breaking news
Sangareddy District News
-
చిట్టితల్లి తలకొరివి పట్టి..
వర్గల్(గజ్వేల్): తండ్రి మరణం.. పుట్టెడు దుఃఖం తనలోనే దిగమింగుకుంది. తానే కొడుకై ంది.. తలకొరివి పట్టింది. తండ్రి అంత్యక్రియలు నిర్వహించి కన్నతండ్రి రుణం తీర్చుకున్నది. వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. గ్రామానికి చెందిన బండ్ల సత్యనారాయణ(40), కవిత దంపతులకు కల్యాణి(18), ఉమ(15), శ్రావణి(13) ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దురదృష్టం వెన్నంటి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముకకు గాయంతో మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న కొద్దిపాటి భూమిలో కొంత అమ్మేసి వైద్యం చేయించన్పటికి నయం కాలేదు. ఇటీవలే మరికొంత భూమి అమ్మి పెద్దకూతురు పెండ్లి చేశారు. మరోవైపు సత్యనారాయణ ఆరోగ్యం మరింత విషమించింది. బుధవారం మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్దదిక్కును, మగ దిక్కును కోల్పోయింది. దుఃఖసాగరంలో మునిగిపోయింది. కొడుకులు లేకపోవడంతో చిన్నకూతురు శ్రావణి దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం తలకొరివిపట్టింది. తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. తండ్రి రుణం తీర్చుకున్నది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. కన్నతండ్రి అంత్యక్రియలు నిర్వహించి.. రుణం తీర్చుకున్న తనయ అనంతగిరిపల్లిలో విషాదం -
మాటువేసి కత్తితో దాడి
● వ్యక్తికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు రాయికోడ్(అందోల్): ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని పీపడ్పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మణ్ బుధవారం రాత్రి తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ముందుగానే మాటువేసిన ఇస్మాయిల్ పదునైన కత్తితో లక్ష్మణ్ కడుపులో పొడిచాడు. దీంతో పేగులు బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావమైంది. భయాందోళనతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన లక్ష్మణ్.. పెద్దగా కేకలు వేస్తూ ఇంటికి చేరుకున్నాడు. వెంటనే అతడిని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు, ఎస్ఐ నారాయణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. -
ఆదాయం కోసం ప్యాకేజీ అస్త్రం
దుబ్బాక: నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాటలోకి తెచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ డిపోలకు ఆదాయ మార్గాలను సమకూర్చుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇందులో భాగంగా కొత్తగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తుంది. ప్యాకేజీల పేరిట ప్రయాణికులను ఆకర్షించుకునేందుకు యత్నిస్తోంది. దుబ్బాక డిపో నుంచి ఆయా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తూ ప్రయాణికులకు మంచి సౌకర్యంతో పాటు లాభాలు అర్జిస్తోంది. దుబ్బాక టూ అరుణాచలం దుబ్బాక బస్సు డిపో నుంచి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ప్రారంభించారు. ఇందులో భాగంగా జూన్ 27న ప్రముఖ పుణ్యక్షేత్రం తమిళనాడులోని అరుణాచలంకు దుబ్బాక నుంచి బస్సును ప్రారంభించారు. ఈ ప్యాకేజీ బస్సు ప్రయోగం సక్సెస్ కావడంతో ఇంకా మరిన్ని పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలనే ఆలోచనలతో పలు ప్రాంతాలకు కొత్తగా బస్సులు నడిపించేందకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి, అరుణాచలం, బీదర్లకు కొత్తగా బస్సులు దుబ్బాక డిపో నుంచి అరుణాచలంతో పాటు తిరుపతి, బీదర్ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు బస్సులు నడిపించేందుకు డిపో అధికారులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా నెలకు రెండు పర్యాయాలు డిపో నుంచి ఈ టూర్లకు బస్సులు నడిపించేందుకు పథకాన్ని సిద్ధం చేశారు. ప్రతి నెలలో రెండు సార్లు సాయంత్రం 3 గంటలకు దుబ్బాక నుంచి అరుణాచంలకు డీలక్స్ బస్సు బయలు దేరుతుంది. సిద్దిపేట, హైదరాబాద్ మీదుగా జోగులాంబ ఆలయం, కాణిపాక ఆలయం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలంకు.. తిరుగు ప్రయాణంలో తిరుపతి దేవాలయాలు దర్శనం చేసుకొని 4 రోజులుకు తిరిగి దుబ్బాకకు చేరుకుంటుంది. ఇట్టి ప్యాకేజీలో సూపర్ లగ్జరీ బస్సు పెద్దలకు రూ.5,200, పిల్లలకు 2,700 నిర్ణయించారు. అలాగే దుబ్బాక టూ బీదర్కు ఝరాసంగంలోని సంగమేశ్వర ఆలయం, జల లక్ష్మీనర్సింహస్వామి బీదర్కు ఒక రోజు ప్యాకేజీతో డీలక్స్ బస్సును వేశారు. ఉదయం ఐదు గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి చేరుకుంటుందని, ఇందుకోసం పెద్దలకు రూ.1,100, పిల్లలకు రూ.600 ప్యాకేజీ పెట్టారు. విస్తృతంగా ప్రచారం దుబ్బాక డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు కొత్తగా ప్రారంభించిన టూర్ ప్యాజీలపై ఆర్టీసీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా, వాట్సాప్ ఫేస్బుక్లతో పాటు ఆకర్షణీయమైన కరపత్రాలతో టూర్లపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ గ్రామం నుంచైనా 36 మంది ప్రయాణికులుంటే ఆ గ్రామం లేద ఆ కాలనీ నుంచే బస్సు పెడుతామంటున్నారు. ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ముందుగా తమ పేర్లను బుక్ చేసుకోవాలి. ఇందు కోసం ప్రత్యేక నెంబర్లు 99592 26271, 86392 07675, 73828 29973 లను సంప్రదించాలి. భక్తుల సౌకర్యార్ధం కోసమే.. భక్తుల సౌకర్యార్థం దుబ్బాక డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుపుతున్నాం, అరుణాచలం, తిరుపతి, బీదర్ ప్రాంతాల్లోని ప్రముఖ పుణక్షేత్రాలకు బస్సులు వేయడం జరిగింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి సహకరించాలి. – రఘురాం, డీఎం ఆర్టీసీ వినూత్న ప్రయోగం దుబ్బాక డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు ప్రత్యేక టూర్ ప్యాకేజీలతో ఆకర్షించుకునేందుకు యత్నం అరుణాచలం, తిరుపతి, బీదర్ తదితర టూర్లకు బస్సులు -
గూడు లేదు.. గుంట భూమీ లేదు
పేదల దరి చేరని ప్రభుత్వ పథకాలు ● పూరి గుడిసెల్లో దుర్భర బతుకు ● కలల గూడు సాకారమయ్యేనా..!జగదేవ్పూర్(గజ్వేల్): ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదోళ్ల తలరాతలు మాత్రం మారడం లేదు. పేరుకే పేదల కోసం పథకాలు.. కానీ వారికి మాత్రం పథకాలు అందడం లేదు. సాగు చేసేందుకు గుంట భూమి లేక.. ఉండేందుకు సరైన గూడు లేక ఏళ్లతరబడి గుడిసెలు, రేకుల కొట్టాల్లోనే జీవిస్తున్నారు. కూలీ చేస్తేనే కుటుంబ పోషణ.. లేదంటే ఉపవాసం ఉండాల్సిన దయనీయ పరిస్థితి వారిది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో కలల గూడు సాకారమవుతుందని కలలు కన్న పేదల పగటి కలగానే మిగిలిందని పేదలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని 28 మండలాల ప్రజలు ప్రజాపాలన కింద ఇందిరమ్మ ఇళ్లకు 2 లక్షల 30 వేల 483 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు ఇంటింటి సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. మూడు విభాగాలుగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు గ్రామ సభల ద్వారా కూడా ఎంపిక చేశారు. 86,968 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నారు. కాగా గుంట భూమి లేని వారు జిల్లాలో 16,505 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం కొంతమందికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా ఇంకా చాలా మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. జగదేవ్పూర్ మండలంలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో గుంట భూమి లేని పేదలు దాదాపుగా యాభై కుటుంబాల వరకు ఉన్నాయి. ఇది అనధికారం మాత్రమే. అధికారంగా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. ప్రజాపాలనలో అందరిలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 9,585 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎల్ వన్ కింద 3319, ఎల్ టు 806, ఎల్ 5,460 విభజించారు. ఎల్ వన్ నుంచి పైలెట్ ప్రాజెక్టు గ్రామంలో 77 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. అలాగే మండల వ్యాప్తంగా 415 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. గుంట భూమిలేదు గుంట భూమి లేదు. భర్త, కొడుకు గ్రామంలో ఉపాధి హామీ పనులతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చిన్నపాటి రేకుల ఇంటిలోనే చాలా ఏళ్ల నుంచి తలదాచుకుంటున్నాం. వర్షాకాలం అయితే ఇంట్లోకి వర్షం నీరు వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు వస్తదని అనుకున్నాం. కానీ రాలేదు. మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తే మంచిగుంటుంది. – సంతోష, రాయవరం ప్రభుత్వం స్పందించాలి మాది చాలా నిరుపేద కుటుంబం. మండలంలోని ఎక్కడ మా కులపోళ్లు(దక్కలి) ఎక్కడ లేరు. ఇక్కడే ఉన్నం. కూలీనాలి పనులు చేసుకుంటూ ఉంటున్నాం. చేసిన కష్టం పూటకే సరిపోతుంది. పూరి గుడిసెలోనే ఉంటున్నాం. ప్రభుత్వమే స్పందించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. – సుగుణ, మునిగడప విడతల వారీగా ఇళ్లు అందిస్తాం అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తాం. ఇంటింటా సర్వే వివరాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరిగింది. అర్హులై ఇల్లు రానివారుంటే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం. ఉన్నతాధికారుల అదేశాల మేరకు ఆన్లైన్లో నమోదు చేసి పరిశీలించి ఎంపిక చేస్తాం. – రాంరెడ్డి, ఎంపీడీఓ జగదేవ్పూర్ -
ములుగు వర్సిటీకి అవార్డు
ములుగు(గజ్వేల్): ఐఐటీ బాంబే నుంచి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ కేటగిరిలో ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉత్తమ యూనివర్సిటీ అవార్డు అందుకుంది. గురువారం ఐఐటీ ముంబైలో జరిగిన ఓపెన్–సోర్స్ జీఐఎస్ దినోత్సవ వేడుకలు, నేషనల్ జియోస్పేషియల్ అవార్డును ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మాజీ చైర్మన్ కిరణ్కుమార్ చేతుల మీదుగా వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. జియోస్పేషియల్ చొరవలు, క్రియాశీల భాగస్వామ్యం గురించి అవగాహన కల్పించడంలో ఆదర్శప్రాయమైన మద్దతును గుర్తించి ఐఐటీ ముంబై ఉద్యాన వర్శిటీ ఈ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన రంగంలో భౌగోళిక సమాచార వ్యవస్థ, జీఐఎస్ మ్యాపింగ్ ప్రాముఖ్యతను అందించడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే ఉద్యాన తోటలను మ్యాపింగ్ చేయడం, తెలంగాణ ఉద్యాన రంగంలో అప్లికేషన్లను ముమ్మరం చేసి రైతులకు సాగును లాభసాటిగా మార్చేందుకు ఇవి ఉపయోగపడుతాయని ఆయన వివరించారు. త్వరలోనే విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీఐఎస్ హ్యాకథాన్ను కూడా నిర్వహిస్తామని వీసీ పేర్కొన్నారు. అలాగే.. ఎక్సలె న్స్ ఇన్ జౌట్రీచ్ అవార్డును కన్సల్టెంట్ డాక్టర్. వీరా ంజనేయులకు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల మోసం
● ఆన్లైన్ ద్వారా ఫోను కొనుగోలు ● లబోదిమంటున్న బాధితుడు అక్కన్నపేట(హుస్నాబాద్): ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆవుల శ్రీనివాస్. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామం. అయితే, బజాజ్ ఈఎంఐ కార్డును సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఆన్లైన్ ద్వారా రూ.34వేల విలువల గల ఫోన్ను కొనుగోలు చేశారు. గురువారం ఫ్లిప్ కార్డు డెలివరీ బాయ్ ఆ ఫోన్ను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆన్లైన్ ద్వారా మీరు ఫోన్ కొనుగోలు చేసుకున్నారని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీనివాస్ కంగుతిన్నాడు. తాను ఆన్లైన్లో ఎలాంటి ఫోన్ కొనుగోలు చేయలేదని ఎంతచెప్పినా ఆర్డర్ క్యాన్సిల్ కాదనడంతో చేసేది లేక ఆ ఫోన్ను తీసుకున్నాడు. ఈ క్రమంలో వెంటనే మరో ఫోన్ ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు, హైదరాబాద్ అడ్రస్తో మెసేజ్ రావడంతో శ్రీనివాస్ అవాక్కయ్యాడు. సైబర్ నేరగాళ్లు బజాజ్ కార్డును హ్యాక్ చేసినట్లు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటాం
మెదక్జోన్: మెదక్లో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్)ను ప్రముఖ నటి వైష్ణవిచైతన్య, టీవీ చానల్స్ నటి వర్షా, నూకరాజు గురువారం ప్రారంభించారు. వీరిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావటంతో సందడి నెలకొంది. సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జానా సురేష్ మాట్లాడుతూ.. తమ సంస్థలను తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందుతున్నాయని చెప్పారు. మెదక్లో కూడా ప్రజల ఆదరాభిమానాలు చూరగొనేలా వస్త్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక్కడి ప్రజల ఆదాయ వనరులకు అనుగుణంగా ధరలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఆషాఢం, శ్రావణ మాసం వేడుకల సందర్భంగా అన్నిరకాల వస్త్రాలపై తగ్గింపు ధరలతో వినియోగదారులను అందిస్తామన్నారు. చందన బ్రదర్స్ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జానా సురేష్ మెదక్లో షాపింగ్ మాల్ ప్రారంభం -
సాగుకు సింగూరు నీళ్లు
పుల్కల్(అందోల్): ఎట్టకేలకు సాగు కోసం సింగూరు జలాలు విడుదలయ్యాయి. సింగూరు జలాలను మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పూజలు చేసి లిఫ్టు ద్వారా ఎడమకాలువకు నీటిని విడుదల చేశారు. కాలువలకు సిమెంట్ లైనింగ్ మరమ్మతుల కారణంతో క్రాప్ హాలిడే ప్రకటించిన రాష్ట ప్రభుత్వం ఏడాది కాలంగా రెండు పంటలకు సింగూరు నీటిని విడుదల చేయని సంగతి తెలిసిందే. అయితే సిమెంట్ లైనింగ్ పనులు నత్తనడకన నడుస్తుండటంతో స్థానిక రైతుల ఆందోళనలను, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం లైనింగ్ పనులకు తాత్కాలికంగా నిలిపి ఎట్టకేలకు సాగుకు సింగూరు జలాలు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ సాగునీటి వల్ల పుల్కల్,అందోల్,చౌటకూర్ మండలాల రైతులకు లాభం చేకూరుతుంది. ఆయకట్టు కింద 40 వేల ఎకరాల్లో, 93 చెరువుల కింద మరో 10వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తారు. సాగు నీటి విడుదల అనంతరం మంత్రి దామోదర సింగూరు గురుకుల, బస్వాపూర్ మోడల్, కస్తూర్బా పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ పాఠశాలల ఆవరణలు చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు పెరిగిపోయి పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించడంతో ఆయా ప్రిన్సిపాళ్లను మంత్రి మందలించారు. ఆవరణలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ పాఠశాలల్లో ప్రతీ తరగతి గదిని పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో త్రిష దామోదర, నీటిపారుదల శాఖ ఈఈ జైభీమ్, డీఈ నాగరాజు, ఏఈలు మహిపాల్రెడ్డి, మహేశ్, తహసీల్దార్ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. లిఫ్టు ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి దామోదర -
అర్హుల కోసం స్క్రీనింగ్
● ‘డబుల్ బెడ్రూమ్’ జాబితాపై అధికారులకు ఫిర్యాదుల వెల్లువ ● కొనసాగుతున్న అర్హుల తొలగింపు ప్రక్రియ ● విచారణ అనంతరమే పంపిణీకి ముహూర్తంజహీరాబాద్: అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టబెట్టేందుకు రెవెన్యూ శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జాబితాలో కొందరు అనర్హులకు చోటు కల్పించారని వచ్చిన ఆరోపణల మేరకు ఇళ్ల పంపిణీని నిలిపివేశారు. తాజాగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేందుకు రెవెన్యూ శాఖ నడుం బిగించింది. మండలంలోని హోతి(కె) గ్రామంలో 660 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకువస్తున్న క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకుగాను అసంపూర్తిగా ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు అర్హులను గుర్తించారు. గుర్తించిన వారిలో అందుబాటులో ఉన్న వారికి పట్టా సర్టిఫికెట్లను సైతం పంపిణీ చేశారు. మిగిలిపోయిన వారిని వారి అడ్రస్లు, ఫోన్ నంబర్ల ఆధారంగా గుర్తించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేసినా లబ్ధిదారులందరినీ గుర్తించలేక పోయారు. దీంతో వారిస్థానంలో మిగతా వారి పేర్లను చేర్చి జాబితా తయారు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అప్పటి జాబితాల్లో ఉన్నవారిలో నిజమైన అర్హులను గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అనర్హుల జాబితాను సైతం సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ముందుగా అర్హులైన వారికి ఇండ్లను కేటాయించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. హామీతో ఆందోళన విరమణ హోతి(కె) గ్రామ శివారులో నిర్మించిన 66 ఇళ్లు అసంపూర్తిగా ఉండటంతో లబ్ధిదారులకు తాళాలు అప్పగించలేదు. లబ్ధిదారులు ఆందోళన చేపట్టడంతో అధికార యంత్రాంగం దిగివచ్చి ఎట్టకేలకు ఈనెల 12వ తేదీ ముహూర్తం ఖరారు చేసింది. అయినా అప్పగించకుండా వాయిదా వేసింది. దీంతో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద, ఆర్డీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దీంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఇళ్ల పంపిణీకి మరోమారు తేదీని ఖరారు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనర్హుల ఏరివేత జాబితాలో అనర్హులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులు స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రజలు అందించే ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫిర్యాదులు అందిన వారికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ అనంతరమే వారికి ఇళ్ల కేటాయింపు విషయాన్ని పరిశీలిస్తారు. ప్రత్యేక కౌంటర్లో పేర్ల పరిశీలన డబుల్బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని వాయిదా వేయడంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి జాబితాల్లో తమ పేర్లు ఉన్నదీ లేనిది చూసుకుంటున్నారు. ఎక్కడ తమ పేర్ల గల్లంతవుతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారుల కోసం కౌంటర్ను ఏర్పాటు చేశారు. గతంలో మంజూరైన లబ్ధిదారుల జాబితాను అక్కడ అందుబాటులో ఉంచారు. సర్టిఫికెట్లను తీసుకువచ్చి సరిచూసుకుంటున్నారు. -
తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ ● అధికారులతో సమీక్ష సంగారెడ్డి జోన్: గిరిజన తండాలలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ స్పష్టం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, రోడ్లు భవనాలు, శిశు సంక్షేమ, విద్యా, వైద్య ఆరోగ్య, వ్యవసాయం, జిల్లా గ్రామీణ సంస్థ, నీటిపారుదల, పరిశ్రమలు, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాలు గిరిజన తండాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికి విద్యా, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్రెడ్డి, వివిధ శాఖల అధికారులు జ్యోతి, లలిత కుమారి, జానకీరెడ్డి, వసంత కుమారి, ఐనేష్ పాల్గొన్నారు. 10 నెలల్లో రోడ్డు, వంతెన పూర్తి చేయాలి కల్హేర్(నారాయణఖేడ్): అంతకుముందు సిర్గాపూర్ మండలం గైరాన్ తండాను సందర్శించారు. తండాకు రోడ్డు, వంతెన నిర్మాణం పనులు 10 నెలల్లో పూర్తి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. సిర్గాపూర్ మండలం గైరాన్ తండాలో గిరిజనులతో మాట్ల్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్టీ కమిషన్ ఆదేశాలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. లేకుంటే అధికారులు న్యూఢిల్ల్లీలో ఎస్టీ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
హామీలను తప్పక అమలు చేస్తా
ఎంపీ రఘునందన్రావురామచంద్రాపురం (పటాన్చెరు): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తానని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు పేర్కొన్నారు. తెల్లాపూర్ పట్టణ ప్రజల అత్యవసర సేవల కోసం గురువారం ఆయన నూతన అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరిగి సమయంలో సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని.. ఇచ్చిన మాట మేరకు అంబులెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. తెల్లపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఈనెల 26న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. -
తాగునీటి కోసం తండ్లాట
● రెండు నెలలుగా అందని నీళ్లు ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ● గిరిజనులకు దికై ్కన వ్యవసాయ బోర్లు హత్నూర (సంగారెడ్డి): ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్తో మిషన్ భగీరథ నీళ్లు అని ప్రజా ప్రతినిధులు, అధికారులు చేస్తున్న ప్రచారార్భాటాలు పటాటోపమేనని రుజువు చేస్తోంది హత్నూర మండలంలోని దేవునిగుట్ట తండావాసుల కన్నీటి గాథ. తండాకు మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోయి గత రెండు నెలలైనా ఈ గిరిజన వాసులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తాగునీటికోసం వ్యవసాయ క్షేత్రాల్లోని బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ గిరిజన తండాలో సుమారు 300 జనాభాతో 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత ప్రభుత్వం ఈ దేవుని గుట్ట తండాను గిరిజన గ్రామపంచాయతీగా సైతం చేసింది. రక్షిత మంచినీటి ట్యాంక్ ఉన్నప్పటికీ చిన్నగా ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ రెండు నెలల క్రితం పగిలిపోవడంతో నీరు తండాకు రావడం లేదు. గిరిజనులు మిషన్ భగీరథ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడటంతోపాటుగా ఈ నీళ్లు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు త్వరగా స్పందించి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు మిషన్ భగీరథ త్రాగునీరు రాక రెండు నెలలైంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. నీటి కోసం ఇబ్బందులు పడుతూ పొలాల్లోని బోర్ల వద్దకు వెళ్తున్నాం. – వాలి, తండా వాసి కొత్త పైప్లైన్ వేస్తాం దేవుని గుట్ట గిరిజన తండాకు త్వరలోనే కొత్త పైప్ లైన్ వేస్తాం. రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకు ఎక్కడం లేదు. పైప్ లైన్ పగిలిపోవడంతో సమస్య తలెత్తింది. –శివ ప్రసాద్, మిషన్ భగీరథ ఏఈ -
మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య జహీరాబాద్ టౌన్: ప్రతీ మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జీ సౌజన్య పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని అల్లీపూర్లో నిర్వహించిన ఐసీడీస్ ప్రాజెక్టు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళలు సామాజిక,చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ సిబ్బందికి చట్టాలపై అవగహన కల్గి ఉండటం అవసరమని చెప్పారు. డీడబ్ల్యూఓ లలిత కుమారి మాట్లాడుతూ..అంగన్వాడీ పిల్లల్లో పోషణలోపం ఉన్న వారిని గుర్తించి వారి బరువు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు: నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలకు సైతం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్బో మెడోస్ కాలనీలో మంచినీటి నల్ల కనెక్షన్లను గురు వారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఐలాపూర్ గ్రామంలో రూ.పది లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన గ్రామాలలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. -
‘ఉపాధి’కి కొత్త హాజరు షురూ
రెండు పూటలా కూలీల ఫొటోలు ● ఒక ఫొటో అప్లోడ్ చేస్తే సగం కూలి మాత్రమే ● కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీసంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పథకం హాజరులో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకనుంచి ఉపాధి హామీలు పనిచేసే కూలీలను ఉదయం, మధ్యాహ్నం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఈ విధంగా రెండుపూటలా కూలీల ఫొటోలు అప్లోడ్ చేస్తేనే పనిచేసిన వ్యక్తికి పూర్తిగా కూలి డబ్బులు అందనున్నాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫొటోలు ఉపాధి హామీ పథకంలో హాజరు విధానాన్ని ఆన్లైన్ ద్వారా చేపట్టింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ ద్వారా ప్రతీరోజు కూలీల ఫేస్ రికగ్నేషన్ చేసి హాజరు తీసుకుంటున్నారు. అయితే పనికి ఆలస్యంగా వచ్చిన కూలీలు కూడా ముందు వచ్చిన కూలీలతో సమానంగా కూలి తీసుకుంటూ ఈ హాజరు విధానాన్ని దుర్వినియోగపరుస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఇటువంటి పనులను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీలో కొత్తగా ప్రవేశపెట్టిన హాజరు విధానాన్ని గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయిలో కమిషనర్ వరకు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. తీసిన ఫొటోలను మండలస్థాయిలో అధికారుల ఆదేశాల మేరకు ఫొటోలను డీఆర్డీఏకు కలెక్టర్కు పంపించాల్సి ఉంటుంది. హార్డ్డిస్క్ కొనుగోలుకు ఆదేశాలు కూలీల హాజరు కోసం తీసే ఫొటోలు విధిగా భద్రపరిచేందుకు హార్డ్డిస్క్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఏటా చేపట్టే సోషల్ ఆడిట్ పూర్తయ్యేంతవరకు ఆ ఫొటోలను ఆ డిస్క్లో నిక్షిప్తం చేసి ఉంచాలి.వ్యతిరేకిస్తున్న కూలీలు సిబ్బంది ఉపాధి హామీ హాజరుకు సంబంధించి కూలీలను రెండు పూటలా ఫొటోలు తీయాలన్న నిబంధనను అటు కూలీలతోపాటు ఉపాధి హామీ సిబ్బంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త హాజరు విధానం వల్ల ఉపాధి పనులకు హాజరయ్యే వారి శాతం తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. -
19న ఖేడ్కు దామోదర
● కొత్త రేషన్ కార్డుల పంపిణీ ● ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నెల 19న ఖేడ్ నియోజకవర్గంలో పర్య టించనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేస్తారని సంజీవరెడ్డి వెల్లడించారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు సైతం మంజూరు చేయకపోగా తొలగింపులు, చేర్చడానికి దరఖాస్తులను ఆహ్వానించి తొలగింపులను చేపట్టిందని మండిపడ్డారు. అనేక సంక్షేమ పథకాలకు రేషన్కార్డు ప్రామాణికం కాగా అర్హులైన అనేకమంది పథకాలకు దూరమయ్యారన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తోందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా 4 వేల రేషన్ కార్డులు మంజూరు కాగా వాటిలో 10,700 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. మరో 1,200 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా విచారణ అనంతరం అర్హులకు మంజూరు చేస్తారని తెలిపారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెల్లడించారు. సంగారెడ్డి పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ మహిళా సంబరాల్లో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ...కార్మికులకు కనీస వేతనం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైఎస్సార్ హయాంలో పావలా వడ్డీ రుణాలు: మంత్రి దామోదర మహిళా సంఘాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో పావలా వడ్డీకే రుణాలు అందించినట్లు మంత్రి దామోదర ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లాలో అగ్రగామిగా నిలబట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్యాంటిన్ల నిర్వహణ కూడా... పారిశ్రామిక ప్రాంతాలలో నిర్వహించే క్యాంటిన్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం ప్రభుత్వం మహిళా సాధికారితకు అనేక పథకాలు అమలు పరుస్తుందన్నారు. కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పరితోశ్ పంకజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, డీఆర్డీఏ జ్యోతి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రేషన్కార్డులు, చెక్కుల పంపిణీజిల్లాలో మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.3.75కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.1.22కోట్ల విలువైన బీమా చెక్కులను అందజేశారు.ఇందిరా మహిళా సంబరాల్లో మంత్రులు -
భయం మరుగై.. వైద్యం మెరుగై
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025జిల్లాలో మెరుగుపడ్డ ప్రభుత్వాస్పత్రులు● కాయకల్ప అవార్డులకు ఎంపిక ● రెండు ఏరియా ఆస్పత్రులు, మూడు సీహెచ్సీలు ● ఆరు పీహెచ్సీలు, 19 సబ్సెంటర్లు నారాయణఖేడ్: సర్కారు దవాఖాన అంటే భయపడే రోజులనుంచి రోగులకు మెరుగైన సేవలు అందించే స్థితికి వచ్చాయి. ప్రభుత్వాస్పత్రులపై నిఘా పెరగడం, ప్రభుత్వం తరచూ సమీక్షలు నిర్వహించడం వంటి చర్యలతో జిల్లాలో వాటి పనితీరు మెరుగుపడింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాకు చెందిన వారే కావడంతో ఆస్పత్రులపై అధికారుల నిఘా ఎక్కువగా ఉండటంతో వైద్యులు, సిబ్బంది సేవల పరంగా మరింత మెరుగ్గా పనిచేస్తున్నారు. దీంతో గతానికి భిన్నంగా జిల్లాలో కాయకల్ప అవార్డులకు రెండు ఏరియా ఆస్పత్రులు, మూడు సీహెచ్సీలు, ఆరు పీహెచ్సీలు, 19 సబ్సెంటర్లు ఎంపికయ్యాయి. సేవల ఆధారంగా ఎంపిక ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు, కల్పిస్తున్న సదుపాయాలు, వసతు లు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, నాణ్యతా ప్రమాణాలు తదతరాలను పాటించడాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాయకల్ప పేరిట అవార్డులను అందజేస్తుంది. 2024– 25వ ఏడాదికిగాను కాయకల్ప బృందాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్ప త్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిశీలించిన అంశాల వారీగా జిల్లాలో 2 ఏరియా ఆస్పత్రులు, 3 సీహెచ్సీలు, 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 19 సబ్సెంటర్లను అవార్డుకు ఎంపిక చేశారు. జోగిపేట ఏరియా ఆస్పత్రి 83.69% స్కోర్ సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా, 72.46% స్కోర్తో ఖేడ్ ఏరియా ఆస్పత్రి రెండో స్థానంలో నిలిచింది. ఎంపికై న ఈ ఆస్పత్రులకు లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తారు. మూడు సీహెచ్సీలు, ఆరు పీహెచ్సీలు న్యూస్రీల్సదాశివపేట సీహెచ్సీ 80.15% స్కోర్తో మొదటి స్థానంలో ఆతర్వాతి స్థానంలో మిర్జాపూర్, కరస్గుత్తి సీహెచ్సీ ఆస్పత్రులు నిలిచా యి. వీటికీ లక్ష చొప్పున నగదు బహుమతులు దక్కనున్నాయి. ఉత్తమ పీహెచ్సీ కింద 88% తో భానూర్ ఎంపికైంది. దీనికి రూ.2లక్షల ప్రోతాహకం దక్కనుంది. ప్రశంసా అవార్డు కింద దిగ్వా ల్, పుల్కల్లు ఎంపిక కాగా దీనికి రూ.50వేలు అందిస్తారు. సంగారెడ్డిలోని ఇంద్రానగర్ యూపీ హెచ్సీ ఎంపిక కాగా రూ.2 లక్షల నగదు, మా ర్క్స్నగర్ యూపీహెచ్సీ రూ. 50 వేలు అందనున్నాయి. ఉత్తమ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా ముబారక్పూర్ సబ్సెంటర్ ఎంపిక కాగా రూ. లక్ష నగదు, రన్నరప్గా ఎంపికై న నందికంది సబ్సెంటర్కు రూ.50వేలు, రెండో రన్నరప్గా ఇస్నాపూర్కు రూ.35వేలు అందనున్నాయి. సుల్తాన్పూర్, ఖాజిపల్లి, చిద్రప్ప, గంగారం, తెర్పోల్, మల్లేపల్లి, పోతిరెడ్డిపల్లి, ధనసిరి, మిమిడ్గి, హోతి(కె), గురుజ్వాడ, నాగన్పల్లి, కారాముంగి, వాసర్, అనంతసాగర్, సంజీవన్రావుపేట్ సబ్ సెంటర్లకు రూ.25వేలు దక్కనున్నాయి. -
సమన్వయంతోనే మెరుగైన వైద్య సేవలు
సంగారెడ్డి: వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రుల మధ్య సమన్వయంతోనే ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయని టీఎన్జీఓ నేతలు పేర్కొన్నారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు జావిద్అలీ ఆ సంఘం నాయకులతో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయప్రకాశ్రావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణలను బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల సమస్యలు, అధ్యాపకుల ఖాళీలు, ప్రయోగశాలల సామగ్రి కొరత, ఆస్పత్రిలో విభాగాల విస్తరణ వంటి అంశాలను చర్చించారు. అనంతరం జయప్రకాశ్రావు, మురళీకృష్ణ మాట్లాడుతూ...ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. సమావేశం టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్ వెంకట్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, సుధామిని, విజయ్ పట్టణ శాఖ అధ్యక్షుడు వెంకటేశం, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్లను కలిసిన టీఎన్జీఓ నేతలు -
నాణ్యమైన విద్య అందించాలి
కలెక్టర్ ప్రావీణ్య పటాన్చెరు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థులైన ఉపాధ్యాయులున్నారని, వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టోరూమ్ను పరిశీలించారు. అనంతరం పాఠశాలల్లోని ప్రీ ప్రైమరీ విద్యార్థులతో మాట్లా డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్య ద్వారా ఆంగ్ల భాషపై విద్యార్థులకు పట్టు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశ నుంచి ఆంగ్ల విద్యను బోధించడం ద్వారా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభు త్వ పాఠశాల విద్యార్థులు రాణించే అవకాశం ఉందన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలిమంత్రి వివేక్కు వినతి పత్రం సంగారెడ్డి జోన్: సంగారెడ్డి పట్టణంలో ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని అడ్వొకేట్ నర్సింగ్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి పట్టణానికి వచ్చిన రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామికి వినతి పత్రం అందించారు. స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే పోటీ పరీక్షలకు యువతకు సన్నద్ధమవుతుందని మంత్రికి వివరించారు. కనీస వేతనాలు పెంచాలి: సీఐటీయూసంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులకు కనీస వేతనాలు పెంచడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సంగారెడ్డికి వచ్చిన కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామిని కలసి సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయి మాట్లా డుతూ...రాష్ట్రంలో సుమారు కోటి 20 లక్షల మంది, జిల్లాలో 5 లక్షల మంది కార్మికు లు ఉన్నారని, వీరికి 11 ఏళ్ల నుంచి వేతనాలు పెంచలేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, వీటిని పరిగణలోకి తీసుకుని వేతనాలు నిర్ణయించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే వేతనాల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తానని హామీ నిచ్చారు. నేడు గైరాన్ తండాకు జాతీయ ఎస్టీ కమిషన్నారాయణఖేడ్: సిర్గాపూర్ మండలం వంగ్దాల్ పరిధిలోని గైరాన్ తండాను గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సందర్శించనుంది. ఈ మేరకు ఖేడ్ రెవెన్యూ డివిజినల్ అధికారి అశోక చక్రవర్తి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తండాలోని మౌలిక సదుపాయాలను ఎస్టీ కమిషన్ పరిశీలించనుందని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలిబీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, మాజీఎంపీ బీబీపాటిల్ పుల్కల్(అందోల్): కాంగ్రెస్ ఎన్నికల ముందు చేసిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీజీపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, మాజీ ఎంపీ బీబీపాటిల్ డిమాండ్ చేశారు. పుల్కల్ మండలం సింగూరు ఆయకట్టు రైతులతో కలిసి బుధవారం వారు మాట్లాడుతూ...పంట విరామం ప్రకటించి రైతుల ఉసురు తీశారన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించినా కాలువలో సిమెంట్ లైనింగ్ పనులు మొదలు పెట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. రెండు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టి మూడో పంటకు వేసి సంబురాలు చేసుకోవడం కాంగ్రెస్ నాయకులకే చెల్లిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుల్కల్ పీఏసీఎస్ చైర్మన్ అనంతరావు కులకర్ణి, బీజేపీ నాయకులు రమేశ్ బస్వారాజ్, నవీన్, పండరీ, నర్సింహులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు సింగూరు జలాలు
నీటిని విడుదల చేయనున్న మంత్రి దామోదర పుల్కల్(అందోల్): సాగు కోసం సింగూరు జలాలు విడుదల చేయాలని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల చేసిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఎట్టకేలకు సింగూరు జలాలను సాగు కోసం విడుదల చేసేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. దీంతో గురువారం ఎడమకాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు బుధవారం మీడియాకు వెల్లడించారు. రెండు పంటల విరామం అనంతరం సాగునీరు విడుదల చేస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దం నుంచి రైతులు సింగూరు కాలువల సాగునీటితో పంటలు పండించారు. ఈ నీటితో తమ భూముల్లో పుట్లకొద్ది ధాన్యాన్ని పండించారు. కానీ ఏడాదిగా కాలువలకు సిమెంట్ లైనింగ్ పేరుతో క్రాప్ హలీడే ప్రకటించారు. దీంతో రైతులు బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేశారు. ఏడాది కాలం పాటు క్రాప్ హాలీడే తీసుకున్న సిమెంట్ లైనింగ్ పనులు ఎక్కడా జరగలేదు. కాలువల్లో బ్రష్ కటింగ్ పేరుతో ఏడాది పాటు ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించారు. తొలగించిన పిచ్చి మొక్కలు కాలువల్లోనే వేయడంతో నీటి ప్రవాహానికి అడ్డుగా తగు లుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎన్నికలతోనే... ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండుసార్లు రైతు భరోసా క్రమంగా వేయకపోవడం, రెండు లక్షలున్న రైతులకు రుణ మాఫీ కాకపోవడం, ఈ రెండు కారణాలకు తోడు ఏడాది నుంచి సింగూరు సాగునీటి ఆయకట్టు రైతులకు పంట విరామం ప్రకటించడంతో స్థానిక రైతాంగం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉంది. దీంతో ఆయకట్టు పరిధి నాయకులు మంత్రి దామోదరకు సింగూరు ఆయకట్టు క్రాప్ హాలీడే ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని వివరించారు. దీంతో గుత్తేదారుతో పనులు ఆపించి క్రాప్ హాలీడేను ఎత్తి వేశారు. -
భూ సమస్య పరిష్కరించాలని రైతు నిరసన
● నివేదిక తప్పుగా పంపించారని ఆగ్రహం ● న్యాయం జరగకపోతేఆత్మహత్యే శరణ్యంఅక్కన్నపేట(హుస్నాబాద్): భూ సమస్యను పరిష్కరించాలని తండ్రీకొడుకులు నిరసన చేపట్టారు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన చిల్పూరి ఎల్లారెడ్డి, అతని కుమారుడు మహేందర్రెడ్డి భూ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్కు చాలా రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా సమస్యను పరిష్కరించకుండా తీవ్ర ఆలస్యం చేస్తున్నారని బుధవారం తండ్రి, కొడుకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైసా పైసా కూడ బెట్టుకొని కొనుగోలు చేసిన 20 ఎకరాల భూమిని సాగు చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఎవరో చెప్పారని ఆ భూమిని ఆన్లైన్లో కనిపించకుండా రెవెన్యూ అధికారులు తొలగించారని కంటతడి పెట్టుకున్నారు. విషయం రైతు కమిషన్ చైర్మన్ వద్దకు.. ఇటీవల సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో భూ బాధితుడు ఎల్లారెడ్డి భూ సమస్యతో విసుగొచ్చి ఓ కవర్లో డీజిల్ను వెంట తీసుకొని వెళ్లాడు. గమనించిన పోలీసులు అడ్డుకొని బయటకు పంపించారు. ఈ క్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి భూ బాధితుడు ఎల్లారెడ్డి, తహసీల్దార్ అనంతరెడ్డిలను హైదరాబాద్కు పిలిపించుకొని మాట్లాడి భూ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయినా భూ సమస్యను పరిష్కరించకుండా ఉన్నతాధికారులకు నివేదికను తప్పుగా పంపించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం జరగకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంపై తహసీల్దార్ అనంతరెడ్డిని వివరణ కోరగా... భూ సమస్యపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించామని, రైతు అడిగిన సమాచారాన్ని ఇచ్చామని తెలిపారు. భూ వివాదం కోర్టు కేసులో ఉందని, ఈ విషయంలో మేము ఏం చేయలేమని చెప్పారు. -
అధ్యాపకురాలికి అవార్డు
నారాయణఖేడ్: పట్టణానికి చెందిన అధ్యాపకురాలు మలమంచి శిల్ప నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో టాపర్గా నిలిచారు. ఇందుకు గాను ఆమెకు మంగళవారం యూనివర్సిటీలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకంతోపాటు అకాడమీ ఎక్సలెనన్స్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఓటే వజ్రాయుధం● ఏఎస్పీ మహేందర్ హవేళిఘణాపూర్(మెదక్): ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని జిల్లా ఏఎస్పీ మహేందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంజేపీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మాక్పోలింగ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పోలింగ్ శాతం తగ్గుతున్న నేటి తరుణంలో విద్యార్థులు ఇలాంటి కార్యక్రమం ద్వారా ఓటు హక్కుపై కనువిప్పు కలిగించడంపై విద్యార్థులు, అధ్యాపకులను అభినందించారు. తాను కూడా ప్ర భుత్వ పాఠశాలలో, హాస్టల్లో చదివి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చానన్నారు. విద్యార్థు లు ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించా రు. ఎంజేపీ ఆర్సీవో గౌతమ్రెడ్డి, ప్రిన్సిపాల్ సృజన, లైబ్రేరీయన్ సంతోశ్, సిబ్బంది ఉన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తం ● సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అనురాధ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్ షాపు లు, వైన్ షాపులు, ఈసేవా కేంద్రాల, హోటళ్ల వద్దకు వచ్చి డబ్బులు అవసరం ఉన్నాయని కమిషన్ ఆశ చూపి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసి నగదు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బులు అడిగితే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కాటేజీ నిర్మాణానికి రూ.15 లక్షల విరాళం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు బస చేసేందుకు 100 కాటేజీలు నిర్మించేందుకు చేపట్టిన డోనర్ స్కీంకు దాతలు ముందుకొస్తున్నారు. బుధవారం హైదరాబాద్లోని చెప్పల్గూడకు చెందిన అందెల నవీన్, స్వప్న దంపతులు కాటేజీ నిర్మాణానికి విరాళంగా రూ.15 లక్షల చెక్కును ఆలయంలో ఏఈవో శ్రీనివాస్కు అందజేశారు. దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేయాలని ఏఈవో భక్తులను కోరారు. ఆలయ ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, అర్చకులు భాస్కర్, ఉద్యోగులు శ్రీనివాస్రెడ్డి, వెంకటాచారి, హైదరాబాద్ యాదవసంఘం నాయకులు దుర్గయ్య పాల్గొన్నారు. మల్లన్న ఆలయపూర్వప్రధానార్చకుడు మృతి మల్లన్న ఆలయ పూర్వ ప్రధానార్చకుడు మృతి కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గతంలో ప్రధానార్చకులుగా విధులు నిర్వహించిన పడిగన్నగారి మల్లప్ప(82) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆలయంలో 50 ఏళ్ల పాటు అర్చకునిగా, ముఖ్య, ప్రధానార్చకునిగా సేవలు అందించి 2009లో పదవీ విరమణ పొందారు. మృతుడి కుటుంబాన్ని ఆలయ అధికారులు, ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గు పూజారులు పరామర్శించారు. -
మొక్కజొన్నకు కత్తెర పురుగు
ఆదిలోనే చీడపీడలతో పంటలకు నష్టం ● మందులు పిచికారీ చేసినా చావని పురుగు ● ఆందోళన చెందుతున్న రైతులు ● పట్టించుకోని వ్యవసాయ అధికారులుఈ ఫొటోలో కన్పించే మహిళా రైతు పొన్నబోయిన చిలుకవ్వ మీర్జాపూర్లో రెండెకరాల్లో మొక్కజొన్న, ఎకరంలో కూరగాయలు సాగు చేస్తుంది. మరో ఎకరం వరి సాగుకు నారు పోసి సిద్ధం చేసింది. మొక్కజొన్న చేనుకు కత్తెర పురుగు (మొగ్గి) రావడంతో తీరొక్క మందులు తెచ్చి పిచికారీ చేసిన పురుగు పోకపోవడంతో ఆమె ఆందోళన చెందుతుంది. -
హామీలు అమలు చేయాలి
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు రూ.6వేల పింఛన్ ప్రకటించి, అమలు చేయలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మెట్రో గార్డెన్లో ఆగస్టు13న వికలాంగుల పోరాట సమితికి మద్దతుగా నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ మహా గర్జన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వికలాంగులకు 20 నెలలుగా పింఛన్ పెంపు హామీ అమలు కావడం లేదన్నారు. ఎన్నికల హామీ అమలుకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయలేదన్నారు. ఇస్తామన్న కాంగ్రెస్ ఇవ్వలేదని, అడగాల్సిన ప్రతిపక్షాలు అడగలేదని విమర్శించారు. వికలాంగులకు ఇవ్వాల్సిన రూ.20 వేల కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మేరకు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు డబ్బులు పడలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం, నాయకులు శంకర్,తదితరులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
బెజ్జంకి(సిద్దిపేట): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సౌజన్య కథనం మేరకు... గూడెం గ్రామానికి చెందిన ఎగోల్ల రాజేశం(39) గతంలో ఉపాధి కోసం రెండేళ్లు దుబాయి వెళ్లి వచ్చాడు. తరువాత బేగంపేటలో సొంతంగా ఇల్లు నిర్మించుకుని ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం చేసిన బాకీలకు తోడు ఆటో నడవకపోవడంతో ఇంటి నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి అప్పులయ్యాయి. వాటిని తీర్చ మార్గంలేక బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం తన ఆటోలో ఇంటి నుంచి వెళ్లాడు. క్రిమి సంహారక మందు తాగి బంధువులకు సమాచారమిచ్చాడు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, కూతుర్లు నిహారిక, హర్షితలున్నారు. అన్న మల్లేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదువు మానేయాలన్నందుకు బాలిక రామాయంపేట, నిజాంపేట(మెదక్): కూతురును చదువు మానేయాలని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. నిజాంపేట పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన మహమ్మద్ సులేమాన్, హమీద దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ సులేమాన్ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండో కూతురు మదిహా(15) పదో తరగతి పాసైంది. కామారెడ్డి మైనారిటీ కళాశాలలో ఇంటర్ సీట్ వచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని, చదువు వద్దని పలుమార్లు ఆమె తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మదిహా బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దర్యాప్తు ముమ్మరం
అనిల్ హత్యపైకొల్చారం(నర్సాపూర్): గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో సోమవారం రా త్రి మృత్యువాత పడ్డ మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరెల్లి అనిల్ అంత్యక్రియలు బుధవారం ఉదయం స్వగ్రామంలో జరిగాయి. అంత్యక్రియలకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, స్థానికంగా ఉన్న కొందరు నాయకులు తప్పించి మిగతా నాయకులు ఎవరూ హాజరు కాలేదు. గత ఏడాది జూలై 16న పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా తండ్రి చేత కేక్ తినిపించుకొని ఉల్లాసంగా గడిపిన అనిల్, ఇదే రోజున తండ్రి చేత తలకొరివి పెట్టించుకోవడం అంత్యక్రియలకు హాజరైన వారిని కంటతడి పెట్టించింది. విచారణ వేగవంతం అనిల్ హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. అంత్యక్రియలకు ముందు ఎస్ఐ మహమ్మద్ గౌస్ అనిల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తులో ముందుకు సాగుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి నుంచి అనిల్ కారులో బయలుదేరిన సమయం నుంచి హత్య జరిగిన ఘటనా స్థలికి వచ్చిన ప్రదేశం వరకు మండలంలో దారి పొడవున ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వెంట ప్రతిరోజు తిరిగే స్నేహితులు, అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. స్వగ్రామం పైతరలో అంత్యక్రియలు మండలంలో సీసీ కెమెరాల పరిశీలన అనిల్ మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ ఆయన అనుచరులనువిచారిస్తున్న పోలీసులు! ఇన్స్ట్రాగామ్లో అనిల్ వీడియోలు వైరల్ మండలంలో ఏ వ్యక్తి మొబైల్లో చూసినా అనిల్కు సంబంధించిన ‘మరెల్లి అనిల్... మౌర్య ‘ పేరిట ఇన్స్ట్రాగామ్లో వివిధ సందర్భాల్లో అప్లోడ్ చేసిన అతడి వీడియోలు వైరల్గా మారాయి. -
అధికారులు పరిశీలించాలి
సాగు నీరు లేదు, వానలు పడక ఆరుతడి పంట మొక్కజొన్న సాగు చేసినం. వరి పెడితే బాయిల ఊట నీరు లేకపాయే. మక్క పెడితే కత్తెర పురుగు రావట్టే. ఏ మందులు కొట్టినా పురుగు పోతలేదు. వ్యవసాయ అధికారులు పంట చేన్లకు వచ్చి తెగుళ్లపై సూచనలు, సలహాలు ఇస్తే పాటిస్తం. ఇప్పటి వరకుఒక అధికారి కూడా రాలేదు. రైతులకు కావల్సిన యూరియాను షరతులు లేకుండా ఇయ్యాలి. – రాంగోపాల్రావు, రైతు, గాంధీనగర్మీర్జాపూర్లో కత్తెర పురుగు తినేసిన రైతు రాములు మొక్కజొన్న చేను● -
జనం కోసమే కమ్యూనిస్టు పార్టీ
హుస్నాబాద్ : జనం కోసమే కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని, త్యాగ గుణం ఉన్న వారే ఈ పార్టీలో ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఓ గార్డెన్లో సీపీఐ జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్ చౌరస్తా నుంచి గార్డెన్ వరకు డప్పు చప్పుళ్లతో సీపీఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాంబశివ రావు మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టులు లేని పేజీ అంటూ ఉండదన్నారు. అడవిలో ఉండి ప్రజల కోసం పని చేసే మావోయిస్టులను కాల్చి చంపడం సరికాదన్నారు. కమ్యూనిస్టులన్నా, ఎర్ర తిలకం అన్న బీజేపీకి భయమన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా విస్మరించారన్నారు. కట్టను పూర్తి చేసి కాలువలను తవ్వలేదన్నారు. కమ్యూనిస్టులను ఏరివేయాలని మోదీ ప్రయత్నిస్తున్నాడని, ప్రశ్నించే గొంతుకలు ప్రజాస్వామ్యంలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్, జిల్లా కార్యదర్శి మంద పవన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు శంకర్, లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, సత్యనారాయణ, వనేష్, కొమురయ్య, లక్ష్మణ్, జనార్దన్, రాజ్కుమార్, పద్మ ఉన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ రావు -
వీధి కుక్కల దాడి
● పలువురికి గాయాలు శివ్వంపేట(నర్సాపూర్): వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఒకే రోజు గ్రామానికి చెందిన వంజరి నర్సయ్య, వరలక్ష్మి, అనిత, మహేష్పై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు గురైన వారు చికిత్స చేయించుకున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, నివారణకు చర్యలు తీసుకోవాల ని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పనిచేస్తున్న చోటేసర్దుబాటు చేయాలి మెదక్ కలెక్టరేట్: ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు తరలించకుండా పనిచేస్తున్న చోటే వర్క్ సర్దుబాటు చేయాలని ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మెదక్ డీఈఓ రాధాకిషన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. 20లోపు విద్యార్థులున్న చోట ఇద్దరు, 40లోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ముగ్గురు, 60 లోపు విద్యార్థులుంటే 4మంది, 60 దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, వందమంది దాటితే ఆ పాఠశాలకు నిబంధనలు పెట్టకుండా తరగతి గదికి ఉపాధ్యాయుడితోపాటు హెచ్ఎంను కూడా నియమించాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింక అశోక్, జగన్, నాయకులు దశరథం, గణేష్ పాల్గొన్నారు. వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యంనర్సాపూర్ రూరల్: యువకుడు అదృశ్యమైన ఘటన మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెలమకన్నె నవీన్(26) నర్సాపూర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. కాగా ఈనెల 14న బంకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో అతడి ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. నవీన్ అన్న జగన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తొమ్మిది నెలల గర్భిణి .. పటాన్చెరు టౌన్: తొమ్మిది నెలల గర్భిణి అదృశ్యమైన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన పప్పుసింగ్ భార్య పూజాభాయితో కలిసి బతుకుదెరువు కోసం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ తండాకు వచ్చారు. గుడిసె వేసుకొని ఆయుర్వేదిక్ మందులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పూజాభాయి 15వ తేదీన తెల్లవారుజామున ఎరుపు రంగు కారులో వెళ్లిందని స్థానికులు చెప్పడంతో భర్త వెళ్లి చూడగా కారు కనిపించలేదు. చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇసుక అక్రమ డంప్ సీజ్
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్పై సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మండల కేంద్రానికి చెందిన మిడిమలుపుల సాంబరాజు ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన 120టన్నుల అక్రమ ఇసుక డంప్ను బుధవారం టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి ఎక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు నిర్వహించి ఇసుక డంప్, ట్రాక్టర్ను సీజ్ చేశామని తెలిపారు. కానిస్టేబుల్ రాజ్కుమార్, టాస్క్ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు. -
● మానవ మనుగడకు కష్టాలు ● సహజ లక్షణాలు కోల్పోతున్న నేలలు ● సేంద్రియ ఎరువులే మేలంటున్నఅధికారులు ● జిల్లాలో 5.20 లక్షల ఎకరాల్లో పంటల సాగు
పంట సాగులో రైతులు రసాయన ఎరువులను అధికంగా వాడుతున్నారు. దీంతో పుడమికి నష్టం, మానవ మనుగడకు కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో భూమి సహజ లక్షణాలను కోల్పోయి నిస్సారమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితేభవిష్యత్లో భూములు సేద్యానికి పనికి రాకుండా పోతాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే సేంద్రియ ఎరువుల వాడకం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. దుబ్బాకటౌన్:రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఓ నరేష్జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 5.20 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో 2.17లక్షల ఎకరాల్లో వరి, 93 వేల ఎకరాల్లో పత్తి, 19 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 31 వేల ఎకరాల్లో కంది, 131 ఎకరాల్లో పెసర పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల అంచనా. పంట దిగుబడి ఎక్కువగా రావాలని రైతులు ఎకరాకు 150 కిలోల డీఏపీ, వంద కిలోల యూరియాను వినియోగిస్తున్నారు. పూత దశకు వచ్చాక పత్తికి 5 సార్లు పురుగుల మందులను పిచికారీ చేసున్నారు. 1960 సంవత్సరంలో వచ్చిన హరిత విప్లవం వ్యవసాయ విధానంతో పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. రసాయనిక ఎరువులతో దిగుబడులు పెరుగుతాయని ఎరువుల మోతాదులు కూడా పెంచుతున్నారు. క్షీణిస్తున్న భూసారం.. రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడటం ద్వారా పంట భూములు నిస్సారమవుతున్నాయి. యూరియా బస్తాల్లో 46 శాతమే యూరియా ఉంటుంది. మిగతా 54 శాతం సున్నపు గుళికలాంటి మూలపదార్థాలు ఉంటాయి. ఈ గుళికలపై సున్నపు పూత పూస్తారు. దీనిని నేలపై వేయడంతో 54 శాతం ఉన్న మూల పదార్థాలు ఏటా నేలపై పేరుకుపోయి భూసారం తగ్గుతుంది. నేలపై ఉండే సహజ బ్యాక్టీరియా, రైతు నేస్తాలు నశించిపోతున్నాయి. ఫలితంగా రైతులకు దిగుబడులు తగ్గుతున్నాయి. కాలానికనుగుణంగా మారుతూ.. గతంలో వ్యవసాయం చేసే తీరే వేరుగా ఉండేది. రైతులు తమ కుటుంబానికి సరిపడా అన్ని రకాల పంటలు పండించేవారు. దిగుబడుల కోసం సేంద్రియ ఎరువులనే చల్లేవారు. అందువల్లే అప్పట్లో రైతులు ఆరోగ్యంగా ఉండేవారు. పశువుల మల, మూత్ర వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులను ఎక్కువగా వినియోగించేవారు. కానీ మారుతున్న కాలానికనుగుణంగా వ్యవసాయ విధానం కూడా మారుతూ వస్తుంది. సేంద్రియ ఎరువులు ఉత్తమం భూముల సారం కోల్పోకుండా ఉండేందుకు రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి. ఈ ఎరువులతో భూమిలో పోషక విలువలు పెరిగి గుల్లగా మారుతుంది. నీటిని పీల్చుకునే తత్వం వృద్ధి చెందుతుంది. మొక్కలకు నీటితో పాటు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. రైతులు నానో యూరియాను వాడండి. సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పిస్తున్నాం. – మల్లయ్య, ఏడీఏ, దుబ్బాకయూరియా కోసం బారులు.. అధిక యూరియా వినియోగించవద్దని రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో రైతులకు అవగాహన కల్పించినా తీరు మారడం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. సరిపడా యూరియా పంపిణీ చేసినా కూడా అధిక శాతం కొనుగోలు చేస్తున్నారని అఽధికారులు చెబుతున్నారు. -
అలోవెరా సాగుతో అధిక ఆదాయం
కౌడిపల్లి(నర్సాపూర్): అలోవెరా పంట సాగు తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి వద్దగల కేవీకేలో ఏఏఏఆర్ఎం ఆధ్వర్యంలో ఎస్సీ సబ్ప్లాన్లో భాగంగా ఎస్సీ మహిళా రైతులకు సేంద్రియ పద్ధతిలో అలవెరా, చిరుధాన్యాల సాగు, వాటి ఉత్పత్తులపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో పడావు భూముల్లో అలవెరా సాగు చేయవచ్చన్నారు. సబ్బుల తయారీ, జ్యూస్, ఇతర సౌందర్య సాధనాలతోపాటు ఇతర ఉత్పత్తులలో ఉపయోగిస్తారని చెప్పారు. అనంతరం క్షేత్రస్థాయిలో అలవెరా పంట సాగును పరిశీలించి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, మహిళా రైతులు పాల్గొన్నారు.కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి -
భూ భారతితో రైతుకు న్యాయం
మునిపల్లి(అందోల్): కంకోల్ గ్రామానికి చెందిన రైతు మడప్పకు భూ భారతితో న్యాయం జరిగింది. వివరాలు ఇలా... గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్లో తప్పిదం వల్ల మడప్ప 5 ఎకరాల భూమి వెరే రైతుపై నమోదైంది. దీంతో తన భూమి వేరే రైతుపై తప్పుగా పడిందని, భూమి రికార్డులు చూసి తన పేరుపైకి మార్చాలని తహసీల్దార్, కలెకర్ట్ కార్యాలయం చుట్టూ ఆరేళ్లుగా తిరిగాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్లోని సీసీఎల్ కార్యాలయం చుట్టూ తిరిగి పాత రికార్డుల ప్రకారం తన 5 ఎకరాలకు సంబంధించి అధికారుల ద్వారా తన పేరిట పాస్బుక్లు తీసుకున్నాడు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో రైతు సమైక్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గంగాభవానిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగన్న, మల్లికార్జున్ శెట్టి, రెవెన్యూ అధికారి జైపాల్, శేఖర్, రాజు, ఈశ్వర్రెడ్డి, వీరన్న, రాంరెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఎట్టకేలకు రైతు పేరిట పాస్బుక్లు -
న్యాయ సేవలు మరింత విస్తృతం: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలో బాధిత మహిళలకు న్యాయ సహాయ సేవలు మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం మహిళా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మిషన్ వాత్సల్య ద్వారా బాలల సంక్షేమం, దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం, విద్య, ఆరోగ్య పరిరక్షణపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు అందుతున్న సేవలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓలు చంద్రకళ, జయరామ్, ప్రియాంక, అంజమ్మ, సుజాత, డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సౌమ్య, జిల్లా మహిళ సాధికారత కోఆర్డినేటర్ పల్లవి, సఖి కేంద్రం కోఆర్డినేటర్ కల్పన, తదితరులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానంసంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మెదక్ ఆర్సీఓ గౌతంకుమార్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక పద్ధతిలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, సోషల్, గణితం, హిందీ సబ్జెక్టులను బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, పీజీ చేసి 50% మార్కులు తగ్గకుండా ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఈ నెల 19న సంగారెడ్డిలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441250450ను సంప్రదించాలన్నారు. 17 కల్లు దుకాణాల నమూనాల సేకరణపటాన్చెరు టౌన్: ఐలాపూర్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న ఓ కల్లు దుకాణంపై కేసు పటాన్చెరు ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదలలో మొత్తం 17 కల్లు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి నిజామాబాద్ ల్యాబ్కు పంపించారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐ పరమేశ్వర గౌడ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. సిగాచి బాధితులకు రూ.కోటి పరిహారంసీఐటీయూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతి మెదక్ కలెక్టరేట్: సిగాచి పరిశ్రమలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం కింద రూ.కోటి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐటీయూ నేతలు అదనపు కలెక్టర్ నగేశ్కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గౌరి మాట్లాడుతూ... సంగారెడ్డి జిల్లా లోని పాశమైలారం ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రూ.50 లక్షలు, పరిశ్రమ యాజమాన్యం కోటి రూపాయలు వెంటనే ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించడంతోపాటు పరిశ్రమల ఇన్స్పెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఘటన జరిగి 15 రోజులవుతున్నా ఇప్పటికీ పరిశ్రమ యాజమాన్యంగాని, ప్రభుత్వంగాని బాధితులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లాలో కూడా చాలా పరిశ్రమల్లో రియాక్టర్స్ లేవని, అలాంటి పరిశ్రమలపై చర్యలు చేపట్టాలన్నారు. -
రూ.3.34 కోట్లు
వసతుల కల్పనకుప్రభుత్వ కళాశాలలు బలోపేతం ● పెరగనున్న ప్రవేశాలు! న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యనందించేందుకు సర్కారు దృష్టి సారించింది. ప్రభుత్వ కళా శాలల్లో వసతుల లేమితో విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారని గుర్తించిన ప్రభు త్వం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. కళా శాలల్లో పూర్తిస్థాయిలో అధ్యాపకులు నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, విద్యార్థుల హాజరు పర్యవేక్షణ నిమిత్తం రూ.3.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. విద్యార్థుల ఇబ్బందులు దూరం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు వారెదుర్కొంటున్న ఇబ్బందులు దూరం కానున్నాయి. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు 48 ప్రైవేట్, ఇతర కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యా లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం 17 కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇటీవల రూ.3.34 కోట్లు మంజూరు చేసింది. సౌకర్యాలు కల్పిస్తాం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 17 జూనియర్ కళాశాలలకు రూ.3.34కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో భవనాలు, మూత్ర శాలల మరమ్మతులు, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ బోర్డులు తదితర సౌకర్యాలు కల్పిస్తాం. ప్రవేశాల ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అకాశం ఉంది. –గోవింద్రావు, డీఐఈఓ–సంగారెడ్డి ఏ కాలేజీకి ఎన్ని నిధులు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైన నిధులు (రూ.లక్షల్లో) 1) సంగారెడ్డి(బాలికలు) రూ. 10.50 2) సంగారెడ్డి(బాలురు) రూ. 313) పుల్కల్ రూ. 9.20 4) పటాన్చెరువు రూ. 65) రామచంద్రపురం(గీతా భూపాల్రెడ్డి) రూ. 12.506) అందోల్ రూ. 207) అందోల్(బాలికలు) రూ. 15 8) సదాశివపేట్ రూ. 21.609) కొండాపూర్ రూ. 25 10) జిన్నారం రూ. 21 11) నారాయణఖేడ్ రూ. 2812) కోహీర్ రూ. 24.5013) హత్నూర రూ. 11.30 14) హద్నూర్(న్యాల్కల్ మండలం) రూ. 29.5015) న్యాల్కల్ రూ. 26.5016) బుధేరా(మునిపల్లి) రూ. 13.1017) కంగ్టి రూ. 28.50 -
మద్రాస్ ఐఐటీతో అనంతసాగర్ ఒప్పందం
చిన్నకోడూరు(సిద్దిపేట): స్కూల్ కనెక్ట్ పేరుతో ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మండలంలోని అనంతసాగర్ జెడ్పీ ఉన్నత పాఠశాల భాగస్వామ్యం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి కోర్సులు, కోడింగ్ సంబంధించిన విషయాలను ఐఐటీ ఫ్రొఫెసర్లతో ఆన్లైన్ ద్వారా విద్యార్థులు నేర్చుకోనున్నారు. పూర్తి విధి,విధానాలను త్వరలో పాఠశాలకు తెలియజేస్తారని పాఠశాల హెచ్ఎం జ్యోతి తెలిపారు. రైస్మిల్ యజమాని అరెస్ట్ చిన్నశంకరంపేట(మెదక్): రైస్మిల్ యజమాని, మాజీ సర్పంచ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలో రైస్మిల్ నిర్వహించే మైనంపల్లి రంగారావు గత ఏడాది ప్రభుత్వ ధాన్యం తీసుకుని తిరిగి బియ్యం అందించడంలో విఫలమయ్యాడు. ప్రభుత్వానికి రూ.1 కోటి 35 లక్షలు బకాయిపడగా, అందులో రూ.కోటి నగదు రూపంలో చెల్లించాడు. మరో రూ.35 లక్షలకు తోడు 25 శాతం పెనాల్టీ చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చారు. కాగా పెనాల్టీ తగ్గించాలని రంగారావు అభ్యర్థించాడు. కాగా ఈ కేసులో చిన్నశంకరంపేట పోలీసులు కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లిన రంగారావును అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. బైక్ను తగులబెట్టినదుండగులు నర్సాపూర్ : గుర్తు తెలియని దుండగులు బైక్కు నిప్పు పెట్టారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లింగం వివరాల ప్రకారం... నర్సాపూర్కు చెందిన రమేష్నాయక్ సోమవారం రాత్రి ఇంటి ముందు బైక్ను పార్కు చేశాడు. అర్ధరాత్రి శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి చూసేసరికి బైక్ కాలిపోతుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి మంటలు ఆర్పాడు. బైక్ తగులబడుతున్న సమయంలో ఓ వ్యక్తి కన్పించాడని, అతడికి, తనకు గతంలో డబ్బుల విషయమై గొడవలు జరిగాయని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మందుబాబులకు జైలు, జరిమానా సిద్దిపేటకమాన్: మందుబాబులకు సిద్దిపేట కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 18మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.28,500 జరిమానా, వీరిలో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. చికిత్స పొందుతూవ్యక్తి మృతి శివ్వంపేట(నర్సాపూర్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తుక్యా తండాకు చెందిన సితారం(50) బోరు మోటార్లు రిపేర్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారం రోజుల క్రితం తిమ్మాపూర్ నుంచి తండాకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ.. సంగారెడ్డి క్రైమ్: ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... గుర్తు తెలియని మహిళ(35 నుంచి 45), గత నెల 24న ఆస్పత్రి అత్యవసర ద్వారం వద్ద మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీలో భద్రపరిచారు. ఫలహారం బండి ఊరేగింపు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆషాఢమాస బోనాల ఉత్సవాలు సిద్దిపేట జిల్లాలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజు అమ్మవార్లకు భక్తులు బోనాలు తీసుకెళ్లి నైవేద్యాలు సమర్పించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నల్లపోచమ్మ ఆలయానికి భక్తులు ఫలహారాల బండిని తరలించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, జోగినిల నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య ఫలహారం బండి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సిద్దిపేటలో ఫలహారాల బండి అమ్మవారి వద్దకు ఊరేగింపుగా వెళ్లడం ఇదే తొలిసారి అవ్వడంతో భక్తులు భారీగాతరలివచ్చారు. -
డీఎస్ఆర్తో రైతులకు మేలు
నారు, నాట్లు లేకుండానే నేరుగా వరి సాగు ● నీటి వినియోగం, కూలీల ఖర్చు ఆదా ● జిల్లాలో వంద ఎకరాల్లో పంట ● అవగాహన కల్పిస్తున్నవ్యవసాయాధికారులు మండలంలో ఆరు ఎకరాల్లో డీఎస్ఆర్ (డైరెక్ట్ సీడెడ్ రైస్) విధానం కొనసాగుతుంది. నేరుగా వరి విత్తనాలు తడి, పొడి నేలల్లో విత్తుకునే అవకాశం ఉండగా, జిల్లా రైతులు పొడి నేలల్లోనే ఎక్కువగా, డ్రమ్సీడర్ సహాయంతో విత్తుకుంటున్నారు. కాగా తడి నేలల్లో విత్తనాలు వేసే రైతులు ముందుగా నీళ్లల్లో నానబెట్టి, బురదలో చల్లుకోవచ్చు. గతంలో పంట కోసిన అనంతరం నేలను రెండుసార్లు దుక్కి దున్ని, రోటావేటర్ చదును చేసిన తర్వాత, ట్రాక్టర్తో నేలలో 2 నుంచి 3 సెం.మీ. లోతు సాళ్లు తీసుకుని, నేరుగా, లేదా డ్రమ్ సీడర్తోనైనా వరి విత్తనాలు వేసుకోవచ్చు. వరుసల మధ్య సుమారు 20 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు సుమారు 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరమవుతాయని, విత్తన ఎంపికలో వ్యవసాయాధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కలుపును మాత్రం సమయానికి తీయాలని, లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. సస్యరక్షణ చర్యలు పాటిస్తే డీఎస్ఆర్తో అధిక దిగుబడులు సాధించవచ్చనితెలిపారు. ప్రయోజనాలు ఈ పద్ధతితో తూకం వేయడం, నారు మడులను సంరక్షించడం ఉండకపోవడంతో నీటి వినియోగం తగ్గుతుంది. నాటు వేయరు గనుక కూలీల ఖర్చు ఉండదు. నేలను అధిక భారంతో దున్నకపోవడంతో నిర్మాణం సక్రమంగా ఉంటుంది. రసాయనాల వినియోగం చాలావరకు తక్కువగా ఉండటంతో నేల సారవంతమవుతుంది. ఈ పద్ధతి వాతావరణ మార్పులకు అనుకూలంగా ఉండటంతో గ్రీన్హౌస్ వాయువులను తగ్గిస్తుంది. సాధారణ వరి సాగుతో పోలిస్తే పెట్టుబడి తక్కువ. పైగా సంప్రదాయ వరి సాగు కంటే పది రోజుల ముందే పంట చేతికొస్తుంది.ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, నీటి వినియోగాన్ని అధికం చేసుకుంటూ, సంప్రదాయ వరి సాగు చేస్తున్న రైతులకు డీఎస్ఆర్ (వరి విత్తనాలను నేరుగా పొలంలో నాటడం)విధానంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు సుమారు 100 ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేస్తున్నట్లు అంచనావేస్తున్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): తగ్గిన శ్రమ.. ఖర్చులు అధికారుల సూచనల మేరకు మూడెకరాల్లో డీఎస్ఆర్ విధానంలో వరి సాగు చేశా. ప్రస్తుతం పంట బాగుంది. నీటి వినియోగం తగ్గడంతో పాటు, కూలీల అవసరం తగ్గింది. దీంతో చాలావరకు శ్రమ తగ్గింది. నారు, నాట్లు లేకపోవడంతో ఖర్చులు చాలా తగ్గాయి. గతంలో నాటేసే కూలీలకే ఎకరాకు 5 నుంచి 6 వేలకు ఇచ్చేవాళ్లం. సరైన దిగుబడి వస్తే ఈ పద్ధతినే కొనసాగిస్తా. – దేవేందర్రెడ్డి, రైతు, చండూర్ అవగాహన కల్పించాం జిల్లా రైతులకు తమ సిబ్బంది డీఎస్ఆర్ పద్ధతిపై అవగాహన కల్పించారు. దీంతో ఆసక్తి ఉన్న పలువురు రైతులు ముందుకు వచ్చారు. ఈ విధానంలో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. తక్కువ సాగు నీరు ఉన్న రైతులకు ఎంతో ఉపయోగం. పైగా పెట్టుబడి తక్కువ. పంటకాల వ్యవధి తక్కువ. మరింత మంది రైతులు ఈ విధానంలో సాగు చేయాలి. – కే.దేవ్కుమార్, డీఏఓ -
వేర్వేరు చోట్లముగ్గురు అదృశ్యం
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రానికి చెందిన తల్లీకూతురు అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి వివరాల ప్రకారం... పేటకు చెందిన చీలాపల్లి రేణుక, సాయిలు దంపతులు. వీరికి ఐదేళ్ల కూతురు మయూరి ఉంది. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల వీరు పీర్ల పండుగ సందర్భంగా మండలానికి వచ్చి తిరిగి ఈ నెల 9న హైదరాబాద్కు వెళ్లారు. అనంతరం సాయిలు భార్య, కూతురు కనిపించడం లేదని రేణుక తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో.. సిద్దిపేటకమాన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం..పట్టణంలోని రేణుకానగర్కు చెందిన ఆకునూర్ బాల్నర్సయ్య (66) స్థానికంగా ఉన్న ఓ టింబర్డిపోలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు సోమవారం పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం భార్య రాజవ్వకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్య, వైద్యం హబ్గా అభివృద్ధి చేస్తాం
● పెండింగ్ పనులు పూర్తి చేయాలి ● మంత్రి దామోదర రాజనర్సింహజోగిపేట (అందోల్): అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్ హబ్గా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోల్లో ఉన్న కేజీబీవీ పాఠశాల, నర్సింగ్ కళాశాల, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలను మంగళవారం ఆయన పరిశీలించారు. నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు, డబుల్ రోడ్డు పనులను పరిశీలించి వెంటనే పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు సూచించాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్, విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. అందోల్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను సమకూర్చుతున్నామన్నారు. నర్సింగ్ కళాశాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట రాజనర్సింహ ఫౌండేషన్ చైర్మన్ త్రిష, అందోల్ ఆర్డీఓ పాండు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, పాఠశాలల ప్రిన్సిపాల్స్ జ్యోతి, వాణి, పద్మ మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్, ధనుంజయ రెడ్డి తదితరులున్నారు. -
ఉదయం తెల్లవారగానే మూగజీవాల చెంతకు..
తాము ఉదయం తెలవారగానే, లేదా పాడి రైతులు ఫోన్ చేసి సమస్య చెప్పగానే వారి వద్దకు వెళ్తాం. పశువులకు ఎదురైన సమస్యకు తగు ప్రథమ చికిత్సలు అందజేస్తాం. ప్రయాణ సమయాల్లో ప్రమాదాల బారిన పడుతున్నాం. కనీస ఉద్యోగ భద్రత లేదు. – రాంచందర్రావుపాటిల్, గోపాలమిత్ర, గాజుల్పాడ్ 25 ఏళ్లుగా విధులు.. 25 ఏళ్లుగా పాడి రైతుల ముంగిట్లో మేలు జాతి పశువుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం. ప్రభుత్వం గుర్తించి రూ.24వేల వేతనం చెల్లించాలి. సీనియార్టీ ప్రకారం పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేటర్లుగా నియమించాలి. – గంప శివకుమార్, జిల్లా అధ్యక్షుడు, గోపాల మిత్ర సంఘం -
పుట్టెడు దుఃఖం మిగిల్చి
పుట్టిన రోజుకు ముందేకొల్చారం(నర్సాపూర్): కాంగ్రెస్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పేద కుటుంబంలో పుట్టిన అనిల్.. రాజకీయంగా అంచెలంచెలుగా జిల్లాస్థాయి నాయకుడిగా ఎదిగారు. పైగా ఆర్థికంగా బలపడ్డారు. అయితే సోమవారం హైదరాబాద్లో పార్టీ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు వెంటాడి కాల్పు లు జరిపి అనిల్ను మట్టుబెట్టారు. దీంతో అతడి సొంతూరు కొల్చారం మండలం పైతరలో విషా దం నెలకొంది. బుధవారం అనిల్ పుట్టిన రోజు ఉండటం ఒక రోజు ముందే హత్యకు గురికావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో.. దేవుడా.. ‘అయ్యో.. బిడ్డా పుట్టిన రోజుకు ఒక ముందే మమ్మల్ని విడిచి పోయావా?.. దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?’ అంటూ అనిల్ తల్లి యేసమ్మ రోదించడం అక్కడున్న వారిని కది లించింది. బర్త్డే వేడుకలు చేసుకుందాం.. అంద రం కలుసుకుందాం అని చెప్పిన అనిల్ను ఇలా విగతజీవిగా చూస్తామని కలలో కూడా ఊహించలేదని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. మా అన్న కు శత్రువులు కూడా ఎవరూ లేరని అనిల్ సోద రుడు నవీన్ విలపిస్తున్నాడు. పోలీస్ ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విషాదఛాయలు అనిల్ మృతితో పైతర గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కావాలనే పిలిచి తమ కుమారుడిని హత్య చేశారంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అనిల్పై కాంగ్రెస్ నాయకులతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడిన 15 నిమిషాలకే.. ఫోన్లో మాట్లాడిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త అందిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్లో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి నాతో పాటు అనిల్, ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారన్నారు. తిరుగు ప్రయాణంలో అదే కారులో నేను మరికొంతమంది కలసి ప్రయాణమయ్యామన్నారు. నేను కూకట్పల్లి మెట్రోస్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 7:45కు ఫోన్ చేయగా అందర్నీ వారివారి గ్రామాల్లో దించేసి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారని, పావుగంట తర్వాత అనిల్కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందని వివరించారు. కలకలం రేపిన కాంగ్రెస్ నేత హత్య కొల్చారం మండలం పైతరలో విషాదం -
బంతిరాళ్ల సమాధులను పరిరక్షించాలి
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని అయినాపూర్ శివారులో క్రీస్తూ పూర్వం 2వేల సంవత్సరాల నాటి బంతిరాళ్ల సమాధులు ఉన్నాయని, అవి మాయమవుతున్నాయని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. బంతిరాళ్ల సమాధులను పరిశీలించి వివరాలు వెల్లడించారు. ప్రాచీన శిలాయుగంలో మనిషి కళేబరాన్ని ప్రకృతికి వదిలివేయగా, కొత్త రాతి యుగంలో చనిపోయిన వ్యక్తితో పాటు అతనికి ఇష్టమైన వస్తువులు, వాడిన వస్తువులు అతనితో పాటు ఖననం చేసేవారని చెప్పారు. ఈ సమాధుల చుట్టూ పెద్ద బండరాళ్లను పేర్చి మధ్యలో చనిపోయిన వ్యక్తిని ఖననం చేసేవారని తెలిపారు. ఆ రాళ్లను రాక్షసులు పెట్టేవారు అనుకుని రాకాసి గుళ్లు అని , బంతిరాళ్ల సమాధులు పిలుస్తుంటారని వివరించారు. అయినాపూర్ గ్రామ శివారులో 60 వరకు ఉండేవని రైతులు వాటిని తీసివేసి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నాలుగు మాత్రమే ఉన్నాయని వాటిని కాపాడాలని కోరారు.చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ -
అటవీ భూమి ఆక్రమణ
శివ్వంపేట(నర్సాపూర్): A{MýSÐ]l$…V> ArÒ ¿¶æ*Ñ$° B{MýS-Ñ$…_ §ýl$°²¯]l çœ$r¯]l Ð]l$…yýlÌS ç³Ç-«¨ÌZ° Ð]l$VýS$®…-ç³NÆŠ‡ ArÒ {´ë…™èl… MýS…´ë-Æý‡Š-ె- -Ã…sŒæ 348ÌZ ^ør$^ól-çÜ$MýS$…¨. ÕÐ]lÓ…õ³r òÜ„ýS¯ŒS A«¨M>Ç }«§ýl-ÆŠ‡MýS$Ð]l*ÆŠ‡ ÑÐ]l-Æ>ÌS {ç³M>-Æý‡…... gñæ…V>Å ™èl…yéMýS$ ^ðl…¨¯]l MøÌê Æ>k ArÒ ¿¶æ*Ñ$ ^èl$r*t ™èlÑÓ¯]l MýS…§ýl-M>°² ç³Nyìla-ÐólíÜ ¿¶æ*Ñ$° ^èl§ýl$¯]l$ ^ólÔ>yýl$. A…™ólV>MýS Æ>{† ÐólâýæÌZÏ {sêMýSt-ÆŠ‡™ø §ýl$¯]l²MýS… ^ólç³sêtyýl$. {sêMýStÆŠ‡ C…h-¯ŒSMýS$ MóSi-ÒÌŒæ HÆ>µr$ ^ólíܯ]l-ç³µ-sìæMìS ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$° ´ùÎ-‹Ü-õÜt-çÙ¯ŒSMýS$ ™èlÆý‡-Í…_ íœÆ>ŧýl$ ^ólÔ>Æý‡$. ½sŒæ BïœçÜÆý‡$Ï MýS$Ð]l*ÆŠæ, }Ð]l-ÍÏ, MýSÈ…Ð]l¬ÌêÏ, Æ>f-Ð]l$×ìæ, Vø´ëÌŒæ, Æý‡Ð]l$Å-}, ÕÈçÙ, Æð‡…gŒæ, »ôæ‹Ü M>Å…ç³# íܺ¾…¨ E¯é²Æý‡$.ట్రాక్టర్ స్వాధీనం.. కేసు నమోదు -
స్వచ్ఛతకు నిధులు
కేటాయింపు ఇలా.. మున్సిపాలిటీ నిధులు (రూ.లలో) అమీన్పూర్ 7,17,141 అందోల్–జోగిపేట 4,26,848 బొల్లారం 42,76,373 చేర్యాల 3,65,174 దుబ్బాక 5,49,240 గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 66,26,784 హుస్నాబాద్ 4,33,385 మెదక్ 8,12,730 నర్సాపూర్ 3,79,634 రామాయంపేట 3,59,549 సదాశివపేట 6,96,026 సంగారెడ్డి 22,29,523 సిద్దిపేట 1,19,70,573 తెల్లాపూర్ 45,56,296 తూప్రాన్ 24,13,867 జహీరాబాద్ 12,05,599 నారాయణఖేడ్ 3,65,934 ● ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.3.83 కోట్లు ●● 16 మున్సిపాలిటీలకు కేటాయింపు ● మెరుగుపడనున్న పట్టణాలు సాక్షి, సిద్దిపేట: పట్టణాలకు ప్రతీ ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ ర్యాంకులను కేటాయిస్తుంది. వివిధ కేటగిరిలలో ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ అవార్డులను ప్రకటిస్తుంది. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాలకు అత్యధికంగా అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2021లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ 2026 అక్టోబర్ వరకు కొనసాగ నుంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం పట్టణాలకు నిధులు కేటాయిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.3,83,84,676 నిధులు మంజూరు చేశారు. ఆయా పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అత్యధికంగా సిద్దిపేట మున్సిపాలిటీకి, అత్యల్పంగా రామాయంపేట మున్సిపాలిటీకి నిధులు మంజూరయ్యాయి. వీటి నిర్వహణకు.. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులను ఘన వ్యర్థాల నిర్వహణ, సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపు, విజ్ఞానం, కమ్యూనికేషన్, ప్రజారోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా వెచ్చించనున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు, బయో మైనింగ్ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించాలని ఆదేశించారు. సౌకర్యాలు ఇక మెరుగు మున్సిపాలిటీలలో వసూలయ్యే పన్నుల ద్వారా దాదాపు అన్ని కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతోంది. అయితే ఆదాయం తక్కువగా వస్తుండటంతో కార్యాలయ భవనాల, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులు మంజూరైన తరుణంలో మున్సిపాలిటీలలో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. -
కాళేశ్వరం నీటి సర్వేకు రూ.108.50 కోట్లు
జోగిపేట (అందోల్): కాళేశ్వరం నుంచి సింగూరు ప్రాజెక్టులోకి 20 టీఎంసీల నీటిని తరలింపునకు కాళేశ్వరం నీటి సర్వే పనులకు ప్రభుత్వం రూ.108.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్ తెలిపారు. కాళేశ్వరం నీటి సర్వే పనులు పూర్తయ్యేందుకు రూ.1000 కోట్లు అవుతుందని, దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.108.50 కోట్ల నిధులతో రూపొందించే సర్వే పనులు రెండు మూడు నెలల్లో పూర్తయితే, పెద్దరెడ్డిపేట వద్ద రూ.1000 కోట్ల నిధులతో చేపట్టబోయే సింగూరు కాల్వ పనులకు సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయిస్తామని తెలిపారు. ఈ సర్వే పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని అందోల్, వట్పల్లి, రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల పరిధిలో ఉన్న రైతాంగానికి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్రెడ్డి, అందోల్, టేక్మాల్ పార్టీ అధ్యక్షుడు శివరాజ్, నిమ్మ రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మాజీ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. త్వరలో సింగూర్ పనులకు సీఎంతో శంకుస్థాపన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్ -
గోపాల మిత్రల గోడు వినరేం!
● 10 నెలలుగా అందని వేతనాలు ● 25 ఏళ్లుగా భద్రత లేని బతుకులు నారాయణఖేడ్: మూగ జీవాల సంరక్షణకు పాటుపడుతూ పొద్దస్తమానం కష్టిస్తున్న గోపాల మిత్రల కష్టాలకు ఫలితం దక్కడంలేదు. పదినెలలుగా విడుదలకాని చాలీచాలని వేతనం, ఏమాత్రం భద్రతలేని ఉద్యోగం, నిర్ణీత సమయంలేని ఉద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతీ అధికారి, ప్రజాప్రతినిధి వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువవడంతో మూగవేదన అనుభవిస్తున్నారు. మూగజీవాలకు సేవ చేస్తున్నామన్న సంతృప్తితోనే కష్టాల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. 2000వ సంవత్సరంలో రాష్ట్రంలో గోపాల మిత్రలను ప్రభుత్వం నియమించింది. వీరు గ్రామీణ ప్రాంతాల్లోని పశువైద్యులు, పశు వైద్య సిబ్బందికి సహాయకారిగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ వారు చేసే విధులన్నీ వీరే నిర్వర్తిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు.. ఒక్కో గోపాల మిత్రకు ఐదారు గ్రామాల పరిధి ఉంటుంది. ఉదయం లేచింది మొదలు సమయం అంటూ లేకుండా రాత్రి పొద్దుపోయేవరకు ఇళ్లకు తిరిగి పశువులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తుంటారు. ప్రయాణ సమయాల్లో ఏదైనా జరగరానిది జరిగితే తమపై ఆధార పడ్డ కుటుంబం రోడ్డున పడాల్సిందేనని గోపాల మిత్రలు వాపోతున్నారు. వైఎస్ చలవతో వేతనం ప్రారంభం.. 2000లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా గోపాల మిత్రలను పశుసంవర్ధక శాఖలో నియమించారు. కానీ, వీరికి వేతనం చెల్లించలేదు. 2007లో నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి వీరి సేవలను గుర్తించి రూ.1,200ల గౌరవ వేతనం చెల్లించడం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వాలు వేతనాలను పెంచుతూ నేడు రూ.11,050లు అందిస్తున్నారు.జిల్లా గోపాల మిత్రలు సంగారెడ్డి 45 సిద్దిపేట 66 మెదక్ 48ఇవీ నిర్వర్తిస్తున్న విధులు.. గోపాల మిత్రలు ఆరునెలలు శిక్షణ పొంది అనుభవం కలిగిన ప్రొఫెసర్ల పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎంపికయ్యారు. బస్సు సౌకర్యం లేని గ్రామాలు, తండాలకు సైతం వెళ్లి విధులు నిర్వర్తిస్తారు. పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు వైద్యుల సూచనలు, సలహాల మేరకు అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సలు అందిస్తారు. భారత్ పశుధన్లో నమోదు చేస్తుంటారు. -
వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం
జిన్నారం (పటాన్చెరు): ఓ వృద్ధురాలు అదృశ్యమైన ఘటన గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... నగరానికి చెందిన సూరారం బాలమణి అనే వృద్ధురాలు సోమవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు. వృద్ధురాలి జాడ తెలిస్తే 95029 74643 నంబరుకు తెలియజేయాలని కుటుంబ సభ్యుడు అనిల్ విజ్ఞప్తి చేశారు. ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి.. సంగారెడ్డి క్రైమ్: వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... శివాజీనగర్ చెందిన చదువుల వెంకటేష్ (28) వృత్తిరీత్య పట్టణంలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. ఈ నెల 12న రాత్రి 9గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డిలో మహిళ... ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. పట్టణ సీఐ వివరాల ప్రకారం... పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మహిళ (25), ఈ నెల 14న సోమవారం ఉదయం 10గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాలేదు. చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థిని.. చేగుంట(తూప్రాన్): విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు...ఈనెల 2న నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అంగర్క గ్రామానికి చెందిన బాలికను ఇంటర్ మొదటి సంవత్సరం చదివేందుకు రెడ్డిపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో చేర్పించారు. ఈనెల 7న బాలిక తల్లినని పాఠశాల ఎస్ఓ శ్రీవాణికి ఫోన్ చేసి బాలిక మేనమామను పంపిస్తున్నట్లు అతడితో తన కూతురుని పంపించాలని కోరింది. నమ్మిన పాఠశాల సిబ్బంది బాలికను ఇంటికి పంపించేందుకు అనుమతించారు. ఆ తర్వాత రెండు రోజులకు సిబ్బంది బాలిక కుటుంబీకులకు ఫోన్ చేసి పాఠశాలకు పంపించాలని కోరడానికి ప్రయత్నించగా బంధువులు ఎవరూ ఫోన్లో స్పందించలేదు. అనుమానంతో ఎస్ఓ శ్రీవాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలికకు ఇటీవలే వివాహం జరిగినట్లు సమాచారం. ఈ విషయమై కస్తూర్బా ఎస్ఓను వివరణ కోరగా బాలిక అదృశ్యం విషయం తెలిపేందుకు నిరాకరించారు. ఎస్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. -
కూలీకి ధీమా.. ఉపాధి బీమా
రూ. 2 లక్షల వరకు కవర్ ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● సంవత్సరానికి రూ. 20 చెల్లింపు సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి 100 రోజులపాటు పనులు కల్పిస్తోంది. ఉపాధి పనులు కల్పించడంతో పాటు పని చేసే సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆదుకునేందుకు బీమా సౌకర్యం సైతం కల్పిస్తుంది. దీంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు మరింత ధీమా పెరుగుతుంది. పీఎంఎస్బీవై ద్వారా అమలు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ కూలీలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకంలో ఉపాధి హామీ కూలీగా ఉండి 18 నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించారు. కూలీ సంబంధిత జాతీయ బ్యాంకుతో బీమా చేయించుకునేందుకు అంగీకారం కుదుర్చుకొని ప్రతి సంవత్సరం రూ. 20 ప్రీమియం చెల్లించాలి. గాయాలైతే లక్ష.. మృతి చెందితే రూ.2 లక్షలు ఉపాధి హామీలో పని చేసే కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఉపాధి హామీ పనులు చేసే సమయంలో నిత్యం ఏదో చోట ఏదో ఘటన జరుగుతోంది. గాయాల పాలవడంతో పాటు మృత్యువాత పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. బీమా ప్రీమియం చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు గాయాలై పనిచేయని స్థితిలో ఉన్న వారికి రూ.లక్ష, మృత్యువాత పడితే రూ.2లక్షల బీమా వర్తిస్తుంది. ఉపాధి పనులపై ఆసక్తి గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉపాధి హామీని మహిళలే అత్యధికంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వేసవిలో ఇతర పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు డిమాండ్ పెరుగుతుంది. రైతు సంక్షేమం కోసం చేపట్టే పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపపడుతున్నారు. ప్రతి సంవత్స రం ప్రభుత్వాలు కూలీ రేటును పెంచుతున్నాయి. ప్రస్తుతం ఒకరోజు రూ. 307గా నిర్ణయించారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల వివరాలు గ్రామ పంచాయతీలు 619 జిల్లాలో ఉన్న మొత్తం జాబ్ కార్డులు 2.19 లక్షలు యాక్టీవ్గా ఉన్న జాబ్కార్డులు 1.32 లక్షలు ఉపాధి హామీ కూలీలు 4.03 లక్షలునాలుగు లక్షల మందికి లబ్ధి జిల్లాలోని 619 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో రెండు లక్షల 19 జాబ్ కార్డులు ఉండగా.. ఒక లక్ష 32 వేల కార్డులు యాక్టివ్గా ఉన్నాయి. అందులో సుమారు నాలుగు లక్షలకు పైగా ఉపాధి హామీ కూలీలు నమోదై ఉన్నారు. దీంతో సుమారు 4 లక్షల 3వేల మందికి లబ్ధి చేకూరనుంది. కూలీలకు లబ్ధి పొందాలంటే ప్రవేశపెట్టే పథకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ఉపాధిలో 18 నుంచి 70 సంవత్సరాలు లోపు ఉన్న కూలీల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. -
కల్వర్టును ఢీకొట్టిన కారు
వ్యక్తి మృతి కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి తన కారులో ప్రయాణమయ్యాడు. చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అనిల్కు ఛాతీలో బలమైన దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. -
సెంట్రింగ్ చోరీ ముఠా అరెస్ట్
● 9 మంది నిందితుల రిమాండ్ ● సామగ్రి , ఆటో స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీపటాన్చెరు టౌన్: సెంట్రింగ్ సామగ్రిని దొంగిలించిన ముఠాను అరెస్టు చేశామని అమీన్పూర్ పోలీసులు తెలిపారు. సోమవారం పటాన్చెరు పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్క్లో భవన నిర్మాణం చేపట్టిన కాంటినెంటల్ బిల్డింగ్ సంస్థ భవనం నిర్మాణం పూర్తి కావడంతో సెంట్రింగ్ సామగ్రిని షెడ్డులో భద్రపరిచారు. జూన్ 21, 22న సామగ్రిని గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. దీంతో కంపెనీ సూపర్వైజర్ కృష్ణ చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా క్రైమ్ సీఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి సుల్తాన్పూర్ సర్వీస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపడంతో అందులో పాత నేరస్తులు ప్రసాద్, అనిత ఉన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మెడికల్ డివైస్ పార్క్లో సెంట్రింగ్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. రామచంద్రపురం, లింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గుడిసెలు వేసుకుని ఉంటున్న జమున, ప్రసాద్, అనిత, రవీన, రాహుల్, ఫాతిమా, నందిని, అంజలి, సుశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రింగ్ సామగ్రిని ఇక్రిశాట్ కాంపౌండ్ ప్రక్కన దాచినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రితో పాటు ఒక ఆటో, రెండు ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకొని, 9 మందిని రిమాండ్కు తరలించారు. నిందితుల్లో రవీనా ఓ దొంగతనం కేసులో నిందితురాలుగా ఉన్నది. కేసు ఛేదించిన సీఐ నరేష్, క్రైమ్ సీఐ సత్యనారాయణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఆయిల్పామ్ సాగు రాయితీ బాగు..
ఆసక్తి చూపుతున్న రైతులు ● లక్ష్యం 3,750 ఎకరాలు ● 2 వేల ఎకరాల్లో సాగు జహీరాబాద్ టౌన్: ఒకప్పుడు ధరలేక సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదు. వందశాతం లాభాల భరోసా కల్పిస్తూ ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడంతో ఆయిల్ పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వంట నూనెల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. రైతులను ప్రోత్సహించేందుకు గెలల ధరలు పెంచుతోంది. రాయితీ సొమ్మును జమ చేస్తుండటంతో ఆయిల్ పామ్ తోటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పలువురు రైతులు ఆయిల్ పామ్ తోటలను పెంచడానికి ముందుకు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాగు విస్తీర్ణం పెంచడానికి సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్ను అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. తెగుళ్లు, చీడ పురుగుల ప్రభావం తక్కువగా ఉంటుంది. కోతులు, అడవి పందుల బెడద ఉండదు. తోటలో అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. మొక్కలు నాటిన నాలుగో ఏడాది నుంచి పంట మొదలై 30 ఏళ్లపాటు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. రేండేళ్లుగా ముమ్మరంగా.. రెండు, మూడేళ్ల నుంచి ఆయిల్ పామ్ సాగు ముమ్మరంగా సాగవుతుంది. జిల్లాలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 2వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి 3,750 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2,500 ఎకరాలకు రైతుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 1,045 ఎకరాలకు పరిపాలన మంజూరు కూడా వచ్చింది. ఆయిల్ పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలు 100 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై ఐదు హెక్టార్ల వరకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తుంది. పెరిగిన ధరలు ఆయిల్ పామ్ గెలల ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు రూ. 20,506 ఉండగా తాజాగా టన్నుకు రూ. 20,871కి చేరుకుంది. ఐదారు నెలల్లో రూ. 365 పెరిగింది. మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా గోద్రేజ్ కంపెనీ వారు గెలలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పదం చేసుకుంది.వందశాతం భరోసా ఆయిల్పామ్ సాగు చేసే రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పంట వల్ల భవిషత్యలో లబ్ధి చేకూరుతుంది. సాగు చట్టబద్ధతతో కూడుకుంది. గెలలను గోద్రేజ్ కంపెనీ కొనుగోలు చేస్తుంది. సాగు కోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లోని రైతులు సాగులో ముందున్నారు. మిగతా ప్రాంత రైతులు ముందుకురావాలి. –సోమేశ్వర్రావు, ఉద్యానశాఖ జిల్లా డీడీ, సంగారెడ్డి -
తప్పిపోయిన పాప.. క్షేమంగా అప్పగింత
సిద్దిపేటకమాన్: తప్పిపోయిన పాపను పోలీసులు వివరాలు తెలుసుకుని వారి బంధువులకు అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం.. పట్టణంలోని శంకర్నగర్లో ఆరె అర్జున్ తన భార్య, కూతురు దివ్య(4)తో కలిసి నివాసం ఉంటున్నాడు. అర్జున్ పాత బట్టలు విక్రయిస్తుంటాడు. సోమవారం తండ్రి పాత బట్టలు విక్రయించడానికి వేములవాడకు వెళ్లడంతో పాప ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలో ఏడుస్తూ ఉండగా.. గమనించిన ఓ వ్యక్తి టూటౌన్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించాడు. సీఐ ఉపేందర్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా పాప ఏడుస్తూ తన పేరు దివ్య అని మాత్రమే చెప్పింది. దీంతో సీఐ తమ సిబ్బంది ద్వారా పాప ఫొటోను అన్ని వాట్సప్ గ్రూప్ల ద్వారా వైరల్ చేశారు. పాపను గుర్తించిన అంగన్వాడీ టీచర్ పీఎస్కు వచ్చింది. దీంతో వివరాలు తెలుసుకుని పాప పెద్దనాన్న కూడా అక్కడికి రావడంతో పోలీసులు వారికి అప్పగించారు. -
‘ఐఐటీ’తో చింతమడక పాఠశాల భాగస్వామ్యం
సిద్దిపేటరూరల్: స్కూల్ కనెక్ట్ పేరుతో ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మండల పరిధిలోని చింతమడక పాఠశాల భాగస్వామ్యం అవుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఐఐటీలో చేరడానికి కావలసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్న్స్, డేటా సైన్స్, వివిధ కోర్సులకు సంబంధించిన కోడింగ్ తదితర వాటిపై అవగాహన, ఐఐటీ ప్రొఫెసర్లతో ఆన్లైన్లో విద్యార్థులు నేర్చుకుంటారని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లు భాగస్వామ్యం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాల్రాజు, అజీజ్, రాందాస్, శ్రీహరి, రాంరెడ్డి, సత్తయ్య, శ్రీనివాస్రెడ్డి, పీడీ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్ నంగునూరు(సిద్దిపేట): మహిళపై దాడి చేసిన వ్యక్తిని సోమవారం రిమాండ్కు తరలించారు. రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ కథనం ప్రకారం.. రాంపూర్కు చెందిన గండికోట సంపత్, రాజవ్వను ఇదే గ్రామానికి చెందిన దున్నపోతుల నరేశ్, పరశురాములు, శారద పెంట్రింగ్ కర్రతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నరేశ్ను కోర్టులో హాజరు పరచగా న్యాయ స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. భార్యాభర్తల గొడవ... చిన్నారి మృతి శివ్వంపేట(నర్సాపూర్): భార్యాభర్తల గొడవలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై మధుకర్ రెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రమైన శివ్వంపేట దళితవాడకు చెందిన కుంట లావణ్య, మహేష్ దంపతులకు నాలుగేళ్ల కూతురు చైత్యతో పాటు 11 నెలల కూతురు ఆకాంక్ష ఉంది. 10 రోజుల క్రితం బయటి నుంచి ఇంటికొచ్చిన మహేష్ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. ఆమె చిన్న పాప ఏడుస్తుందని నీవే పెట్టుకుని తినమని చెప్పింది. దీంతో మద్యం మత్తులో ఉన్న మహేష్ భార్యపై దాడి చేసిన క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కూతురు ఆకాంక్ష తలకు బలమైన గాయమై అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి మృతిచెందింది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెగిపడ్డ లిఫ్ట్ .. పరిమితికి మించి ఎక్కడంతో ప్రమాదం పలువురికి గాయాలు రామచంద్రాపురం(పటాన్చెరు): లిఫ్ట్లో పరిమితికి మించి ఎక్కడంతో ఒక్కసారిగా తెగిపడింది. ఈ ఘటనలో పలువురు మహిళా కార్మికులు గాయాలపాలయ్యారు. పోలీసుల కఽథనం ప్రకారం... కూకట్పల్లి ప్రాంతానికి చెందిన పలువురు మహిళలు ఆదివారం రాత్రి రామచంద్రాపురం పట్టణంలోని బట్టల దుకాణంలో దుస్తులకు ఉన్న ట్యాగులను తొలగించే పనికి వచ్చారు. సోమవారం ఉదయం వరకు పని చేశారు. ఇంటికి వెళ్లేందుకు రెండవ అంతస్తు నుంచి లిఫ్ట్లో సుమారు 14మంది లిప్టులో ఎక్కారు. ఒక్కసారిగా లిఫ్ట్ తెగి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో పింకీ అనే కార్మికురాలికి కాలు ఫ్రాక్చర్ అయింది. మిగితావారికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో భారీ చోరీ రూ.10 లక్షలు, బంగారం అపహరణ చిన్నశంకరంపేట(మెదక్): తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగలు చొరబడి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నార్సింగి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రానికి చెందిన బోండ్ల శ్రీనివాస్ ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం భార్య, పిల్లలతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువా తెరిచి ఉందని కుమారుడి పెళ్లి ఖర్చుల కోసం తీసుకువచ్చిన రూ.10 లక్షలు, 3 తులాల బంగారం, 10 తులాల వెండిని దుండగులు ఎత్తుకెల్లినట్లు బాధితుడు తెలిపారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, ఇన్చార్జీ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ అహ్మద్మోహినోద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీమ్ బృందం ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన బైక్ ప్రమాదంలో వ్యక్తి మృతి జిన్నారం (పటాన్చెరు): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... దాదిగూడెం సోలక్పల్లి రహదారిపై టిప్పర్ లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ పక్కనే నిలిపాడు. ఈ క్రమంలో సోలక్పల్లి నుంచి జిన్నారం వైపు వస్తున్న మంబాపూర్కు చెందిన కంజర్ల సుదర్శన్ (40) ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి టిప్పర్ను ఢీకొట్టాడు. దీంతో అతడు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. -
అధికారుల సంతకాలు లేకుండా చెల్లింపులు
రూ.22 వేల రికవరీ, 63 వేల జరిమానా నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనుల మస్టర్పై ఎంపీడీఓ, ఏపీఓ సంతకాలు లేకుండానే చెల్లింపులు జరిగాయి. తనిఖీలో అవినీతి జరిగినట్లు గుర్తించి అధికారులు రికవరీ చేసి , జరిమానా విధించారు. నంగునూరులో సోమవారం 16వ జాతీయ ఉపాధిహామీ పనులపై ప్రజాదర్బార్ నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు మండలంలో జరిగిన పనులపై గ్రామాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీ వివరాలు వెల్లడించారు. గ్రామసభలకు కొందరు టీఏలు, అసిస్టెంట్లు రాలేదని, పనులు ఒకరు చేస్తే డబ్బులు మరొకరికి చెల్లించారని, మస్టర్లలో చాలా తప్పులున్నాయని ఆడిట్ బృందం సభ్యులు సభ దృష్టికి తాసుకొచ్చారు. పనుల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఎఫ్ఏల నుంచి రూ.22వేల రికవరీ, 63 వేల జరిమానా విధించినుట్లు డీఆర్డీఓ అసిస్టెంట్ పీడీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ మెనేజర్ గణేశ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి సంతోష్రెడ్డి, ఎస్ఆర్పీ భగవత్రావు, ఎంపీడీఓ లక్ష్మణప్ప పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
మాజీ ఎయిర్ మార్షల్ చంద్రశేఖర్ ములుగు(గజ్వేల్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ కమాండెంట్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ ఎయిర్ మార్షల్ బవిశెట్టి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మక్కపల్లిలోని ఓ ఫంక్షన్హాలులో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు కప్స్తో పాటు మెమెంటోలు, మెడల్స్ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తి, సామాజిక సేవను అలవర్చుకోవాలన్నారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు విష్ణుజగతి కార్యక్రమానికి హాజరైన అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయ్భాస్కర్రెడ్డి, ఆయా పాఠశాలల, ట్రస్ట్ ప్రతినిధులు రాజశేఖర్రెడ్డి, ఆంజనేయులు, శేషారెడ్డి, రామ్ నరసింహాగౌడ్, చంటి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణ, పురుషోత్తం, సుధాకర్, విజయేందర్రెడ్డి, విజయ్పాల్రెడ్డి, చంద్రమౌళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బెట్టింగ్, డ్రగ్స్ను తరిమికొట్టాలి
● శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ ● మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్అల్లాదుర్గం(మెదక్): బెట్టింగ్, డ్రగ్స్ను యువత తరిమికొట్టాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావ్ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, 10 మంది ఎస్ఐలు, 110 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సోదాలు చేపట్టారు. సరైన ధ్రువ పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, 2 బులోరా వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నారని తెలిపారు. కార్డెన్ సెర్చ్తో గ్రామాల్లో ఎవరైన సంఘ విద్రోహ శక్తులు తల దాచుకుంటే పట్టుకునే అవకాశం ఉందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో..
● యువకుడి దారుణ హత్య ● పోలీసులకు లొంగిపోయిన నిందితులు ● జహీరాబాద్లో ఘటనజహీరాబాద్ టౌన్: మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. సోమవారం డీఎస్పీ సైదా నాయక్, టౌన్ సీఐ శివలింగంతో కలసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బసవేశ్వర మోహల్లాకు చెందిన తాజోద్దీన్ (22) మహీంద్ర ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మంత్రాలు వస్తాయని, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మంత్రాలతో తమ కుటుంబ సభ్యులను అనారోగ్యానికి గురి చేస్తున్నాడని మాణిక్ప్రభు వీధికి చెందిన ఎండీ హసన్ ఖురేషికి అనుమానం కలిగింది. ఇదే విషయమై పలు మార్లు ఖురేషి, తాజోద్దీన్ను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాడనే అనుమానంతో ఎలాగైన తాజోద్దీన్ను హత్య చేయాలని ఖరేషి నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయం 11.30 ప్రాంతంలో తాజోద్దీన్ నాగులకట్ట ప్రాంతానికి వెళ్లడాన్ని ఖురేషి చూశాడు. దీంతో తన మిత్రుడు ముఖ్రంతో కలసి బైక్పై ఆ ప్రాంతానికి వెళ్లాడు. ఒక విషయం మాట్లాడాలని చెప్పి.. తాజోద్దీన్ను బైక్పై ఎక్కించుకుని చెన్నారెడ్డి నగర్ కాలనీ వద్ద గల చెరకు తోట లోపలికి తీసుకెళ్లారు. అక్కడ తాజోద్దీన్ చేతులు కట్టేసి ఇద్దరూ కలిసి తీవ్రంగా కొట్టారు. అనంతరం హసన్ ఖురేషి వెంట తెచ్చుకున్న కత్తితో తాజోద్దీన్ మెడపై నరకడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని అక్బర్ అనే వ్యక్తికి చెందిన కారులో తీసుకెళ్లి ఓ బావిలో పడేశారు. అనంతరం ముగ్గురూ పోలీసు స్టేషన్కు వచ్చి లొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తాజోద్దీన్ మృతదేహాన్ని గుర్తించి, నిందితుల నుంచి కారు, మూడు బైక్లు, కత్తితో పాటు 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులపై చిన్నచూపు!
● 114 చెరువు లకు పది నెలల క్రితం రూ. 31.19 కోట్లు మంజూరు ● ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి చేయని నీటిపారుదలశాఖ ● పనులు ప్రారంభమయ్యేదెప్పుడు.. పూర్తయ్యేదెన్నడు..? ● ఖరీఫ్ సీజన్లోనూ ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరువుల మరమ్మతులకు అలసత్వం గ్రహణం పట్టుకుంది. నిధులు మంజూరై ఏడాది దగ్గర పడుతున్నప్పటికీ.. నీటి పారుదల శాఖ టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లోనూ ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. చిన్న నీటి వనరుల అభివృద్ధే లక్ష్యంగా జిల్లాలో మొత్తం 114 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 31.19 కోట్ల నిదులు మంజూరయ్యాయి. ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలంలో 23 చెరువుల మరమ్మతులకు రూ.4.96 కోట్లు, చౌటకూర్ మండలంలో 25 చెరువుల మరమ్మతులకు రూ. 5.21 కోట్లు, ఆందోల్ మండలంలో 37 చెరువులకు రూ.16.04 కోట్లు మంజూరయ్యాయి. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో 29 చెరువుల మరమ్మతులకు రూ. 4.98 కోట్లు మంజూరయ్యాయి. ఆయా చెరువుల కట్టల బలోపేతం, తూముల లీకేజీలకు మరమ్మతులు, అలుగు రిపేర్లు, అవసరమైన చోట్ల గైడ్వాల్ల నిర్మాణం, కాలువల్లో పూడికతీత వంటి పనులు చేపట్టేందుకు ఈ నిదులు మంజూరయ్యాయి. ఇందులో కొన్ని చెరువులకు 2024 సెప్టెంబర్లో జీఓలు జారీ అయ్యాయి. అంటే దాదాపు పది నెలలు దాటింది. అయినప్పటికీ టెండరు ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈ పనులు ప్రారంభమే కాకపోవడంతో ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరందడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ ఇద్దరు నేతల నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా.. అధికార కాంగ్రెస్లో ఇద్దరు కీలక నేతల నియోజకవర్గాలకు ఈ నిధులు మంజూరయ్యాయి. మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేకంగా తమ నియోజకవర్గాల్లోని చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించుకున్నారు. జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల్లో మినహా, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాలకు నిధులు రాలేదు. ఈ రెండు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరైనప్పటికీ, పనులు జరగకపోవడంతో ఆయా చెరువుల పరిస్థితి మెరుగుపడటం లేదు. ఈ చిత్రంలో కనిపిస్తున్న చెరువు పుల్కల్ మండలం చిట్టారెడ్డికుంట. దీని మరమ్మతు కోసం 2024 సెప్టెంబర్ 25న రూ.15.90 లక్షలు మంజూరయ్యాయి. కానీ పదినెలలైనా నీటిపారుదల శాఖ ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ కుంట కింద ఉన్న ఆయకట్టుకు ఈసారి సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇలా జిల్లాలో సుమారు 114 చెరువుల మరమ్మతుల పరిస్థితి కూడా ఇదే తీరుగా ఉంది.ఎస్ఈ లేకపోవడంతో... ఈ పనులకు నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) కార్యాలయం టెండర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ప్రస్తుతం జిల్లాకు ఎస్ఈ లేకపోవడంతో టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నారు. ఈఎస్ఈగా పనిచేసిన ఏసయ్య మేలో పదవీ విరమణ చేసిన విషయం విధితమే. అప్పటి నుంచి ప్రభుత్వం ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు. దీంతో టెండర్ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చిన పుల్కల్, చౌటకూర్ మండలాలకు సంబంధించిన చెరువులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో ఈ నోటిఫికేషన్ను రద్దు చేశారు. మేలో మరోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎస్ఈ పదవీ విరమణ చేయడంతో ఈ టెండర్లను ఓపెన్ చేయలేదు. వర్షాలు ఎక్కువై చెరువుల్లో నీరు చేరితే ఈ మరమ్మతులు చేయడం వీలుకాదు. దీంతో ఈ పనులకు మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తయితే.. కనీసం అక్టోబర్, నవంబర్లో నీటి మట్టాలు తగ్గాక పనులు చేసేందుకు వీలు కలుగుతుంది. కనీసం మూడు నెలల్లోనైనా టెండర్ ప్రక్రియను నిర్వహించి మరమ్మతులు పూర్తి చేస్తే ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ ప్రావీణ్య ● ప్రజావాణిలో వినతుల స్వీకరణ సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 73 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. సమస్యలతో ప్రభుత్వాలు అందించే పలు పథకాలు లబ్ధిపొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం మేరకు రుణాలు అందించాలి సంగారెడ్డి జోన్: మున్సిపాలిటీలో మెప్మా, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమన్వయం చేసి కార్మికులకు లక్ష్యం మేరకు రుణాలను అందించాలని కలెక్టరు ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి కోసం ఉద్దేశించిన కార్యక్రమంపై సంగారెడ్డి మున్సిపాలిటీలో అవగాహన కల్పించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి ఫిట్టింగ్, ప్లాంటేషన్ వివరాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు విధిగా వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి మొగుడంపల్లి మండల పరిధిలోని ధనసిరిలో తమ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకొని ఇంటి నిర్మాణం జరిగే విధంగా చూడాలి. – శివకుమార్, ధనసిరి, మొగుడంపల్లి తెలియకుండానే పట్టా చేశారు కోహిర్ మండల పరిధిలోని దిగ్వాల్ గ్రామ శివారులో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి నా పేరున పట్టా చేసుకున్నా. గతేడాది డిసెంబర్లో కోర్టు నుంచి ఇతరుల పేరుపై భూమి మారిందని, స్థలం ఖాళీ చేయాలని అందించారు. సంబంధిత కార్యాలయంలో విచారణ చేయగా ఇతరుల పేరుపైకి భూమి మారిందంటూ నిర్లక్ష్యంగా అధికారులు సమాధానం ఇస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. – శోభారాణి, శాంతినగర్, హైదరాబాద్ -
సిగాచీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సిగాచీ పరిశ్రమ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వరుస ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించటం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి ముందస్తుగా తనిఖీలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం, నాయకులు సాయిలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డిటౌన్: జిల్లాలో కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈత, తాటి చెట్లపై నుంచి పడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. అక్రమ మద్యం, బెల్ట్ షాపులను అరికట్టాలన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాలను వెంటనే మంజూరు చేయాలని, సొసైటీలలో సభ్యులుగా ఉన్నవారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. సమస్యలపై అనేకసార్లు అధికారులు, మంత్రులకు తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్గౌడ్, సంగారెడ్డి మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూపులొద్దు.. రచ్చకెక్కొద్దు
మహిళలను కోటీశ్వరులను చేస్తాంప్రణాళికాబద్ధంగా ల్యాబ్లు నిర్వహించాలిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు రాజిరెడ్డి, టి.నర్సారెడ్డి, నాయకులు ఉప్పల శ్రీనివాస్గుప్త, మెట్టుసాయికుమార్ పాల్గొన్నారు. నారాయణఖేడ్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్ననే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్లోని ఓ ఫంక్షన్హాల్లో ఇందిర మహిళాశక్తి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పలు మహిళా సంఘాల సభ్యులకు వ డ్డీ రాయితీకి సంబంధించి రూ. 2,87,82,000 చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు దివంగత వైఎస్సార్ మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారని, తర్వాత బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూతనందిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులు ముందుకు వస్తే రెండు బస్సులు, పెట్రోల్బంక్లు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలోని వెంకటాపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. రూ. 3.86 కోట్లతో అర్బన్ పార్కుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎఫ్ఓ శ్రీధర్రావు, రేంజ్ అధికారిణి అనురాధ, సి బ్బందితో కలిసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గిరిజా షెట్కార్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఐకేపీ పీడీ జ్యోతి, డీపీఎం సుధాకర్, ఏపీఎంలు వంశీకృష్ణ, సాయిలు, అనంతయ్య, కుమార్, శేఖర్, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు నాయకు లు త దితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డిమెదక్ కలెక్టరేట్: అటల్ టింకరింగ్ ల్యాబ్లను జిల్లాలో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సైన్స్ను ప్రయోగశాలకు అనుసంధానం చేయాలన్నారు. సైన్స్, గణితం ఉపాధ్యాయులకు ల్యాబ్ల నిర్వహణపై అవగాహన కల్పించడానికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విభేదాలొస్తే అంతర్గతంగా చర్చించుకోవాలి అవసరమైతే పీసీసీ దృష్టికి తీసుకురండి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు పొన్నం సూచన -
పరిశ్రమలు నిబంధనలు పాటించాలి
అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డిపటాన్చెరు టౌన్: అగ్ని ప్రమాదాల పట్ల పారిశ్రామికవేత్తలంతా అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి పరిశ్రమలో రక్షణ పరికరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. సోమ వారం పాశమైలారం ఐలా ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా కొన్ని పరిశ్రమల్లో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు లేవని, పలు పరిశ్రమల్లో ఉపయోగిస్తున్న కెమికల్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నిపుణులైన కార్మికులను నియమించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో అగ్నిమాపకశాఖ సమర్థవంతంగా పనిచేసి ఎక్కువ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కృషి చేయడం హర్షించ తగిన విషయమన్నారు. కాగా సిగాచీ పరిశ్రమ ఘోర ప్రమాదం నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, అగ్ని ప్రమాదాల విషయంలో నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో 44 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మదినగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెస్ట్ బెంగాల్కు చెందిన తుడు తరపాడు (45) సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈసందర్భంగా అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద రూ. లక్ష అందజేసి, అంబులెన్స్ ఏర్పాటు చేసి స్వస్థలానికి పంపించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందారని, వివిధ ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణఖేడ్: నిజాంపేట్ మండల పరిధిలోని గిరిజన సంక్షేమ మిని బాలికల గురుకులంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తించేందుకు కుక్, ఆయా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోగా గురుకులంలో సమర్పించాలని తెలిపారు. టెన్త్ విద్యార్హత అని, రూ. 9,750 వేతనం చెల్లిస్తామన్నారు. ఇతర వివరాలకు 7981090652 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర జోగిపేట(అందోల్): ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్నారు. సోమవారం జోగిపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 7,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, సన్నీ దినేష్, మహేష్, శ్రీలత, దీపిక, చోటు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఏడు మండలాలు.. 2,508 రేషన్ కార్డులు నర్సాపూర్: నియోజకవర్గంలోని ఏడు మండలాలకు 2,508 కొత్త రేషన్కార్డులు వచ్చాయని ఆర్డీఓ మహిపాల్ సోమవారం తెలిపారు. వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. నర్సాపూర్ మండలానికి 354, శివ్వంపేటకు 428, కౌడిపల్లికి 615, కొల్చారానికి 384, మాసాయిపేటకు 249, వెల్దుర్తికి 385, చిలప్చెడ్ మండలానికి 93 రేషన్కార్డులు మంజూరైనట్లు వివరించారు. ఉపాధ్యాయులకు శిక్షణ శివ్వంపేట(నర్సాపూర్): శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు అవగాహన పెంచుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేటలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్లపై 12 పాఠశాలలకు సంబంధించి 36 మంది ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 25 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసిందన్నారు. ఆయా పాఠశాలల్లో రూ. 10 లక్షల విలువ గల రోబోటిక్స్తో పాటు అధునాతన ప్రయోగ పరికరాలను అందజేసిందన్నారు. సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్పై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చనాయక్, గెజిటెడ్ హెచ్ఎం, కోర్స్ కోఆర్డినేటర్ బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
18న జిల్లాకు బీజేపీ చీఫ్ రాక
నర్సాపూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎంపీ రఘునందన్రావు సోమ వారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మొదటి సారి జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనను విజయవంతం చేయా లని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నిరంగాల్లో అభివృద్ధి: దామోదర
సంగారెడ్డిజోన్: ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, భూ భారతి, రైతు రుణమాఫీ, రైతు బీమాను అమలు చేయడంతో పాటు పెన్షన్లు, కొత్త రేషన్కార్డుల జారీ, సన్నబియ్యం, ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు రూ. 500 బోనస్ అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఆందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్కుమార్ షెట్కార్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సిలారపు త్రిష, పీసీసీ సభ్యుడు కిషన్, ఏఎంసీ చైర్మన్లు సుధాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, కచూర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు దిగంబరరావు, శేషారెడ్డి, రమేష్, నిమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తి పీఠాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి నీలిమ దర్శించుకున్నారు. ఈసందర్భంగా వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. శక్తిపీఠం విశిష్టత, నిర్మాణం గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో పబ్బ రమేష్గుప్తా తదితరులు పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. శనివారం పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో బీసీ వర్గాల్లో ఆనందం నెలకొందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాయకల్ప పురస్కారానికి ఖేడ్ ఆస్పత్రి ఎంపిక నారాయణఖేడ్: 2024– 25 సంవత్సరానికి ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిని కాయకల్ప పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ శనివారం తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న నాణ్యమైన ఆరోగ్యసేవలు, పరిశుభ్రత తదితర వాటికి సంబంధించి ఈ పురస్కారానికి ఎంపికై నట్లు చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మద్దతు, ఎంపీ సురేష్ షెట్కార్ సహకారం, సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. విద్యార్థులు కష్టపడి చదవాలి పటాన్చెరు టౌన్: విద్యార్థులు కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి గోవిందరావు అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడలో ఐఐటీ చుక్కా రామయ్య ఇష్టా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేస్తారు, చనిపోయినప్పుడు నలుగురు మోస్తారు. ఈ మధ్యలో మనం ఏదో చేయాలనే తపన ఏర్పడాలన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంటర్ దశలోనే మంచి గోల్ పెట్టుకొని కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఏడాది పాటుసీపీఐ వందేళ్ల ఉత్సవాలుహుస్నాబాద్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజాఉద్యమంలో సాధించిన విజయాలపై ఏడాదిపాటు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి తెలిపారు. -
డబుల్ బెడ్రూంల తాళాలు ఇవ్వండి
జహీరాబాద్ టౌన్: హోతి(కె) వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో డబుల్బెడ్రూం కాల నీకి తరలివచ్చారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లను ఎందుకు అప్పగించడం లేద ని, 12 తేదీన ఇళ్ల తాళాలు ఇస్తామని చెప్పి ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. తాళాలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ ఆందోళన కారులతో మాట్లాడారు. రెండవ శనివారం ఇళ్ల కేటాయింపు వాయిదా పడిందని, మరో రోజు అప్పగిస్తారని నచ్చజెప్పారు. అక్కడి నుంచి లబ్ధిదారులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు మహిపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభు త్వం హోతి(కె) వద్ద పేదల కోసం 660 ఇళ్లను కట్టించగా అధికారులు డ్రా ద్వారా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారని చెప్పారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇళ్లను అప్పగించడం లేదన్నారు. డీఎస్పీ సైదానాయక్ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పారు. తహసీల్దార్ దశరథ్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఉన్నతాధికారులతో చర్చించి ఇళ్ల కేటాయింపుకు మరో తేదీని ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. -
‘పైరాలసిస్’ పీసీబీ కొరడా
● మూడు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్లు జారీ ● స్టేట్ లేవర్ టాస్క్ఫోర్స్ కమిటీఆదేశాలతో చర్యలు ● విచ్చలవిడిగా కాలుష్యం వదులుతున్న టైర్లు కాల్చే కంపెనీలుపైరాలసిస్ పరిశ్రమలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విచ్చలవిడిగా కాలుష్యం వెదజల్లుతూ పరిసర గ్రామాల ప్రజల జీవనానికి ఇబ్బందిగా మారుతున్న పైరాలసిస్ పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. కొండాపూర్ మండలంలోని మూడు పైరాలసిస్ పరిశ్రమలను మూసివేయాలని పీసీబీ క్లోజర్ ఆర్డర్ జారీ చేసింది. మరో ఐదు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్ జారీ చేసేందుకు నోటీసులు జారీ చేసింది. జిల్లాలో పీసీపీ నుంచి అనుమతులు పొందిన పైరాలసిస్ పరిశ్రమలు 19 ఉన్నాయి. కొండాపూర్ మండలంలోని ఎదురుగూడెం, మల్లేపల్లి, గుంతపల్లి, గొల్లపల్లి, తేర్పోల్ తదితర గ్రామాల శివారుల్లో ఉన్నాయి. అలాగే పాశమైలారం పారిశ్రామికవాడలో కూడా ఈ పైరాలసిస్ పరిశ్రమల యూనిట్లు ఉన్నాయి. పాతటైర్లను కాల్చి.. పాత టైర్లను కాల్చి అందులోంచి ఆయిల్తో పాటు, ఇతర ఉప ఉత్పత్తులను తయారు చేసే ఈ పైరాలసిస్ పరిశ్రమలు భారీగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి చేస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విచ్చలవిడిగా గాలి కాలుష్యంతో పాటు, భూగర్భజలాలు కూడా కలుషితమవుతున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. టైర్లను కాల్చే క్రమంలో దట్టమైన నల్లని పొగ కమ్ముకొని పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యాపిస్తోంది. పరిసర గ్రామాల రైతులు వ్యవసాయం చేయాలంటే కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తెల్ల రంగులో ఉండాల్సిన పత్తి పూర్తిగా మసిబారి పోతుండటంతో స్థానిక రైతులు ఈ పంటను వేయడమే మానేశారు. పాత టైర్లను కాల్చడం ద్వారా వచ్చే ఆయిల్ను డాంబార్ (తారు) కంపెనీలకు విక్రయిస్తుంటారు. బూడిదను సిమెంట్ ఉత్పత్తి చేసే కంపెనీలకు అమ్ముతుంటారు. టైర్లలో ఉండే ఐరన్ తీగలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.మరో ఐదు పరిశ్రమలపైన చర్యలు పైరాలసిస్ పరిశ్రమల కాలుష్యంపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశాం. ఈ మేరకు నివేదికను రాష్ట్రస్థాయిలోని టాస్క్ఫోర్స్ కమిటీకి పంపాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ మూడు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్లు జారీ చేశాం. రానున్న రోజుల్లో మరో ఐదు పరిశ్రమలకు కూడా క్లోజర్ ఆర్డర్లు జారీ చేస్తాం. – గీత సపారే, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, పీసీబీ, సంగారెడ్డి స్థానికుల కష్టాలపై ‘సాక్షి’ కథనం.. ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ నెల రోజుల క్రితం సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ‘పైరాలసిస్ పరేషాన్’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంతో పీసీబీ అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో ఎట్టకేలకు మూడు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పీసీబీ అధికారులు కాలుష్యం కారక పరిశ్రమలపై చర్యలకు ఉపక్రమించాలంటే రాష్ట్రస్థాయిలో ఉన్న టాస్క్ఫోర్స్ కమిటీకి నివేదికలు పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికలను పరిశీలించిన కమిటీ ఆయా పరిశ్రమలపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలు వచ్చాక జిల్లా పీసీబీ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తారు. -
ఆర్టీసీకి మహిళా సంఘాల బస్సులు
ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చర్యలు సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు రంగాలలో అవకాశాలు కల్పిస్తుండగా, మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. జిల్లాకు 20 బస్సులు కేటాయించే అవకాశం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, మిల్క్పార్లర్లు, మహి ళా పెట్రోల్ బంక్, పాఠశాల విద్యార్థులకు యూని ఫాం కుట్టడంతోపాటు వివిధరకాలు యూనిట్లు ప్రవేశపెట్టింది. ఈక్రమంలో మహిళా శక్తి పథకం ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె కు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు 20బస్సుల వరకు అప్పగించే అవకాశముంది. మరింత ఆదాయం జిల్లాలో ఉన్న మండల మహిళా సమాఖ్య సభ్యులతో అద్దె బస్సులు ఇవ్వనున్నారు. రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ఉండటంతో పాటు వివిధ రకాల అర్హతలను పరిశీలించి సంఘాలను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గ్రాంట్ ద్వారా రూ. 30 లక్షలు, సమాఖ్య సభ్యులతో రూ. 6 లక్షలు ఇప్పించి బస్సులను కొనుగోలు చేయనుంది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. సంస్థ ప్రతి నెల సంబంధిత సభ్యులకు నెలకు సుమారు రూ. 70 వేలు చెల్లించనుంది. దీంతో సుమారురూ. 14 లక్షల ఆదాయం సమకూరనుంది. ఫలితంగా మహిళలకు మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.జిల్లా వివరాలు జిలా మహిళా సమాఖ్య 1 మండల మహిళా సమాఖ్యలు 25 గ్రామ మహిళా సమాఖ్యలు 695 మహిళా గ్రూపులు 18,488 గ్రూపులలోని మహిళా సభ్యులు 1,91,455 -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పరిగి ఎమ్మెల్యే, జిల్లా సంస్థాగతఎన్నికల ఇన్చార్జి రాంమోహన్రెడ్డి నారాయణఖేడ్: అతిత్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే, పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా ఇన్చార్జి రాంమోహన్రెడ్డి సూచించారు. ఖేడ్లోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందుతున్న విషయాలను సమగ్రంగా వివరించారు. జనాభా దమాషా ప్రకారం బీసీలకు సమానా వాటా దక్కాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం జరుగుతోందన్నారు. టీపీసీసీ సభ్యు లు శంకరయ్యస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఆనంద్ స్వరూప్ షెట్కార్, వినోద్పాటిల్, మాజీ ఎంపీపీ, జెడ్పీసీటీలు, ఆయా మండలాల పార్టీల అధ్యక్షులు నియోజకవర్గంలోని కాంగ్రెస్పార్టీ, అనుబంధ సంఘాల బాధ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
27 జెడ్పీటీసీలు, 276 ఎంపీటీసీలు
అమీన్పూర్ డీ నోటిఫై అయితే 271 ఎంపీటీసీలు, 26 జెడ్పీటీలుగా నిర్ధారణనారాయణఖేడ్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పునర్విభజన తుదిజాబితా ప్రకారం జిల్లాలో 276 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు. 27 జెడ్పీటీసీ స్థానాలు, అదేస్థాయిలో ఎంపీపీలు ఉండనున్నారు. కాగా అమీన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు కాగా, ప్రభుత్వం డీ నోటిఫై చేయాల్సి ఉంది. డీ నోటిఫై చేయకపోవడంతో జిల్లాలో ప్రస్తుతం 276 ఎంపీటీసీలు, 27 జెడ్పీటీసీ స్థానాలుగా అధికారులు ఖరారు చేశారు. త్వరలో ప్రభుత్వం అమీన్పూర్ను డీ నోటిఫై చేస్తే ఐదు ఎంపీటీసీ స్థానాలు తగ్గి జిల్లాలో 271 ఎంపీటీసీ స్థానాలు, 26 జెడ్పీటీసీ అదేస్థాయిలో ఎంపీపీల సంఖ్య ఖరారు కానుంది. అధికారులు ఇప్పటికే (మార్చి)లో ఎంపీటీసీ స్థానాలపై కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించారు. కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు అవతరించడంతో వాటిని మినహాయించి ప్రస్తుతం ఉన్న గ్రామాలతో కలిపి ఎంపీటీసీ స్థానాల సరిహద్దులను ఖరారు చేశారు. ఈమేరకు పంచాయతీరాజ్ కమిషనర్ సృజన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ స్థానాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఈనెల 8న ముసాయిదా ప్రకటన రాగా 8, 9వ తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాల పరిశీలన చేపట్టారు. 12న శనివారం తుది జాబితాను వెల్లడించారు. ఎంపీటీసీ స్థానాల స్పష్టత అనంతరం ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. నిజాంపేట్, చౌట్కూర్లలో ఆరు చొప్పున.. నూతనంగా నిజాంపేట్, చౌట్కూర్ మండలాలుగా ఏర్పాటు కాగా, ఈ మండలాల్లో ఎంపీటీసీలను ఖరారు చేశారు. నిజాంపేట్లో 6, చౌట్కూర్లో 6 చొప్పున నిర్ధారించారు. నిజాంపేట్ మండల పరిధిలో ర్యాలమడుగు, నిజాంపేట్– 1, నిజాంపేట్– 2 ఎంపీటీసీలను పాత ఖేడ్ మండలంలో నుంచి తీసుకోగా, నాగ్ధర్, బాచేపల్లి, రాంరెడ్డిపేట్లు కల్హేర్ మండలంలోని తీసుకొని నిజాంపేట్ మండలంలో నిర్ధారించారు. పుల్కల్ మండలం నుంచి వేరుపడ్డ చౌట్కూర్ మండలంలోనూ ఆరు ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. చౌట్కూర్, కోర్పొల్, సుల్తాన్పూర్, శివ్వంపేట్, చక్రియాల్, వెంకట కిష్టాపూర్ ఎంపీటీసీలుగా ఏర్పాటు చేశారు. పుల్కల్ మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు ఉండగా, ఇందులోంచి విభజించి చౌట్కూర్ మండలంలో 6 ఎంపీటీసీలు కేటాయించారు. ఈ అన్ని ఎంపీటీసీ స్థానాలన్నీ పుల్కల్ మండలం నుంచే ఏర్పాటయ్యాయి. -
బైక్ దొంగలు అరెస్ట్
హరితం ఆయన అభిమతంసిద్దిపేటజోన్: పట్టణానికి చెందిన రాదారి నాగరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంతో పాటు మొక్కల పెంపకం, వృక్షాల ప్రాముఖ్యత గూర్చి కొన్నేళ్లుగా అవగాహన కల్పిస్తున్నారు. ఇరుకోడ్ మోడల్ స్కూల్లో సుమారు 3వేల మొక్కలు నాటి హరితహారంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డు సాధించేలా కృషి చేశారు. తన ఇంటిని సైతం 300 మొక్కలతో నింపేశారు. మిద్దె తోటల పెంపకాన్ని సిద్దిపేటలో విస్తరించారు. పాఠశాలలో వృక్షా బంధన్ పేరిట చెట్లకు పిల్లలతో రాఖీ కట్టించి మొక్కల గూర్చి ప్రచారం చేశారు. సెమినార్, శిక్షణ తరగతులలో మొక్కల పెంపకం గూర్చి వివరించారు. శుభకార్యాలకు మొక్కను బహుమతిగా ఇవ్వడం ఆయన ఆనవాయితీగా మార్చుకున్నారు.13 బైకులు స్వాధీనంమొక్కలంటే ప్రాణంజహీరాబాద్ టౌన్: పట్టణంలోని పస్తాపూర్ డబుల్బెడ్రూం కాలనీలో గల గౌసొద్దీన్ ఇళ్లు పచ్చదనంతో వెల్లివిరిస్తోంది. ఆయనకు మొక్కలు పెంచడం అలవాటు. ఇంటి లోపల, బయట ఎక్కడ చూసిన వివిధ రకాల మొక్కలు, చెట్లు దర్శనమిస్తున్నాయి. వరండాలో పైకప్పు, మెట్లకు ఇరు పక్కల, ఇంటి గేటు పక్కన ఖాళీ స్థలం లేకుండా మొక్కలను పెంచడంతో ఇంటి ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. వివిధ రకాల పూలు, పండ్లు తదితర మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడి కాసిన పండ్లు ఇతరులకు ఉచితంగా అందజేస్తారు. మొక్కల పెంపకం కోసం ఆయన వేల రుపాయలు ఖర్చు చేస్తుంటారు. తనకు మొక్కలంటే ప్రాణమని, వాటి పెంపకం కోసం ప్రతి రోజు కొన్ని గంటల సమయం కేటాయిస్తానని గౌసొద్దీన్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి కాపర్ వైర్ చోరీ అంతర్రాష్ట్ర నిందితుల్లో ఇద్దరి అరెస్టు.. పరారీలో ముగ్గురు 227కేజీల కాపర్ వైర్, 3లక్షల నగదు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన సీపీ అనురాధ -
మొక్కవోని దీక్ష
కొల్చారం(నర్సాపూర్): పచ్చని చెట్లతో నిండి ఉపాధ్యాయులు, విద్యార్థులతో కనిపిస్తున్న ఈ ప్రదేశం మండలంలోని వరిగుంతం ఉన్నత పాఠశాల ఆవరణ. ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో ఉత్తమ పాఠశాలగా ఎంపికై ంది. మొక్కవోని దీక్షతో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాల ఆవరణ పచ్చదనంతో నింపాలన్న ఆశయంతో ముందుకు సాగుతామని ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిన పూనుతున్నారు.కొల్చారం వరిగుంతం పాఠశాలలో పచ్చని చెట్ల మధ్య విద్యార్థులు, ఉపాధ్యాయులు -
కోటి మొక్కలు నాటడమే సంకల్పం
నారాయణఖేడ్: మనుషులు చెట్లను ఇష్టానుసారంగా నరికి వేస్తుండటంతో ప్రకృతి గతి తప్పిందని భావించాడు. కోటి మొక్కలు నాటాలని పదేళ్ల క్రితం దీక్ష బూనాడు. ఆయనే సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్. కోటి మొక్కలు నాటే వరకు పాదరక్షలు ధరించబోనని శపథం చేశాడు. ఇప్పటి వరకు 3.50లక్షల మొక్కలను అడవులు, నదీ పరివాహక ప్రాంతాల్లో, దేవాలయ ప్రాంగణాలు, పాఠశాల ఆవరణలో నాటారు. విత్తన బంతులు తయారు చేసి నర్సాపూర్, మెదక్, మంజీరా నదికి ఇరువైపులా తాను చల్లడమే కాకుండా విద్యార్థులతో చల్లించారు. జ్ఞానేశ్వర్కు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ మొక్కలను అందిస్తుంది. ఈ పర్యావరణ ప్రేమికుడికి ‘సాక్షి’ దినత్రిక ఎక్స్లెన్స్ అవార్డును గవర్నర్ విశ్వభూషన్ హరిచందర్ చేతులమీదుగా, భారత్ యువ పురస్కార్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ద్వారా ఎర్త్ లీడర్ అవార్డులతోపాటు సత్కారాలు పొందాడు.మొక్కలు నాటుతున్న జ్ఞానేశ్వర్ -
భవిషత్ తరాల కోసం నాటుదాం
రామచంద్రాపురం(పటాన్చెరు): మొక్కలు నాటడం అంటే ఎంతో ఇష్టం. ఆయనే తెల్లాపూర్ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట భాస్కర్. నిత్యం పాఠశాలలో పర్యావరణంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలో 350 మొక్కలు నాటారు. గతంలో ఆయన ఎద్దుమైలారం పాఠశాలలో పని చేసిన సమయంలో 400 మొక్కలు నాటి కలెక్టర్ నుంచి గ్రీన్ స్కూల్ అవార్డును సైతం తీసుకున్నారు. భవిష్యత్ తరాల వారికి మంచి వాతావరణం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు. -
మా ఇంటి తోట
చేగుంట(తూప్రాన్): మండలంలోని వడి యారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కృష్ణవేణి ఇంట్లోనే పలు రకాల మొక్కలు పెంచుతున్నారు. మొక్కల పెంపకంపై ఆసక్తితో ఆమె ఐదేళ్లుగా ఇంటి ఆవరణలో మామిడి, జామ, కరివేపాకు, మల్లె చెట్టు, శ్రీగంధం, ఎర్రచందనం, లక్ష్మణఫలం, బిర్యానీ ఆకు, తైవాన్ మామిడి, తైవాన్ జామ, అశ్వగంధం, అల్లనేరేడు, అవకాడో, అంజీర్ మొక్కలను నాటారు. వీటితోపాటు అంతర పంటగా పసుపు, వేరుశనగ పండిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మొక్కలను సేంద్రీయ ఎరువులతో మాఇంటి తోటలో పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఆ పాఠశాల నందనవనం
తూప్రాన్: ఆహ్లాదం..పచ్చదనంతో పట్టణ పరిధిలోని పోతరాజుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందనవనంను తలపిస్తోంది. విద్యార్థులు మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి నేడు వృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. పచ్చదనం అలుముకుని చల్లని నీడతోపాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థి ఒక మొక్క చొప్పున పూలు, పండ్ల మొక్కలు దానిమ్మ, జామ, కర్జూరం, బాదం, మామిడి తదితర మొక్కలు పాఠశాల ఆవరణలో నాటారు. వాటి సంరక్షణ బాధ్యతలను ఆ విద్యార్థులకు అప్పగించారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో మొక్కలకు నీరు పోసి సంరక్షించారు. నేడు ఆ మొక్కలే వృక్షాలై చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
ఆ ఆస్పత్రి హరిత వనం
హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణం చుట్టూ పచ్చదనం పరిచినట్లుగా చెట్లు, మొక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి వందలాది మొక్కలు నాటించారు. దాదాపు మూడేళ్ల నుంచి గ్రీనరీపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ మొక్కలు నేడు ఎపుగా పెరిగి ఆస్పత్రి వచ్చే రోగులకు నీడనిస్తున్నాయి. వారితోపాటు రోగులను చూడటానికి వచ్చే బంధువులు సైతం చెట్ల నీడన సేద తీరుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పూల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు పెంచుతూ ఆస్పత్రి ఆవరణను హరిత వనంగా మార్చారు. ఆస్పత్రి ప్రధాన ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన పూల కుండీలు అందరిని ఆకర్షిస్తున్నాయి. -
జల్సాలకు అలవాటు పడి..
సిద్దిపేటకమాన్: ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైరును దొంగిలిస్తున్న ముఠాలోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసు కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అనురాధ కేసు వివరాలు వెల్లడించారు. కొండపాక మండల కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు మే 27న చోరీ చేసినట్లు విద్యుత్శాఖ ఏఈ కుకునూరుపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలో మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో రైతులు విద్యుత్ సమస్యతో పొలాల దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో తొగుట సీఐ లతీఫ్, కుకునూర్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లాలోని ఝూనతి గ్రామానికి చెందిన మహమ్మాద్ అజారుద్దీన్ (27), మహమ్మద్ షాకీర్ (28), తెలీమ్ఖాన్, సలీమ్ అలియాస్ సోహెల్, అక్రమ్ సిద్దిపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో ఇద్దరు నిందితులు ద్విచక్ర వాహనంపై వచ్చి ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నారు. వీరికి మరో ముగ్గురు నిందితులు సహకరించే వారు. దొంగిలించిన కాపర్ వైర్ను హర్యానా, ఇతర ప్రాంతాల్లో స్క్రాప్ షాప్లలో విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. 185 కేసుల్లో నిందితులు.. కొన్ని నెలలుగా సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మొత్తం 185 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి కాపర్ వైర్ చోరీ చేసినట్లు పలు పోలీసు స్టేషన్లలో నిందితులపై 185 కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలలుగా సిద్దిపేట జిల్లాలో 26, మెదక్లో 34, కరీంనగర్ జిల్లాలో 19, వరంగల్ జిల్లాలో 63, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 40, సైబరాబాద్ పరిధిలో 2, పెద్దపల్లి జిల్లాలో ఒక ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి కాపర్ వైరును తస్కరించారు. అజారుద్దీన్ 49 కేసుల్లో నిందితుడిగా ఉండటంతో పాటు షామీర్పేట పీఎస్ పరిధిలో జరిగిన ఓ కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించి వారిలో మహమ్మాద్ అజారుద్దీన్, మహమ్మాద్ షాకీర్లను రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 272 కేజీల కాపర్ వైర్, రూ.3,24,700 నగదుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలో పట్టుకుంటామన్నారు. టెక్నాలజీ సాయంతో నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర వహించిన సీఐ లతీఫ్, ఎస్ఐ శ్రీనివాస్, బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు మధుసూధన్రెడ్డి, రమణ, ఐటీ కోర్ సిబ్బంది శ్రీకాంత్, రమేష్, కానిస్టేబుల్స్ను అభినందించి, నగదు రివార్డు అందజేశారు. -
పచ్చని తోరణంలా ద్రాక్ష తీగ
దుబ్బాకటౌన్: ఇంటిని పచ్చని తోరణంలా ఉంచడానికి, ఎండాకాలంలో భవనాన్ని చల్లగా ఉంచడానికి , వాతావరణ కాలుష్యం నుంచి ఉపశమనం పొందడానికి పచ్చని పొదరిల్లుగా తీర్చిదిద్దింది ఓ గృహిణి. దుబ్బాక పట్టణానికి చెందిన కోమలి వినూత్న ఆలోచనతో ఇంట్లో ఉన్న తక్కువ ఖాళీ స్థలంలో ప్రత్యేక ద్రాక్ష మొక్కలను నాటింది. దీంతో వేసవి కాలంలో ఇంట్లోకి ఎండ పడకుండా చల్లగా ఉండేలా ఇంటిముందు ద్రాక్ష తీగలు పందిరిలా అల్లుకుపోయేలా ఏర్పాట్లు చేసింది. ఈ మొక్కలు తీగలా అల్లుకుని చల్లదనంతో పాటు పండ్లను సైతం ఇస్తున్నాయి. ఇంటిపై సైతం మరిన్ని మొక్కలు నాటడానికి ప్రయత్నాలు చేస్తున్నా. ఇంటి ముందే కాకుండా భవనంపై సైతం మొక్కలు నాటడానికి నూతన తరహాలో ఆలోచన చేసింది. భవనంపై ఇటీవల డ్రాగన్, కివీ మొక్కలు నాటింది ఇంటి ముందు పందిరిలా అల్లుకున్న ద్రాక్ష చెట్టుతో కోమలి -
విరివిగా మొక్కలు పెంచుతున్న వృక్ష ప్రేమికులు పెంపకంపై ఇతరులకు అవగాహన ● శుభకార్యాలకు మొక్కలే బహుమతి పచ్చదనం పంచుతున్న ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు
అడవులు అంతరించిపోతున్న తరుణంలో పలువురు వృక్ష ప్రేమికులు సొంతంగా మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. భవిషత్ తరాలకు మంచి వాతావరణం అందించడానికి తమ ఇంటి పరిసరాలు, పని చేసే చోట, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నారు. విత్తన బంతులను తయారు చేసి చల్లుతున్నారు. వృక్షాల ప్రాముఖ్యత గూర్చి సమాజంలో పలువురికి అవగాహన కల్పిస్తూ పలువురు మొక్కలు నాటేలా కృషి చేస్తున్న హరిత ప్రేమికులపై సాక్షి సండే స్పెషల్.ఉపాధ్యాయుడి ఇల్లు.. ఉద్యాన వనంచేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన అంబాల వెంకటేశ్గౌడ్, ప్రస్తుతం చుంచనకోట ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. మొక్కలంటే మక్కువ. తన ఇంటినే ఉద్యానవనంగా మార్చుకున్నాడు. ఇంటిలో నాటిన మొక్కలకు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో కొంత సమయం కేటాయించి వాటిని సంరక్షిస్తున్నాడు. ఖాళీ స్థలంలో మొక్కలు నాటి పెంచుతుండటంతో ఇంటి పరిసరాలు ఉద్యానవనాన్ని తలపిస్తున్నాయి. ఎర్రచందనం, శ్రీగంధం, మూడు రకాల మామిడి, రెండురకాల ఉసిరి మొక్కలతో కలుపుకొని మొత్తం 15 రకాల పండ్ల జాతి, 8 రకాల పూల మొక్కలు, కొన్ని రకాల తీగజాతి కూరగాయ తోటలు పెంచుతున్నాడు. పండ్లు, పూలు, నీడనిచ్చే, వాటిని కలుపుకుని మొత్తం 200 రకాలు మొక్కలు ఆ వనంలో ఉన్నాయి. గతంలో కేరళకు వెళ్లిన ఆయన అక్కడ ఏ ఇంటి ఆవరణ చూసినా వనంలా కనిపించడంతో అలా తన ఇంటిని కూడా ఉద్యానవనంగా మార్చుకున్నాడు. -
వనితకు ధీమాగా బీమా
● మహిళా స్వయం సహాయక బృందాలకు మేలు ● ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ ● ఆపత్కాలంలో భరోసా నారాయణఖేడ్: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి ప్రమాద బీమాను 2029వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోని మహిళా స్వయం సహాయ సంఘాలకు ప్రమాద సమయంలో భరోసా కల్పించినట్లైంది. సంఘాల సభ్యులుగా ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు బీమా పరిహారం పొందే సౌలభ్యం ఉంది. జిల్లాలో 688 గ్రామైఖ్య సంఘాలు ఉండగా పొదుపు సంఘాలు 18,213 ఉన్నాయి వాటిల్లో 1,90,426మంది సభ్యులు ఉన్నారు. ఈ మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయా యూనిట్లు, స్వయం ఉపాధి అవకాశాలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రమాద బీమాను 2029వరకు పొడిగించడంవల్ల ఈ సభ్యులందరికీ మేలు చేకూరనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్ర నిధి ద్వారా అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో 5గురు ప్రమాదం వల్ల మరణించగా వారికి రూ.50లక్షలు, రుణాలు పొంది సాధారణ మరణం పొందిన 89మందికి రూ.76లక్షలు విడుదలయ్యాయి. వీటిని త్వరలో జిల్లా అధికారులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీ పథకం ఉద్దేశ్యం మహిళను మహారాణులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ పథకాల రూకల్పన చేస్తుంది. స్వయం సహాయ సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు సీ్త్రనిధి రుణాలను అందిస్తూ వారు స్వశక్తితో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నారు. సంఘంలో సభ్యులకు ప్రత్యేకంగా రుణ, ప్రమాద బీమా పథకాలను ప్రవేశపెట్టింది. సభ్యులు ఎవరైనా సాధారణ, ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రత్యేకంగా రుణ, ప్రమాద బీమాలు అమలయ్యేలా చర్యలు చేపట్టింది. రుణ బీమా పథకంలో సహజ మరణం పొందితే రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల వరకు అందించనుంది. సభ్యుల భద్రతకు పథకం దోహదం స్వయం సహాయక సంఘాల సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజాగా ప్రమాద బీమా పథకాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగిస్తూ కొత్త జీవోను విడుదల చేసింది. మహిళా స్వయం సహాయక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబనకు, సామాజిక సాధికారతకు కీలమైన వేదికలు. ఈ బృందాల ద్వారా మహిళలు చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించుకోవడంతో పాటు చిన్న తరహా పొదుపును ప్రోత్సహిస్తున్నారు. తద్వారా తమ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. కాగా, అనేక సందర్భాల్లో దురదృష్టవశాత్తు జరిగే ప్రమాదాలు వారి జీవితాలను, వారి కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలకు ఇది ఒక పెద్ద ఊరట. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోకుండా కొంతమేర రక్షణ లభిస్తుంది. ఖేడ్లో సమావేశమైన స్వయం సహాయ సంఘాల సభ్యులు కుటుంబాలపై భారం లేకుండా.. సభ్యురాలు ప్రమాదశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.10లక్షలు నామినీ ఖాతాలో జమ చేస్తారు. వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి రూ.5లక్షలు అందజేయనున్నారు. ఈ పథకం ప్రారంభించకముందు రుణం పొందినవారు మరణిస్తే వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబీకులు, సంఘం సభ్యులపై పడేది. వీరు అర్హులు.. జిల్లా గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో 18 నుంచి 59ఏళ్ల వారు స్వయం సహాయ సభ్యురాలిగా ఉన్నట్లయితే బీమా వర్తిస్తుంది. పథకాన్ని గతేడాది మార్చి 14న ప్రారంభించగా అప్పటి నుంచి ఎవరైనా మృతి చెందితే ఈ పథకానికి అర్హులు. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకున్న వారు మరణిస్తే ప్రభుత్వం చేయూత అందిస్తుంది. -
నేడు తుది జాబితా
మొదట ప్రాదేశిక ఎన్నికలు.. మండల ప్రాదేశిక స్థానాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ ఎన్నికలు ముందుగానే నిర్వహించే అవకాశం కన్పిస్తోంది. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ బీఫారంపై జరుగుతుండటంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సవాల్గా స్వీకరించనున్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికలు జరగగా, ఎంపీపీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక ఉంటుంది. గెలుపొందిన ఎంపీటీసీలు ఆయా మండలాల ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ననుసరించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లపై త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేపట్టింది. ● కొలిక్కి వచ్చిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ● జిల్లాలో మొదలైన ఎన్నికల వేడి ● కొత్త మండలాల వారీగా ఎన్నికలునారాయణఖేడ్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎంపీటీసీల పునర్విభజన ప్రక్రియ దాదాపు ఖరారు కావడంతో జిల్లాలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ)ల పునర్విభజన షెడ్యూల్ ప్రకటించడం..పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285–ఏ సవరణకు మంత్రి మండలి నిర్ణయించడం..మొదట మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో ఎన్నికల సంఘం ఆదిశగా చర్యలు ప్రారంభించడంతో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇదివరకున్న మండల పరిషత్తులు, మండల ప్రాదేశిక నియోజకవర్గాల వివరాలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను మినహాయిస్తూ కొత్త మండలాలల్లో ఎంపీటీసీల సంఖ్య ఖరారు చేస్తున్నారు. దాదాపు జెడ్పీటీసీల సంఖ్యపై స్పష్టత రాగా ఎంపీటీసీలపై పూర్తిస్థాయిలో స్పష్టత రాగానే ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా ఎన్నికల సమరానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోనున్నాయి. కొత్త మండలాల వారీగా పునర్వ్యవస్థీకరణ జిల్లాలో కొత్తగా మండలాలు ఏర్పాటైనా పాత మండలాల పరిధిలోని గ్రామాలను కలుపుతూ కొన్ని ఎంపీటీసీ స్థానాలు కొనసాగాయి. కాగా, ప్రస్తుతం అలాకాకుండా కొత్త మండలాల వారీగా ఎంపీటీసీ, మండల పరిషత్తు, జెడ్పీటీసీ స్థానాలు ఖరారు కానున్నాయి. జిల్లాలో గతంలో 271 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుత పునర్వ్యవస్థీకరణతో ఎంపీటీసీ స్థానాలు ఖరారవుతాయి. 27మండలాలకు 27 జెడ్పీటీసీ స్థానాలు, అదే స్థాయిలో ఎంపీపీలు కొలువు దీరనున్నారు. ప్రతీ మండలంలో ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన ఆదేశించారు. ఆదిశగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితా ప్రకటన జరగగా తుది జాబితాను ఈనెల 12న అధికారులు ప్రకటించనున్నారు. ఖేడ్ నియోజవకర్గంలో నిజాంపేట్, ఆందోల్ నియోజకవర్గంలో చౌట్కూర్ కొత్త మండలాలుగా ఏర్పాటు కాగా ఈ మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు కొలువుదీరనున్నారు. ఇటీవల అమీన్పూర్, జిన్నారం మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో వీటిల్లోని ప్రాదేశిక స్థానాలు తొలగిపోయాయి. ఇప్పటికే పూర్తయిన శిక్షణ టీ స్వాన్ ద్వారా శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు జిల్లాలో బూత్లెవల్ అధికారులు ఇదివరకే శిక్షణను పూర్తి చేశారు. వారికి బీఎల్ఓ యాప్ద్వారా ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు తదితర అంశాలను వివరించారు. ప్రతీ బూత్స్థాయి అధికారి డోర్ టూ డోర్ వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూసుకోవాల్సి ఉంది. కాగా, ఈసారి ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలోనే ఒకేరకమైన యూనిఫాం శిక్షణను ఎన్నికల అధికారులు ఇచ్చింది. అధికారులు పోలింగ్ బూత్ల పరిశీలన, అక్కడ సౌకర్యాలు తదితరాలపై ఇదివరకే జిల్లా అధికారులకు నివేదిక సమర్పించారు. అందుకనుగుణంగా ఎన్నికల సంఘానికి జిల్లా అధికారులు నివేదించారు. కాగా, గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలవుతుంది. పార్టీల్లో సైతం సమావేశాలు, దిశా నిర్దేశాలు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. -
పంచాయతీ కార్మికుల వేతనాలు విడుదల
ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, విడుదలైన నిధుల వివరాలు జిల్లా గ్రామ వర్కర్లు నిధులు పంచాయతీలు (రూ.కోట్లలో) సంగారెడ్డి 620 2,316 6.39 మెదక్ 465 1,535 4.34 సిద్దిపేట 493 2,171 6.17 ● గ్రామపంచాయతీ ఖాతాలలో జమ ● కొత్త జీపీలకు విడుదల కాని నిధులు ● ఉమ్మడి మెదక్లో రూ.16.90కోట్లు విడుదల సంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీలలో మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్త సేకరణ, డంపింగ్యార్డ్కు తరలించడంతోపాటు వివిధ రకాల విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఊరట లభించింది. మూడు నెలలుగా సకాలంలో వేతనాలు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ పోషణభారం ఎదుర్కొన్నారు. గ్రామాలలో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన విధంగా నిధులు రాకపోవడంతో పంచాయతీల నిర్వహణ భారం ఆయా కార్యదర్శులపై పడుతుంది. అదేవిధంగా వేతనాలు రాకపోవటంతో పంచాయతీ కార్మికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేతనాలు విడుదలతో కార్మికుల హర్షం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 74 మండలాలు ఉండగా 1,578 గ్రామ పంచాయతీలున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 6,022 మంది బహుళ ప్రయోజనాల కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా సుమారు ఒక్కొక్కరికి రూ.9,500లు అందిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు సుమారు రూ.16.90కోట్ల నిధులు విడుదలైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. నేరుగా సంబంధిత గ్రామ పంచాయతీలలో నిధులు జమ కానున్నాయి. త్వరలో కొత్త జీపీ కార్మికులకు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల కార్మికులకు వేతనాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఆయా గ్రామ పంచాయతీలకు టీజీ బీ–పాస్ అకౌంట్లు లేకపోవటంతో కార్మికుల వేతనాలు విడుదల కాలేదు. గ్రామ పంచాయతీల వారీగా ఖాతాలు తెరవాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేశారు. అకౌంట్ నంబర్లు అప్డేట్ కాగానే వారికి సైతం వేతనాలు విడుదల కానున్నాయి. పంచాయతీ ఖాతాలలో జమ గ్రామ పచాయతీ కార్మికులకు మూడు వేతనాలు విడుదలయ్యాయి. నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలలో జమవుతాయి. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు ఖాతాలు ఓపెన్ చేయాలని ఆదేశించాం. వారికి కూడా త్వరలోనే వేతనాలు విడుదలవుతాయి. –సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, సంగారెడ్డి -
ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని మెరుగైన సేవలు
డయల్యువర్ డీఎంలో మల్లేశయ్య నారాయణఖేడ్: ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆదరిస్తే మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉందని ఖేడ్ ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. ఖేడ్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖేడ్కు చెందిన గౌలి మెఘారాం ఖేడ్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు, కంగ్జికి చెందిన సుభాష్ కంగ్జి, దెగుల్వాడీ, చింతాకి మీదుగా కర్ణాటకలోని బీదర్కు బస్సులు నడపాలని కోరారు. తడ్కల్కు చెందిన వెంకటేశం కంగ్టి నుంచి తడ్కల్మీదుగా పిట్లంకు, తాటిపల్లికి చెందిన బాగారెడ్డితో పాటు తాటిపల్లిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాణి, శ్రీలత, సంగీత, వెంకట్రెడ్డి పాఠశాల సమయానికి చేరుకునేలా బస్సు సమయాన్ని మార్చాలని కోరారు. బీబీపేటకు చెందిన గుండుమోహన్, సిర్గాపూర్కు చెందిన నర్సింహులు నల్లవాగు, బీబీపేట, ఫత్తేపూర్ మీదుగా పిట్లంకు, మునిగేపల్లికి చెందిన బషీర్ నిజాంపేట ఫ్లైఓవర్ వంతెన వద్ద రిక్వెస్ట్స్టాప్ ఏర్పాటు చేయాలని, వంగ్దాల్ మాజీ సర్పంచ్ భీమ్రావుపటేల్ విద్యార్థుల సౌకర్యార్థం తమ గ్రామానికి బస్సు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను నమోదు చేసుకున్న డీఎం ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఎంపీ కొండా క్షమాపణలు చెప్పాలి కొండాపూర్(సంగారెడ్డి): రాష్ట్రంలో వరి సాగు అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర రైతాంగానికి వెంటనే ఆయనతోపాటు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దశరథ్ డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలంలోని మందాపూర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ్ మాట్లాడుతూ...రాష్ట్రంలో వరి సాగు వద్దని చెప్పి రైతులను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. బియ్యం తినకుండా బతకలేమా? తెలంగాణకు బియ్యం అవసరమా అని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని ప్రశ్నించారు? కార్యక్రమంలో సీపీఐ నాయకులు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరిలో కాంప్లెక్స్ ఎరువులు తగ్గించాలి కల్హేర్(నారాయణఖేడ్): వరిలో పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం తగ్గించాలని నారాయణఖేడ్ ఏడీఏ నూతన్కుమార్ సూచించారు. మండలంలోని రాపర్తిలో వరి సాగు విధానంపై శుక్రవారం రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. అధికారుల సలహాలు పాటించాలని కోరారు. అనంతరం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ వెంకటేశం, ఏఈఓ కృష్ణవేణి, రైతులు హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు. సిగాచీ బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిగాచీ పరిశ్రమలో ప్రమాదంలో ఇంతవరకు ఆచూకీ లేని ఇస్నాపూర్కు చెందిన సిల్వర్ రవి కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు. రవి భార్య దివ్య, పిల్లలు లౌక్య, అద్విక్ లను కలిసి వారికి ధైర్యం చెప్పి వారిని ఓదార్చారు. -
ఆలయాల ధ్వంసానికి కుట్ర
● మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపణ ● రుద్రారం ఆలయం పరిశీలనపటాన్చెరు టౌన్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, పిచ్చివాళ్ల పేరిట ఆలయాల ధ్వంసానికి ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. పటాన్చెరు మండలం రుద్రారంలోని హనుమాన్ ఆలయంలో గురువారం రాత్రి విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి గ్రామస్తులు,పోలీసులతో కలసి రఘునందన్రావు శుక్రవారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, సదాశివపేట,రుద్రారం ఆలయాల్లో దాడులు చేసింది పిచ్చివాళ్లు అనిచెప్పి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. పిచ్చివాళ్లకు సీసీ కెమెరాలు తొలగించి దాడులు చేయాలనే అవగాహన ఉండటమేమిటోనని అర్థం కావడంలేదన్నారు. -
నానో యూరియా, డీఏపీతో ప్రయోజనాలు
పాపన్నపేట(మెదక్): నానో యూరియా, డీఏపీ వాడకంతో అధిక ప్రయోజనాలు ఉంటాయని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రవికుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారులతో కలిసి మండలంలోని తమ్మాయపల్లి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. నానో డీఏపీ వాడకం వల్ల పంటకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని, దీంతో ఎరువులు ఆదా అవుతాయని తెలిపారు. నేల ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందన్నారు. పీఎస్బీ వాడకం వల్ల నేలలో ఉన్న భాస్వరం త్వరగా కరుగుతుందని చెప్పారు. నానో యూరియా స్ప్రే చేసిన 4 గంటల్లోపు 95 శాతం శోషించుకుంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమాధురి, ఏఈఓ నాగరాజు, రైతులు రాంరెడ్డి, అనీల్ రెడ్డి, సాయిలు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ -
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
కొండపాక(గజ్వేల్): ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కుకునూరుపల్లి పోలీస్టేషన్లో తొగుట సీఐ లతీఫ్ వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్కు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి హైదరాబాద్లోని వినాయకనగర్లో నివాసం ఉంటున్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో పగటి పూట రెక్కీ చేస్తూ.. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు. రాత్రి వేళల్లో దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేసేవారు. ఈ క్రమంలో జిల్లాలోని 19 చోట్ల దొంగతనాలు చేయగా 6 పోలీస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం కుకునూరుపల్లిలోని బస్టాండ్ వద్ద ఎస్సై శ్రీనివాస్ పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అన్నారెడ్డి రమేష్, కూజ నర్సయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని కోర్టులో హాజరుపర్చారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు. ముఠాలో ఇద్దరు అరెస్ట్ మిగతా నులుగురి కోసం గాలింపు వివరాలు వెల్లడించిన సీఐ లతీఫ్ -
మొక్కజొన్న సాగుకే మొగ్గు
ఈ ఏడాది జహీరాబాద్ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తారంగా సాగవుతోంది. గతేడాది పత్తి అధికంగా సాగు కావడంతో ఈ సారి పంట మార్పిడి అవుతుందని, నమ్మకమైన పంట కావడంతో మొక్కజొన్నకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తగిన మేర వర్షాలు కూడా లేకపోవడంతో మినుము, పెసర సాగుకు అదను మించిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ పంటను సాగు చేస్తున్నారు. జహీరాబాద్: జహీరాబాద్ డివిజన్లో 90 శాతం మేర మొక్కజొన్న పంట సాగవుతోంది. ఇప్పటికే 10వేల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 2వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి మాత్రం 75 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఇంకా మొక్కజొన్న పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వర్షపాతం లేకపోవడంతో మినుము, పెసర సాగుకు సమయం మించిపోవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. జిల్లాలోనే జహీరాబాద్ ప్రాంతంలో మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. డివిజన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో పంట సాగులోకి వచ్చింది. అత్యధికంగా కోహీర్ మండలంలో రైతులు సాగు చేస్తున్నారు. డివిజన్ పరిధిలో 80 శాతం పంట ఈ మండలంలోనే సాగవుతోంది. మొక్కజొన్నలో అంతర పంటగా కంది వేస్తున్నారు. బావులు, బోర్లు ఉన్న రైతులు మాత్రం ఒక్క మొక్కజొన్న పంటనే వేసుకుంటున్నారు. పంట తీసుకున్న తర్వాత రెండో పంటగా శనగ లేదా తెల్లకుసుమ పంటను సాగు చేయనున్నారు. గిట్టుబాటు ధర ఉండడంతో.. మొక్కజొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,360 కనీస మద్దతు ధర ప్రకటించింది. దీంతో ఈ పంట వేసే గిట్టుబాటు అవుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కలుపు నివారణ, పంట కోతకు కూలీల అవసరం లేకపోవడం కూడా ఓ కారణమని అధికారులు చెబుతున్నారు. కలుపు నివారణ మందులను స్ప్రే చేసుకోవడం, పంట చేతికి వచ్చాక యంత్రాల సహాయంతో రాసులు చేసుకునే వెసులుబాటు ఉండటంతో రైతులు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.జహీరాబాద్ డివిజన్లో గతేడాది కంటే అత్యధికం తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతుల ఆసక్తి గిట్టుబాటు ధర, నమ్మకంగా చేతికొస్తుందనే ఆశ కూలీల అవసరం ఉండక పోవడమే కారణంతెగుళ్లను తట్టుకొని.. తెగుళ్లు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని పంట చేతికి వస్తుండటంతో రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుతున్నారు. అధిక వర్షాలు కురిస్తే ఇతర పంటలు దెబ్బతింటున్నాయని, ఈ పంటను వేస్తే పంట దిగుబడి ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు వస్తుండటంతో సాగు చేస్తున్నారు.పెరిగిన సాగు విస్తీర్ణం తగినన్నీ వర్షాలు పడకపోవడంతో రైతులు మొక్కజొన్న సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం బాగా పెరుగుతోంది. పత్తి, సోయాబీన్, కంది, మినుము పంటల సాగు సమయం మించి పోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న ఎప్పుడైనా సాగు చేసే వీలుండటంతో సాగు పెరిగింది. ఇంకా రైతులు మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటున్నారు. –ప్రదీప్కుమార్, ఏఈఓ, జహీరాబాద్ -
సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఉమెన్ చాంపియన్ టోర్నీ నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరాం, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శని, ఆదివారాల్లో స్థానిక సిటీజన్ క్లబ్ ఆధ్వర్యంలో టోర్నీ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలను శనివారం సాయంత్రం 5 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు.పునరావాస పథకానికి దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటరూరల్: దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన కోసం ఉపాధి, పునరావాస పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.లక్ష్మికాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదేళ్లలో మహిళలు, పిల్లలు , వికలాంగులు, వయోవృద్ధుల శాఖ, ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి సబ్సిడీ పొంది ఉండరాదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు https:// tgobmms.cgg.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి కమి టీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కోర్సులు.. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డ్రైవింగ్, ఫొటో, వీడియోగ్రఫీ, బ్యూటీషియన్, జ్యూట్బ్యాగ్, టైలరింగ్, లాజిస్టిక్ రంగాల్లో శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన వారు www.wdsc.telangana .gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040– 24559050 నంబర్ను సంప్రదించాలన్నారు.ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గర్భిణిని కాపాడిన వైద్యులు గజ్వేల్: గజ్వేల్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి చెందిన వైద్యులు ఓ తల్లికి కఠినమైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. వివరాలు... గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీలోని వేములగట్ గ్రామానికి చెందిన ఎర్రన్నగారి ప్రవీణ ఇన్ ఫర్టిలిటీ ద్వారా గర్భం దాల్చింది. కానీ ఈ గర్భం అసాధారణ రీతిలో గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్లో పిండం ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా ఆమెకు రక్తం 7హెచ్బీ గ్రాములు మాత్రమే ఉందని, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ప్రభుత్వాస్పత్రిని సదరు మహిళ ఆశ్రయించింది. దీంతో ఆమెకు శస్త్ర చికిత్స చేసేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఏర్పాట్లు చేశారు. ఆమె కడుపులోంచి 500 గ్రాముల పిండం రక్తపు గడ్డలను ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది. డాక్టర్ అన్నపూర్ణతో పాటు ప్రణయరెడ్డి, మత్తుమందు వైద్యులు సూర్య, ఓటీ థియేటర్ అసిస్టెంట్ శ్రీలత తదితరులు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. బావిలో పడి కూలీ మృతిచిన్నకోడూరు(సిద్దిపేట): బావిలో పడి కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని విఠలాపూర్లో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మేకల రవి(45) కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలతో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కూలీ పనులకు వెళ్లాడు. వ్యవసాయ భావి సమీపంలో చెట్టును కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి బావిలో పడ్డాడు. ఇది గమనించిన తోటి కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించి వారి సహాయంతో రవిని బయటకు తీశారు. వెంటనే ప్రైవేటు వాహనంలో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైఫ్ అలీ తెలిపారు. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
కొల్చారం(నర్సాపూర్): వరి సాగు చేసి నష్టపోతున్న రైతులు, ఆయిల్ పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. శుక్రవారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో జిల్లా ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్సింగ్, జడ్పీసీఈఓ చేతుల మీదుగా రైతు జగదీష్ పొలంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు 90 శాతం సబ్సిడీపై అవసరమైన మొక్కలు, డ్రిప్ ఇస్తుందన్నారు. జిల్లాలో 2025–26 సంవత్సరానికి 2500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. ఇప్పటివరకు 1545 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. అందులో నుంచి 771 ఎకరాలు ఆయిల్ పామ్ తోటలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ శ్వేతా కుమారి, ఏఈఓలు రాజశేఖర్ రెడ్డి, నిరోషా, కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లోని ప్రతి కాలనీ పరిశుభ్రంగా ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని ధర్మాసాగర్లో డ్రైడే కార్యక్రమంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత డబ్బాలు, కొబ్బరి బోండాలు, టైర్లు, నిరుపయోగంగా ఉండే నీటితొట్లలో నీరు నిలువలేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఏ పుణ్యదాస్, పంచాయతీ కార్యదర్శి నరహరి, అంగన్వాడీ టీచర్ పద్మ, ఆశవర్కర్ మంజుల పాల్గొన్నారు.జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
పందిరి సాగు ఎంతో లాభదాయకం
కొండపాక(గజ్వేల్): పందిరి తోటల కూరగాయల సాగు ఎంతో లాభదాయకమని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బందారం శివారులో రైతు అమ్మన రాజిరెడ్డి 30 ఎకరాల్లో సాగు చేస్తున్న పందిరి కాకర, బీర కూరగాయల క్షేత్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి సందర్శించారు. పశువుల ఎరువును సేంద్రీయ ఎరువుగా తయారు చేసే యూనిట్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పందిరి సాగుకు ప్రభుత్వం రూ. లక్ష వరకు సబ్సిడీ ఇస్తుందని, కానీ ఎకరాకు సుమారు రూ. 4లక్షల వరకు ఖర్చు అవుతుందని వీసీ రాజిరెడ్డి దృష్టికి రైతు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. కూలీల కొరతను అధిగమించి యంత్ర పరికరాలతో పండించిన కూరగాయలను మద్రాస్తోపాటు ఖమ్మం వరంగల్,కరీంనగర్, హైదరాబాద్లోని మార్కెట్ల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతు రాజిరెడ్డి దంపతులను వైస్ చాన్స్లర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ జిల్లా అధికారి సువర్ణ, మండల అధికారి కౌసల్య, యూనివర్సిటీ అధికారులు సురేష్కుమార్, భగవాన్, చీనా, లక్ష్మినారాయణ,నాయకులు దుర్గయ్య, కరుణాకర్రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి -
త్వరలో ఉపాధ్యాయులకు పీఆర్సీ
వర్గల్(గజ్వేల్): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే పీఆర్సీని సాధించబోతున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం గౌరారంలో ఓ ఫంక్షన్హాల్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన శేరిపల్లి హెచ్ఎం కాయిత రమాదేవి ఉద్యోగ విరమణ సభకు హాజరై సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ సాధించుకున్న ఘనత పీఆర్టీయూ సంఘానికే దక్కుతుందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్శర్మ, మండల పీఆర్టీయూ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ఎంఈఓలు సునీత, ఉదయభాస్కర్, జిల్లా నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ రెడ్డి, లక్కిరెడ్డి విజయ పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
గురుకుల భూమి.. దర్జాగా కబ్జా
రాత్రికి రాత్రే చదును చేసిన వైనం ● ఆక్రమించిన భూమి విలువ రూ.కోటిన్నర ● గతంలోనే 7ఎకరాలు గురుకులానికి కేటాయింపు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులుమండల కేంద్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. విలువలైన భూములపై కబ్జాకోరులు కన్నేసి రాత్రికి రాత్రే చదును చేసి దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరిగినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్): గురుకుల స్థలాన్ని చదును చేసిన అక్రమార్కులు ● -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..
గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మండల పరిధిలోని కొల్గూరు గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కర్రొల్ల ప్రశాంత్(21) సిద్దిపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లికి చెందిన మర్పడగ(గాజులపల్లి) రాజిరెడ్డి(38) పెయింటర్గా పనిచేస్తూ గజ్వేల్లో నివసిస్తున్నాడు. ప్రశాంత్ తన పని ముగించుకొని సిద్దిపేట నుంచి కొల్గూరు గ్రామానికి స్కూటీపై బయలుదేరాడు. ఇదే క్రమంలో గజ్వేల్ నుంచి రాజిరెడ్డి కూడా బైక్పై వస్తున్నాడు. కొల్గూరు దాటిన తర్వాత పెద్దమ్మ గుడి సమీపంలో వీరిద్దరు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదా తెలిపారు.ఇద్దరు వ్యక్తులు మృతి -
మహిళల రక్షణకు భరోసా కల్పించాలి
సిద్దిపేటకమాన్ : పిల్లలు, మహిళల రక్షణకు మేమున్నామని పూర్తి నమ్మకం, భరోసా కల్పించాలని సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో షీటీమ్, భరోసా సిబ్బందితో సీపీ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షీటీమ్ మహిళలు, బాలికలకు రక్షణ కవచంగా పనిచేయాలన్నారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలని సూచించారు. హాట్స్పాట్లను ప్రతి రోజు మూడు నాలుగు సార్లు సందర్శించాలన్నారు. ఫిర్యాదు బాక్సులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, పార్క్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో మహిళ పోలీసు స్టేషన్ సీఐ దుర్గ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు కిరణ్, మూడు డివిజన్ల షీటీమ్, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలి గజ్వేల్రూరల్: సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే వారికి ప్రాధాన్యతనివ్వాలని సీపీ అనురాధ పేర్కొన్నారు. గజ్వేల్ పోలీస్స్టేషన్కు బదిలీపై వచ్చిన ఎస్ఐలు రఘుపతి, ప్రేమ్దీప్ గురువారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి సీపీ పలు సూచనలు చేశారు.సీపీ అనురాధ -
ఎండు గంజాయి స్వాధీనం
మునిపల్లి(అందోల్): ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేశారు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు, సిబ్బంది గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్కు యాక్టివాపై మొహమ్మద్ సమీర్ (35) గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించారు. అతడి వద్ద సుమారు 6.400 కిలో గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీదర్ లోని ఇరాన్ గల్లీలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏఎస్ఐ బక్కన్న, సి బ్బంది ఎండి, హనీఫ్, పాండు, సునీల్ పాల్గొన్నారు.నిందితుడి రిమాండ్ -
ఉమ్మడికే జై.. ఒక్కరిద్దరికే సై
సిద్దిపేట జిల్లాలో 2,38,049 గృహాలున్నాయి. మొత్తం 10,12,065 జనాభా ఉంది. వీరిలో 5,04,141 మంది పురుషులు, 5,07,924మంది మహిళలు ఉన్నారు. నూతన టెక్నాలజీ, మారుతున్న పరిస్థితులు, ఆలోచన విధానం, ఉద్యోగ, వ్యాపార రీత్యా కొంత మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి, పిల్లలు అనే ఆలోచనతో ఉన్నారు. 30 ఏళ్లు దాటిన యువత చాలా మంది జీవితంలో స్థిరపడక పోవడంతో వివాహాలకు వెనకడుగు వేస్తున్నారు. జనాభా పెరగడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. జనాభా పెరుగుతున్న కారణంగా ఆహార ధాన్యాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. చ.కి.మీటర్కు సగటున 340 మంది సంగారెడ్డి జిల్లాలో 4.492.07 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 15,27,301 మంది జనాభా ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్కు జనసాంద్రత 340 నమోదై ఉంది. 15 లక్షల పైగా జనాభా ఉండగా ఇందులో దాదాపు 50 శాతానికి పైగా యువత మరియు వృద్ధులే ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడితే వే లాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటు న్నారు. దీంతో విపరీతమైన పోటీ నెలకొంది. అటు ప్రైవేట్ రంగంలోనూ పోటీ ఉంది. దీనికంతటికి ప్రధాన కారణం పెరుగుతున్న జనాభా అనుగుణంగా వనరులు లేకపోవడం అని గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల వల్ల నివాస సముదాయాలు పెరిగిపోవడం, రియల్ ఎస్టేట్ రంగం వ్యాప్తి చెందుతుండటంతో క్రమంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రస్తుత సమాజ ంలో ఉమ్మడి కుటుంబానికే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ పెద్దలు చెప్పిన మాటను నిజం చేస్తున్నారు. సమాజంలో మారిన జీవన పరిస్థితులు, కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పట్టణాల్లో స్థిరపడి పెద్దలకు దూరంగా ఉంటున్నారు. దీని వల్ల చిన్న చిన్న సమస్యలకే గొడవలు పడి, ఓపిక లేక వివాహమైన కొన్ని నెలలకే విడిపోతున్నారు. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే మనోఽధైర్యం కల్పించి కుటుంబ సభ్యులు అండగా ఉంటారు. గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న దంపతులు ఉమ్మడి కుటుంబంతోనే సంతోషంగా ఉండవచ్చని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నేడు ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. సిద్దిపేటకమాన్ / సంగారెడ్డి క్రైమ్: ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న వైనం సెటిలయ్యాకే వివాహం అంటున్న యువత ఉమ్మడి కుటుంబాలు మేలంటున్న పలువురు సిద్దిపేట జిల్లాలో 10,12,065 జనాభా అధిక జనాభాతో అనర్థాలు నేడు ప్రపంచ జనాభా దినోత్సవంజనాభాను నియంత్రించాలి నేను నా భార్య అనిత, మూడేళ్ల పాప శ్రీనికతో కలిసి పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నాం. అన్నయ్య, వదినె, పిల్లలు, అమ్మతో పాటు మొత్తం 8మందితో సంతోషంగా ఉన్నాం. ఆడ, మగ అని తేడా లేకుండా పిల్లలను బాగా చదివించి, వారికి భవిష్యత్ను అందించాలి. ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా విద్య, వైద్యం వంటి రంగాల్లో సౌకకర్యాలు కల్పించాలి. జనాభా నియంత్రణపై అవగాహన కల్పించాలి. – గుండబోయిన కిరణ్ అనిత, సిద్దిపేట ఉమ్మడి కుటుంబాలకే మొగ్గు ప్రస్తుతం సమాజంలో మారిన జీవన పరిస్థితులు, కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పట్టణాల్లో స్థిరపడి పెద్దలకు దూరంగా ఉంటున్నారు. యువత వేరు కాపురం పెట్టడం వల్ల చిన్న చిన్న సమస్యలకే గొడవలు పడి, ఆలోచన, అనుభవం, ఓపిక లేకపోవడంతో వివాహమైన కొన్ని నెలలకే విడిపోతున్నారు. మరి కొంత మంది తమకు ఆడ, మగ అని తేడా లేకుండా ఒక్కరు చాలు అని వారికి ఉన్నత చదువు నేర్పించి జీవితంలో ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. అలాగే గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న దంపతులు ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.జనాభా పెరిగితే ఏర్పడే సమస్యలు ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. అడవులు అంతరించిపోతాయి. ఆకలికేకలు, ఆరోగ్యం ఇబ్బందిపెడతాయి. సహజ వనరులు లేకపోవడంతో భవిష్యత్ అవసరాలకు ఆటంకంగా మారుతుంది. జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు అవసరాలు తీర్చాలి. నిరుద్యోగం సమస్య పరిణమిస్తుంది. -
శ్రీచైతన్య పాఠశాలకు షోకాజ్ నోటీసులు
● యునిఫాంలు ఉన్న గది సీజ్ ● ఎంఈఓ సత్యనారాయణతూప్రాన్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న శ్రీచైతన్య పాఠశాలను ఎంఈఓ సత్యనారాయణ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే పాఠశాలకు ప్రీ–ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ 9వ తరగతి నిర్వహిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా తొమ్మిదో తరగతి నడుపుతున్నట్లు గుర్తించినట్లు ఎంఈఓ తెలిపారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో యూనిఫాంలు విక్రయం కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత పాఠశాల యాజమాన్యానికి తక్షణమే 9వ తరగతిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసి, యునిఫాంలు ఉన్న గదిని సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పిల్లలను చేర్పించాలని సూచించారు. -
ట్రాక్టర్ బోల్తా
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన మండలం కపూర్నాయక్ తండా గ్రామ పరిధిలోని శ్రీరాం తండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... తండావాసులకు తాగునీరు సరఫరా చేసేందుకు వెళుతున్న వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతోనే ట్రాక్టర్ బోల్తాపడినట్లు తండావాసులు వాపోయారు. బస్సు, బైక్ ఢీ.. ● ఒకరికి తీవ్ర గాయాలు కౌడిపల్లి(నర్సాపూర్): బస్సు, బైక్ ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి బస్టాండ్ వద్ద 765డి జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం... చిలప్చెడ్ మండలం రాందాస్గూడ గ్రామానికి చెందిన గణేష్ తన బైక్పై కౌడిపల్లికి వచ్చి బస్టాండ్వద్ద యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో బస్టాండ్ నుంచి పల్లెవెలుగు బస్సు రోడ్డుపైకి రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్పై ఉన్న గణేష్ కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాధితున్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి వెల్దుర్తి(తూప్రాన్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని యశ్వంతరావ్పేట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... తండాకు చెందిన నేనావత్ దుర్గ్య, జయరాంలు అన్నదమ్ములు. భూమి పంపకం విషయంలో గత నెల 29న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా దుర్గ్య వెళ్లలేదు. కొన్నేళ్లుగా హైదరాబాద్లోని బహుదూర్పల్లిలో నివాసముంటున్న జయరాం(55) ఆ రోజు రాత్రి తండాలోనే ఉండి మరుసటిరోజు బహుదూర్పల్లి వెళ్లిపోయాడు. దీంతో కొద్ది సేపటికే కింద పడిపోగా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. తన భర్తను అతని సోదరుడు దుర్గ్య, వదిన రాణి దారుణంగా కొట్టడంతోనే నీరసంతో మృతి చెందాడని మృతుడి భార్య జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్తో సైబర్ మోసం – రూ.35 లక్షలు పోగొట్టుకున్న గృహిణి పటాన్చెరు టౌ్న్ : నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్తో ఓ గృహిణి రూ.35 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన అమీన్న్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుప్రజ హోమ్స్కు చెందిన మహిళకు ఏప్రిల్ 2న ట్రేడింగ్కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. దీంతో ఆన్న్లైన్ ట్రేడింగ్లో అకౌంట్ కోసం తన వివరాలను యాప్లో నమోదు చేసింది. అనంతరం నిర్వాహకులు ఒక ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఆ గృహిణి నగదును ఆన్న్లైన్లో పలు దఫాలుగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. పెట్టిన నగదుతో పాటు, లాభాలు చూపిస్తూ అపరిచిత వ్యక్తి వచ్చాడు. అయితే బాధితురాలు.. కుటుంబ సభ్యులు తన ఖాతాలో ఉంచిన నగదును ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. రూ.35 లక్షలు పెట్టిన అనంతరం తాను పెట్టిన నగదుతో పాటు, లాభాలను ఇవ్వాలని అడగగా అపరిచిత వ్యక్తులు స్పందించలేదు. దీంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గుర్తించి, సైబర్ క్రైమ్ పోలీసులకు, అమీన్న్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్జ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
● డిప్యూటీ తహసీల్దార్ వద్దరూ.15 వేలు స్వాధీనం ● మరో రూ.50 వేలు రికవరీ ● డిప్యూటీ కలెక్టర్తో సహ మరో ఇద్దరు అరెస్టు జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ వద్ద రూ.15 వేలు, డిప్యూటీ కలెక్టర్కు ఇవ్వాలనుకున్న మరో రూ.50 వేలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. ఏసీబీ మెదక్ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం..న్యాల్కల్ మండలంలోని హుసెల్లి గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ మక్బూల్ 50 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన భూమి గ్రామంలో ఉంది. నిమ్జ్ ప్రాజెక్టులో భూమి పోతుందని తెలుసుకున్న అతడు పరిహారం కోసం కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ కలెక్టర్ రాజును కలిసి పట్టాపాస్బుక్ను అందజేశాడు. ఏడాది నుంచి తిరుగుతున్నా పరిహారం ఇవ్వడం లేదు. మే 9న పరిహారం ఇస్తామని, కార్యాలయానికి రావాలని ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లిన ఆయనను విచారణ చేయాలని పంపించారు. మక్బూల్కు ఓరోజు డ్రైవర్ దుర్గయ్య ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తే పని అవుతుందని చెప్పాడు. డిప్యూటీ కలెక్టర్ రాజుకు రూ.50 వేలు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్కు రూ.15 వేలు కార్యాలయం సిబ్బందికి కలిపి మొత్తం రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.75 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు రూ. 52.87 లక్షల పరిహారం డబ్బులు మక్బూల్ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత డబ్బుల కోసం ఫోన్ చేస్తుండటంతో విసుగుచెందిన మక్బూల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు గురువారం నిమ్జ్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సతీష్కు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ కలెక్టర్కు రూ.50 వేలు ఇవ్వడానికి వెళ్లగా హైదరాబాద్లో తీసుకుంటానన్నాడు. రూ.50 వేలను స్వాఽధీనం చేసుకుని ,డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డిప్యూటీ కలెక్టర్ రాజు, డ్రైవర్ దుర్గయ్యను అరెస్టు చేశారు. -
వరకట్న వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
టేక్మాల్ (మెదక్): వరకట్నం వేధింపులతో నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని హసన్మహమ్మద్ పల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎక్కెల సాయిలు మూడో కూతురు మానస (17)ను పెద్దశంకరంపేట మండలంలోని మూసాపేట గ్రామానికి చెందిన తెరిగోర సంగమేశ్వర్తో 2024 ఏప్రిల్ 19న వివాహం చేశారు. కాగా, రెండేళ్ల క్రితం సంగమేశ్వర్ను హసన్ మహమ్మద్పల్లి గ్రామానికి చెందిన ఎక్కాల పోచమ్మ, బీరయ్య తన ఇంటికి దత్తత తీసుకున్నారు. వివాహ సమయంలో తులం బంగారంతో పాటు బైకు కోసం లక్ష రూపాయలు ఇచ్చారు. ఇంకా ఐదు తులాల బంగారం ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ పంటలపై ఇస్తానని మానస తల్లిదండ్రులు చెప్పారు. ఈ బంగారం కోసం తరచూ సంగమేశ్వర్ భార్యను వేధిస్తుండగా పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టారు. మానస 8 నెలల గర్భిణి కావడంతో తమ ఇంటికి తీసుకెళ్తామని ఈ నెల 7న మానస తల్లి బేతమ్మ వెళ్లి అడగగా పంపించనని గొడవపడ్డాడు. బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తలుపులు మూసి ఉన్నాయి. ఇంటి పైకప్పు తెరిచి లోపలికి చూడగా మానస దూలానికి చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. తన కూతురు అల్లుడు వేధింపులతోనే ఉరివేసుకున్నదని తండ్రి సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన స్థలాన్ని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు.ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ -
అద్దెకుండే వారి వివరాలు తీసుకోవాలి
● కార్డన్ సర్చ్లో 80 వాహనాలు సీజ్ ● తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమల వాడ కావడంతో అద్దెకు వచ్చే వారి వివరాలను తప్పనిసరిగా యజమానులు తీసుకోవాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. గురువారం మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్లో వేకువజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లలో అద్దెకుండే వారి వివరాలు సేకరించారు. అంతే కాకుండా ఇండ్ల మధ్య బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి 250 మద్యం బాటిల్లు, 50 బీరు బాటిల్స్ను సీజ్ చేశారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 80 బైక్లు, రెండు ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. అలాగే వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు రూ. 87,895 ఆన్లైన్లో క్లియర్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో డీఎస్పీ మాట్లాడుతూ... గ్రామాల్లో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్గౌడ్, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు ● దుర్వాసనతో స్థానికుల విలవిల జిన్నారం(పటాన్చెరు): గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలను పారబోసిన ఘటన ఖాజీపల్లి పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... గడ్డపోతారం మున్సిపాలిటీ ఖాజీపల్లి పరిధిలోని సర్వేనం.181 వనదుర్గాదేవి ఆలయ సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థాలను సంచుల్లో తీసుకొచ్చి పారబోశారు. దీంతో ఆ ప్రాంతమంతా వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో ఊపిరితీసుకోలేని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా సమీప చెరువు, కుంటలకు ఆ వ్యర్థాలు చేరి తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పీసీబీ అఽధికారులు స్పందించి వ్యర్థాలు పారబోసిన పరిశ్రమపై, క్షేత్ర స్థాయిలో గుర్తించి బాధ్యులపై కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
భూములాక్కోవడం దారుణం
కలెక్టర్కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిశారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలసి కలెక్టర్కు సమస్యలపై ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. కొండాపూర్ మండలం మందాపూర్, మునిదేవునిపల్లి గ్రామాల్లో పరిశ్రమల పేరుతో రైతులు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తుందని, రైతుల నుంచి భూములను లాక్కుంటే రైతులు రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల బతుకులు చిన్నాభిన్నం చేసేలా ప్రభుత్వ ప్రతిపాదనలు సరికాదన్నారు. రైతులకు నష్ట పరిహారం నిర్ధారణ చేసి ,సాగుకు అనుకూలంగా లేని భూమిని చూసుకుని పరిశ్రమలకు కేటాయించుకోవాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా మురళీకృష్ణ సంగారెడ్డి: జిల్లా కేంద్ర సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్గా మురళీకృష్ణ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వాసుపత్రి ఇన్చార్జి ప్రిన్సిపాల్గా ఉన్న డాక్టర్ అనిల్కుమార్ ఆయనకు కేటాయించిన పోస్టులో కొనసాగనున్నారు. ఎరువులపై అపోహలు వద్దు ఖేడ్ ఏడీఏ నూతన్కుమార్ కంగ్టి(నారాయణఖేడ్): రైతులు ఎరువుల వినియోగం విషయంలో ఎలాంటి అపోహలకు గురికావద్దని అన్నీ కంపెనీల డీఏపీ ఎరువులు ఒకేవిధంగా మొక్కల ఎదుగుదలకు పనిచేస్తాయని నారాయణఖేడ్ ఏడీఏ నూతన్కుమార్ తెలిపారు. మండల కేంద్రం కంగ్టితోపాటు పలు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి రైతులకు ఎరువుల పట్ల అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎరువులు అమ్మినా..అధిక ధరలకు అమ్మకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని రైతులు తమకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు, ఏఈఓ పాల్గొన్నారు. త్వరలో టీచర్లకు హెల్త్కార్డులు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ కల్హేర్(నారాయణఖేడ్): ఉపాధ్యాయులకు త్వర లో ప్రభుత్వం హెల్త్కార్డులు అందజేస్తుందని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కల్హేర్ మండలంలో గురువారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండు లక్ష్మణ్ మాట్లాడుతూ... పీఆర్టీయూ సంఘం సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందన్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయని తెలిపారు. పీఆర్టీయూ సంఘం ఆశయాలకు కట్టుబడి ఉపాధ్యయులు పనిచేయాలని కోరారు. గుండు లక్ష్మణ్ను మార్డి, బీబీపేట్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఆవిష్కరణలపై దృష్టి సారించాలి గీతం సదస్సులో లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ పటాన్చెరు: రక్షణ రంగంలో సవాళ్లను ఎదుర్కునేందుకు వివిధ ఇంజనీరింగ్ విభాగాల మధ్య సమన్వయంతో నూతన ఆవిష్కరణల పై దృష్టి సారించాలని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్సే పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో వస్తున్న ధోరణులు, ఆవిష్కరణలు’అంశంపై గురువారం నుంచి నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రక్షణ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతిక అవసరమని, అందుకు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అంతర్గత పరి శోధనల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. -
ఎరువుల కొరత ఉండొద్దు
17మంది అధికారులకు షోకాజ్!కలెక్టర్ ప్రావీణ్య పల్లెకు పోయి.. పనులను పరిశీలించిఎద్దుమైలారం గ్రామాన్ని సందర్శించిన తమిళనాడు అధికారుల బృందం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన 17 శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులకు కలెక్టర్ పి.ప్రావీణ్య షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7న జరిగిన ప్రజావాణికి ఈ అధికారులు హాజరు కాకుండా, తమ కిందిస్థాయి ఉద్యోగులను పంపారు. దీనిపై కలెక్టర్ ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..యూరియా స్టాక్ను ప్రణాళిక బద్ధంగా రైతులకు పారదర్శకంగా అందించాలన్నారు. అధికారులు విధిగా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వం సూచించిన లక్ష్యం మేరకు 3,750ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ పంటను విస్తరించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయిల్పామ్ పంటపై రైతులకు అవగాహన కల్పించి సకాలంలో ప్లాంటేషన్ పూర్తి చేయించాలన్నారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సునీత, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కంది(సంగారెడ్డి): కంది మండలం ఎద్దు మైలారం గ్రామాన్ని గురువారం తమిళనాడు అధికారులు, ప్రజా ప్రతినిధుల బృందం సందర్శించింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో పొందుతున్న శిక్షణలో భాగంగా ఎద్దు మైలారం గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ద్వారా జారీ చేసే మరణ, జనన ధ్రువీకరణ పత్రాలు, ఇంటి టాక్స్ పత్రాల జారీ ప్రక్రియను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త శుద్ధీకరణ, క్రీడా ప్రాంగణం, డంప్ యార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ అనిత, ఎంపీఓ మహేందర్రెడ్డి, ఎంసీహెచ్ఆర్డీ ప్రోగ్రాం అధికారి అనిల్ కుమార్, ఆరోగ్య ఉపకేంద్రం డాక్టర్ రెజీనా, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్తోపాటు తమిళనాడుకు చెందిన జెడ్పీ చైర్మన్లు, సీఈఓలు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
రూ.కోటి నష్టపరిహారం ఇవ్వండి
రామచంద్రాపురం(పటాన్చెరు): సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన, ఆచూకీలేని కార్మిక కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని గురువారం తెల్లాపూర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ను బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్గౌడ్లు కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలో జరిగిన ప్రమాద వివరాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నాయకులకు వివరించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఆదర్శ్రెడ్డి మాట్లాడుతూ మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
వన మహోత్సవంతో పచ్చదనం
జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య రాయికోడ్(అందోల్): వన మహోత్సవ కార్యక్రమంతో గ్రామాల్లో పచ్చదనం మరింత పెరుగుతుందని గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ జి.అంజయ్య పేర్కొన్నారు. రాయికోడ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల ప్రత్యేక అధికారి జగదీశ్ తదితరులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మొక్కలను పెంచడం ప్రతీ ఒక్కరు అలవాటుగా మార్చుకోవాలని కోరారు. మండలంలోని పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులపై ఎంఈఓ మాణయ్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును పర్యవేక్షించి విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. -
మహిళా శక్తి సంబరాలు
సంగారెడ్డిటౌన్: గ్రామీణ ప్రాంతంలోని మహిళలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులోభాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో వివిధ రకాల పథకాల రూపంలో రుణాలను అందజేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సీ్త్ర నిధి రుణాలను అందజేస్తున్నారు. గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా స్థిరపడేలా మహిళా సంఘం సభ్యులకు ప్రభుత్వం రాయితీ రూపంలో రుణాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. గతేడాది రూ.911 కోట్ల రుణాలను అందజేశారు. మహిళా సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో అభివృద్ధి పనులను చేపడుతుంది. ఇందులోభాగంగా మండల, గ్రామస్థాయిలలో సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 18 వరకు నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు, పెట్రోల్ పంపుల నిర్వహణ, చేపల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, పాలడైరీ, పిండిగిర్నీలు ఏర్పాట్లకు ప్రోత్సహిస్తూ మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 25 మండలాలలో 695 గ్రామ సంఘాలు ఉండగా అందులో 18,448 సంఘాలు వున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,94,013 మహిళ సంఘం సభ్యులు ఉన్నారు. ఆన్లైన్ పద్ధతిలో నెలనెలా వాయిదాల రూపంలో డబ్బులు చెల్లిస్తూ వివిధ రకాలుగా లబ్ధి పొందుతున్నారు. మహిళా సంఘాలలో కొత్తగా ఇవి... ● ఈ ఏడాది నుంచి దివ్యాంగ మహిళలకు గ్రామాలలో ఐదుమందికి కలిసి ఒక గ్రూపును ఏర్పాటు చేస్తున్నారు. ● 14 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన యువతులకు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ● 18 నుంచి 60 ఏళ్లున్న మహిళలకు సంఘంలో లేని వారికి సభ్యత్వాలు కలిగించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ● 60 ఏళ్లు పైబడిన వారికి కొత్తగా గ్రూప్ను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహమవుతున్నారు. ● నిరక్షరాస్య మహిళలను గుర్తించి ప్రత్యేకంగా చదివించేందుకు మహిళా సంఘంలోని సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ● మండలానికి ఒకటి చొప్పున ఆర్టీసీ బస్సులను త్వరలోనే అందజేయనున్నారు. ● అమ్మ ఆదర్శ పాఠశాలలో మహిళా సంఘాల సభ్యుల ద్వారా పాఠశాలను అభివృద్ధి చెందేలా కృషి చేశారు. ● గృహ నిర్మాణాలకు కావలసిన ఇటుకలను, కార్ డ్రైవింగ్ శిక్షణను అందించి మహిళల కోసం మరింత ఉపాధి కల్పిస్తున్నారు. ● జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా సమైక్యాలు మరింత కృషి చేస్తున్నాయి. ● 2025–26 గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.930 కోట్ల రుణాలను లక్ష్యంగా ఇచ్చింది. ● మహిళలకు రుణాలు అందిస్తూ వారు సకాలంలో చెల్లించుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు. ● గ్రామ, మండల సమైక్య సంఘాల ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాలో మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తున్నారు. చిరు వ్యాపారం సాగిస్తున్నా మహిళా సంఘంలో రుణాన్ని తీసుకుని పాపడ్ల మెషీన్ను కొనుగోలు చేశాను. వాటిని తయారు చేస్తూ అమ్ముకుంటూ మంచి వ్యాపారాన్ని సాగిస్తున్నాను. వ్యాపారంలో లాభాలు పొందుతున్నాను. –అంబిక, ఇస్మాయిల్ ఖాన్ పేట్ గ్రామం, సంగారెడ్డి మండలంకుట్టు మెషీన్ నడిపిస్తున్నా సంఘం ద్వారా బ్యాంకులో రుణం తీసుకుని బట్టలు కుట్టడంతోపాటు మహిళలకు టైలరింగ్ శిక్షణనిచ్చి ఆదాయాన్ని పొందుతున్నాను. నాతోపాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నా. –సంతోషి, గుమ్మడిదల మండలంవ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం జిల్లాలోని మహిళా సంఘం సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలను అందిస్తున్నాం. –జ్యోతి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిపురుషులతో సమానంగా వేతనాలు పురుషులతో సమానంగా పనిచేస్తూ వేతనాలను తీసుకుంటున్నాం. మహిళా సంఘం ద్వారా జిల్లా కేంద్రంలోని సంగారెడ్డిలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. 16 మంది మహిళలం ఉపాధి పొందుతున్నాము. –సుకన్య, నలంద నగర్ సంగారెడ్డిఈనెల 18 వరకు వేడుకలు మహిళలకు రూ.930 కోట్ల రుణాల లక్ష్యం లబ్ధి పొందుతున్న మహిళా సంఘం సభ్యులు -
ఫైర్ సేఫ్టీకి పాతర
● అగ్ని ప్రమాదాల నివారణకు కనీస నిబంధనలు పాటించని సిగాచీ ● ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిశ్రమ ఆగడాలు ● రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన అగ్నిమాపకశాఖ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పదుల సంఖ్యలో అమాయక కార్మికుల ప్రాణాలను బలిగొన్న సిగాచీ పరిశ్రమ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలో కనీస భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యం..ఇటు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు సైతం పాతర వేసినట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో తేలింది. జూన్ 30న జరిగిన ఈ భారీ పేలుడు ఘటనలో ఇప్పటికే 44 మంది మృతి చెందగా, ఎనిమిది మంది ఆచూకీలేకుండా పోయారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 52కు చేరింది. మరో 16 మంది ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీల ఆటోమెటిక్ స్పింక్లర్ సిస్టం ఉండాలి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఈ స్పింక్లర్లు తెరుచుకుని అగ్ని కీలలను ఆర్పే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ఈ పరిశ్రమలో ఈ సిస్టం లేదని ఆశాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ఆటోమెటిక్ డిటెక్టర్ సిస్టం కూడా అమర్చుకోవాలి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండకుండా తక్షణం స్పందించేలా ఈ సిస్టం పనిచేస్తుంది. కానీ, ఆటోమెటిక్ డిటెక్టర్ కూడా లేదు. ఫోమ్ఆధారిత అగ్ని నిరోధక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంచుకోవాల్సి ఉండగా, రూ.వందల కోట్ల లాభాలను ఆర్జిస్తున్న యాజమాన్యం ఈ అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేదు. మంటలార్పేందుకు నీళ్ల సంపు కూడా లేదు పరిశ్రమలోనైనా కనీసం లక్ష లీటర్లు సామర్థ్యంతో కూడిన నీళ్ల సంపు, దానికి కరెంట్, డీజిల్తో నడిచే మోటార్లు ఉండాలి. కనీసం ఈ చిన్న ఏర్పాట్లు కూడా చేయలేదంటే యాజమాన్య నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ● ఉత్పత్తి కొనసాగే ప్రొడక్షన్ బ్లాక్ పైనే అడ్మిన్ బ్లాకు ఉంది. ఈ బ్లాకుకు ఎమర్జెనీ డోర్లు ఎమ ర్జెనీ మెట్లు కూడా లేవు. బయటకు దారిచూపే సైన్బోర్డులు ఉండాలి. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుక్ను వారు ఈ ఎమర్జెన్సీ డోర్లు లేక పైప్లైన్లు పట్టుకుని కిందికి దూకినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ● ఫైర్ ఇంజన్ తిరిగేంత స్థలం ఫ్యాక్టరీ చుట్టూ ఉండాలి. కానీ ఈ ఫ్యాక్టరీకి ఆ స్థలం కూడా లేదు. రెండు వైపులా పబ్లిక్ రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇలా అగ్ని మాపకశాఖకు సంబంధించిన ఏ ఒక్క నిబంధనను కూడా పరిశ్రమ యాజమాన్యం పాటించలేదంటే నిరుపేద కార్మికులు, ఉద్యోగుల ప్రాణాల పట్ల ఆ యాజమాన్యానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జేఎఫ్సీఎం కోర్టులో విచారణసిగాచీ పరిశ్రమపై అగ్నిమాపకశాఖ కూడా తాజాగా కేసు నమోదు చేసింది. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్టు –1999 సెక్షన్ 31, 31ల కింద ఈ నెల 7న సంగారెడ్డి అగ్నిమాపకశాఖ అధికారులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జేఎఫ్సీఎం కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. అగ్నిమాపకశాఖకు సంబంధించి కనీస నిబంధనలు పాటించకుండా... నిర్లక్ష్యం చేసినందుకుగాను ఈ కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపకశాఖ అధికారు లు తెలిపారు. అన్ని శాఖల మాదిరిగానే అగ్నిమాపక శాఖ ప్రమాదం జరిగాక..అమాయక కార్మికుల ప్రాణాలు పోయాక చర్యలకు ఉపక్రమించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. -
పాండురంగ స్వామికి మంత్రి దామోదర పూజలు
సంగారెడ్డి: చౌటకూరు మండలంలోని వెంకటకృష్ణపూర్ గ్రామంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి ఆలయాన్ని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. దేవాలయంలో జరిగిన కల్యాణ మహోత్సవానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయంకు సమీపంలో ఉన్న పురాతన మెట్ల బావిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజనర్సింహ ఫౌండేషన్ చైర్పర్సన్ త్రిష మణికంఠ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. భారతినగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ పెన్సింగ్ ఏరియా, ఎల్ఐజీ, మ్యాక్సొసైటీ కాలనీలో రూ.కోటి26లక్షల నిధులతో చేపట్టిన ప్రహారీగోడ, భూగర్భడ్రైనేజీ పనులు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతినగర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వి.సింధురెడ్డి, ఉప కమిషనర్ సురేశ్, నాయకులు పరమేశ్, ఐలేష్ యాదవ్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. 12న గురుకులంలో నేరుగా ప్రవేశాలు జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలం కేంద్రంలోని గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ మొదటి సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల12న నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ పథకం సద్వినియోగం చేసుకోవాలి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సదాశివపేట(సంగారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకాన్ని నిరుపేదలు ఉపయోగించుకుని సొంతగూటిని ఏర్పాటు చేసుకోవాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పట్టణంలో 52 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను నిర్మలారెడ్డి బుధవారం అందజేశారు. అనంతరం 11,19,22 వార్డుల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సొంత స్థలం ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరవుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమ, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ కంది కృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ డివిజనల్ ఇంజనీర్ మాధవరెడ్డి, టీపీఓ భాస్కర్గౌడ్, మాజీ కౌన్సిలర్లు విశ్వనాథం, గుండురవి, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వివరాలతోనే పంట అమ్మకం
పంటల వివరాలు నమోదు చేయడం వల్ల మనం పండించిన పంటలను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. పంట వివరాలు నమోదు చేయకపోతే పంట అమ్ముకోవడనికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేయించుకోవాలి. –మధు (తాటిపల్లి) పంట వివరాలు నమోదు ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు ఏయే పంటలను సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర నమోదు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు చెప్పాం. న మోదు చేసిన పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. –శివప్రసాద్ (జిల్లా వ్యవసాయాధికారి) -
రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి
సంగారెడ్డి టౌన్ : రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని గుర్తింపుకార్డులు పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీ సూచించారు. సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రైతు కార్డు నమోదు అనేది రైతులందరికీ ముఖ్యమైనదని దీని ద్వారా ప్రభుత్వ పథకాలు, రాయితీలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని పూర్తి వివరాలను అందజేయాలన్నా రు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి మునిపల్లి(అందోల్): అండగా ఉంటాం ధైర్యంగా ఉండాలని రాజనర్సింహ్మ ఫౌండేషన్న్ చైర్మన్ శిలాపూర్ త్రిష మణికంఠ బాధిత కుటుంలబానికి భరోసా కల్పించారు. బుధవారం సంగారెడ్డిలో మంత్రి దామోదర క్యాంపు కార్యాలయంలో మండలంలోని పెద్దచల్మెడ గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య, కంకోల్ గ్రామానికి చెందిన రషిద్ కుతూరు పెళ్లికి రాజనర్సింహ్మ పౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. కంకోల్ గ్రామానికి చెందిన ఎండీ రషీద్ నాలుగేళ్ల క్రితం పాము కాటుతో మృతి చెందాడు. దీంతో రషిద్ కూతురు వివాహానికి ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దచల్మెడ గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య యాక్సిడెంట్లో మృతి చెందాడు. వారికి కూడా రాజనర్సింహ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. కార్మిక సంఘం ఎన్నికల్లోఇండిపెండెంట్ గెలుపుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ సమీపంలోని ముంగి ఇంజనీరింగ్ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గోవర్థన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఎంఎస్ అభ్యర్థిగా మల్లేశం, స్వతంత్ర అభ్యర్థిగా గోవర్ధన్లు పోటీ చేశారు. 63 ఓట్లు పోల్ అవ్వగా గోవర్థన్కు 47, మల్లేశంకు 15 ఓట్లు పడ్డాయి. 32 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి రాయికోడ్(అందోల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగేలా చూడాలని ఎంపీడీఓ ఎంఎం.షరీఫ్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండలంలోని హస్నాబాద్, సంగాపూర్ గ్రామాలను సందర్శించారు. జాతీయ ఉపాధిహామీ పనులను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 414 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 145 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 17 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో భాగంగా రూ.లక్ష బిల్లు చెల్లించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు. తహసీల్దార్గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ వట్పల్లి(అందోల్): వట్పల్లి మండల తహసీల్దార్గా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎం. శ్రీనివాస్ జీహెచ్ఎంసీ ఎలక్షన్ బ్రాంచికి బదిలీ అయ్యారు. ఇక్కడే డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న చంద్రశేఖర్కు తహసీల్దార్గా బాధ్యతలు అప్పగించారు. అనంతరం విధుల్లో చేరిన చంద్రశేఖర్ను రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ను సన్మానించి వీడ్కోలు పలికారు. సమస్యల పరిష్కారానికి కృషి జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలనీలను మున్సిపల్ కమిషనర్ దశరథ్ బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కొసాగుతున్న డిజిటల్ బోధన పద్ధతులను పర్యవేక్షించారు. కార్యలయ సిబ్బది, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక అమీన్పూర్ (పటాన్చెరు): కాలనీ ఫేజ్ 1లోని హ్యాపీ ఫెదర్స్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2023–2025 కాలపరిమితిని పూర్తి చేసుకున్న పాత కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ 2025–2027 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అజయ్ ఒరుగంటి, ఉపాధ్యక్షుడు శేఖర్ రెడ్డి జక్కిరెడ్డి, సాధారణ కార్యదర్శి శివ కృష్ణ రాంధి, సహాయ కార్యదర్శి , సందీప్ చింతల, ఖజానాదారు వంశీ మోరిశెట్టి, కార్యవర్గ సభ్యులు వెంకట్ రాంరెడ్డి బుషిరెడ్డి, శ్రీకాంత్ బయర్గోని, మురళీ కృష్ణ లింగంపల్లి, నాగేశ్వర్రావు సానబోయిన, సర్కార్ శ్రీనివాసులు చొక్కారి, వీరా రెడ్డి కొండేటిలను ఎన్నుకున్నారు. -
ఆయిల్పామ్ సాగుకు రాయితీ
రైతులతో కలెక్టర్ ప్రావీణ్యజహీరాబాద్: పంట మార్పిడిని ప్రోత్సహిస్తూ మూడు రెట్లు అధిక దిగుబడి కలిగించే బహు వార్షిక వాణిజ్య పంట అయిన ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం 90% రాయితీని కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. మండలంలోని గోవింద్పూర్ గ్రామంలోని రైతు నాగిశెట్టి రాథోడ్ వ్యవసాయ పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని మొక్కలు నాటారు. అంతకుముందు మండలంలోని హోతి(కె) గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ(కేజీబీవీ) మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించి క్లాస్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీతో పాటు మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తోందన్నారు. మొదటి నాలుగేళ్ల పాటు అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.4,200 ప్రోత్సహకం కింద అందిస్తుందన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఆయిల్పామ్ సాగును 3,750 ఎకరాలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఇప్పటికే జూన్ నెలలో 200 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తయిందని తెలిపారు. అంతకుముందు క్లాస్ రూమ్లను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందరికీ అందాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు నూతన శైలి బోధనా పద్ధతులు పాంటించాలని సూచించారు. ముఖ్యంగా గణిత శాస్త్రం, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల్లో పిల్లలకు ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్రెడ్డి, తహసీల్దార్ దశరథ్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సోమేశ్వరరావు, మండల అధికారి పండరీ, గోద్రేజ్ సంస్థ ప్రతినిధులు కొండలరావు, వెంకటేశ్వర్లు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్పటాన్చెరు టౌన్: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సీఎం సహాయనిధి ఆపత్కాలంలో అండగా నిలిచి ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. సుమారు రూ. వెయ్యి కోట్లకుపైగా నిధులను సీఎంఆర్ఎఫ్ కోసం వెచ్చించిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: మండలంలోని డోవూరుకు చెందిన బస్లంగొండకు రూ.60 వేలు, కంగ్టి మండలం ఘన్పూర్కు చెందిన సావిత్రికి రూ.16,500 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరయ్యాయి. బుధవారం ఈ చెక్కులను ఖేడ్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి లబ్ధిదారుల కుటుంబీకులకు అందజేశారు. మనూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకాష్రావు, నాయకులు రాములు, రాజు పాల్గొన్నారు. -
గుమ్మడిదల రైతులకు అండగా ఉంటా
జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 109 భూ బాధితులు బుధవారం ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్రెడ్డితో కలిసి సమస్యను వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోతున్న రైతులు తగిన పరిహారం అందించేందుకు కృషి చేయాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి న్యాయపరమైన పరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మద్దుల బాల్రెడ్డి, దేవేందర్రెడ్డి, సత్యనారాయణ, వాసుదేవరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
స్మార్ట్ సిటీకి నిధులివ్వండి
● రూ.596.61 కోట్లు మంజూరుకు వినతి ● గతేడాది ఆగస్టులో జహీరాబాద్ స్మార్ట్ సిటీని ప్రకటించిన కేంద్రం ● ఇప్పటివరకు అడుగు ముందుకు పడని వైనం ● స్మార్ట్సిటీతో భారీగా విస్తరించనున్న పట్టణం జహీరాబాద్/సంగారెడ్డి జోన్: గతేడాది కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్ను స్మార్ట్ సిటీగా ప్రకటించింది. అయినా ఇప్పటివరకు నిధుల కేటాయింపు జరగలేదు. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ను కలిసి జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి, జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) ఆమోదించిన రూ. 596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని కోరా రు. స్మార్ట్సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ ఇతర వసతుల కల్పనకుగాను ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక ప్రాజెక్టు ఏర్పాటు వేగిరం! దేశవ్యాప్తంగా మొత్తం 12 ప్రపంచస్థాయి గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందని ఆశించినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. సీఎం చొరవతోనైనా నిధులు కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఏర్పాటు వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 3,200ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీ ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటు కాబోతున్న నిమ్జ్( జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి) పరిసర గ్రామాలు బర్దీపూర్, చీలపల్లి, చీలపల్లి తండా, ముంగి గ్రామ శివారులో స్మార్ట్ సిటీ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రాజెక్టు కోసం 3,200 ఎకరాల భూమిని కేటాయించి రూ.2,361 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయితే పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా జరగడంతోపాటు జహీరాబాద్ పట్టణం బాగా విస్తరించనుంది. రాష్ట్ర సరిహద్దులో ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో నిమ్జ్ ప్రాజెక్టుతోపాటు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు దోహదపడనుంది. హైదరాబాద్–నాగపూర్ కారిడార్ ప్రాజెక్టు హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ప్రాజెక్టు నెలకొల్పనున్నారు. ఇప్పటికే ముంబై జాతీయ రహదారి నుంచి నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం వరకు ప్రత్యేక రహదారిని పూర్తి చేశారు. భూసేకరణకు ప్రత్యేక చర్యలు నిమ్జ్లో భాగంగా భూములను సేకరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండు మండలాల్లో సుమారు 12 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. మొదటి విడతలో 3,600 ఎకరాలు సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండవ విడత ద్వారా ఇప్పటివరకు సుమారు 7000 ఎకరాల వరకు భూసేకరణ పూర్తి అయింది. మిగతా భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ను విడుదల చేయటంతోపాటు సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. జహీరాబాద్ టౌన్ వ్యూ‘నిమ్జ్’ భూసేకరణ వేగవంతంకలెక్టర్ ప్రావీణ్య జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటవుతున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్)కు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం జహీరాబాద్లోని ఆర్డీఓ కార్యాలయంలో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, ఆర్డీఓ రాంరెడ్డి, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిమ్జ్ ప్రాజెక్టు ఫేజ్–1కు అవసరమైన భూమిని సేకరించాల్సి ఉందని, దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఫేజ్–1లో మొత్తం 3,240 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 2,888 ఎకరాల భూమి మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన భూ సేకరణ ఇంకా పూర్తి కాలేదని, సంబంధిత గ్రామాల రైతులు, భూమి యజమానులతో చర్చించి సమస్యలు పరిష్కరించి భూ సేకరణను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూముల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. పెరగనున్న ఉపాధి అవకాశాలు స్మార్ట్ సిటీ ఏర్పాటుతో యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక్షంగా 1.74 లక్షల మందికి ఉ పాధి లభించే అవకాశం ఉండగా పరోక్షంగా మరో 1లక్ష మంది ఉపాధి పొందనున్నారు. యు వతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పా టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
ఎల్ఐసీ ఉద్యోగుల ధర్నా
జహీరాబాద్ టౌన్: ఎల్ఐసీ జహీరాబాద్ శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ పాలసీదారులు చెల్లిస్తున్న ప్రీమియంపై జీఎస్టీ రద్ద చేయాలని, క్లాస్ 3, 4 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు. -
నిధుల దుర్వియోగంపై నిలదీత
జహీరాబాద్: మండలంలోని గోవింద్పూర్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ప్రజలు అధికారులను నిలదీశారు. బుధవారం గ్రామంలో ఎంపీడీఓ మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సరస్వతీ, ఆయా శాఖల అధికారులు, గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన సమయంలో ఎంత మేర నిధులు ఉన్నాయి? పన్నుల రూపంలో, ఇతరత్రా వచ్చిన నిధులు ఎంత మేర వచ్చాయనే దానిపై వివరాలు అడిగారు. నిధులను దుర్వినియోగం చేశారని, చేయని పనులకు రికార్డులు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తక్షణమే తేల్చాలని పట్టుబట్టారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై ఎంపీడీఓ మహేందర్రెడ్డి మాట్లాడుతూ నిధుల దుర్వినియోగం జరగలేదని, వచ్ని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పనులు, నిధులకు సంబంధించిన లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో రూ.కోటి మేర నిధులు ఉండగా వివిధ పనులకు సంబంధించి రూ.50లక్షలు ఖర్చు చేశామని, మిగిలిన నిధులు పంచాయతీ ఖాతాలో ఉన్నట్లు వివరించారు. -
బందే మాతరం
●కదిలిన కార్మిక, కర్షక లోకం ●లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే తరిమికొడతాం ●కేంద్రం మెడలు వంచే వరకు పోరాటం ఆగదు ●సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు సంగారెడ్డిఎడ్యుకేషన్/జోగిపేట (అందోల్)/జహీరాబాద్టౌన్/జిన్నారం పటాన్చెరు: కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం కార్మిక, కర్షక లోకం కదం తొక్కింది. కార్మిక, కర్షక సంఘాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బంద్లో పాల్గొనడంతో సార్వత్రిక సమ్మె జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో పలు పట్టణాల్లో వ్యాపార, వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో పారిశ్రామికవాడలోని పరిశ్రమలన్నింటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. జహీరాబాద్ పట్టణంలో కార్మికులు, సంఘాల నాయకులు శ్రామీక్భవన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆందోల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డు నుంచి పట్టణంలోని చౌరస్తావరకు భారీ ర్యాలీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు కార్మిక, కర్షక సంఘాలు భారీ ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు మాట్లాడుతూ...నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామన్నారు. కార్మికవర్గం పొట్టగొట్టే విధంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావాలనుకోవడం ప్రధానిమోదీ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కును కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కార్మికులు యూనియన్ పెట్టుకోకుండా జీతభత్యాల కోసం, సదుపాయాల కోసం బేరసారాలు ఆడకుండా చేయడం అంటే అది పెట్టుబడుదారుల లాభాలను కాపాడటం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. లేబర్ కోడ్ల రద్దు కోసం సమ్మె చేస్తుంటే ఆర్ఎస్ఎస్, బీఎంఎస్ లాంటి సంస్థలు కార్మిక సంఘాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సమరశీల పోరాటాల ద్వారానే ఈ నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయించుకోగలమని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు బాగారెడ్డి యాదగిరి, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్, నాయకులు నర్సింహులు, ఎంఆర్ఎఫ్ కేపీఎస్ నాయకులు నారాయణ, సీఐటీయూ నాయకులు నాగభూషణం, ప్రసన్న, సురేశ్ రాందాస్, కొండల్ రెడ్డి, రమేశ్, భీమ్రెడ్డి, సువర్ణ, రాజు, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వస్తున్న కార్మిక సంఘాల నాయకులు -
రైతు వేదికల్లో సాగు చైతన్యం
● రైతులకు సలహాలు,సూచనలిస్తున్న ఏఈఓలు ● జిల్లాలో 116 రైతు వేదికలు ● 28 మంది ఏఓలు ● 116 మంది ఏఈఓలు మునిపల్లి(అందోల్): ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు వేదికలు అన్నదాతకు అండగా నిలబడుతున్నాయి. రైతు వేదికల ద్వారా రైతులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఏఈఓల ద్వారా వివిధ రకాల పంటల సాగులో అన్నదాతలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ సలహాలు, సూచనలిస్తూ మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అలాగే రైతులందరినీ ఒకే చోట చేర్చి వారికి పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఈ రైతు వేదికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 116 రైతు వేదికలున్నాయి. 28 మంది మండల (ఏఓలు) వ్యవసాయాధికారులతోపాటు 116 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు (ఏఈఓలు)లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతు వేదికలతో ఇవీ ప్రయోజనాలు... జిల్లాలో నిర్మించిన రైతు వేదికలతో రైతులకు పలు రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. ● ప్రతి క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలిస్తున్నారు. ● రైతు వేదికల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ● పంటలకు తెగుళ్లు సోకినప్పుడు క్లస్టర్ పరిధిలోని ఏఈఓలు పంటలను నేరుగా సందర్శించి వాటి నివారణకు సూచనలు చేస్తున్నారు. ● రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పిస్తున్నారు. ● పంటలకు తెగుళ్లు సోకినప్పుడు గతంలో రైతులు ఇష్టం వచ్చిన మందులు పిచికారీ చేసేవారు. దీంతో తెగుళ్లు తగ్గకపోగా రైతులు ఆర్థికంగా నష్టపోయేవారు. కానీ, రైతు వేదికలు వచ్చిన తర్వాత పంటలకు ఏ తెగులు సోకింది? దాని నివారణకు ఏ మందులు వాడాలో ఏఓలు, ఏఈఓలు చెబుతున్నారు. -
పక్కాగా సాగు లెక్క!
పంట ఎకరాలు సోయాబీన్ 46,689 కంది 44,755 చెరుకు 8,973 పెసర 8,354 మొక్కజొన్న 8,459 మినుము 4,820 జనుము 5,006 జీలుగు 19,525 ● జిల్లాలో పత్తి 3,16,171 ఎకరాలు ● గ్రామాల వారీగా పంట నమోదు ● ప్రతీ పంట ఆన్లైన్లో అప్లోడ్మునిపల్లి(అందోల్): రైతులు ఖరీఫ్ సీజన్లో ఏ పంట ఎంత సాగు చేస్తున్నారనే వివరాలను సంబంధిత జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2025 జూలై 6 వరకు ఆయా గ్రామాల్లో పంటల సాగుకు సంబంఽధించి వివరాలను సంబంధిత అధికారుల లెక్కల ప్రకారం. వివరాల నమోదు ● గ్రామాల వారీగా రైతులు ఏ పంట ఎన్ని రకాలలో సాగు చేస్తున్నారు? రైతుల భూములకు సంబంధించి ఏ సర్వే నంబర్లో? ఎన్ని ఎకరాలలో ఏ పంట వేశారనే వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర తప్పని సరిగా నమోదు చేయించాలి. ● పండించిన పంటను అమ్ముకోవడనికి సౌకర్యంగా ఉండేందు కోసం ప్రతీ పంటను ఆన్లైన్లో అప్లోడ్ చేసే కార్యక్రమంను వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. ● జిల్లాలో ఎక్కువగా రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. మొదటి స్థానంలో పత్తి, రెండవ స్థానంలో సోయాబీన్ మూడవ స్థానంలో కంది సాగు చేస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తి పంటకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఎక్కువగా పత్తి పంట సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. 4,29,965 ఎకరాలలో ఖరీఫ్ పంట సాగు చేసినట్లు సంబంధిత అధికారుల లెక్కలు చెబుతున్నాయి. (రబీ) మిగతా పంట సాగు కోసం 2,92, 955 ఎకరాలున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. -
కార్మికుల మృతదేహాల గుర్తింపు పూర్తికాలేదు
●కలెక్టర్ ప్రావీణ్య వెల్లడి ●త్వరలో ప్రభుత్వానికి నివేదికఈ మరణాల ధ్రువీకరణకు అనుమతిపటాన్చెరు: సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన 8 మంది కార్మికుల మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 44 మంది మృతిచెందినట్లు నిర్ధారించామని, మృతదేహాలను, అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించి, వారివారి స్వగ్రామాలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేసి పంపించామని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 14 మంది వివిధ ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎనిమిదిమంది మృతదేహాలు గుర్తించాల్సి ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇప్పటివరకు మృతులకు సంబంధించి 70 మానవ శరీర అవశేషాలు, డీఎన్ఏ పరీక్షకు పంపించినట్లు తెలిపారు. పంపిన శాంపిల్స్లో ఇప్పటివరకు 67 శాంపిల్స్ నిర్ధారణ, ముందు గుర్తించి మృతుల గుర్తులతో సరిపోలుతున్నాయన్నారు. మిగిలిన 8 మంది మృతులకు సరిపోయే ఆధారాలు ఇంకా దొరకలేదన్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన అవశేషాలతో వీరి డీఎన్ఏ నమూనాలు ఏవీ సరిపోలలేదని చెప్పారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వీరి కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. వీరి ఆచూకీ లభ్యం కాని పక్షంలో మృతులుగా పరిగణిస్తామని వెల్లడించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఆచూకీ లేని ఎనిమిదిమంది గురించి ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సదరు కుటుంబ సభ్యులకు తెలిపామన్నారు. ఆచూకీ దొరకని వారి బాధిత కుటుంబాలకు తాత్కాలిక పరిహారం కింద, వారు స్వస్థలానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు కంపెనీ తరఫున రూ.15లక్షలు అందజేసినట్లు చెప్పారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సాధారణంగా ఎవరైనా కనిపించకుండాపోతే ఎఫ్ఐఆర్ అయ్యాక ఏడు సంవత్సరాల తర్వాత మరణించినట్లు ధ్రువీకరణ ఉంటుందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆచూకీ లేకుండా పోయిన వారికి డెత్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ప్రత్యేకంగా లీగల్ ప్రాసెస్ ఉంటుందన్నారు. కానీ, ఈ దుర్ఘటన విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మరణ ధ్రువీకరణ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పారు. బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుపై హామీనిస్తూనే వారికి భరోసా ఇచ్చేందుకు రూ.15 లక్షల చెక్కును తక్షణ సాయం కింద పంపిణీ చేశాము. ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉంటాం. బాధిత కుటుంబాల కోసం ఐలా కార్యాలయంలో శిబిరాన్ని కొనసాగిస్తాము. బాధితులు ఈ చెక్కును తీసుకుని తమ వారి ఆచూకీ దొరికే వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయిస్తే వారి కోసం ఈ శిబిరాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ -
కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోరేం?
రామచంద్రాపురం(పటాన్చెరు): ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని తెల్లాపూర్ మున్సిపల్ వాసులు ఆవేదన చెందుతున్నారు. మున్సిపల్ పరిధిలో రెండు నెలల క్రితం వందలాది మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ రుసుమును కూడా చెల్లించేశారు. అయితే అధికారులు తమను మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ పని మాత్రం చేయడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. తమ దరఖాస్తు విషయాన్ని ఏమైందని అడిగితే అస్సలు సమాధానం చెప్పకపోగా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కొందరికి మాత్రం అధికారులు ఆగమేఘాలపై పనిపూర్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి కొంతమంది ఇప్పటివరకు అధికారులు చేసిన ఎల్ఆర్ఎస్లపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలువురు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ఆవేదన నా దృష్టికి రాలేదు మున్సిపల్ కార్యాలయంకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్న విషయం ఎవరు నాదృష్టికి తీసుకురాలేదు. ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. – అజయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తెల్లాపూర్ -
ఫోన్ కొనివ్వలేదని అలిగి...
చేగుంట(తూప్రాన్): ఫోన్ కొనివ్వలేదని అలిగిన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం ప్రకారం.. చేగుంటకు చెందిన షేక్ ఆసిఫ్ (16) తనకు ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. వారు నిరాకరించడంతో అలిగిన ఆసిఫ్.. ఈనెల 4న ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి షాదుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్టుచేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ వి.నవీన్ తెలిపాడు. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి శివారు కటికె బండ వద్ద ఓ యువకుడు గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్, చేర్యాల పోలీసులు దాడి చేసి సోహెల్ పాషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 115 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. విచారించగా హైదరాబాద్ దూల్పేటలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపాడు. మందుబాబులకు జరిమాన సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా, పాత బస్టాంట్ వద్ద, బైపాస్లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వ హించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వారిని మంగళవారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీకి రూ. రెండు వేలు, ముగ్గురికి రూ.1500, మిగ తా ముగ్గురికి రూ.1000, చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో మూడు గేదెల మృత్యువాతపటాన్చెరు టౌన్: పటాన్చెరు మండలం రుద్రారంలోని పెద్ద చెరువులో మంగళవారం విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన గేదెలు మృతి చెందాయని, రూ. 4లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు మహేశ్ కోరాడు. చెరువులో విద్యుత్ స్తంభాలు ఉండటమే తరచూ గేదెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రూ.87.94 లక్షల వడ్డీలేని రుణాలు ఐకేపీ ఏపీఎం రుక్ష్మిణి తూప్రాన్: మండల మహిళా సమైఖ్యకు ప్రభుత్వం రూ.87.94 వడ్డీలేని రుణాలను మంజూరు చేసిందని ఐకేపీ ఏపీఎం రుక్ష్మిణి పేర్కొన్నారు. మంగళవారం మహిళా శక్తి సంబురాలు కార్యక్రమం నిర్వ హించారు. ఈ సంబురాలు గ్రామాల వారీగా ఈనె ల 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో మహిళ సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. -
డీఎస్ఆర్ పద్ధతితో ప్రయోజనం
చిలప్చెడ్(నర్సాపూర్): డీఎస్ఆర్ పద్ధతిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి రాజశేఖర్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని చండూర్ గ్రామంలో పలువురు రైతులు సాగు చేస్తున్న డీఎస్ఆర్ పద్ధతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ రాజశేఖర్గౌడ్ మాట్లాడుతూ.. సంప్రదాయంగా నాటే వరి పద్ధతి కంటే డైరెక్ట్ సీడెడ్ రైస్తో నీటి వినియోగం చాలా వరకు తగ్గుతుందన్నారు. నారు వేసే పద్ధతి ఉండకపోవడంతో, కూలీల శ్రమ తగ్గుతుంది. పైగా తక్కువ కాలంలో పంట చేతికి వస్తుంది. రసాయన ఎరువుల వినియోగం తక్కువగా ఉండడంతో నేల సారవంతమవుతుంది. ఈ పద్ధతి వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉంటుంది. గ్రీన్హౌస్ వాయువులను తగ్గించడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ కృష్ణవేణి, రైతు శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందాపూర్ గ్రామశివారులోని వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. వాటిలో నుంచి ఆయిల్, కాపర్ వైరు చోరీ చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం వ్యవసాయ పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు విషయం గమనించి ట్రాన్స్కో అధికారులకు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసిన విషయం తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. వ్యవసాయాధికారి రాజశేఖర్గౌడ్ -
అథ్లెటిక్స్లో విద్యార్థినికి 6 గోల్డ్ మెడల్స్
కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎర్రోళ్ల ప్రణీత అథ్లెటిక్స్ పోటీల్లో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించారని ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జూన్ 4న, 29న జిల్లా స్థాయిలో నిర్వహించిన రన్నింగ్, బ్రాడ్ జంప్ పోటీలో నాలుగు గోల్డ్ మెడల్స్ను సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై ందన్నారు. హైదారాబాద్లోని జింఖాన గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 60 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ దక్కించుకుందన్నారు. ఈసందర్భంగా ప్రణీతను ఫిజికల్ డైరెక్టర్ ఉప్పలయ్యతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. -
పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్
హుస్నాబాద్రూరల్: దేవేంద్రనగర్లో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి పది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా దేవేంద్రనగర్లోని పశువుల పాకలో పేకాట అడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకోని వారి నుంచి రూ.43 వేల నగదు, 9 సెల్ ఫోన్స్, 9 బైక్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి గజ్వేల్రూరల్: పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామశివారులో చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులతో పాటు వారి వద్దనుంచి 9,700 నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ పోలీసులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు, ఫామ్హౌస్లు, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఎవరైనా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే టాస్క్ఫోర్స్ అధికారులకు (8712667445, 8712667446)కు సమాచారం అందించాలని సూచించారు.రూ.43 వేల నగదు, 9 సెల్ ఫోన్లు, 9 బైక్స్ స్వాధీనం -
నిరవధిక సమ్మెకు సిద్ధం
జహీరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి సమ్మెకు పోతున్నట్లు టీవీఏసీ–జేఏసీ ప్రకటించింది. సమ్మెకు శాశ్వత ఉద్యోగులు సైతం సహకరించాలని కోరింది. విద్యుత్ ఉత్పత్తి నుంచి బిల్లుల వసూళ్ల వరకు అంతా ఆర్టిజన్లే చేస్తున్నా.. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జహీరాబాద్, పటాన్చెరు, జోగిపేట, సంగారెడ్డి డివిజన్లు ఉండగా 568 మంది ఆర్టిజన్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ బోర్డులో ఉన్న నిబంధనలనే అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారని, అయినా అమలు చేయక పోవడం వల్లే సమ్మె బాట పట్టాల్సి వస్తోందంటున్నారు. విధి నిర్వహణలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నా.. పట్టించుకోవడం లేదని, ఆర్థిక ఇబ్బందులతో పలువురు ఆత్మహత్యలకు సైతం పాల్పడినా న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. బోర్డు విభజన సందర్భంగా ఇస్తామని చెప్పిన వాటినే తాము అడుగుతున్నామని పేర్కొంటున్నారు. ఏపీఎస్ఈబీ రూల్స్ను అమలు చేయాలని, ఆర్టిజన్లు మరణిస్తే వారి సంతానానికి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే సంస్థ అన్నప్పుడే ఒకే రూల్ ఉండాలని, ప్రస్తుతం పర్మినెంట్ వారికి ఒక విధానం, ఆర్టిజన్లకు ఒక చట్టం అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సీనియారిటీని బట్టి బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, ఇండస్ట్రీయల్ యాక్టు ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులను పర్మనెంట్ చేయడం ద్వారానే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం లభిస్తుందంటున్నారు. నిరవధిక సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆర్టిజన్లు జిల్లా వ్యాప్తంగా ఆవిష్కరిస్తున్నారు. గోడలపై వాటిని అంటించి మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు.పర్మినెంట్ కోసమే ఆందోళన తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలనే డిమాండ్తో ఆందోళనకు వెళుతున్నాం. కరెంటు ఉత్పత్తి మొదలుకొని బిల్లుల వసూళ్ల వరకు అన్నీ ఆర్టిజన్ కార్మికులే చేస్తున్నా న్యాయం జరగడం లేదు. వివక్షతకు గురవుతున్నాం. పర్మినెంట్ చేయడం ద్వారానే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం ఉంటుంది. బోర్డు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నాం. ఉద్యమానికి శాశ్వత ఉద్యోగులు కూడా సహకరించాలి. – ఆయిదాల జైపాల్, తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడువిద్యుత్ సంస్థలో వెట్టి చాకిరి చేయడానికే తాము పుట్టినట్లు ఉందని ఆర్టీజన్ కార్మికులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం సామగ్రి, బ్లేడ్స్ ఓపెన్ కాని ఎల్బీ స్విచ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ప్రమాదాలకు గురైన కార్మికులకు కాళ్లు, చేతులు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు కరెంటు స్తంభాలపైనే ప్రాణాలు వదులుతున్నారని, పిల్లలు అనాథలు అవుతున్నారని వాపోతున్నారు. ఇంత కష్టపడి పని చేస్తున్నా సంస్థలో తగిన గుర్తింపు లే కుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.14 నుంచి ఆర్టిజన్ కార్మికుల ఆందోళన బాట ఆర్టీజన్స్ కన్వర్షన్తోనే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరం జిల్లా వ్యాప్తంగా పోస్టర్ల ఆవిష్కరణ -
ఒంటరి మహిళలే టార్గెట్
మెదక్ మున్సిపాలిటీ: బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడిన దొంగతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బదనపురం పెంటయ్య అలియాస్ ప్రేమ్, తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన కుమ్మరి శివకుమార్, ఇదే మండలం వట్టూరుకు చెందిన పాంబండ వరలక్ష్మిలతో కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. కల్లు దుకాణాల్లోకి ఒంటరిగా వచ్చే మహిళలను టార్గెట్ చేసుకున్నారు. వారికి మాయ మాటలు చెప్పి బాగా కల్లు తాగిస్తారు. మత్తులోకి జారుకోగానే వాళ్ల దగ్గర ఉన్న బంగారం నగలు, వెండి కాళ్ల కడియాలను దోచుకొని వెళ్లేవారు.ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో హవేళిఘణాపూర్ మండలం కూచన్పల్లికి చెందిన ఎరుకల ఎల్లవ్వ మెదక్ పట్టణంలోని ఒకటవ నంబర్ కల్లు దుకాణంలోకి వచ్చింది. ఆమె వద్ద ఉన్న బంగారం నగలు, కాళ్ల కడియాలపై వీరి దృష్టి పడింది. ఆమెకు బాగా కల్లు తాగించి మత్తులోకి జారుకోగానే తులం బంగారు గుండ్లు, 1.5 తులాల బంగారు కమ్మలు, 60 తులాల వెండి కడియాలను దోచుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా కుమ్మరి శివకుమార్ అదుపులోకి విచారించగా.. ఈ కేసులో వరలక్ష్మి, పెంటయ్యల ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితులపై నర్సాపూర్, గజ్వేల్, మనోహరబాద్లలో కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించామన్నారు. కేసును ఛేదించిన మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేశ్, పోలీసు బృందం అమర్, నర్సింలు, నిఖిల్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్ వ్యసనంతో చోరీలు ముగ్గురు దొంగల రిమాండ్ రూ.6లక్షల విలువైన సొత్తు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు -
టమాటా.. రైతులకు ఊరట
పెరుగుతున్న ధరలుగిట్టుబాటు అవుతున్న ధరలు కొన్ని రోజుల నుంచి టమాట ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో నాటిన తోటల నుంచి కోతలు వస్తున్నాయి. ప్రస్తుతం సగం కోతలు పూర్తి చేశారు. అయితే దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. ధర మాత్రం ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం బాక్స్ ధర రూ. 400 నుంచి రూ. 500 పలుకుతుంది. వారంతపు సంతలో టమాట కిలో రూ.40 నుంచి 50 అమ్ముతున్నారు. దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు ధరలు లేక నష్టపోయామని, అరకొరగా పంట ఉన్నప్పుడు ధరలు పెరిగాయని కంబాలపల్లికి చెందిన రైతు శ్రీనివాస్ వాపోయారు. కొందరు మాత్రమే పెరిగినఽ ధరలు పొందుతారని ఆయన పేర్కొన్నారు. -
బర్త్ సర్టిఫికెట్ జాప్యం చేస్తున్నారని..
జహీరాబాద్ టౌన్: తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఓ వ్యక్తి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట హల్చల్ చేశాడు. మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన బోయిని శేఖర్(35) తన కుమారుడు రాము బర్త్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్ జారీ చేయడం లేదని కోపంతో మద్యం తాగి పెట్రోల్ సీసాతో జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఎందుకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడంలేదంటూ అధికారులను నిలదీశాడు. కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్నవారు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్టేషన్కు తీసుకెళ్లారు. సర్టిఫికెట్ జారీ చేశాం శేఖర్ కుమారుడి బర్త్ సర్టిఫికెట్ పెండింగ్లో లేదని తహసీల్దార్ దశరథ్ పేర్కొన్నారు. సర్టి ఫికెట్ ఎప్పుడో జారీ చేశామని, మీ సేవలో ప్రింట్ తీసుకోవాల్సి ఉందన్నా రు. మీ సేవకు వెళ్లకుండా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడని ఆయన పేర్కొన్నారు.హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుజహీరాబాద్ టౌన్: నెల రోజుల వరకు టమాట పంట రైతులను ఆందోళనకు గురిచేసింది. బోరు బావులు, స్థానిక నీటి వనరులను వినియోగించుకొని సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోయారు. టమాట తెంపిన కూలీలు, మార్కెట్కు తరలించేందుకు రవాణా చార్జీలకే సరిపోయింది. కమీషన్ ఏజెంట్ల వద్ద 25 కిలోల బాక్స్ రూ.100కు అమ్మాల్సి వచ్చింది. సంతలో కిలో రూ.10కు అమ్ముకున్నారు. కొన్ని రోజుల నుంచి టమాట ధరలు పెరుగుతుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆదుకుంటుందని యాసంగిలో సాగు చేసిన టమాట పంట వల్ల రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. పంట దిగుబడి పెరగడంతో కొనేవారు కరువయ్యారు. వేల రూపాయల పెట్టిన పెట్టుబడి దక్కలేదు. జిల్లాలో సుమారు 537 ఎకరాల్లో టమాట పంట సాగవగ పడిపోయిన ధరల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. జహీరాబాద్ మార్కెట్కు లోకల్ టమాటతో పాటు మహారాష్ట్ర నుంచి టమాట వస్తుంది. డిమాండ్ కన్నా దాదాపు రెట్టింపు రావడం వల్ల ధరలు పడిపోవడానికి కారణమవుతోంది. ఒక్కసారిగా పంట చేతికి రావడంతో ధరలు పతనమయ్యాయి. కూలీలు, రవాణా చార్జీలు మీదపడుతున్నాయని కొంత మంది రైతులు పంటను పొలంలోనే వదిలేశారు.బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో చోరీనర్సాపూర్: నర్సాపూర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో చోరీ జరిగిందని ఎస్ఐ లింగం చెప్పారు. ఆ సంస్థలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న పూర్ణచందర్రెడ్డి ఈనెల 5న ఆఫీసుకు తాళం వేసి వెళ్లాడని, 7న ఉదయం తిరిగి ఆఫీసుకు వచ్చే సరికి తాళం పగులగొట్టి ఉంది. కౌంటర్లో ఉన్న రూ, 1500 ఎత్తుకు వెళ్లారు. పూర్ణచందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం -
యువతి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన నర్సాపూర్ మండలం అచ్చంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు కూతురు సురేఖ (19) పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. సోమవారం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. చాకలి ఆంజనేయులు అతని భార్య పోచమ్మ, ఇద్దరు కుమారులు సురేఖను ఇంటి వద్ద ఉంచి 7వ తేదీ సోమవారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సురేఖ ఇంటివద్ద లేదు. చుట్టుపక్కలతో పాటు బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించ లేదు. ఇంట్లో ఉన్న రూ 15 వేలు తీసుకెళ్లినట్లు తెలిపారు. తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జేబు దొంగకు దేహశుద్ధి నర్సాపూర్ రూరల్: జేబు దొంగను మహిళలు పట్టుకొని చితకబాదారు. ఈ సంఘటన నర్సాపూర్ బస్టాండ్లో మంగళవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ బస్టాండ్లో ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లతో కలసి హైదరాబాద్కు వెళ్లే బస్సు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో జేబులో ఉన్న డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్న దుండగుడిని మహిళలు చూసి పట్టుకొని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు అతను తప్పించుకొని పారిపోయాడు. తరచూ బస్టాండ్లో జేబుదొంగలు, డబ్బులతో పాటు బంగారు నగలు, సెల్ఫోన్లను అపహరిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. -
790 లైబ్రరీ పోస్టుల భర్తీ
నారాయణఖేడ్: రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న 790 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.రియాజ్ అహ్మద్ తెలిపారు. ఖేడ్ శాఖ గ్రంథాలయానికి రూ.60లక్షలతో విస్తరణ పనులకు ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత 25 ఏళ్లుగా గ్రంథాలయాల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తూ ఇప్పటికే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. కంగ్టిలో గ్రంథాలయ భవనం కోసం రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. జహీరాబాద్లో గ్రంథాలయానికి రూ.54 లక్షలు మంజూరుచేసి దానికి కేటాయించిన స్థలంలో గత ప్రభుత్వం ఆసుపత్రిని నిర్మించిందన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. ప్రతీ ఒక్కరూ రోజూ దినపత్రికలను చదవాలని, సైన్స్ను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. గ్రంథాలయంలో పుస్తకాల కోసం తనకోటాకు సంబంధించి రూ.5లక్షలు మంజూరు చేస్తానన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ..త్వరలో నిర్వహించనున్న ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నీట్ కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. నియోజకవర్గంలోని 15 పెద్దగ్రామాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ అంజయ్య, కార్యదర్శి వసుంధర, ఆర్డీఓ అశోకచక్రవర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, నాయకులు రమేశ్ చౌహాన్, వినోద్పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్ హామీ -
మండల పరిషత్ పునర్వ్యవస్థీకరణ
నారాయణఖేడ్: స్థానిక సమరానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ఆదేశాలు రావడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మండల ప్రజాపరిషత్తుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టారు. మండల ప్రాదేశిక స్థానాలు (ఎంపీటీసీ)ల ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఇదివరకే ఆదేశించారు. మండల ప్రజాపరిషత్తుల పునర్వ్యవస్థీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీలు.. ప్రతీ మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ(మండల ప్రాదేశిక) స్థానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటైనా చాలా ఎంపీటీసీలు పాత మండలాల పరిధిల్లోనే ఉన్నాయి. ఎంపీటీసీలు కూడా పాత మండలాల వారీగానే ఉన్నారు. జిల్లాలో పలు కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు పట్టణ కేంద్రాల సమీపంలోని ఆయా గ్రామాలు మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో మండలాల్లోని ఎంపీటీసీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పూనుకుంది. మండలాన్ని ప్రాతిపదికన తీసుకుని ఎంపీటీసీల సంఖ్యను కొత్తగా నిర్ణయించనుంది. రెండు తగ్గి.. రెండు జత కూడి.. జిల్లాలో 28 మండలాలుగా 26 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇటీవల అమీన్పూర్, జిన్నారం మండలాలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. దీంతో ఈ జిల్లా ప్రాదేశిక స్థానాలు తొలగిపోయాయి. ఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్, ఆందోల్ నియోజకవర్గంలో చౌట్కూర్లు కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఎన్నికల్లో నిజాంపేట్, చౌట్కూర్లలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు కొలువు దీరనున్నారు. గత ఐదేళ్ల క్రితం జిల్లాలో ఖేడ్ నియోజకవర్గంలో నాగల్గిద్ద, సిర్గాపూర్, ఆందోల్లో వట్పల్లి, జహీరాబాద్లో మొగుడంపల్లిలు కొత్త మండలాలుగా ఏర్పాటయి వాటిల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎన్నికయ్యారు. ఈసారికూడా జిల్లా లో 26 ఎంపీపీలు, 26జెడ్పీటీసీ స్థానాలు ఉండనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 271 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వీటి సంఖ్య పునర్వ్యవస్థీకరణలో పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లలో తలమునకలు త్వరలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కొత్త మండలాల్లోనూ కొలువుదీరనున్న పాలకవర్గాలు -
సిగాఛీ.. నిబంధనల్ని కాలరాసి
సిగాచీ పరిశ్రమకు ఎన్డీఎంఏక్యాజువల్ లేబర్తో పనులు చేయించింది● ఈ లేబర్ను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు కనీసం లేబర్ లైసెన్సే లేదు ● ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్న సిగాచీ పరిశ్రమ యాజమాన్యం ఆగడాలు ● మొక్కుబడి తనిఖీలకే పరిమితమైన కార్మికశాఖ అధికారులు ● ప్రమాదం జరిగాక నోటీసులు జారీ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా 44 మంది నిరుపేద కార్మికుల ప్రాణాలను బలిగొన్న సిగాచీ పరిశ్రమ యాజమాన్యం.. ఇటు కార్మిక చట్టాలను కూడా కాలరాసింది. రియాక్టర్లు, బాయిలర్లు.. వంటి కీలక యంత్రాల వద్ద సంబంధిత రంగాల్లో అన్ని అర్హతలున్న స్కిల్డ్ వర్కర్లతో పనిచేయించాల్సిన యాజమాన్యం అడ్డా కూలీ (క్యాజువల్ లేబర్)తో పరిశ్రమల్లో పనిచేయించినట్లు తేలింది. పైగా ఈ పరిశ్రమకు ఈ అడ్డాకూలీలను ఇద్దరు లేబర్ కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. అయితే ఈ కాంట్రాక్టర్లు ఇద్దరికీ కూడా కార్మిక శాఖ నుంచి కనీసం లైసెన్స్లు లేవని తేలింది. దీన్ని బట్టి చూస్తే అన్స్కిల్డ్ వర్కర్లతో కీలక యంత్రాల వద్ద పనులు చేయించడంతోపాటు, కనీస నిబంధనలు పాటించలేదనేది స్పష్టమవుతోంది. అన్ని అర్హతలున్న వారిని ఉద్యోగాల్లో నియమించుకుంటే అధికంగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందని కక్కుర్తి పడి అడ్డాకూలీలతో పనిచేయించినట్లు తేలింది. 85 మంది రోజువారీ కూలీలు, వర్కర్లే.. నిరుపేద కూలీల ప్రాణాలు గాలిలో కలిశాక కార్మిక శాఖ మేల్కొంది. పొట్టచేతపట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన అమాయక కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాక ఈ శాఖ అధికారులు మొద్దునిద్ర వీడారు. ప్రమాదం జరిగాక ప్రభుత్వానికి ఆశాఖ ఓ నివేదిక పంపింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 143 మంది కార్మికులు, ఉద్యోగులున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 85 మంది డెయిలీ వేజ్ లేబరే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 32 కంపెనీ ఉద్యోగులు ఉండగా, 26 మంది కాంట్రాక్టు వర్కర్లు ఉన్నట్లు గుర్తించారు. లైసెన్స్లేని కాంట్రాక్టర్ ద్వారా కూలీలు ఈ దుర్ఘటన జరిగిన నెలలో జూన్లో ఈ పరిశ్రమలో పని ఎక్కువగా ఉందని, ఇందుకోసం రోజువారీ కూలీలతో పనులు చేయించాలని పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం 20 మంది రోజు కూలీలను సరఫరా చేసేందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్, పది మంది కూలీలను సరఫరా చేసేందుకు మరో లేబర్ కాంట్రాక్టర్తో పరిశ్రమ యాజమాన్యం మాట్లాడుకున్నట్లు కార్మికశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్యాజువల్ లేబర్ను సరఫరా చేస్తున్న ఈ ఇద్దరు లేబర్ కాంట్రాక్టర్లకు కార్మిక శాఖ నుంచి ఎలాంటి లైసెన్స్ లేకపోవడం గమనార్హం. అంటే కనీసం లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్ ద్వారా కూడా రోజు వారీ కూలీలను పనిలో పెట్టుకోలేదంటే ఈ పరిశ్రమ యాజమాన్యం అలసత్వం ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కనీస సమాచారం లేదు ఈ ఫ్యాక్టరీని ఇటీవల నిజామాబాద్ జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో పనిచేస్తున్న విషయాన్ని యాదయ్య తాను ఆశాఖ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొనకపోవడం గమనార్హం. కేవలం కార్మికుల సంఖ్య, షిఫ్టులు, వంటి వివరాలు డిస్ప్లేబోర్డుపై పెట్టలేదని మాత్రమే నివేదికలో రాసానని యాదయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రమాద స్థలం అధ్యయనం పటాన్చెరు: ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా పరిశ్రమను మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఎంఏ) బృందం సందర్శించింది. ఈ బృందం సభ్యులు ప్రమాద స్థలాన్ని నిశితంగా పరిశీలించి అణువణువూ గాలించారు. ప్రమాద వివరాలను ఆ సమయంలో కొనసాగుతున్న ఉత్పత్తి తదితర అంశాలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఎంఏ కేంద్ర బృందం కమిటీ సభ్యులు, సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధ్యయనంతో పాటు పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో ఏ పరిశ్రమల లోనూ పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వ నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, పరిశ్రమల శాఖ, అగ్ని మాపకశాఖ, కార్మికశాఖ, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.10ఏ కింద నోటీసులు జారీ ఈ ప్రమాదం జరిగాక సిగాచీ పరిశ్రమ యాజమాన్యానికి సెక్షన్ 10–ఏ కింద నోటీసులు జారీ చేసినట్లు కార్మికశాఖ సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. యూ–1 ఫాంలో కార్మికులు, ఉద్యోగుల వివరాలివ్వాలని యాజమాన్యానికి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేఖ రాసింది. -
ఎన్యూమరేటర్లకు పారితోషికం చెల్లించాలి
నారాయణఖేడ్: గతేడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్లకు పారితోషికాన్ని చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్ జాదవ్ డిమాండ్ చేశారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా మంగళవారం ఖేడ్ మండలంలోని పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేచేసి 8 నెలలు గడుస్తున్నా పారితోషికాన్ని చెల్లించకపోవడం విచారకరమన్నారు. పీఆర్సీ రిపోర్టును తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల టైంటేబుల్ మార్చాలని, కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించి వారికి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. పాఠశాలల పర్యవేక్షణకోసం ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సంఘ ఖేడ్ మండల ప్రధానకార్యదర్శి శ్రీరామ్నాయక్, నాయకులు గంగామోహన్, మంగుబాయి, శోభారాణి, శంకర్రావు పాల్గొన్నారు. ప్రతి మహిళా కోటీశ్వరులు కావాలి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేశ్బాబు ఝరాసంగం(జహీరాబాద్): మహిళా సంఘాల్లోని ప్రతీ మహిళా కోటీశ్వరుల్ని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన ఝరాసంగం పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళా సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీయం టిక్యానాయక్, తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి నర్సాపూర్: బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పకడ్బందీగా పాటించాలని స్థానిక ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహిపాల్ సూచించారు. నర్సాపూర్లోని వైపర్ కాలేజీ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండలంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఎల్ఓలు తమకు కేటాయించిన బూత్ పరిధిలో కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, ఆర్ఐ ఫైజల్, ట్రైనర్లు లక్ష్మినారాయణ, ప్రసన్నకుమార్, శ్రీనివాస్యాదవ్, బీఎల్ఓలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మెదక్ జిల్లా జట్టు మెదక్ మున్సిపాలిటీ: ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మంచిర్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలకు జిల్లా జట్టు సభ్యుడు మంగళవారం మెదక్ నుంచి తరలివెళ్లారు. మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ జట్టుకు కోచ్గా జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి పి.భాగ్యమ్మను నియమితులయ్యారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కంది (సంగారెడ్డి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింలు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం మంగళవారం కందిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కార్పొరేట్లకు ప్రభుత్వాలు లాభం చేకూర్చుతున్నాయని ఆరోపించారు. రైతులు సాగు చేసిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని మండిపడ్డారు. 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు ,కర్షకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుజాత,నర్సింలు,ఆనంద్,షబానా,కాశమ్మ, మంజుల,సునంద,జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
జీపీఓలుగా మరో చాన్స్
సంగారెడ్డి జోన్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ)ని నియమించనుంది. అయితే అర్హత పరీక్షకు మరో అవకాశం కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గతంలో రెవెన్యూ వ్యవస్థ నుంచి ఇతర శాఖలకు కేటాయించిన పాత ఉద్యోగుల నుంచి జీపీఓ నియామకానికి దరఖాస్తులు స్వీకరించింది. ఇంటర్మీడియెట్, డిగ్రీతో పాటు రెవెన్యూ శాఖలో ఐదు సంవత్సరాలు పాటు పని చేసిన అనుభవం కలిగి ఉన్న వారికి అవకాశం కల్పించింది. గత ప్రభుత్వంలో జిల్లావ్యాప్తంగా 2022 ఆగస్టు 1న రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేస్తున్న సు మారు 700 మంది వీఆర్ఏలు, 250పైగా వీఆర్ఓలను 2023 ఆగస్టు 10న ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. 182 మంది ఉత్తీర్ణత జీపీఓ ఉద్యోగ నియామకానికి 250 మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, వారికి ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించారు. అందులో 182 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సమాచారం. వివిధ కారణాలతో పరీక్షకు హాజరుకాని వారికి మరోసారి అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాల నాయకులు ఇటీవల మంత్రిని కలిశారు. ఈమేరకు మరోసారి అర్హత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. త్వరలో ఉద్యోగులకు బాధ్యతలు! జిల్లాలో త్వరలో రెవెన్యూ శాఖలో జీపీఓలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అర్హత పరీక్ష రాసేందుకు మరోసారి అవకాశం కల్పించడంతో వీరితో పాటే ఉత్తీర్ణత పొందిన వారికి బాధ్యతలు అప్పగిస్తారా? లేదా ముందుగానే ఉత్తీర్ణత పొందిన వారికి అప్పగిస్తారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. హాజరు కాని వారికి మరోసారి అర్హత పరీక్ష రెవెన్యూ సంఘాల విజ్ఞప్తితో నిర్ణయం త్వరలో జారీ కానున్న అధికారిక ప్రకటన -
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
సంగారెడ్డి జోన్: ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురితో కలిసి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను అర్జీదారులకు వివరించాలన్నారు. ఇదిలాఉండగా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న తమకు గత నాలుగు నెలలుగా వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు కావటం లేదని ఉద్యోగులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వేతనాలు సమయానికి రాకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు చర్యలు తీసుకొని తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలు మంచి లాభాలు వచ్చే వ్యాపారాలు నిర్వహించి, ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందిస్తామన్నారు. అలా గే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదే శించారు. సమావేశంలో డీఆర్డీఏ జ్యోతి, అడిషనల్ డీఆర్డీఓ సూర్యరావు, జిల్లా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావిణ్య ప్రజావాణికి 46 వినతులు ఓపెన్ స్కూల్ వరం సంగారెడ్డి ఎడ్యుకేషన్: చదువు మద్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిదని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సోమవారం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానమన్నారు. ఈనెల 11 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని వెల్లడించారు. -
సింగూరు జలాలను విడుదల చేయాలి
బీకేఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి సంగారెడ్డి టౌన్: సింగూరు జలాలను వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట ఖర్చులు పెరగడంతో చెరకు పంటకు టన్నుకు రూ.500 చెల్లించాలని, జొన్నలు కొనుగోలు డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను తీర్చాలన్నారు. సమావేశంలో జిల్లా కోశాధికారి సదానంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి తదిరులు పాల్గొన్నారు. సీఐ విద్యాసాగర్కు సేవా పతకంసిద్దిపేటకమాన్: సిద్దిపేట త్రీ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ విద్యాసాగర్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 అతిఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికై నట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీఐని సోమవారం ఆమె అభినందించారు. ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీసు శాఖలో 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న విద్యాసాగర్ ఈ పథకావడం గర్వకారణమన్నారు. త్వరలోనే ఈ పతకం అందజేస్తామన్నారు. ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందిని గుర్తించి అవార్డులు, రివార్డులు, సేవా పతకాలు ఇస్తామన్నారు.తండ్రి మందలించారని.. తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యం హత్నూర( సంగారెడ్డి): తండ్రి మందలించడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన హత్నూర పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మంగాపూర్కు చెందిన గడ్డమీది వీరేశం, నిర్మల దంపతుల పెద్ద కుమారుడు అభిరాం దౌల్తాబాద్ లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఆలస్యంగా రావడంతో తండ్రి వీరేశం మందలించాడు. సోమవారం తెల్లవారుజామున అభిరాం ఇంట్లో నుంచి వెళ్లిపోయి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 83309 07363, 96528 87845, 97014 68493 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబీకులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో జింక హతంరామాయంపేట(మెదక్): దారి తప్పి అటవీప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన చుక్కల జింకను సోమవారం మండలంలోని లక్ష్మాపూర్ వద్ద కుక్కలు హతమార్చాయి. ఈ విషయమై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి ఖుద్బుద్దీన్ సంఘటనా స్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పశువైద్యుడు పోస్టుమార్టం నిర్వహించారు. -
ఈ పాపం ఎవరిది..?
పటాన్చెరు: సిగాచి పరిశ్రమలో అసలు ప్రమాదం ఎలా జరిగింది.. దానికి కారణాలేమిటి..? ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ సంగతేమిటి..?డ ఇలా పారిశ్రామికవాడలోని కార్మికులు, సంఘాల నేతలు ప్రమాదంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. పరిశ్రమలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ప్రమాదం జరిగిందని వారు భావిస్తున్నారు. ప్రధానంగా ఆ పరిశ్రమను స్థాపించిన నాటి పరిస్థితులే నేటికీ ఆ పరిశ్రమలో ఉన్నాయని నవీన సాంకేతిక పరిజ్ఙానాన్ని అనుసరించి పరిశ్రమను అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. బాయిలర్కు అనుసంధానమైన డ్రైయ్యర్కు నిబంధనల ప్రకారం ఉండాల్సిన దూరం లేదని చెబుతున్నారు. ఇంట్లో గ్యాస్ కుక్కర్కు ఉండే సేఫ్టీ నట్ లాంటి వ్యవస్థ డ్రైయ్యర్కు లేకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మొత్తం అయిదు చోట్ల ఎగ్జాస్ట్ హోల్స్ (ఆవిరి బయటకు వెళ్లే మార్గాలు) ఉండాలని, అలాంటి వ్యవస్థ లేని కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది వరకే ఓ కార్మికుడి కుటుంబీకుడు తన తండ్రి చెప్పినట్లు పాత సామగ్రి కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కనీసం ఫైర్ ఇంజన్ పరిశ్రమ చుట్టూరా తిరిగే విధంగా సెట్ బ్యాక్లు కూడా లేవు. అగ్నిమాపక శాఖ, విద్యుత్ అధికారులు, టీఎస్ఐఐసీ అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. పరిశ్రమలో ట్రాన్స్ఫార్మర్ను ప్రహరీగోడపై అమర్చి ఉండటాన్ని తప్పు పడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది ఉండే సెక్షన్ను డ్రయ్యర్ ఉన్న చోట పై అంతస్తులో ఉండటాన్ని కూడ తప్పు పడుతున్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలో ఉత్పత్తి చేస్తున్న పరిమాణానికి తగిన విధంగా ఏర్పాట్లు లేవని ఎప్పుడో 1989లో స్థాపించిన పద్దతిలోనే పరిశ్రమ ఇప్పటికీ పెద్ద మార్పులు లేకుండా కొనసాగుతుందని వివరించారు. అన్ని శాఖల వారి నిర్లక్ష్యం కారణంగానే ఆ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇతర యూనియన్ నేతలు మాట్లాడుతూ నిపుణులైన కార్మికులను కాకుండా అన్స్కిల్డ్ వర్కర్లను పని చేయించడం కారణంగా కూడా ప్రమాదానికి కారణమని విశ్లేషిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేందుకు హైలెవల్ కమిటీ, నిపుణుల కమిటీలు అధ్యయనం ఓ వైపు కొనసాగుతుండగా పారిశ్రామికవాడలో ప్రమాదానికి కారణాలపై చర్చించుకోవడం గమనార్హం. ‘సిగాచీ’ప్రమాదానికి కారణాలెన్నో.. అన్ని శాఖల నిర్లక్ష్యం కూడా.. నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేదు పారిశ్రామికవాడలో కార్మికుల చర్చోపచర్చలు -
చిచ్చురేపిన పచ్చగడ్డి●
వర్గల్(గజ్వేల్): పచ్చగడ్డి వేసిన పొలం చిచ్చురేపింది. భూ తగాదా వృద్ధుని ఉసురుతీసింది. వరుసకు కొడుకే హంతకుడయ్యాడు. పారతో దాడిచేసి హతమార్చాడు. రెండు రోజుల క్రితం (శనివారం) వర్గల్ మండలం వేలూరులో వృద్ధుడు రాయన్న నర్సయ్య హత్యకేసును గౌరారం పోలీసులు ఛేదించారు. సోమవారం నిందితుని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. గౌరారం సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ మహేందర్రెడ్డి ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. వేలూరు గ్రామానికి చెందిన రాయన్న నర్సయ్య(65), వరుసకు కొడుకై న చింతకింది రాజు(39) పొలాలు పక్కపక్కనే ఉంటాయి. వీరిద్దరి మధ్య భూతగాదాలు ఉన్నాయి. గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నర్సయ్య పొలం సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. రూరల్ సీఐ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ కరుణాకర్రెడ్డి, సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు, గొడవలు, భూవివాదాలు, పాత కక్షలు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపారు. హత్యకు పాల్పడిన వరుసకు కొడుకై న చింతకింది రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం సాయంత్రం వ్యవసాయపొలంలో పనిచేసుకుంటున్న రాజు వద్దకు నర్సయ్య వెళ్లి తన పొలంలో పచ్చగడ్డి ఎందుకు వేశావంటూ తిట్టాడు. కోపంతో రాజు తన చేతిలో ఉన్న పారతో మూడు, నాలుగుసార్లు మెడ, తలపై బాదడంతో నర్సయ్య చనిపోయాడు. ఈ మేరకు నిందితుడు రాజు నేరం అంగీకరించాడని, అతనిని అరెస్ట్చేసి సోమవారం రిమాండ్ చేశామని సీఐ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ఎస్ఐ కరుణాకర్రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. కాగా తనను చేరదీసి, అప్యాయంగా పెంచిన తాత నర్సయ్య హత్యకు గురవడంతో మనవరాలు శ్వేత అనాథగా మిగిలిపోయింది.● వృద్ధుడి ఉసురు తీసిన భూ తగాదా ● వరుసకు కొడుకే నిందితుడు ● వేలూరు వృద్ధుని హత్యకేసు ఛేదించిన పోలీసులు -
వృద్ధురాలి మెడలో పుస్తెల తాడు తస్కరణ
చేర్యాల(సిద్దిపేట): బైక్పై తీసుకెళ్తానని నమ్మించి వృద్ధురాలి మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మండల పరిధిలోని తాడూరు క్రాస్రోడ్డు సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. తాడూరు గ్రామానికి చెందిన ఈరు సత్తమ్మ, యాదయ్య దంపతులు దైవదర్శనం నిమిత్తం మర్కూక్ వెళ్లి వచ్చే క్రమంలో తాడూరు క్రాస్రోడ్డు వద్ద బస్సు దిగారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై భర్త వెళ్లగా అక్కడే ఉన్న సత్తమ్మను అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నమ్మించి బైక్పై ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లాక బండి ఆపి వృద్ధురాలి మెడలోంచి పుస్తెల తాడు లాక్కుని వెళ్లారు. ఈ క్రమంలో సత్తమ్మ మెడకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ తెలిపాడు. -
బదిలీలు, పదోన్నతులు కల్పించాలి
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరిమెదక్జోన్: ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులను కల్పించటంతో పాటు విద్యాశాఖలో ఇన్చార్జిల స్థానంలో రెగ్యులర్ డీఈఓ, ఎంఈఓలను నియమించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో రెగ్యులర్ ఉపన్యాసకుడు లేకపోవటంతో శిక్షణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నగదు రహిత వైద్య విధాన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్రెడ్డి, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కారెక్కిన కాంగ్రెస్ నాయకులు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు యూటర్న్ తీసుకున్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పట్టణానికి చెందిన జీవన్రావు, చిన్నశంకరంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మితో పాటు మరికొంతమంది తెలంగాణ భవన్కు తరలివెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరంతా గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారే కావడం గమనార్హం. పలు కారణాలతో ఉద్యమ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఇదిలాఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన చాలా మంది నేతలు పార్టీని వీడారు. ప్రస్తుతం వారంతా మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఈసందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్గౌడ్, బట్టి జగపతి, గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
భద్రత.. పునరావాసం
కార్మికులకు వరం నమస్తేపథకం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అమలు గుర్తించిన కార్మికుల వివరాలు యాప్లో నమోదురామాయంపేట(మెదక్): మున్సిపాలిటీల పరిధిలో మరుగుదొడ్ల వ్యర్థాలను తొలగించే పాకీ పనివారు, సెఫ్టిక్ ట్యాంక్లు, మురుగు కాల్వలు, మ్యాన్హోల్స్ను శుభ్రపరిచే కార్మికులు, చెత్త ఏరుకునే వారి శ్రేయస్సు కోసం కేంద్రం ‘నమస్తే’అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో జాతీయ యాంత్రిక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ (నమస్తే) పథకం కింద గుర్తించిన కార్మికులను యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఆయా వృత్తుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల భద్రత, పునరావాసం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రత గౌరవంతో పాటు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకోవడం, వారికి పరికరాలు అందించడం, పునరావాసం కల్పించడం, ఆధునిక, సురక్షిత పద్ధతుల్లో వారికి శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ఈఽ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ కోవలోకి వచ్చే కార్మికులకు రక్షణ కల్పించేలా ఈ పథకం ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల పాలవుతున్నట్లు గుర్తించిన కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత మేరకు యంత్రాలను ఉపయోగించి వీరు పనిచేసేలా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు నమస్తే యాప్లో నమోదు చేస్తున్నారు.చెత్త ఏరుకునే వారు సైతం.. సాధారణంగా పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవితం వెళ్లదీస్తున్నాయి. వీరు డంప్యార్డులు, ఇతర ప్రదేశాల్లో చెత్తను సేకరించి దాన్ని అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరు సైతం తమ వివరాలు నమస్తే యాప్లో నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్లో వీరికి కేంద్రం తరపున పలు పథకాలు, పింఛన్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో 14 మంది చొప్పున మొత్తం 28 మంది కార్మికులను గుర్తించి వారి వివరాలు యాప్లో నమోదు చేశారు. నర్సాపూర్లో నలుగురిని గుర్తించారు. రామాయంపేటలో మాత్రం ఇంకా నమోదు కార్యక్రమం ప్రారంభం కాలేదు. -
క్రీడాభివృద్ధికి రూ.700 కోట్లు
హుస్నాబాద్: దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీస్ల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హుస్నాబాద్ మిని స్టేడియంను సందర్శించారు. స్ధానిక క్రీడాకారులు, విద్యార్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ..తమ ప్రభుత్వం మొదటి మంత్రివర్గ సమావేశంలోనే క్రీడా పాలసీని ప్రకటించిందని చెప్పారు. అంతర్జాతీయ స్ధాయిలో, ఒలింపిక్ గేమ్స్లో దేశం నుంచి ఒక్క బంగారు పతకాన్ని సాధించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. క్రీడల అభివృద్ధికి రూ.700 కోట్లు కేటాయించామని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో విద్యార్ధులు క్రీడల పట్ల ఆసక్తిని కనబరచడం సంతోషకర విషయమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్ష మేరకు హుస్నాబాద్లో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక సమస్యలు అధిగమించి క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో అన్ని రకాల స్పోర్ట్స్ కిట్లను అందిస్తామన్నారు. హుస్నాబాద్ క్రీడలకు పెట్టింది పేరు: పొన్నం హుస్నాబాద్ నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్ధులు, యువకులు ఉపయోగించుకోవాలన్నారు. కబడ్డీ కోర్టుకు రెండు మ్యాట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ధ చైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రతి నియోజకవర్గంలో క్రీడా సౌకర్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. అనంతరం మినీ స్టేడియంలో మంత్రులు, కలెక్టర్, ఇతర అధికారులు తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, క్రీడా ప్రాధికార సంస్ధ డైరెక్టర్ సోనీ బాలాదేవి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, తదితరులు ఉన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి హుస్నాబాద్కు స్విమ్మింగ్ పూల్ మంజూరు మంత్రి వాకిటి శ్రీహరి -
రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి
పటాన్చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పనిగంటలు పెంచుతూ తెచ్చిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. సోమవారం పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి కవ్వింపు చర్యగా పని గంటలు పెంచుతూ జీవో జారీ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చర్యతో శ్రమ దోపిడీకి చట్టబద్దత కల్పించినట్లేనని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు