెలికాస్ట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపులో పడి వ్యక్తి మృతిములుగు(గజ్వేల్): ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం తున్కిబొల్లారంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బద్దం బలవంతరెడ్డి(34)వ్యవసాయం చేస్తున్నాడు. గురువారం ఉదయం వ్యవసాయ పొలం వద్దగల నీటి సంపులో బోరు మోటరు నడవక పోవడంతో సంపులోకి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. ఇది గమనించిన తమ్ముడు కోటిరెడ్డి విషయాన్ని తన తండ్రి బుచ్చిరెడ్డికి తెలుపగా వారిరువురు కలిసి బలవంతరెడ్డిని నీటి సంపులోనుంచి పైకి తీసి చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య అనూష ఇద్దరు పిల్లలున్నారు. పిట్టగోడ కూలి గర్భిణి మృతి ● వర్షం వస్తుందని దాబా దగ్గర ఆగిన భార్యాభర్తలు.. ● టీ తాగుతుండగా గోడ కూలి ప్రమాదం మునిపల్లి(అందోల్): పిట్టగోడ కూలడంతో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని పొల్కంపల్లికి చెందిన మన్నె విజయ్, ఆయన భార్య శ్రావణి (గర్భిణి) సదాశివపేట ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. బుదేరా గ్రామానికి సమీపంలోకి రాగానే ఈదురు గాలులు, వర్షం రావడంతో భార్యాభర్తలు ఓ దాబా దగ్గర ఆగి టీ తాగుతున్నారు. అదే సమయంలో దాబా రేకుల షేడ్డు ముందు భాగంతో పాటు పిట్టగోడ కూలి శ్రావణిపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలొదిలింది. కేసు దర్యాప్తులో ఉంది. మద్యం తాగి కిందపడి వ్యక్తి మృతిపటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం... నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లికి చెందిన ఊషయ్య(45) తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామం ఇంద్రపురి కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. ఈనెల 13న మద్యం తాగి కింద పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. పక్కనే ఉన్న మేస్త్రి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అనంతరం అతనికి తల నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ చేసి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో 23న ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎఫ్ఆర్ఓ అర్చన, సిబ్బంది గురువారం సీజ్ చేశారు. జలాల్పూర్, జాకంపల్లి తండాల్లోని అడవిలోని వాగుల నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సీజ్చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. -
జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్ చోరీ..
● అంతర్జిల్లా దొంగను పట్టుకున్నత్రీటౌన్ పోలీసులు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ మధుసిద్దిపేటఅర్బన్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను గురువారం సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట ఏసీపీ మధు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఇస్సానగర్కు చెందిన చెవుల మల్లేశం (40) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు చేస్తున్నాడు. తన సమీప గ్రామాల్లో దొంగతనం చేస్తే పోలీసులకు దొరికిపోతాననే భయంతో దూర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ ముందు రోజు రెక్కీ నిర్వహించి అనంతరం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొండపాక మండలం మర్పడగ మధరి దోమలోనిపల్లి గ్రామంలో దోమల మల్లయ్య వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాక్టర్ ట్రాలీని అపహరించాడు. అంతకుముందు ఫిబ్రవరి 12న రాంపల్లి గ్రామ శివారులోని బొమ్మ నర్సయ్య పొలం వద్ద నిలిపి ఉంచిన జాన్డీర్ ట్రాక్టర్ను ట్రాలీతో సహా దొంగిలించి తన స్వగ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ట్రాక్టర్ను గుర్తు పట్టకుండా నంబర్ ప్లేట్కు రంగులు వేసినట్టు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో సెలంపు గ్రామ శివారులో ట్రాక్టర్ ఇంజిన్తో సహా ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి జాన్ డీర్ ట్రాక్టర్ ఇంజిన్, రెండు ట్రాలీలు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. నేరస్తుడు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, సిబ్బంది తిరుపతిరెడ్డి, బాబు, శ్రీనివాస్లను ఏసీపీ అభినందించారు. -
కారు ఢీకొట్టిన ప్రమాదంలో బైకిస్టు దుర్మరణం
వర్గల్(గజ్వేల్): బైకును వెనక నుంచి కారు ఢీకొట్టడంతో బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్రోడ్డు వద్ద రాజీవ్రహదారిపై జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం... మర్కూక్ మండలం ఎర్రవల్లికి చెందిన సంద గణేశ్(40)కు భార్య పద్మ, 14 యేళ్లలోపు మనోజ్, మానస అనే ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల చదువుల కోసం గజ్వేల్లో ఉంటూ టిప్పర్, జేసీబీ పనులు చూసుకుంటున్నాడు. గురువారం సాయంత్రం బైక్పై గజ్వేల్ నుంచి గౌరారం వైపు వస్తున్నాడు. సింగాయపల్లి క్రాస్రోడ్డు వద్ద వెనక నుంచి కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకుకేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే
సాక్షి, సిద్దిపేట: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పీఎం మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పాశవికచర్య అని, సెక్యులర్ మేధావులు సైతం తీవ్రంగా ఖండించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఈ ఘటనపై స్టాలిన్, కమల్ హాసన్, ప్రకాశ్రాజ్, సెక్యులర్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ రకమైన అల్లర్లు సృష్టించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాల వల్ల పాతబస్తీలో అభివృద్ధి జరగలేదని, మెట్రో రాలేదని విమర్శించారు. ఒవైసీ పేద ముస్లింల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. డెవలప్మెంట్కి ముస్లింలను దూరంగా ఉంచేది ఏంఐఎం పార్టీ అని విమర్శించారు. మదర్సాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి తెలంగాణలో ఉన్న మదర్సాల్లో ఎవరు ఉంటున్నారు? ఏ రాష్ట్రం వారు ఉంటున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఎంటీ? విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇస్లామిక్ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ మేధావులు సైతం ఉగ్రదాడిని ఖండించాలి మెదక్ ఎంపీ రఘునందన్రావు -
విధులు ఒక చోట... వేతనం మరోచోట
ఝరాసంగం(జహీరాబాద్): మండల పరిధిలో అధికారుల డివ్యూటేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. విధులు ఒకచోట.. వేతనం మరోచోట తీసుకుంటున్నారు. తమకు అనువుగా ఉన్న చోట డిప్యూటేషన్పై కొనసాగుతున్నారు. పలు శాఖల్లో డిప్యూటేషన్పై వెళ్లడంతో ఇతర అధికారులపై పని భారం పడటమే కాకుండా.. కొన్ని శాఖల్లో సేవలు నిలిచిపోయాయి. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ,తో పాటు ఎంపీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్తోపాటు నలుగురు అటెండర్లు (ఆఫీస్ సబార్డినేట్లు) ఉండాలి. ఇక్కడ పేరుకు మాత్రం అన్ని పోస్టులు భర్తీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు డిప్యూటేషన్పై వెళ్లారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన సూపరింటెండెంట్ రాములు పుల్కల్ మండలంలో, టైపిస్ట్ వెంకటయ్య కొండాపూర్ మండలంలో, అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) పద్మావతి న్యాల్కల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో డిప్యూటేషన్పై వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి డిప్యూటేషన్పై సూపరింటెండెంట్గా వచ్చిన శంకర్ తిరిగి చౌటకూర్ ఎంపీడీఓ(ఎఫ్ఏసీ)గా వెళ్లారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న అధికారి సమయ పాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ సేవలు అందించాలనే లక్ష్యంగా ప్రత్యేకంగా మెడికల్ అధికారి డా.గోపీని నియమించి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాటు చేశారు. కానీ, అధికారి మాత్రం మేడ్చల్ జిల్లా షామిర్పేటకు డిప్యూటేషన్పై వెళ్లాడు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇక్కడ విధులు నిర్వహించే జేఈ అధికారి అశోక్కుమార్ కోహీర్కు, అక్కడి నుంచి జేఈ ప్రతాప్రెడ్డి ఝరాసంగంకు డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పని చేసే అధికారిపై సమయపాలన పాటించకపోవటంతోపాటు నచ్చిన విధంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏపీయం బాలకృష్ణ జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి అక్కడి నుంచి ఝరాసంగంకు ఏపీఎంగా వి.టిక్యా డిప్యూటేషన్పై వచ్చారు. గతంలో వీఆర్ఏగా విధులు నిర్వహించిన బీరప్ప జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది కోహీర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఝరాసంగం తహసీల్దార్ కారా్యాలయానికి డిప్యూటేషన్పై వచ్చారు. లైబ్రేరియన్ శ్రీనివాస్ సంగారెడ్డి గ్రంథాలయానికి డిప్యూటేషన్పై వెళ్లారు. దీంతో వారంలో కేవలం ఒక రోజు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. దీంతో పౌరసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఝరాసంగంలో డిప్యూటేషన్ల దుమారం -
ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిరామచంద్రాపురం(పటాన్చెరు)/పటాన్చెరు: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. భారతీనగర్, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో గురువారం పలు కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీలకతీతంగా చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతోపాటు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని వివరించారు. దైవభక్తి పెంపొందించుకోవాలి ప్రతీ ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల శ్రీ సాయిబాబా దేవాలయం వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్లు వి.సింధురెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, పుష్ప, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో ఆ కమిటీలు పునరుద్ధరణ
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● నిర్ణీత గడువులోగా పరిష్కారం ● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● నాగల్గిద్ద, మనూరు మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నారాయణఖేడ్: భూ భారతి చట్టంతో అసైన్మెంట్ కమిటీలు పునరుద్ధరణ చేశారని, తద్వారా పేదలకు భూమి పట్టాలు, ఇళ్ల పట్టాలు జారీ చేసే అధికారం కలిగిందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణితో ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మనూరు, నాగల్గిద్ద మండల కేంద్రాల్లో సంజీవరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరై కలెక్టర్ మాట్లాడారు. నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టం దోహదపడుతుందన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో ఏవైనా లోటుపాట్లు, తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు నూతన ఆర్ఓఆర్ 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. ఎవరికై నా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా... భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టాపాస్ బుక్కులలో సమగ్ర వివరాలతో, హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాప్) పొందుపరుస్తారని కలెక్టర్ తెలిపారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూధార్ నంబర్ కేటాయిస్తారని చెప్పారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను కోర్టు స్టే విధించడం వల్ల ధరణిలో పరిష్కరించేందుకు అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. నల్లపోచమ్మను సందర్శించుకున్న కలెక్టర్ మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్కు నల్లపోచమ్మ తల్లి చిత్ర పటాన్ని ఎమ్మెల్యే బహూకరించారు. రైతులు అవగాహన ఏర్పరచుకోవాలి: కలెక్టర్ కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగాా రైతులు అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురితో కలిసి కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఎఓ శివప్రసాద్, ఆర్డీవో అశోక చక్రవర్తి, ఏడిఏ నూతన్కుమార్, తహసీల్దార్ నజీంఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మనీశ్ పాటీల్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణం పెనుభారం!
● భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం ● స్టీల్, ఇసుక, సిమెంట్ ధరలు ౖపైపెకి ● పెరిగిన కూలీ రేట్లు ● బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు జహీరాబాద్ టౌన్: ఇల్లు కట్టి చూడు..పెళ్లి చూసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. రెండింటికీ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నాడైనా నేడైనా. రోజు రోజుకు భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని తాకడంతో బడ్జెట్ అంచనాలు తారుమారవుతున్నా యి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబడటం లేదు. సిమెంట్, స్టీల్, ఇసుక, పీవీసీ, విద్యుత్, ప్లంబింగ్ మెటీరియల్, కలర్, కూలీ రేట్లు ప్రతీ వస్తువు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిలో ఇల్లు కట్టుకోవాలంటే సామాన్య ప్రజ లు బెంబేలెత్తున్నారు. నిర్మాణం పనులు ప్రారంభించిన వారు పెరిగిన ధరలతో సగంలోనే పనులు ఆపేస్తున్నారు. కొత్తగా ఇంటి పనులు మొదలు పెట్టాలనుకునేవారు సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు. పెరిగిపోతున్న రేట్లు... భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మేసీ్త్ర, కూలీల రేట్లు సైతం ఎక్కువయ్యాయి. సొంతగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే గతేడాది చదరపు అడుగు రూ.1,700–1,800 వరకు అయ్యేది. అదే గుత్తేదారు అయితే రూ.1,700–1,900 వరకు చేసేవారు. గుత్తేదారుకు ఇస్తే రూ.2,000–2,200 దాకా తీసుకుంటున్నారు. మార్కెట్లో ఇసుక టన్నుకు రూ.2,500 నుంచి రూ.2,800 వరకు పలుకుతుంది. స్టీల్ టన్ను రూ.54 వేల నుంచి ఉంది. సిమెంట్ ధరలు బస్తాకి కంపెనీ బట్టి రూ.360 వరకు పలుకుతోంది. మేసీ్త్ర,కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇసుక మరింత ప్రియం ఇళ్ల నిర్మాణంలో ఇసుకకు ప్రాధాన్యం ఉంది. ఇసుకలో రెండు రకాలు. కట్టడానికి ఉపయోగించేది. ప్లాస్టింగ్కు వాడేది. సన్నరకం ఇసుక టన్నుకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నారు. ఇసుక కొరత వల్ల ఓవర్ లోడ్కు అనుమతులు ఇవ్వకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. పునాదులు, స్లాబ్కు ఉపయోగించే కంకరు ధర కూడా పెరిగింది. 300 ఫీట్కు రూ.900 వరకు విక్రయిస్తున్నారు. గతంతో పొలిస్తే కార్మికులు, కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కలర్, కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, కలప తదితర వస్తువుల ధరలు కూడా 25 నుంచి 30% వరకు పెరిగాయి. ఫ్లోరింగ్, టైల్స్ ధరలు కూడా 30% పెరిగాయి. ఇలా నిర్మాణానికి ఉపయోగించే ప్రతీ వస్తువు ధర పెరిగిందని, సొంతంగా ఇళ్లు కట్టుకునే ప్రజలతో పాటు బిల్డర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరల కారణంగా నిర్మాణాలు కాస్త మందగించాయంటున్నారు.ధరలు పెరగడంతో నష్టపోతున్నాం నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. ఇసుక, సిమెంట్, స్టీల్, డస్ట్,కంకర, ఇతర మెటీరియల్ రేట్లు పెరగడం వల్ల గతేడాది ఒప్పందం చేసుకున్న పనులకు నష్టం వస్తోంది. లేబర్ ఛార్జీలు కూడా చాలా పెంచారు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో నిర్మాణం రంగంపై దెబ్బపడింది. –ఎస్ఎన్, భూషణం, ఇంజనీర్, జహీరాబాద్ -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
రాయికోడ్(అందోల్): మండలంలోని యూసుఫ్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన వేడుక గురువారం వైభవంగా జరిగింది. బీచ్కుందకు చెందిన శివాచార్య సోమలింగ స్వామి ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, నంది, గణపతి, సుబ్రమణ్య స్వామి, శిఖరప్రతిష్ఠలు వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ధనసిరి ఆశ్రమాధిపతి, బండయప్ప స్వామి, నిర్వాహకులు భాస్కర్రెడ్డి, నర్సింహారెడ్డి, సంగారెడ్డి, నాయకులు నవనీత తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ప్రాధాన్యతనివ్వాలిజహీరాబాద్ టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొనింటి నర్సింలు కోరారు. ఈ మేరకు గురువారం ఆర్డీఓ రాంరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇళ్లులేని వారికి స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేయాలన్నారు. శ్రమశక్తి సంఘాలు ఏర్పాటుచేసి జాబ్కార్డు ఇచ్చి 150 రోజుల పని కల్పించాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద 5% యూనిట్స్ కేటాయించాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో రాజ్కుమార్, నాయకులు మచ్చెందర్, బిస్మిల్లా,శోభమ్మ, వాజీద్లు ఉన్నారు. శాంతిభద్రతలపై రాజీపడేది లేదు: ఎస్పీ పటాన్చెరు టౌన్: శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. పటాన్చెరు పోలీస్స్టేషన్ను గురువారం ఎస్పీ సందర్శించి పెండింగ్ కేసులు విషయంలో పలు సూచనలు చేశారు. అనంతరం పటాన్చెరు మైనార్టీ నాయకులు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. జిన్నారంలో ఓ వర్గానికి చెందిన విద్యార్థులపై అకారణంగా జరిగిన దాడిపై సంపూర్ణ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడుతూ కోతులు విగ్రహంను ధ్వంసం చేశాయని దర్యాప్తులో గుర్తించి ఆధారాలతో సహా చూపి అందరిలో ఉన్న అపోహలను తొలగించారని తెలిపారు. నేడు న్యాల్కల్లో భూ భారతి సదస్సున్యాల్కల్(జహీరాబాద్): మండల కేంద్రమైన న్యాల్కల్లో భూభారతి–2025 చట్టంపై శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు ఉండనుందని తహసీల్దార్ భూపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ఎంపీ సురేశ్కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్రావు, కలెక్టర్ క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆర్డీఓ రాంరెడ్డి, న్యాల్కల్, హద్నూర్ పీఏసీఎస్ చైర్మన్లు సిద్దిలింగయ్యస్వామి, జగనాథ్రెడ్డి, ఎంపీడీఓ రాజశేఖర్తోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు హజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి రైతులందరూ హాజరు కావాలని తహసీల్దార్ కోరారు. డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం పటాన్చెరు టౌన్: డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు. మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు పెద్దకంజర్లలో అడ్మిషన్ తీసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు గురుకుల నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్ కల్పించనున్నట్లు చెప్పారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, విద్య, యూనిఫాం, ఉచిత ఎగ్జామినేషన్ ఫీజు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94948 24692, 80080 70959 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. -
పహల్గాం దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ
సదాశివపేట(సంగారెడ్డి)/జోగిపేట (అందోల్): జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ సదాశివపేట, జోగిపేటలో పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కాగాడాలు, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఉగ్ర దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక జోగిపేటలో ధార్మిక సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ నుంచి హనుమాన్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. -
ఆటలాడుకుందాం రండి
● మే 1 నుంచి వేసవి శిబిరం ప్రారంభం ● ఈనెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ సంగారెడ్డి జోన్: పాఠశాలలకు సెలవులు ప్రకటించటంతో విద్యార్థులకు క్రీడలపై శిక్షణ అందించేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది. ప్రతీ ఏడాది మాదిరిగానే పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటు చేసి, శిక్షణ అందించనున్నారు. ఇప్పటికే శిక్షణ అందించే కేంద్రాలను గుర్తించారు. అదేవిధంగా శిక్షణ అందించే కోచ్లను సైతం నియామకం చేసింది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో రాణించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెలరోజులపాటు కార్యక్ర మాలు వేసవి శిక్షణ కార్యక్రమాలు మే 1న ప్రారంభమై మే 31 వరకు కొనసాగనున్నాయి. నెల రోజులపాటు యువతకు ఆసక్తి ఉన్న క్రీడలలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. శిక్షణ పూర్తి అయిన తర్వాత యువతకు శాఖ తరఫున సర్టిఫికెట్లు అందిస్తారు. 14 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలకే... క్రీడా శిబిరాలలో14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలకు మాత్రమే శిక్షణ అందిచనున్నారు. ఆసక్తి గల బాల, బాలికలు ఈ నెల 31 వరకు జిల్లా క్రీడల అధికారి ఫోన్ నం:7981798957 కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పలు క్రీడలపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లో బాక్సింగ్, కిక్ బాక్సింగ్, అథ్లెట్స్, కబడ్డీ, చెస్, ఫుట్బాల్ పట్ణణ ప్రాంతాలలో హ్యాండ్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, వుషు క్రీడలలో శిక్షణ కల్పించనున్నారు. గ్రామీణప్రాంతాల్లో 10..పట్టణ ప్రాంతాల్లో 12 జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో 10, పట్టణ ప్రాంతాలలో 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాల నిర్వహణకు రూ.50వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. క్రీడా సామగ్రి కొనుగోలుతోపాటు శిక్షణ అందించే కోచ్లకు పారితోషికంగా రూ.4వేలు అందించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను 14 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 22 కేంద్రాలను ఏర్పాటు చేశాం. మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. –ఖాసీం బేగ్, జిల్లా యువజన, క్రీడల అధికారి, సంగారెడ్డి -
చెక్బౌన్స్ కేసులపై లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: బ్యాంకులో చెక్బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టు కార్యాలయంలో గురువారం బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బ్యాంకు కేసులు రాజీమార్గంతో పరిష్కరించుకోవచ్చని, కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
శుభకార్యంలో ఈదురు గాలుల బీభత్సం
● ఎగిరిపోయిన షామినాయా, టెంట్లు, ఇనుప రేకులు ● తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న బంధువులు నారాయణఖేడ్: ఈదురు గాలుల బీభత్సం ఓ వివాహ శుభకార్యంలో కొద్దిసేపు బంధుమిత్రులను ఆందోళనకు గురిచేసింది. మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో ఓ మాలిపటేల్ కుమారుడి వివాహం గ్రామంలో నిర్వహించారు. ఇంటి ఆవరణలో టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. వివాహం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో అక్కడ వేసిన టెంట్లు, షామియానా, సమీపంలోని షెడ్డుపై రేకులు గాలిలోకి ఎగిరిపోయాయి. టెంట్లు కూలిపోవడంతో బంధువులు, మిత్రులు వాటి కిందనుంచి బయటకు పరుగులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డి సైతం టెంటు కింద చిక్కుకుపోగా ఇతరుల సహాయంతో బయటపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. షెడ్డు రేకులు దూరంగా పడటంతో తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థంలో సీఎం రేవంత్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో బుధవారం జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి–గుణచైతన్యరెడ్డి నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డికి చేరుకున్న రేవంత్రెడ్డి ముందుగా రాంనగర్లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిశ్చితార్థ కార్యక్రమానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి జగ్గారెడ్డితోపాటు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డివెంకట్రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, సీనియర్ నాయకులు వి.హన్మంతరావు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ క్రాంతి, ఎస్పీ పరితోశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం హోదాలో తొలిసారి రాక.. రేవంత్రెడ్డి సీఎం హోదాలో తొలిసారి సంగారెడ్డికి వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి వచ్చారు. -
సాగు చట్టాలపై అవగాహన ఉండాలి
వ్యవసాయ అధికారి శివప్రసాద్జహీరాబాద్ టౌన్: వ్యవసాయ చట్టాలపై డీలర్లకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. మండలంలోని రంజోల్ రైతు వేదికలో బుధవారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందు చట్టాలపై డీలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులే లక్ష్యంగా వ్యవసాయ చట్టాలు తయారు చేసినట్లు చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాల ని వివరించారు. దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. విత్తనాలు కొంటే ఎరువులు ఇస్తామని ఎవరైనా డీలర్లు రైతులకు షరతులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రోజు వ్యవసాయ అధికారులు దుకాణాలను తనిఖీలు నిర్వహిస్తారని, వారికి సహకరించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో విత్తనాల కొరతలేదని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ అధికారులు లావణ్య,అభినాష్ వర్మ, హసునుద్దీన్, వినోద్కుమార్,రంజోల్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రదీప్కుమార్ నియోజకవర్గంలోని డీలర్లు పాల్గొన్నారు. -
భూ భారతిపై రైతులకు అవగాహన
మునిపల్లి(అందోల్)/కంది (సంగారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి పథకంను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్రెడ్డి, ఎంపీడీఓ హరినందన్రావు, తహసీల్దార్ గంగాభవానీ, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భూ భారతి పథకంపై అవగాహన సదస్సు కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు కంది మండలంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధిస్తారని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శబడి పథకం ద్వారా పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతులు చేపడుతుందని చెప్పారు. విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, డ్రెస్సుల ను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కందిలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్రెడ్డి తహసీల్దార్ ఆశాజ్యోతితోపాటు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ రేవతి, ఆర్ఐ సుభాష్, శృతి, కార్యాలయ సిబ్బంది శశాంక్, చందు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
పాఠ్య పుస్తకాలు సిద్ధం!
● జిల్లాలో 9,86,120 పుస్తకాలు అవసరం ● ఇప్పటికి చేరినవి 2,22,820 ● పాఠశాలలు ప్రారంభం రోజునాటికి అందించేలా చర్యలు కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం 2025–26కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. జూన్ 12న పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్య లు చేపడుతోంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పనులు చేపడుతోంది. ఇందులోభాగంగానే విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందిస్తోంది. గతేడాది పాఠ్యపుస్తకాలు ముద్రణ ఆలస్యంగా జరగడంతో విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించలేకపోయారు. గత విద్యా సంవత్సరం అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈసారైనా పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు అవసరమైన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిలో పుస్తకాల ముద్రణ చేపట్టారు. క్యూర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా జిల్లా, మండలం, పాఠశాల పేరుతో ఆన్లైన్లో సమాచారం వచ్చేస్తుంది. జిల్లాలో 1,17,238 మంది విద్యార్థులు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1,17,238 మంది విద్యార్థులు చదువుతున్నారని గుర్తించారు. 9,86,120 పుస్తకాలు అవసరం ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే 2,22,820 పుస్తకాలు జిల్లాకు చేరాయి. వచ్చిన పుస్తకాలు డీఈఓ సమావేశ మందిరం, పాత ఎస్ఎస్ఏ కార్యాలయాల సమీపంలో గోదాంలలో భద్రపరిచారు. తెలుగు–ఆంగ్లం పద్ధతిలో పుస్తకాలు ముద్రించారు. మేలో పూర్తిస్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పుస్తకాలు వచ్చాక మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. -
రజతోత్సవ సభను విజయంతం చేయాలి
పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డి సదాశివపేట(సంగారెడ్డి): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పీఏసిఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డి పిలుపునిచ్చారు. సదాశివపేటలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి ఏర్పడి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, సోషల్ మీడియాలో రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. కేసీఆర్ బహిరంగ సభ ద్వారా దేశరాజకీయల్లో చర్చ జరుగుతుందన్నారు. ప్రజల మనిషి కేసీఆర్ సభ కోసం ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చీటింగ్ కేసులో అఘోరీ రిమాండ్ ● లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరణ ● తిరిగి కోర్టుకు పంపిన అధికారులు సంగారెడ్డి టౌన్: ఓ చీటింగ్ కేసులో అఘోరీని బుధవారం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్లో ఉంచాలో అనే టెన్షన్ మొదలైంది. అయితే లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరించడంతో తిరిగి చేవెళ్ల కోర్టుకు పంపించినట్టు జైలు పర్యవేక్షకులు సంతోష్ రాయ్ తెలిపారు. బొంతపల్లిలో ఇరు వర్గాల ఘర్షణజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల కేంద్రంలో విగ్రహ ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న ఓ వర్గానికి చెందినవారు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి వారిని శాంతింపచేశారు. మరో వర్గం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా చేయడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి ఆయిల్ చోరీ దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టారు. దానిలోని కాయిల్స్, ఆయిల్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు వాటి విలు రూ. 50 వేల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు మల్లమ్మ ఫిర్యాదు మేరకు బేగంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భర్త ఆచూకీ తెలపండిహవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన శశికళ తన భర్త కనిపించడం లేదని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఆమె తన భర్త మహేశ్తో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో చాకలి గోపాల్, బండి శోభలు కలిసి శశికళ అత్తమ్మ(64)ను మార్చి 25న బంగారు ఆభరణాల కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందుబాబులకు జరిమానా సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి పాత బస్టాండ్వద్ద, జాతీయ రహదారి, బైపాస్లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరికి రూ.2వేలు, మిగతా నలుగురికి రూ.1,500 చొప్పున జరిమానా విధించారు. -
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
● 2024–25లో రూ.26 లక్షలు పడిపోయిన రాబడి ● డాక్యుమెంట్ల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం ● రియల్ఎస్టేట్ రంగం సంక్షోభమే కారణమంటున్న అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ఎస్ఆర్ఓ కార్యాలయాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా తగ్గింది. అలాగే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా కొంతమేరకు పడిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో రూ.25.74 లక్షలు తగ్గింది. 2023–24లో మొత్తం 1.29 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,135.19 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–24లో 1.13 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 1,109.45 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో కీలకమైంది. రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆస్తి విలువలో సుమారు 7.5% మొత్తాన్ని ఈ రిజిస్ట్రేషన్ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తుండగా... ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం పడిపోవడం గమనార్హం. రియల్ రంగం కుదేలే కారణం! రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టింది. ఇందుకు ఈ రంగం సంక్షోభమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వెంచర్లలో నివాస స్థలాల క్రయవిక్రయాలు చాలా మట్టుకు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న వెంచర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ఉన్న వెంచర్లలోనే నివాస స్థలాలను కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయారు. దీంతో చాలా వెంచర్లలో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. అలాగే ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ అవసరాల కోసం విక్రయిద్దామంటే కూడా కొనుగోలుదారులు లేకుండా పోయారు. సెకండ్ సేల్ కూడా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. దీనికితోడు రియల్ వ్యాపారులు నివాస స్థలాల రేట్లను విపరీతంగా పెంచడంతో సామాన్యులు ప్లాట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అపార్టుమెంట్లు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు కూడా పడిపోయాయి. ఇలా రియల్ రంగం సంక్షోభం ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయంపై స్పష్టంగా కనిపిస్తోంది. అనధికారిక లే అవుట్ రిజిస్ట్రేషన్లపై నిషేధంతో.. అనధికారిక లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్లను చేయకూడదని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ను ఆదేశించిన విషయం విదితమే. ఇది కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణమని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు. -
పోలీసు దిగ్బంధంలో జిన్నారం
● ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు ● పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ పంకజ్ జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల కేంద్రాన్ని పోలీసులు ఎక్కడికక్కడ దిగ్బంధం చేశారు. గ్రామంలోని తాంబేలు గుట్టపై విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లను చేపట్టారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశాల మేరకు 163 సెక్షన్ విధించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతాబలగాలతో పహారా చేపట్టారు. జిన్నారం గ్రామానికి వచ్చే నలుమూలల వద్ద పోలీసు బలగాలు చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. -
వాన నీటిని ఒడిసిపట్టేందుకు..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్షెడ్ పథకం మంజూరైంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తారు. జిల్లాకు మంజూరైన పిచెర్యాగడి వాటర్షెడ్ ప్రాజెక్టు కింద 8 గ్రామాలను ఎంపిక చేశారు. అత్యంత తక్కువగా భూగర్భ జలాలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించిన ప్రాంతాలను వాటర్షెడ్ పథకం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచి కరువును పారద్రోలనున్నారు. ఈ ప్రాజెక్టు కింద జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాగడి, బడంపేట, పర్శపల్లి, సజ్జాపూర్, కొత్తూర్(కె), ఖానాపూర్, మాచిరెడ్డిపల్లి, రాజనెల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరు కావాల్సిన ప్రాజెక్టుకు ఆలస్యంగా 2024లో మంజూరైంది. ఆరు నెలల పాటు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పథకం కింద 4,733 హెక్టార్ల భూమిలో వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు గుర్తించారు. ప్రాజెక్టు మంజూరైనందున ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో మూడు శాతం మేర పనులు చేశారు. పర్శపల్లిలో 6, సజ్జాపూర్లో 3 శాతం మట్టి పర్క్యులేషన్ ట్యాంకుల పనులు కొనసాగుతున్నాయి. వాటర్షెడ్ పనుల కోసం 49 శాతం నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో గుట్టలపై మట్టి కట్టలు వేసి వర్షపునీరు ఎక్కడికక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపడతారు. మిగిలిన నీరు కూడా ఇంకిపోయేందుకు కందకాలను, మట్టి సర్కులేషన్ ట్యాంకులను నిర్మిస్తారు. వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాలు పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు అవసరమైన పరికరాలకు నిధులు.. సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించి, ఉత్పాదకత పెంచేందుకు వీలుగా రైతులకు అవసరమైన పరికరాలను అందించేందుకు వీలుగా 15 శాతం నిధులను కేటాయిస్తారు. మరో 15 శాతం నిధులతో పేద, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు గ్రామాల్లో ఉన్న సంఘాల ద్వారా అమలు చేస్తారు. ముఖ్యంగా స్వయం ఉపాధి, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి వ్యవసాయేతర ఉపాధిని ఈ పథకం కింద కల్పిస్తారు.జిల్లాకు కొత్త వాటర్షెడ్ పథకం పిచెర్యాగడి ప్రాజెక్టు కింద 8 గ్రామాల ఎంపిక భూగర్భ జలాలు తక్కువగా ఉన్న గ్రామాలకు చోటు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు 4,733 హెక్టార్లలో పనులు మూడు శాతం మాత్రమే జరిగిన పనులు -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలు భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన అవుసుల శ్రీకాంత్ (26) నార్సింగి గ్రామంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఆరేళ్ల క్రితం బాచుపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 21న భార్య, అతని తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎవరిని ఏమనలేక , బయటకు వెళ్లిన శ్రీకాంత్ పెట్రోల్ తీసుకొని వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని మెదక్కు, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై .. సంగారెడ్డి క్రైమ్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పట్టణ సీఐ రమేశ్ కథనం ప్రకారం... పట్టణంలోని శివాజీనగర్కు చెందిన మార్కంటి దేవదాసు (50), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం మహరాష్ట్ర నుంచి పట్టణానికి వచ్చి, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య లక్మీభాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం భార్య లక్మీభాయి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. మధ్నాహ్యం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా దేవదాసు తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై సరిగా పని చేయడం లేదని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గడి ్డ మందు తాగి.. సిద్దిపేటకమాన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గ్రీన్ కాలనీకి చెందిన నర్సింహారెడ్డి టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. అతడు వ్యాపార నిర్వహణ కోసం అవసరాల నిమిత్తం చిట్ ఫండ్లలో, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక, మానసికంగా ఇబ్బంది పడుతూ టింబర్ డిపోలో మంగళవారం గడ్డి మందు తాగాడు. గమనించిన అతడి కుమారుడు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెట్రోలు పోసుకొని ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు లారీని ఢీకొట్టిన మహిళా ఆర్ఎంపీ.. చేగుంట(తూప్రాన్): ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా ఆర్ఎంపీ మృతి చెందింది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీ సబ్ స్టేషన్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారానికి చెందిన కమ్మరి మంజుల(45) ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. మంజుల కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఉంటున్న కూతురు శృతిలయను చూసేందుకు స్కూటీపై వెళ్లింది. బుధవారం తిరుగు ప్రయాణంలో స్కూటీపై వస్తుండగా రెడ్డిపల్లికాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో.. హవేళిఘణాపూర్(మెదక్): ఆగి వున్న లారీని ఆటో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని శాలిపేట గేటు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హవేళిఘణాపూర్ మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన ఆటోలో మెదక్ నుంచి 12 మంది ప్రయాణికులు బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిఽధిలోని శాలిపేట గేటు శివారులోకి రాగానే నిలిచి ఉన్న ఇనుప రాడ్ల లోడ్తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాలిపేట గ్రామానికి చెందిన లక్ష్మి(54) అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ రాములుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా గుండారానికి చెందిన పెంటి, శ్రీకాంత్లకు మెదక్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఉన్న మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భర్త యాదగిరి, ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ను ఢీకొట్టిన యువకుడు.. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని జప్తిశివనూర్ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి యువకుడు డివైడర్ను ఢీకొట్టి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా అక్బర్పేట –భూపంల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన వల్లెపు సంతోష్(28) తన పెద్దమ్మ కుమారుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి బైక్పై గండిమైసమ్మ నుంచి కామారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో జప్తిశివనూర్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైఢర్ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా సంతోష్ మృతి చెందాడు. రాజు కాలు విరగడంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
షెడ్డుకు మరమ్మతులు చేపట్టండి
కంది(సంగారెడ్డి): డంప్యార్డు షెడ్డుకు మరమ్మతులు నిర్వహించి చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని డీపీఓ సాయిబాబా పంచాయితీ అధికారులకు సూచించారు. మండల పరిధిలోని బుధవారం కవలంపేటలోని డంప్యార్డు శిథిలావస్థలో ఉండటాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో శిథిలావస్థకు చేరిందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం వేసవికాలం ఉన్నందున నీటి కొరత లేకుండా చూడాలన్నారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించి నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎల్పీఓ అనిత, ఎంపీఓ మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.డీపీఓ సాయిబాబా -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
నారాయణఖేడ్: ఉతికిన బట్టలు ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి థనం ప్రకారం.. ఖేడ్ మండలం హుక్రానా(జి) గ్రామానికి చెందిన రావుల స్వప్న (30) బుధవారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఉతికి ఆవరణలో దుస్తులు ఆరబెట్టడానికి కట్టిన పాత టీవీ కేబుల్ తీగపై దుస్తులను ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కిందపడిపోయింది. కుటుంబీకులు ఆమెను ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త రావుల హన్మారెడ్డి, ఈమధ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న కుమారుడు సాయిచరణ్ రెడ్డి, 8వ తరగతి పూర్తిచేసుకున్న కూతురు భార్గవి ఉన్నారు. దుస్తులు ఆరవేయడానికి కట్టిన కేబుల్ తీగకు వైర్లు తేలిన విద్యుత్తు తీగ తగిలి విద్యుదాఘాతతానికి గురైనట్లు భావిస్తున్నారు. స్వప్న మృతితో గ్రామంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. -
మంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం
పిచెర్యాగడికి వాటర్షెడ్ ప్రాజెక్టు పథకం మంజూరైనా ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు లేకపోవడంతో మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. చేసిన పనులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. శనివారం పిచెర్యాగడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్షెడ్ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.1.56కోట్ల చెక్కును ఉపాధి కోసం అందజేశారు. మంత్రి కార్యక్రమంతో నిధులు విడుదలై వాటర్షెడ్ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రైతులు, లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. -
కూతుర్ల మృతికి కారకురాలైన తల్లిపై కేసు నమోదు
తూప్రాన్: కూతుర్ల మృతికి కారకురాలైన తల్లిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందం మంగళవారం తెలిపారు. పట్టణ సమీపంలోని హల్దీవాగులో మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత తన ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్వీని(5)ని హల్దీవాగులో తోసి తాను కూడా ఆత్మహత్యాయత్నంకు యత్నించి ప్రాణాలతో బయట పడిన విషయం తెలిసిందే. ఇద్దరు చిన్నారుల మృతికి తల్లి కారణమని ఎస్ఐ తెలిపారు. నిందితురాలి మరిది పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కరాటే పోటీల్లో ప్రతిభమెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్లో రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెదక్ జిల్లా స్థాయి కరాటే బిల్ట్ ఎగ్జామ్లో విద్యార్థులు ప్రతిభ కనర్చినట్లు కరాటే మాస్టర్ దినాకర్ తెలిపారు. సుమారు 100 మంది విద్యార్థులు వివిధ మండలాల నుంచి పాల్గొని ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులకు రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా వ్యస్థాపక అధ్యక్షుడు మాస్టర్ నగేశ్ బెల్టులు ప్రధానం చేశారు. నితన్య సిరి, ఐశ్వర్య, అక్షర, విశిష్ట రాజ్, సూరజ్, అబ్దుల్లా, అఖిల్, రిషి, స్వరూప్ సింగ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ.. విద్యార్థి దశ నుంచే మంచి క్రమ శిక్షణ అలవర్చుకుంటేనే నిజ జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్క ృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి భాస్కర్, ఎంఈఓ అంజాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ వడ్ల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ ఉమారాణి, నాయకులు బాలాగౌడ్, నర్సింహులు, ఎర్త్ ఫౌండేషన్, ప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అల్లుకున్న ‘నిర్లక్ష్యం
సంగారెడ్డిలో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. కరెంట్ స్తంభాలకు మొక్కలు తీగలా అల్లుకున్నాయి. ఇలాగే వదిలేస్తే మొక్కలు తినడానికి వచ్చిన పశువులు విద్యుత్ తగిలి చనిపోయే అవకాశం ఉంది. మనుషులు సైతం అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాల బారిన పడుతారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పిచ్చి మొక్కలు తొలగించి, స్తంభాలకు ఉన్న అల్లికలు, తీగలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
పిల్లలను బడిలో చేర్పించాలి
హుస్నాబాద్రూరల్/ మద్దూరు(హుస్నాబాద్): పిల్లలను మన ఊరు బడిలోనే చేర్పించి నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులతో కలిసి పని చేయించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పొట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మద్దూరు మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామస్తుల సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని, పిల్లల సంఖ్యను కూడ పెంచడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనీల, హెచ్ఎంలు స్వరూప, వాసుదేవారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మద్దూరు కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్శర్మ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుంటిపల్లి కనకమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, ఉపాధ్యాయులు సరళ, అనురాధ, శిరీష, వెంకట్రాజు, బాల్ రాజు, రవితేజ పాల్గొన్నారు.– డీఈఓ శ్రీనివాస్రెడ్డి -
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
దుబ్బాకరూరల్: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని చీకోడ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజ్ కథనం మేరకు.. తౌడ ఏగొండ, భూదవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాబు(25) గ్రామ శివారులో ఉన్న చెరువులోకి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ చెరువులోకి చాలా దూరం వెళ్లి నీటిలో మునిగి పోయాడు. గమనించిన స్నేహితులు చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఏగొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చేతికొచ్చిన కొడుకు చెరువులో మునిగి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మద్యం మత్తులో వెళ్లి.. కొమురవెల్లి(సిద్దిపేట): మద్యం మత్తులో ఈత కొట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్ఐ రాజు కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి కనకయ్య(50) కుటుబంతో కలిసి హైదరాబాద్లో పాత ఇసుప సామగ్రి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పెద్ద కుమారుడుకి కొడుకు పుట్టడంతో బారసాల నిర్వహించేందుకు గ్రామానికి వచ్చారు. ఆదివారం బారసాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మంగళవారం కుటుంబంతో కలిసి మద్యం సేవించారు. మధ్యాహ్న సమయంలో స్నానం చేసేందుకు గ్రామ శివారులో గల పెద్ద బావి వద్దకు వెళ్లాడు. నీటికిలోకి దూకిన కనకయ్య ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుమారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దుబ్బాకలో యువకుడు, కొమురవెల్లిలో వ్యక్తి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం -
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హుస్నాబాద్రూరల్: జిల్లెలగడ్డ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన సాయి ప్రకాశ్ (29) చేయూత స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. చిన్నమ్మ ఓ కానిస్టేబుల్తో అక్రమ సంబంధంను గుర్తించిన సాయి ప్రకాశ్ కానిస్టేబుల్పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఆరు నెలల తర్వాత విధుల్లో చేరిన కానిస్టేబుల్ ప్రియురాలితో కలిసి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న సాయి ప్రకాశ్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానిస్టేబుల్ ఓ సుఫారీ గ్యాంగ్ను మాట్లాడి సాయిని హత్య చేసే పనిని అప్పగించాడు. 15న వెంకటాపూర్ నుంచి సాయి ప్రకాశ్ కారులో బంధువులను హన్మకొండ హాస్పిటల్కు తీసుకొచ్చాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో ప్రకాశ్ కారును రెండు ఆటోల్లో సుఫారీ గ్యాంగ్ వెంబడించింది. ములుగు రోడ్డులో కిడ్నాప్ చేసి కారులో హసనుపర్తి వద్దనే హత్య చేశారు. సాయి కారులోనే హన్మకొండ జిల్లా సరిహద్దు దాటి హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో రాత్రి ఒక వ్యవసాయ బావిలో మృతదేహం పడేసి వెళ్లిపోయారు. 17న సాయంత్రం రైతు తన బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి హుస్నాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జిల్లెలగడ్డలోని ఇటుక బట్టీల దగ్గర సీసీ కెమెరాలో ఫుటేజీను పరిశీలించారు. రాత్రి కారు వచ్చి వెళ్లిన దృశ్యాల ఆధారంతో పోలీసులు కేసును ఛేదించారు. కిడ్నాపు చేసి హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ను హన్మకొండ పోలీసులు అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ పోలీసులు పేర్కొన్నారు. యువకుడి దారుణ హత్య మృతుడు ములుగు జిల్లా వాసి వరంగల్లో కిడ్నాప్ చేసి జిల్లెలగడ్డలో బావిలో పడేసిన వైనం గుర్తు తెలియని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు -
బిడ్డ చదువు కోసం ఆరాటం
విజయ ఒక్కగానొక్క కూతురు సాత్విక.. ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. కట్టుకున్న భర్త దూరం అయ్యాక.. బిడ్డ భవిష్యత్ కోసం ఆమె పడుతున్న తపన వర్ణనాతీతం. ఎన్ని కష్టాలు వచ్చినా సాత్విక చదువుకు ఆటంకం రాకుండా ఉన్నదాంట్లో సర్దుకుపోతుంది. భర్త బతికి ఉన్నప్పుడు రెండో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదివించింది. భర్త దూరం అయ్యాక ప్రైవేటు విద్య ఆర్థికంగా ఇబ్బంది కావడంతో రెండేళ్లు ఆకారం ప్రభుత్వ పాఠశాలలో చేర్చింది. తిరిగి సిద్దిపేటకు బతుకు దెరువు కోసం వచ్చి పిండి గిర్ని నడుపుతూ బతుకును వెళ్లదీస్తుంది. మొదట్లో చదివిన స్కూల్లో సాత్వికను చేర్పించి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారం, చేయూతతో కూతురు చదువుకు ఆటంకం లేకుండా చదువు సాఫీగా సాగుతుంది.. -
పిడుగుపాటుకు గేదెలు మృతి
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన రైతు కోర్పతి కృష్ణ రెండు గేదెలు మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. దీంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు వాపోయాడు. వ్యవసాయానికి పాడి సంపద ఉపాధిగా ఉండేదని పిడుగుపాటుతో వాటిని కోల్పోవడం వల్ల విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ధర్మారంలో మరో గేదె మిరుదొడ్డి(దుబ్బాక): పిడుగు పాటుకు పాడి గేదె మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ధర్మారంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గూళ్ల బాగులు రోజు మాదిరిగానే పాడి గేదెను వ్యవసాయ పొలం వద్ద కట్టి వేశాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడటంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. పాడి గేదె మృతితో సుమారు రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
మహానందిలో మల్లుపల్లి వాసి ఆత్మహత్య
మిరుదొడ్డి(దుబ్బాక): మిత్రులతో కలిసి సరదాగా విహార యాత్రకని వెళ్లిన యువకుడు అక్కడ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల చిన్న బోయ రాజు (36) కేబుల్ టీవీ ఆపరేటర్గా పని చేస్తూ భార్య సుమలతతోపాటు, ఆరేళ్లలోపు కుమారుడు, కూతురిని పోషించుకుంటున్నాడు. 17న ఉమ్మడి మండల పరిధిలోని 14 మంది కేబుల్ ఆపరేటర్లందరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్లోని నంద్యాల జిల్లా మహానందిలో మంగళవారం సాయంత్రం దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం టెంపుల్కు సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్కు రాజు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.విహారయాత్రకు వెళ్లి ఉరేసుకున్న యువకుడు -
విజయ తీరం వైపు..
కష్టాల కడలిలో...కూతురు చదువు కోసం ఓ తల్లి ఆరాటంఏడడుగులు తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన పతిని విధి దూరం చేసింది. ఇంటి పెద్ద లేకపోవడంతో బాధ్యతలు భుజాన పడ్డాయి. పండుగొస్తే రెండు పూటలా భోజనం.. సాధారణ రోజుల్లో ఒక్క పూట తిండి గగనం.. మరోవైపు ఎదుగుతున్న ఆడపిల్లను చదివించడం ఒక పోరాటం.. ఆర్థిక పరిస్థితి బాగాలేక, అటు కన్నవారు, ఇటు కట్టుకున్న వారు ఆర్థికంగా లేక జానెడు పొట్ట కోసం బతుకు పోరాటం చేస్తున్న విజయ కష్టాల కడలిలో తీరం వైపు కదులుతుంది.. మనసున్న మహారాజులు చేయూత ఇస్తే నా కూతురు చదువుకు సాయం చేసిన వారు అవుతారని కోరారు. – సిద్దిపేటజోన్ పెద్దపల్లి జిల్లాకు చెందిన విజయకు సిద్దిపేట జిల్లా ఆకారానికి చెందిన నాగరాజుతో 2011లో వివాహం జరిగింది. ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండటంతో నాగరాజు 10 ఏళ్ల క్రితం సిద్దిపేట పట్టణానికి బతుకు దెరువు కోసం వలసొచ్చాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీలో చిరు ఉద్యోగం సంపాదించి భార్య బిడ్డను పోషిస్తున్నాడు. సజావుగా సాగుతున్న వీరి జీవితం పై విధి పగ పట్టింది. 2020లో కరోనా వ్యాప్తి ప్రబలుతున్న సమయంలో బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. అక్కడి నుంచి విజయ కష్టాలు మొదలయ్యాయి కట్టుకున్న భర్త దూరం కావడంతో సిద్దిపేటలో జీవనం కష్టతరంగా మారడంతో మెట్టినిల్లు ఆకారం గ్రామానికి తిరిగి వెళ్లింది. రెండేళ్ల తర్వాత మళ్లీ సిద్దిపేటకు బతుకు దెరువు కోసం వచ్చింది. చదువు అంతంతే ఉండటంతో విజయకు ఉపాధి అవకాశాలు లభించలేదు. పట్టణంలోని పలు చోట్ల కిరాయి ఇంట్లో ఉంటూ కూతురిని చదివిస్తూ బతుకు పోరాటం చేస్తుంది. మోటివేషన్లో కంటతడి ఇటీవల వేలాది మంది విద్యార్థులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు.. పిల్లల బాధ్యత గురించి మోటివేషన్ ప్రక్రియ నిర్వహించారు. వారి మోటివేషన్ విన్న సాత్విక తల్లీ విజయ తన కోసం పడుతున్న తపన గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టింది. ఇదే సభలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఒక్కసారిగా కంటతడి పెట్టిన వైనం వైరల్గా మారిన విషయం తెలిసిందే. బాగా చదువుకోవాలి అమ్మ నా చదువు కోసం పడుతున్న కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. అమ్మ కష్టాలు శాశ్వతంగా తీరాలి అంటే నేను బాగా చదువుకోవాలి. పెద్ద అయ్యాక ప్రొఫెసర్ అవుతా.. కానీ ఇప్పుడు చదివేందుకు మా అమ్మ వద్ద డబ్బులు లేవు అంటూ అమాయకంగా తమ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పింది సాత్విక.పిండి గిర్ని పడుతున్న విజయ ఒంటరిగా బతుకు పోరాటం ఒడిదుడుకుల జీవితం.. తీరని దుఃఖం ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు సిద్దిపేట జిల్లా ఆకారానికి చెందిన విజయ కన్నీటి గాథ పిండి గిర్ని జీవనాధారంగా.. స్థానికంగా ఎన్టీఆర్ నగర్ కాలనీలో రెండు గదుల కిరాయి ఇంట్లో ఉంటున్న విజయ జీవనాధారం పిండి గిర్ని మాత్రమే.. చిన్నపాటి రేకుల షెడ్లో గిర్ని పెట్టుకొని బతుకు దెరువు సాగిస్తోంది. సమీపంలో ఉన్న వారు తెచ్చిన వాటిని పిండిగా మార్చి వారిచ్చే కొద్దిపాటి డబ్బులతో బతుకు బండిని నడిపిస్తుంది. నెలవారీ ఖర్చు అధికంగా ఉండడం.. పిండి గిర్ని ద్వారా వచ్చే ఆదాయం అంతంతే కావడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక నిత్యం జీవితంతో పోరాటం చేస్తోంది.కూతురు కోసమే.. భర్త దూరం అయ్యాడు... పుట్టినిల్లు. మెట్టినల్లు వారు ఆర్థికంగా లేరు. ఒక్కగానొక్క కూతురు చదువు కోసం కష్టపడాలి. తప్పదు. గిర్ని మీద వచ్చేది అంతంత మాత్రమే. రెక్కాడితే కానీ ఇల్లు, పిల్ల చదువు నడిచే పరిస్థితి. సాత్విక చాలా చురుకుగా ఉంటుంది చదువులో రాణిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. – బోయ విజయ -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొల్చారం(నర్సాపూర్):ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులో రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందితో ఆరా తీశారు. వై ద్యం కోసం వచ్చిన రోగులను పలకరించి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో రోగులకు అసౌకర్యం కలిగించొద్దని సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి అంశాన్ పల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ సెంటర్ను సందర్శించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, నర్సాపూర్ డివిజన్ వైద్యాధికారి సజన, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్, ఎంపీహెచ్ఓ మదన్ మోహన్, సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ కొల్చారం పీహెచ్సీ తనిఖీ -
కాలుష్యం
కమ్మేస్తున్న కాలుష్యం నుంచి కాపాడండి పరిశ్రమల నుంచి నిరంతరం వెలువడుతున్న వాయు కాలుష్యంతో జీవన పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆందోళన పడుతున్నాం. పిల్లలు మహిళలు ఘాటైన వాసనలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. మా ప్రాణాలను రక్షించండి. – ఇమ్రాన్, బొల్లారం కాంగ్రెస్ నాయకులు పీసీబీ అధికారుల చర్యలు శూన్యం సా్థనికంగా వెలువడుతున్న విష వాయువులు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేరు. సమస్య తీవ్రతరంగా మారుతున్న నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మద్దూరి పెంటేశ్, బీఆర్ఎస్ నాయకులుజిన్నారం (పటాన్చెరు): వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకరంగా మారుతోంది. బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమలు విచ్చలవిడిగా విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే జల కాలుష్యం పెద్ద ఎత్తున ఉండగా దానికి తోడు వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకునే అవకాశాలను సైతం విష వాయువులను విడుదల చేస్తూ హరించేస్తున్నారు. సామాన్య ప్రజల జీవన విధానం పైనే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం రసాయన పరిశ్రమలు విగాధం కలిగిస్తున్నాయి. రసాయన విష వాయువులు గాలిలోకి.. పారిశ్రామిక వాడకు చెందిన పలు పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరిశ్రమల పొగ గొట్టాల ద్వారా పెద్ద ఎత్తున రసాయన విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వాయువులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను కలుషితం చేస్తూ సామాన్య ప్రజలను ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేసిన పీసీబీ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఫిర్యాదులను పెడచెవిన పెట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు విషవాయువులు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు వృద్దుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక విషవాయువులు కళ్లలో మంటలు పుట్టిస్తూ, ముక్కుపుట్టలు అదిరేలా చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమలను గుర్తించి విషవాయువులను నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పారిశ్రామిక వాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా బొల్లారంపారిశ్రామిక వాడ విచ్చలవిడిగా వాతావరణంలోకివిష వాయువులు ఘాటైన వాసనలతో జనాల్లోఅనారోగ్య సమస్యలు పట్టించుకోని పీసీబీ యంత్రాంగం -
సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి
కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రం కొల్చారంలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యను ప్రజలు, యువత సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం గ్రామంలో వివాదాస్పదంగా మారిన అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలంను వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్ను, శివాజీ మహారాజ్ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొదట పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేయాలనడం సబబు కాదన్నారు. ముందస్తుగానే గ్రామస్తులు ఈ విషయమై చర్చించుకోవాల్సి ఉండేదన్నారు. విగ్రహం ఎదుట మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఇబ్బంది కలిగించడమేనని పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్ ఈ విషయంలో గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ గౌస్,దళిత సంఘాల నాయకులు ఉన్నారు. ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య కొల్చారంలో విగ్రహ ఏర్పాట్ల స్థల పరిశీలన -
రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి
హవేళిఘణాపూర్(మెదక్): చరిత్రలో నిలిచిపోయే విధంగా హవేళిఘణాపూర్ విద్యార్థులు పుస్తక రచన చేయడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు రచించిన ‘అమృత గుళికలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సృజనాత్మకత కలిగిన విద్యార్థులు భవిష్యత్లో ఏ రంగంలో ఉన్న సమాజ సేవ చేస్తారన్నారు. పుస్తకాలు చదవాల్సిన సమయంలో విజ్ఞానం పొంది పుస్తక రచనలు చేయడం సంతోషమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ స్వాతి, ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్యామల, రవీందర్, మహేశ్వరచారీ, అశోక్, ఎల్లమ్మ, రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డీఈఓ రాధాకిషన్ -
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్రికార్డులో సిద్దిపేట చిన్నోడు
మద్దూరు(హుస్నాబాద్): ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో సిద్దిపేట జిల్లా దూల్మి ట్ట మండలం హనుమ తండాకు చెందిన అంతర్జాతీయ పర్వతారోహకుడు జాటోత్ విహాన్రామ్కు చోటు దక్కింది. ఈ విషయం తండ్రి తిరుపతినాయక్ తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఈ మేరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును జాటోత్ విహాన్రామ్ అందుకున్నట్లు తిరుపతి తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, హిమాచల్ ప్రదేశ్లోని పాతాల్ పర్వతాన్ని అధిరోహించినందుకు గాను అందించినట్లు తెలిపారు. తన కుమారుడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన కోచ్ లెంకల మహిపాల్కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విహాన్ మంచిర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వారెవ్వా .. వైష్ణవి ● అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్లో దామరకుంట విద్యార్థిని మర్కూక్(గజ్వేల్): అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్ వారు నిర్వహించిన పోటీల్లో మర్కూక్ మండలం దామరకుంట విద్యార్థిని లింగ వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. దామరకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి ఆదివారం పంజాబ్లో నిర్వహించిన పోటీల్లో వైష్ణవి పాల్గొని భౌతిక రసాయన శాస్త్రంలో అత్యంత వేగంగా నిమిషం 59 సెంకడ్లలో ఆవర్తన పట్టిక క్రమ రూపం ఏర్పాటు చేసి బుక్ ఆఫ్ అవార్డ్స్లో స్థానం దక్కించుకుంది. సోమవారం ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ సీఈఓ పంకజ్ వేగ్ చేతుల మీదుగా ట్రోఫీ, బహుమతిని అందుకుందని మండల విధ్యాధికారి వెంకట్ రాములు తెలిపారు. వెంకట్రాములు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి పెద్దశంకరంపేట(మెదక్): సనాతన ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత అని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతిస్వామి, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు డాక్టర్ సీఎస్. రంగరాజన్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయ ఉత్సవాల్లో వారు పాల్గొని భక్తులకు ప్రవచనాలందించారు. ఆలయ నిర్మాణంలో ప్రతీ ఇంటి నుంచి కులమతాలకు అతీతంగా భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. గుర్తు తెలియని మహిళ మృతి జహీరాబాద్: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ (45) మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని వికారాబాద్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వివరించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సెల్ 84669 38351ను సంప్రదించాలని సూచించారు. కులం పేరుతో దూషణ ● ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు మద్దూరు(హుస్నాబాద్) : కులం పేరుతో దూషించి వ్యక్తిపై దాడి చేసిన వారిపై సోమవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ఖాతా గ్రామానికి చెందిన సోలిపురం బాబు శనివారం మిత్రులు సురేశ్, రాజుతో కలిసి ధూల్మిట్టలో వ్యవసాయ పనులకు కూలీ పనికి వెళ్లారు. తిరిగి వస్తూ బాబు, సురేశ్ వైన్స్ వద్ద గల పర్మిట్ రూంలో మద్యం తాగుతుండగా మహిపాల్రెడ్డి కులం పేరుతో బాబును దూషించాడు. కర్రతో దాడి చేయగా తలకు గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో కత్తితోపొడుచుకున్న వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన మండల పరిధి బోజ్య తండాలో చోటు చేసుకుంది. తండా వాసుల కథనం మేరకు.. తండాకు చెందిన గగూలోత్ విఠల్ మద్యం మత్తులో సోమవారం తండాలో జరిగిన తమ్ముడి కూతురు పెళ్లిలో హల్చల్ చేశాడు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులతో గొడవ పడి కత్తితో పొడుచుకున్నాడు. పేగులు బయటకు వచ్చి రక్తస్రావం అవుతున్నప్పటికీ గొడవ చేస్తూనే ఉన్నాడు. తండా వాసులు కత్తిని లాగేసుకొని చికిత్స నిమిత్తం పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
గొయ్యిని పరిశీలించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకొని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి, నాయకులు అశోక్రెడ్డి గొయ్యిని పరిశీలించారు. ఆలయం ఆవరణలో అపారమైన నిధి ఉందని చైర్మన్ హన్మాండ్లు చెప్పేవారని కొందరు ఎమ్మెల్యేకు వివరించారు. కొత్త ఆలయ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఘటన జరగడం, పరిస్థితులను బట్టి గుప్తనిధుల కోసమే తవ్వినట్లు ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. త్వరగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. తవ్వకాల విషయంలో కేసు నమోదు చేసి సమగ్రవిచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు.విశ్వనాథస్వామి ఆలయఆవరణలో భారీ గొయ్యి ● చైర్మన్పై భక్తుల ఆగ్రహం ● ఎమ్మెల్యే, పోలీసుల పరిశీలన ● పోలీసుల అదుపులో చైర్మన్నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని విశిష్ట చరిత్రగల ప్రాచీన కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఆవరణలో గొయ్యి తవ్వకం కలకలం సృష్టించింది. గుప్త నిధుల కోసమేనని భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీ విశ్వనాథస్వామి ఆలయ ముఖద్వారం ఎదుట ఉన్న మండపానికి ఆనుకొని దాదాపు ఐదు అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యిని తవ్వారు. దానిపై పాత గేటు గ్రిల్ వేసి, గొయ్యి కనిపించకుండా ఉండేందుకు గడ్డి, చెట్ల పొదలతో కప్పి ఉన్న విషయాన్ని సోమవారం ఆలయానికి వచ్చిన భక్తులు గుర్తించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మాండ్లును పిలిపించగా పూజకు వాడిన పూలను వేసేందుకు ఆదివారం తానే అడ్డా కూలీలతో తవ్వించినట్లు తెలపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయంలో అధికారుల అనుమతి లేకుండా, కమిటీలోని ఇతర బాధ్యులకు తెలపకుండా ఎలా తవ్వించారని భక్తులు ప్రశ్నించారు. పూలను వేసేందుకై తే అంత పెద్ద గొయ్యి, అదీ మండపానికి ఆనుకొని దాని పునాదులు కూలే అవకాశం ఉండేలా తవ్వించడం.. పైగా కనపడకుండా పైన గ్రిల్పెట్టి పొదలతో కప్పిఉంచడంలో ఆంతర్యం ఏంటని భక్తులు నిలదీశారు. ఇద్దరు కూలీలతో తవ్వించినట్లు చెబుతుండగా నలుగురితోపాటు ఓ బాబా సైతం ఉన్నట్లు అక్కడున్న వారు చెప్పడంతో గుప్త నిధుల కోసమే తవ్వించారని భక్తులు ఆరోపించారు. విషయం తెలుసుకొని ఎస్సై–2 మెగులయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. విచారణ నిమిత్తం చైర్మన్ హన్మాండ్లును స్టేషన్కు తరలించారు. -
మొక్కజొన్న సాగుపై ఆరా
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని హరిదాసుపూర్లో సోమవారం సౌదీ అరేబియా రైతులు పర్యటించారు. గ్రామంలోని రైతులను కలిసి జొన్న పంట సాగు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరాల్లో జొన్న సాగుచేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్ జొన్న పంటకు డిమాండ్ ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు. జొన్న సాగు చేయడానికి ఒక ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి వస్తుందని, ఒక ఎకరాలో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు వివరించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. నీటి సాంద్రత తక్కువ ఉన్న ప్రాంతంలో ఎలాంటి పంటలను సాగు చేయాలనే పరిశోధనతో క్షేత్ర స్థాయిలో సాగు వివరాలను తెలుసుకునేందుకు సౌదీ అరేబియా రైతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, ఏడీఏ వెంకట లక్ష్మీ, మండల వ్యవసాయాధికారి గణేశ్, ప్రతిభ, ఏఈఓ రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.హరిదాసుపూర్లో సౌదీ అరేబియా రైతులు -
ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరువు మండలం ఇస్నాపూర్లో నివాసముంటున్న వీ. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నాడు. వెంకట్రావు సోమవారం భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు మొత్తం అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొనిల దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై అపోహలు నమ్మొద్దు
ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి ఎడ్యుకేషన్: వక్ఫ్ సవరణ చట్టంపై పేద ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12,892 ఎకరాలు వక్ఫ్ భూములుగా నమోదు చేయడం వల్ల వేల మంది రైతులు హక్కులు కోల్పోయారని వాపోయారు. కొండాపూర్ మండలం సైదాపూర్లో 197 ఎకరాలు వక్ఫ్ జాబితాలో చేరడం వల్ల సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో పెద్ద ఎత్తున భూములు వక్ఫ్ జాబితాలో చేరాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాతబస్తీ వక్ఫ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వివరాలు ఇవ్వాలనీ, ముతావలీలు ఎవరి పేర్లపై లీజులకు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘పట్టణాల్లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురవుతున్నా, అసలు లబ్ధిదారులైన పేద ముస్లింలకు ఉపయోగం లేకుండా పోతోందని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు. రైతులు, ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేశ్వర్ రావు దేశ్ పాండేతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం
జిన్నారం (పటాన్చెరు): మద్యం సేవించి భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బొల్లా రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జీఎంఆర్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దండుగుల కురుమయ్య (39) కుటుంబం బతుకు దెరువు కోసం వచ్చి ఖాజీపల్లి జీఎంఆర్ కాలనీలో స్థిరపడ్డారు. ఆదివారం కురుమయ్య మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్య ఎల్లమ్మతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. క్షణికావేశంలో గ్రామ శివారులోని అడవి మైసమ్మ గుడి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో వ్యక్తి.. రామాయంపేట(మెదక్): పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం మండలంలోని అక్కన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హవేళీఘనపూర్ మండలం ముద్దుల్వాయి గ్రామానికి చెందిన తంత్రి సిద్ధరాములు (55) ఓ కోళ్ల ఫారమ్లో పని చేస్తున్నాడు. అప్పుల బాధతో ఫారమ్లోనే రసాయనిక మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి పాపన్నపేట(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రావుగారి ఆంజనేయులు (38) హైదరాబాద్లో మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా ఇబ్బందుల పాలవుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో 19న జరిగిన విందుకు హాజరయ్యాడు. క్రిమి సంహారక మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి వెళ్లాడు. చికిత్స నిమిత్తం మెదక్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో.. వెల్దుర్తి(తూప్రాన్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన మండలంలోని మానెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చౌదరిపేట రాగిరి(50) పొలం వద్ద ఇటీవల బోరు వేయగా ఫెయిల్ అయ్యింది. వ్యవసాయానికి కొంత అప్పు చేశాడు. పంట సైతం ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. అప్పులు ఎలా తీర్చాలోనని మదనపడుతూ 17న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో పంట దగ్ధం
కంగ్టి(నారాయణఖేడ్): విద్యుదాఘాతంతో మొక్కజొన్న కంకులు బుగ్గిపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సయ్యద్ అనే రైతు పట్టా భూమిలో ఒక ఎకరం మొక్కజొన్న పంట కాలిపోయింది. విద్యుత్ తీగలతో మంటలు చెలరేగి ఉంటాయని రైతు అనుమానం వ్యక్తం చేశారు. మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.80 వేల విలువ చేసే పంట కాలిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు. పిడుగుపాటుకుఇల్లు ధ్వంసం ములుగు(గజ్వేల్): పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసమై మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు మండలం బస్వాపూర్లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కురుమ వసంత రామాంజనేయులు దంపతులు నివాసముంటున్న ఇంటిపై ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడటంతో రేకులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో వసంతకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. -
పింఛన్ ఇక సులభతరం
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వివిధ కేటగిరిలలో పింఛన్ పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ముఖ గుర్తింపు హాజరు పెన్షన్ మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీంతో పింఛన్లు పారదర్శకంగా పంపిణీతో పాటు వృద్ధులకు ఇబ్బందులు తొలగనున్నాయి. జిల్లాలో 1,55,837 పింఛన్దారులు జిల్లాలో వివిధ కేటగిరిలలో 1,55,837 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. దివ్యాంగులు, వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడి, కల్లుగీత కార్మికులు, డయాలసిస్తో పాటు తదితరులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వితంతువులు, వృద్ధులు ఉన్నారు. దివ్యాంగులకు రూ.4016, ఇతరులకు రూ.2016లను అందిస్తున్నారు. ప్రతి నెలా రూ.36,15,19,230లు పింఛన్ డబ్బులు తీసుకుంటున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చెల్లింపులు ప్రస్తుతం చేయూత ద్వారా అందించే పింఛన్ డబ్బులు బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే డ్రా చేసుకునే సమయంలో వృద్ధులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు రాకపోవటంతో సకాలంలో డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. వేలిముద్రలు రాని వారికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి డబ్బులు డ్రా చేసి అందిస్తున్నారు. అధికారులు అందుబాటులో లేని సమయంలో పింఛన్ డబ్బుల కొరకు తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ గుర్తింపు హాజరు అమలుకు కసరత్తు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అన్ని రంగాల్లో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు సులభతరంగా పెన్షన్ అందించేందుకు ఫేస్ రికగ్నిషన్ ద్వారా పంపిణీ చేసేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో కసరత్తు చేస్తుంది. ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్ దారుడి ముఖాన్ని నిర్ధారణ చేసి పంపిణీ చేయనుంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ విధానం అమలులోకి రానుంది.ముఖ గుర్తింపు హాజరు అమలుకు కసరత్తు వృద్ధులకు తొలగనున్న ఇబ్బందులు త్వరలో అమలు కానున్న విధానంఅక్రమాలకు తావు లేకుండా.. నూతన విధానం అమలుతో వృద్ధులకు వేలిముద్రల సమస్యతో పాటు అక్రమాలకు తావు లేకుండా పంపిణీ చేయనుంది. బ్యాంకులలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయటం ద్వారా వివిధ మార్గాల ద్వారా తీసుకుంటున్నారు. పింఛన్దారుడు మృతి చెందిన సమయంలో సమాచారం అందించకపోవటంతో నెలల తరబడి ఖాతాల్లో జమ అయ్యి వారి కుటుంబ సభ్యులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.జిల్లాలో పింఛన్ల వివరాలు దివ్యాంగులు 14,465 వృద్ధులు 59,083 వితంతువులు 70,673 చేనేత కార్మికులు 683 కల్లుగీత కార్మికులు 813 ఒంటరి మహిళలు 7,475 బీడి కార్మికులు 112 ఇతరులు 2,533 -
అగ్నిమాపక సేవా వారోత్సవాలు
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ యూనిట్లో సోమవారం సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో జాతీయ అగ్నిమాపక సేవా వారోత్సవల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీఎం విజయ సాగర్, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మంజీత్ కుమార్, ఎస్డీజీజిఎం అరవింద్ కుమార్, ఇన్స్పెక్టర్ బి.ఎస్.భండారి పాల్గొన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. -
రేపు జిల్లాకు సీఎం రాక
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు తూర్పు జయారెడ్డి (కూచమ్మ), గుణచైతన్యరెడ్డిల నిశ్చితార్థం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని జగ్గారెడ్డి నివాసం వద్ద జరగనుంది. ఈ కార్యక్రమానికి రేవంత్రెడ్డి హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అదేరోజు ఆయన ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి హజరు కానున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఈ నిశ్చితార్థనికి హజరు కానున్నారు. అయితే రేవంత్రెడ్డి పర్యటన మంగళవారం అధికారికంగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలించిన ఎస్పీ సీఎంతో పాటు, పలువురు మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎస్పీ పరితోష్పంకజ్ సోమవారం జగ్గారెడ్డి నివాస ప్రాంతాన్ని పరిశీలించారు. డీఎస్పీ సత్తయ్యగౌడ్, ఇతర పోలీసు అధికారులు కలిసి ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.జగ్గారెడ్డి కూతురు నిశ్చితార్థానికి హజరుకానున్న రేవంత్ -
భూ సమస్యలకు పరిష్కారం
జహీరాబాద్/రాయికోడ్(అందోల్): భూ సమస్యలకు భూభారతితో సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. సోమవారం జహీరాబాద్, మొగుడంపల్లి, అలాగే.. రాయికోడ్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు. భూ సమస్యలు కలిగి ఉన్న రైతులు పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తామన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉందన్నారు. భూ భారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భారతిలో కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం ఈ చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రతి భూ కమతానికి భూదాన్ నంబరు కేటాయించనున్నట్లు తెలిపారు. భూ సరిహద్దు గొడవలు, ఫిర్యాదులు భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించుకునే అవకాశం కలిగిందన్నారు. నూతన చట్టం ద్వారా ఇకపై ఫౌతి నెల రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ రాంరెడ్డి, ఏడీఏ భిక్షపతి, ఏఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు.పారదర్శకంగా భూభారతి నిర్ధిష్ట గడువులోగా మ్యుటేషన్ అవగాహన సదస్సులో కలెక్టర్ క్రాంతి అర్హులనే ఎంపిక చేయాలి రాయికోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. నిరుపేదలు, వితంతువులు, భూమిలేని వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాయికోడ్లో జరిగిన సదస్సులో గ్రంథాలయాల సంస్థల చైర్మన్ అంజయ్య, మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్, ఏఎంసీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సిద్దప్ప పాటిల్, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ షరీఫ్ తదితరలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సభకు తరలిరండి
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి పిలుపు మునిపల్లి(అందోల్): ఈ నెల 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే రజోత్సవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆవిష్కరించారు. సోమవారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ సభకు పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి ఒకరు చొప్పున రావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, నాయకులు చీలపల్లి రాంచంధర్రావు, బుదేరా మల్లేశం, పిల్లోడి ప్రభు, బుదేరా విజయభాస్కర్ పాల్గొన్నారు. -
ఏఐతో కలుపుతీసే రోబో
ఆవిష్కరించిన గీతం విద్యార్థులుపటాన్చెరు: ఆధునిక వ్యవసాయాన్ని మరింత విప్లవాత్మకంగా మార్చడానికి విద్యార్థులు తమ మేధకు పదునుపెడుతున్నారు. గీతంలో చదువుతున్న బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థిని సి.అమూల్య నేతృత్వంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో కలుపుతీసే రోబోకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా సోమవారం అమూల్య రోబో గురించి వివరించారు. ఆధునిక సాంకేతికత సహాయంతో అది కలుపు మొక్కలను గుర్తించి తొలగిస్తుందని చెప్పారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా అమూల్య, ఆమె బృందాన్ని అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, టెక్నాలజీ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి ప్రశంసించారు. -
ప్రజాభిమానం మరవలేను
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి: ప్రజల అభిమానం ఎన్నటికీ మర్చిపోలేనని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే తన జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వేతన ఒప్పందం మాతోనే సాధ్యం సీఐటీయూ అధ్యక్షుడు చుక్క రాములు జహీరాబాద్ టౌన్: మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మహీంద్ర కార్మిక సంఘం అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. పట్టణ సమీపంలో గల మహీంద్ర అండ్ మహీంద్ర పరిశ్రమలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహీంద్రలో త్వరలో కార్మిక సంఘం ఎన్నికలు రాబోతున్నాయని, సీఐటీయూను గెలిపించాలని కోరారు. వేతన ఒప్పందం, ఉద్యోగ భద్రత, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బలపరచాలని కోరారు. ఈ నెల 20న దేశవ్యాప్త స్వారత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, జహీరాబాద్ క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్, యూనియన్ నాయ కులు నరేష్ ఉమామహేశ్వరరావు, కిరణ్, బాలరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సన్మానం మునిపల్లి(అందోల్): అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని పై తరగతులకు వెళ్తున్న చిన్నారులకు టీచర్లు మంజుల, శకుంతల సన్మానించారు. సోమవారం మండలంలోని పెద్దగోపులారంలో ఆంగన్వాడీ కేంద్రంలో వార్షికోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్రావు, ఉపాధ్యాయ బృందం, సూపర్ వైజర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. బడిబాట కరపత్రం ఆవిష్కరణకల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ నాగరం శ్రీనివాస్ సోమవారం బడిబాట కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మారుతి, టీచర్లు శ్రీకాంత్, భాస్కర్, సీఆర్పీ శివకుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు తుకారాం, రాంకిషన్, సాయిలు, మాశ్నప్ప ఉన్నారు. బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు మునిపల్లి(అందోల్): బేతాళ స్వామికి మాజీ ఎంపీపీ రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని మేళసంగ్యం, మగ్దుంపల్లి, కంకోల్ శివారులో బేతాళ స్వామి జాతర మహోత్సవంం ఘనంగా నిర్వహించారు. మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ రాంరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులకు మగ్దుంపల్లి కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి సన్మానించారు. -
సోలార్ కుంటలు
వన్యప్రాణుల దాహార్తికి సౌరశక్తితో నీటి సరఫరా ● చెక్ డ్యామ్లు, కుంటల్లో నీరు అడుగంటడంతో ప్రత్యామ్నాయ చర్యలు ● నీరు లేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్న జంతువులు ● శనిగరం, మీర్జాపూర్, గురువన్నపేట ఫారెస్టులో ఏర్పాటుకు ప్రతిపాదనలు ● హుస్నాబాద్ ఫారెస్టు పరిధిలో7 మండలాలు 4వేల హెక్టార్లు నీరు తాగుతున్న దుప్పిలు నీటి సరఫరాకు ట్యాంకర్లు ఇవ్వాలి వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో అడవిలో నీటి లభ్యత తగ్గిపోతోంది. మేము నిర్మించే సాసర్ పిట్లకు నీటి సరఫరా కోసం సమీపంలోని గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. శనిగరం, మీర్జాపూర్, గురువన్నపేట అటవీ ప్రాంతంలో సౌరశక్తి పంపుల ద్వారా నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.నిధులు మంజూరైతే అడవిలో నిరంతరం జంతువులకు నీరు దొరుకుతుంది. అడవిలో పలు రకాల జంతువులు ఉన్నాయి. పులులు ఇప్పటి వరకు ఎక్కడా కెమెరాలకు చిక్కలేదు. – సిద్ధార్థరెడ్డి, ఎఫ్ఆర్ఓ, హుస్నాబాద్హుస్నాబాద్ రూరల్: వేసవిలో అడవిలో నీటి వనరులు లేక దాహం కోసం బయటకు వచ్చిన జంతువులు వేటగాళ్ల ఉచ్చులకు బలై మృత్యువాత పడుతున్నాయి. జింకల మందలు మైదానానికి రావడంతో కుక్కలు తరుమడంతో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అడవి జంతువుల దాహార్తి తీర్చడానికి సోలార్ పంపుల ద్వారా నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వేసవిలో సైతం నీటి కుంటలు నిండుగా ఉంటే జంతువులు అడవి విడిచి బయటకు రావనే ఆలోచనతో అధికారులు సౌరశక్తి కుంటల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. దుబ్బాక ఫారెస్టు పరిధిలో చింతమడక, చీకోడులో సోలార్ కుంటలు నిర్మించి జంతువులకు నీరు అందిస్తున్నారు. హుస్నాబాద్ ఫారెస్టు..హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, ధూలిమిట్ట, చేర్యాల ఏడు మండలాల్లో 4వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అడవిలో జింకలు, కొండ గొర్రెలు, నక్కలు, ఎలుగు బంట్లు, హైనా, నెమళ్లు లాంటి జంతువులు ఉన్నాయి. 2017లో మహ్మదాపూర్ గుట్టల్లో చిరుతపులి దాహం కోసం వ్యవసాయ బావుల వద్దకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి బలైపోయింది. అప్పటి నుంచే జంతువుల దాహార్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 3వేల నుంచి 5వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 19 సాసర్లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. వర్షాకాలం నీటిని నిల్వ చేయడానికి లోతట్టు ప్రాంతంలో 10 చెక్ డ్యామ్లు, 8 కుంటలను నిర్మించారు. హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ అటవీ ప్రాంతంలో మహాసముద్రం, జిల్లెలగడ్డలో గాడిదలలొద్ది చిన్ననీటి జలాశయాలను నిర్మించడంతో జంతువులు బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బాంబుల శబ్దాలకు భయపడి బయటకు.. ఉమ్మాపూర్ అటవీ ప్రాంతంలో మిషన్లతో గుట్టలను తవ్వడం, బండరాళ్లను తొలగించడానికి బాంబులను వినియోగించడం వల్ల పెద్ద పెద్ద శబ్దాలకు జంతువులు భయపడి బయటకు వస్తున్నాయి. అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ ప్రాంతంలో గుట్టల తవ్వకాలను, బాంబు పేలుళ్లను నిషేధించాలని వన్యప్రాణుల సంరక్షణ సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. -
చిరుతపులి దాడిలో లేగదూడ మృతి
నారాయణఖేడ్: లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపింది. ఈ ఘటన ఆదివారం నారాయణఖేడ్ మండలంలో జరిగింది. బాధిత రైతు నారాయణ, గ్రామస్తుల కథనం ప్రకారం.. సంజీవన్రావుపేట్ గ్రామానికి చెందిన రైతు నారాయణ శనివారం రాత్రి గ్రామ శివారులోని తన చేను వద్ద పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా లేగదూడ శరీరం ఛిద్రమై మృతిచెంది ఉంది. గ్రామానికి కొద్దిదూరంలో అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి వచ్చి లేగదూడపై దాడి చేసి ఉండవచ్చని అనుమానించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది సందర్శించి పరిసరాల్లో గుర్తించిన పాదముద్రల ఆధారంగా చిరుతపులి సంచరించినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఖేడ్ అటవీశాఖ రేంజ్ అధికారి అనురాధ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను చేను వద్ద కట్టేయవద్దని సూచించారు. చిరుత ఎవరికై నా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
ఇరు వర్గాల మధ్య విభేదాలు
మిరుదొడ్డిలో పోలీసుల పికెట్ మిరుదొడ్డి(దుబ్బాక): ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఓ వర్గం యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పోలీసుల కథనం ప్రకారం... బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఒక వర్గానికి చెందిన యువకులు శనివారం రాత్రి మిరుదొడ్డి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఇదే గ్రామానికి చెందిన ఓ వర్గానికి చెందిన యువకుడు సోషల్ మీడియాలో కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేశాడు. దీంతో తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా పోస్టు పెట్టిన యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేయడానికి ఒక వర్గం యువకులు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే యువకుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో సదరు యువకుడిపై అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆదివారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ర్యాపిడ్ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ మీడియాను మంచికి వాడకుండా ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
పటాన్చెరు టౌన్ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు శివకుమార్ కథనం ప్రకారం... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ సాయి కాలనీకి చెందిన శివకుమార్ ఈ నెల 18వ తేదీన సదాశివపేట్లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంటి యజమాని శ్రీనివాస్ ఫోన్ చేసి మీ ఇంటి తాళం పగలగొట్టి ఉందని అతడికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చిన అతడు ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గుర్తు తెలియని దండుగులు ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింతకొండపాక(గజ్వేల్): ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న దుద్దెడకు చెందిన పలువురిని అడ్డగించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం సిద్దిపేట నుంచి కొండపాక వైపు బొలెరో వాహనంలో 9 ఆవులు, ఒక లేగను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండగా మురళి అనే వ్యక్తి గమనించి హిందూవాహిని సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలిపారు. దీంతో త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని దుద్దెడ టోల్గేట్ వద్ద వాహనాన్ని అడ్డగించి డ్రైవర్ను విచారించారు. నల్లగొండ సంత నుంచి హైద్రాబాద్లోని మూసాపేట్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని తేలడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం తూప్రాన్: ట్రావెల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం, ప్రయాణికుల కథనం ప్రకారం... పట్టణ సమీపంలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోని హల్దీవాగు వద్ద రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు వస్తున్న విశ్వకర్మ ట్రావెల్స్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. తూప్రాన్ పట్టణ సమీపంలోని హల్దీవాగు వద్దకు చేరుకోగానే బస్సు ముందు చక్రాలు ఊడిపోయి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమేదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్సును ఢీకొట్టిన కారు – పలువురికి స్వల్ప గాయాలు నర్సాపూర్ రూరల్: కారు ముందు టైర్ పేలి అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై రెడ్డిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఇద్దరు భక్తులు ఏడుపాయల వనదుర్గామాతను దర్శనం చేసుకొని కారులో నర్సాపూర్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో రెడ్డిపల్లి సమీపంలో కారు ముందు టైరు పేలి అదుపు తప్పడంతో మెదక్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు, కారులో ఉన్న ఇద్దరు భక్తులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ స్వామి సమన్వయంతో బస్సును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న భక్తుల వివరాలు తెలియ రాలేదు. బస్సు కిందపడి వ్యక్తి మృతి పటాన్చెరు టౌన్ : బస్సు ఎక్కుతున్న క్రమంలో ఓ వ్యక్తి కింద పడగా అతడి కుడి కాలు పై నుంచి బస్సు వెనుక టైర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన జాన్ మొహమ్మద్ (40) బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం వచ్చి పటాన్చెరు డివిజన్ పరిధిలోని కటిక బస్తీలో నివాసం ఉంటూ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సంగారెడ్డిలో ఉన్న లారీని తీసుకువచ్చేందుకు బస్టాండ్లో పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎక్కుతున్న క్రమంలో కింద పడ్డాడు. దీంతో అతడి కుడికాలుపై నుంచి బస్సు వెనుక టైర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స కోసం 108 వాహనంలో పటాన్చెరు, సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారంగానే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య ఫుల్జాహ బేగం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
వేర్వేరు చోట్ల ఇద్దరు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. పెద్ద శంకరంపేట(మెదక్): వరి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద శంకరంపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం... మక్త లక్ష్మాపూర్కు చెందిన నాగధర్ బేతయ్య(50) తాను సాగు చేస్తున్న వరి పంటను అడవి పందుల నుంచి రక్షించేందుకు చుట్టూ విద్యుత్ వైర్లను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగలడంతో రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో కరెంట్ రావట్లేదని చెక్ చేస్తుండగా.. మద్దూరు(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లద్నూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మచ్చ యాదగిరి(48) అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా హైదరాబాద్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో జరిగే బొడ్రాయి పండుగ కోసం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం ఇంట్లో కరెంట్ రాకపోవడంతో విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లి చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
దుబాయిలో చిక్కుకున్న వ్యక్తికి ఆపన్నహస్తం
హుస్నాబాద్: తాను దుబాయిలో చిక్కుకున్నానని రక్షించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య అనే గల్ఫ్ కార్మికుడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ను వేడుకుంటూ ఇటీవల ఓ సెల్ఫీ వీడియో పంపించాడు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం. వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దుబాయిలోని సామాజిక సేవకులు సుతారి సత్యం పటేల్ను సంప్రదించి లింగయ్యకు అవసరమైన సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. విద్యుత్ వైర్లు తగిలి పశుగ్రాసం దగ్ధం శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదభరితంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం పోతులబోగూడ నుంచి ఉసిరికపల్లి వైపునకు గడ్డి లోడ్తో (పశుగ్రాసం) వస్తున్న ట్రాక్టర్కు పాంబండ వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. గుర్తించిన ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి గడ్డి లోడ్కు కట్టిన తాడు తొలగించి ట్రాలీని లేపి గడ్డిని కిందపడేశాడు. దీంతో వెల్దుర్తి– ఉసిరికపల్లి ప్రధాన రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న నర్సాపూర్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పివేసి రాకపోకలను పునరుద్ధరించారు. నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి విద్యుత్ వైర్లు పలు చోట్ల కిందికి ప్రమాదభరితంగా వేలాడుతుండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
గజ్వేల్రూరల్: అంగన్వాడీ కేంద్రానికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని దాచారంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వల్లెపు యాదగిరికి 20 ఏళ్ల క్రితం నర్సమ్మ అనే మహిళతో వివాహం జరుగగా ఆమె మృతి చెందింది. దీంతో ఆరేళ్ల క్రితం కామారెడ్డి ప్రాంతానికి చెందిన శ్రీలతను రెండో వివాహం చేసుకోగా వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 16న ఓ పరిశ్రమలో పనికోసం వెళ్లిన యాదగిరి రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుస్తులు అమ్మడానికి వెళ్లిన యువకుడు రామాయంపేట(మెదక్): దుస్తులు అమ్మడానికి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ బాల్రాజ్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్లోని ఖానాపూర్ జిల్లా అలపూర్ గ్రామానికి చెందిన బాబులు సింగ్ (23) నాలుగేళ్ల క్రితం రామాయంపేటకు వచ్చి దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 18న ఉదయం దుస్తులు అమ్మడానికి బైక్పై బోడ్మట్పల్లి వైపు వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజులుగా అతడి ఆచూకీ లభించకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. అతడి బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. పటాన్చెరు టౌన్: స్కూటీని కారు ఢీకొట్టిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ భూపాల్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం (50), అతడి బంధువు ఎం.డి ఖాజా ఇరువురు కలిసి శనివారం స్కూటీపై కిష్టారెడ్డిపేట్ వైపు నుంచి పటాన్చెరు వైపు వస్తుండగా మార్గమధ్యలో ఎల్లంకి కాలేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం షేక్ ఇబ్రహీంను మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని ఒకరు.. హత్నూర(సంగారెడ్డి): ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో దౌల్తాబాద్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగింది. ఎస్సై సుభాష్ కథనం ప్రకారం... మాదుర గ్రామానికి చెందిన లింగన్నగారి దశరథ్ రోజువారి మాదిరిగానే దౌల్తాబాద్ వచ్చి రాత్రి స్వగ్రామానికి తన మోటార్ సైకిల్ పై తిరిగి వెళ్తున్నాడు. దేవులపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే హత్నూర వైపు నుంచి ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథ్ (45)తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ దశరథను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గాయాలైన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. మృతుడి భార్య వీరమని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఎమ్ శివయ్య (52) సోమవారం పట్టణంలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. తిరిగి తన ద్విచక్ర వాహనంపై సిద్దిపేట నుంచి రామునిపట్ల వైపు వెళుతుండగా మందపల్లి స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా
కంగ్టి(నారాయణఖేడ్): పక్షం రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్ రైతు వేదికలో కంగ్టి ప్యాక్స్ చైర్మన్ మారుతిరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రూ. 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...తడ్కల్ మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తే తడ్కల్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రేషన్లో సన్నబియ్యం ఉచితంగా ఇస్తూన్నా నూకలు ఇచ్చారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ తడ్కల్ మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం -
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
కందిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ (సంగారెడ్డి): కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కందిలో ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ అనే ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. అనంతరం కంది చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బూడిద కుమార్, చిన్న సాయి శ్రీరామ్,అసద్ ఖాన్ శ్రీనివాస్,రాందాస్తోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విరమించేంత వరకూ పోరాడుతాండంపింగ్యార్డ్కు వ్యతిరేకంగా జేఏసీ నిరసనలు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 75వ రోజుకు చేరుకున్నా యి. ఆదివారం గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు, మహిళలు, దివ్యాంగులు నల్లవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రిలేనిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... ప్రభుత్వం డంపింగ్యార్డ్ ఏర్పాటును విరమించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విషవాయువుల నుంచి కాపాడండిపటాన్చెరు టౌన్: పటాన్చెరు డివిజన్ పరిధిలోని తరచూ పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువుల నుంచి తమను కాపాడాలని నవ్య ది గ్రాండ్ కాలనీ వాసులు ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి విష వాయువులతో తామంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డామని..వారంలో ఒకసారి ఇదేవిధంగా జరుగుతోందని వివరించారు. చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి వారికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నేడు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళాసంగారెడ్డి టౌన్: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జానకీదేవి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జాబ్ మేళాలో ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయని, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేట్ శక్తులకే అనుకూలంసీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు పటాన్చెరు: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆర్థిక విధానాలను అవలంబిస్తోందని ఈ నయా ఉదారవాద విధానాలపై పెద్ద ఎత్తున పోరాడాలని సీఐటీయూ అఖిలభారత కోశాధికారి సాయిబాబు పిలుపునిచ్చారు. పటాన్చెరులోని ఐలా భవన్లో తోషిబా పరిశ్రమలో సీఐటీయూ యూనియన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘నయా ఉదార వాద విధానాలు– లేబర్ కోడ్లు– కార్మికుల కర్తవ్యాలు’అనే అంశంపై ఆదివారం జరిగిన సెమినార్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేకి అన్నారు. మోదీ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలతో ప్రజలకు, కూలీలకు, కార్మికులకు ఎవరికీ ఉపయోగపడటం లేదని విమర్శించారు. మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, రాజయ్య, పాండు రంగారెడ్డి, అనంతరావు తదితరులు పాల్గొన్నారు. -
చివరి గింజవరకూ కొంటాం
నారాయణఖేడ్: రైతుల మేలుకోసమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని, చివరి గింజవరకూ ధాన్యాన్ని కొంటామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నిజాంపేట్ మండలం జంబికుంట గ్రామంలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. తమ ప్రభుత్వం రైతులకు పనిముట్లు, విత్తనాలు సైతం అందజేస్తామని తెలిపారు. ధరణి పోర్టల్తో ఇన్నాళ్లూ రైతులు పడ్డ కష్టాలు భూ భారతితో తొలగిపోయాయని వివరించారు. భూ భారతి ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న భూ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని వెల్లడించారు. అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట ఖేడ్ మండలం నమ్లిమెట్ గ్రామంలో దుర్గాభవానీమాత ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామపెద్దలు వారిని శాలువాతో సన్మానించారు. బాధిత కుటుంబానికి పరామర్శ ఖేడ్ మున్సిపాలిటీలో నీటి సరాఫరా విభాగం సూపర్వైజర్గా పనిచేస్తున్న జన్వాడె బస్వరాజ్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం ఆయన స్వగ్రామమైన సిర్గాపూర్ మండలం చిన్నముబారక్ పూర్ గ్రామానికి సంజీవరెడ్డి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీవో సంగ్రాం, కాంగ్రెస్ నాయకులు అంతన్నగారి మల్లేశం, రాధాకిషన్, నాయకులు యాదవరెడ్డి, అశోక్పాటిల్, పండరిరెడ్డి తదితరులు ఉన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి