Palnadu
-
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్బుక్లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
ఉప ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తొమ్మిది మండల ప్రజా పరిషత్లకు సంబంధించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యలో ఉప ఎన్నికల నిర్వహణపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. జెడ్పీలోని తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించిన సీఈవో జ్యోతిబసు ఈనెల 27న ఆయా మండలాల పరిధిలో మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసి, అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే విధానంపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా సంబంధిత ప్రిసైడింగ్ అధికారులతో పాటు మండల పరిషత్ అభివద్ధి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు, దుగ్గిరాల, గుంటూరు రూరల్, తెనాలి, అచ్చంపేట, కారంపూడి, నరసరావుపేట, ముప్పాళ్ల ఎంపీడీవోలతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధిత జిల్లా కలెక్టర్లచే నియమించబడిన ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. బాపట్ల మండలం పిట్టలవానిపాలెం మండల అధ్యక్ష ఎన్నికకు బాపట్ల డీఎల్డీవో సీహెచ్ విజయలక్ష్మి, భట్టిప్రోలు కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు బాపట్ల డీఏహెచ్వో డాక్టర్ బి. వేణుగోపాలరావు, దుగ్గిరాల మండల అధ్యక్ష ఎన్నికకు గుంటూరు డ్వామా పీడీ వి. శంకర్, గుంటూరు రూరల్ ఉపాధ్యక్ష ఎన్నికకు ఏపీఎంఐపీ పీడీ ఎల్, వజ్రశ్రీ, తెనాలి కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు హ్యాండ్లూమ్స్ ఏడీ బి. ఉదయ కుమార్, అచ్చంపేట మండల అధ్యక్ష ఎన్నికకు క్రోసూరు వ్యవసాయశాఖ ఏడీ వి. హనుమంతరావు, కారంపూడి ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డ్వామా పీడీ ఎస్. లింగమూర్తి, నరసరావుపేట ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డీఏఓ ఐ.మురళి, ముప్పాళ్ల కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు పల్నాడు డీఏహెచ్వో కె. కాంతారావు ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులయ్యారు. సమావేశంలో గురజాల డీఎల్డీవో గభ్రూ నాయక్, పెదకాకాని ఈవోపీఆర్డీ కె. శ్రీనివాసరావు, రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. -
సొంత రాజ్యాంగం ‘పులి’మేసి!
● మున్సిపల్ చట్టాలకు తూట్లు ● కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై వైఎస్సార్ సీపీ ధ్వజం ● మేయర్ రాజీనామా ఆమోదంపై కౌన్సిల్ నిర్వహణ ! ● అసలు రాజీనామా ఫార్మేటే సరికాదు ● వైఎస్సార్ సీపీ సభ్యుల వాకౌట్ ● మెజార్టీ సభ్యుల ఆమోదంతో మేయర్ రాజీనామా ఆమోదం నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్) : గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్నాయుడు రాజీనామాపై మున్సిపల్ చట్టాలను కాదని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) దుయ్యబట్టారు. ఈ నెల 15న నగర మేయర్ కావటి మనోహర్నాయుడు తన పదవికి రాజీనామా చేసి కలెక్టర్కు పంపిన విషయం తెలిసిందే. మేయర్ రాజీ నామా ఆమోదం కోసం మంగళవారం కౌన్సిల్ హాల్లో అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. తాత్కాలిక మేయర్గా షేక్ సజీల మేయర్ రాజీనామా ఆమోదానికి సభ్యుల అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. వెంటనే డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ మేయర్ రాజీనామా లేఖను కలెక్టర్కు పంపితే.. ఆ లేఖ ఆధారంగా కౌన్సిల్ ఏ విధంగా నిర్వహిస్తారు? అసలు కలెక్టర్ నగరపాలక సంస్థకు మేయర్ రాజీనామాపై ఏమని రాశారో చెప్పాలని సెక్రటరీని కోరారు. మౌనం వహించిన సెక్రటరీ దీనిపై కౌన్సిల్ సెక్రటరీ మౌనం వహించారు. దీంతో వెంటనే కమిషనర్ అందుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 15న మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా చేస్తూ లేఖను మెయిల్ ద్వారా కలెక్టర్కు, కమిషనర్కు పంపారని, దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారని కమిషనర్ వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేయర్ రాజీనామాపై అత్యవసర కౌన్సిల్ నిర్వహణకు ఉన్న ఇద్దరు డెప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్గా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎంఏయూడీ శాఖకు లేఖ రాశామని, ఈ నెల 21న డెప్యూటీ మేయర్ షేక్ సజీలను తాత్కాలిక మేయర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీని ప్రకారం సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేయర్ రాజీనామా ఫార్మేట్ సరైనది కాదు మున్సిపల్ చట్టం 92 (1) మేయర్ తన పదవికి రాజీనామా చేయాలంటే కౌన్సిల్ నిర్వహించి కౌన్సిల్లో రాజీనామాకు గల కారణాలను చర్చించిన తరువాత సభ్యుల ఆమోదంతో రాజీనామాను ఆమోదించాలి. లేదా కౌన్సిల్ సెక్రటరీకి రాజీనామాను పంపితే ఆ రాజీనామాకు అనుగుణంగా సెక్రటరీ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ తరువాత రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నగర కమిషనర్ కలెక్టర్కు పంపిన రాజీనామాను ఆధారం చేసుకుని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రభుత్వానికి లేఖ రాయడమేమిటని డెప్యూటీ మేయర్ వజ్రబాబు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై తాము లీగల్ ఓపీనీయన్ తీసుకుంటామని..అప్పటివరకు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సభ నుంచి వైఎస్సార్ సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తరువాత తాత్కాలిక మేయర్ షేక్ సజీల మెజార్టీ సభ్యుల ఆమోదంతో మేయర్ కావటి మనోహర్ రాజీనామాను ఆమోదించారు. -
నోటి కందేలా లేదు!
పల్నాడుబుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025చేతి కందింది వైభవంగా ఆలయ వార్షికోత్సవం బాపట్ల: బాపట్ల పట్టణం పాతబస్టాండ్లోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. శాంతి కల్యాణ మహోత్సవం చేపట్టారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమరావతిలో జపాన్ బృందం అమరావతి: ప్రముఖ పర్యాటక కేంద్రం అమరావతిని మంగళవారం జపాన్ ప్రతినిధుల బృందం సందర్శించింది. వారివెంట ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఉన్నారు.వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం దుగ్గిరాల: శ్రవణానక్షత్రం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం దుగ్గిరాల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఇఫ్తార్ సహర్ (బుధ) (గురు) నరసరావుపేట 6.27 4.53 గుంటూరు 6.25 4.51 బాపట్ల 6.25 4.51 కంది రైతుకు ‘మద్దతు’ ఇవ్వని సర్కారు I -
సీఐ ‘గన్’ కార్యం..!
ఫిరంగిపురంలో ఓవర్ యాక్షన్ ● అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న ఖాకీలు ● అధికార పార్టీకి కొమ్ముకాసి వీఆర్ బాట పడుతున్న వైనం ● సివిల్ పంచాయితీలలో తలదూర్చి శాఖకు చెడ్డపేరు ● రేంజ్ పరిధిలో అడ్డగోలు బదిలీలు, వీఆర్లు ● పది నెలల్లో ఒకే స్టేషన్కు ముగ్గురు సీఐలు ● కూటమి సర్కారు వచ్చాక ఎల్లో పైరవీలదే రాజ్యం సాక్షి ప్రతినిధి, గుంటూరు, నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ నాయకులను పట్టుకుని పోస్టింగ్లు తెచ్చుకున్న సీఐలు కొందరు స్వామిభక్తిని ప్రదర్శిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మరికొందరు అడ్డంగా దొరికిపోయి వీఆర్ బాట పడుతున్నారు. తాజాగా ఫిరంగిపురంలో సీఐ రవీంద్రబాబు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థల వివాదంలో ఫిర్యాదు చేసిన వారిపైనే దాడికి తెగబడటం, వారికి సినీఫక్కీలో గన్ గురిపెట్టడం, ఒక యువకుడిని గన్తో కొట్టి గాయపరచడం జిల్లాలో సంచలనం రేకెత్తించాయి. ఈ అధికారి సివిల్ పంచాయితీలో తలదూర్చి రెచ్చిపోవడం ఇది రెండోసారి. గతంలో గోడను పడగొట్టించిమరీ..! గతంలో పొనుగుపాడు గ్రామంలో దళితులకు సంబంధించిన స్థలంలో గోడను పడగొట్టించి మరీ ఈ సీఐ రోడ్డు వేయించిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకుని గ్రామానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డైమండ్బాబుపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గ్రామస్తుల చేతిలో తన్నులు తినే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ అధికారిని వెనకేసుకొస్తారా, లేక చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. 25 మంది వీఆర్లో.. ప్రస్తుతం రేంజ్లో సుమారు 25 మందికి పైగా సీఐలు వీఆర్లో ఉన్నారు. వీరంతా కూడా కూటమి అధికారంలోకి వచ్చాక వీఆర్కు వెళ్లిన వారే. సీఐల పోస్టింగులలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. మిగిలిన వారిని వీఆర్కు పిలవడం లేకపోతే ప్రాధాన్యం లేని పోస్టింగ్లు కట్టబెట్టడం చేస్తున్నారు. లూప్లైన్ పోస్టింగ్లు ఇచ్చినా చిన్నచిన్న కారణాలతోనే వారిని పక్కన పెట్టారు. బూట్లతో డెప్యూటీ సీఎం వద్దకు వెళ్లారని వీఆర్కు.. జనసేన కార్యాలయంలో డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దీక్షలో ఉండగా బూట్లతో లోపలికి వెళ్లారంటూ మంగళగిరి పట్టణ సీఐ ఎం.శ్రీనివాసరావును వీఆర్కు పంపడం కూటమి ప్రభుత్వ విధానాలకు పరాకాష్టగా నిలిచింది. కొన్ని స్టేషన్లకు సీఐగా వస్తే ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి ఉంది. పట్టాభిపురంలో ఇప్పటికి నలుగురు సీఐలు మారారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాభిపురం స్టేషన్కు సీఐగా కిరణ్ వచ్చారు. అతను ఎమ్మెల్యే భర్త ఆదేశాల మేరకు వేరే వారిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టడంతో అతనిని వీఆర్కు పంపారు. తర్వాత వీరేంద్రబాబు వచ్చీరాగానే సివిల్ పంచాయితీలలో వేలుపెట్టారు. విపక్ష నాయకులే టార్గెట్గా కేసులు పెట్టి వేధింపులకు దిగారు. అయితే అతన్ని కూడా వీఆర్కు పంపించి మధుసూదన్కు డీవో ఇచ్చారు. అతను విధుల్లో చేరిన 24 గంటల్లోనే పోస్టింగ్ నిలిపేసి గాల్లో పెట్టారు. అరండల్పేట స్టేషన్కు కూడా ఇద్దరు సీఐలు మారారు. మొదట కుంకా శ్రీనివాసరావును తీసుకురాగా బోరుగడ్డ అనీల్ కేసులో వీఆర్కు పంపించి వీరాస్వామిని తీసుకువచ్చారు. నగరంపాలెం స్టేషన్కు మొదట మధుసూధనరావును తీసుకురాగా తర్వాత నాయక్, ప్రస్తుతం నజీర్బేగ్ను తీసుకొచ్చారు. ● తాజాగా రెండు రోజుల క్రితమే అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్పై వేటు పడింది. గ్రంధశిరి గ్రామంలో జరిగిన వివాదంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఒక నిందితుడు తప్పించుకుపోయేలా వ్యవహరించిన అంశంలో వీఆర్కు పిలిచారు. ఇలా రేంజ్ పరిధిలో మారిన వారి సంఖ్య చాలా ఉంది. ఈ మూడు ముక్కలాటపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ‘రేంజ్’ వేరు..! సీఐల బదిలీలు, వీఆర్ విషయంలో గుంటూరు రేంజ్ కొత్త ట్రాక్ రికార్డును నెలకొల్పింది. గుంటూరు రేంజ్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠీ వచ్చిన తర్వాత పలువురు సీఐలను బంతాట ఆడుతున్నారు. సరిగ్గా పది నెలలు క్రితం సుమారు 13 మందికిపైగా సీఐలను పోలీస్స్టేషన్ల (పీఎస్)కు బదిలీ చేశారు. అయితే వీరు బాధ్యతలు స్వీకరించక ముందే వెనక్కి పిలిచారు. కొందరు సీఐలు బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిల్లోనే వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లోకి వెళ్తున్నారు. కొంతమందికి పోస్టింగ్ ఇవ్వగానే కూటమికి చెందిన పచ్చపత్రికల్లో, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతోంది. గత ప్రభుత్వానికి అంటకాగారని, వారికి పోస్టింగ్ ఇవ్వడమేమిటంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు వస్తాయి. వెంటనే వారిని వీఆర్కు పిలుస్తున్నారు. ఇలా వెళ్లిన వారికి నెలలు గడిచినా పోస్టింగ్లు ఉండటం లేదు. -
గణనీయంగా పెరిగిన మల్లేశ్వరుడి ఆదాయం
109 రోజుల హుండీ కానుకల ఆదాయం రూ.58.03లక్షలు పెదకాకాని: శివాలయం మల్లేశ్వరస్వామి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మంగళవారం హుండీల్లోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా కాజ గ్రూపు టెంపుల్స్ ఈఓ పుణ్యాల వెంకటరెడ్డి హాజరయ్యారు. 109 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ.58,03,497లు ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.2,89,270లు సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం 54.300 గ్రాములు, వెండి 438 గ్రాములు, ఆస్ట్రేలియా 20 డాలర్లు, యుఎస్ఏ 139 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పాండ్లు, నేపాల్ కరెన్సీ రూ.130 , ఇండోనేషియా రూ.5000 వచ్చాయని డీసీ తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్ శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలుగ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శాంతి భద్రతల సమావేశానికి కలెక్టర్, ఎస్పీ హాజరు నరసరావుపేట: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నిర్వహించిన శాంతిభద్రతల సమావేశానికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు హాజరయ్యారు. పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ముగ్గురు వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు మాచవరం: మాచవరం మండలంలో ముగ్గురు వీఆర్ఓలకు ఆర్డీఓ మురళీ కృష్ణ షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగమల్లేశ్వరరావు మంగళవారం తెలిపారు. మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం వీఆర్ఓలు ఏసుపాదం, లోకేష్, జానీబాషాలు ఐవీఆర్ కాల్స్లో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని మూడు గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ముగ్గురు వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన వాయిదా గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్చి 27 నుంచి 29వ తేదీవరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శనను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని తెలిపారు. -
● కంది పంటను అమ్ముకోవడానికి ఇబ్బందిపడుతున్న రైతులు ● జిల్లాలో 26,908 హెక్టార్లలో 50,879 మెట్రిక్ టన్నుల దిగుమతి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు ● మార్క్ఫెడ్ ద్వారా తూతూమంత్రంగా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ● కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో కందులను క
సాక్షి, నరసరావుపేట: కంది కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటను కొంటామని కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ వట్టి మూటలుగానే మారాయి. మార్క్ఫెడ్, నాఫెడ్ల ద్వారా ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాలలో తూతూమంత్రంగా కందులను కొనుగోలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రకరకాల కారణాలు చెప్పి రైతుల నుంచి కంది కొనుగోలుకు నిబంధనల బంధనాలు వేస్తున్నారు. దీంతో కందిపంట సాగు చేసిన రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయక ఒకవైపు.. కంది మిల్లుల యజమానులు సిండికేట్గా మారి దోచుకోవడంతో మరోవైపు కందిరైతు విలవిలలాడుతున్నాడు. తేమ శాతం పేరుతో... మద్దతు ధర రూ.7,550కు ప్రతి రైతు నుంచి సమీపంలో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్, నాఫెడ్ల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటనలు చేశారు. ఇప్పటివరకు సుమారు 1200 మంది రైతుల నుంచి 12,200 మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేసినట్టు జిల్లా మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఖరీఫ్తో పాటు రబీ కంది కూడా అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన కంది చాలా తక్కువ. మరోవైపు తేమశాతం, తాలు పేరిట రైతుల నుంచి కందుల కొనుగోలులో మార్క్ఫెడ్ ప్రతిబంధకాలు సృష్టిస్తోంది. కల్లాల వద్ద రైతులు శ్రమ పడి అధికారులు చెప్పిన విధంగా తయారు చేసినా.. కొనుగోలు జరగని దుస్థితి నెలకొంది. అధికారులు చెబుతున్న ప్రకారం చేయడం వల్ల తమకు క్వింటాకు 5 నుంచి 10 కిలోల తరుగుదల కనిపిస్తోందని, ఇప్పటికే మద్దతు ధరలేక ఇబ్బందిపడుతుంటే ఇది మరింత నష్టం కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కందుల మిల్లుల యజమానులు, వ్యాపారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ధరలు పతనమయ్యాయన్న పేరుతో క్వింటా కందులను రూ.6,000–రూ.6,200 మధ్య మాత్రమే కొంటున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.12 వేల వరకు... పెట్టుబడి కూడా కష్టంతేమ శాతం సాకుతో కొనడం లేదు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో క్వింటా కందులు రూ.10వేలకు పైగా ధర పలికింది. కొంతమంది రైతులు రూ.12 వేలకు సైతం అమ్ముకున్నారు. దీంతో ఈ ఏడాది పల్నాడులోని మెట్ట ప్రాంతాల్లో కంది పంట సాగుకు రైతులు ఉత్సాహం చూపారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ఏడాది రూ.7,550 మాత్రమే మద్దతు ధర ప్రకటించింది. తీవ్ర వాతావరణ అనుకూలతలు, చీడపీడల మధ్య పండిన అరకొర పంటను ఆ ధరకై నా అమ్ముకుందామన్న రైతులకు తీవ్ర నిరాఽశే ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ లాంటి పథకాల ద్వారా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా కనీసం పండినపంటను సైతం అమ్ముకోలేని దుస్థితికి తెచ్చారని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా అందడంతోపాటు దిగుబడులను దళారుల దోపిడీ లేకుండా అమ్ముకున్నామని వారు చెబుతున్నారు. వారు చెప్పిందే ధర..! వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 26,908 హెక్టార్లలో కంది పంట సాగుచేయగా సుమారు 50,879 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే దిగుబడి ఊహించిన దానికన్నా అధికంగా ఉంది. రైతులకు ఈ–క్రాప్ బుకింగ్పై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో కంది సాగు తక్కువగా ఉంది. మరోవైపు ఈ–క్రాప్ చేయని రైతుల నుంచి కందులు కొనుగోలు చేయబోమని కొనుగోలు కేంద్రాలు తేల్చిచెబుతున్నాయి. దీంతో తప్పనసరి ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారు చెప్పిందే ధరగా మారింది. నాలుగు ఎకరాల్లో కంది సాగుచేస్తే దిగుబడి సుమారు 25 క్వింటాళ్లు వచ్చింది. కోతల తరువాత నాలుగు రోజులు కల్లంలో ఎండబెట్టాను. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో సాకులు చెబుతున్నారని జల్లెడ సైతం పట్టి సిద్ధంగా ఉన్నాం. పంట అమ్ముకుందామంటే కొనేవారు ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరం దిగుబడి కూడా బాగా తగ్గింది. గత సంవత్సరం క్వింటా కంది రూ.10 వేలకు పైగా ధర పలకడంతో ఎన్నో ఆశలతో ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో సాగు చేశాను. ఇప్పటికై నా ప్రభుత్వం మద్దతు ధర రూ.7,550లకు కంది కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి. – మిరియాల కొండలు, కంది రైతు, ఒప్పిచర్ల, కారంపూడి మండలం ప్రభుత్వం కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు చేయకపోవడంతో ఖరీఫ్లో పండిన కందిని క్వింటాలు రూ.6వేలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రబీ సీజన్లో కంది పంట చేతికి వస్తున్నా ప్రభుత్వం కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నాం. కందులు కొనుగోలు చేయాలని స్థానిక వ్యవసాయ సిబ్బందిని అడిగితే తేమశాతం ఎక్కువగా ఉందని, రకరకాల కారణాలు చెప్పి కొనుగోలు చేయడం లేదు. ఇటువంటి దుస్థితి ఎప్పుడు లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నేరుగా కల్లం వద్దకు వచ్చి రూ.10వేలు పైగా చెల్లించి అధికారులు కొనుగోలు చేశారు. అప్పుడు లేని సాకులు ఈరోజు చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. మద్దతు ధర రూ.7,550లకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – అడపాల అంబారావు, కంది రైతు, ఆత్మకూరు గ్రామం, దుర్గి మండలం -
జిల్లా సెషన్స్ న్యాయాధికారి సత్యశ్రీకి పీహెచ్డీ
నరసరావుపేట టౌన్: స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయాధికారి నేతి సత్యశ్రీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం పీహెచ్డీ పట్టా అందించింది. న్యాయాధికారి ఎన్.సత్యశ్రీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతామాణిక్యం పర్యవేక్షణలో తన పీహెచ్డీ పూర్తిచేశారు. ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేయడం, ఎన్నికలలో ప్రచారాలు, సాంకేతిక యుగంలో చట్టపరమైన నైతిక సందిగ్ధతలు అనే అంశంపై పరిశోధన చేశారు. ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ యుగంలో ఎన్నికల ప్రచారాలలో చోటు చేసుకుంటున్న అపసవ్యతలు, వాటిని శాసీ్త్రయంగా సరిదిద్దుకోవడానికి తీసుకోవలసిన చర్యలు, మీడియా పాత్ర, వ్యక్తిగత స్వేచ్ఛ తదితర అంశాలను స్పృశిస్తూ ఈ పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీఎస్ రాజశేఖర్ చేతులమీదుగా న్యాయశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీని పొందుకున్నట్లు ఆమె మంగళవారం తెలిపారు. -
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం పర్యటించారు. రాయపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాలను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకొని సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.43 వేల కోట్లతో గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయన్నారు. మొదట రాజధానిలో క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఇప్పుడు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు పరిశీలించినట్టు పేర్కొన్నారు. 186 బంగ్లాలు, మంత్రులు, జడ్జిలు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయన్నారు. గెజిటెడ్ అధికారులకు 1440, ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయని, హైకోర్టు 16.85 లక్షల చదరపు అడుగులు వస్తుందని, అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో అందుబాటులోకి రానుందన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నామని, ల్యాండ్ వేల్యూ పెరిగిన తరువాత అప్పు తీరుస్తామని వెల్లడించారు. -
దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(గుంటూరు) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్ రావు మంగళవారం విడుదల చేశారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31న తుది గడువుగా నిర్ణయించారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ర్యాంక్ పొందిన వారితోపాటు ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు అని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ లు తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డులను వర్సిటీ వైబ్సెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్యూసీడీఈ.ఇన్ఫో నుంచి పొందవచ్చన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వర్సిటీ ఓ ఎస్ డి ఆచార్య ఆర్ వి ఎస్ ఎస్ రవికుమార్, అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణవేణి, సూపరింటెండెంట్లు జవ్వాజి శ్రీనివాసరావు, నేలపాటి నాగేశ్వరరావు, వర్సిటీ సిబ్బంది రాధాకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మొండి బకాయిల రికవరీ వేగవంతం చేయాలి
ఈపూరు(శావల్యాపురం): సీ్త్రనిధి మొండి బకాయిల వసూలు వేగవంతం చేయాలని జిల్లా సీ్త్రనిధి ఏజీఎం రంతు చిన బుల్లెయ్య అన్నారు. మంగళవారం ఈపూరు మండలం వెలుగు కార్యాలయంలో సీ్త్రనిధి రుణాల రికవరీ పురోగతిపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సీ్త్రనిధి మొండి బకాయిలు రూ.15 కోట్లు ఉండగా ఇప్పుటి వరకు రూ.5కోట్లు వసూలు చేశామన్నారు. ఈనెలాఖారులోగా పెండింగ్లో ఉన్న రుణాలను రీకవరీ చేయాలన్నారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే మహిళల జీవనోపాధుల పెంపుదలకు దోహదపడతాయన్నారు. బొల్లాపల్లి మండలం రూ.53 లక్షలు, ఈపూరు రూ.53లక్షలు, అమరావతి రూ.82లక్షలు, యడ్లపాడు రూ.79లక్షలు, గురజాల రూ.79 లక్షలు, నరసరావుపేట రూ.71లక్షలు, అచ్చంపేట రూ.69 లక్షలు, పిడుగురాళ్ళ రూ.47 లక్షలు, క్రోసూరు రూ.37 లక్షలు, దాచేపల్లి రూ.44లక్షలు, కారంపూడి మండలంలో రూ. 35 లక్షల మొండి బకాయిలు ఉన్నాయని మండలాల వారిగా ఉన్నతాధికారులు రీకవరీ టీం సభ్యులను ఏర్పాటు చేసి నూరుశాతం వసూలు చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 24 వేల మంది మహిళా సభ్యులకు సీ్త్రనిధి రుణాలు రూ.120 కోట్లు ఇవ్వటానికి లక్ష్యంగా ఏంచుకొనగా ఇప్పుటి వరకు 5400 మంది మహిళలకు రూ.41 కోట్లు రుణాలను అందజేశామన్నారు. సీ్త్రనిధి రుణాలు చెల్లింపులు సక్రమంగా లేకపోవటం వలన లక్ష్యాలను అధిగమించలేదన్నారు. అనంతరం ఈపూరు మండలం వనికుంట, బొమ్మరాజుపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామసంఘం సభ్యులతో మాట్లాడి సీ్త్రనిధి రుణాలు వసూలు పురోగతిపై సమీక్షంచారు. ఆయనతో పాటు సీసీలు అబ్బురి రామారావు, నరేష్, సీలార్బీ వీవోఏలు ఉన్నారు.సీ్త్రనిధి జిల్లా ఏజీఎం చిన బుల్లెయ్య -
యార్డుకు 1,44,172 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు)ఃగుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,44,172 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,39,165 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 69,373 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి
తెనాలిరూరల్: రైలు ఢీకొని ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద చోటుచేసుకుంది. తెనాలి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి ఆరో బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న పెద్దనబోయన రాఘవరెడ్డి(46) తనతో కలసి డ్యూటీలో ఉన్న సహచరులకు వారి ఇళ్ల నుంచి మంగళవారం భోజన క్యారేజీలను తీసుకెళ్లాల్సి ఉంది. 11 గంటల ప్రాంతంలో సహచరులకు ఫోన్ చేసి భోజనాలు సిద్ధమయ్యాయో కనుక్కుంటే తీసుకొస్తానని చెప్పాడు. కొద్ది సేపటికే ఇప్పటం రైల్వే గేటు వద్ద పట్టాల వెంబడి మృతి చెంది పడి ఉన్నాడు. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రైలు ఢీకొట్టిందా లేక సడెన్గా రైలు రావడంతో పక్కకు జరిగే క్రమంలో కాలు జారి పడడంతో తల వెనుక భాగంలో గాయమై మృతి చెందాడా అన్న అంశాలు పోస్ట్మార్టమ్/దర్యాప్తులో తెలుస్తాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భౠర్య ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపండి
నరసరావుపేట: మాతా శిశు సంరక్షణలో గౌరవ వేతనం తీసుకుంటూ విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు తగదని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్కుమార్ అన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞానకేంద్రంలో మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కేపీ మెటిల్డాదేవి అధ్యక్షత వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సందర్భాలలో అంగన్వాడీలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని, ప్రస్తుతం రాజకీయ వేధింపులతో పాటు అధికారుల వేధింపులు కూడా తోడయ్యాయన్నారు. వీటికి నిదర్శనమే సత్తెనపల్లిలో అంగన్వాడీ జ్యోతి ఆత్మహత్యాయత్నం, నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంలో అంగన్వాడీ ఫాతిమా ఆత్మహత్యలన్నారు. ఆయా ఘటనలలో నిందితులపై ఇంతవరకు కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ ఒకవైపు వేధింపులు మరోవైపు యాప్లతో అంగన్వాడీలు పని ఒత్తిడికి గురవుతున్నారరన్నారు. సాంకేతిక సమస్యలతో మొబైల్ ఫోన్లు పనిచేయక అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అధికారులు యాప్లో పిల్లల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయకపోతే వేతనాల్లో కోత విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం తగదన్నారు. అదేవిధంగా 42 రోజుల పాటు చేసిన సమ్మె సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా హామీల అమలు డిమాండ్ల సాధనకు అవసరమైతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఎ.లక్ష్మీ ప్రసన్న, నిర్మల, సాయి, మాధవి, పద్మ పాల్గొన్నారు. సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్కుమార్ -
సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దాం
నరసరావుపేట ఈస్ట్: డిగ్రీ కళాశాలల సమస్యలను పరిష్కరించుకోవడంలో సమష్టిగా కృషి చేయాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు తీర్మానించాయి. రావిపాడురోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మంగళవారం వర్సీటీ అనుబంధ కళాశాలల యాజమాన్య సంఘం సమావేశం నిర్వహించారు. కళాశాలలకు ఎదురవుతున్న సమస్యలను ఐకమత్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఈసందర్భంగా యాజమాన్యాల ప్రతినిధులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళాశాలల ఖాతాల్లో ఫీజురీయింబర్స్మెంట్ నగదు వేయటంపై కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలల అఫిలియేషన్ గడువును 5 సంవత్సరాలకు ఒకేసారి ఇవ్వాలని, జీఓ 36ను రద్దు చేయాలని కోరారు. అలాగే 30 శాతం మేనేజ్మెంట్ సీట్ల కోటాను రద్దు చేసి అన్ని సీట్లు కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలన్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం, వర్సీటీ అధికారుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించేలా అసోసియేషన్ కృషి చేయాలని తీర్మానించారు. నూతన కార్యవర్గం.. వర్సీటీ అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా రాయల శ్రీనివాసరావు (వాగ్దేవి డిగ్రీ కళాశాల, నరసరావుపేట), ప్రధాన కార్యదర్శిగా ప్రమదా రాజశేఖర్ (మంగళగిరి), ఫైనాన్స్ సెక్రటరీగా మైనీడి శ్రీనివాసరావు (విక్టరీ డిగ్రీ కళాశాల, నరసరావుపేట), ఉపాధ్యక్షులుగా వై.వెంకట్రామయ్య (మాచర్ల), పి.సీతారామ్బాబు (వినుకొండ), జాయింట్ సెక్రటరీగా వీరవల్లి శ్రీనివాసరావు (సత్తెనపల్లి), కార్యవర్గ సభ్యులుగా గంట కిషోర్కుమార్ (గురజాల), చేబ్రోలు మహేష్ (చిలకలూరిపేట), బాడిశ మస్తాన్ (పిడుగురాళ్ల) ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం సంఘం ప్రతినిధులు రాంబాబు, పెద్దిరాజు, రాష్ట్ర జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు వీవీ ప్రసాద్ వ్యవహరించారు. సమావేశంలో వర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. వర్సిటీ అనుబంధ కళాశాలల యాజమాన్య సంఘం -
ఆదిలక్ష్మిని అతి కిరాతకంగా చంపిన ప్రియుడు..
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జానపాడు గ్రామానికి చెందిన తాటి కొండలు, తాటి ఆదిలక్ష్మి(30)లు భార్యాభర్తలు. నిత్యం పని నిమిత్తం పిడుగురాళ్ల పట్టణంలోని సున్నపు బట్టీలకు వస్తుంటారు. ఈ క్రమంలో వేముల ఏడుకొండలు అనే బట్టీ మేస్త్రీతో ఆదిలక్ష్మికి పరిచయమేర్పడింది. దీంతో ఆదిలక్ష్మి కొండలను వదిలిపెట్టి ఐదేళ్లుగా పిడుగురాళ్ల పట్టణంలో పిల్లలతో పాటు ఏడుకొండలుతో సహజీవనం సాగిస్తోంది.ఆదిలక్ష్మి డ్వాక్రా ద్వారా రూ.3 లక్షలు తీసుకుందని, ఆ డబ్బుల విషయంలో ఆదిలక్ష్మికి, ఏడుకొండలకు తరచూ గొడవలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. రోజులాగే పిల్లలిద్దరూ వారి అమ్మమ్మ ఇంటికి పడుకునేందుకు వెళ్లారు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం రక్తంతో ఉంది. వెంటనే పిల్లలు వారి అమ్మమ్మకు విషయం చెప్పడంతో అమ్మమ్మతో పాటు చుట్టుపక్కల బంధువులు వచ్చి చూడగా.. ఇంటి నుంచి దారి పొడవునా రక్తపు మరకలు కనిపించాయి.సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రక్తపు మరకలను చూసుకుంటూ వెళ్లగా కొత్తగా కడుతున్న స్కూల్ సమీపంలోని క్వారీ వద్ద తాళిబొట్టు, రక్తపు మరకలు కనిపించాయి. వారు వెంటనే క్వారీలోకి దిగి వెతకగా ఆదిలక్ష్మి మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు ఏడుకొండలు ఉన్నట్టు తెలిసింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
కేవీకేలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సోమవారం నగర శివారుల్లోని లాంఫాంలోని కేవీకేలో ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ ఎం.యుగంధర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పశు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జేవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనశాలల్లో రూపుదిద్దుకుంటున్న సాంకేతికతను రైతులకు చేరవేయటంలో కృషివిజ్ఞాన కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. వివిధ రంగాల్లో శిక్షణ, నైపూణ్యాల వృద్ధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ యువతకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ శాసీ్త్రయ సలహా మండలి సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించాలని అభిప్రాయపడ్డారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గేదెల యాజమాన్య పద్ధతులపై కేవీకే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ బి. శోభామణి, డాక్టర్ శివన్నారాయణలు క్షేత్రస్థాయి పరిశీలనలు, సూక్ష్మ సమన్వయంతో నిర్వహించేట్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు నరసింహారావు, ఎల్ఆర్ఎస్ హెడ్ డాక్టర్ ముత్తారావు వ్యవసాయ, అనుభంద సంస్థల నిపుణులు వారి సలహాలను అందించారు. కేవీకే శాస్త్రవేత్తలు 2024–25 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 2025–26 సంవత్సరంలోని కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యుగంధర్కుమార్ మాట్లాడుతూ సలహామండలి సలహాలు సూచనలు పాటిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు, ఎల్ఆర్ఎస్ సిబ్బంది, రైతులు, శాస్త్రవేత్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట ఈస్ట్: దేశవ్యాప్తంగా అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ, కాలేజ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపులో భాగంగా సోమవారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఎయిడెడ్ అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్గనైజేషన్ 33వ కాన్ఫరెన్స్ తీర్మానం మేరకు ఈనెల 24, 25, 26 తేదీలల్లో అధ్యాపకులు తమ డిమాండ్ల సాధనకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ఆక్టా రాష్ట్ర అధ్యక్షుడు కోండ్రు మోహనరావు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ, ఎన్ఈపీ–2020 ఉపసంహరించుకోవాలని కోరారు. ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆక్టా నాయకులు డాక్టర్ ముద్దా రమేష్, డాక్టర్ ఐ.సదాశివరెడ్డి, డాక్టర్ పీఎన్వీడీ మహేష్, డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డాక్టర్ భానునాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆక్టా రాష్ట్ర అధ్యక్షుడు మోహనరావు -
● ఆన్లైన్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా ● ఎస్పీ తుషార్ డూడీ
అంగన్వాడీల వేతనాలు పెంచాలి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఇంతవరకు తమ వేతనాలు పెంచలేదని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. పాతగుంటూరులోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి అధ్యక్షుతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోగా ఉద్యోగుల పేరుతో కరెంట్ బిల్లులు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో అంగన్వాడీల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా వై.రమణను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దీప్తి, ఉపాధ్యక్షులు సుకన్య, ధనలక్ష్మి, హేమలత, రాజకుమారి, శివ పార్వతి తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్లకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం బాపట్లటౌన్: బెట్టింగ్లకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్లైన్లో రోజుకొక రకమైన బెట్టింగ్ యాప్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వివిధ ఆఫర్స్తో బెట్టింగ్ ఫ్రీ అంటూ యువతను ఆకర్షించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ఒకసారి ఆడి చూద్దాం అని సరదాగా మొదలుపెట్టి వీటి బారిన పడిన యువకులు బయటికి రావడమనేది కష్టతరమైన విషయమన్నారు. ఈ బెట్టింగ్స్కి అలవాటు పడ్డ వాళ్లు అప్పుల పాలు కావడమే కాకుండా.. చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్లైన్ బెట్టింగ్పై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ ముఠాలు రేపల్లె, చీరాల, అద్దంకి వంటి మరికొన్ని ప్రదేశాల్లో వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దానికి అనుగుణంగా గతంలో బెట్టింగ్లు నిర్వహిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 39 మంది కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. చీరాల–1 టౌన్లో రెండు కేసుల్లో 11 మంది, రేపల్లె టౌన్లో ము గ్గురు, వేమూరు పోలీస్స్టేషన్లో ఆరుగురు, కొల్లూరులో ఒకరు, చీరాల టూ టౌన్లో ఒక రు, వేటపాలెంలో 9 మంది, అద్దంకిలో 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. బెట్టింగ్లకు పాల్పడే అవకాశం ఉన్న వారిపై నిఘా ఉంచామన్నారు. 29న బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం మార్చి 29, 30 తేదీలలో నిర్వహిస్తున్నట్లు దర్గా ఈఓ షేక్ ముక్తార్బాషా తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 537వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని సోమవారం ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్ చేతుల మీదుగా పోస్టర్లు ఆవిష్కరించారు. రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే చెప్పారు. -
హత్య కేసును విచారించిన జిల్లా ఎస్పీ
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణం మారుతీనగర్లో సోమవారం జరిగిన హత్య కేసు విచారణ నిమిత్తం పల్నాడు జిల్లా కె.శ్రీనివాసరావు సోమవారం హాజరయ్యారు. తొలుత ఆదిలక్ష్మి హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని పడేసిన క్వారీని గుంతను పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్కు చేరుకుని, హత్యకు సంబంధించి పూర్తి వివరాలు సీఐ శ్రీరామ్ వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. కొత్త కవులను ప్రోత్సహిద్దాం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బ్రాడిపేటలోని కథా రచయిత్రి తాటికోల పద్మావతి నివాసంలో గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కవులందరూ కలిసి ‘కవిత్వంతో కాసేపు’ నిర్వహించారు. ఈనెల 21 న అంతర్జాతీయ కవితా దినోత్సవం, 30న ఉగాది పండుగ సందర్భంగా కవిత్వంపై చర్చించారు. ఔత్సాహిక కవులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సంఘం పని చేద్దామని సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.సుభాని తెలిపారు. కవులు తాము రాసిన కవితతోపాటు సమకాలీన కవులు రాసిన, తమకు నచ్చిన మరో కవిత వినిపించి జయప్రదం చేశారని కోశాధికారి నానా చెప్పారు. సంఘానికి కొత్తగా పరిచయమైన కవులు మెట్టు శ్రీనివాసరెడ్డి, సురేష్, కడంశెట్టి సతీష్కుమార్ మాట్లాడారు. ఇది కవి సంగమం అని, సత్సంగమని, అందరూ మర్యాద పూర్వకంగా కలవడం సంతోషంతోపాటు ప్రోత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు. రచయిత్రి తాటికోల పద్మావతి ఆతిథ్యం, ఆప్యాయతలను కవులు కొనియాడారు. సంఘం ఉపాధ్యక్షులు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, సభ్యులు ఈవూరి వెంకట రెడ్డి, కొణతం నాగేశ్వరరావు, శ్రీవశిష్ట సోమేపల్లి పాల్గొన్నారు. -
వివాహిత బలవన్మరణం
యడ్లపాడు: వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయపాలెంకు చెందిన వడ్డేపల్లి అశోక్కు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఇరిపని లక్ష్మీభార్గవి (23)కు 2018లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తుండగా, భార్గవి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతకు తీయకపోవడంతో అనుమానంతో ఆమె ఆడపడుచు తలుపుకొట్టి తీసి చూడగా రేకుల షెడ్డు పైకప్పుకు వేసి ఐరన్రాడ్డుకు చీరెతో ఉరివేసుకుని కన్పించింది. పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా అప్పటికే లక్ష్మీభార్గవి మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి ఆడపడుచు భర్త బాలాజీ ద్వారా విషయం తెలుసుకున్న మృతిరాలి తల్లి దుర్గ సోమవారం బోయపాలెం చేరుకుంది. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే బంధువులతో కలిసి యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఏడాది నుంచి భార్గవికి కడుపునొప్పి వేధిస్తుందని, దానిని తాళలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్గవి తల్లి తన ఫిర్యాదు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అప్పులు కట్టలేక భార్యాభర్తల అదృశ్యం అద్దంకిరూరల్: అప్పులు కట్టలేనని.. ఇంట్లో పుస్తకంలో రాసిపెట్టి భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. ఈఘటన ఆదివారం అద్దంకి పట్టణంలో జరగ్గా భార్య, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు ఎస్ఐ ఖాదర్బాషా నమోదు చేశారు. ఎస్సై వివరాల మేరకు అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన కుంచాల శ్రీనివాసరావుకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె అంజలికి మూడేళ్ల కిందట ఆలకుంట వెంకట్రావుతో వివాహం కాగా అద్దంకిలో ఉంటున్నారు. వెంకట్రావు బేల్దారి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ప్రస్తుతం అంజలి గర్భిణి. ఈ క్రమంలో ఆదివారం తల్లి తన కుమార్తె అంజలి ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. దీంతో కూతురు, అల్లుడు హాస్పటల్కు వెళ్లారని భావించి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అద్దంకిలోని వైద్యశాలలో చూశారు. అక్కడా కూడా లేకపోవడంతో ఒంగోలులోని పలు వైద్యశాలలు వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో ఇంటికి వచ్చి అన్ని వెతకగా ఒక పుస్తకంలో తాము ఇవ్వాల్సిన అప్పుల జాబితా రాసి ఉంది. ‘అవి తాను కట్టలేనని తన ఇల్లు అమ్ముకుని అందరూ తీసుకోవాలని రాసి, తమకోసం వెతకవద్దు ఎవరికి కనబడం ’ అని ఉంది. బంధువుల వద్ద అడగ్గా తమవద్దకు రాలేదని చెప్పారు. అద్దంకిలోని గుండ్లకమ్మ నది ప్రాంతం అంతా వెతికారు. అయినా జాడ కనబడలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను హత్యచేసిన వ్యక్తికి జీవిత ఖైదు చినగంజాం: భార్యను హత్యచేసిన కేసులో వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు సమాచారం మేరకు బాపట్ల జిల్లా చినగంజాంలోని మహాలక్ష్మి కాలనీకి చెందిన కత్తి శ్రీనుకు తన భార్య కత్తి దుర్గ(30)తో మనస్పర్థలు వచ్చాయి. భర్తతో విభేదించి ఆమె పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు మల్లవరపు అంజయ్య, రాఘవమ్మ ఇంట్లో తన పిల్లలతో ఉంటోంది. ఈ గొడవలు మనసులో పెట్టుకున్న శ్రీను గతేడాది జూన్లో దుర్గ ఉంటున్న ఇంటికెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. మృతురాలి తల్లి మల్లవరపు రాఘవమ్మ ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ బత్తుల శ్రీనివాసరావు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండుకు పంపారు. ఇప్పటి సీఐ వై.వి.రమణయ్య దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. అనంతరం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతి కుమారి వాదనలతో ఏకీభవించిన ఒంగోలు మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి డి.రాములు నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1600 జరిమానా విధించారు. -
వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
బాపట్ల: వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వలనే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ జి.వి.రామాంజనేయులు పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల్లో ఆర్థిక శాస్త్ర విభాగం నిర్వహించిన సమావేశంలో డాక్టరు జి.వి.రామాంజనేయులు మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికై చేపట్టిన విధానాల రైతులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు ప్రభుత్వ విధానాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగివుండాలన్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మార్కెఫెడ్ జనరల్ మేనేజర్ సీహెచ్.శ్రీనివాసరావు మార్కెఫెడ్ రంగం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. డెయిరీ, ఫిషరీస్ వంటి వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికై ప్రభుత్వ నూతన విధానాలను కూలంకషంగా వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి, ఆర్థిక శాస్త్ర విభాగ ప్రొఫెసర్లు డాక్టర్ కె.ఎస్.పాల్, డాక్టర్ ఎస్.హైమజ్యోతి, డాక్టర్ కె.సుశీల, డాక్టర్ బి.అపర్ణ, డాక్టర్ వి.సీతారాంబాబు, 200 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టరు జి.వి.రామాంజనేయులు -
పొగాకు తగలబెట్టి నిరసన తెలిపిన రైతులు
నల్లబర్లీ పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ జే.పంగులూరు: నల్లబర్లీ పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రైవేటు కంపెనీలు నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయకపోవడం.. ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోకపోవడంతో నిరసనగా పంగులూరు బస్టాండ్ సెంటర్లో సోమవారం రైతులు పొగాకు పంటను తగులబెట్టి నిరసరన తెలిపారు. రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ నల్లబర్లీ కొనుగోలు చేస్తాం సాగు చేయండని రైతులను ప్రొత్సహించి సాగుచేయించిన ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు మొహం చాటేశాయని, కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు, కౌలు రైతులు సాగు చేస్తే కంపెనీలు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. నిమ్మకు నీరెత్తినట్లుగా కూటమి ప్రభుత్వం నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉందన్నారు. గత సంవత్సరం పొగాకు పంట లాభాలు దృష్ట్యా రైతులు ఎక్కువగా ఆ పంట వేసేందుకు మక్కువ చూపారని, బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో లక్షల ఎకరాల్లో సాగు చేశారన్నారు. దానికి తోడు నల్లబర్లీ ఎక్కువగా సాగు చేశారని అన్నారు. బర్లీ పొగాకును కూడా బోర్డు పరిధిలోకి తీసుకొని కొనుగోలు చేయాలన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ను, ప్రైవేటు కంపెనీల యాజమన్యాలను కూడా కలిశామన్నారు. వెంటనే పొగాకు పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్బాబు, మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. -
విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రం ప్రారంభం
మాచర్ల: పట్టణంలో విద్యుత్ బిల్లులు మొదటి అంతస్థుకు వెళ్లి చెల్లించే పనిలేకుండా గ్రౌండ్ ఫ్లోర్లోనే విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్ఈ) డాక్టర్ పత్తిపాటి విజయ్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజినల్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవా కేంద్రాన్ని ఈఈ సింగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా గ్రౌండ్ ఫ్లోర్లోనే విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఏడీఏ రామయ్య, ఏఈ కోటేశ్వరరావు, పలు మండలాల ఎఈలు పాల్గొన్నారు. అనంతరం డివిజినల్ పరిధిలో 9 మండలాలకు చెందిన డీఈలు, ఏఈలు, అసిస్టెంట్ ఇంజినీర్లు, అకౌంటెంట్ ఆఫీసర్లుతో ఎస్ఈ పి.విజయ్కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. -
40 మంది కార్మికులను తొలగించారు..
గత ఆరేళ్ల నుంచి నరసరావుపేట పుర పాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. అప్కాస్లో మా పేర్లు నమోదయ్యాయి. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తున్నాం. మేం 30రోజులు పనిచేస్తున్నా మాకు రూ.6–7వేలే చెల్లిస్తున్నారు. మాకు రూ.21వేలు జీతం రావాల్సివుంది. అదేమని మున్సిపల్ కమిషనర్ను అడిగితే మీకు వచ్చేది అంతే, మీరు బదిలీ కార్మికులు, ఇష్టమైతే చేయండి, లేకపోతే మానుకోండి అంటూ 40మందిని ఆపేశారు. మళ్లీ విధుల్లోకి తీసుకొని పూర్తిజీతం చెల్లించాలి. –షేక్ శిలార్, మున్సిపల్ కార్మికులు, నరసరావుపేట -
మందులు, పౌష్టికాహారంతో క్షయ వ్యాధి దూరం
డీఎంహెచ్ఓ డాక్టర్ రవి నరసరావుపేటటౌన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏరియా వైద్యశాలలో క్షయ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవి మాట్లాడుతూ టీబీ అంటు వ్యాధి అన్నారు. టీబీకి ప్రస్తుతం చాలా మంచి మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రెండు వారాల పాటు దగ్గు, జలుబు ఉండి తగ్గకపోతే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ వైద్యశాల్లో సంప్రదించాలన్నారు. టీబీ ఉన్నట్లు నిర్థారణ అయితే ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో 1500 కేసులు ఉన్నాయన్నారు. పోషణ కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి నెలా పౌష్టికాహారం కూడా అందజేస్తున్నామన్నారు. డెప్యూటీ డీఎంచ్హెచ్ఓ డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ గీతాంజలి పాల్గొన్నారు. -
‘పౌడా’ బడ్జెట్ అంచనాలకు ఆమోదం
జేసీ అధ్యక్షతన పౌడా ప్రత్యేక సమావేశం నరసరావుపేట: పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పౌడా) ప్రత్యేక సమావేశం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, పౌడా వైస్ చైర్మన్ గనోరే సూరజ్ ధనుంజయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా 2025–26 ఏడాదికి బడ్జెట్ అంచనాలతో పాటు జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే 2024–25 ఏడాదికి సంబంధించిన ఖర్చులతో పాటు 2025–26 ఏడాది బడ్జెట్ అంచనాలను చర్చించి ఆమోదించినట్లు పౌడా కార్యదర్శి నవీన్కుమార్ వెల్లడించారు. అనంతరం నిర్వహించిన సాధారణ సమావేశంలో వైస్ చైర్మన్ ఎనిమిది అంశాలపై చర్చించి ఆమోదం తెలియచేశారని ఆయన స్పష్టం చేశారు. దీనిలో రీజినల్ డెప్యూటీ డైరక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పి.మధుకుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ ఆర్.రాజానాయక్, జిల్లా టూరిజం అధికారి జి.నాయుడమ్మ హాజరయ్యారు. భవిత ఫిజియోథెరపిస్టులకు ఇంటర్వ్యూలు.. కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో సోమవారం జేసీ గనోరే సూరజ్ ధనుంజయ్ భవిత ప్రత్యేక స్కూళ్లలో పనిచేసేందుకు ఫిజియో థెరపిస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం నాలుగు ఖాళీలు ఉండగా ఆరుగురు హాజరయ్యారు. డీహెచ్ఎస్ డాక్టర్ బీవీ రంగారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీఈఓ ఎల్.చంద్రకళ, ఐఈబీ కో–ఆర్డినేటర్ ఆర్.సెల్వరాజ్లు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయటం జరుగుతుందని తెలిపారు. -
స్వయంకృత అపరాధాలే అవరోధాలు
పరిషత్లను నాటకరంగానికి ఊపిరి అంటారు, కానీ అవి కేవలం ఉనికిని చాటుతాయిగానీ, అభివృద్ధికి దోహదపడడం లేదు. నాటక వికాసానికి ప్రధానంగా ప్రేక్షకాదరణ అవసరం. కొన్ని పరిషత్లు తమకిష్టమైన వ్యక్తులు, సమాజాలకు ఇచ్చే ప్రాధాన్యత మిగతావారికి ఇవ్వడం లేదు. నూతనత్వం, న్యాయ నిర్ణేతల్లో లోపించిన పారదర్శకత తదితర లోపాలతో యువత ఈరంగంపై ఆసక్తి చూపడం లేదు. పోటీ నాటికల స్థానంలో నాటకోత్సవాలను నిర్వహిస్తూ, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దగలిగితే పూర్వవైభవం తథ్యం. – అద్దేపల్లి భరత్కుమార్, నాటక రచయిత, హైదరాబాద్ -
వేదికలపై ఇచ్చిన జీఓ వెనక్కి తీసుకోవాలి...
కూటమి ప్రభుత్వం స్కూళ్లలో ఉన్న రంగస్థల వేదికల వద్ద ఎటువంటి నాటక ప్రదర్శనలు ఇవ్వకూడదని జీఓ ఇవ్వడం బాధాకరం. దీనిని వెనక్కి తీసుకోవాలి. అంపశయ్యపై ఉన్న నాటక రంగాన్ని పరిషత్లే దాతల సాయంతో పునరుజ్జీవానికి కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం సినీ పరిశ్రమపై చూపే ప్రేమ నాటకరంగంపై చూపడంలేదు. రంగస్థలాన్ని విస్మరిస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఓపెన్ థియేటర్లను నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలి. కళాకారులకు అక్రిడిడేషన్తో పాటు పెన్షన్, ఇళ్లస్థలాలు మంజూరు చేసి భరోసా కల్పించాలి. – డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు, వేదిక, పుచ్చలపల్లి సుందరయ్య కళాపరిషత్ అధ్యక్షుడు, యడ్లపాడు -
విముక్తితోనే ముక్తి...
కొంతమంది సీనియర్ కళాకారుల స్వార్థ రాగద్వేషాలు తెలుగు నాటకరంగాన్ని దెబ్బతీశాయి. పరిషత్ నిర్వాహకుల చేతుల్లోంచి నియంత్రణ జారిపోవడం, రంగస్థల అభివృద్ధికి పెద్ద అవరోధం. తమ రంగస్థల ప్రయాణాన్ని విశ్లేషించుకుని, నాటక అభివృద్ధికి నిజ మైన కృషి చేసే పరిషత్లకు బాధ్యతలు అప్పగించేందుకు సీనియర్ కళాకారులు, నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు ముందుకు రావాలి. నాటక వేదికలను స్వార్థానికి కాకుండా, కళాభివృద్ధికి ఉపయోగించాలి. – గోపరాజు విజయ్, సినీ, రంగస్థల నటుడు, తెనాలి -
తాగునీటి సౌకర్యం పునరుద్ధరించండి
లింగంగుంట్ల పంచాయతీ పరిధిలోని యానాది, బోయ కాలనీలలో 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత 16ఏళ్ల నుంచి మాకు మంచినీటికి బజారు పంపులు ఏర్పాటు చేశారు. వాటి నుంచి తాగునీరు పట్టుకొని కాలం గడుపుతున్నాం. అయితే రెండు నెలల కిందట ఆ పంపులను తొలగించారు. అదేమంటే మున్సిపల్ నీరు పంచాయతీ పరిధిలోకి ఏ విధంగా ఇస్తామని అధికారులు మాట్లాడుతున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – గంగుల పెద్దిరెడ్డి, చలంచర్ల పుల్లయ్య తదితరులు, బోయకాలనీ● -
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం
జిల్లా మత్యశాఖ అధికారి సంజీవరావు విజయపురిసౌత్: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు అన్నారు. మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో మాచర్ల మండలం అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి 10 లక్షల చేప పిల్లలను సోమవారం విడుదల చేశారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వారంలో సైతం 10 లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలి వలలుతో చేపల వేట చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మత్స్య సంపదను కాపాడుకోవాలని సూచించారు. ఎఫ్డీఓ టీవీఏ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఏఓ జగదీష్, మత్స్యశాఖ తనిఖీ అధికారి వెంకట రమణ, గ్రామ మత్స్య సహాయకులు లీలావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 27న ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నరసరావుపేట: జిల్లాలోని 17 మండలాల్లోని 44 గ్రామ పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం నరసరావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 11గంటలకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 6,041 క్యూసెక్కులు విడుదలవుతోంది. నేడు గుంటూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ గుంటూరు లీగల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇ.ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. రుక్మిణీ అలంకారంలో నృసింహుడు మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీ నృసింహస్వామి సోమవారం రాత్రి రుక్మిణీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. మంగళవారం స్వామి స్థంభోద్భవం అలంకారంలో దర్శనమివ్వనున్నారు. -
నాటకం.. మనుగడ పోరాటం
● కాలంతో పోరాటం.. పూర్వవైభవానికై ఆరాటం ● ఆధునికతను ఆహ్వానిస్తూ.. ప్రయోగాలతో పయనిస్తూ.. ● ఈనెల 27న ప్రపంచ నాటక దినోత్సవం యడ్లపాడు: ప్రేమ, దుఃఖం, ఆశ, నిరాశ, విజయం, ఓటమి ఈ జీవన ఘట్టాలన్నింటినీ ఒకే వేదికపై ఆవిష్కరించే మహత్తర మాధ్యమం నాటకం. ప్రేక్షకుని మనస్సును హత్తుకునే హావభావాలు, ఆలోచనలను కదిలించే సంభాషణలు, సమాజాన్ని శుద్ధి చేసే కథావస్తువు, ఒక్క ప్రదర్శనలోనే గుండెల్ని కొల్లగొట్టే నిజజీవిత అనుభవం. ఇవన్నీ నాటక కళను విశిష్టంగా నిలబెడతాయి. కావ్యేషు నాటకం రమ్యం.. భరతముని రచించిన ‘నాట్యశాస్త్రం’ నుంచి నేటి సాంకేతిక నాటక ప్రదర్శనల వరకు ఈ రంగం ఎన్నో మార్పులను స్వీకరించింది. రాజసభల నుంచి వీధి ప్రదర్శనల వరకు విస్తరించి, యక్షగానం, కూచిపూడి, భవాయి, ఒగ్గుకథల రూపంలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తి ప్రచార సాధనంగా మారింది. పాశ్చాత్య ప్రభావంతో ఆధునిక రంగస్థల నాటకాలు ఆవిష్కృతమయ్యాయి. నయా థియేటర్లు, కొత్త కథావస్తువులు రంగ ప్రవేశం చేశాయి. ప్రయోగాత్మక ప్రదర్శనలు వెలుగులోకి వచ్చాయి. పౌరాణిక, జానపద, సాంఘికంగా రూపాంతరం చెందాయి. భారతీయ కళలు 64 ఉన్నప్పటికీ ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే రమణీయ ఆర్యోక్తితో అగ్రస్థానంలో నిలిచింది. అన్నింటికీ మూలం అదే.. టీవీ, సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ఫిల్మ్, యాడ్స్, లైవ్షోస్, సినిమాలు వంటివి ఎన్ని వచ్చినా వాటికి మూలమైన నాటకం తన జీవాన్ని కోల్పోలేదు. ఎందుకంటే తెర వెనుక నటించిన నటుడిని మనం చూసే అవకాశం లేదు, కానీ రంగస్థలం మీద తడిసిముద్దయిన భావోద్వేగాలను ప్రత్యక్షంగా అనుభవించగలగే గంభీరత నాటక కళకు మాత్రమే సాధ్యం. డిజిటల్ ప్రొజెక్షన్స్, మల్టీమీడియా ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, 3డీ లైట్ టెక్నాలజీ వంటి విభిన్న ప్రయోగాలతో నాటకం జవసత్వాలను తెచ్చుకుంటుంది. పరిషత్లు సైతం ప్రేక్షకుల్ని వేదిక వద్దకు తెచ్చేలా తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడో 1961 మార్చి 27న ప్రారంభమైన అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం, నాలుగేళ్ల కిందటే షష్టిపూర్తి చేసుకుంది. -
మోసపోయాం.. న్యాయం చేయండి
● పోలీసు పీజీఆర్ఎస్లో బాధితుల మొర ● 80 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్యపై శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులచే కుటుంబ, ఆస్తి, చోరీలు, మోసాలకు చెందిన 80 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.20లక్షలు మోసం నాకు 2019లో వాంకడావత్ వసంతరావు నాయక్ అనేవ్యక్తి ఎంపీడీఓగా పరిచయమై ప్రస్తుతం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో పనిచేస్తున్నట్లు నమ్మబలికాడు. నా మరదలు కుమారుడైన చింత దానయ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని దానికి గాను సుమారు రూ.20లక్షలు వరకు ఖర్చు అవుతుందని, ఆ డబ్బులు ఇస్తే పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని, ముందు డబ్బులు ఇస్తే తాను ప్రిన్సిపల్ సెక్రెటరీ దగ్గర నుంచి కలెక్టర్ దాకా డబ్బులు ఇచ్చుకుంటూ రావాలని ఆ తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి రూ.20లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికి ఆరేళ్లు గడిచినా ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడు. తగిన న్యాయం చేసి, మోసం చేసిన వ్యక్తిని అరెస్టుచేసి శిక్షించండి. – భీముని వెంకటరావు, వినుకొండ క్రెడిట్ కార్డుకోసం ఫోన్చేసి మోసం.. నేను పట్టణంలోని ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాను. ఓ అజ్ఞాత వ్యక్తి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు కావాలా అంటూ కాల్ చేశాడు. నాకు అవసరంలేదని చెప్పాను. జనవరి 21వ తేదీన ఓ వ్యక్తి బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పగా ఆ కాల్ కట్ చేశాను. తరువాత నా వాట్సాప్కు ఒక లింక్ పెట్టగా తెలియక ఆ లింక్ ఓపెన్ చేశా. ఆ తర్వాత నా ఫోను ఆ అజ్ఞాత వ్యక్తి కంట్రోల్ లోకి వెళ్లింది. నా బ్యాంకు అకౌంట్ ద్వారా నగదు లావాదేవీలు చేశాడు. అతనిపై సైబర్ క్రైం ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించండి. – బొడ్డపాటి వెంకటేశ్వరరావు, అల్లూరివారిపాలెం, నరసరావుపేట మండలం యాడ్ ఏజెన్సీ పేరుతో రూ.33లక్షలు కాజేశాడు నేను ఓఏల్ఎక్స్ వెబ్సైట్లో కెమెరా రోజువారీ అద్దెకు ఇస్తానని పెట్టగా, సెప్టెంబర్ నెలలో కండ్రిక గ్రామానికి చెందిన సాగర్బాబు ఆన్లైన్లో పరిచయమై మీ కెమెరాను నేను అద్దెకు ఇప్పిస్తానని, తాను సినిమాలకు స్క్రిప్ట్లు రాస్తానని, నాకు జబర్దస్త్ ప్రోగ్రాం వారు కూడా తెలుసునని, తాను అందులో పనిచేస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం కలిసి యాడ్ ఏజెన్సీ పెడదామని చెప్పి నా వద్ద నుంచి రూ.33లక్షలు ఆన్లైన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడి నుంచి స్పందన లేకపోవటంతో మోసపోయానని గ్రహించి పెద్ద మనుషులను తీసుకొని అతను వద్దకు వెళ్లగా డబ్బులు తీసుకున్న మాట నిజమేనని ఒప్పుకొని నెలకు రూ.50వేలు ఇస్తాని ఒప్పుకొన్నాడు. ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. గట్టిగా అడిగితే తిరిగి నాపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించండి. – రెడ్డిమాసు దిలీప్కుమార్, రావిపాడు, నరసరావుపేట మండలం -
పీటీ వారెంట్పై నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ
● ఈ నెల 3న ఫిరంగిపురంలో కేసు నమోదు ● రాజమండ్రి జైలు నుంచి నరసరావుపేట కోర్టుకు హాజరు ● వచ్చే నెల 4వ తేదీవరకు రిమాండ్ నరసరావుపేటటౌన్: బోరుగడ్డ అనిల్ను ఫిరంగిపురం పోలీసులు పీటీ వారెంట్పై నరసరావుపేట కోర్టులో సోమవారం హాజరు పరిచారు. అనిల్పై ఫిరంగిపురం పోలీసులు ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అతన్ని పీటీ వారెంట్పై పట్టణానికి తెచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో దూషించాడని ఫిరంగిపురంకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ అన్నమ్మ భర్త పెరికల లూర్దయ్య ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు 351(1),351(2), 351(4),352, 356(2),79 బీఎన్ఎస్, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
హద్దులు దాటుతున్న ఇసుక
కొల్లూరు: కూటమి నేతలు ఇసుకను అక్రమ మార్గంలో హద్దులు దాటిస్తున్నారు. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం ప్రాంతంలో ఉచిత ఇసుక క్వారీ ఉంది. యంత్రాలతో ఇసుకను భారీ లారీలలో నింపి దొడ్డి దారిలో బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక, కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామాల నడుమ వ్యవసాయ కార్యకలాపాలు, ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గాలు మార్గం వారి అక్రమాలకు రాచమార్గంగా మారింది. రోజుకు 100 ఇసుక లారీలు అక్రమంగా తరలివెళుతున్నాయి. బిల్లులు నిల్ నిబంధనల మేరకు రీచ్ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇతర జిల్లాల్లోకి సంబంధిత బిల్లులతో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఉచిత ఇసుక క్వారీలను దక్కించుకున్న కూటమి నాయకులు ఎలాంటి బిల్లులు లేకుండానే బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం కృష్ణా జిల్లా నుంచి నదిలోని గాలు మార్గం ద్వారా బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా జిల్లాలోకి వస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా అధిక సంఖ్యలో వాహనాలు గాజుల్లంక, పెసర్లంక, కొల్లూరు, పోతార్లంక, దోనేపూడి, కిష్కిందపాలెం, తోకలవారిపాలెం మీదుగా తరలి వెళుతున్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు మాత్రం స్పందించడంలేదు. పెసర్లంక–కొల్లూరు రహదారి పనులు జరుగుతున్న తరుణంలో ఇసుక లారీల నుంచి భారీగా కారుతున్న నీరు కారణంగా రోడ్డు మన్నిక ప్రశ్నార్ధకంగా మారుతుంది. కూలీల కడుపుకొడుతున్నారు ఉచిత ఇసుక క్వారీలలో తవ్వకాలకు కూలీలను మాత్రమే వినియోగించాలన్న నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు. ఉచిత ఇసుక క్వారీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు యంత్రాలను వినియోగిస్తున్నారు. నదిలో ట్రాక్టర్లు దిగి కూలీలతో ఇసుక నింపకుండా నది వద్ద అడ్డుగాా గుంతలు తీసి అడ్డుకుంటున్న అధికారులు పక్క జిల్లా నుంచి అక్రమ మార్గంలో 40 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నా అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదు. అధికారుల తీరుపై కార్మికులు మండి పడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక క్వారీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు తరలింపు గాలు రోడ్డే అక్రమాలకు మార్గం పట్టించుకోని అధికారులు పరిశీలించి చర్యలు.. నదిలో అక్రమ మార్గం ద్వారా జిల్లాలోకి ఇసుక రవాణాను అరికట్టే విషయంలో రూల్స్ను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. మైనింగ్ శాఖాధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి కృష్ణా నదిలో జిల్లా దాటి బిల్లులు లేకుండా వాహనాలు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలిస్తాం. – బి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు -
ఏఎఫ్డబ్ల్యూఎల్ వైస్ ప్రెసిడెంట్గా ఝాన్సీ
గుంటూరు లీగల్: ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ (ఏఎఫ్డబ్ల్యూఎల్) దక్షిణభారత ఉపాధ్యక్షురాలిగా సోమసాని ఝాన్సీ ఎన్నికయ్యారు. బెంగళూరులో ఈనెల 23న నిర్వహించిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి తెలంగాణకు చెందిన పి.రేవతి దేవిపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పోలూరు వెంకటరెడ్డి, సి.డి. భగవాన్, ఒట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, కళ్లం రమణారెడ్డి, కృష్ణారెడ్డి, పలువురు న్యాయవాదులు ఝాన్సీకి అభినందనలు తెలిపారు. ఝాన్సీ గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యురాలు కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా కె.శాంతకుమారి(తమిళనాడు) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఝాన్సీలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ భాస్కరలక్ష్మి, ప్రెసిడెంట్ అరుణ, ఈసీ సభ్యులు, గుంటూరు బార్ అసోసియేషన్ పూర్వ ప్రెసిడెంట్ పోలూరి వెంకటరెడ్డి, ప్రస్తుత ప్రెసిడెంట్ కాసు వెంకట రెడ్డి, బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మానందరెడ్డి, పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఝాన్సీ ప్రస్థానమిలా.. ఝాన్సీలక్ష్మి 2000 నుంచి న్యాయవాదిగా గుంటూరు జిల్లా కోర్ట్, హైకోర్ట్, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో పనిచేస్తున్నారు. సోమసాని బ్రహ్మానందరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. ఆమె ఆర్డీఓ ట్రిబ్యునల్ ప్యానెల్ అడ్వకేట్గా, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా, స్టాండింగ్ కౌన్సెల్ కం స్పెషల్ పీపీపీసీఆర్ సెల్కు కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఫెడరేషన్ అఫ్ ఉమెన్ లాయర్స్ అఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఝాన్సీ లక్ష్మికి ట్రెక్కింగ్ అంటే ఆసక్తి 2024 జూన్లో 53 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్కింగ్ కూడా చేశారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేత్ర సమస్యల పరిష్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: నేత్ర సంబంధ సమస్యలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో చంద్రమౌళీనగర్లో నెలకొల్పిన మెడెక్స్ హాస్పిటల్స్లో ఆధునిక నేత్ర సంరక్షణ వైద్యసేవలను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ మెడెక్స్ హాస్పిటల్స్ ద్వారా వైద్యరంగంలో అడుగుపెట్టడం శుభపరిణామమన్నారు. ప్రముఖ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మెడెక్స్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన కంటి, దంత, చర్మ, సైకాలజీ వైద్య సేవల విభాగాలను సందర్శించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి సిబ్బంది ఆయనకు వివరించారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ ఐ కేర్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23 వరకు మెడెక్స్ హాస్పిటల్స్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆస్పత్రిని ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మెడెక్స్ హాస్పిటల్స్ ఐ కేర్ యూనిట్ చీఫ్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ యర్రారపు మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
తలసేమియా ట్రాన్స్ప్యూజన్ సెంటర్ నిర్మాణం
నరసరావుపేట: పల్నాడు జిల్లాకు రెడ్క్రాస్ ద్వారా తలసేమియా ట్రాన్స్ప్యూజన్ సెంటర్ మంజూరైందని, త్వరలో ప్రారంభిస్తామని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చే తలసేమియా, హిమోఫీలియా జబ్బులున్న వారికి ప్రతినెలా ఉచితంగా రక్తాన్ని అందజేస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం పట్టణంలోని సమావేశపు హాలులో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు.‘మీ డాక్టర్ మీ ఇంటికి’ అనే ప్రాజెక్టు మంజూరైందని, దీనిని త్వరలో ప్రారంభించి జిల్లాలో గిరిజన తండాలు, మత్స్యకారుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఆర్డీవో ఆఫీస్ కాంపౌండ్లో ఉన్న 15 సెంట్లు రెడ్క్రాస్ స్థలంలో నూతన భవన నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. ఇందులో ఓల్డ్ఏజ్ హోం, స్కిల్ డెవలప్మెంటు ట్రైనింగ్ సెంటర్, ఉచిత వైద్యశాల, అనాథ శరణాలయం, జనరిక్ మెడికల్ షాప్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. రెడ్క్రాస్ బ్లడ్ సెంటర్కు ప్రస్తుత వేసవిలో రక్తకొరత ఏర్పడవచ్చని, రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేసేవారు, సంస్థ ద్వారా ప్రథమ చికిత్స శిక్షణను పొందదల్చినవారు, మెంబర్లుగా చేరేవారు 91000 78576 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. వైస్ చైర్మన్ పీవీఎం శరత్బాబు, కోశాధికారి గండ్రకోట మురళీకృష్ణ ప్రసంగిస్తూ జిల్లా రెడ్క్రాస్ ఏర్పడిన నాటి నుంచి న్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్మాణం కోసం విరాళాలు అందించిన దాతలు, సేవలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేనేజింగ్ కమిటీ సభ్యులైన శ్రీనివాస గుప్తా, డాక్టర్ సృజన, వీరారెడ్డిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు సాంబశివరావు, జీవీఎస్ రాము, డాక్టర్ రహమతుల్లా, మాజీ కౌన్సిలర్ మస్తాన్వలి, జీవితకాల సభ్యులు మేళం శ్రీకృష్ణ, హనుమంత ప్రసాద్, కాసు దశరథరామిరెడ్డి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ జగన్మోహన్రెడ్డి వెల్లడి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో నూతన కార్యాలయం ఏర్పాటు -
గతంలో ఓ సచివాలయ ఉద్యోగి అదృశ్యం
నరసరావుపేట టౌన్: కాయ్ రాజా కాయ్ అంటూ ఊరిస్తోన్న బెట్టింగ్ భూతానికి అమాయకులు బలవుతున్నారు. ఒకటికి పది రెట్లు అంటూ ఆశలు కల్పించడంతో ఆ వలలో చిక్కుకుని బయటికి రాలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఓ యువకుడు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి నాలుగు నెలల కిందట నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన యువతితో వివాహమైంది. గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసిన ఆ యువకుడు ఉద్యోగం మానేసి స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం బెట్టింగ్ యాప్లకు బానిసయ్యాడు. దీంతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందిన విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తొలుత పని ఒత్తిడితో కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. తీగలాగితే కదిలిన బెట్టింగ్ డొంక యువకుడి ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులకు దర్యాప్తులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతుడి సెల్ఫోన్, లాప్టాప్లను స్వాధీనం చేసుకుని అందులోని డేటా విశ్లేషించారు. కొంతమందికి మృతుడు తాను క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు నష్టపోయానని, సమయం ఇస్తే తిరిగి చెల్లిస్తానని ప్రాథేయపడుతూ పంపిన సందేశాలు గుర్తించారు. దీంతో బెట్టింగ్ ఊబిలో దిగి ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగుతోంది. ఐపీఎల్ నేపథ్యంలో జోరందుకున్న బెట్టింగ్లు అశల వలలో చిక్కుకుంటున్న యువత డబ్బులు పోగొట్టుకుని నవ వరుడు ఆత్మహత్య విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం ఆత్మహత్య చేసుకునేందుకు మరో యువకుడు ఇంటి నుంచి పరారీ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా రక్షించిన పోలీసులు బెట్టింగ్ అరికటడ్డంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్న పోలీసులు పోలీసులు విఫలం బెట్టింగ్ ఈ స్టాయిలో జడలువిప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా, అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బెట్టింగ్ చాపకింద నీరులా విస్తరించింది. ఏ ఇతర జిల్లాలో లేనంతమంది క్రికెట్ బకీలు పట్టణంలో ఉండటం గమరార్హం. పోలీసులు పట్టించుకోకపోవడంతో జడలు విచ్చుతోంది. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు వచ్చిన కొన్నే. జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి కూకటి వేళ్లతో పెకలించకపోతే ప్రస్తుత ఐపీఎల్లో మరెన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో యువకుడు పట్టణంలోని ప్రకాశ్నగర్కు చెందిన ఓ యువకుడు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లో పని చేస్తున్నాడు. అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ బెట్టింగ్లో డబ్బులు పందెం కట్టాడు. అవి పోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఇంట్లో విషయం తెలియజేసి తనకు డబ్బులు కావాలని కోరాడు. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెల్ఫోన్ లోకేషన్ ఆధారంగా అతన్ని గుర్తించి ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. విచారణలో క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఏం చేయాలో తెలియక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆ యువకుడు తెలిపాడు. రెండు నెలల కిందట గురజాల నియోజకవర్గానికి చెందిన ఓ సచివాలయ ఉద్యోగి సామాజిక పింఛన్ డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్లో పెట్టాడు. తెల్లవారేసరికి అధిక మొత్తం అవుతాయని ఆశకు పోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఒకటో తేదీ ఉదయం నగదు పంచకుండా అదృశ్యమయ్యాడు. అనంతరం ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తానని, ఉద్యోగం ఇస్తేనే తమ భార్యాపిల్లలు బతికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇలా బెట్టింగ్ వ్యసనానికి బానిసై నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. -
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం వారు కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు. ఎద్దు వాగుపై బిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన రాజుపాలెం: మండలంలోని మొక్కపాడు గ్రామ సమీపాన ఎద్దువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బిడ్జిని రూ.5.66 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు దుర్గేష్రావు, ఎంపీడీవో జీవీ సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలైన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల లయోలా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు సమీపంలోని నల్లపాడుకు చెందిన 25 మంది నాగార్జునసాగర్ వెళ్లి మొక్కు తీర్చుకొని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. వయోజన విద్య, రాత్రి బడి పరిశీలన తాడికొండ: తాడికొండ మండలంలో నిర్వహిస్తున్న వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాలను ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని నాలుగు కేంద్రాలను పరిశీలించిన వారు వయోజన విద్య, రాత్రి బడి కార్యక్రమం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 50 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 510 మంది చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్య ద్వారా డాక్రా సంఘాల మహిళలు నేర్చుకున్న అక్షరాలు, విద్యపై పరీక్ష నిర్వహించి, వాటిని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అడల్ట్ ఎడ్యుకేషన్ బ్యూరో కన్సల్టెంట్ అధికారి జగన్మోహన్రావు, సభ్యులు ఓంకారం, శిరీష, దాసరి వెంకటస్వామి ఎంపీడీవో కె. సమతావాణి, ఏపీఎం సాంబశివరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ సంఘ జిల్లా అధ్యక్షుడిగా కోటయ్య
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా మార్పు కోటయ్య ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అసోసియేట్ అధ్యక్షులుగా మైల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి.కొండలరావు, కె.రజని, జనరల్ సెక్రెటరీగా ఎం.లక్ష్మణరావు, జాయింట్ సెక్రెటరీగా ఆర్.కోటేశ్వరరావు, పాతపాటి రమేష్, ట్రెజరర్గా ిసీహెచ్.అనూష, ప్రెస్ సెక్రటరీగా ఎం. కోటేశ్వరరావు, పి.రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ిసీహెచ్.ఆంజనేయులు, ఎన్.రవిశంకర్, కోటి శ్రీనివాసరావు, జె.విమలను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నిౖకైన కమిటీని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి అభినందించారు. న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.6లక్షలకు పెంపు గుంటూరు లీగల్: న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో న్యాయవాదులు అనారోగ్యానికి గురైప్పుడు రూ.లక్షగా ఉన్న మెడికల్ బెనిఫిట్స్ రూ.1.50 లక్షలకు పెంచుతున్నట్లు తీర్మానించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. యాక్సిడెంట్ డెత్ జరిగితే బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్తో సంబంధం లేకుండా రూ.5 లక్షలు ఇచ్చే విధంగా తీర్మానించింది. ఇది మే 1 నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించింది. లవ్ యువర్ ఫాదర్ చిత్ర బృందం సందడి నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలో లవ్ యువర్ ఫాదర్ (ఎల్వైఎఫ్) చిత్ర బృందం సందడి చేసింది. వచ్చేనెల 4న ఎల్వైఎఫ్ చిత్రం విడుదలకానుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చిత్ర ిహీరో శ్రీహర్ష, నటులు బంటి, శ్రీకర్, నిర్మాత కిషోర్ రాఠీ బృందం చేరుకుంది. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం నటుడు శ్రీహర్షను ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య సత్కరించి, చిత్ర బందానికి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్ర హీరో శ్రీహర్ష మాట్లాడుతూ వచ్చే నెల 4న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లల్లో వీక్షించాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లా డుతూ చిత్ర టైటిల్ లవ్ యువర్ ఫాదర్ బాగుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఫాదర్స్ డే రోజునే కాకుండా తండ్రిని ప్రతి నిత్యం ప్రేమించాలని అన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేత్ర సమస్యల పరిష్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: నేత్ర సంబంధ సమస్యలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో చంద్రమౌళీనగర్లో నెలకొల్పిన మెడెక్స్ హాస్పిటల్స్లో ఆధునిక నేత్ర సంరక్షణ వైద్యసేవలను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ మెడెక్స్ హాస్పిటల్స్ ద్వారా వైద్యరంగంలో అడుగుపెట్టడం శుభపరిణామమన్నారు. ప్రముఖ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మెడెక్స్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన కంటి, దంత, చర్మ, సైకాలజీ వైద్య సేవల విభాగాలను సందర్శించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి సిబ్బంది ఆయనకు వివరించారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ ఐ కేర్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23 వరకు మెడెక్స్ హాస్పిటల్స్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆస్పత్రిని ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మెడెక్స్ హాస్పిటల్స్ ఐ కేర్ యూనిట్ చీఫ్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ యర్రారపు మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
నిరాధార వార్తలు పోస్టు చేస్తే కఠిన చర్యలు
గుంటూరు రూరల్: సామాజిక మాధ్యమాల్లో నిరాధార వార్తలను పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సౌత్ సబ్ డివిజన్ డీఎిస్పీ ఎ. భానోదయ తెలిపారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో డీఎస్పీ మాట్లాడారు. ప్రజా రిపోర్టర్ అనే వాట్సాప్ గ్రూప్లో 9640128296 అనే ఫోన్ నంబర్ కలిగిన వ్యక్తి గుంటూరు పోలీసుల అదుపులో దళిత జర్నలిస్టు? మూడు రోజులైనా ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదని పోస్టును వైరల్ చేసినట్టు వివరించారు. వాస్తవానికి దళిత జర్నలిస్టులెవరినీ అరెస్టు చేయలేదని డీఎస్పీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం తెచ్చి విక్రయిస్తున్న కేసులో మార్చి 22న తెల్లవారు జామున కూరపాటి విజయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అదే రోజు మధ్యాహ్నం న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని, అతనికి న్యాయమూర్తి రిమాండ్ విధించారని వెల్లడించారు. అసత్య పోస్టును పెట్టిన వ్యక్తిపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. సౌత్ డీఎస్పీ భానోదయ -
గ్రానైట్ రైట్..రైట్ !
సాక్షి, టాస్క్ఫోర్స్: జీరో బిల్లులతో వెళ్తున్న గ్రానైట్ లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించడాన్ని కూటమి నేతలు ఆదాయంగా మార్చుకున్నారు. ఇందుకోసం సిండికేట్గా మారి అక్రమార్జనకు తెరలేపారు. ఇందులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసు అధికారులు కూడా భాగస్వామ్యం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పిడుగురాళ్ల, పొందుగల మీదుగా ఓ సిండికేట్ బృందం లారీలను తెలంగాణ వరకు దాటిస్తోంది. కొత్తగా మరో సిండికేట్ బృందం వీరికి పోటీగా తయారైంది. గత నెల రోజులుగా గ్రానైట్ లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే పనిలో ఉన్నాయి. కారంపూడి, మాచర్ల, నాగార్జునసాగర్ మీదుగా జీరో బిల్లు దందా నిర్వహిస్తూ లారీలను తెలంగాణ దాటిస్తున్నారు. పల్నాడులోకి ప్రవేశించినప్పటి నుంచి జిల్లా దాటే వరకు వారే బాధ్యత తీసుకుంటున్నారు. అందుకు గానూ పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రవాణాశాఖ, మైనింగ్, జీఎస్టీ అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నకిరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లిలో అప్పుడప్పుడు ఒకటీ ఆరా కేసులు బుక్చేసి ‘మమ’ అనిపిస్తున్నారు. పెద్ద మొత్తంలో అధికారులకు మామూళ్లు వెళ్లడంతో మిన్నుకుండిపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. దీంతో గ్రానైట్ సిండికేట్లు రెచ్చిపోతున్నాయి. ఎమ్మెల్యే బంధువు కీలకపాత్ర నాగార్జున సాగర్ మీదుగా అక్రమ గ్రానైట్ లారీలను తరలించడంలో కీలకపాత్ర మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి కుమారుడి వరుసయ్యే జూలకంటి అక్కిరెడ్డి, టీడీపీ నాయకుడు అనిల్ వహిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ నేతలే మాచర్లలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు. తాను అవినీతి చేయనని, కార్యకర్తలను సైతం చేయించనని గొప్పలు చెప్పే జూలకంటి బంధువుతో ఎలా గ్రానైట్ అక్రమ రవాణా చేయిస్తున్నాడంటూ సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ గ్రానైట్ లారీని కారంపూడి ఎస్ఐ అడ్డుకోగా నేరుగా అక్కిరెడ్డే రంగంలోకి దిగారు. బిల్లులు లేని గ్రానైట్ లారీని విడిపించి అతని ఆధ్వర్యంలో సాగర్ దాకా తీసుకెళ్లి సరిహద్దు దాటించినట్టు తెలుస్తోంది. లారీకి రూ.15 వేలు తీసుకొని జిల్లా దాటిస్తున్నట్టు సమాచారం. నాగార్జున సాగర్ మీదుగా అక్రమ రవాణా లారీకి రూ.15 వేలు తీసుకొని రాష్ట్రం దాటిస్తున్న సిండి‘కేటు’గాళ్లు మాచర్ల ఎమ్మెల్యే బంధువు, ఓ ఎస్ఐ దగ్గరుండి అక్రమ రవాణా కారంపూడి నుంచి సాగర్ వరకు తరలించే బాధ్యత వీరిదే.. ఎమ్మెల్యే హస్తం లేకపోతే ఎందుకు అడ్డుకోలేదంటూ విమర్శలు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలం రోజూ రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి -
ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అర్జిత సేవల్లో ఉభయదాతలు తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్లో వేచిఉన్న భక్తులకు ముఖ మండప దర్శనానికి అనుమతించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా దేవస్థానం ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్ క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ఆలయ ప్రాంగణంతో పాటు మహామండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్రోడ్డులో దేవస్థానం భక్తులకు మంచినీటిని సరఫరా చేసింది. దర్శనం పూర్తయిన భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ చేసింది. -
సీపీఐ నేత జేబీ శ్రీధర్ మృతి
బాపట్ల: కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకై న పాత్ర పోషిస్తున్న జేబీ శ్రీధర్ (69) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. ఆయన వినుకొండంలో జన్మించారు. సీపీఐ సానుభూతిపరులైన తల్లిదండ్రులు ఆనందరావు, మార్తమ్మల పోరాట లక్షణాలను అలవర్చుకుని విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఐదు దశాబ్దాలపాటు వామపక్ష సిద్ధాంతాల వ్యాప్తికి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో కృషి చేశారు. 12 ఏళ్లపాటు విశాలాంధ్ర జర్నలిస్టుగా పని చేశారు. బాపట్లలో జరిగిన వామపక్ష ఉద్యమాల్లో శ్రీధర్ కీలక పాత్ర పోషించారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా ఉద్యమమే ఊపిరిగా జీవితం గడిపారు. శ్రీధర్ మృతిపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జల్లి విల్సన్, జంగాల అజయ్కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ తదితరులు శ్రీధర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి కోన రఘుపతి కూడా శ్రీధర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యేలు చీరాల గోవర్ధనరెడ్డి, గాదె వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కోకి రాఘవరెడ్డి, కాగిత సుధీర్బాబు, జోగి రాజా, కొక్కిలిగడ్డ చెంచయ్య తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. -
సమాజాభివృద్ధికి హేతుబద్ధ ఆలోచనలు దోహదం
నరసరావుపేట ఈస్ట్: సమాజాభివృద్ధికి హేతుబద్ధ ఆలోచనలు, ఆచరణలు దోహదపడతాయని వక్తలు స్పష్టం చేశారు. హేతువాద సంఘం కార్యాలయంలో ఆదివారం పల్నాడు జిల్లా సంఘం ద్వితీయ మహాసభలు నిర్వహించారు. మతం–సైన్స్ అంశంపై ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షుడు కరణం రవీంద్రబాబు మాట్లాడారు. మనుష్యుల్లో ఆలోచనా శక్తిని మ తాలు ముందుకు సాగనీయవని తెలిపారు. మతాలు విశ్వాసాలతో ముడిపడి ఉండగా, సైన్స్ సత్యాన్వేషణ చేస్తుందని స్పష్టం చేశారు. హేతుబద్ధంగా మాట్లాడినందుకు కోపర్నికస్, గెలీలియో, బ్రూనో వంటి వారిని మతపెద్దలు వేధింపులకు గురి చేశారని తెలిపారు. విశ్వ తత్వం– జీవతత్వం అంశంపై భారత హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ మాట్లాడారు. విశ్వానికి ఆది, అంతాలు లేవని స్పష్టం చేశారు. మానవుడు సహజ సహేతుకంగా ఆలోచించే జీవి కావడంతో ఇంతటి అభివృద్ధిని సాధించాడని వివరించారు. సాయంత్రం నిర్వహించిన అధ్యయన తరగతుల్లో నిత్యజీవితంలో హేతువాదం అంశంపై ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ దరియావలి మాట్లాడారు. మూఢ విశ్వాసాలను ప్రశ్నించాలని తెలిపారు. డాక్టర్ గుమ్మా రచించిన హేతువాద, మానవతావాద తత్వవేత్త రావిపూడి వెంకటాద్రి గ్రంథాన్ని ఈదర గోపీచంద్ ఆవిష్కరించగా, రవీంద్రబాబు సమీక్షించారు. నూతన కార్యవర్గం ఎంపిక ఈ సందర్భంగా జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బి.పి.వి. సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా కట్టా సుబ్బారావు, ఉపాధ్యక్షునిగా వి.ఎస్.ఎస్. మూర్తి, సహాయ కార్యదర్శిగా షేక్ చినమస్తాన్, కోశాధికారిగా ఈదర గోపీచంద్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఘనంగా జిల్లా హేతువాద సంఘం ద్వితీయ మహాసభలు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక -
కార్యకర్తలందరికీ వైఎస్సార్ సీపీ అండ
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అంజినీపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కిరెడ్డిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. టీడీపీ మూకలు దాడి చేయడం దుర్మార్గమని, ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, గెలుపు, ఓటములు సహజమని పేర్కొ న్నారు. రేపు అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని, అది గుర్తుపెట్టుకొని టీడీపీ నాయకులు వ్యవహరించాలని తెలిపారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యులు విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, పట్టణ, మండల కనీనర్లు చింతా వెంకట రామారావు, చల్లా పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అల్లు పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డి, కత్తెరపు రామ్గోపాల్రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ కాలే మాణిక్యరావు, పట్టణ యూత్ అధ్యక్షులు మందా సుధీర్, వైస్ ఎంపీపీ సాతులూరి బాబు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తుమ్మలచెరువు గ్రామం వద్ద ఆదివారం జరిగింది. వాహనం ఆచూకీ తెలియలేదు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. స్థానికులు సమాచారం మేరకు 108 సిబ్బంది నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒంటిపై పచ్చ రంగు గీతల చొక్కా ధరించి ఉన్నాడు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సంప్రదించాలని పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని అలవలపాడు గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు.. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన దంపతులు తేళ్ల యోహోషువా, ఏసురత్నం ఆదివారం తిమ్మసముద్రం గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు బైకుపై బయలుదేరారు. జాతీయ రహదారి నుంచి అలవలపాడు వైపు తిరిగాక గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రేమ పెళ్లి చేసుక్ను మూడేళ్లకే బలవన్మరణం ! వివాహిత అనుమానాస్పద మృతి తాడేపల్లి రూరల్: ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కుంచనపల్లిలో జరగింది. బంధువుల కథనం ప్రకారం.. కుంచనపల్లికి చెందిన నల్లపు సంజీవరావు, విజయ కుమారి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె కుక్కమల్ల సౌందర్య (26) 2022లో అదే గ్రామానికి చెందిన రాజును ప్రేమించింది. పెద్దలను ఎదిరించి ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అదే గ్రామంలో భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే ఇటీవల సౌందర్యను రాజు, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నట్టు సమాచారం. శనివారం రాత్రి భర్త వేధిస్తున్నాడంటూ తండ్రి సంజీవరావుకు సౌందర్య ఫోస్ చేసింది. ఆదివారం ఉదయం బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి సంజీవరావు, కుమారులు సౌందర్య నివాసానికి వెళ్లిగా అప్పటికే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు వెళ్లగా సౌందర్య మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త, అతని తరఫు కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తన కుమార్తె సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సంజీవరావు విలపిస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముస్లింలను వంచించిన కూటమి ప్రభుత్వం
నాదెండ్ల: ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు కూటమి ప్రభుత్వం మద్దతునివ్వడం అన్యాయమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని ద్రోహం చేశారని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి మోసం చేసిందని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, నితీష్కుమార్ మద్దతు తెలిపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు బహిరంగ ప్రకటన చేయడం ముస్లింలపై వారికున్న కపట ప్రేమను తేటతెల్లం చేసిందని తెలిపారు. ముస్లింలకు అండగా నిలుస్తామన్న మాటకు కట్టుబడి ఉంటే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయాలని షేక్ బాజీ డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లుపై చిత్తశుద్ధి ప్రకటించకపోతే భవిష్యత్తులో ముస్లింల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ వక్ఫ్ బిల్లుకు మద్దతు అన్యాయం -
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
మోసం చేసి డబ్బుతో పరారైన నిందితుడి అరెస్ట్
మాచర్ల: పొలం రిజిస్ట్రేషన్కు ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని ఉడాయించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజు రిమాండ్ విధించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రభాకరరావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ గ్రామానికి చెందినా బండెల నరసింహా రెడ్డికి దుర్గి మండలంలోని, ముటుకూరు గ్రామ శివారులో 6.88 ఎకరాల పొలం ఉంది. దీన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా మాచర్ల టౌన్కు చెందిన చింతా శ్రీనివాసరావు పరిచయం అయ్యాడు. 2022లో పొలం అమ్మకం విషయంలో చిత్తూరు జిల్లాకు చెందిన మైలా మల్లేష్ యాదవ్, సదరు మధ్యవర్తిగా ఉన్నాడు. నరసింహారెడ్డి తన పొలాన్ని దుర్గి మండలానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లుకు రూ.70.50 లక్షలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అడ్వాన్సుగా రూ.45 లక్షలు మాదాసు వెంకటేశ్వర్లు, మల్లేష్ యాదవ్కి ఇచ్చారు. అందులో రూ.15 లక్షలు తన వద్ద పెట్టుకొని రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాతే ఇస్తాను అని మల్లేష్ యాదవ్ నమ్మించాడు. అది నమ్మి నరసింహారెడ్డి మార్చి 15న తన పొలంలో మాదాసు వెంకటేశ్వర్లు పేరిటా రిజిస్ట్రేషన్ చేశాడు. నిందితుడి తన వద్ద ఉన్న ఫిర్యాదికి చెందిన రూ.15 లక్షలు, మాదాసు వెంకటేశ్వర్లు వద్ద నుంచి రావాల్సిన రూ.25.50 లక్షలు మొత్తం రూ.40.50 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి పరిపోయాడు. నిందితుడికి ఫిర్యాది ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించక పోవడంతో మోసపోయినట్లు గ్రహించి సదరు విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ పి.ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సంధ్య రాణి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నగదు రికవరీ చేసి మాచర్ల కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. డబ్బు రికవరీ 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకరరావు -
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రవి నరసరావుపేట: ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని ప్రజలందరూ ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటూ వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి.రవి కోరారు. ఈ మేరకు శనివారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియాకు వివరించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక, పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉంటే వడదెబ్బ తగిలినట్లుగా భావించాలని చెప్పారు. అటువంటి వారిని నీడగా ఉన్న చల్లటి ప్రాంతానికి వెంటనే చేర్చాలని, తడి గుడ్డతో శరీరం రుద్దుతూ ఉండాలని, ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం తుడవాలని అన్నారు. శరీర ఉష్ణోగ్రత 101– డిగ్రీస్ కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలని, వడదెబ్బకు గురైనవారు సాధారణ స్థితికి రాకుంటే వారిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు. రక్షణ ఇలా... ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలని, నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకోవాలని, వీలైనంతవరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించాలని సూచించారు. దాహం వేయకపోయినా తరచుగా నీటిని తాగుతూ ఉండాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్ఎస్ కలిసిన నీటిని తాగవచ్చునని చెప్పారు. మంచినీరు ఎక్కువ సార్లు తాగాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాస్ మంచి నీరు, ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు లేదా చల్లని నీరు తాగాలని, తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరగటం లాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుణ్ణి సంప్రదించి ప్రాతమిక చికిత్స పొందాలని అన్నారు. సూర్యకిరణాలు, వేడిగాలికి శరీరంపై పడకుండా ఉంచుకోవాలని, సూర్యకాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదని, నలుపు రంగు దుస్తులు మందంగా ఉండే దుస్తులు ధరించకుండా ఉంటే మంచిదని అన్నారు. ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకొన కూడదని అన్నారు. శీతలపానీయం, మంచుముక్క వంటివి తీసుకొంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. -
నోటి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలి
పెదకాకాని: ప్రభుత్వం ఆధ్వర్యంలో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ టి.కృష్ణబాబు అన్నారు. ఓరల్ మెడిసిన్, ఓరల్ పథాలజీ, ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా నోటి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలన్నారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని సిబార్ దంత వైద్య కళాశాల గత రెండు రోజులుగా జరిగిన జాతీయ దంత వైద్య సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సుకు సిబార్ కళాశాల డీన్ డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాన్ఫరెన్స్ను ప్రారంభించారు. అంతర్జాతీయ ఓరల్ పథాలజీ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కె.రంగనాథన్ గౌరవ అతిథిగా విచ్చేశారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ స్వాగతోపన్యాసం చేశారు. డాక్టర్ టి.కృష్ణబాబు మాట్లాడుతూ సిబార్ దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో జాతీయ దంత వైద్య సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఓరల్ క్యాన్సర్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, ఓరల్ మెడిసిన్, రేడియాలజీ, ఓరల్ సర్జరీ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు వక్తలుగా విచ్చేసి వారి అనుభవాలను తెలియజేశారు. ఈ కాన్ఫరెన్స్కు దేశ నలుమూ లల నుంచి 500 వరకు ఓరల్ మెడిసిన్, ఓరల్ పథాలజీ, ఓరల్ సర్జరీ నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నా రు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఓరల్ మెడి సిన్ అండ్ రేడియాలజీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ కృష్ణ, కార్యదర్శి డాక్టర్ శివ ప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ అవినాష్ తేజన్వి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సమత, ట్రెజరర్ డాక్టర్ సేతు మంజూష, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు నాయక్, సిబార్ దంత వైద్య కళాశాల డీన్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ టి.కృష్ణబాబు సిబార్లో జాతీయ దంత వైద్య సదస్సు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో యడ్లపాడు మండలం వంకాయలపాడుకు చెందిన వ్యక్తి మృత్యువాత పడిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు.. మండలంలోని వంకాయలపాడుకు చెందిన లారీ డ్రైవర్ షేక్ మస్తాన్వలి(62) మూడు రోజుల కిందట వైజాగ్కు లోడు తీసుకుని వెళ్లాడు. వైజాగ్ నుంచి ఐరన్ లోడ్తో తిరుగు ప్రయాణంలో ఉన్న లారీ, శుక్రవారం అర్ధరాత్రి అనకాపల్లిలో మరో లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసం కాగా, మస్తాన్వలి నడిపే లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జ కావడంతో మస్తాన్వలి డ్రైవర్ సీట్లోనే ఇరక్కుపోయాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితం భార్యను కోల్పోయిన మస్తానన్వలి, ఇద్దరు సంతానంలో ఒక కుమార్తె కూడా కొద్దికాలం కిందట మృతి చెందింది. ప్రస్తుతం మరో కుమార్తె, అల్లుడు వంకాయపాడు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. డ్యూటీకి అని వెళ్లిన తన తండ్రి విగతజీవిగా మారాడన్న వార్త విన్న కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించింది. కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి అచ్చంపేట: కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కోగంటివారిపాలెంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు మండలంలోని ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట జయరావు, సరోజినీల కుమారుడు రామ్కుమార్ (28) తన స్నేహితులతో కలసి శనివారం సాయంత్రం 5గంటల సమయంలో సమీపంలోని కృష్ణానదిలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే నది లోతుల్లో జారి పడిపోయినట్లు తెలిసింది. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలుపుతున్నారు. రామ్కుమార్ ఇటీవలనే వైద్యునిగా అర్హతపొంది గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అసిస్టెంట్ వైద్యునిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కుమారుడు అకస్మాతుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీసుస్టేషన్లో ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. చెట్టును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి మాచవరం: ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన నంద్యాల శివయ్య(65) వ్యక్తిగత పనులు ముగించుకొని బ్రాహ్మణపల్లి వైపు నుంచి గంగిరెడ్డిపాలెం వస్తుండగా ద్విచక్ర వాహనం టైరు పంక్చర్ కావడంతో బైక్ అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో శివయ్య ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు ఎమ్మెల్యే ఒత్తిడితోనే అంటున్న కుటుంబ సభ్యులు పట్నంబజారు: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు నమోదయింది. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్, సయ్యద్ ఫిరోజ్లు అన్నదమ్ములు. వీరిపై గత ఎనిమిది సంవత్సరాలుగా రౌడీషీట్ ఉంది. ఈక్రమంలో గత కొద్దిరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన తూర్పు ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్కు వీరికి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై వీరు దాడికి యత్నించారు. గతంలో నుంచే టీడీపీలో నసీర్ అహ్మద్, ఇంతియాజ్ కుటుంబీకుల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇంతియాజ్, ఫిరోజ్ల సోదరుడు ముజీబ్ కూడా టీడీపీ తూర్పు నియోజకవర్గ సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో వీరిమధ్య వివాదాలు మరింత ముదిరాయి. వివాదం విషయాన్ని మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉద్దేశ్యపూర్వకంగా వీరిపై పీడీ యాక్టు పెట్టించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి అదును కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే వీరికి ఉన్న రౌడీషీట్లను అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో పీడీ యాక్టుతో పావులు కదిపారనే ఆరోపణలు లేకపోలేదు. పీడీ యాక్టు నమోదైన ఇంతియాజ్, ఫిరోజ్లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లిన నేపధ్యంలో వారు పరారీలో ఉన్నారని తెలిసింది. ఈ నేపధ్యంలో వారు టీడీపీ అగ్ర నాయకత్వాన్ని కలిసి విషయాన్ని వారికి దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లుసమాచారం. సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాలి కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గుంటూరు ఎడ్యుకేషన్: భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి అన్నారు. శనివారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేసిన భవన్స్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ రామలింగశాస్త్రి మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక జీవనంలో మన పురాతన కళలైన సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి కనుమరుగవుతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో భారతీయ విద్యా భవన్స్ ముందుకు వచ్చి సంస్కృతి, లలిత కళల అకాడమీని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి బాల్యం నుంచే సంగీతం, నాట్యం, సాహిత్యం, గానం, చిత్ర లేఖనంవంటి కళలు నేర్చుకొని అద్భుత ప్రతిభావంతులుగా రాణించాలన్నారు. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ లలిత కళలు మన భారత జీవన గమనంలో భాగమని, పాశ్చాత్య దేశాలు పుట్టక మునుపే మన దేశంలో నలంద, తక్షశిలా వంటి విశ్వవిద్యాలయాల్లో సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి అనేక కళల్లో శిక్షణా తరగతులను నిర్వహించి, భావితరాలకు అద్భుత కళారూపాలను అందించారని తెలిపారు. భారతీయ విద్యా భవన్స్ కార్యదర్శి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ అనేకమంది ప్రఖ్యాత కళాకారులకు జన్మభూమి అయిన గుంటూరులో అకాడమీను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వేదాంతం రామలింగేశ్వర శాస్త్రి చేతులమీదుగా అకాడమీ లోగోని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ సంగీత నాటక పాఠశాల ప్రిన్సిపాల్ మార్టూరు హరిబాబు, శ్రీసాయి మంజీరా ఆర్ట్ అకాడమీ కార్యదర్శి కాజా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి శేషు రాణిని సన్మానించారు. సాహితీ సమాఖ్య కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యా భవన్ కోశాధికారి రామ్ సుభాష్, హిందూ కళాశాల తెలుగు విభాగాధిపతి ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ హేమాంబ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసుల్లో సున్నితత్వం అవసరం
గుంటూరులీగల్: పోక్సో చట్టం ప్రకారం బాధితులకు ఎలాంటి సహాయం అందించాలి, ఇటువంటి కేసులలో సున్నితత్వం అనేది ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శనివారం గుంటూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గుంటూరు పోక్సో కోర్ట్ న్యాయమూర్తి ఏ అనిత మాట్లాడుతూ బాధిత మహిళా, చైల్డ్ కానీ న్యాయం కోసం కేసు ఫైల్ చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించినపుడు నేరం చేసిన వారికి శిక్ష విధించి బాధితులకు న్యాయం చేయగలమని వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) గుంటూరు సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ కేసుల్లో బాధితులకు నల్సా పరిహార పథకం, లైంగిక దాడులకు గురైన వారికి రక్షణ పథకం 2012 ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహార పథకం 2015 ద్వారా పరిహారం ఎలా పొందవచ్చునో వివరించారు. గుంటూరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.విజయలక్ష్మి, ట్రైనీ న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, పోలీస్ సిబ్బంది, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నదుల సంరక్షణ ముఖ్యం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గుంటూరు సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ హిమనీ నదుల సంరక్షణ అనేది చాలా ముఖ్యమని అన్నారు. బొగ్గు, చమురు వనరులను తగ్గించి సహజ వనరులకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నీరు లేక ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రాబోవు తరాలకు నీటి విలువను తెలియజేయాలన్నారు. ప్రధానన్యాయమూర్తి పార్థసారథి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వలన పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. అన్ని అవసరాలకు మున్సిపల్ వాటర్ వాడుకొని తాగునీటికి మినరల్ వాటర్ వాడుతున్నామని, ఖాళీ స్థలాల్లో ఇళ్లు నిర్మించడం, మొక్కలను పెంచకపోవడం ప్రపంచం బాగుండాలంటే ఇప్పటి తరం అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి నీటిని సంరక్షించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గుంటూరు ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఎండీ నజీనా బేగం, గుంటూరు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ బి.ఆదిశేషయ్య, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఔషధ దుకాణాలపై కొనసాగుతున్న దాడులు
నరసరావుపేటటౌన్: మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఔషధ దుకాణాలపై చేపట్టిన ఆపరేషన్ గరుడ బృందం తనిఖీలు నరసరావుపేటలో రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. పల్నాడు జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి డి.సునీత ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్, ఏఈఈ శివనారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, సీఐ పి.రామకృష్ణ పట్టణంలోని బరంపేట్లో గల భవ్యశ్రీ మెడికల్ దుకాణానికి సంబంధించి భారీ స్థాయిలో ఔషధాలను అన్ లైసెన్సుడ్ గోదాంలో నిల్వ ఉంచినట్టు గుర్తించారు. ఈ మేరకు అక్కడ తనిఖీలు చేపట్టి రూ.18,40,000 విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు సునీత తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఎన్డీపీఎస్కు సంబంధించి, కాల పరిమితి దాటిన ఔషధాలు, ఫిజిషియన్ శాంపిల్స్ లభించలేదన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగల్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, పోలీసు శాఖలతో కూడిన సంయుక్త బృందం దాడులను నిర్వహిస్తుందన్నారు. హై యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే మాత్రలను వైద్యుని చీటీ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హోల్ సేల్ ఏజెన్సీలు, రిటైల్ మెడికల్ షాపులు కొనుగోలుకు సంబంధించి రసీదులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. అందులో ఎవరైనా పరిమితికి మించి భారీ స్థాయిలో మత్తు బిళ్లలు కానీ, హై యాంటిబయాటిక్స్ కానీ కొనుగోలు చేసినట్లు, డాక్టర్ చీటీ లేకుండా విక్రయించినట్లు పసిగడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
బాజీబాబా దర్గాను సందర్శించిన హైకోర్టు జడ్జి
పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విద్యావతి శనివారం పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించారు. పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి విద్యావతికి సిబ్బంది దర్గా మర్యాదలతో స్వాగతం పలికారు. దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేసిన న్యాయమూర్తి అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దర్గా సిబ్బంది న్యాయమూర్తి విద్యావతిని శాలువాతో సత్కరించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉరుసు మహోత్సవం జరగనున్న నేపధ్యంలో రూ.5వేల నగదు విరాళంగా అందజేసినట్లు దర్గా సిబ్బంది తెలిపారు.28 అర్జీలు స్వీకరణ నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఎస్సీ, ఎస్టీ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 28 అర్జీలను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు స్వీకరించారు. తక్షణమే సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాల వారి సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోని ప్రతినెలా నాల్గవ శనివారం ప్రత్యేక పీజీఆర్ఏస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆయా వర్గాల ప్రజలు ఉపయోగించుకోవాలి అన్నారు. జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ,, డీఆర్వో ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్లోనే సహకార సంఘాల లావాదేవీలునరసరావుపేట: ఇకపై సహకార సంఘాలలో అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా శనివారం జిల్లా సహకార బ్యాంక్ ఆవరణలో పీఏసీలు, సీఈవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వాణిజ్య బ్యాంక్ల మాదిరి సహకార సంఘాలు పనిచేయాలన్నారు. అవసరమైతే తగిన ఫర్నిచర్ సమకూర్చుకోవాలని తెలిపారు. సభ్యులకు ఆన్లైన్ సేవలు అందించాలని చెప్పారు. గో లైవ్కు వెళ్లిన అన్ని పీఏసీలు ముందుగా నెట్వర్క్ పనితీరును పరీక్షించుకోవాలని చెప్పారు. సభ్యుల డేటా సరిగ్గా నమోదైందో లేదో లాగిన్ చేసి పరిశీలించుకోవాలని కోరారు. సిబ్బందిలో అవసరమైన వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సిస్టమ్ ఆడిట్లో భాగంగా అన్ని మాడ్యూల్స్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలని సూచించారు. రియల్ టైం ఎంట్రీ ప్రారంభించాలని, ఏ రోజుకుకారోజు ఆన్లైన్ లావాదేవీలు సక్రమంగా చేస్తూ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో 59 పీఏసీలకుగాను 38 పీఏసీలలో గో లైవ్కు వెళ్లిన సీఇవోలు, జిల్లా సహకార ఆడిట్ అధికారి డి. శ్రీనివాసరావు, బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాధాన్యత అంశాలపై నివేదికలివ్వండి
నరసరావుపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాల నివేదికలను తక్షణం సమర్పించాలని కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించనున్న కాన్ఫరెన్స్ సందర్భంగా శనివారం ఆయన కార్యాలయంలో అన్ని విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను సీఎంకు వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో అన్ని శాఖల పరంగా నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను అందించాలన్నారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డులోని గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శనివారం తనిఖీ చేశారు. డీఆర్వో ఏకా మురళి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భావితరాలకు నీటిని అందించాలి నరసరావుపేట రూరల్: మన జీవనాధారమైన నీటిని ఒడిసి పట్టుకొని భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా మండలంలోని ఇక్కుర్రు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేయనున్న సేద్యపు నీటి కుంట పనులను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆర్డీవో మధులత, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తిలు పాల్గొన్నారు. దాదాపు రూ.43 వేలతో ఏర్పాటు చేయనున్న సేద్యపు నీటి కుంట పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రొంపిచర్ల మండలం విప్పర్లపల్లిలో నీటి కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణవాయువు తరువాత నీరే మనకు ప్రాణాధారమని తెలిపారు. నీటి వనరులను పరిమితమని, జలాన్ని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గోదాములో ఈవీఎంలు పరిశీలన -
అక్రమార్జనకు దగ్గరిదారి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానిలో కాంట్రాక్టర్లు, కొంతమంది మట్టి మాఫియా రాబందుల్లా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ ప్రతిరోజు రూ.లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి 5,6 కిలోమీటర్ల దూరంలోని కాజా టోల్గేట్ నుంచి గన్నవరం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి మట్టి తవ్వి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్దంగా ఈ మట్టిని కొంతమంది వ్యాపారులకు లారీ రూ.2వేలకు అమ్ముతుంటే ఆ వ్యాపారులు లారీ రూ.7వేల నుంచి రూ.8 వేలకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. వాస్తవానికి ఈ మట్టిని తరలించేందుకు మైనింగ్శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే సదరు కాంట్రాక్టర్ అవేవీ పట్టించుకోకుండా మట్టిని అమ్ముకోవడం ప్రారంభించారు. ఇదే అదునుగా తీసుకుని కొంతమంది అక్రమార్కులు సైతం రాజధాని ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన రోడ్లను సైతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో సైతం.. గత ప్రభుత్వం పేదలకు నివాసాలుగా ఇచ్చిన స్థలాల్లో రోడ్లను సైతం కొన్ని చోట్ల తవ్వేశారు. రాత్రిళ్లు ఆ రహదారిపై మట్టిని తవ్వి ఒక ప్రాంతంలో డంపింగ్ చేసి ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసి అమ్ముకుంటున్నారు. అక్రమ మట్టి తవ్వకాల విషయంలో ఈ మధ్యకాలంలో పలు కేసుల్లో నమోదైన ఓ వ్యక్తి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజధాని గ్రామాలైన కృష్ణాయపాలెం శివారు, వెంకటపాలెం, మందడం శివారు ప్రాంతాల్లో, కొండవీటి వాగు రోడ్డుకు సంబంధించిన మట్టిని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో లారీలు పెట్టి బయటకు తరలిస్తున్నారు. ఐదు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారు పొక్లెయిన్లు తీసుకువచ్చి వారంతట వారే హద్దులు నిర్వహించుకుని మట్టి తవ్వకాలు నిర్వహించి జేబులు నింపుకొంటున్నారు. కనిపించని పర్యవేక్షణ రాజధానిలో వివిధ పనులు నిర్వహించేందుకు వందలాది కంపెనీలు టెండర్లు దక్కించుకుని కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నాయి. పనులు నిర్వహించే దగ్గర ఎటువంటి సెక్యూరిటీని నియమించడం లేదు. దాంతో సూపర్వైజర్స్గా వ్యవహరించే వారు అక్రమాలకు పాల్పడుతూ రాజధానిలో సంపదను దోచుకుంటు జేబులు నింపుకొంటున్నారు. మట్టిని రాజధాని ప్రయోజనాలకు కాకుండా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలకు నీళ్లు రాజధానిలో రోడ్లను తవ్వేస్తూ మట్టి అక్రమ విక్రయాలు పట్టించుకోని అధికార యంత్రాంగం రాత్రిళ్లు ఐదు చోట్ల భారీ యంత్రాలతో మట్టి లోడింగ్ జేబులు నింపుకొంటున్న వ్యాపారులు, కాంట్రాక్టర్లు, వాహన యజమానులు రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలి తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం కాజాటోల్ వద్ద నుంచి గన్నవరం వరకు నిర్మించే రహదారిలో కాజా టోల్గేట్వద్ద నుంచి వెంకటపాలెం శివారు వరకు రోడ్డు నిర్మించేటప్పుడు తవ్వే మట్టిని నిబంధనలకు విరుద్దంగా అమ్ముకోవడమే. సదరు కాంట్రాక్టర్లు అవినీతికి దారి చూపడంతో కొంతమంది స్వార్ధపరులు రాజధానిలో నిర్మించిన రహదారులను సైతం తవ్వేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రాజధానిలో చేపట్టిన అభివృద్ధి పనులపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
పార్థసారథి అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా నాగేశ్వరరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు. నేడు శ్రీరంగనాయకులు అలంకారం... లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు శ్రీరంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి కోరారు. -
పోస్టల్ శాఖ బలోపేతమే కేంద్రం లక్ష్యం
సత్తెనపల్లి: పోస్టల్ శాఖ బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సత్తెనపల్లి రఘురాంనగర్లో తపాలా శాఖకు చెందిన స్థలంలో రూ.2.60 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ప్రధాన తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి చేపట్టిన శంకుస్థాపనలో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వెంకటేశ్వర గ్రాండ్లో తపాలా శాఖ నిర్వహించిన సమావేశంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ మార్పులకు అనుగుణంగా పోస్టల్ శాఖను ముందుకు తీసుకెళుతున్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు పోస్టల్ శాఖ ద్వారానే చేరుతున్నాయన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలను తీసుకుంటే వందల సంవత్సరాలు వేగవంతంగా వెళుతూ కొన్ని మూతపడుతుంటాయన్నారు. ఎయిర్ ఇండియా పూర్తిగా మూతబడిందన్నారు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ పోస్టల్ శాఖ నుంచి రూ.11 వేల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని, ఖర్చులు చూస్తే రూ.38 వేల కోట్లు ఉన్నాయన్నారు. రూ.27 వేల కోట్లు మైనస్లో ఉన్నామని, దీనిలో ఎక్కువగా వేతనాలు ఉన్నాయన్నారు. పోస్టల్శాఖలో మునుపెన్నడూ లేని విధంగా సీటీఓ, వైస్ ప్రెసిడెంట్ను రిక్రూట్ చేశామన్నారు. వారి టెక్నాలజీతో ఉద్యోగులు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. పార్సిల్, డెలివరీ వేగవంతంగా జరగాలని, జవాబుదారీతనం ఉండాలన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కె.ప్రకాష్లు మాట్లాడారు. ముందుగా రఘురాంనగర్లోని 48 సెంట్ల స్థలంలో ప్రధాన తపాలా కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసంఘటిత కార్మికులకు 12 అంకెల గల ప్రత్యేక గుర్తింపు కార్డులు అర్హులకు పంపిణీ చేశారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పోస్టల్ శాఖ అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో విజయవాడ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డీఎస్వీఆర్.మూర్తి, నరసరావుపేట డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ పి.వెంకటస్వామి, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, డీఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దరువూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తపాలా శాఖ పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తాం కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని సత్తెనపల్లిలో ప్రధాన తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన -
పల్నాడు
ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025చేప పిల్లలు విడుదల విజయపురిసౌత్: అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి మత్యశాఖ అధికారులు 10 లక్షల చేప పిల్లలను శనివారం విడుదల చేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.70 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. నృసింహుని సేవలో.. మంగళగిరి టౌన్: మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు మోహనకృష్ణ శనివారం స్థానిక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఒక్కసారి సున్నా చూసుకోండి అని చెబుతూనే వాహనదారులను బంకు నిర్వాహకులు నిండా ముంచుతున్నారు. డబ్బు ఇవ్వడానికి కాస్త చూపు పక్కకు తిిప్పితే చాలు చిటికెలోనే పంప్ రీడింగ్లో చక్రం తిప్పేస్తున్నారు. రాత్రి వేళ చిప్ మార్చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. బంకులోకి అడుగుపెట్టిన వారికి గొంతు తడుపుకొందామన్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. అసలు బంకుల్లో కనీస వసతుల సంగతి దేవుడెరుగు.. ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. వినియోగదారులకు నిర్ణీత కొలత, నాణ్యత విషయంలో గ్యారంటీ లేకుండాపోయింది. ఇఫ్తార్ సహర్ (ఆది) (సోమ) నరసరావుపేట 6.26 4.55 గుంటూరు 6.24 4.53 బాపట్ల 6.24 4.53 నరసరావుపేట టౌన్: ఉరుకులు పరుగుల జీవితంలో మనిషికి వాహనం తప్పనిసరి. కాలు బయటకు పెట్టాలంటే స్టార్ట్ అనాల్సిందే. అలాంటి తరుణంలో వాహనాలకు ఇంధనం నింపుకొనే విషయంలో వాహనదారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించడం లేదు. పెట్రోలు బంకులోకి వెళితే లైనులో నిలుచున్నామా.. పెట్రోల్ కొట్టించామా.. తిరిగి వచ్చామా అనే లెక్కలో ఉన్నారు. కానీ బంకుల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యజమానులపై ఉందని గుర్తించడం లేదు. వాహనాలకు అవసరమైన గాలి ఫిల్లింగ్ అక్కడే చేయించుకోవచ్చని తెలుసుకోవడం లేదు. అవసరమైతే క్వాలిటీ, క్వాంటిటీ చెకింగ్ చేయొచ్చనే విషయంపై దృష్టి సారించడం లేదు. ఇదే అదనుగా పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇవి మీ కోసమే.. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారులకు ఉచితంగా తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స కిట్, గాలి నింపే సౌకర్యం ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. కంపెనీ డీలర్, సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలి. పెట్రోల్, డీజిల్ ధర, ట్యాంక్లో ఉన్న నిల్వల వివరాలు, 24 గంటలు నీటి సౌకర్యం కలిగి ఉండాలి. ఈ–సేవలను అందించాలి. శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండాలి. అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా ఉపకరణాలు ఏర్పాటు చేయాలి. పెట్రోల్ బంకులో ‘నో స్మోకింగ్’, ఇతర భద్రతా సూచనలు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. సరైన కొలతలతో పెట్రోల్, డీజిల్ విక్రయించాలి. వినియోగదారుడు అడిగితే పెట్రోల్ నాణ్యతను చూపించాలి. వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రభుత్వ బంకులోనే వసతులు శూన్యం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులోనే కనీస సౌకర్యాలు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ‘సాక్షి’ సదరు పెట్రోల్ బంకును పరిశీలించగా... గాలి నింపే పరికరం నిరుపయోగంగా దర్శనమిచ్చింది. కొన్ని నెలలుగా ఇది పనిచేయటం లేదు. మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నా అవి కేవలం సిబ్బందికి మాత్రమేనని చెప్పారు. వాహనదారులు వినియోగించాటానికి వీలులేదని సిబ్బంది దురుసుగా సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటు బంకుల్లో మరింత దారుణంగా ఉంది. ఎక్కడా మరుగుదొడ్లు లేవు. తాగునీటి వసతి ఉండటం లేదు. కొంతమంది సిబ్బంది పెట్రోల్ నింపే సమయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతల శాఖ పట్టించుకోవడం లేదు. 7న్యూస్రీల్రాత్రి వేళ మోసం చేస్తున్నారుఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు సున్నా రీడింగ్ అంటూనే నిలువునా మోసం ఇంధనం కొలతల్లో సిబ్బంది చేతివాటం అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కరవు గాలి నింపే పరికరాలూ అంతంత మాత్రమే తీవ్రంగా నష్టపోతున్న వినియోగదారులు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం పట్టణ శివారులో ఉన్న పెట్రోల్ బంకుల్లో రాత్రివేళ ఇచ్చిన డబ్బులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నింపటం లేదు. అక్కడ పనిచేసే సిబ్బంది సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్ నాణ్యత చూపించే పరికరం బంకుల్లో అందుబాటులో ఉండటం లేదు. ఏ బంకుల్లో కూడా ఉచితంగా గాలి నింపడం లేదు. మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులో లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా యజమానులు ఇచ్చే మాముళ్లో.. లేక ఏ ఇతర కారణమో తెలియదుగానీ చర్యలు మాత్రం తీసుకోవటం లేదు. – కుంచాల స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు, వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లాలో మొత్తం 210 పెట్రోలు బంకులు ఉన్నాయి. ఏటా వాటిని పరిశీలించి స్టాంపింగ్ వేస్తున్నాం. దీంతోపాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ ఏడాది 36 కేసులు నమోదు చేశాం. రూ.2.70 లక్షల జరిమానా విధించాం. బంకుల యజమానులు విధిగా నిబంధనలు పాటించాలి. వాహనదారులు పెట్రోల్ కల్తీ, పరిమాణంపై అనుమానం ఉండి అడిగితే క్వాలిటీ టెస్ట్ చేసి చూపించాల్సిన బాధ్యత యజమానులదే. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టోల్ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – నల్లబోతుల అల్లూరయ్య, అసిస్టెంట్ కంట్రోలర్, పల్నాడు జిల్లా -
‘రెడ్ బుక్’ రచయిత ఫోన్ కాల్ వలనే పోసాని విడుదల ఆలస్యం’
సాక్షి, గుంటూరు: రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టారని.. 24 రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జైలు నుంచి బెయిల్పై విడుదలైన పోసానిని అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారని.. ఆ వయసులో పోసానిని అలా తిప్పటం కన్నా శిక్ష ఇంకేం ఉంటుంది?’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి. పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. అంతమాత్రానికే కేసులు పెడతారా?. వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా?. మరి ఆయనపై ఎందుకు కేసులు ఎట్టలేదు?. అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదలేదిలేదు’’ అని అంబటి స్పష్టం చేశారు.పోలీసుల కన్నా మా న్యాయ వాదులు డబుల్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మేము వస్తాం. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టుల్లో ఇబ్బంది పడతారు జాగ్రత్త. మా లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. శవాలు దొరకట్లేదుగానీ లేకపోతే అన్యాయంగా మర్డర్ కేసు కూడా పెట్టేవారు. నారా లోకేష్ కాల్ చేయటం వలనే పోసాని విడుదల ఆలస్యం అయింది. లేకపోతే మధ్యాహ్నానికే పోసాని బయటకు వచ్చేవారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎంతోకాలం నడవవు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఆర్చరీ చాంపియన్షిప్ ప్రారంభం
ఏఎన్యూ(గుంటూరు): ఏపీ ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న లెనిన్ ఓల్గా మెమోరియల్ అండర్–13, అండర్–10 ఆర్చరీ చాంపియన్షిప్ శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభకు ఏఎన్యూ వీసీ కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో విలువిద్యకు వర్సిటీ పూర్తి సహకారం అదిస్తుందన్నారు. ఏఎన్యూ రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధ్దికి యూనివర్సిటీలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ ఆర్చరీ క్రీడను రానున్న రోజుల్లో ఏఎన్యూలో ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, నేషనల్ జడ్జి బి.వి.రమణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి అండర్–13 విభాగంలో 700 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. తొలిరోజు రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్ విభాగాలలో ర్యాంకింగ్ పోటీలు జరిగాయి. -
బతుకు భారంగుండె..!
● పెయింటర్ల ఆవేదన ● ఆధునిక పద్ధతులతో ఉపాధికి గండి ● వృత్తికి స్వస్తి పలుకుతున్న కార్మికులు ● ఇతర ఉపాధి మార్గాలపై దృష్టి పట్నంబజారు: రంగుల హరివిల్లును అందంగా ఆవిష్కరించే కళాకారులు వారు.. అందమైన బొమ్మలను సుమనోహరంగా తీర్చిదిద్దే అపరబ్రహ్మలు పెయింటర్లు. ఏ శుభకార్యమైనా ఇంటిని రంగులతో అలంకరించాలని కోరుకుంటాం. అభిమాన నాయకుడు, హీరోపై ప్రేమను చాటేలా, దేవుని తిరునాళ్ల సందర్భంగా భక్తిపారవశ్యం ఉప్పొంగేలా బ్యానర్లు కట్టాలని భావిస్తాం. ఈ పనులకు మనకు తొలుత గుర్తొచ్చేది పెయింటర్లే. ఈ వృత్తికి గతంలో బాగా డిమాండ్ ఉండేది. గుంటూరు జిల్లాలో 30వేల మందికిపైగానే పెయింటర్లు ఉన్నారు. గుంటూరు నగరంలో సుమారు 10వేల మందికిపైగా ఉండవచ్చని పెయింటర్ అసోసియేషన్ల అంచనా. అయితే, కొన్నేళ్లుగా వీరి వృత్తి సజావుగా సాగడం లేదు. అధునాతన యంత్రాలతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తుండడంతో స్థానిక పెయింటర్ల ఉపాధికి గండి పడుతోంది. ఫలితంగా కుటుంబాలు పోషించుకోలేని దైన్యంలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. యాంత్రీకరణతోనే నష్టం గతంలో సాధారణ ఇంటి నుంచి రెండు, మూడు అంతస్తుల భవనాలు, బహుళ వ్యాపార సముదాయాలకూ పెయింటర్లే రంగులు వేసేవారు. ఫలితంగా ఏడాదిలో ఆరు నెలల పాటు వీరికి పుష్కలంగా పని దొరికేది. అయితే, ఇప్పుడు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. రంగుల నుంచి రకరకాల డిజైన్లను యంత్రాలే వేసేస్తున్నాయి. దీంతో పెయింటర్లకు పని దొరకడం లేదు. అరకొరగా దొరికినా ఉదయం నుంచి చీకటి పడే వరకు రంగులు వేసినా రూ.600 నుంచి రూ. 700 కూలి రావడం గగనమైంది. అది కూడా ఏడాదిలో కేవలం రెండు, మూడు నెలలే పనులు ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణాల సమయంలో రంగులు వేసే పనులను తాపీ మేసీ్త్రలే ఒప్పుకోవడం కూడా పెయింటర్ల జీవనాన్ని దెబ్బతీస్తోంది. దీనికి తోడు కంప్యూటర్పై ఫ్లెక్సీలు తయారు చేసే వ్యవస్థ రావటంతో బ్యానర్లపై బొమ్మలు, పెయింటింగ్లు వేసే పరిస్థితి దాదాపు కనుమరుగైంది. ప్రత్యామ్నాయం వైపు,, పనులు లేకపోవడంతో పెయింటర్లు ప్రత్యామ్నాయ వృత్తులవైపు మళ్లుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రంగుల షాపులు, కిరాణా దుకాణాల్లో గుమాస్తాలుగా చేరుతున్నారు. పూల దుకాణాల్లో కూలీలుగా, బార్లలో వెయిటర్లుగా మారుతున్నారు. ప్రమాదాలతో.. ఊయలూగుతూ.. వృత్తిని నమ్ముకుని బతుకుతున్నాం ఎన్నోఏళ్ల నుంచి పెయింటింగ్ వృత్తిని నమ్ముకున్నాం. ఆధునిక యంత్రాల రంగప్రవేశంతో పనులు దొరకడం లేదు. ఆకలి కేకలు తప్పడం లేదు. ప్రభుత్వమే మమ్మలను ఆదుకోవాలి. – షేక్ బాషా, పెయింటర్ పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయాలి ఈ వృత్తి ద్వారా కుటుంబ పోషణ భారమవుతోంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని రుణాలు మంజూరు చేయాలి. ఈ డబ్బుతో యంత్రాలు కొనుక్కుని జీవనోపాధి పొందుతాం. పింఛన్లు, గృహాలు ఇచ్చి మా సంక్షేమానికి కృషి చేయాలి. – ఎస్.రాము, పెయింటర్ బహుళ అంతస్తుల భవనాలకు రంగులు వేయడం ఓ సాహసమే. తాళ్ల సాయంతో గాలిలో ఊగుతూ రంగులు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం మెండుగా ఉంది. రంగులు వేసే క్రమంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ప్రాణాలకు తెగించి పెయింటింగ్ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు ఇప్పుడు ఆకలికేకలతో ఆర్తనాదాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల కులవృత్తులకు విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ పథకంలో పెయింటర్లను చేర్చకపోవడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెయింటర్ల సంక్షేమానికి కృషి చేయాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
గజేంద్ర మోక్షం అలంకారంలో నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం గజేంద్ర మోక్షం అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శేషగిరిరావు, కల్యాణిలు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ తిరుమలరావు, తాడికొండ సాయికుమార్లు వ్యవహరించారు. శనివారం స్వామి పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. -
ఇస్రో చూసొద్దాం రారండోయ్ !
● యువికా–25కు ఆహ్వానం ● ఈ నెల 23 వరకు రిజిస్ట్రేషన్ గడువు ● తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అవకాశం సత్తెనపల్లి/బెల్లంకొండ :భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను చూసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అంతరిక్ష పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి కలిగించడమే ప్రధాన ఉద్దేశం. స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఇస్రో యువికాను చేపడుతోంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా తొమ్మిదవ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మేలో రెండు వారాలపాటు శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఇవే.. ఇస్రోను యువికాను దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో నిర్వహిస్తోంది. ● తిరువనంతపురం (కేరళ) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ● తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్) సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ● డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ● అహ్మదాబాద్ (గుజరాత్) స్పేస్ అప్లికేషన్ సెంటర్ ● షిల్లాంగ్ (మేఘాలయ) నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ● బెంగళూర్ (కర్ణాటక) యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ ● హైదరాబాద్ (తెలంగాణ) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెయిటేజ్ ఇలా... ● 8వ తరగతిలో పొందిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. ● జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం ఇస్తారు. ● స్పేస్, సైన్స్ క్లబ్లలో నమోదై ఉంటే ఐదు శాతం ● ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఐదు శాతం. ● గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే 20 శాతం ప్రాధాన్యమిస్తారు. ఎంపికై తే అన్నీ ఉచితం యువికాకు ఎంపికై న విద్యార్థులకు ప్రయాణంతో పాటు వసతి, భోజన సదుపాయాలను అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉచితంగానే అందిస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో రెండు వారాలపాటు (14 రోజులు) ఇస్రోకు చెందిన వివిధ రాష్ట్రాల్లోని స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, నవగ్రహాల సముదాయం తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు అరుదైన అవకాశం ఇస్రో కల్పించే అరుదైన అవకాశాన్ని విద్యార్థి దశలోనే పొందితే కచ్చితంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు దీన్ని బాధ్యతగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించాలి. –ఎస్.రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి, పల్నాడు శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం ప్రపంచంలోనే అగరాజ్యాలతో పోటీపడుతూ ఇస్రో ఎన్నో విజయవంతమైన రాకెట్ ప్రయోగ పరీక్షలను నిర్వహించింది. దేశ కీర్తిని ఆకాశానికి తీసుకెళ్లింది. యువికా పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం. ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. –ఏ.ఏ. మధు కుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు, ఉప్పలపాడు ఆన్లైన్ ద్వారా ఎంపిక ప్రక్రియ యువికాలో భాగంగా 2025లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవి.ఇన్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు పంపించాలి. ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఉంది. ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితాను విడుదల మే 18న ఆహ్వానం మే 19 నుంచి 30 వరకు శిక్షణ మే 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తారు. -
రంజాన్ పండుగ మానవాళికి ఒక సందేశం
● జిల్లా పోలీసు కార్యాలయంలో ముస్లిం పోలీసులకు ఇఫ్తార్ విందు ● జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట: పండుగ అనేది ఏ మతానికి సంబంధించినది అయినా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని , ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి బోధిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రంజాన్ ఉపవాస దినాలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలో ముస్లిం పోలీసులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి రోజాను విరమింపచేశారు. ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రాముఖ్యత, రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే విధానం గురించి తెలియజేశారు. చాంద్ర మానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ తొమ్మిది నెల రంజాన్ అని, దీన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ నెలలోనే దివ్య ఖురాన్ గ్రంథం అవతరించడమేనని ఆయన వివరించారు. ఈ మాసంలో ముఖ్యమైనవి రోజా, తరావి నమాజ్ అన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించినది రంజాన్ మాసంలోనే అవ్వడంతో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఫిత్ర, జకాత్ దానధర్మాలు చేస్తుంటారని ఎస్పీ వివరించారు. అనంతరం ముస్లింలతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు పరిపాలన ఎస్పీ జేవీ.సంతోష్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, వెల్ఫేర్ ఆర్ఐ గోిపీనాథ్, జిల్లాలోని ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చట్టాలపై విదార్థులకు అవగాహన అవసరం
నరసరావుపేట టౌన్: చట్టాలపై విదార్థులకు కూడా అవగాహన అవసరమని ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కె. మధుస్వామి తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శుక్రవారం సెల్ఫ్ డిఫెన్స్, పోక్సో చట్టం తదితర అంశాలపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మధుస్వామి పోక్సో చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను తెలియజేశారు. రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య ఎదురైనా సంకోచించకుండా డయల్ 100కు గానీ, స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థలో గానీ సంప్రదించాలని సూచించారు. విద్యార్థి దశలో కష్టపడి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరేలా కృషి చేయాలని ఆయన తెలిపారు. తొలుత పట్టణ ఎస్ఐ అరుణ మాట్లాడుతూ మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచమని పేర్కొన్నారు. ప్రతి మహిళా ఫోన్లో నిక్షిప్తం చేసుకొని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని సూచించారు. తొలుత న్యాయమూర్తి హాస్టల్ వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెనూను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్లు ఎన్. జయప్రద, జయలక్ష్మి, వసతి గృహ సిబ్బంది, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
పీ–4 సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ అరుణ్బాబు నరసరావుపేట: ప్రభుత్వం చేపట్టిన పీ–4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) సర్వే ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో వెనుకబడిన వారిని గుర్తించి వారి అభ్యున్నతికి పనులు చేపట్టడమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పీ–4 విధానంపై స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్లతో అర్థ గణాంకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలో ప్రజలంతా పాలుపంచుకొని మెజార్టీ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటులో సహకరించి, భూములు ఇచ్చిన రైతుల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, దీనికి పీ–4 సర్వే ఉపయోగపడుతుందని కలెక్టర్ చెప్పారు. సర్వేపై స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్స్, రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ సర్వే మంచిదని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ జనరేషన్కు దోహదపడుతుందని తెలిపారు. రైతులతో పాటు అందరికీ అర్థమయ్యేలా తెలుగులో ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అర్థ గణాంకాధికారి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ ఏడీ నవీన్కుమార్, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. -
మందుల దుకాణాలపై దాడులు
నరసరావుపేటటౌన్: పట్టణంలోని పలు మందుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా బరంపేటలోని భాగ్యశ్రీ మెడికల్ ఏజెన్సీ దుకాణంలో మొదట తనిఖీలు నిర్వహించారు. దుకాణానికి సంబంధించి రిక్షా సెంటర్ సమీపంలో ఇళ్ల మధ్య ఉన్న గోదాంలో సోదాలు చేపట్టారు. అనుమతులు లేకుండా భారీ స్థాయిలో మందులు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించింది. మందులను సీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఫిజీషియన్ శాంపిల్స్ ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్ సీఐ పి. రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈఈ శివన్నారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమతులు లేకుండా గోదాం నిర్వహణ భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం దాడుల్లో పాల్గొన్న విజిలెన్స్, డ్రగ్స్ అధికారులు -
ఆచార్య కృపాచారికి పరిశోధక గురు పురస్కారం
తెనాలి: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత ఆచార్యుడు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పరిశోధక గురువుగా చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రముఖ రచయిత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. స్థానిక చెంచుపేట డొంకరోడ్డులోని ఆచార్య కృపాచారి నివాసానికి శుక్రవారం ఆచార్య ఇనాక్ వచ్చారు. పరిశోధక గురు పేరుతో కొలకలూరి పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. అనంతరంమాట్లాడుతూ తాము ఏటా ప్రదానం చేస్తున్న కొలకలూరి పురస్కారాలను రచయితలతోపాటు పరిశోధకులు, పరిశోధక గురువుకు కూడా అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో పరిశోధక గురు అవార్డుకు కృపాచారిని ఎంపిక చేశామని తెలిపారు. అయితే ఆరోగ్య కారణాలతో హైదరాబాద్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ సభకు ఆయన హాజరుకాలేకపోయారని చెప్పారు. తానే స్వయంగా తెనాలి వచ్చి కృపాచారికి ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ఆచార్య ఇనాక్ వివరించారు. కృపాచారి పర్యవేక్షణలో 75 మంది పీహెచ్డీలు, 68 మంది ఎంఫిల్ చేసినట్టు గుర్తుచేశారు. పలు విశ్వవిద్యాలయాకు 45 పాఠ్యగ్రంథాలను అందించారనీ, పలు అవార్డులను స్వీకరించారని గుర్తుచేశారు. పురస్కారం స్వీకరించటంపై కృపాచారి సంతోషాన్ని ప్రకటించారు. -
ముగిసిన ఏఎన్యూ ఇంటర్ కాలేజియేట్ బేస్బాల్ మెన్ టోర్నీ
గుంటూరు రూరల్: క్రీడా స్ఫూర్తి జీవితంలో ఉన్నస్థాయికి చేరుస్తుందని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బేస్ బాల్ (మెన్) టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఆర్వీఆర్జేసీ కళాశాల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. రన్నర్ ట్రోఫీని ఏఎన్యూ ఫిజికల్ కళాశాల జట్టు సాధించింది. తృతీయ స్థానంలో ఎంఏఎం పీజీ కాలేజీ, నాలుగో స్థానంలో సీఆర్ కాలేజీ జట్లు నిలిచి ట్రోఫీలను అందుకున్నాయి. టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్యూ సాఫ్ట్ బాల్ (మెన్) జట్టును సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్. గోపాలకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కె. కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్ డైరెక్టర్ డాక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పి. గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఏఎన్యూ టోర్నమెంట్ ఆబ్సర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఎం. బుచ్చిబాబు, డాక్టర్ రాజామెరిసిన్ బాబు, జె.ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
పత్తి ఉత్పత్తిని పెంచేందుకు కృషి జరగాలి
గుంటూరు రూరల్: దేశంలో పత్తి పంట ఉత్పత్తి పెంచేలా కృషి జరగాలని వక్తలు అభిప్రాయపడ్డారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఎన్జీ రంగా వర్సిటీలో ఐసీఏఆర్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ (ఐసీఏఆర్– సీఐసీఆర్), వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పత్తి వార్షిక సమూహ సమావేశం (ఏజీఎమ్) –2025ను శుక్రవారం ప్రారంభించారు. మూడురోజులపాటు జరిగే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు ముఖ్య భాగస్వాములు హాజరయ్యారు. పత్తి ఉత్పత్తి పెంపుపై చర్చించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. ఆమె పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో బీటీ పత్తి కీలకపాత్ర పోషించినట్టు వివరించారు. వర్సిటీ విడుదల చేసిన నరసింహ (ఎన్ఏ–1325) పత్తి రకం విజయ ప్రస్థానం గురించి చెప్పారు. పత్తి రైతుల నికర ఆదాయాన్ని గణనీయంగా పెంచడంలో ఇది దోహదపడిందని తెలిపారు. డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో పత్తి ఉత్పత్తి పెంపునకు కృషి జరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్, సీఐసీఆర్ నాగపూర్ సంచాలకులు డాక్టర్ వై.జి. ప్రసాద్, ఐసీఏఆర్, సీఐఆర్సీఓటీ ముంబై డైరెక్టర్ డాక్టర్ ఎస్కే శుక్లా, ఐసీఏఆర్ పంట శాస్త్ర విభాగం సహాయ డైరెక్టర్ జనరల్ (వాణిజ్య పంటలు) డాక్టర్ ప్రశాంతకుమార్దాస్, పత్తి ప్రాజెక్ట్ పర్యవేక్షణ, సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ సిడి మాయీ తదితరులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పత్తిపంట అఖిల భారత వార్షిక సమూహ సమావేశంలో వక్తలు -
ముగిసిన ఏఎన్యూ ఇంటర్ కాలేజియేట్ బేస్బాల్ మెన్ టోర్నీ
గుంటూరు రూరల్: క్రీడా స్ఫూర్తి జీవితంలో ఉన్నస్థాయికి చేరుస్తుందని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బేస్ బాల్ (మెన్) టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఆర్వీఆర్జేసీ కళాశాల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. రన్నర్ ట్రోఫీని ఏఎన్యూ ఫిజికల్ కళాశాల జట్టు సాధించింది. తృతీయ స్థానంలో ఎంఏఎం పీజీ కాలేజీ, నాలుగో స్థానంలో సీఆర్ కాలేజీ జట్లు నిలిచి ట్రోఫీలను అందుకున్నాయి. టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్యూ సాఫ్ట్ బాల్ (మెన్) జట్టును సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్. గోపాలకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కె. కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్ డైరెక్టర్ డాక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పి. గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఏఎన్యూ టోర్నమెంట్ ఆబ్సర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఎం. బుచ్చిబాబు, డాక్టర్ రాజామెరిసిన్ బాబు, జె.ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
24న రవాణా రంగ కార్మికుల ‘చలో పార్లమెంట్’
లక్ష్మీపురం: ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 24న ‘చలో పార్లమెంట్’ చేపట్టినట్లు సంఘ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు వెల్లడించారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని ఆటో స్టాండ్ల వద్ద పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రవాణా రంగంపై పెద్దఎత్తున దాడి ప్రారంభించిందని ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 106(1), (2)ను తీసుకురావడం చిన్న చిన్న తప్పిదాలకు కూడా డ్రైవర్లలను బాధ్యులు చేయటం, భారీ శిక్షలు, జరిమానాలు విధించడం వంటి చర్యలు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. వాహనా ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం కార్మికులపై భారాన్ని మోపడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో భారీ పెనాల్టీలు విధిస్తూ తీసుకొచ్చిన జీఓ నంబర్ 21ను తక్షణమే రద్దు చేయాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నగర ఆటో డ్రైవర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసరావు, వెంకట్, జానీ పాల్గొన్నారు. -
అరకొర వేతనాలతో ‘ఆశా’ల అవస్థలు
నరసరావుపేట: వైద్య ఆరోగ్య శాఖలో విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, పెన్షన్ కల్పించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.చంద్రకళ, డి.శివకుమారి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎండీహెచ్వో డాక్టర్ రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని కోరారు. దీర్ఘకాలంగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో అర్ధంతరంగా మృతి చెందిన ఆశాల కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించారు. గ్రూపు ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించి మట్టి ఖర్చులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్హెచ్ఎం స్కీం ఏర్పడి 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీస వేతనాలు చెల్లించడంలేదని తెలిపారు. గడిచిన ఏడేళ్లలో ఆశాలకు వేతనాన్ని వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, పారితోషకంలేని పనులు చేయించరాదని కోరారు. ఆశాలకు ఆస్పత్రులలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, ప్రసూతి సెలవుల అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనంతో కూడిన సాధారణ, ఆరు నెలల మెడికల్ సెలవులు ఇవ్వాలని కోరారు. ఆశాల సమస్యలు పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని శివకుమారి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రత్నకుమారి, జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్ డీఎంహెచ్వోకు వినతిపత్రం అందజేసిన నాయకులు -
స్థల వివాదం నేపథ్యంలో ఇంటిపై దాడి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): స్థల వివాదం నేపథ్యంలో కొందరు దాడి చేసి ఇంటిని, గృహోపకరణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం శాంతినగర్ 4వ లైన్లో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. శాంతీనగర్లోని ఇంటిలో జాజుల ఏడుకొండలు, భార్య తిరుపతమ్మ ఉంటారు. వీరికి నలుగురు సంతానం. అదే ఇంట్లో అతని తమ్ముడు జాజుల బాల నరసింహారావు, అతని భార్య నాగమణి కూడా నివాసం ఉంటారు. ఏడుకొండలు, ఫైనాన్స్, గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. 2021లో శాంతీనగర్ 4వ లైన్లో 216 గజాల స్థలం శ్రీనివాసరావుపేటకు చెందిన కాశీవిశ్వనాథ్ కుమారుడు రవీంద్రబాబు వద్ద ఏడుకొండలు కొన్నాడు. రవీంద్రబాబుకు శ్రీనివాసరావుపేటకు చెందిన పెడమల్లు భాస్కర్ల మధ్య కోర్టులో స్థల వివాదం నడుస్తోంది. 2018లో రవీంద్రబాబుపై భాస్కర్ కోర్టులో గెలిచారు. 2021లో స్థలాన్ని రవీంద్రబాబు వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని ఇల్లు ఖాళీ చేయాలంటూ, కోర్టులో తమకు పూర్తి అధికారాలు ఉన్నాయని మల్లు భాస్కర్ వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. శుక్రవారం ఏడుకొండలు, భార్య తిరుపతమ్మ బయటకు వెళ్లగా ఇంట్లో ఏడుకొండలు తమ్ముడు బాలనరసింహారావు, అతని భార్య నాగమణి ఉన్నారు. పెడమల్లు భాస్కర్ ఆయన సతీమణి భూలక్ష్మి పల్నాడు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుచరులు అయిన ఆలపాటి నాని, అశోక్లతోపాటు సుమారు 30 మందితో ఇంటిపైకి వచ్చి దాడి చేశారు. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు ధ్వంసం చేశారు. బాధితులు 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగరంపాలెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అందరినీ అక్కడి నుంచి తరిమేసి పెద్దమల్లు భాస్కర్ని అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితులు తేరుకొని నగరంపాలెం పోలీస్ స్టేషన్కుని ఫిర్యాదు చేశారు. ఇల్లు, ఇంట్లో గృహోపకరణాలు ధ్వంసం నిందితులు అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా గుర్తింపు ! పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు -
ఎట్టకేలకు కస్తల మైనర్కు సాగునీరు విడుదల
దొడ్లేరు ఆయకట్టు రైతుల్లో సంతోషం క్రోసూరు: నాగార్జున సాగర్ కెనాల్స్ అధికారులు ఐదు రోజుల వారాబందీ పద్ధతిలో చింతపల్లి మేజరు ద్వారా కస్తల మైనర్కు నీళ్లు విడుదల చేశారు. మండలంలోని దొడ్లేరు గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు దాళ్వాలో వరి సాగు చేస్తున్నారు. గత పది రోజులుగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని బుధవారం గ్రామంలో ధర్నా చేశారు. దీంతో కెనాల్స్ ఏఈ బండి శ్రీనివాసరావు గురువారం నీళ్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కాలువలకు నీళ్లు విడుదల చేశారు. శుక్రవారం కస్తల మైనర్ కాలువకు చేరుకున్నాయి. ఐదు రోజుల పాటు విడుదల చేస్తామని, ఆ తరువాత ఎర్రబాలెం మేజరుకు నీళ్లు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కరాలపాడు వెళ్లే నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు...దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన మందా సాగర్బాబు(35) భార్య మరియకుమారితో కలిసి ద్విచక్ర వాహనంపై కరాలపాడు వస్తున్నారు. నీలంపాటి అమ్మవారి గుడి నుంచి వేగంగా వస్తున్న కారు కరాలపాడు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో సాగర్బాబుకు తీవ్రం గానూ, భార్య మరియకుమారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇద్దరిని పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సాగర్బాబు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు మరియకుమారి కాలికి గాయమైంది. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం వేటపాలెం: స్ట్రయిట్ కట్ కాల్వలో చెక్ వాల్ దగ్గరలో నీటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి సుమారు 58 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఒంటిపై ఎర్రగీతల బనియన్ ధరించి ఉన్నాడు. మృతుడు దగ్గరలోని చేపలు పట్టుకొనే యానాదుల కాలనీకి చెందిన వాడిగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
24న శాంతియుత నిరసన
గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో దీర్ఘకాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మార్చి 24న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసన తెలియజేయనున్నట్లు ఎన్టీఆర్ వైద్య మిత్ర అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరులోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త (డీసీ) ఆఫీసుల వద్ద విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈనెల 27న మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆఫీస్ వద్ద గాంధేయ పద్ధతిలో శాంతియుత నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిద్దాం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి తెనాలి అర్బన్: ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కొర్ర విజయలక్ష్మి సూచించారు. మలేరియా విభాగం ఆధ్వర్యంలో నరేంద్రదేవ్ కాలనీలో శుక్రవారం దోమలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దోమల నివారణ గురించి వివరించారు. జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ జ్వర లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స పొందాలని సూచించారు. -
మర్రి రాజశేఖర్ను వైఎస్ కుటుంబం ఎంతో గౌరవించింది: విడదల రజిని
పల్నాడు, సాక్షి: వైఎస్సార్సీపీ మర్రి రాజశేఖర్ని ఏనాడూ మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జి విడదల రజిని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్సార్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్ మోహన్రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెడ్ బుక్ పేరుతో పాలన జరుగుతున్నప్పుడు మర్రి రాజశేఖర్ తన గొంతుక వినిపించి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ఒకవేళ.. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు మర్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్సార్సీపీ ఆయన్ని మోసం చేయలేదు. ఉన్నత పదవులతో గౌరవించింది అని విడదల రజిని అన్నారు... 2019 ఎన్నికల టైంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ సమయంలో పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చిలకలూరి పేట నుంచి పోటీ చేయలేకపోవడం నా దురదృష్టంగా భావించా. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబితేనే పోటీ చేశాను. తిరిగి చిలకలూరిపేటకు తిరిగి ఆయన పంపిస్తేనే వచ్చా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టే ఆ పనులన్నీ చేశా. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించడం మాత్రమే నాకు తెలుసు అని అన్నారామె. -
కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని 24 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, 11వ తరగతి (ఇంటర్మీడియేట్) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అదనపు ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ టి.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 22వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 7,8, 9, 10,12 తరగతుల్లోనూ మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను https//apkgbv.apcfss.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. వివరాలకు 9704100406, 9440642122 నంబర్లలో సంప్రదించాలని కోరారు. చర్లపల్లి–కన్యాకుమారి మధ్య వేసవి వారాంతపు ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్థం సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కన్యాకుమారి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రత్యేక రైలు(07230) ప్రతి బుధవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి రెండో రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. కన్యాకుమారి–చర్లపల్లి రైలు(07229) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 ప్రతి శుక్రవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు కన్యాకుమారి స్టేషన్ నుంచి తెల్లవారుజామున 5.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు చర్లపల్లి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. జయ గోవర్ధనా.. నారసింహా మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్, శేషాంజనేయ గోపాల్లు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. శుక్రవారం స్వామి గజేంద్రమోక్షం అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఖాళీ స్థానాలకు 27న ఎన్నికలు గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఈనెల 27న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీలను పరోక్ష విధానంలో ఎన్నికల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరించిన అనంతరం మధ్యాహ్నానికి ఎన్నిక, ప్రమాణ స్వీకారంతో ప్రక్రియ ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ద్వారా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షులు, గుంటూరు రూరల్ మండల పరిషత్ ఉపాధ్యక్ష స్థానంతో పాటు తెనాలి మండల నుంచి కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ల స్థానాల వారీగా కొల్లిపర మండలం తూములూరు, చక్రాయపాలెం, మేడికొండూరు మండలం గుండ్లపాలెం, మేడికొండూరు, దుగ్గిరాల మండలం మంచికలపూడి, ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం, పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం, పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు, చేబ్రోలు మండలం శ్రీరంగాపురంలో ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ● వినుకొండలో నాయకుడి అక్రమ నిర్బంధంపై మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడితో కలసి సమావేశం ● ఈపూరు మండల నాయకుడు నాగేశ్వరరావు అక్రమ నిర్బంధంపై హైకోర్టులో పిటిషన్ ● రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు హత్యలు తప్పా పరిపాలన ఎక్కడని పొన్నవోలు ప్రశ్న ● హిట్లర్ను మరపిస్తున్న చంద్రబాబు పాలన వినుకొండ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు కొండావర్జు నాగేశ్వరరావు యాదవ్ను ఈపూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని దాచిపెట్టడంపై ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా చొరవతో తమ నాయకుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విషయం తెలిసిన వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరై నాగేశ్వరరావును విడిచిపెట్టారని వివరించారు. కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను వేధించడం, భూములు లాక్కోవడం, హత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు నిత్య కృత్యంలా మారాయని తెలిపారు. వినుకొండలో రషీద్ దారుణహత్యతోపాటు, వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెంలో మహిళపై అత్యాచారం కేసుల్లో ఇప్పటివరకూ పోలీసులు పురోగతి సాధించలేదని విమర్శించారు. హిట్లర్ పాలన కంటే దారుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఒక మీడియా చానల్లో ప్రభుత్వ పథకాలపై మాట్లాడిన నాగేశ్వరరావును తీవ్రవాదుల కంటే దారుణంగా పొలంలో పని చేసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకోవడం ఏమిటని పొన్నవోలు ప్రశ్నించారు. పోలీసులు నాగేశ్వరరావును స్టేషనులో కాకుండా వేరేచోట నిర్బంధించి కుటుంబసభ్యులకు కూడా తెలియకుండా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. నాగేశ్వరరావు భార్య సునీత, గ్రామస్తులు, బంధువులు పోలీస్టేషన్లో కాపలాగా ఉండి అతడిని కాపాడుకున్న తీరు అభినందనీయమన్నారు. ఈ ఘటనతో జగన్ మాటల మనిషికాదని, చేతల మనిషి అని, సామాన్య కార్యకర్తలకు అన్యాయం జరితే ఆయన స్పందించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, జిల్లా లీగల్సెల్ కన్వీనర్ మాధవితోపాటు, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్ కృషి మరువలేనిదన్నారు. ప్రభుత్వం తమ కార్యకర్తలను ఎంత అణగదొక్కాలని చూస్తే అంతే వేగంగా చైతన్యవంతులు అవుతారని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను ఇలా కూడా వాడుకోవచ్చని చంద్రబాబు ప్రభుత్వ విధానం చూస్తుంటే అర్థమవుతోందని తెలిపారు. వారు ట్రైలర్ మాత్రమే చూపించారని, రానున్న రోజుల్లో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. వినుకొండను అనకొండగా మార్చిన టీడీపీ నాయకులకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని పొన్నవోలు పేర్కొన్నారు. ధైర్యంగా ఉండండి : బొల్లా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పొన్నవోలు లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నతకాలం భయపడేది లేదన్నారు. వినుకొండలో పేదలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. శావల్యాపురం మండలంలోని వెలమావారిపాలెంలో సాగునీరు అడిగినందకు మహిళపై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి, ఎం.ఎన్. ప్రసాద్, సీనియర్ నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి రాజా, మున్సిపల్ వైస్ చైర్మన్ బేతం గాబ్రియేలు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ సర్కారు వారి పాట
నరసరావుపేట టౌన్: జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో అక్రమాలపై ‘సర్కారు వారి పాట’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 3391.55 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యాన్ని గతంలో వేలం నిర్వహించగా కిలో రూ. 32.50 పైసలకు ఓ పాటదారుడు దక్కించుకున్నారు. అనంతరం అతడు పూర్తిగా డబ్బు చెల్లించకపోవడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 7న తిరిగి వేలం నిర్వహించారు. ఇందులో ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు. నకరికల్లు గ్రామానికి చెందిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారి తెర వెనుక చక్రం తిప్పాడు. కిలో రూ.22.50 ధర నిర్ణయించి కూటమి నేతలకు అధికారులు అప్పగించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.35 లక్షలు గండి పడింది. ఈ వ్యవహారంపై సాక్షి దినపత్రికలో ఈనెల 14న కథనం వెలువడటంతో జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నెలలో ప్రకటించిన వేలంలో 3391.55 క్వింటాళ్లకు గాను 1519.40 క్వింటాళ్లకు సరైన ధర రాలేదని, ఈ నెల 29న తిరిగి మరో మారు నిర్వహించబోతున్నామని తాజాగా ప్రకటన ఇచ్చారు. ఈ వేలంలో పాల్గొనదలచిన వారికి ఉండాల్సిన అర్హతలను అందులో పేర్కొన్నారు. ముందుగా రూ.లక్ష ధరావతు చెల్లించాలని, మిల్లులకు సంబంధించి లైసెన్సు ఉండాలని తెలిపారు. పాటలో పాల్గొనే వారిపై 6–ఏ కేసులు ఉండరాదని డీఎస్వో నారదముని పేర్కొన్నారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యంలో సగం సరుకుకు సరైన ధర రాలేదంట ! 29న మళ్లీ వేలానికి ప్రకటన ఇచ్చిన జిల్లా అధికారులు -
రెచ్చిపోయిన ‘పచ్చ’ నేత
నకరికల్లు: అధికార అహంకారంతో తమ గుడిసెలను కూల్చేసిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. గుడిసెలు కూలగొట్టి భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని మండలంలోని బాలాజీనగర్ తండాకు చెందిన పలువురు సుగాలీలు పీడీఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుటఽ ఆందోళనకు దిగారు. బాధితుల తరఫున పీడీఎం పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి మాట్లాడారు. తండాకు చెందిన 37 సుగాలి కుటుంబాలకు మూడు సెంట్లు చొప్పున 1989లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అంతా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాట్రావత్ సాంబయ్య నాయక్ 2022లో గుడిసెలకు నిప్పంటించాడు. అతనిపై కేసు నమోదు కాగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాడు. అనంతరం తిరిగి సుగాలీలకే పట్టాలు మంజూరు చేయాలని హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు అందాయి. దీంతో కొందరు తిరిగి గుడిసెలు నిర్మించుకొని నివాసముంటున్నారు. అప్పటి నుంచి ఊరుకున్న సాంబయ్య నాయక్ ప్రస్తుతం టీడీపీ అండతో, తండాలో ఎవరూలేని సమయం చూసుకొని పొక్లెయిన్తో గుడిసెలను కూలగొట్టాడు. దీంతో బాధితులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కోర్టు ఉత్తర్వుల ఉన్నప్పటికీ గుడిసెలు కూల్చిన సాంబయ్య నాయక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కె.పుల్లారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్.శివానాయక్, పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పి.రామునాయక్, పి.సాంబబాయి, కేతావత్ శ్రీరాములు నాయక్, వి.బాలసింగ్నాయక్, కె.కృష్ణనాయక్, కె.రమాదేవి, ఆర్.హనుమానాయక్, ఆర్.మణిబాయి పాల్గొన్నారు. అధికార అహంకారంతో పేదల గుడిసెలు కూల్చివేత ఆందోళనకు దిగిన బాధితులు కోర్టు ఆదేశాల మేరకు చర్యలు బాలాజీనగర్తండాకు చెందిన ఎస్టీలు ఇచ్చిన అర్జీని పరిశీలించాను. భూ సమస్యపై ఇరువర్గాలు హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – కె.పుల్లారావు, తహసీల్దార్, నకరికల్లు -
అమరేశ్వరుడికి వేలం పాటల ద్వారా రూ.54.22 లక్షల ఆదాయం
అమరావతి: అమరేశ్వరుడికి వేలం పాటల ద్వారా రూ.54.22 లక్షలు ఆదాయం వచ్చింది. ఆలయంలో దుకాణాలకు గురువారం బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సునీల్కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2026 మార్చి 31 వరకు పాటదారులు వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఆలయంలో కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడాన్ని రూ. 9.51లక్షలకు, ఆవరణలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్ముకునేందుకు రూ.17.20లక్షలు, పార్కింగ్ రుసుం వసూలును రూ.10.61లక్షలకు, బొమ్మలు అమ్ముకునే హక్కుకు రూ.3.90 లక్షలకు, నదీ తీరంలో కూల్డ్రింక్స్ షాపునకు రూ.9.9లక్షలకు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు రూ. 2.66 లక్షలకు, తలనీలాలకు రూ. 20వేలు, మొదటి ప్రాకారంలో కూల్డ్రింక్స్ షాపు నిర్వహణకు రూ. 1.5లక్షలకు పాడుకున్నట్లు ఆయన వివరించారు. స్వామికి ఆదాయం గత ఏడాది రూ. 49.44 లక్షలు రాగా ఈ ఏడాది రూ.54.22 లక్షలు వచ్చినట్లు చెప్పారు. గత ఏదాది కంటే రూ.4.78 లక్షలు అధికంగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సిండికేట్తో ఆదాయానికి గండి పాటదారులు సిండికేట్ కావడంతో అమరేశ్వరుని ఆదాయానికి గండిపడింది. ఒకటి, రెండు వ్యాపారాలకు తప్పా మిగిలిన అన్నింటిలో పాటదారులు సిండికేట్ అయ్యారు. అధికారులు కూడా పార్కింగ్, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కుకు అధిక మొత్తంలో పాట పెంచారు. మిగిలిన వ్యాపారాలకు తక్కువ మొత్తంలో పెంచి మమ అనిపించారు. ఈ విధంగా దేవుని ఆదాయానికి గండి కొట్టటం దారుణమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. -
తంగెడపై ఖాకీల పడగ !
ఎస్..బాస్ అంటూ కూటమి నేతల కనుసన్నల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. సామదాన దండోపాయాలను ప్రయోగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని అధికార పార్టీ నేతల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని అమలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసులు పడుతున్న హైరానా పల్నాడు జిల్లాలో సంచలనంగా మారుతోంది. తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామాన్ని పోలీసులు టార్గెట్ చేశారు. ● వైఎస్సార్ సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ● హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసి వేధింపులు ● రౌడీషీట్స్ తెరచి బెదిరింపులు ● రూ.40 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని పోలీసుల ఒత్తిడి ● చెప్పినట్లు చేయకపోతే మరిన్ని కేసులు పెడతామని హెచ్చరికలు ● పోలీసుల తీరుపై హైకోర్టుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతలు సాక్షి, టాస్క్ఫోర్స్ : తంగెడ గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు బలవంతంగా తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారు. గ్రామంలో ఏ ఒక్క నేతను వదిలిపెట్టకుండా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, నిర్బంధంపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు దాచేపల్లిలో ఏం జరుగుతుందనే దానిపై ఉన్నతాధికారులు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దాచేపల్లి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఏ క్షణంలోనైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవచ్చుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కోవడంతో పాటుగా దశలవారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలీసులపై ఒత్తిడి పురాతన చరిత్ర కలిగిన తంగెడని పోలీసులు టార్గెట్ చేశారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల రోజున వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు పరస్పర దాడులు చేసుకుని పెట్రోల్ బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీకి చెందిన 25 మంది, టీడీపీకి చెందిన 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో ఈ కేసును అడ్డుపెట్టుకుని మరిన్ని కేసుల్లో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధంలేని వ్యవహారాలను అపాదించి, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. పలువురిపై అక్రమ కేసులు తంగెడకి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దేవళ్ల వీరాస్వామితో పాటుగా వట్టె రామిరెడ్డి, దేవళ్ల నీలిమేఘం, తండా సైదా, ఉప్పు హరికృష్ణ, గోగుల హరికృష్ణ, దేవళ్ల అంకిరాజులపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు.18 రోజుల పాటు పోలీస్స్టేషన్కి పోలీసులు పిలిపించి ఇబ్బందులు పెట్టారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరు ప్రతి రోజూ స్టేషన్కి రావడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో కుర్చోబెట్టి ఆ తరువాత ఇంటికి పంపించేవారు. ● తంగెడకి చెందిన వైఎస్సార్ సీపీ నేత గొగిరెడ్డి వెంకటరెడ్డి, మాదినపాటి జానీలపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేత షేక్ హుస్సేన్ గొర్రెలు మేపేందుకు వెళ్లగా వెంకటరెడ్డి, జానీ చంపుతామని బెదిరించినట్లుగా సృష్టించి కేసు పెట్టారు. ● మరో వైఎస్సార్ సీపీ నేత వట్టె రామచంద్రా రెడ్డిపై ఓ ఎస్సీ మహిళతో ఫిర్యాదు ఇప్పించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఒత్తిడి చేస్తున్నారు. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు ఈ ఫిర్యాదు సరైనది కాదని పట్టించుకోకపోవడంతో గ్రీవెన్స్లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ● ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు ఆరికట్ల మల్లారెడ్డి, కాసర్ల జానకీరెడ్డి, ఉప్పుతల పెదనరసింహారావుపై టీడీపీ నేత షేక్ జాకీర్హుస్సేన్తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేయించారు. వీరితో పాటుగా మరికొంతమందిపై కేసులు పెట్టించేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పోలీసుల స్వామిభక్తి -
జయహో భారత్.. జయహో సునీత !
అచ్చంపేట: మహిళా శక్తికి ప్రతీకగా నిలచిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తరువాత సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చిన సందర్భంగా మండలంలోని వేల్పూరు జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు 100మీటర్ల జాతీయ జెండాతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ టి.తులసి మాట్లాడుతూ సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి వచ్చిన క్షణాలు అద్భుతమని, ఆమె ధైర్య సాహసాలు అనితరసాధ్యమని కొనియాడారు. ఈ విజయం యావత్ భారతావని గర్వించదగినదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ భారతదేశంలోని ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందని తెలిపారు. జయహో భారత్..జయహో సునీత విలియమ్స్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం అగస్టీన్రెడ్డి, ఉపాధ్యాయులు మస్తాన్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ -
కిలోన్నర గంజాయి పట్టివేత
అమరావతి: మండల పరిధిలోని ధరణికోట ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి కిలోన్నర గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలోని పాగుబడిన కోళ్ల ఫారంలో గంజాయిని దాస్తుండగా పోలీసులు దాడి చేశారు. గమనించిన నిందితులు అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు కిలోన్నర గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అచ్చియ్య మాట్లాడుతూ పారిపోయిన వారి కోసం పోలీసు బృందాలు, ఈగల్ టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. -
ఆధునిక సాంకేతికతో మెరుగైన పనితనం
నరసరావుపేట: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని మెరుగైన విధి నిర్వహణను కనబర్చాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు పలు పోలీసుస్టేషన్ల నుంచి హాజరైన 55మందికి నూతన చట్టాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుళ్లలో పలువురు ఉన్నత విద్యతో పాటు ఎన్నో నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారని తెలిపారు. వాటిని వెలికితీసి, మెరుగులు దిద్ది స్టేషన్లో అన్ని విధులు నిర్వర్తించేలా తర్ఫీదు ఇవ్వడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. పనులను అందరూ పంచుకోవడం వల్ల ఒత్తిడి, భారం తగ్గుతుందని తెలిపారు. అప్పుడు చేసే పని చాలా సులువుగా మారి, పని చేయాలన్న ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు. స్టేషన్లో ఫిర్యాదు రాసే దగ్గర నుంచి రఫ్ స్కెచ్, ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు రాయడం, చార్జిషీటు తయారు చేయడం, అరెస్టు కార్డు రాయడం వంటి అన్ని పనులను అందరూ నేర్చుకోవాలని ఆయన సూచించారు. దీనివల్ల కేసుల్లో దర్యాప్తు త్వరగా పూర్తిచేసి నేరస్తులకు తగిన శిక్షలు వేయించడానికి వీలవుతుందని వివరించారు. తద్వారా బాధితులకు సకాలంలో న్యాయం చేసిన వారమవుతామని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ సీఐ బి.రమేష్బాబు పర్యవేక్షణలో నిర్వహించిన శిక్షణకు ట్రాఫిక్ సీఐ లోకనాథం, డీసీఆర్బీ సీఐ ఎం.శ్రీనివాసరావు, మహిళా పోలీసుస్టేషన్ సీఐ కేవీ సుభాషిణి, డీఎస్బీ ఎస్ఐ ఏ. శశికుమార్, డీసీఆర్బీ మహిళా ఎస్ఐ జి.అరుణజ్యోతి హాజరై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో పోలీసు సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ -
రైల్వే గేట్ల కష్టాలకు తెర
పెదకూరపాడు: సత్తెనపల్లి – అమరావతి మార్గంలో ప్రయాణికుల రైల్వే గేట్ల కష్టాలకు త్వరలో తెరపడనుంది. ఈ మార్గంలో పెదకూరపాడు వద్ద రోజుకు 40 సార్లు దాకా గేటు పడుతోంది. ప్రతిసారి 8 నుంచి 10 నిమిషాలు వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలో 30 గ్రామాల ప్రజలు, సత్తెనపల్లి పట్టణంలో అనేక కాలనీల్లోని ప్రజలు రైల్వే గేటుతో నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇదే దుస్థితి పల్రాడు ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ఉంది. ఆర్ఓబీలు మంజూరు పల్నాడు జిల్లాలో హైదరాబాద్ రైల్వే మార్గంలో మూడు చోట్ల లెవెల్ క్రాపింగ్ గేట్లు వద్ద ఆర్ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జిలు)ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణానికి సంబంధించిన గెజిట్ను రైల్వే శాఖ గెజిట్ను బుధవారం విడుదల చేసింది. సత్తెనపల్లి–అమరావతి రోడ్డులో (కాలచక్ర రహదారి) పెదకూరపాడు యార్డు వద్ద ఎల్సీ నెంబర్ 27 వద్ద, వెన్నాదేవి –కంకాణాల పల్లి రోడ్డు, దాచేపల్లి–కేసానుపల్లి రోడ్డులోని తమ్మలచెరువు –నడికూడి స్టేషన్ల మధ్యలో ఎల్సీ నంబర్ 81 దగ్గరున్న లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఆర్ఓబీలు మంజూరు చేసింది. ట్రాఫిక్, ప్రమాదాల నివారణకు చెక్ ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తాయి. క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. బ్రిడ్జిలు నిర్మాణం జరిగితే నిత్యం ప్రయాణికుల కష్టాలు తీరతాయి. ప్రమాదాలను కూడా నివారించవచ్చు. ఆర్టీసీ, ప్రైవేట్ పాఠశాల బస్సులతో పాటు లారీలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయి. తీరనున్న పల్నాడువాసుల చిరకాల కోరిక మూడు ఓవర్ బ్రిడ్జిల మంజూరు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, ప్రయాణికులు -
ప్రజాస్వామ్య విలువలకు ‘కూటమి’ తూట్లు
నరసరావుపేట: ప్రజాస్వామ్యం, విలువల గురించి ఎన్నికలకు ముందు మాట్లాడిన కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చాక వాటికి తూట్లు పొడుస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ విమర్శించారు. స్థానిక కోటప్ప కొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో గురువారం జిల్లా కమిటీ సభ్యులు వై.రాధాకృష్ణ అధ్యక్షతన పల్నాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20వేలు ఇవ్వకుండా మొండిచేయి చూపారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు, దిగుబడులు లేక రైతాంగం అల్లాడుతోందని చెప్పారు. రైతుల పక్షాన మాట్లాడిన రైతు సంఘం నాయకులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసి, వలసలు నివారించి, 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలు వలస వెళ్తున్న క్రమంలో ప్రమాదాల బారిన పడి ఆరుగురు చనిపోగా, 70 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారందరికీ న్యాయం చేయాలని విజయకుమార్ కోరారు. బనకచర్ల పేరుతో వరికపూడిశెల ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. వెనకబడిన పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పార్టీ చేపట్టే పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ ప్రకటించిన అభ్యర్థి విజయం కోసం పనిచేసిన నాయకులు, ప్రజాసంఘాలపై కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడడం తగదని ఆయన ఖండించారు. ఎన్నికల రోజున ఓటమి భయంతోనే కూటమి నేతలు ఏజెంట్లపై దాడులు, రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయనాయక్, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.శివకుమారి పాల్గొన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు ఎప్పుడు ? పంట కాలం ముగిసే వరకు సాగునీరు ఇవ్వాలి సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో గుంటూరు విజయకుమార్ -
మిర్చి రైతులకు సాగునీటి కష్టాలు
నరసరావుపేట: జిల్లాలో వారబందీ అమలులో ఎండ తీవ్రతకు మిర్చి పంట ఎండిపోతోందని, తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను రక్షించాలని ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామానికి చెందిన మిర్చి రైతులతో కలిసి నాగార్జునసాగర్ సంతగుడిపాడు సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ లక్షల రూపాయల పెట్టుబడులు ఒకవైపు, చీడపీడల బెడద మరోవైపు, ధరలు లేమితో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు నీటి కష్టాలు తోడు కావడంతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పారు. పంటకు నీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. సాగునీటి కోసం ఆందోళన చెందడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గతంలో నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజ్ ఉన్న సమయంలో కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను ఏకంచేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలు, నీటి అవసరాలపై ఎన్ఎస్పీ అధికారుల దగ్గర వివరాలు లేకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న మిర్చి, మొక్కజొన్న, దాళ్వా వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బ తినకుండా ఏప్రిల్ 20 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డీఈ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని, తక్షణమే నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఎన్ఎస్పీ డీఈని కలిసి వినతిపత్రం అందజేత -
దాడి ఘటనలో మహిళ మృతి
పిడుగురాళ్ల: నగదు విషయంలో ఇద్దరి మధ్యా జరిగిన ఘర్షణలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వాసుపల్లి సీతారత్నం (57) పని చేస్తోంది. ఇదే ఆరోగ్య కేంద్రంలో సత్తెనపల్లికి చెందిన మన్నెం శ్రీనివాసరావు హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరి మధ్యా పరిచయం పెరిగి చనువుగా ఉంటున్నారు. సీతారత్నం బ్రాహ్మణపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తోంది. ఆమెకు భర్త లేడు. శ్రీనివాసరావుతో పరిచయం పెరిగి తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు. గురువారం రాత్రి ఇద్దరి మధ్యా నగదు విషయంలో మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో శ్రీనివాసరావు, సీతారత్నంపై దాడి చేసి బలంగా నెట్టడంతో తల భాగం గోడకు తగిలింది. తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇరుగు పొరుగువారు గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు, ఎస్ఐ మోహన్ , సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. సీతారత్నం మృతికి కారకుడైన మన్నెం శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగదు విషయంలో ఘర్షణ -
రైలు కింద పడి వ్యక్తి మృతి
పెదకాకాని: రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పెదకాకానిలో జరిగింది. పెదకాకాని సుందరయ్యకాలనీకి సమీపంలో రైల్వేట్రాక్పై మృతదేహం ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున ౖపైలెట్ ద్వారా గుంటూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి రైల్వే ఎస్సై కె.దీపిక సిబ్బందితో చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి సమీపంలో డ్రైవింగ్ లైసెన్స్ కనిపించడంతో దాని ఆధారంగా మృతుడు పెదకాకానికి చెందిన పంది గోపీకృష్ణ(32)గా గుర్తించారు. మృతుడి కాళ్లు చేతులు దూరంగా పడి ఉన్నాయి. మృతుడి తండ్రి సాంబశివరావు నాలుగేళ్ల కిందట మరణించారు. గోిపీకృష్ణకు తల్లి జ్యోత్న్ప, తమ్ముడు ఉన్నారు. అతడు లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ కడలి దీపిక తెలిపారు. -
122 దరఖాస్తులను ఆమోదించిన పరిశ్రమల శాఖ
నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సింగిల్ డెస్క్ పోర్టల్పై ఈ నెలలో వచ్చిన 129 దరఖాస్తులకు గాను 122ను ఆమోదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.సుధాకర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలు అంశాలపై జేసీ సమీక్ష చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ క్లియరెన్స్, ఎస్సీ, ఎస్టీలకు పెట్టుబడి రాయితీ, పారిశ్రామిక అభివృద్ధిలో రాయితీ విధానం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన, సులభతర వ్యాపారంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, క్లస్టర్ డెవలప్మెంటు ప్రోగ్రాం తదతర పలు అజెండాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కేవైసీ ద్వారా దరఖాస్తుల ప్రాసెస్ వేగవంతంగా చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో ఇప్పటి వరకు 4950 మందికి శిక్షణ ఇచ్చామని, 3,357 దరఖాస్తులను బ్యాంకులకు పంపించామని జేసీ తెలిపారు. ఇందులో 521 మంజూరై 452 యూనిట్లకు రుణాలు విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఊయలే ఉరి తాడైంది !
రెంటచింతల: ప్రతి రోజూ సరదాపడి ఊగే ఊయలే తన ప్రాణం తీస్తుందని ఆ బాలుడు ఊహించలేకపోయాడు. రోజూ మాదిరే ఇంట్లో చీరతో కట్టిన ఊయల ఊగుతున్న సమయంలో మెడకు బిగుసుకుని ఊపిరాడక చిన్నారి మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా రెంటచింతలలో చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి మాణం కాలనీకి చెందిన సలిబండ్ల అద్విక్రెడ్డి(11) ఆరోగ్యం బాగో లేదని చెప్పి గురువారం పాఠశాలకు వెళ్లకుండా, అమ్మమ్మ ఇంటి పైగదిలో చీరతో కట్టిన ఊయల ఊగుతున్నాడు. మధ్యాహ్నం అన్నం తినడానికి కిందకు అద్విక్రెడ్డి రాకపోవడంతో అమ్మమ్మ కటకం శౌరీలు పైకి వెళ్లి చూసింది. ఊయల చీర అద్విక్రెడ్డి మెడకు బిగుసుకుని పోయి ఉండటం గమనించి కేకలు వేసింది. బంధువులు వెంటనే స్థానిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అద్విక్రెడ్డి స్థానిక ఫాతిమా విద్యానికేతన్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి నిర్మలారాణి అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తోంది. తల్లి, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడ వారిని కంట తడి పెట్టించింది. విద్యార్థి అద్విక్రెడ్డి అకాల మృతికి పాఠశాల డైరెక్టర్ ఏరువ మర్రెడ్డి, హెచ్ఎం ఏరువ స్టేఫీ స్టార్ సంతాపం తెలిపారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆగిన బాలుడి ఊపిరి -
వైఎస్సార్సీపీ నేత అక్రమ నిర్బంధం.. పరాకాష్టకు ‘కూటమి’ అరాచకాలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఈపూరు మండల వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ కొండవర్జి నాగేశ్వరరావు యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజాగళంలో మాట్లాడినందుకు నాగేశ్వరావును పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మిర్చి పొలానికి రాత్రి కాపలాకు నాగేశ్వరావు యాదవ్ దంపతులు వెళ్లగా.. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ లీగల్ టీం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పొన్నవోలు సుధాకర్రెడ్డిని ఈపూరు పోలీస్ స్టేషన్కు వైఎస్సార్సీపీ అధిష్టానం పంపించింది. దీంతో నాగేశ్వరరావు యాదవ్పై ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. ఈపూరు ఎస్ఐ వదిలేశారు.పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వినుకొండను కూటమి ప్రభుత్వం అరాచకాల అక్రమాలతో అనకొండగా మార్చిందని మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను టీడీపీ గుండాలు అత్యంత దారుణంగా హత్య చేశారు. పది నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. మీడియాతో మాట్లాడినందుకు నాగేశ్వరావు యాదవ్ను తీవ్రవాదిని తీసుకువెళ్లినట్టు పొలం నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో నేను వినుకొండ వచ్చాను. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి ధ్వజమెత్తారు.వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వినుకొండలో దారుణాలు, అక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలను నాయకుల్ని పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భయపెడితే భయపడే రకం ఇక్కడ ఎవరూ లేరు. అన్నిటికి సిద్ధమయ్యే ఉన్నాం. ప్రభుత్వం ప్రజల హక్కులను కాల రాస్తోంది. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని బ్రహ్మనాయుడు హెచ్చరించారు. -
నిర్ణీత గడువులోగారీ సర్వే పూర్తిచేయాలి
నకరికల్లు: భూముల రీసర్వేను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. మండలంలోని కండ్లకుంటలో సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి, సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులతో మాట్లాడారు. రీసర్వేపై ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే సత్వరమే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొలుత స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రాథమిక సేవలు, విద్యుత్ తదితర మౌలిక వసతులు తనిఖీ చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. అనంతరం చల్లగుండ్లలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపే పనులను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కూలీలతో మాట్లాడారు. సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పని ప్రదేశాల్లో టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. పొలాల్లో చెరువులను తవ్వుకుంటున్న రైతులతో మాట్లాడి, పలు సూచనలు ఇచ్చారు. ఈ– శ్రమ కార్డ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్వే అండ్ రికార్డ్స్ అధికారి మధుకీర్తి, డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, డీఈఓ చంద్రకళ, పలు శాఖల అధికారులు ఉన్నారు. కలెక్టర్ పి.అరుణ్బాబు మండలంలోని పలుచోట్ల పరిశీలన -
ప్రశాంతంగా పది పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 25,607మందికి గాను 25,373మంది, ప్రైవేటు విద్యార్థులు 78మంది హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థుల హాజరు 99శాతంగా నమోదైనట్టు ఆమె వివరించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నియమించిన 22 సిట్టింగ్, 13 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాలను సందర్శించినట్టు తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదవ తరగతి దూరవిద్య ఇంగ్లిష్ పరీక్షకు జిల్లాలోని 27 కేంద్రాల్లో 1,118మందికి గాను 977మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నకరికల్లు జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ నకరికల్లు, కారంపూడిలోని నాలుగు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులరెడ్డి సతైనపల్లి డివిజన్లోని ఆరు కేంద్రాలు, దూరవిద్య డైరెక్టర్ ఆర్.నరసింహారావు పట్టణంలోని ఐదు కేంద్రాలు, జాయింట్ డైరెక్టర్ ఎన్.గీత వినుకొండలోని 11 కేంద్రాలు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఎన్.అక్బర్ అలీ గురజాలలోని రెండు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 99శాతం విద్యార్థుల హాజరు పరీక్షల నిర్వహణను పరిశీలించిన అధికారులు -
సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు
ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యవసాయ కూలీలు ఫిబ్రవరి 9న సాయంత్రం మిరప కోతలకు వెళ్లి ట్రాక్టర్పై తిరిగి వస్తూ ప్రమాదంలో మృతి చెందారు. తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ ఒక్కో కుటుంబానికి రూ.25వేలు అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కలెక్టర్ అరుణ్బాబు హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆయా కుటుంబాలకు సాయం అందలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ సాంకేతిక కారణాలతో వెనక్కి వచ్చిందని స్థానిక ఆధికారలు చెబుతున్నారు. గత సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో బాధిత కుటుంబాలు నష్టపరిహారం అందివ్వాలని కోరాయి. బీమా పథకం అమలులో ఉంటే ప్రతి కుటుంబానికీ హక్కుగా రూ.10 లక్షలు దక్కేదని బాధితులు వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం లబ్ధిదారులు మరణించిన వెంటనే గంటల వ్యవధిలో సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వెళ్లి పేరు నమోదు చేసుకొని, మట్టి ఖర్చుల నగదు అందజేసేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: తీవ్ర పని ఒత్తిడితో ఉద్యోగం చేయలేక పోతున్నా.. వద్దు అంటే పెళ్లి చేశారు.. ఇప్పుడు ఉద్యోగం మానేస్తే భార్య తరఫు బంధువుల నుంచి మాట వస్తుంది.. ఒత్తిడి తట్టుకోలేక లోకం విడిచి వెళ్తున్నా..అమ్మా నాన్న నన్ను క్షమించండి ! అంటూ నాలుగు నెలల క్రితం వివాహం అయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు (29) కు నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన సౌజన్యతో నాలుగు నెలల కిందట వివాహం అయ్యింది. హనుమంతరావు రెండేళ్ల నుంచి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పెద్దలు అతనికి నచ్చ చెప్పారు. కొన్ని రోజులు బాగానే ఉండి రెండ్రోజుల కిందట భార్యను పుట్టింట్లో వదిలి నరసరావుపేట బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం నుంచి అతను గది బయటకు రాకపోవడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది మంగళవారం రాత్రి తలుపు బద్దలకొట్టి చూడగా ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ సీహెచ్ విజయ్ చరణ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు వివిధ మార్గాల్లో ప్రయత్నం బండ్ల హనుమంతరావు ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత పలు రకాలుగా ప్రయత్నం చేసి విఫలమై చివరకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భావిస్తున్నారు. కత్తితో మెడ కోసుకునేందుకు మొదట ప్రయత్నం చేశాడు. మృతుడి మెడ భాగంలో ఉన్న గాట్లను పరిశీలించిన పోలీసులు అక్కడ ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. పురుగు మందు తాగిన భార్య భర్త ఆత్మహత్య విషయం తెలుసుకున్నయ సౌజన్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. పని ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్ నాలుగు నెలల క్రితమే వివాహం -
అడ్డదారిలో తగ్గేదేలే !
సాక్షి , టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అక్రమార్కులకు వరంగా మారింది. అడ్డదారిలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వానికి రాయల్టీలు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో కూటమి నేతలు కూడా భాగస్వాములుగా చేరి బరితెగిస్తున్నారు. అడ్డ‘దారి’లో తగ్గేదేలే ! అంటూ విర్రవీగుతున్నారు. తమను అడ్డుకునేదెవరూ అంటూ రెచ్చిపొతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చే గ్రానైట్ లారీలను రాష్ట్ర సరిహద్దు దాటిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండల పరిధిలోని రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల మీదుగా రోజుకి 50కి పైగా లారీలు దాటిపోతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి చేరుతోంది. సరిహద్దు దాటించేందుకు భారీ వసూళ్లు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్ పుష్కలంగా ఉంది. లారీల ద్వారా తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. జాతీయ రహదారులపై అధికారులు తనిఖీలు చేసే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో దాటేలా స్కెచ్ వేశారు. చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లో లారీ బయలుదేరగానే సరిహద్దు దాటించే అక్రమార్కులకు ముందుగానే సమాచారం అందిస్తారు. గురజాలకు గ్రానైట్ లారీ వచ్చిన తరువాత అక్కడే బేరం కుదుర్చుకుంటారు. ఒక్కొ లారీకి రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తారు. కూటమి నేతలు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నారు. వీళ్ల కళ్లుగప్పి గ్రానైట్ లారీ సరిహద్దు దాటితే వెంటబడి, బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడతారు. మామూళ్లు ఇవ్వకపోతే అధికారులకు వీరే ఫోన్లు చేసి పట్టిస్తారు. గురజాలలో బేరసారాలు అక్రమాలకు పాల్పడే వారు సైతం ఎస్కార్ట్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పోలీసులు, మంత్రుల వాహనాలకు పోలీస్ సైరన్లు ఉంటాయి. కానీ గ్రానైట్ వాహనాలను సరిహద్దు దాటించే అక్రమార్కుల వాహనాలకు ఈ సైరన్లు అమర్చుకున్నారు. చీమకుర్తి, మార్టూరు నుంచి గ్రానైట్ వాహనాలు నకరికల్లు మీదుగా కారంపూడి అక్కడ నుంచి గురజాలకు వస్తాయి. అక్రమార్కులు వాహనం వద్దకు వెళ్లి బేరాలు మాట్లాడుకుని గురజాల నుంచి పులిపాడు, శ్రీనివాసపురం, పొందుగల మీదుగా రాష్ట్ర సరిహద్దు దాటిస్తారు. గ్రానైట్ వాహనాలకు ముందుగా కార్లలో, ద్విచక్ర వాహనాల్లో వెళతారు. అధికారులు ఉన్నారా..లేదా ? అని ఆరా తీస్తారు. కిందిస్థాయి సిబ్బంది ఉంటే కొంతముట్టజెప్పి సరిహద్దు దాటిస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇటువంటి అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఒకవేళ లారీలను మైనింగ్, వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఆపితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. సరిహద్దు దాటుతున్న గ్రానైట్, ఇసుక గురజాల వయా శ్రీనివాసపురం మీదుగా రవాణా లారీలను దాటించి సొమ్ము చేసుకుంటున్న కూటమి నేతలు ఒక్కో లారీకి రూ.40వేలకుపైగా వసూలు రోజుకి 50 లారీలకు పైగా రవాణా ఎస్కార్ట్ వాహనాలతో ఓ గ్యాంగ్ పహరా ప్రభుత్వ ఆదాయానికి గండి ఇసుక లారీలు రైట్ రైట్ ఇసుక లారీలుసైత సరిహద్దులు దాటిపోతున్నాయి. అచ్చంపేట, క్రొసూరు రీచ్ల నుంచి కూటమి సైన్యమే సరిహద్దు దాటిస్తోంది. ఒక్కో లారీకి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజుకి 40కిపైగా ఇసుక లారీలు అక్రమంగా సరిహద్దు దాటుతున్నాయి. ఇటీవల అధికారులు దాడులు చేసి గ్రానైట్, ఇసుక లారీలను పట్టుకున్నారు. పెనాల్టీలు చెల్లించిన తరువాత వదిలేయడం గమనార్హం -
డీఆర్డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ
నరసరావుపేట: జిల్లా డీఆర్డీఎ పీడీగా ఝాన్సీరాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె ఒంగోలు జిల్లాలో విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. కలెక్టర్ పి.అరుణ్బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన బాలూనాయక్పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. గేట్లో జశ్వంత్ భవానీకి 6వ ర్యాంక్ నరసరావుపేట ఈస్ట్: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2025 పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన పెంటేల జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించాడు. జశ్వంత్ భవాని తండ్రి రాజశేఖర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ముంబైలో 5జీ సిస్టమ్ ఇంజనీర్గా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గేట్ పరీక్షలకు జశ్వంత్ సిద్ధం అయ్యాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. ఇందులో దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేశారు. 1,27,005 బస్తాల మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,27,005 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,24,077 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,903 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్న ప్రభుత్వం
చిలకలూరిపేట: రాజకీయ అరాచకాలకు పరాకాష్ట కూటమి ప్రభుత్వ పాలన అని... న్యాయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పరిపాలనపై, పేదలపై ప్రేమ లేదని, కేవలం రాజ్య హింసను మాత్రమే ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్డా రాకేష్గాంధీ కేసు విచారణ నిమిత్తం చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బుధవారం ఆయన హాజరయ్యారు. మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించడంలో పురోగతి సాధించిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కోరితే రాష్ట్ర డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వరని, టీడీపీ వారు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే ఏ మాత్రం కేసులు నమోదు చేయరని ఆరోపించారు. అదే టీడీపీకి చెందిన వారు ఫిర్యాదు చేయడం ఆలస్యం, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు రాష్ట్రం నలుమూలల కేసులు నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న ఆరాచక వైఖరిని మర్చిపోమని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పోలీసు అధికారులను న్యాయ స్థానాల ముందు నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు. జర్మనీలో హిట్లర్ పరిపాలన కాలంలో ముందుగా యూదులను వేధించారని, తమను కాదని కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నారన్నారు. అనంతరం కమ్యూనిస్టులను, సోషలిస్టులను కూడా వేధించారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న ప్రభుత్వం తదుపరి సమస్యలపై ప్రశ్నించే ప్రతి గొంతుకను వేధించటం ఖాయమన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు. అన్నీ తప్పుడు కేసులే ! ప్రస్తుతం కేసులు బనాయించి వేధిస్తున్న దొడ్డా రాకేష్ గాంధీ కేసులో పేర్కొన్న ఆరో తేదీ రాత్రి 9గంటలకు గుంటూరులోని శ్యామలానగర్లో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు ఉన్నాయని, అవి న్యాయస్థానంలో అందజేశామని తెలిపారు. ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఫణీంద్ర అదే సమయంలో గుంటూరులోని ఓ సెలూన్లో ఉండగా, మరో ముద్దాయి రామకోటేశ్వరరావు హైదరాబాద్లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఇలాంటి తప్పుడు కేసుల్లో పోలీసుల తరుఫున డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ స్థాయి న్యాయాధికారి హాజరుకావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు వేరే ఉన్నాయని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. రాకేష్గాంధీని కస్టడీకి తీసుకొని తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. భారతదేశంలో పోలీసుల ముందు ఇచ్చిన వాగ్మూలానికి చట్టబద్దత ఉండదని తెలిపారు. బీసీ మహిళ అయిన మాజీ మంత్రి విడదల రజినీని కేసులో ఇరికించి వేధించేందుకే పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను న్యాయపరంగా ఆదుకొనేందుకు, అరాచకాలను అడ్డుకొనేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి సుదీర్ఘ వాదనలు రాకేష్గాంధీకి బెయిల్ మంజూరు చేయాలని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. అతనిని పోలీసు కస్టడికి అప్పగించాలని డీడీవోపీ బర్కత్ అలిఖాన్ పోలీసుల తరఫున వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఆర్డర్లు జారీ చేస్తామని వెల్లడించారు. -
గేట్లో హేమంత్కు 25వ ర్యాంకు
నూజెండ్ల: గేట్–2025 పరీక్ష ఫలితాల్లో ఘంటా హేమంత్ 25వ ర్యాంకు సాధించాడు. ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అతడు ప్రస్తుతం చైన్నె ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులైన ఘంటా నాగేశ్వరరావు, సుజాత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మైక్రోసాఫ్ట్కు ఎంపికయ్యాడు. గేట్ ర్యాంకు ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో హేమంత్ పీజీ చేయటానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ స్కాలర్షిప్లు పొందుతూ చదువుకునే అవకాశాలు ఉంటాయని నాగేశ్వరరావు తెలిపారు. -
సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్న
దొడ్లేరు(క్రోసూరు): సాగర్ నీళ్లు విడుదల కాక, వదిలినా దిగువ పొలాలకు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం దొడ్లేరులో రైతులు ధర్నా చేపట్టారు. రబీలో దాళ్వా వరి సాగు చేస్తున్న వారంతా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువల్లో చుక్క నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. క్రోసూరు మండలం దొడ్లేరు పరిధిలోని కస్తల మైనర్ కింద 500 హెక్టార్ల ఆయకట్టు ఉంది. దీనికి నాగార్జున సాగర్ కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తారు. అవి ఎర్రబాలెం మేజర్ దాటుకుని, చింతపల్లి మేజర్కు వెళ్లే మార్గంలో దొడ్లేరులోని కస్తల మైనర్కు రావాలి. అయితే, నీళ్లందక కస్తల మైనర్ డ్రాప్ కూడా ఎండిపోయింది. పొలాలకు నీళ్లు వచ్చే దిక్కే లేదు. దీనిపై కెనాల్స్ ఏఈ బండి శ్రీనివాసరావును వివరణ కోరిగా 500 క్కూసెక్కులకు గానూ ప్రస్తుతం 350 మాత్రమే సరఫరా అవుతున్నాయని తెలిపారు. వారాబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. నాలుగు రోజులు ఎర్రబాలెం మేజర్కు, తర్వాత నాలుగు రోజులు కస్తల మైనర్కు వదులుతామని తెలిపారు. గురువారం దొడ్లేరు పొలాలకు విడుదల చేస్తామని వెల్లడించారు. పంటలను కాపాడండి నేను పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. కాలువ నీళ్లు రాకపోవడంతో కళ్ల ఎదుటే పంట ఎండి పోతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. –షేక్ బాషా, దొడ్లేరు నీరు అందడం లేదు కాలువకు నీళ్లు విడుదల చేయడం లేదు. చేసినా కింద పొలాలకు అందడం లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. – షేక్ కరీమూన్, దొడ్లేరు పది రోజులుగా ఎండిపోతున్న పంటలు -
జలాల్పురంలో ఆధ్యాత్మిక శోభ
● భక్తిశ్రద్ధలతో పునీత జోజిప్ప మహోత్సవం ● పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు ● ఆకట్టుకున్న సాంఘిక నాటిక పెదకూరపాడు: మండలంలోని జలాల్పురంలో బుధవారం పునీత జోజిప్ప దేవాలయ పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాటిబండ్లి విచారణ గురువులు రెవరెండ్ హదయకుమార్, సహాయక గురువులు సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దివ్య పూజ బలిని నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి హదయకుమార్, సురేష్ మాట్లాడారు. ఆధ్యాత్మక చింతనతో ప్రతి ఒక్కరూ సిలువ మార్గంలో నడవాలని కోరారు. తోటి వారికి సాయం చేస్తూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని కోరారు. పునీత జోజిప్ప మానవాళికి మార్గదర్శమని తెలిపారు. పలువురు గురువులు మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు పునీత జోజిప్ప మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిచారు. బాల ఏసు యువజన నాట్యమండలి కళాకారులు ప్రత్యేక నాటికలను ప్రదర్శించారు. రాత్రి భారీ బాణసంచా కాల్చుతూ, మేళతాళాలతో గ్రామంలో తేరు ఊరేగింపు నిర్వహించారు. -
పత్తి వ్యాపారి ఆత్మహత్య
ప్రత్తిపాడు: పత్తి వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన కాసు నాగిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ పదేళ్లుగా పత్తి కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా బామిని మండలం దమ్మిడిజోలా గ్రామ పరిధిలోని రైతుల దగ్గర పత్తిని కమీషన్ పద్ధ్దతిన బొమ్మా కొండారెడ్డి అనే అతనికి ఇప్పిస్తుంటాడు. అయితే ఆ పత్తికి సంబంధించిన డబ్బులు, కమీషన్ కలిపి నాగిరెడ్డికి రూ.43 లక్షలు కొండారెడ్డి ఇవ్వాల్సి ఉంది.కొంత కాలంగా రైతులు డబ్బులు అడుగుతున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని, రైతుల పత్తికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని కొండారెడ్డిని నాగిరెడ్డి అడుగుతున్నాడు. దీంతో తన దగ్గర డబ్బులు లేవని, పదే పదే డబ్బులు అడిగితే కోర్టులో కేసు వేస్తానని కొండారెడ్డితోపాటు ఆయన సోదరుడు శ్రీనివాస్రెడ్డి నాగిరెడ్డిని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మంగళవారం గ్రామంలోని సాగర్ కాలువ వద్ద ఉన్న సమాధుల వద్ద పురుగు మందు తాగి నాగిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు విషయాన్ని అతని భార్య రాజ్యలక్ష్మికి తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు ఎస్ఐ కె.నాగేంద్ర బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాయి సాధన చిట్ ఫండ్ కేసు గుంటూరుకు బదిలీ
నరసరావుపేటటౌన్: సాయి సాధన చిట్ ఫండ్ స్కాం కేసు గుంటూరు సీఐడీ కోర్టుకు బదిలీ అయ్యింది. సుమారు 600 మంది చిట్స్ సభ్యులు, డిపాజిట్ దారులను భారీస్థాయిలో మోసగించినట్లు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్బారెడ్డి ఫిర్యాదుతో నెల కిందట వన్టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇందులో గ్రావిటీని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సీఐడీకి అప్పగించడంతో పాటు కొన్ని ప్రత్యేక చట్టాలను కూడా జత పరిచింది. దీంతో కేసును సీఐడీ కేసుల విచారణ కోర్టు అయిన గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బుధవారం గుంటూరు సీఐడీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. దీంతోపాటు 13వ అదనపు జిల్లా కోర్టులో పాలడుగు పుల్లారావు కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బదిలీ అయింది. కాగా పాలడుగు పుల్లారావుతో పాటు చిట్ఫండ్లో భాగస్వాములుగా ఉన్న ఆయన భార్య వాణిశ్రీ , కుమారుడు పవన్ కుమార్, కుమార్తె శ్రీహర్షవర్ధిని, అల్లుడు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ నూకవరపు రాజా రమేష్, నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన గాలి కోటయ్యలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. పుల్లారావు ఇప్పటికే కోర్టులో లొంగిపోయి జైల్లో ఉండగా, మిగిలిన వారు పరారీలో ఉండి, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య దాచేపల్లి : మండలంలోని పొందుగల రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం నుంచి తల వేరు అయింది. శరీరంపై నలుపు రంగు బనియన్, ప్యాంట్ ఉంది. సంఘటన స్థలాన్ని జీఆర్పీ ఏఎస్ఐ వెంకట్రామయ్య, కానిస్టేబుల్ రామరాజు పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలకు 9440438256, 9949063960 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సాగర్ ఎర్త్డ్యాం కింద అగ్నికీలలు
● నాలుగు గంటల శ్రమ అనంతరం అదుపులోకి వచ్చిన మంటలు ● కాలిపోయిన సీసీ కెమెరాల కేబుల్వైర్లు ● అగ్నికి ఆహుతైన విద్యుత్ కేబుల్ విజయపురి సౌత్: సాగర్ ప్రధాన డ్యాం ఎడమ వైపున గల ఎర్త్డ్యాం కింద బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు లేచాయి. ఎండిన కార్పె గ్రాస్కు అంటుకోవడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున లేచాయి. దిగువనే ఉన్న శివం పార్కులో ఎండిన గడ్డి ఉండటంతో దానికి మంటలు అంటుకుని గాలి వాటానికి కిలోమీటరు మేర తగలబడింది. మెయిన్ డ్యాంకు సమీపంలో వ్యూ పాయింట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ పోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బంది అధికారులను అలర్ట్ చేశారు. మెయిన్ డ్యాం ముఖ ద్వారం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది, జెన్కో, సాగునీటి శాఖ సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. ఈలోపు ఫైర్ ఇంజన్ వచ్చింది. నాలుగు గంటల శ్రమ అనంతరం ఎట్టకేలకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఎర్త్ డ్యాంపై గల విద్యుత్ కేబుల్స్, సీసీ కెమెరాల కేబుల్స్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి కావడంతో ఎంతమేరకు నష్టం జరిగింది తెలియడం లేదని డ్యాం ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం అంచనా వేస్తామని వెల్లడించారు. -
జాతీయ రహదారిపై లిక్కర్ లారీ బోల్తా
యడ్లపాడు: జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి లిక్కర్ లారీ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి మద్యం లోడుతో సామర్లకోట వెళుతున్న లారీని రోడ్డు పక్కగా ఆపి డ్రైవర్ నిద్ర పోతున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ లిక్కర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిక్కర్ లారీ సర్వీస్ రోడ్డుపై పడిపోగా, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం సీసాలు పగిలి రోడ్డుపై పడిపోయాయి. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని లీకేజీని పరిశీలించారు. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించి, లారీ తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం విజయపురిసౌత్త్: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సరోజిని తెలిపారు. ఆమె కళాశాలలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ కల్లా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ చేరడానికి ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు 26 కేంద్రాల్లో ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఫీజు రూ. 300ను ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. గురుకుల, జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నోట్, టెక్ట్స్ బుక్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, నీట్, సీఏ(సీపీటీ) కోచింగ్ ఇస్తామని తెలిపారు. నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం www.aprrapcfrr.in వెబ్సైట్లో చూడాలని ఆమె సూచించారు. అర్హత గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. జూట్ ఉత్పత్తులతో ఆర్థికాభివృద్ధి సాధించాలి రాజుపాలెం: జూట్ ఉత్పత్తుల తయారీలో శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సీఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ బి. బబిత తెలిపారు. మండలంలోని కొండమోడు మండల పరిషత్ పాఠశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ఆధ్వర్యంలో మహిళలకు జూట్ ఉత్పత్తుల తయారీలో శిక్షణను బుధవారం ప్రారంభించారు. డైరెక్టర్ బబిత మాట్లాడుతూ నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామంలోని ముస్లిం మహిళలకు జూట్ ఉత్పత్తుల శిక్షణను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ ప్రోగ్రాం అధికారి మండూరి వెంకటరమణ, శిక్షకురాలు పి.దుర్గ, కె.ఎన్.ఆర్. విద్యా సంస్థల డైరెక్టర్స్ కోనేటి నరసింహారావు, బాడిసె మస్తాన్రావు పాల్గొన్నారు. మొదటి రోజు శిక్షణకు 50 మంది మహిళలు హాజరయ్యారు. -
తెల్లజొన్న రైతు విలవిల
కొల్లూరు: ఖరీఫ్లో వరి సాగు చేసిన అన్నదాతలు మూడొంతులు పంట అయినకాడికి దళారులకు విక్రయించి నష్టాలను చవిచూశారు. నామమాత్రంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సామాన్య రైతులు పండించిన పంటల విక్రయానికి ఆంక్షలు ఎదురవడంతో దళారులను ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుతం రబీలో సాగు చేసిన పంటకై నా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి పారదర్శకంగా కొనుగోలు చేస్తుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురవుతోంది. దీనంగా తెల్లజొన్న రైతుల పరిస్థితి రబీలో తెల్లజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దీనంగా మారింది. నియోజకవర్గంలో చుండూరు, అమృతలూరు మండలాలలో రైతులు అధిక శాతం మినుము, పెసర సాగు చేశారు. పెసర పంటకు మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు మండలాలలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగైంది. సుమారు 8 వేల ఎకరాలకు పైగా తెల్లజొన్న సాగులో ఉంది. కొనే దిక్కేది? కొల్లూరు మండలంలో 1,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తెల్లజొన్న వేయగా.. ప్రస్తుతం పంట చేతికందింది. రైతులు జొన్న కంకులు కోసుకొని నూర్పిళ్లు పూర్తి చేస్తున్నారు. మండలంలోని కొల్లూరు, క్రాప, అనంతవరం, చిలుమూరు ప్రాంతాలలో తెల్లజొన్న కంకులు కోత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 200 ఎకరాల వరకు జొన్న కోతలు పూర్తయ్యాయి. ఎకరాకు సుమారు రూ. 20 వేలు పెట్టుబడులు పెట్టారు. సగటున 25 బస్తాల దిగుబడి లభిస్తోంది. గతేడాది ఇదే సమయంలో జొన్న క్వింటాకు రూ. 2,400 వరకు లభించడంతో రైతులకు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించకపోవడంతో క్వింటాకు దళారులు రూ. 2 వేలు నుంచి రూ. 2,100 వరకు ఇస్తున్నారు. దీంతో రైతాంగం నష్టపోతోంది. రబీలో సాగు చేసిన పంటల విక్రయాలకు వీలుగా వ్యవసాయ శాఖాధికారులు ఈక్రాప్ బుకింగ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. పంట చేతికందినా విక్రయించే మార్గం శూన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలు, మద్దతు ధర లేక ఆవేదన దళారులకు తక్కువ ధరకే అమ్మాల్సిన దుస్థితి కూటమి సర్కారు తీరుతో నష్టపోతున్న అన్నదాతలు కొనుగోలు కేంద్రాల ఊసేదీ? రబీలో సాగు చేసిన పంటల కొనుగోలుకు వ్యవసాయ శాఖాధికారులు పంట నమోదు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దళారులు చెప్పిన ధరలకే అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పంట కోతలు చివరి దశకు చేరుకునే సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండాపోతుంది. – టి. సురేష్, రైతు అనుమతులొస్తే కేంద్రాలు ఏర్పాటు తెల్లజొన్న ప్రస్తుతం కోత దశకు రావడంతో రైతులు నూర్పిళ్లు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో మార్క్ఫెడ్ నుంచి ఆదేశాలు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం – ఆర్.వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖాధికారి, కొల్లూరు. -
మాలలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర
నరసరావుపేట: రాష్ట్రంలో మాలలు, వారి ఉప కులాలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ మాల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తల జయరావు ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి హాజరైన జాన్పాల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 2021 జనాభా లెక్కలు తేల్చకుండా వర్గీకరణ అమలు చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో వేసిన వన్మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపటాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ చేసిన సూచనలను అమలు చేయకుండా, ఎంపారికల్ డేటా తీయకుండా రాష్ట్ర విభజనకు ముందు ఉన్న 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకొని వర్గీకరణ చేయటం దారుణన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజా పోరాటంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రోజుల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ గోదా బాల, జిల్లా ఉపాధ్యక్షుడు కోండ్రు విజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రపాటి ఎర్రయ్య, నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేబినేట్ ఆమోదంపై మాల మహానాడు ఆగ్రహం -
బీసీ సంక్షేమ సంఘం జిల్లా కో–కన్వీనర్గా తిరుమల
సత్తెనపల్లి: బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా కో–కన్వీనర్గా సత్తెనపల్లికి చెందిన సంకుల తిరుమలరావు (తిరుమల), నియోజకవర్గ అధ్యక్షుడిగా మందడపు శివసాయిలు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంకళరావు యాదవ్ నుంచి తిరుమల, శివసాయిలు మంగళవారం నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల, శివసాయి నియామకంపై పలువురు హర్షం వెలిబుచ్చారు. గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య పిడుగురాళ్ల: గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుత్తికొండ గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన పరిటాల పోతురాజు(60) అనే రైతు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సక్రమంగా లేకపోవటం వలన సోమవారం రాత్రి గడ్డిమందు తన ఇంట్లోనే తాగాడు. గమనించిన భార్య హనుమాయమ్మ వెంటనే హుటాహుటిన పిడుగురాళ్ల ప్రైవేటు హాస్పటల్కు తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం గుంటూరు జీజీహెచ్లో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుమారుడు పరిటాల రామలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ పేర్కొన్నారు. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి నరసరావుపేటటౌన్: మీటర్ రీడర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సంఘ ప్రతినిధులు మంగళవారం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ రాంబొట్లను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి షేక్ యాసిన్, జాయింట్ సెక్రటరీ శివసాయి మాట్లాడుతూ మీటర్ రీడర్స్కి కనీస వేతనం అమలు చేయాలన్నారు. మీటర్ రీడర్స్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. రిచార్జి స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ అందరికీ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలన్నారు. గత 20 ఏళ్లుగా చాలీచాలని జీతంతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ సంఘం రాష్ట్రవ్యాప్త ప్రథమ మహాసభ అనంతరం కార్యచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మీటర్ రీడర్స్ కార్మికులు మార్చి 18న డీఈ ఆఫీస్ ముందు ధర్నా, 20న ఎస్ఈ ఆఫీసు ముందు ధర్నా, 24న కలెక్టర్కు సమస్యలపై వినతి పత్రం సమర్పించడం, 27న సీఎండీ కార్యాలయం ముందు ధర్నా తదితర కార్యచరణ రూపొందించామన్నారు. అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య దామరపల్లి(తాడికొండ): వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల బాధ పెరిగి కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడికొండ మండలం దామరపల్లి గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టం వస్తుండటంతో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చారు. కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపం చెందారు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడికి గురిచేస్తుండటంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో మనస్థాపంతో శ్రీనివాసరావు భార్య అరుణ కుమారి ఈనెల 14న పొలానికి వేసేందుకు తెచ్చిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మంగళవారం ఉదయం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. పట్టాభిపురం సీఐ పోస్టుపై సందిగ్ధం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పశ్చిమ సబ్ డివిజన్లోని పట్టాభిపురం పీఎస్ సీఐ పోస్టుపై సందిగ్ధం నెలకొంది. వీఆర్లో ఉన్న సీఐ ఎం.మధుసూదనరావును ఈనెల 16న పట్టాభిపురం పీఎస్ సీఐగా నియమిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి వరకు విధుల్లో ఉన్న వీరేంద్రబాబును సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కొత్త సీఐగా మధుసూదనరావు అదే రోజు రాత్రి స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్కు బ్రేక్పడినట్లు తెలుస్తోంది. దీంతో సందిగ్ధం నెలకొంది. బుధవారం సాధ్యమైనంత వరకు ఆయనే మళ్లీ సీఐగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. -
రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం
నరసరావుపేట: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రావిపాడు గ్రామ రైతులకు తగిన నష్టపరిహారం ఇస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో భూములు కోల్పోతున్న నరసరావుపేట మండలం రావిపాడు గ్రామస్తులకు నష్టపరిహార చెల్లింపులపై నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జేసీ హాజరై రైతులకు ఈ మేర హామీ ఇచ్చారు. ఆర్డీఓ కె.మధులత, జాతీయ రహదారి విస్తరణ అధికారులు, తహసీల్దార్ వేణుగోపాలరావు, మండల సర్వేయర్ మాట్లాడారు. రైతులు పాల్గొన్నారు. -
రజకుల సత్రం స్థలాన్ని కాపాడండి
నరసరావుపేట: కోటప్పకొండరోడ్డులోని రజకుల సత్రం స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని స్థలాన్ని తిరిగి ఇవ్వాలని అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు కోరారు. మంగళవారం కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ కె.మధులతను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు ఉదయగిరి వెంకటస్వామి మాట్లాడుతూ గుంటూరు బ్రహ్మయ్యకు సేవలు చేసినందుకు గాను 1940లో కోటప్పకొండరోడ్డులోని వారి స్థలంలో ఐదుసెంట్ల భూమిని రజక వర్గీయులైన దడిగె లక్ష్మయ్య, రాఘవులకు ఇవ్వటం జరిగిందన్నారు. ఆ భూమిలో ఐదేళ్లలో సత్ర నిర్మాణం చేసుకోవాలని కండిషన్ పెట్టడంతో కష్టపడి చందాలు వసూలుచేసి అన్నపూర్ణ సత్ర నిర్మాణం చేశారన్నారు. ఆ స్థలాన్ని రజకులకు రిజిష్టర్ చేయటం జరిగిందన్నారు. వారిలో రాఘవులు చనిపోవటంతో అతడి మృతదేహాన్ని సత్రం వెనుక పూడ్చిపెట్టి సమాధి నిర్మాణం చేశారన్నారు. అప్పటినుంచి కోటప్పకొండకు వచ్చే రజక భక్తులకు అన్నపానీయాలు అందజేయటం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో సమాధిని కూలగొట్టి దానిపక్కనే ఉన్న వారి స్థలంలో కలుపుకొని మొత్తానికి ప్రహరీ ఏర్పాటు చేశారన్నారు. ఈ చర్యతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకొని, రజకుల స్థలాన్ని కాపాడాలని వారు కోరారు. నడికోట సూర్యనారాయణ, దమ్మాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దన్నవరపు ఆదిలక్ష్మి, జి.హనుమంతరావు, డి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓను కోరిన అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు -
బియ్యం పంపిణీ సక్రమంగా లేకుంటే చర్యలు
నరసరావుపేట: రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయని ఎండీయూ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.నారదముని హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో ఎండీయూ ఆపరేటర్లపై పలు ఆరోపణలు వచ్చాయన్నారు. దీని వలన జిల్లాకు చెడ్డపేరు వస్తుందన్నారు. బియ్యం సమయానికి పంపిణీ చేయాలని, నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని ఎంఎల్ఎస్ పాయింట్కు తిరిగి అప్పగించి, మంచి బియ్యం తీసుకొని కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే పంపిణీ చేసే సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అందజేయాలన్నారు. ఫిర్యాదులు నమోదైన ఎండీయూ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.నారదముని -
రైతు కుటుంబాలు, స్థానికులకు ఉద్యోగాలు
సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులకు సూచించిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకై పొలాలు ఇచ్చిన రైతు కుటుంబాల్లో అర్హులైన వారికి విధిగా ఉపాధి కల్పించి, ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.అరుణబాబు ఆయా కంపెనీల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్లో భవ్య, చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులతో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా అభివృద్ధికి పరిశ్రమల అవసరం చాలా ముఖ్యమన్నారు. సిమెంట్ పరిశ్రమలు ఉన్న తంగేడ, పెదగార్లపాడు ప్రదేశాలలోని పొలాలు రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తుల తరపున జానీబాషా, సీవీ రావు లేవనెత్తిన ఐదు ప్రధాన అంశాలపై సంబంధిత రెవెన్యూ, పంచాయతీ రాజ్, సర్వే, వ్యవసాయ, ఉద్యాన, హౌసింగ్ తదితర శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 10 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. దాని ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కంపెనీల యజమాన్యాలు ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాతూ పరిశ్రమల యాజమాన్యం స్థానిక ప్రజల మనసు దోచుకొనే విధంగా పలు చర్యలు చేపట్టాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా వ్యవహరించాలని కోరారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఎ.మురళి, గురజాల ఆర్డీఓ మురళి, జిల్లా పరిశ్రమల అధికారి రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి నజీన బేగం, డీపీఓ ఎంవీ భాస్కరరెడ్డి, డీఏఓ ఐ.మురళి, ఉద్యాన శాఖాధికారి సీహెచ్.వి.రమణారెడ్డి, హౌసింగ్ పీడీ ఎస్.వేణుగోపాలరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కంది, శనగ రైతులు పేర్లు నమోదు చేయించుకోవాలి
జిల్లా వ్యవసాయాధికారి మురళి నాదెండ్ల: రబీలో సాగైన కంది, శనగలను ప్రభుత్వం మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నందున ముందుగా రైతులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి చెప్పారు. సాతులూరులో రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న మొక్కజొన్న, మిరప పంటలకు సాగునీరు లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంది మద్దతు ధర క్వింటా రూ.7550లు, శనగ రూ.5650లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్వరలో రైతు సేవా కేంద్రాల ద్వారా రెండు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం డీడీఏ ఎం.శివకుమారి మాట్లాడారు. అనంతరం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించారు. నరసరావుపేట ఏడీఏ మస్తానమ్మ, ఏఓ హరిప్రసాద్, ఏఈఓలు బి.జీవన్నాయక్, వేణుగోపాల్, రామారావు, జీడీసీఎంఎస్ కొనుగోలు ఇన్చార్జి రామారావు పాల్గొన్నారు. -
లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక!
గోల్డ్మెన్ పెరుమాళ్ల రాజేష్ కేసులో కొత్త మలుపు పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో గోల్డ్మెన్ (గోల్డ్ బిస్కెట్ల విక్రయదారుడు) పెరుమాళ్ల రాజేష్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పిడుగురాళ్ల పట్టణంతోపాటు చుట్టుపక్కల పట్టణాల్లోని పలువురు వ్యాపారుల వద్ద రూ.8 లక్షలు విలువ చేసే 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ను రూ.7లక్షలకు ఇస్తానని చెప్పి రూ.కోట్లు వసూళ్లు చేసి పట్టణం విడిచి పారిపోయిన ఘటన ఈనెల 11వ తేదీన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసుకొని బాధితులకు బిస్కెట్లు ఇవ్వకుండానే శ్రీలంకలో తలదాచుకున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తెరపైకి టీడీపీ నేత చేబు పేరు.. ఈక్రమంలో టీడీపీ ఆర్యవైశ్య నాయకుడు చేబు సురేష్ పాత్ర తెరపైకి వచ్చింది. బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు తీసుకొని వస్తానని మాయచేసి వ్యాపారులకు రూ.కోట్లు కుచ్చుటోపీ పెట్టిన రాజేష్ మిత్రుడే ఈ చేబు సురేష్. పెరుమాళ్ల రాజేష్ మార్చి 3వ తేదీ బోర్డు తిప్పేసి శ్రీలంక వెళ్లినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 28వ తేదీన పిడుగురాళ్ల పట్టణంలోని డీబీఎఫ్ బ్యాంక్లో తాను దాచుకున్న బంగారు, వెండి ఆభరణాలతో కూడిన రెండు గోతాలను రాజేష్ తన మిత్రుడైన చేబు సురేష్ వద్ద దాచి ఉంచాడన్న వార్త ఇప్పుడు పట్టణంలో హాట్టాపిక్గా మారింది. అయితే రాజేష్ కనిపించకుండా పోయినప్పటి నుంచి చేబు సురేష్ రాజేష్కు డబ్బు ఇచ్చిన మోసపోయినవారందరితో మీ అందరికీ న్యాయం చేస్తానని, అందుకు కోటికి రూ.లక్ష ఇస్తే పోలీసుల సహాయంతో పెరుమాళ్ల రాజేష్ను పట్టకొచ్చి డబ్బులు వసూళ్లు చేయిస్తానని బాధితులతో మాట్లాడి ఇప్పటికే సుమారు రూ.10 లక్షలు వసూళ్లు చేసినట్లు పలువురు బాధితులు పేర్కొంటున్నారు. తనకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండదండలు ఉన్నాయని, తన్ను నమ్మితే రాజేష్ను పట్టకొచ్చి ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వచ్చేలా న్యాయం చేస్తానని చేబు సురేష్ బాధితులతో చర్చించాడనేది కొసమెరుపు. తెరపైకి టీడీపీ నాయకుడు చేబు సురేష్ పేరు సురేష్ వద్దే రాజేష్ బంగారం, వెండి వస్తువులు దాచినట్లు ఆరోపణలు స్వాధీనం చేసుకున్న పోలీసులు! నిందితుడిని ఎలాగైనా పట్టిస్తానని బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన సురేష్!బంగారు ఆభరణాల గోతాలు స్వాధీనం! ఇదిలా ఉండగా బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయటంతో పిడుగురాళ్ల పట్టణ పోలీసులు కేసును మంగళవారం రంగంలోకి దిగారు. డీబీఎస్ బ్యాంక్కు వెళ్లిన పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన సీసీ ఫుటేజ్ పరిశీలించటంతో రాజేష్ మిత్రుడు సురేష్కు రెండు బంగారు ఆభరణాల గోతాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ విషయమై సురేష్ను పట్టణ పోలీసులు విచారించే కార్యక్రమం మొదలు పెట్టారు. అంతేకాకుండా రెండు గోతాల నగల గోతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెరుమాళ్ల రాజేష్ ముఖ్య అనుచరుడైన వందనపు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పెరుమాళ్ల రాజేష్ కోసం మూడు, నాలుగు బృందాలుగా పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. హైదరాబాద్, కోల్కత్తా, ఇతర ప్రాంతాల్లో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
వైవీ మాతృమూర్తికి కన్నీటి వీడ్కోలు
భారీగా చేరుకున్న అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ప్రతినిధి,బాపట్ల: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో మృతిచెందగా స్వగ్రామం మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు మంగళవారం బంధువులు, పార్టీశ్రేణుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకొని వేలాదిగా కార్యకర్తలు, అభిమానులే కాదు సామాన్య జనమూ తరలి వచ్చారు. ఎంతగా అంటే జనం తాకిడికి జగన్ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ తర్వాత జగన్ వైవీ ఇంటికి చేరుకొని అక్కడ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించి చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, చిన్నమ్మ స్వర్ణమ్మ, చిన్నాన్నలు వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి, సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్రెడ్డిలతోపాటు వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. భుజంతట్టి ఓదార్చారు. అక్కడే ఉన్న తల్లి విజయమ్మ, మేనమామ రవీంద్రనాథరెడ్డి ఇతర బంధువులతో మాట్లాడారు. అర్ధగంట పాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో గడిపారు. వైఎస్సార్ సీపీ నేతలను పేరుపేరునా పలకరించారు. వైవీ ఇంటి నుంచి జగన్ తిరుగు ప్రయాణంలోనూ ఆయన వాహనం ముందు చేరిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. పిచ్చమ్మ భౌతికకాయానికి వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ ఉపముఖ్యమంత్రి మంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, జోగి రమేష్, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ముస్తాఫా, బుర్రా మధుసూదనయాదవ్, జంకె వెంకటరెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు, పార్టీ నాయకులు కరణం వెంకటేశ్, గాదె మధుసూదన్రెడ్డి, వరికూటి అశోక్బాబు, మేరిగ మురళి, చుండూరు రవి, పానెం చిన హనిమిరెడ్డి తదితరులు నివాళు లర్పించారు. వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలకు మేదరమెట్లకు వచ్చిన జగన్ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులు కుటుంబ సభ్యులకు పరామర్శ అర్ధగంటపాటు అక్కడే గడిపిన జననేత -
విద్యార్థులు నైపుణ్యాలకు పదును పెట్టాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు అంతర్గతంగా దాగిన నైపుణ్యాలకు పదును పెట్టాలని ఏఎన్యూ ఉప కులపతి ఆచార్య కె.గంగాధరరావు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంగళవారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వీసీ గంగాధరరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. కళాశాల కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి శ్యాం సుందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అనితాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా ఎంకాం విద్యార్థిని షేక్ షహనాజ్, ఎంబీఏ విద్యార్థి కె.అనంతలక్ష్మి, ఎమ్మెస్సీ మ్యాథ్స్లో వై.నాగమణి, ఫిజిక్స్లో బి.దుర్గా లావణ్య, కంప్యూటర్స్ సైన్స్లో కె.నాగసాయి రమ్య, కెమిస్ట్రీలో జుబేర్ అహ్మద్, ఎంసీఏ విద్యార్థి ఎన్. సాయిలీల ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. బీకాం జనరల్ విభాగంలో టాపర్గా నిలిచిన నరేంద్ర, బీకాం కంప్యూటర్స్లో షేక్ ఫారినా, బీఎస్సీ బీజెడ్సీలో షేక్ ఇషా సుల్తానా, బీబీఏలో జి.శ్వేత, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో టాపర్ పి. గౌస్య ప్రతిభా పురస్కారాలు పొందారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, అధ్యాపకులు బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి, డీవీ చంద్రశేఖర్, ఎస్. శ్రీనివాసరావు, యు. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు శక్తియాప్ దోహదం
నరసరావుపేట: మహిళలు భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలా పనిచేస్తుందని అదనపు ఎస్పీ(పరిపాలన) జేవీ సంతోష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహి ళలు, బాలికల భద్రత కోసం తీసుకొచ్చిన శక్తి యాప్ౖ పె అవగాహన నిమిత్తం మంగళవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ స్కూలు విద్యార్థినులతో స్వీయ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సంతోష్ మాట్లాడుతూ ప్రతీ ఒక్క మహిళ తమ ఫోన్లో యాప్ నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని సూచించారు. అనంతరం యాప్ను ఉపయోగించే విధానం వివరించారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి వారి మనోధైర్యాన్ని పెంపొందించుటకు కావాల్సిన స్వీయరక్షణ మెలకువలను కరాటే ద్వారా ఎదుర్కొనే విధానాలను నిపుణులు ప్రదర్శించారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, మహిళా పోలీస్ సిబ్బంది, శంకర భారతిపురం, తిలక్ స్కూలుకు చెందిన 500మంది విద్యార్థినులు పాల్గొన్నారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. ఇఫ్తార్ సహర్ (బుధ) (గురు) నరసరావుపేట 6.26 4.58 గుంటూరు 6.24 4.56 బాపట్ల 6.24 4.56 వినుకొండ: ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతూ ఎదురు తిరిగిన వాళ్లను చంపుతూ దొంగలు యథేచ్ఛగా హత్యాకాండ సాగిస్తున్నారు. వినుకొండకు గుండెకాయ లాంటి కొత్తపేట ప్రాంతంలో ఏడాది తిరగకుండానే ఇద్దరు వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకొని వారిని హతమార్చి, వారి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరినీ అత్యంత కిరాతకంగా చంపి బంగారాన్ని ఎత్తుకెళ్లడం గమనార్హం. కలకలం రేపిన సావిత్రి హత్య.. సోమవారం రాత్రి కొత్తపేటలో మెయిన్బజారులో వినాయకుడి గుడి వద్ద ఒంటరిగా ఉంటున్న కొప్పరపు సావిత్రి అనే 75 ఏళ్ల మహిళ ఇంట్లోకి పట్టపగలే ప్రవేశించిన దుండగులు ఆమెను హత్య చేసి ఆమె ఒంటిపై బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే ఇంట్లో టీవీ సౌండ్ పెంచి టీవీ చూస్తున్నట్టుగా భ్రమింపజేసి బయట తాళం వేసి పరారయ్యారు. స్కూల్కు వెళ్లి వచ్చిన ఆమె మనవరాలు ఎంతసేపటికీ పిలిచినా పలకక పోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా అప్పటికే సావిత్రి మృతి చెందినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది ఇదే ప్రాంతంలో... ఇదిలా ఉంటే.. గత ఏడాది జూన్ 19వ తేదీన ఇదే కొత్తపేట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పి.కోటిరత్నం అనే 75 ఏళ్ల వృద్ధురాలి మెడలో గొలుసు చోరీకి విఫలయత్నం చేసిన దొంగలు ఆమె ఎంతసేపటికీ గొలుసు వదలకపోవడంతో తలపై రాయితో కొట్టి హత్య చేసి పారిపోయారు. రెండు హత్యలు పట్టపగలే జరగడంతో ఆ ప్రాంతంలో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కోటిరత్నం హత్య జరిగి ఏడాదికావస్తున్నా ఇప్పటికీ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసు జాగిలాలు 7 బంగారం కోసం మహిళలను హతమారుస్తున్న వైనం వినుకొండ కొత్తపేటలో ఏడాది కాలంలో ఇరువురు మహిళల హత్య ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఇంటి సమీపంలో ఘటనలు మహిళల భద్రత ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు న్యూస్రీల్జీవీ ఇంటికి కూత వేటు దూరంలోనే.. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇంటి సమీపంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం భద్రత వైఫల్యాలకు అద్దం పడుతుంది. దొంగలు రాత్రిళ్లే కాకుండా పట్టపగలే ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతుండడం పోలీసు వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉన్నప్పటికీ కేసుల దర్యా ప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం విచా రకరం. ఇప్పటికై నా పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేపట్టి మహిళల భద్రతపై నమ్మకం కలిగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతల గ్రామానికి చెందిన మక్కెన శివతేజ(30) పేరేచర్లలో కొబ్బరి బొండాల దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో పేరేచర్ల నుంచి రెంటచింతలకు స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గ మధ్యలో పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు సమీపంలో శ్రీ లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్, ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో లారీ అతివేగంగా వచ్చి శివతేజ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనటంతో రోడ్డుపై పడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ తెలిపారు. -
మహిళా చైన్ స్నాచర్ అరెస్ట్
మంగళగిరి టౌన్: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఓ మహిళను మంగళగిరి పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ తెలిపిన వివరాల మేరకు... పాత మంగళగిరికి చెందిన రామిశెట్టి సాయిలక్ష్మి నివాసానికి అద్దెకు ఇల్లు కావాలంటూ ఓ మహిళ వచ్చింది. మాట కలిపాక ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని బయటకు పరిగెత్తింది. సాయిలక్ష్మి పెద్దగా కేకలు వేయడంతో ఆ మహిళ చైన్ను అక్కడ వదిలేసి పారిపోయింది. సోమవారం మంగళగిరి రత్నాలచెరువు అండర్పాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలించి విచారించగా విజయవాడకు చెందిన మానసవాణి అని, గతంలో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి 42 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మానసవాణిపై విజయవాడలో సింగ్నగర్, కృష్ణలంకలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని విచారణలో తెలిసినట్లు తెలిపారు. మానసవాణిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు రవీంద్రనాయక్ తెలిపారు. 42 గ్రాముల బంగారం స్వాధీనం -
కొడుకులు అడుక్కుతినమంటున్నారు!
నరసరావుపేట రూరల్: ‘అయ్యా.. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నా స్వశక్తితో సంపాదించిన రెండు ఇళ్లను కొడుకులకు ఇచ్చాను. ఇప్పుడు నేను పక్షవాతంతో పాటు షుగర్, బీపీతో అనారోగ్యానికి గురికావడంతో ఇద్దరు కుమారులూ పట్టించుకోవడం లేదు. పనిచేసే ఓపిక ఉన్న నా భార్యను మాత్రం చిన్న కుమారుడు తన వద్ద ఉంచుకుని దుకాణంలో పని చేయించుకుంటున్నాడు. నేను ఎలా బతకాలని అడిగితే అడుక్కుతినమంటూ కొడుకులు సలహా ఇస్తున్నారు. ఏ పని చేయలేని స్థితిలో ఉన్న నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాచర్లకు చెందిన వృద్ధుడైన ఏడుకొండలు ఆవేదన ఇది.. ఇదేవిధమైన పలు అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చాయి. పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు అర్జీలపై సత్వరం చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి తగదాలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. కన్న కూతురు మోసం చేసింది.. నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉద్యోగరీత్యా కుమారుడు, కోడలు నిజామాబాద్లో ఉంటున్నారు. కుమారుడు నాతో పాటు నా భర్త చిన్నయ్య బాగోగులు చూసేవాడు. కోవిడ్ సమయంలో రెండు నెలలు మా వద్దకు రావడానికి కుమారుడికి వీలుకాలేదు. ఆ సమయంలో నా భర్త అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలోనే నివసించే మా కుమార్తె శాంతకుమారి తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో నా భర్త పేరున ఉన్న రూ.6లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ నగదును డ్రా చేయడంతో పాటు పూర్వార్జితంగా వస్తున్న 1.40 ఎకరాలను తనకు గిఫ్ట్గా ఇచ్చినట్టుగా రాయించుకుంది. తదనంతరం నా భర్త చనిపోవడంతో ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ నగదును నాకు అందించేలా చర్యలు తీసుకోండి. – పి.చిన్నమ్మ, ముసాపురం, పెదకూరపాడు మండలం రెండుసార్లు హత్యాయత్నం చేశారు సత్తెనపల్లిలోని పెద్దమసీదు ప్రాంతంలో నివసించే నాపై గత ఏడాది ఎన్నికల ముందు దాడి జరిగింది. 15 రోజులు ఐసీయూలో చికిత్స పొందాను. నాలుగు నెలల క్రితం మరోమారు హత్యాయత్నం చేశారు. షాదీఖానా బజార్లో తల్వార్తో దాడికి పాల్పడ్డారు. షేక్ ఆదం షరీఫ్ అతని కుమారులు గౌస్, రఫీలతో పాటు ఉమర్, అక్తాబ్ ఈ దాడిలో పాల్గొన్నారు. సత్తెనపల్లి టౌన్ పీఎస్లో వీరిపై ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోలేదు. నాపై కౌంటర్ కేసులను పోలీసులు నమోదు చేసారు. నిందితులు ఇప్పటికీ తల్వార్లతో తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. – షేక్ రఫీ, సత్తెనపల్లి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి మా అమ్మ ఆరే లక్ష్మమ్మ కారంపూడిలో నివసిస్తుంది. గత ఏడాది మార్చి 27వ తేదీన ఆమెను హత్య చేశారు. ఈ కేసులో అనుమానితులుగా ఆరే రమేష్, ఆరే రాంబాబు, పులి శ్రీలక్ష్మి, ఆరే పద్మల పేర్లను పోలీసులకు మేం అందజేశాం. ఆస్తి కోసం గతంలో వీరు ఆమెను చంపటానికి ప్రయత్నించారు. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయలేదు. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలి. – తాళ్ల పద్మ, అడిగొప్పల, దుర్గిమండలం జిల్లా ఎస్పీ ఎదుట వాపోయిన ఓ వృద్ధ తండ్రి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 75 ఫిర్యాదులు స్వీకరణ -
జాతీయ స్థాయి పోటీలకు క్రోసూరు సెయింట్ ఆన్స్ విద్యార్థులు
బేస్బాల్లో ఆంధ్రజట్టుకు ఎంపికై న విద్యార్థులు క్రోసూరు: పంజాబ్ రాష్ట్రం సంగ్రూరులో మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్ బేస్బాల్ నేషనల్ టోర్నమెంట్కు క్రోసూరు సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు హెచ్ఎం సిస్టర్ మేరీ రజిత సోమవారం తెలిపారు. ఎంపిక వివరాలు తెలుపుతూ ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కసుమూరులో బేస్బాల్ రాష్ట్ర జట్టును ఎంపిక చేశాన్నారు. అందులో క్రోసూరు సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు తెలిపారు. ఎనిమిదవ తరగతికి చెందిన వి.గ్రీష్మ బిందు, ఎం.గాయత్రి, అదేవిధంగా ఏడవ తరగతికి చెందిన కె.జాషువా డేనియల్, ఎస్కే అబుబకర్లను ఆంధ్ర జట్టుకి ఎంపిక చేసినట్లు చెప్పారు. తమ పాఠశాల విద్యార్థులు నేషనల్ టోర్నమెంట్కు ఎంపికవడంపై ఎంతో సంతోషంగా ఉందని, ఆంధ్రజట్టు తరఫున పోటీల్లో గెలిచి తమ పాఠశాలకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని మృతదేహం సత్తెనపల్లి: గుర్తు తెలియని మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని నిర్మల నగర్ సమీపంలో గల రైల్వే పట్టాలపై సోమవారం కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నిర్మలా నగర్ రైల్వేగేట్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం రైల్వే పట్టాలపై పడి ఉంది. మృతదేహం పూర్తిగా చిధ్రమై ఉండడంతో గుర్తుపట్టడం అసాధ్యంగా మారింది. -
వినుకొండలో వృద్ధురాలి హత్య
మెడలో బంగారు గొలుసు మాయం వినుకొండ: వినుకొండలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కొత్తపేటలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కొప్పరపు సావిత్రి(70)ని దుండగులు పట్టపగలే హత్య చేసి మెడలోని బంగారు గొలుసు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న టౌన్ సీఐ శోభన్బాబుతోపాటు పోలీసు సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారు గొలుసు కోసమే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటిలో లేకపోవటం గమనార్హం. పగలే హత్య చేసి టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి పరారయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు ఇంటికి కొద్దిదూరంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాగ్స్క్వాడ్ తో పరిశీలన అనంతరం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కేసును త్వరలోనే ఛేదిస్తామని సీఐ తెలిపారు. వైద్యమిత్రల ధర్నా నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా తమకు ఇప్పటికీ సరైన జీతాలు లేక తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని వైద్యమిత్రలు విన్నవించారు. సోమవారం ప్రకాష్నగర్లోని ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయం ముందు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. తాము ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో ఆస్పత్రికి, రోగులకు మధ్య అనుసంధాన కర్తలుగా వుంటూ పేద ప్రజలకు సేవలు అందజేస్తున్నామన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, తమ సర్వీసుని పరిగణనలోకి తీసుకొని ట్రస్ట్ ఉద్యోగిగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని కోరారు. ఉద్యోగ విరమణ తరువాత కుటుంబానికి రూ.15లక్షల గ్రాడ్యూటీ ఇవ్వాలని, అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. గోగులమ్మను తాకిన సూర్య కిరణాలు పెదపులివర్రు (భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మను సోమవారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఏటా ఫాల్గుణ నెలలో అమ్మ విగ్రహంపై కిరణాలు ప్రసరిస్తాయని అర్చకులు దీవి గోపి తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యావతారంలో శ్రీవారు మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి ఆస్ధాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. కై ంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మిళ్లూరి రామచంద్ర శర్మ, కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు. -
లంక పొలాల సమస్య పరిష్కరించాలి
తాడేపల్లి రూరల్: కుంచనపల్లిలోని దళిత లంక పొలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లిలో సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజాచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన రైతులతో మాట్లాడారు. కృష్ణానది ఒడ్డున దళితులకు ఇచ్చిన 30 ఎకరాల లంక పొలాల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సాగు చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, సీపీఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, కుంచనపల్లి గ్రామ శాఖ కార్యదర్శి అమ్మిశెట్టి రంగారావు, నాయకులు నాగపోగు విజయరాజు, అమ్మిశెట్టి రామారావు, కంచర్ల సాంబశివరావు, కొండపల్లి యశోద, సింగంశెట్టి రవికిషోర్, అమ్మిశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు శక్తి యాప్ దోహదం
నరసరావుపేట: ప్రతీ ఒక్క మహిళ శక్తియాప్ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కోరారు. సోమవారం పోలీసు ప్రధాన కార్యాలయానికి ప్రజాసమస్యల పరిష్కార వేదికకు విచ్చేసిన మహిళలకు యాప్ వివరాల కరపత్రాలు పంచి వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం శక్తి పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, లైంగికదాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పల్నాడు జిల్లాలో మహిళలు, గృహిణులు, విద్యార్థినులు వారి ఫోన్లులో శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం, సహకారం పొందాలని కోరారు. అదనపు ఎస్పీ (పరిపాలన) జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాషిణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రాజకీయ బదిలీలకు నిరసనగా ఎన్ఎస్పీ ఉద్యోగుల ఆందోళన నరసరావుపేట: ఎన్ఎస్పీ అధికారులైన సూపరింటెండెంట్ ఇంజినీరు కృష్ణమోహన్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సుబ్బారావుల వేధింపులపై ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. ఎన్ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా వర్క్చార్జ్డ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే వద్ద నుంచి లెటర్ తీసుకొచ్చి రాష్ట్ర నాయకత్వంలో అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేస్తున్న నాగరాజు, కొండారెడ్డిలపై అభియోగాలు మోపుతూ ఇక్కడి నుంచి మాచర్లకు బదిలీ చేశారన్నారు. ఎటువంటి విచారణ లేకుండా అకస్మాత్తుగా బదిలీ చేయటంపై న్యాయ విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని తాము రావటం జరిగిందన్నారు. సమర్ధవంతంగా పనిచేసి అవార్డులు పొందిన చరిత్ర యూనియన్ నేతలకు ఉందని, కేవలం నాలుగైదు నెలల క్రితం అధికారులుగా వచ్చిన వారికి వీరి సమర్ధత ఏవిధంగా తెలుస్తుందని ప్రశ్నించారు. సాగర్ పరిధిలో సరైన ఏఈలు లేకపోయినా లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తూ ప్రతి ఎకరాకు నీరు అందేలా పనిచేస్తున్నారన్నారు. డీఈ, ఈఈలను మారుస్తారా, లేక తమ 60మంది ఉద్యోగులను మారుస్తారా అనేది తేల్చుకోవాలన్నారు. వీరిపై సీఈచే విచారణ చేస్తున్నారని తెలిసిందని, ఆ విచారణ ముగిసేంతవరకు బదిలీ రద్దుచేయాలని కోరారు. బదిలీ ఉపసహరించేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. మంగళగిరి టౌన్ : మంగళగిరి నగర పరిధిలోని బిస్మిల్లా హోటల్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... గత 5 రోజుల నుంచి ఓ వ్యక్తి మంగళగిరి పాతబస్టాండ్ సమీపంలో వున్న బిస్మిల్లా హోటల్ దగ్గర ఉంటున్నాడు. అతని ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని రోజులుగా భోజనం, తాగునీరు అందజేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆ వ్యక్తి మృతి చెందాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
పది పరీక్షలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పల్నాడుజిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 128 పరీక్ష కేంద్రాలలో తొలిరోజు తెలుగు పరీక్షకు 26,497మంది విద్యార్థులకు గాను 99.5శాతం హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రికార్డు స్థాయిలో 72 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. అలాగే డీఈఓ ఎల్.చంద్రకళ పట్టణంలోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను సందర్శించి సీఎస్లకు పలు సూచనలు చేశారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు జిల్లాలోని 27 పరీక్ష కేంద్రాలలో తొలిరోజు నాలుగు కేంద్రాలలో నిర్వహించిన హిందీ పరీక్షకు నలుగురు విద్యార్థులకు గాను ఇద్దరు హాజరైనట్టు తెలిపారు. జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలు తెలుగు పరీక్షకు 99.5శాతం హాజరు 72 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన 6 స్క్వాడ్ బృందాలు -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నల్లపాటి రామారావు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం. ఇతని పేరు మీద తన సొంత గ్రామంలో 3.48 ఎకరాల పొలం ఉంది. రీ సర్వేలో 3.30 ఎకరాలు మాత్రమే నమోదైంది. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ని కలసి రెండు సార్లు అర్జీలు ఇచ్చాడు. చివరికి రెండు నెలల క్రితం సర్వేయర్ వచ్చి పొలం కొలిచినప్పటికీ ఇప్పటికీ సర్వే సర్టిఫికేట్ ఇవ్వలేదని ఫిర్యాదుదారుడు వాపోతున్నాడు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇఫ్తార్ సహర్ (మంగళ) (బుధ) నరసరావుపేట 6.26 4.59 గుంటూరు 6.24 4.57 బాపట్ల 6.24 4.57 గ్రీవెన్స్లో రీ ఓపెన్ అవుతున్న అర్జీలు న్యూస్రీల్ -
సెంటు భూమిలోని పంట కూడా ఎండకూడదు
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి సాగునీరు అందని కారణంగా సెంటు భూమిలో పంట సైతం ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలో రైతుల అవసరాలకు తగ్గట్టు నీరుఅందేలా చూడాలన్నారు. మండలస్థాయిలో కరవు పర్యవేక్షణ సెల్ ప్రారంభించాలన్నారు. పంచాయతీ నిధులతో గ్రామాల్లో తాగునీటి సరఫరా చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో పీ–4 సర్వే 95 శాతం, వర్క్ ఫ్రం హోం 45 శాతం పూర్తయ్యాయన్నారు. జిల్లా ప్రజల చేత అభివృద్ధికి సూచనలు చేసే పీ–4 కన్సల్టెన్సీ సర్వేలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరులోగా రైతు రిజిస్టేషన్లు 60 శాతం పూర్తిచేయాలన్నారు. ఫామ్పాండ్స్ పథకంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం మూడు ఫామ్పాండ్స్ ప్రారంభించేలా చూడాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం ఆర్థికసాయం పెంపు విషయంపై లబ్ధిదారులకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పేదలకు 365 రోజుల ఉపాధి కల్పించాలన్నారు. కాగా, కందిపప్పు, శనగ కొనుగోలు కోసం రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జేసీ సూరజ్ గనోరే ఆదేశించారు. డీఆర్వో ఎ.మురళి, సీపీఓ జి.శ్రీనివాస్, డీపీఓ విజయభాస్కరరెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటరెడ్డి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో మేలు నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) విధానంలో పల్నాడు జిల్లాలోని రైతులందరూ పంటలను సాగు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ కషాయాలు, తెగుళ్లు, పెరటి తోటల పెంపకం, పుస్తకాలు, పాంప్లెట్స్ ఆవిష్కరించి ప్రకతి వ్యవసాయం సిబ్బంది ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు, పురుగుమందుల వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తయారైన ఉత్పత్తులను తినడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. జిల్లా అధికారులందరూ ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. డీపీఓ పి.అమలకుమారి మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. డీఎఫ్ఓ కృష్ణప్రియ, డీఆర్ఓ మురళి, డీఏఓ ఐ.మురళి, స్టేట్ ఎన్ఎఫ్ఏ మన్విత, జిల్లా ప్రకతి వ్యవసాయ సిబ్బంది మేరీ, సౌజన్య, బేబీ రాణి, యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. ●జిల్లాలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న పేద, అర్హులైన 17 మంది దివ్యాంగులైన విద్యార్థులకు ఏపీ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహాయక సంస్థ ద్వారా ఉచితంగా ల్యాప్ టాప్లను కలెక్టర్ పి.అరుణ్బాబు అందజేశారు. -
ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు..
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన వారికి సత్వరమే న్యాయం చేయకపోగా, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు తమ గోడును విన్నివించుకోని రశీదుతో వెళ్లిన వారికి రిక్తహస్తమే దక్కుతోంది. ఫిర్యాదుకు నిర్ణయించిన గడువులోగా పరిష్కారం చూపకపోవడంతో ఫిర్యా దులు రీ ఓపెన్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు కలెక్టరేట్లో 13,695 ఫిర్యాదుల అందగా వాటిలో 12,277 ఫిర్యాదులు పరిష్కారం చూపగా, 1,418 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. సుమారు 500 ఫిర్యాదుల రీ ఓపెన్ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రెవె న్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదుల రీ ఓపెన్ అవుతున్నాయి. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారి కలెక్టర్ కార్యాలయానికి వచ్చినా సత్వరం న్యాయం జరగడంలేదని బాధితులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి ి స్పందన ఉండటం లేదని వాపోతున్నారు. గతంలో సత్వర పరిష్కారం.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ద్వారా స్పందన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేవారు. ఇందులో పనిచేసే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుడు, సంబంధిత అధికారులు, ఆయా మండలాల ప్రత్యేక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేవరకు పనిచేసేవారు. దీనివల్ల ఫిర్యాదుదారులకు సత్వరమే సమస్య పరిష్కారం, లేదా కాకపోవడానికి గల కారణాలు తెలిసేవి. కొత్త ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంకు స్వస్తిపలికారు. ప్రస్తుతం పీజీఆర్ఎస్ సిబ్బంది, ప్రత్యేకాధికారులు ఈ పనిచేస్తున్నా గతంలో లాగా పారదర్శకత ఉండటం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సోమవారం ప్రజా పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులు కొన్ని.. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన అల్లూరివారి పాలెం, ఎస్టీకాలనీ వాసులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు క్యూ కడుతున్న అర్జీదారులు గత పది నెలల్లో కలెక్టరేట్లో సుమారు 500 అర్జీలు రీ ఓపెన్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పదేపదే వెళ్లినా తీరని సమస్యలు గత ప్రభుత్వం హయాంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక కాల్ సెంటర్ సమస్య పరిష్కారం అయ్యేవరకు పర్యవేక్షణ నేడు కలెక్టర్ చెప్పినా కింద స్థాయిలో పట్టించుకోవడం లేదని వాపోతున్న ఫిర్యాదుదారులు మేము 54 మందిమి గత ఐదేళ్లుగా మున్సి పాల్టీలోని పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. మాకు అరకొర జీతాలే చెల్లిస్తున్నారు. మొదట మున్సిపల్ శాఖనుంచి, ఆ తర్వాత ఆప్కాస్ ద్వారా చెల్లిస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐలు కట్ చేస్తున్నారు. వాటికి కార్డు ఇవ్వలేదు. మాకు ఒక్కో నెల ఒక్కోరకంగా జీతం ఇస్తున్నారు. పూర్తి నెల జీతం అందించడం లేదు. మున్సిపల్ ఉద్యోగులనే కారణంతో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఎన్నోసార్లు వినతిపత్రాలు, అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి, నెలకు రూ.21వేలు వేతనం చెల్లించాలి. – కార్మికులు, నాయకులు, పల్నాడు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ -
మద్యం దుకాణాలు సమయపాలన పాటించడం లేదు
నరసరావుపేటలో చాలా మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుంచే షాపులు తెరిచి మద్యం విక్రయాలు చేస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో ఇబ్బందికరంగా ఉంది. పట్టణంలో ప్రముఖ మసీదుల వద్ద ఉన్న మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద మరీ ఇబ్బందికరంగా మారింది.. అలాగే ఈద్గా మైదానంలో రాత్రిళ్లు మద్యం సేవిస్తున్నారు. ఎకై ్సజ్ విభాగం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి. – షేక్ కరిముల్లా, ఎంఐఎం జిల్లా కార్యదర్శి -
వెల్ఫేర్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పించండి
నేను బీకాం చదివాను. కూలి పనిచేసుకుంటున్నా. సచివాలయ వార్డు సెక్రటరీల ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యాను. తీరా బీకాం చదివిన వారు అనర్హులని అప్పుడు ఉద్యోగం ఇవ్వలేదు. నేను నా కుటుంబంతో పాటు పనికోసం హైదరాబాదు వెళ్లాను. నాతో పాటు పరీక్షరాసి ఎంపికై న వారు కోర్టుకు వెళ్లటంతో ప్రభుత్వ ఆదేశాలపై కోర్టు స్టే ఇచ్చింది. దీంతో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నాకు ఆలస్యంగా ఈ విషయం తెలిసింది. కాబట్టి విచారించి నాకు కూడా వార్డు వెల్ఫేర్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా. – పాముల నరేష్, పిడుగురాళ్ల ●దస్తావేజులు ఇప్పించండి -
వైభవంగా మహాశైవక్షేత్ర పునఃప్రతిష్ట
దాచేపల్లి: దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలోని శ్రీ పార్వతిదేవి సమేత చెన్నమల్లిఖార్జునస్వామి వార్ల దేవాస్థానం(మహా శైవక్షేత్రం) పునఃప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతులు శివస్వామి, టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణమచార్యుల బృందం వేదమంత్రాల సాక్షిగా పార్వతీదేవి సమేత చెన్నమల్లిఖార్జునస్వామి, గణపతి, ద్వారపాలకులు, నందీశ్వరుడు, బలిపీటం, శిఖరాన్ని ప్రతిష్టించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పల్నాటి తొలిమహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ నిర్మించిన ఈ మహాశైవక్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల జెడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య, సర్పంచ్ జంగా సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. పునఃప్రతిష్ట సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి అర్చకులు, భక్తులు తరలివచ్చారు. మహాశైవక్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. -
నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయించాలి
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి జె.పంగులూరు: నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి కోరారు. పంగులూరు మండలంలోని చందలూరు దళిత కాలనీ కౌలు రైతులతో సీపీఎం ప్రచార యాత్ర నాయకులు ఆదివారం మాట్లాడారు. పొగాకు అమ్ముడు పోక, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు తెలిపారు. పంట నష్టపరిహారాలు కూడా అందటం లేదని, రాయితీలు కూడా భూ యజమానులకే అందుతున్నాయని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీపీఎం కార్యవర్గ సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ బర్లీ పొగాకును కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీలు ఇస్టానుసారంగా ధరలు తగ్గించడం, ఆలస్యంగా కొనడంతో రైతులు నష్టపోతున్నారని ఆమె తెలిపారు. సీపీఎం బాపట్ల కార్యదర్శి సీహెచ్. గంగయ్య మాట్లాడుతూ కౌలు రైతులంగా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఐకమత్యంతో ఏదైనా సాధించగలమని చెప్పారు. హక్కుల కోసం పోరాడాలని, దాని కోసం సంఘాలుగా ఏర్పడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు రాయిని వినోద్బాబు, పార్టీ మండల కార్యదర్శి రామారావు, ప్రభాకర్, సుధాకర్, కౌలు రైతులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నూజెండ్ల శ్రీనివాసరావు
జాతీయ భావంతో విద్యార్థుల నిర్మాణమే లక్ష్యం బాపట్ల: విద్యార్థుల సమస్యలపై పోరాటంతో పాటు వారిని జాతీయ భావాలతో నిర్మాణాత్మక ంగా తీర్చిదిద్దడమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్ష్యం అని రాష్ట్ర అధ్యక్షులు నూజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. తొలుత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ రీడర్ యు. వరలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజెండ్ల మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. వరలక్ష్మి మాట్లాడుతూ 50 సంవత్సరాల కిందట మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఏబీవీపీ కార్యక్రమాల్లో చేపట్టిన పనులను గుర్తు చేసుకున్నారు. నేటి యువత సమాజంలో రుగ్మతలు రూపుమాపటానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సదస్సుకు వచ్చిన ఏబీవీపీ యువ కెరటాలకు అభినందనలు తెలిపారు. దక్షిణ భారత సంఘటన కార్యదర్శి ఎస్. శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకై క విద్యార్థి యూనియన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000 అందజేస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు 10 నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు వెంటనే భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉండిపోయాయని, వాటిని తిరిగి రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సూళ్లూరు యాచేంద్ర, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, న్యాయవాది కళ్లం హరినాథ్రెడ్డి, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్, నంగు ఏడుకొండలురెడ్డి, వల్లూరి భావన్నారాయణ, మామిడి రాజశేఖర్, బాలాజీ, బిల్లూరి భావన్నారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. సుమన్, కార్యదర్శి పవన్ పాల్గొన్నారు. హామీలు అమలు చేయకుంటే సమ్మె చేస్తాం గుంటూరు మెడికల్: ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్య వర్గ సమావేశం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ హాలులో జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార రావు మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని చెప్పారు. తమ సంఘం తరఫున సుమారు 28 డిమాండ్లను లిఖిత పూర్వకంగా తెలియజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నేటికీ వాటిని పరిష్కరించిన పాపానపోలేదని వాపోయారు. ఇక పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. త్వరలో సమ్మె నోటీసు జారీ చేస్తామన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తమ సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉద్యమానికి జిల్లా శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు సత్వరమే మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు. సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. ముఖ్య సలహాదారు రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు. -
తులసీ తన్మయ్కు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల నర్సింగ్ విద్యార్థిని వి.తులసీతన్మయ్ తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు ఆదివారం తెలిపారు. తెనాలిలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 5వ గుంటూరు (జిల్లా) ఆహ్వాన తైక్వాండో చాంపియన్షిప్–2025 పోటీలో తులసీ తన్మయ్ 49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించినట్టు వివరించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి, నర్సింగ్ విభాగం ఇన్చార్జి ఏవీఎన్ గుప్త తదితరులు అభినందించారు. రైలు కింద పడి మహిళ ఆత్మహత్య నరసరావుపేట టౌన్: కేసానుపల్లిరోడ్డులోని టిడ్కో గృహాల పక్కనే ఉన్న రైలుపట్టాలపై ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుంటూరు –డోన్ ఎక్స్ప్రెస్ రైలు బండి కింద పడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుందని రైల్వే ఎస్ఐ శ్రీనివాసనాయక్ తెలిపారు. మృతురాలు శరీరం నలుపు రంగుతోను, ఒంటిపై నీలం రంగు పూల డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. మృతేదేహాన్ని స్థానిక ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చామన్నారు. సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై కేసు పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురం ఎల్బీఎస్ నగర్కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మోజెస్ విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శప్రాయం
నరసరావుపేట: తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాథ్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో... నరసరావుపేట: రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి పేర్కొన్నారు. అమరజీవి జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్య నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రసాధన కోసం అమరజీవి చేసిన త్యాగం అజరామరం అని కొనియాడారు. ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు -
‘పది’ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాకు వివరాలు తెలియచేస్తూ...పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, పరీక్షకు కేటాయించిన సిబ్బంది, పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు తప్ప ఇతర వ్యక్తులు ఉండకూడదని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని అన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే విద్య నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖ తరుపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన, విద్యార్థులు పరీక్షల సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం కొరకు వెంటనే డయల్:100/112కు సమాచారం అందించాలని కోరారు. ఒకే కాన్పులో ముగ్గురు జననం గుంటూరు మెడికల్: హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు. -
డివైడర్ను ఢీకొని యువకుడు మృతి
మరొకరికి తీవ్ర గాయాలు వెల్దుర్తి: లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొని బైక్పై వెళుతున్న యువకుడు మృతి చెందిన ఘటన వెల్దుర్తి బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వెంకట సత్యం(23), మరిపూడి మణికంఠలు ద్విచక్ర వాహనం పై మాచర్లకు వచ్చి వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి గుండ్లపాడుకు వెళ్తున్న సమయంలో వెల్దుర్తి బస్టాండ్ వద్ద 565 జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తూ, తప్పించబోయి, పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారమివ్వటంతో వారు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని ఇద్దరినీ మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకట సత్యం మృతి చెందాడు. మణికంఠకు తీవ్రగాయాలు కావటంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట వైద్యశాలకు రిఫర్ చేశారు. మృతి చెందిన వెంకట సత్యంకు భార్య రమాదేవి, ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం రమాదేవి నాలుగు నెలల గర్భిణిగా ఉందని బంధువులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు నరసరావుపేట: కేంద్రంలోని బీజేపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన పల్నాడు బస్టాండ్లో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే, విశ్వకర్మ, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఒక హోటల్లో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు కేంద్రంలో బీసీ కులాల జనగణన చేపడతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతోందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తెస్తామని, నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించడానికి బీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజులు ఓసీలతో సమానంగా వసూలు చేస్తున్నారని, వెంటనే లా సెట్, ఎంసెట్, పాలీసెట్, ఇతర అన్ని రకాల సెట్లకు బీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు యామా మురళి మాట్లాడారు. సంఘం నరసరావుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా సుతారం విశ్వేశ్వరరావును నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కాకుమాను రమేష్, నరసరావుపేట, రొంపిచర్ల మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, గాలి సాంబశివరావు, రజక సంఘ నాయకులు చట్టూ శ్రీరాములు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యయోస్తు
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2025 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా విద్యార్థులు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2025 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 40 ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ ఈఏపీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets.a psche.ap.gov.in సైట్కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2025పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతోపాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ఏపీ ఈఏపీసెట్–2025 షెడ్యూల్ విడుదల మే 21 నుంచి 27 వరకు ఏపీ ఈఏపీసెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణ మే 19,20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 40ఇంజినీరింగ్ కళాశాలల్లో 20వేల సీట్లు