breaking news
Palnadu
-
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు...
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఆదివారం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోటప్పకొండ పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. ● తెల్లవారుజామున ఒంటి గంటకు బిందెతీర్థంతో స్వామి వారికి ఆలయ ప్రధానార్చకులు అప్పయ్యగురుకుల్ ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ● స్వామి వారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100లు, రూ.200లు, రూ.500ల అభిషేక క్యూల ద్వారా దర్శించుకున్నారు. ● ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన రూ.300 వీఐపీ దర్శన టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పించారు. ఉదయం నుంచి భక్తులతో క్యూ కాంప్లెక్స్ కిక్కిరిసింది. ఉచిత దర్శనంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ● మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోఫాన మార్గం నుంచి భక్తులు మెట్ల పూజ నిర్వహించుకుంటూ కొండపైకి చేరుకున్నారు. ధ్యానశివుడు, నాగేంద్రుని పుట్ట, నంది విగ్రహం వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. ● త్రిముఖ శివలింగం వద్ద యాత్రికులు సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. పలువురు భక్తులు కాలినడకన పాతకోటయ్య స్వామి ఆలయం వద్దకు చేరుకుని దర్శించుకున్నారు. ● జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, ఆలయ పరిసరప్రాంతాలను సందర్శించి భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆలయ ఈవో డి. చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రభల వద్ద కోలాహలం... ప్రభల పండగగా పేరొందిన కోటప్పకొండ తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు యాత్రికులను కనువిందు చేశాయి. ఈ ఏడాది అధికంగా 23 భారీ విద్యుత్ ప్రభలు కొండకు తరలివచ్చాయి. భారీ విద్యుత్ ప్రభల కాంతులతో కోటప్పకొండ ప్రాంతం ప్రత్యేక రూపు సంతరించుకుంది. ప్రభలపై ఏర్పాటుచేసిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్పెషల్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించారు. కొండ కింద పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుకాణాల వద్ద రోజంతా సందడి నెలకొంది. కోటప్ప కొండకు తరలివచ్చిన భక్త జన సందోహంలో ఓ భాగం -
కాళ్లు దువ్విన కోళ్లు
నరసరావుపేటటౌన్: కోడి పందేలకు.. కోత ముక్కలకు.. గుండు ఆటకు రొంపిచర్ల మండలం కేరాఫ్ అడ్రస్గా మారిందా అంటే.. అవుననే అంటున్నారు అనుభవజ్ఞులు. ఇటీవల కాలంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో పేకాట, కోతముక్కా, గుండు ఆట, కోడిపందేలు పెచ్చుమీరాయి. విప్పర్ల, కొనకంచివారిపాలెం, గ్రామాల్లో శివరాత్రి పండుగ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కోడి పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పందెగాళ్లకే కాకుండా చూడటానికి వెళ్లిన ప్రేక్షకుల వద్ద కూడా ద్విచక్ర వాహనానికి, కార్లకు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. కోతముక్క, గుండాట ఆడే పందెగాళ్ల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజు వసూలు చేసి సకలం ఏర్పాట్లు చేశారు. కోడికి కూడా ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు, పోరులో గెలిచిన పందెం కోడి యజమాని వద్ద నుంచి రూ.ఐదు వేల రూపాయలు వసూలు చేశారు. రాత్రి వేళ కూడా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ముందే తెల్సినా నియంత్రించలేదు.. శివరాత్రి పండగకూ ముందే కోడిపందేలు, పేకాట నిర్వహణకు బరులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు చేయటంతో అధికారులు మిన్నకున్నారు. బరుల నిర్వాహకుల వద్ద లంచం తీసుకొని వారికి సహకరించారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రొంపిచర్లలో బహిరంగంగా జూదం నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. -
ఏలేశ్వరం గట్టుకు పోటెత్తిన భక్తులు
విజయపురిసౌత్: శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య ద్వారంగా మహోన్నత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్ జలాశయం మధ్యన సింహాపురి కొండపై వెలసిన ఏలేశ్వరస్వామి జాతరకు ఆదివారం మహా శివరాత్రిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. ఏలేశ్వరం గట్టు హరిహర నామస్మరణతో మార్మోగింది. ఆంధ్రా – తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లాంచీలను ఏలేశ్వరం గట్టుకు నడిపారు. లాంచీలలో కాకుండా భక్తులు మహబూబ్నగర్, ప్రకాశం, నల్లగొండ, గుంటూరు జిల్లాలలో సాగర్ జలాశయం తీరాలను ఆనుకొని ఉన్న పలుగ్రామాలు తండాల వాసులు మరబోట్లలో, పుట్టీలలో ఏలేశ్వరం జాతరకు తరలి వచ్చారు. కొండ ఎక్కిన భక్తులకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పలు స్వచ్ఛంధ సంస్థలు మజ్జిగ, నీళ్ళ ప్యాకెట్లను అందజేశారు. అలాగే విజయపురిసౌత్లో శివాలయంలో అర్చకుడు జూనూతుల నరసింహమూర్తి, ప్రశాంత్ శర్మలు అమరలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం గట్లు దిగువన, అనుపు వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల రూరల్ సీఐ నఫీజ్బాష నేతృత్వంలో విజయపురిసౌత్ ఎస్ఐ అనుపు వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
స్తంభించిన ట్రాఫిక్
మెట్లమార్గం పట్టిన భక్తులు నరసరావుపేటరూరల్:కోటప్పకొండ ఘాట్రోడ్లో ట్రాఫిక్ స్తంభించడంతో మెట్ల మార్గంలో కిందకి వెళ్లే వారిని పోలీసులు నిలిపివేశారు. దీంతో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోటప్పకొండ మీద భక్తులు స్తంభించిపోయారు. ఘాట్రోడ్లో ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురికావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కొండమీద భక్తులు కిందకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో వారు మెట్లమార్గం బాట పట్టారు. ఈ సమయంలోనే పదేళ్ల నందిని ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుంది. రాత్రికి ప్రసాదాల కొరత ఏర్పడింది. ముందుగా సిద్ధం చేసిన లడ్డూ ప్రసాదం విక్రయాలు రాత్రి ఏడుగంటలతో పూర్తయ్యాయి. అప్పటి నుంచి ప్రసాద విక్రయాలు నిలిపివేశారు. ప్రసాదాల కోసం కౌంటర్ల ముందు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. కోటప్పకొండలో రెండువైపులా స్తంభించిన ట్రాఫిక్ కోటప్పకొండలో ఆదివారం రాత్రి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఘాట్రోడ్డులో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో మెట్లమార్గం వైపుకు భక్తులు వెళ్లినా వారు కిందకు, కింది నుంచి పైకి రాలేని పరిస్థితి నెలకొంది. -
పల్నాడు
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం ఆదివారం 537.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 21,176 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు ఆదివారం 2,304 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 11.1 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. కొండ దిగువన కొలువుదీరిన విద్యుత్ ప్రభలుగుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను తుంగ లో తొక్కింది. విద్యా రంగానికి కేటాయింపులు పెంచకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకానికి నిధులను తగ్గించడం ద్వారా వేలాది మంది విద్యార్థులను అనర్హులుగా చేయాలని ఆలోచన తగదు. – వై.థామస్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుకోటప్పకొండకు7 -
అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్
చీరాల:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉంది. సున్నాలు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పారో అది అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ హామీలకు ఏ మేర కేటాయింపుల చేశారో స్పష్టత లేదు. నిరుద్యోగ భృతి, సున్నా వడ్డీ, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50ఏళ్లకే పింఛన్ వంటి హామీలకు కేటాయింపులు లేవు. – కరణం వెంకటేష్బాబు, వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి -
భక్తులకు లేదు తోవ
వీఐపీలకు సేవ సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకే పెద్దపేట వేస్తామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు వీఐపీల తాకిడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ. 200, రూ.500 అభిషేక దర్శనం క్యూలైన్లను భక్తులు స్వామివారిని దర్శించుకున్నందుకు దాదాపు నాలుగు గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీలతోపాటు అధికారుల కుటుంబ సభ్యులను పెద్ద సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. కింద నుంచి నేరుగా లిఫ్ట్ సదుపాయంతో వస్తున్న అధికారపార్టీ నేతలు, కార్యకర్తల వల్ల ఆ ప్రదేశంలో భారీ క్యూ కనిపించింది. ఈ సమయంలో శీఘ్ర ,అభిషేక దర్శనం క్యూలైన్ను నిలిపివేయడంతో భక్తులకు స్వామివారి దర్శనం ఆలస్యం అయింది. పోలీసులతో భక్తుల వాగ్వాదం .. స్వామి వారికి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందటంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. వీవీఐపీల సేవలలోనే తరిస్తారా సామాన్య భక్తులను పట్టించుకోరా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భక్తుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో పోలీసులు బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. మాకు ప్రోటోకాల్ ఉంటది ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే బయటకు వెళ్లిపోండి అంటూ పోలీసులు భక్తులపై ఫైర్ అయ్యారు. ఆగ్రహంతో మాట్లాడుతున్న భక్తులు పట్ల పోలీస్ అధికారులు అసభ్యకరంగా బూతుల దండకాన్ని అందుకున్నారు. కొంతసేపటి తర్వాత జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ అక్కడికి చేరుకొని వీ వీఐపీ దర్శనాలలో ఇతరులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ టికెట్ల దర్శనం భేష్... ఆలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంలో కొనుగోలు చేసే వీఐపీ టికెట్ల విధానం సత్ఫలితాలను ఇచ్చింది. గతంలో వీఐపీ పాసుల పేరుతో ఉచితంగా దర్శనానికి అనుమతి ఇచ్చేవారు. దీని వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టంతో పాటు సామాన్య భక్తులు ఇబ్బందిపడేవారు. ఈ ఏడాది వీఐపీ దర్శనానికి రూ.300 టికెట్ ను నిర్ణయించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దాదాపు 6 వేల మంది కి పైగా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్లను కొనుగోలు చేశారు. వీరికి కేటాయించిన టైం స్లాట్ లో కొండకు వచ్చి స్వామివారిని శీఘ్రంగా దర్శించుకున్నారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే వీఐపీ క్యూ లైన్ భక్తులకు సకాలంలో దర్శనం కావడంతో ఈ ఏడాది ఖాళీగా కనిపించింది. నరసరావుపేట నుంచి కోటప్పకొండ తిరుణాలకు వెళ్లిన భక్తులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నరసరావుపేట వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పెట్లూరువారి పాలెం రోడ్ లో నిలిపివేశారు. అక్కడ నుంచి కొండ దిగున ఘాట్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్ కు భక్తులు కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది. కిలోమీటర్కు పైగా ఉన్న బస్టాండ్కు చేరుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో లేని విధంగా నరసరావుపేట వైపు నుంచి వచ్చే బస్సులను దూరంగా నిలిపివేయటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. భక్తుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏడాది నుంచి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల కోటప్పకొండకు వచ్చిన సమయంలో ప్రకటించారు. తిరునాళ్ల రోజు అందరికి స్వామి వారి ఉచిత ప్రసాదం అందజేస్తామన్నారు. అయితే ఆదివారం కొంతమందికే ఉచిత లడ్డూ ప్రసాదం అందింది. ఉదయం 11 గంటల వరకు దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేసి తరువాత లడ్డూలు లేవంటూ నిలిపివేశారు. పలువురు భక్తులు దీనిపై ప్రశ్నించడంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పంపిణీని తిరిగి ప్రారంభించారు. -
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి...
రాష్ట్ర పండుగ హోదాలో కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి వారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం ఉదయం 10.30 గంటలకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు, పూజారులు మంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెలే డాక్టర్ చదలవాడ అరవింద్బాబుతో కలసి ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి, కలెక్టర్ కృతికాశుక్లా, ఎస్పీ కృష్ణారావు, ఆలయ ఈవో చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్త జనసంద్రంగా సత్రశాల
సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ప్రముఖశైవక్షేత్రం సత్రశాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తజనం పోటెత్తి తరలివచ్చారు. వేకువజామునుంచే వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చి దేవస్థానానికి సమీపంలోని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి మల్లన్నస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ప్రధాన అర్చకుల నేతృత్వంలో పలువురు వేదపండితులు ప్రత్యేక పూజలు, స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి శ్రీ చక్రనవవర్ణ అర్చన, కుంకుమార్చ నలు, జలబిందెలతో స్వామివారికి అభిషేకం, గంగపూజ, మంగళస్నానములు, ఖడ్గ ప్రదర్శన, అఖండ దీపారాధన నిర్వహించారు. దేవస్థానం ఆవరణలోని మండపంలో ప్రతిష్టించిన స్పర్శ స్పటికలింగం వద్ద భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి సత్రశాలకు వేలమంది భక్తులు తరలివచ్చి దైవదర్శనం చేసుకున్నారని ఈఓ గాదె రామిరెడ్డి తెలిపారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున నేతృత్వంలో పోలీసులు, మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ బి.వీరస్వామి పలు కూడలలో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా భద్రత చర్యలు చేపట్టారు. స్వామివారిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారికి దేవస్థానం ఈఓ గాదె రామిరెడ్డి, దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, ప్రధాన అర్చకులు నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివనామ స్మరణతో పులకించిన సత్రశాల -
సత్తెనపల్లిలో రూ.3.50 కోట్లతో నిర్మాణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్జీవోస్ సెంటర్లో రూ. 3.50 కోట్లతో అన్ని హంగులతో కూడిన బిలాల్ మసీద్ను(చిన్న మసీద్) ఆదివారం ఢిల్లీకి చెందిన ప్రముఖ మత గురువు ప్రారంభించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజు నిర్వహించారు. సత్తెనపల్లిలో 110 సంవత్సరాల క్రితం ఢిల్లీ నిజాముద్దీన్కి అనుసంధానంగా పవిత్రమైన బిలాల్ మసీద్ (చిన్నమసీద్) నిర్మాణం జరిగింది. ఆ మసీద్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల దానిని కూల్చివేసి నూతన మసీదు నిర్మాణం కోసం ముస్లీం సోదరులు శ్రీకారం చుట్టి విరాళాలు సేకరించారు. లగడపాడు గ్రామంలో... పెదకూరపాడు: మండలంలోని లగడపాడు గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన మస్జీదే మహమ్మదీయను ఉమ్మడి గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజు నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. మార్టూరు: పిల్లల మధ్య ప్రారంభమైన వివాదం పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసిన ఘటన మండలంలోని నాగరాజు పల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అందిన వివరాల మేరకు.. నాగరాజుపల్లి గ్రామం వెలుపల గల భూముల్లో స్థానిక పిల్లలు కర్రాబిళ్ల ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం ప్రారంభమై క్రమేపి వారి పెద్దల వరకు వెళ్లింది. క్షణికా వేశానికి లోనైన ఇరుపక్షాలకు చెందిన పెద్దలు గ్రామంలోని రోడ్లపై పరస్పరం దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాలకు చెందిన ముఖ్యులను స్టేషన్కు తరలించారు. ఈ విషయమై రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరు వర్గాలకు చెందిన సుమారు 50 మందికి పైగా నాగరాజు పల్లి గ్రామస్తులు స్టేషన్ పరిసరాల్లో గుమిగూడటం చర్చనీయంశమైంది. -
కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం
మంత్రి గొట్టిపాటి, కలెక్టర్కు చెక్కు అందజేసిన క్వారీ అసోసియేషన్ యజమానులు నరసరావుపేట: కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తుల వసతుల కల్పనకోసం సంతమాగులూరు మండలం గురిజేపల్లికి చెందిన శ్రీ త్రికోటేశ్వర గ్రానైట్ క్వారీ అసోసియేషన్ రూ.10లక్షల విరాళాన్ని అందజేసింది. ఆదివారం అసోసియేషన్ ప్రతినిధులు ఈ మేరకు చెక్కును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు అందజేశారు. దాతలను ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ అభినందించారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం క్వారీ అసోసియేషన్ వారు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల షూటింగ్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల జట్లు సత్తా చాటి చాంపియన్గా నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న 9వ సబ్ జూనియర్ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల షూటింగ్ బాల్ చాంపియన్షిప్ హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 18 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు హజరయ్యాయి. బాల,బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాల, బాలికలు నువ్వా.. నేనా అన్నట్లు క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానం నెల్లూరు జిల్లా సాధించగా ద్వితీయ స్థానం పల్నాడు జిల్లా, తృతీయస్థానం ఎన్టీఆర్ జిల్లా జట్లు కై వసం చేసుకున్నాయి. నరసరావుపేట టౌన్: ఎన్ఎస్పీ మేజర్ కెనాల్లో స్నానానికి దిగి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం పెట్లూరివారిపాలెం వద్ద చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఓలేటివారిపాలెం మండలం సింగ్నేనిపల్లి గ్రామానికి చెందిన కట్టా రోహిత్(20) హైదరాబాద్లో బేల్దార్ పని చేస్తుంటాడు. కోటప్పకొండ తిరునాళ్ల చూసేందుకు శనివారం రాత్రి ఐదుగురు స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు. పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద ఏఎంరెడ్డి కళాశాల సమీపంలో ఎన్ఎస్పీ కాల్వలో స్నానం చేసేందుకు తెల్లవారుజామున దిగాడు. ఈత రాకపోవటంతో కాల్వలో నీటమునిగాడు. గమనించిన స్నేహితులు అభి, ఎలీషా, శ్రీనాథ్, ఇసాక్, మల్లిఖార్జునలు బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ కిషోర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముగ్గురికి గాయాలు నూజండ్ల: మండల పరిధిలోని పాత, కొత్త ఉప్పలపాడు గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో ములకలూరు గ్రామానికి చెందిన మందా శాంసన్ (28) సంఘటనా స్థలంలో మృతిచెందగా క్షతగ్రాత్రులను 108 ద్వారా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన ధనుంజయ్ ఈదర మీదుగా బైక్పై వినుకొండకు వస్తూ.. మార్గమధ్యంలో వేరే మహిళను ఎక్కించుకుని వస్తున్నాడు. అదే సమయంలో ములకలూరు గ్రామానికి చెందిన శాంసన్ తన మిత్రుడితో కలిసి బైక్పై వినుకొండ నుంచి వస్తుండగా ఉప్పలపాడు గ్రామ సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఽఢీ కొన్నాయి. ప్రమాదంలో శాంసన్ మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుడు మందా శాంసన్కు భార్య నాగమల్లేశ్వరి, ముగ్గురు సంతానం ఉన్నారు. పండుగ రోజు కుటుంబ పెద్ద మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
పూర్తి తిరోగమన బడ్జెట్
చినగంజాం: ఇది తిరోగమన బడ్జెట్ తప్ప పేద వర్గాలకు మేలు చేసే విధంగా లేదు. సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 బడ్జెట్లో కనిపించలేదు. విద్యారంగంలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. సంక్షేమానికి 17.03 శాతం నుంచి 16 శాతానికి తగ్గించారు. అంగన్వాడీ, ఆశాలు వంటి స్కీం వర్కర్లకు సంబంధించి జీతాల పెంపుపై బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనే లేదు. చేనేత వర్గాలకు రిక్తహస్తం చూపారు. పేద వర్గాల వారిపై కక్షతో ఇళ్లస్థలాలు గాని, ఇళ్ళు కట్టించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తుంటే పేద వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. –బత్తుల బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్సీపీ బాపట్ల, ప్రకాశం జిల్లాల టాస్క్ఫోర్స్ పరిశీలకులు -
పెట్లూరు వారిపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్...
నరసరావుపేట మండలం పెట్లూరు వారిపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు వాహనాలు భారీస్థాయిలో నిలిచిపోయాయి. బస్సులోని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. పెట్లూరు వారిపాలెం గ్రామానికి చెందిన రెండు ప్రభలు ఉదయం 11 గంటల సమయంలో కొండకు బయలుదేరాయి. ఆ సమయంలో గుంటూరు–కర్నూలు హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు విమర్శించారు. -
ప్రభవించిన భక్తిభావం..!
కోటప్పకొండ తిరునాళ్లకు తరలిన ప్రభలు, భక్తులు నరసరావుపేట ఈస్ట్: అన్ని దారులు శివయ్య సన్నిధికే.. కోటప్పకొండలో కొలువైన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళుతున్న భక్తులతో నరసరావుపేట పట్టణం భక్తజన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కోటప్పకొండకు అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ మార్గాలలో భక్తుల సందడి అధికంగా కనిపించింది. పల్నాడురోడ్డు, స్టేషన్రోడ్డు, చిత్రాలయ సెంటర్లో యాత్రికుల తాకిడి కనిపించింది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, పల్నాడు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రధాన మార్గాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆధ్వర్యంలో అన్నప్రసాదాలను యాత్రికులకు అందించారు. కొండ దిగువన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన స్టాళ్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు.. పట్టణంలోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతూరులోని భీమలింగేశ్వరస్వామి, పల్నాడురోడ్డులోని కళ్యాణ సుందరేశ్వరస్వామి, వల్లప్పచెరువులోని కేదారేశ్వరస్వామి, బరంపేటలోని వాయు మల్లేశ్వరస్వామి తదితర ఆలయాలలో పూజలు నిర్వహించారు. హైకోర్లు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి దంపతులు కేదారేశ్వరస్వామి వారికి అభిషేకాలు, పూజలు జరిపారు. కొండకు తరలిన ప్రభలు ప్రభల పండగ్గా పేరుపొందిన మహాశివరాత్రి పర్వదినాన జరిగే కోటప్పకొండ తిరునాళ్లకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు తరలివెళ్లాయి. ఉదయం తల్లిదండ్రులు తమ చిన్నారులతో మొక్కుబడి ప్రభలను తీసుకొని కొండకు వెళ్లారు. -
కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్లో కౌలు రైతుల పంట రుణాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో 70 శాతం సాగుభూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, వారికి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ప్రభుత్వం విస్మరించింది. అలాగే గుంటూరు జిల్లాకు నిధులు కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. 50 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగింపునకు, నల్లమడ వాగు ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేక పోవడం శోచనీయం. సంక్షేమ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి తగిన కేటాయింపులు లేవు. – పాశం రామారావు, కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు -
కోటప్పకొండ ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్
పల్నాడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు భక్తులు పోటెత్తడంతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండ కిందకి గాని పైకి గాని కదలకుండా వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా గంటల తరబడి అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా కోటప్పకొండ నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో నరసరావుపేట వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు భక్తులు. కొండ దిగుభాగంలో పూర్తిగా వాహనాలు ప్యాక్ అయిపోవడంతో ట్రాఫిక్ను కంట్రోల్లో తీసుకురావడం కష్టతరంగా మారింది. ఇది క్లియర్ కావడానికి మరికొన్నిగంటలు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. -
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
విద్యుత్ దీపకాంతులలో కోటప్పకొండ ఆలయం కొండ జాతరకువివిధ జిల్లాల నుంచి కోటప్పకొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తుంది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరేవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో 10 మెడికల్ క్యాంప్లు ఏర్పాటుచేస్తున్నారు. సర్వం సిద్ధం -
తిరునాళ్ల విధులను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించాలి
ఎస్పీ బి.కృష్ణారావు నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. తిరునాళ్ల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి బ్రీఫింగ్ కార్యక్రమం శనివారం జెడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ బందోబస్తుకు హాజరైయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది తిరునాళ్ల విధులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డ్యూటీ ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. -
కొండకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా శనివారం కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. సాధారణంగా ఏకాదశి రోజుల కొండలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఏకాదశి రోజున భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా శనివారం ఊహించని విధంగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. నందీశ్వరుడు, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. మండప అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. బాల ప్రభలతో భక్తులు కొండకు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సోఫాన మార్గంలో మెట్లపూజ చేసుకుంటూ కొండమీదకు చేరుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించేందుకు వస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దాదాపు 40 నిమిషాలు పాటు కలెక్టర్ కాన్వాయ్ ట్రాఫిక్లో నిలిచిపోయింది. కొబ్బరికాయ రూ.50 కోటప్పకొండలో దుకాణాదారులు అధిక ధరలకు భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కొబ్బరికాయను రూ.50లకు విక్రయిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇక్కడి రేటు ఇంతే అంటూ భక్తులపై విరుచుకుపడుతున్నారు. దీంతోపాటు వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్కు రూ.10 అదనపు ధరకు అమ్ముతున్నారు. దీనిపై పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
వెన్ను పోటు బడ్జెట్
● టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కేటాయింపులేవి? ● మహిళలకు నెల నెలా రూ.1,500 ఆర్థిక సాయం ప్రస్తావనేది! ● నిరుద్యోగులకు మరోసారి మొండిచేయి ● ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలపై లేని స్పష్టత ● ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ల ఊసేది! ● కొత్త పింఛన్లు మంజూరు ఈ ఏడాదీ లేనట్టే ● బడ్జెట్లో రైతులకు ఒరిగిందేమీ లేదంటున్న రైతు సంఘాల నేతలు సాక్షి, నరసరావుపేట: ఎన్నికలయ్యే వరకు ఓటరు మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది తెలుగుదేశం పార్టీ తీరు. ఎన్నికల్లో గెలవడానికి సూపర్ సిక్స్తో పాటు అలవిగాని హామీలను ఎన్నింటినో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తీరా వాటి అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మరోసారి నిరాశ మిగిలింది. సూపర్–6 పథకాలను ఈ ఆర్థిక సంవత్సరమైనా పూర్తిగా అమలు చేస్తారనుకుంటే వాటి ప్రస్తావనే చేయలేదు. నెల నెలా ఆడబిడ్డ నిధి ద్వారా అందజేస్తామ న్న రూ.1,500 కోసం జిల్లాలో 7,80,538 మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. వారికి గత రెండేళ్లలాగే ఈసారీ మొండిచేయి చూపారు. నూతన పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్కు అర్హత కల్పించి ఉంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.48 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వచ్చి ఉండేది. దీని గురించి ప్రస్తావన చేయలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులకు నిరాశే.. ఇంటింటికి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీ అమలు కోసం జిల్లాలో 6.51 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ బడ్జెట్లో వాటి ఊసేలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. తల్లికి వందన, సుఖీభవ వంటి పథకాల ప్రస్తావన ఉన్నా వాటికి ఇచ్చిన ఆరకొర నిధులతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందేమోనన్న భయం ప్రజల్లో మొదలైంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా ఉండగా కేటాయింపులు అరకొర చేసి మరోసారి పెండింగ్లో ఉంచేలా చేశారు. దీంతో విద్యార్థుల చదువులు ప్రమాదంలో పడనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూసిన పీఆర్సీ, ఐఆర్ల ఊసే లేకపోవడంతో ఆయా వర్గాలు మండిపోతున్నాయి. పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాకు ఏం చేస్తున్నారో పేర్కొనలేదు. -
పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు
అమరావతి: అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివా రం సాయంత్రం పెండ్లికుమారుడైన అమరేశ్వరుడిని పల్లకీ వాహనంలో, పెండ్లి కుమార్తె అయిన బాలచాముండేశ్వరీదేవిని పులివాహనంపై ఉంచి వైభవంగా పురవీధులలో ఊరేగించారు. ఆలయ ఈఓ రేఖ మాట్లాడుతూ భక్తులకు తెల్లవారుజామున మూడు గంటల నుంచే దర్శనం కల్పిస్తామని చెప్పారు. సాయంత్రం 4గంటల వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపా రు. భక్తులకు అందించేందుకు 50 వేల లడ్డూలను తయారు చేయించామని తెలిపారు. సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం
● తరలిరానున్న లక్షలాది మంది భక్తులు ● కొలువుతీరనున్న 26 భారీ విద్యుత్ ప్రభలు ● విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం ● మూడు వేల మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ● 618 బస్సులను కొండకు నడపనున్న ఆర్టీసీ ● పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే తిరునాళ్ల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడువేల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడపనుంది. రాష్ట్ర పండుగ హోదాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి త్రికోటేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఒంటి గంట నుంచి దర్శనం త్రికోటేశ్వర స్వామికి శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పుష్పాలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత, ప్రత్యేక, శ్రీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనాన్ని భక్తులకు కల్పించే విధంగా క్యూలైన్లు సిద్ధం చేశారు. క్యూలైన్లో భక్తులకు ఆరు లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది భక్తులకు ఉచితంగా చిన్న లడ్డూలను అందజేయనున్నారు. సుమారు 1.50లక్షల మంది స్వామి దర్శించుకుంటారని అధికారుల అంచనాగా ఉంది. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 10 నుంచి 15 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర జరిగే కొండ దిగువు ప్రాంతం లక్షలాది మంది యాత్రికులతో కిక్కిరిసిపోతుంది. కొలువుతీరనున్న భారీ విద్యుత్ ప్రభలు ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యుత్ ప్రభలు భక్తులను కనువిందు చేయనున్నాయి. 26 భారీ విద్యుత్ ప్రభలు కొండకు తరలిరానున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కబడి ప్రభులు కొండకు రానున్నాయి. -
చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన
దాచేపల్లి: ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పెదగార్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. దాచేపల్లి నగర పంచాయతీలోని నారాయణపురంకి చెందిన వైఎస్సార్ సీపీ నేత దేరంగుల శ్రీను కుమారుడు రమేష్ (28) చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు శుక్రవారం మృతిచెందాడు. మృతుడు రమేష్కి భార్య సత్యవతి, పెద్దకుమారుడు మహాదేవ్ (3). 25 రోజుల పసిబాబు సంతానం. చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన రమేష్ మృతదేహానికి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్మార్టం పూర్తి చేశా రు. అయితే రమేష్ కుటుబానికి నష్టపరిహారం చెల్లించి భార్యకి ఉద్యోగం అవకాశం కల్పించాలని ప్రధానగేట్ వద్ద బైఠాయించారు. యజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటల తరబడి ఆందోళన చేసినా స్పందించకపోవటంతో రమేష్ మృతదేహంతో ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ ఆందోళన చేయటంతో యజమాన్యం ప్రతినిధులు చర్చలకు పిలిచారు. రమేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి అతని భార్యకి ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై యజమాన్య ప్రతినిధులు చర్చలు కొనసాగిస్తున్నారు. -
యువతకు నిరాశ
రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశపర్చింది. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసింది. వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు నిధులు కేటాయించలేదు. కొత్త ఉద్యోగాల కల్పన కోసం జాబ్ క్యాలెండర్ ఊసేలేకపోగా.. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తోంది. అన్ని రంగాల వర్గాలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. – పడాల శివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి -
నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం
నరసరావుపేట రూరల్: తిరునాళ్ల మహోత్సవానికి పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండ సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం నిర్వహించే ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు జాగరణకు తరలిరానున్నారు. త్రికోటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. భక్తులకు ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం కల్పించే విధంగా క్యూలైన్లు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. క్యూలైన్లలో భక్తులకు అందజేసేందుకు ఆరు లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ కోటప్పకొండకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడు వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొలువుదీరనున్న భారీ విద్యుత్ ప్రభలు ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది 26 భారీ విద్యుత్ ప్రభలు కొలువుదీరనున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కుబడి ప్రభలు కొండకు తరలిరానున్నాయి. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది భక్తులకు చిన్న లడ్డూలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకున్న 281మంది న్యాయవాదులు నరసరావుపేట: రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం స్థానిక న్యాయవాద సంఘ కార్యాలయంలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 303 ఓట్లు ఉండగా 281 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10.30నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు ఉత్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. న్యాయవాద సంఘం అధ్యక్షుడు జీవీసుబ్బారావు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు కట్టా నారపరెడ్డి, సీజే ప్రతాప్, ఎస్.అయ్యప్పరాజు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. మొత్తం ప్రక్రియ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన మూడు సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయబడింది. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ బాక్స్లను ఏపీ బార్ కౌన్సిల్కు కొరియర్ ద్వారా పంపే ఏర్పాట్లు చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్లో నూతనంగా ఏర్పాటు చేసే ఎయిర్ పోర్ట్కు కావాల్సిన భూములను ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు అయిషీరాజ్, పరజిట్ ముఖర్జీలు మాచర్ల తహసీల్దార్ కిరణ్కుమార్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. మాచర్ల మండలం పశువేముల గ్రామంలో భూములను వీరు పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు తమ పరిధిలోని భూములను పరిశీలన జరిపి ఎయిర్ పోర్టు డవలప్మెంట్ అథారిటీ సభ్యులతో మాట్లాడారు. నూతన ఎయిర్ పోర్టు కోసం విజయపురిసౌత్, నాగులవరం, పశువేముల పంచాయతీల పరిధిలో భూమిని సేకరించాల్సి ఉంది. -
అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు
అమరావతి: అమరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాలపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి సమీక్షించారు. అమరేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్, ఈవో రేఖలతో కలిసి వైద్య శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై చర్చించారు. అనంతరం సిబ్బందికి, శిబిరాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రతలు వివరించా రు. భక్తులకు అరోగ్యశాఖ సేవలు 24గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఐఓ డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ శివరత్నకుమార్, డాక్టర్ మౌనిక ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరున్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి వాసంశెట్టి సుభాష్కు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సుభాష్కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు):భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరి సమేత రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఆమంచి సృజన్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం నిత్యహోమం బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం, నెమలి వాహన సేవ జరిగింది. కార్యక్రమాలను ఈవో ఇ.సాంబశివరావు పర్యవేక్షించారు. మహాశివరాత్రికి మల్లయ్య గట్టుకు లాంచీలు ఏర్పాటు విజయపురిసౌత్: ఏపీ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన అనుపు నుంచి ఏలేశ్వరం స్వామి మల్లయ్య గట్టుకు ప్రత్యేక లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక లాంచీ స్టేషన్ యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఏలేశ్వరం గట్టుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం స్పెషల్ లాంచీలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 గా నిర్ణయించడమైందన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్పెషల్ లాంచీల కోసం భక్తులు 97051 88311, 94414 53115 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6300, మోడల్ ధర రూ.5800 వరకు పలికింది. -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
గుంటూరు వెస్ట్: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... కమిటీ సభ్యులు సూచించిన అంశాలసౌ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో నీళ్ల ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్కు నిర్దేశిత ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార తనిఖీ విభాగం హోటళ్లపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాల్సి ఉందని వివరించారు. గ్యాస్ డెలివరీ బాయ్ వినియోగదారుల నుంచి అధికంగా నగదు వసూలు చేస్తున్నారని, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద రంగుల ఐస్ క్రీములు, హానికరమైన ఆహార పదార్థాల విక్రయాన్ని కట్టడి చేయాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని తనిఖీ చేయాలని అన్నారు. సమావేశంలో డీఎస్ఓ పి.కోమలి పద్మ, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, సీపీడీసీఎల్ కార్యనిర్వహక ఇంజినీర్ రమేష్, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. గుండవరం(చేబ్రోలు): మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు ప్రధాన ఆకర్షణ. దీనిలో భాగంగా ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి గొడవర్రు గ్రామ ప్రభ, గుండవరం గ్రామ ప్రభలు క్రమం తప్పకుండా ఆనవాయితీగా ముందు వరసలో ఉంటాయి. వంద సంవత్సరాల నుంచి గ్రామ ప్రభలు భారీ విద్యుత్ ప్రభలను నిర్మించుకొని భక్తిశ్రద్ధలతో గ్రామంలో మహాశివరాత్రి ముందురోజు ఊరేగింపు నిర్వహించి అనంతరం పండుగ రోజున భక్తుల శివనామస్మరణలతో ఆలయానికి చేరుకుంటాయి. గుండవరం గ్రామానికి చెందిన చుక్కా వంశస్తులు ఒక సంవత్సరం, టంకశాల వంశస్తులు మరో సంవత్సరం గ్రామ ప్రభను నిర్మించి క్వారీ ఆలయానికి గ్రామ ప్రభను తీసుకువెళ్లటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడాది చుక్కా వంశస్తులు గ్రామ ప్రభను నిర్మిస్తున్నారు. గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరు లాల్పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు సమక్షంలో జిల్లా మహిళ మోర్ఛా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాజామాధవి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ అన్నారు. మహిళ మోర్చా ఉపాధ్యక్షునిగా వాణి వెంకట్, సాధువాణి, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, స్వాతి, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కాసు శ్రీదేవి, కఠారి పద్మజ, కార్యదర్శులుగా రాధిక, రమ్య, రమాదేవి, లక్ష్మీప్రసన్న, పర్హానా, కోశాధికారిగా డాక్టర్ స్రవంతి, సోషల్మీడియా కన్వీనర్గా వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులుగా లీలారాణి, ఉష, లీల, దుర్గా, పద్మా, బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళ మోర్చా కమిటీకి మహిళ మోర్ఛా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడ్డి నాగమల్లేశ్వరి, గుంటూరు మిర్చి యార్డు డైరెక్టర్ శ్రావణ్కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈదర శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భజరంగ్ రామకృష్ణ, తదితరులు అభినందనలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన శుక్రవారం భ్రమరాంబ అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు. దేవస్థానంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, పంచహారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు గ్రామ బలిహరణ, 8.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, నిత్యౌపాసన, గ్రామబలిహరణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పంచహారతులు ఇచ్చారు. ఆదివారం రాహు కేతు పూజలు, 100 అభిషేకాలు మినహా అన్ని అర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. తెనాలి రమేష్బాబు బృందంచే భక్తిరంజని, నటరాజ నృత్యనిలయం విజయవాడ వారిచే కూచిపూడినృత్యం, వెనిగండ్ల ఉల్లంగుల బ్రహ్మం ఆధ్వర్యంలో గయోపాఖ్యానం నాటకం నుంచి యుద్ధసీను, నిడుబ్రోలు వేపసూరి వెంకట్రావు ఆధ్వర్యంలో బాలనాగమ్మ నాటకం నుండి ఫకీరు, సంగు సీన్లు అద్భుతంగా ప్రదర్శించారు. -
తపోభూమి సత్రశాల
సత్రశాల(రెంటచింతల): పవిత్ర కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న అత్యంత పురాతనమైన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీగంగా భ్రమరాంబా సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినానికి సిద్ధమైంది. అనాదిగా ఈ దేవస్థానం భక్తులపాలిట సంతాన మల్లయ్య స్వామిగా... కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. సంతానం కలగని మహిళ ఇక్కడ కొలువైన స్వామి వారిని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం (నమ్మకం). విశ్వామిత్ర మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. తాను చేస్తున్న కఠోర తపస్సును భగ్నం చేసిన కాకులను విశ్వామిత్ర మహర్షి ఆగ్రహంతో శపించడం వలనే ఈ ప్రాంతంలో కాకులు మచ్చుకై న కనిపించవు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శైవక్షేత్రంలో ప్రతిరోజు మల్లన్న స్వామికి దేవస్థానం ప్రధాన అర్చకుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మహాశివ రాత్రి పర్వదినం రోజు తెల్లవారు జామునుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం తరహాలో ఇక్కడ కూడా వివిధ సామాజక వర్గాలకు చెందిన సుమారు 20 అన్నదాన సత్రాలు ఉన్నాయి. మహాశివ రాత్రి పర్వదినం రోజున ఆయా సామాజక వర్గాలకు చెందిన వారికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తారు. అతిపురాతనమైన శైవక్షేత్రం రాష్ట్రంలోని అతిపూరతనమైన శైవ క్షేత్రాలలో సత్రశాల మల్లిఖార్జున స్వామి దేవస్ధానం ఒకటి. ఈ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల సైతం ప్రతిఏటా తరలివస్తుంటారు. మాచర్ల నుంచి పాలువాయి జంక్షన్, పశర్లపాడు, జెట్టిపాలెం గ్రామాల మీదగా సత్రశాలకు చేరుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలోనే రామాలయం, కుమార స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్తరేశ్వరుని ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, కాలభైరువుని ఆలయం, అన్నపూర్ణదేవి ఆలయం, కాశీవిశ్వేరుని ఆలయం, వెంకటేశ్వరుని ఆలయం, చీకటి మల్లయ్య స్వామి ఆలయం, అమర లింగేశ్వర స్వామి ఆలయం, కృష్ణవేణి ఆలయం కొలువై ఉన్నాయి. దేవస్ధానానికి విచ్చేసిన భక్తులలో భక్తిపారవశ్యంతో ఆధ్యాత్మికభావం తోణికిసలాడుతుంది. ఆలయ ప్రాంగణంలో నున్న ఏకశిలనంది విగ్రహం, దేవస్థానం మాజీ చైర్మన్ వేముల పిచ్చయ్య నిర్మించిన అతి పెద్దదైన శివయ్య విగ్రహం, మాజీ దేవస్థానం చైర్మన్ బద్దూరి బ్రహ్మారెడ్డి చేతులమీదుగా ఏర్పాటు చేసిన స్పటిక శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు తెల్లవార్లు జాగారం చేస్తుంటారని దేవస్థానం కార్యనిర్వణాధికారి గాదె రామిరెడ్డి, దేవస్థానం చైర్మన్ గుండా వెంకట శివయ్య తెలిపారు. -
ఈ పంట నమోదుపై సూపర్చెక్
నకరికల్లు: సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయ సంక్షేమపథకాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు అన్నారు. మండలంలోని నకరికల్లు, చల్లగుండ్ల గ్రామాల్లో ఈ పంట నమోదు చేసుకున్న పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. సూపర్చెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26లో గ్రామాల్లోని రైతుసేవకేంద్రాల సిబ్బంది నమోదు చేసిన పంటలను జియోఫెన్సింగ్తో తనిఖీ చేశామన్నారు. మండలంలో రబీ సీజన్లో 7,752 హెక్టార్లలో వరి, 1,598 హెక్టార్లలో మొక్కజొన్న, 71 హెక్టార్లలో ఇతపంటలు సాగుచేస్తున్నట్లు నమోదైందన్నారు. జియోఫెన్సింగ్తో 18,839 ఎకరాల్లోని పంటలను నమోదు చేయడమైందన్నారు. సాగుచేస్తున్న పంటలకు ఈ పంటనమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతుసేవ కేంద్రాల సిబ్బందిని సంప్రదించి ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకొని రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.దేవదాసు, గ్రామ వ్యవసాయ సహాయకులు వై.ప్రభాకర్, ఎస్.విజయనరసింహ, ఏఈఓ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జియోఫెన్సింగ్ సూపర్చెక్లో పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు -
భక్తుల భద్రతే ధ్యేయంగా ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది భక్తుల సంఖ్య గతేడాది కంటే 30 శాతం అధికంగా ఉంటుందని, సుమారు 1.50 లక్షలకు పైగా భక్తులు దర్శనానికి వస్తారని అంచనాతో ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రధానంగా శనివారం అర్ధరాత్రి (తెల్లవారితే శివరాత్రి) ఒంటి గంట నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక ఉచిత క్యూలైన్లు ఏర్పాటుచేశామన్నారు. ఆన్లైన్లో అన్ని రకాల టికెట్లతోపాటు రూ.300 వీఐపీ టికెట్లు 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, కొండపై కౌంటర్లలో రూ.100, రూ.200, రూ.500 టికెట్లు ఆఫ్లైన్లో సైతం లభిస్తాయన్నారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి 20 గ్రాముల లడ్డూ ఉచితంగా అందజేస్తారని, లడ్డూ కొనుగోలు చేసేందుకు 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్వదినాన పలు ప్రాంతాల నుంచి మొత్తం 618 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ఇందులో కొండపైకి భక్తులు వెళ్లేందుకు 120 బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్కార్డు ఉన్న ప్రతి మహిళకు సీ్త్రశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల కోసం 6 లక్షల వాటర్ బాటిళ్లు, లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లు, లక్ష బిస్కెట్లు ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా షేడ్ నెట్లు ఏర్పాటు చేశామని, 10 మెడికల్ క్యాంపులు, 170 మంది వైద్య సిబ్బంది, ఎనిమిది అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని అన్నా రు. 440 మంది సిబ్బందితో నిరంతర పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తామని, 16వ తేదీ వరకూ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతుంటాయన్నారు. 2500 మంది సిబ్బందితో బందోబస్తు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణారావు మాట్లాడుతూ భక్తుల రక్షణ కోసం 2500 మంది పోలీస్ సిబ్బంది, తొమ్మిది ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కొండపైన, దిగువన 100 సీసీ కెమెరాలు, 30 డ్రోన్ల తో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. దొంగతనాల నివారణకు మఫ్టీలో క్రైమ్ టీమ్స్ నిత్యం పహారా కాస్తాయన్నారు. నరసరావుపేట, వినుకొండ నుంచి వచ్చే వారు పెట్లూరివారిపాలెం దారిలో రావాలని, చిలకలూరిపేట భక్తులకు శారదా ఫార్మసీ కాలేజీ వద్ద పార్కింగ్ ఏర్పాటుచేశామని, యల్లమంద, గురవయ్యపాలెం దారిలో వచ్చే భక్తులకు యాదవ, రెడ్ల సత్రాల పక్కగా పార్కింగ్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 విద్యుత్ ప్రభలు, 3 ఇతర ప్రభలు కొండకు వచ్చేందుకు నమోదు చేసుకున్నాయన్నారు. అత్యవసర సహాయం కోసం 94409 00885నంబరులో సంప్రదించాలని సూచించారు. -
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు డిమాండ్ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన హామీల్లో భాగంగా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలనీ, అప్పటి వరకు 30 శాతం మధ్యంతర భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అధ్యక్షత వహించిన ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ, రూ.34 వేల కోట్లను దశల వారీగా విడుదల చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఏమండీ మాట్లాడుతూ జిల్లాను యూనిట్గా తీసుకొని కారుణ్య నియాకాలను పూర్తి చేయాలన్నారు. పెన్షనర్ల నగదును ఉద్యోగ విరమణ రోజు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాకు మద్దతు ఇచ్చిన సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. నాలుగు విడతల డీఏ మంజూరు చేయాల్సి ఉండగా ఒక డీఏతో చేతులు దులుపుకున్నదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలసి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జె.గంగాధర్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.చంద్రజిత్ యాదవ్, వెంకట కోటయ్య, రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు షేక్.కరిముల్లా, జిల్లా పరిధిలోని మండలాల అధ్యక్ష్య, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
హరహర.. త్రికోటేశ్వరా..
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 536.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 36.0467 టీఎంసీలు. అమ్మవారికి బోనాలు గురజాల:పల్లెగుంత రోడ్డులో వేంచేసి ఉన్న లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వామి వారికి శుక్రవారం బోనాలు సమర్పించారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు.ఈ–పంట.. మేలంట గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి నుంచి మహాశివరాత్రి వరకు మూడు రోజుల పాటు కోటప్పకొండలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం కోటప్పకొండలో భక్తుల రద్దీ నెలకొంది వేలాది మంది స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలవిరాట్ అభిషేకాలు నిలిపివేయడంతో అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. -
కప్పం కడితేనే దుకాణాలకు అనుమతి
నరసరావుపేట రూరల్: ‘మేం అడిగినంత ఇస్తేనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. మాకు తెలియకుండా ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తాం’ అంటూ పల్నాడు జిల్లా కోటప్పకొండలోని రైతులను, దుకాణాదారులను నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చదలవాడను బాధిత రైతులు కలిసి గోడును వెళ్లబోసుకోగా.. తన అనుచరులు చెప్పినట్టు చేయాలని ఆయన చెప్పడంతో రైతులు కోటప్పకొండలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్లకు లక్షలాది మంది తరలివస్తారు. యాత్రికుల కోసం కొండ దిగువన జాతర జరిగే ప్రదేశంలో దుకాణాలు, వినోదం కోసం జెయింట్ వీల్ వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. తమ భూముల్లో దుకాణాలు పెట్టుకున్నందుకు వ్యాపారుల నుంచి రైతులు కొంత మొత్తాన్ని అద్దె దూరంలో తీసుకుంటారు. ఈ మొత్తంలోనే కొంత గ్రామ పంచాయతీకి పన్నుగా చెల్లించేవారు. అయితే.. రెండేళ్లుగా తిరునాళ్లలో నిర్వహించే దుకాణాలపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరుడు, తెలుగు యువత నాయకుడు నాగూర్మీరా గత ఏడాది దుకాణాదారులు, జెయింట్ వీల్ నిర్వాహకుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. ఈ ఏడాది కూడా రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి జెయింట్ వీల్ నిర్వాహకులు సామగ్రితో కొండకు చేరుకోగా.. నాగూర్మీరా అనుచరులు అడ్డుకోవడంతో రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మా భూముల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే మీకెందుకు డబ్బులివ్వాలి’ అని రైతులు నిలదీశారు. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మాకు డబ్బులు ఇవ్వాల్సిందే’ అని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు. దీంతో రైతులంతా ఎమ్మెల్యే చదలవాడను కలిసి గోడు వెళ్లబోసుకోగా.. నాగూర్మీరా చెప్పినట్టే చేయాలని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో చేసేదిలేక రైతులంతా కోటప్పకొండకు చేరుకుని జాతర జరిగే స్థలంలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ‘మేమంతా టీడీపీ, జనసేన అభిమానులమే. టీడీపీ కూటమి విజయం కోసం కృషి చేసిన మాకే ఇలా అన్యాయం చేస్తే ఎలా’ అని ప్రశి్నంచారు. -
నేడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు
నరసరావుపేట: స్థానిక బార్ అసోసియేషన్ హాలులో శుక్రవారం ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్లో పాల్గొనేందుకు స్థానిక న్యాయవాదులు సమాయుత్తమయ్యారు. బార్ కౌన్సిల్కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది న్యాయవాదులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక బార్ అసోసియేషన్కు చెందిన 303 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి ఒక్కరూ బ్యాలెట్ పేపర్పై ఐదుగురికి తప్పనిసరిగా ఓటు వేయాల్సి ఉంటుంది. తాము ఎంపిక చేసుకున్న అభ్యర్ధులకు ఆంగ్లంలో ఓఎన్ఇ ఒన్, టీడబ్ల్యుఓ టు అంటూ ఐదుగురి పేర్లు ఎదుట ఆంగ్లంలో రాస్తేనే ఆ ఓటుకు విలువ ఉంటుందని, లేనిపక్షంలో ఇన్వాలిడ్ ఓటుగా పరిగణిస్తారని సీనియర్లు తెలియచేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లను సాయంత్రం నుంచి బార్ అసోసియేషన్ హాలు వద్ద చేపట్టి పూర్తిచేశారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బార్ కౌన్సిల్కు పోటీ చేస్తున్న పలువురు సీనియర్ న్యాయవాదులు స్థానిక బార్కు స్వయంగా వచ్చి న్యాయవాదులను కలిసి తమకు మద్దతు తెలియచేయాలని అభ్యర్ధించారు. పోటీలో ఉన్న గుంటూరుకు చెందిన పలువురు న్యాయవాదులకు మద్దతుగా స్థానిక న్యాయవాదులు ప్రచారం చేస్తూ తమ మద్దతుదార్లను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. సమాయత్తమైన స్థానిక న్యాయవాదులు -
పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు
అమరావతి: బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం వేద పండితులు, అర్చకులు అమరేశ్వరుడికి పెండ్లి కుమారునిగా అలంకరణ చేశారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో బాలచాముండికా సమేత అమరేశ్వరుడికి విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్, స్వామి వారికి కల్యాణోత్సవ పట్టువస్త్రాలను సమర్పించారు. అమరేశ్వరునికి వేకువ జామున అభిషేకం చేసి నూతన వస్త్రఽ దారణతో పెండ్లి కుమారుని చేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ కల్యాణోత్సవాలకు అర్చకులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేఖ చేతుల మీదుగా దీక్షా వస్త్రాలు సమర్పించారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన కేతవరం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న తండాల వాసులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ముంపు గ్రామాలకు చెందిన గిరిజనులు మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్టీ కమిషన్ ను వినతి పత్రం అందజేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన కేతవరం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న వారి వద్దకు వెళ్లి జేసీ వారి సమస్యలు తెలుసుకున్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అటవీ ప్రాంతంలో ఎందుకు నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా తాండ వాసులు పునరావాస కేంద్రాల్లో పనులు లేక పూట గడవడం కష్టంగా ఉందని జేసీకి తెలిపారు. దాదాపుగా 150 కుటుంబాల వరకు స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని తమకు వచ్చిన వ్యవసాయం చేసుకుంటూ, చేపల వేట సాగిస్తూ జీవిస్తున్నామన్నారు. తమ నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులైన రహదారి, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. వివరాల నమోదు చేసుకుని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జేసీ వివరించారు. కార్యక్రమంలో సత్తనపల్లి ఆర్డీవో రమణ కాంత్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, అటవీశాఖ అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ -
రీ సర్వే సక్రమంగా నిర్వహించాలి
కర్లపాలెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా ఆదేశించారు. గురువారం ఆర్డీవో యాజలి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ యాజలి గ్రామ సచివాలయ పరిధిలో రీ సర్వే పనులు మందకొడిగా జరుగుతున్నాయని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో అలసత్వం వహించే సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల రీసర్వేతో పాటు ప్రభుత్వ సర్వేలన్నీ సకాలంలో పూర్తి చేయాలని సచివాలయం సిబ్బందికి చెప్పారు. ఆర్డీవో వెంట కర్లపాలెం తహసీల్దార్ శ్రీదేవి ఉన్నారు. ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ‘ఏఏ గ్రేడ్’ చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మక ‘ఏఏ గ్రేడ్’ లభించిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ స్వయం ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 29వ ర్యాంక్ సాధించి ‘ఏఏ గ్రేడ్’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సులలో విజ్ఞాన్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొత్తం 4,881 కోర్సు సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. వీటిలో 145 గోల్డ్ సర్టిఫికెట్లు, 424 సిల్వర్ సర్టిఫికెట్లు, 2,136 ఎలైట్ సర్టిఫికెట్లు, 2,176 సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఉన్నాయని వివరించారు. 61 ఎన్పీటీఈఎల్ స్టార్స్ సర్టిఫికెట్లు లభించడంతో పాటు, 106 మంది విద్యార్థులు టాపర్స్గా నిలిచారని వెల్లడించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వరుసగా తొమ్మిదవ సారి జాతీయ స్థాయిలో టాప్–100లో స్థానం సంపాదించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ‘ఏఏ గ్రేడ్’ సాధించడానికి కృషి చేసిన టీం సభ్యులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
ప్రభుత్వాల అరాచకాలను తిప్పికొడదాం
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ఏపీ డబ్ల్యూజేఎఫ్, యూటీఎఫ్, ఏపీటీఫ్ నాయకులు, స్కీం వర్కర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకింగ్, కార్మిక రైతాంగ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన అనంతరం సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్, ఏఐటీయుసీ రాష్ట్ర నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ రైతులు, కార్మికులు, స్కీం వర్కర్లు పేద ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్ల కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను అమలు చేసేది లేదని కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ కార్మిక రక్షణ చట్టం లేబర్ కోడ్ల పరిధిలో లేదని కార్మికులకు పనిచేసే ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యంకు సంబంధం లేని విధంగా కోడ్లు రూపొందించారని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఐ నాయకులు ఎ.మారుతీ వరప్రసాద్, రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము, ఎన్జీఓ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు ఎం.రాజ్యలక్ష్మి, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.నాగేంద్రప్రసాద్, యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు, ఏపీటీఫ్ నాయకులు బి.సంపత్బాబు, సీఐటీయూ నాయకులు డి.శివకుమారి, సిలార్ మసూద్ ఎం.ఆంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య, రైతు సంఘం నాయకులు సీహెచ్.సత్యనారాయణరాజు, రోడ్డ అంజిరెడ్డి, నాగేశ్వరావు పాల్గొన్నారు. -
పల్నాడులో వ్యవసాయ సంక్షోభం
దాచేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని ఆయన ధ్వజమెత్తారు. గతేడాది పంటలు బాగా పండితే గిట్టుబాటు ధరలేకండా చేశారని, ఈ ఏడాది ప్రత్తి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతే మిర్చి పంటకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయాలని, గతేడాది ఇస్తామన్న రూ.20 వేలు ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ సంవత్సరం ఇస్తామన్న దాంట్లో సగమే ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఏడాదికి ఉచితంగా ఇస్తామన్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం లేదని, మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 కూడా ఇవ్వటంలేదని, అసులు ఇస్తారా ఇవ్వరా అనే ప్రజలకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదని, అన్ని పథకాలు అరకొరగా ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము తెచ్చిన మెడికల్ కళాశాల, పిడుగురాళ్ల బైపాస్, మున్సిపల్ కార్యాలయాలకు శిలఫలకాలు పెట్టి ప్రారంభించటం సిగ్గుచేటన్నారు. ఎండకాలం రాకముందే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, మేము తెచ్చిన రూ250 కోట్ల జలజీవన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన చెప్పారు. మంచినీళ్ల కోసం మేము తెచ్చిన పైపులను కొంతమంది టీడీపీ నాయకులు దొంగిలిస్తున్నారని, చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, రేపు విప్లవం కూడా వస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునగా పున్నారావు, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, ఎంపీపీ కందుల జాను, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్భాషా, కొమరబత్తిన విజయ్కుమార్, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్సత్తార్, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి వారు రుద్రాక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి ఉదయ్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఉదయ్కుమార్, బాలగంగాధర గుప్తా, రంగా సత్యనారాయణ, శివ మోహన్మూర్తి సురేంద్రబాబు, పెద్దబాబు, శివప్రసాదరావు, రంగారావు గుప్తా, రవీంద్రనాఽథ్ గుప్తా, గోపాలకృష్ణ కుమార్, మధు సూదన వెంకట సుబ్బారావు, చెన్నకేశవ శేషగిరిరావులు వ్యవహరించారు. ఈవో గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్ : మంగళగిరిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న వాహనాన్ని పలువురు గోసంరక్షణ వాదులు వెంబడించి కాజ టోల్గేటు వద్ద అడ్డుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా గో సంరక్షణ, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఓ చిన్న వాహనంలో సుమారు 25 దూడలను పెట్టి, వాటికి ఊపిరి ఆడకుండా చేయడంతో వాటిలో ఏడు దూడలు మృత్యువాత పడ్డాయని, సుమారు 12 గంటల పాటు వాటికి నీళ్లు, ఆహారం లేక సొమ్మసిల్లి పోయాయని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన 21న ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీలు హాజరై అజెండాలోని అంశాలపై చర్చిస్తారు. తాడికొండ: తుళ్ళూరు మండలం పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ మాజీ సర్పంచ్ కొండా సాంబిరెడ్డి లక్ష రూపాయలు, మేక భారతి లక్ష రూపాయలు, కొల్లి కోటిరెడ్డి 50 వేల రూపాయలు చెక్కులను గురువారం మేనేజింగ్ ట్రస్ట్ ఎంవీ రామిరెడ్డికి అందజేశారు. దాతలు కొండా సాంబిరెడ్డి, మేక భారతి మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ట్రస్ట్కు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దాతలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026నేటి నుంచి కోటప్పకొండ మహాశివరాత్రి మహోత్సవంఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు.తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4,800, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.5,400 వరకు పలికింది. బాపట్ల టౌన్: బాపట్లలోని బాలిక సదనంలో 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వసతిగృహం నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, రక్షణ కరువైన బాలికలకు నీడ కల్పించడమే బాల సదనం ముఖ్య ఉద్దేశం. 6–18 ఏళ్ళలోపు బాలికలకు ఉచిత ఆశ్రయంతోపాటు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం అర్ధరాత్రి బాపట్ల బాలిక సదనంలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వసతిగృహం వార్డెన్లు, సూపరింటెండెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. సహచర విద్యార్థులు ఈ విషయాన్ని చెప్పడంతో గంట తర్వాత వారు అప్రమత్తమయ్యారు. ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో గాలించారు. పట్టణ శివారులోని కంకటపాలెం గేటు సమీపంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కొన్నేళ్లుగా వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. అధికారులు వారిని చిత్రహింసలకు గురిచేయటం, వెట్టిచాకిరి చేయించడంతోనే పారిపోవాల్సి వచ్చిందని సమాచారం. ఇటీవల బంధువులకు ఫోన్ చేసినప్పుడు కూడా తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని, ఇంటికి వచ్చేస్తామని వాపోయినట్లు తెలిసింది. బాల సదనం సూపరింటెండెంట్ ఎస్.సుబ్బలక్ష్మి మాట్లాడుతూ... హాస్టల్ గేటుకు వేసిన తాళాలు తీసుకొని వారిద్దరు పారిపోయారని, పోలీసుల సహాయంతో రాత్రి 10.45 గంటల సమయంలో తిరిగి తీసుకొచ్చామని తెలిపారు.నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి కోటప్పకొండలో గురువారం ఆమె పర్యటించారు. క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదని ఆదేశించారు. ఆర్డీవో మధులత, ఈవో డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కోటప్పకొండలో గురువారం ఆయన పర్యటించి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. లక్షలాది మంది వచ్చే తిరునాళ్లకు అరకొరగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సత్రాలకు నీటిని సరఫరా చేసే శంభులింగం చెరువును ఇప్పటి వరకు నీటితో నింపలేదని తెలిపారు. మరమ్మతులు పూర్తికాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వచ్చే లింకు రోడ్లు మరమ్మతులు కూడా చేపట్టలేదని తెలిపారు. ఘాట్ రోడ్డు టోల్ గేట్ ద్వారా సంవత్సరానికి రూ.60 లక్షల ఆదాయం అటవీ శాఖకు వస్తున్నా మొక్కలకు నీళ్లు కూడా అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. కొండకు కిలోమీటరు దూరంలో బస్టాండ్ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రోజుకొక గ్రూపుతో కొండకు వచ్చి రోడ్లు ఉడ్చి వెళ్లడం మినహా ఏర్పాట్లు జరుగుతున్న తీరును పట్టించుకోవడం లేదని విమర్శించారు. Iనరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల జాతర మహోత్సవానికి అంతా సిద్ధమయింది. మహాశివరాత్రి రోజున నిర్వహించే తిరునాళ్లకు రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండలో భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కొండ దిగువున విద్యుత్ ప్రభల వెలుగులతో నిర్వహించే శివరాత్రి జాగరణతో ఉత్సవం ముగియనుంది. కోటప్పకొండ తిరునాళ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి కోటయ్య స్వామికి మొక్కులు చెల్లించుకుని స్వామి వారి సన్నిధానంలో శివరాత్రి జాగరణ చేస్తారు. విస్తృత ఏర్పాట్లు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాట్లపై ఆరా తీస్తున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
బాపట్ల బాపట్ల పట్టణంలోని జాతీయ రహదారి వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య డిమాండ్ చేశారు. విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని గురువారం చల్లా రామయ్య సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజల గుండెచప్పుడుగా ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం, స్మృతివనం నిర్మించేందుకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందుకొచ్చి శంకుస్థాప చేపడితే అడ్డంకులు కల్పించటం సరైన పద్ధతి కాదన్నారు. స్మృతివనం ప్రదేశంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి కుట్రలను చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. విగ్రహాన్ని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేసేవరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు బోడా జాన్ (నాని), డి.పాల్, ఆవుల గోపిరెడ్డి, బి.సోమయ్య, డి.సంజీవులు, బి.గోపి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా -
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెదకాకాని: గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భ్రమరాంబ అమ్మవారిని పెళ్లి కుమార్తె అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 10.30 గంటలకు ధ్వజారోహణ, ఆలయ బలిహరణ, తదితర కార్యక్రమాలు శైవాగమ పద్ధతిన దేవస్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకస్వామి పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ పర్యవేక్షణలో వేదపండితులు, అర్చకస్వాములచే నిర్వహించినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరు పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాలకమండలి చైర్మన్, సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దాతలచే రూ.5 లక్షలతో నిర్మించిన పీపీజీఎల్ షెడ్, గ్రామోత్సవాల సేవలకు దాతలు సమర్పించిన లక్ష రూపాయల విలువైన ట్రక్కును ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్, డీసీ గోగినేని లీలాకుమార్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షెడ్డు దాతలు నందిపాటి రామకృష్ణ శివకుమారి, నందిపాటి భరత్కుమార్ శోభ దంపతులు, ట్రక్కు దాతలు గోగినేని వీరాబాయి, శివరామ్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు. పండగ శోభను సంతరించుకున్న పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం -
భోగభాగ్యాల దేవుడు ... దైద అమరలింగేశ్వరుడు
గురజాల : పల్నాడు ప్రాంతంలోని భక్తులకు భోగభాగ్యాలిచ్చే ... అమరలింగేశ్వరుడు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యారు. కోరిన కోర్కెలు తీర్చుతూ కొలిచిన వారి కొంగు బంగారంగా విలసిల్లుతూ ప్రాచీన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో అనుభూతి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండల పరిధిలోని దైద గ్రామ సమీపంలో కృష్ణానది తీరంలో బిలంలో కొలువై ఉన్న అమరలింగేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రత్యేక పూజలు ప్రతి సోమవారం బిలంలో ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాట్లు చేపడతారు. శివరాత్రి వంటి ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. కృష్ణానదిలో స్నానమాచరించి బిలంలో కొలువై వున్న అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మనస్సులో ఉన్న కోర్కెలు వెంటనే తీరుతాయని భక్తుల విశ్వాసం. దైదకు వెళ్లే మార్గం ఇలా... గుంటూరు నుంచి వచ్చు వారు మాచర్ల బస్సు ఎక్కి గురజాలలో దిగాలి. గురజాల బస్టాండ్ సమీపంలో దైద బస్సులు, ఆటోలు అందుబాటులో వుంటాయి. గురజాల నుంచి సుమారుగా 18 కిలోమీటర్లు దూరంలో కృష్ణానది తీర పరీవాహక ప్రాంతంలో స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది. మాచర్ల నుంచి వచ్చు వారు గుంటూరుకు వెళ్లు బస్సులు ఎక్కి గురజాలలో దిగాలి. శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. కృష్ణానదిలో స్నానమాచరించిన మహిళలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశాం. అదే విధంగా బిలంలోకి వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. మంచినీటి వసతి, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. అదే విధంగా కృష్ణానదిలో భద్రతా చర్యలు చేపట్టాం. –పూర్ణచంద్రరావు, కార్యనిర్వహణాధికారి -
వెట్టి చాకిరి తీవ్రమైన నేరం
చీరాలటౌన్: వెట్టి చాకిరి తీవ్రమైన నేరం.. ఎవరైనా వెట్టిచాకిరీకి వ్యక్తులను నియమించుకోవడం నేరమని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. వెట్టి చాకిరి చట్టం అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయినందున జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన పంపొందించేందుకు వెట్టి చాకిరి నేరం వాల్పోస్టర్ గురువారం చీరాల ఆర్డీవో ఆవిష్కరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం వెట్టిచాకిరి నిర్మూలించిందని, ఎవరైనా ముందస్తుగా డబ్బు, అప్పులు, ఇతర కారాణాలతో వ్యక్తులను బలవంతంగా పని చేయడం విరుద్ధమన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడైనా వెట్టి చాకిరికి నియమించుకున్న సమాచారం తహసీల్దార్ కార్యాలయాల్లో అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో షాడోస్ ప్రతినిధి రాజా సాల్మన్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ భగవాన్ దాస్, షాడోస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుండవరం(చేబ్రోలు): పాత కక్షలు, ఆస్తి గొడవల కారణంగా జరిగిన హత్యాయత్నం కేసులోని ముగ్గురు నిందితులను చేబ్రోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఎస్ఐ పి వీరనారాయణ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల వెంకటేష్కు సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్ల మధ్య ఆస్తి, భూ వివాదాలు, పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్, తొడెమల వెంకట గోపిలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం వెంకటేష్పై కత్తితో దాడి చేశారు. బాధితుడికి మెడతోపాటు పలు చోట్ల కత్తి గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీ జనార్థనరావు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. నిందితులను గురువారం నారాకోడూరు మినీ బైపాస్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పి వీరనారాయణ తెలిపారు. కోటప్పకొండకు 50 బస్సులు చీరాల: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు చీరాల ఆర్టీసీ డిపో నుంచి 50 బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ జె.శ్యామల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోటప్పకొండకు ఆదివారం ఉదయం నుంచి చీరాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశామన్నారు. అలానే చినగంజాం దగ్గర గల సోపిరాలకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. -
అమరేశ్వర దర్శనం సర్వ పాప హరణం
నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అలంకరణలో అమరేశ్వరుడువిశేషాలంకారంలో ఉత్సవమూర్తులు అమరావతి: సకల చరాచరా జగత్తుకు లయకారకుడైన ఈశ్వరుడు మాఘశుద్ధ చతుర్దశి నాడు లింగరూపంలో ఆవిర్భవించిన రోజున జరిపే మహాశివరాత్రి ఉత్సవాలను కలియుగ కై లాసమైన పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రం అమరావతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తజన సులభుడిగా, భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలను చూసి తరించటానికి రాష్ట్ర వ్యాప్తంగా అశేషభక్త జనం అమరావతి రానున్నారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశిక ధర్మకర్తలుగా స్వామివారి కై ంకర్యాలను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు -
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది.సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు. నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు.ఇలా వరుస కేసులతో బాబు సర్కార్.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రొంపిచర్ల: మండలంలోని నల్లగార్లపాడు గ్రామంలో బుధవారం తృటిలో ఓ ప్రమాదం తప్పింది. అధిక వేగంతో వెళ్తున్న ఇసుక లారీ స్కూల్ బస్సును ఢీకొట్టబోయి, అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. స్కూల్ బస్ మాచవరం నుంచి విద్యార్థులతో బయలుదేరి నరసరావుపేట వైపు వస్తుంది. అదే మార్గంలో ఇసుక లారీ మాచవరం గ్రామానికి వెళుతుంది. నల్లగార్లపాడు ఊరి బయట రోడ్డు మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును తప్పించబోయిన ఇసుక లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్లపొదలలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సంఘటన ను చూసిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని లారీ డ్రైవర్ను నిలదీశారు. డ్రైవర్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లారీని అక్కడే నిలుపుదల చేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
అమరావతిని సందర్శించిన జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిని జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ బుధవారం సందర్శించారు. తొలుత పురావస్తు మ్యూజియం, అమరావతి బౌద్ధ స్తూపాన్ని, ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని దర్శించుకున్నారు. తొలుత జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ను ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిం చారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో రేఖ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్శనలో ఆయన వెంట జర్మన్ కౌన్సిల్ ఇండియా ప్రతినిధి సందీప్, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మల్లిఖార్జునరావు, శ్రీహర్ష, రామకృష్ణ, ఏపీ టూరిజం రీజనల్ డైరక్టర్ లక్ష్మీప్రసన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసరావు సత్తెనపల్లి అర్డీవో రమణకాంతరెడ్డి, తహసీల్దార్ డానియేలు తదితరులు ఉన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి అవయవదానం
తాడేపల్లిరూరల్: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ్కుమార్ (20) తాడేపల్లిలోని ఓ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం విజయ్కుమార్కు బ్రెయిన్ డెడ్గా బుధవారం వైద్యులు నిర్ధారించారు. విజయ్కుమార్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయ్కుమార్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డా. కె. రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. గుండె, కాలేయం మణిపాల్ హాస్పిటల్లో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్కు, కిడ్నీలకు విధాత హాస్పిటల్కు, కంటి కార్నియాను విజయవాడ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. విజయ్కుమార్ అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు మణిపాల్ హాస్పిటల్ వర్గాలు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయలు విక్రయిస్తూ పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూరగాయలు విక్రయిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. – ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వెలుగూరి రాధాకృష్ణ మాట్లాడుతూ గత రెండు నెలలుగా పీఏసీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. -
కారులో చెలరేగిన మంటలు
మంగళగిరి టౌన్: కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన మంగళగిరి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు అనంతపూర్కు చెందిన ఆదిత్య జగ్గయ్యపేటలోని కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. గుంటూరులో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్లో బ్యాంకుకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు బుధవారం తన కారులో వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో తాడేపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా మంగళగిరి రత్నాల చెరువు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి రాత్రి 7.30 గంటలు అయ్యింది. ఈ క్రమంలో కారు బ్యానెట్లో నుంచి పొగలు రావడం ఆదిత్య గమనించాడు. వెంటనే కారు పక్కన ఆపి కారులో నుంచి దిగాడు. క్షణాల్లో కారులో మంటలు భారీగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు దాదాపుగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని, సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. -
డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు దిట్ట
చిలకలూరిపేట: రాష్ట్రంలో రాజకీయమంతా తిరుమల లడ్డూ చుట్టూ తిరుగుతోందని, డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు ప్రభుత్వం అరితేరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం ీసీపీఐ అమరవీరులు బొంతా డానియేలు, బొంతా మస్తాన్ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ లడ్డూ వ్యవహారం సైంటిస్టు తెలుస్తారని, చంద్రబాబు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. దేవుడ్ని కూడా రాజకీయాల్లో లాగి రోడ్డు పాలు చేశారని ఎద్దేవా చేశారు. తిరుమలకు వెళ్లేవారు, ప్రసాదం చేసేవారు, దాన్ని స్వీకరించేవారు కూడా హిందువులేనని, ఇందులో అన్యమతస్తులకు స్థానం లేదన్న విషయం తెలిసి కూడా మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ లౌకిక పార్టీ కాదని, బీజేపీతో కలసిన అనంతరం పూర్తిగా మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పార్టీ పట్ల టీడీపీలో ఉన్న లౌకిక వాదులు అప్రత్తంగా వ్యవహరించాలని సూచించారు. సనాతన వాదం అంటూ మాట్లాడుతున్న పవన్న్ కళ్యాణ్కు సనాతన వాదాన్ని అమలు చేస్తారా అని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామని చెప్పుతున్న చంద్రబాబు వేలాది ఎకరాల భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, అప్పులు చేస్తూ కొత్త రికార్డు సృష్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి పుట్టిన బిడ్డపై సైతం రూ. 3లక్షల అప్పు ఉందన్న విషయం తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారని రెండు సంవత్సరాల గడిచినా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేసిందో చంద్రబాబు నాయుడు చెప్పగలరా అని ఆయన నిలదీశారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి సంకోచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల భూములను కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండి పడ్డారు. అసెంబ్లీ బూతుల మయంగా మారిందని, ప్రజా సమస్యల ప్రస్తావనే రావడం లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నంచటం లేదని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాల, మతాల మధ్య రగ్గి రాజేస్తున్నదని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ. మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుభాని, గ్రామ సర్పంచ్ బొంతా తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి
చిలకలూరిపేట: ముస్లిం మైనార్టీల సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చెప్పారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ముస్లిం మైనార్టీ నాయకులు, సంబంధిత వార్డు ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మద్దినగర్, సుభానినగర్లలో ఉన్న కమ్యూనిటీ భవనాల అభివృద్ధి పనుల కోసం ఒక్కొక్క భవనానికి రూ. 30 లక్షల చొప్పున రూ. 60 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో కమ్యూనిటీ భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. సమావేశానికి హాజరైన ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ మదర్థెరిస్సా కాలనీ, టిడ్కో, ఆరిఫుల్లా నగర్, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాకు సంబంధించి ముస్లిం స్మశానవాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. అలాగే పురుషోత్తమపట్నంలో ముస్లిం కమ్యూనిటీ అవసరాల నిమిత్తం మరో కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ను ముస్లింలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా కమిటీ సభ్యులు, వివిధ వార్డుల ముస్లిం కౌన్సిలర్లు పాల్గొన్నారు. పేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని -
టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు సిద్ధార్థ నగర్లోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు. అంబటి సతీమణి విజయలక్ష్మి, ఆయన కుమార్తెలు మౌనిక, మనోజ్ఞతో వారి ఇంటిపై జరిగిన దాడి ఘటన గురించి ఆరా తీశారు. ఇంకా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఉభయగోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చిన్నిమిల్లి వెంకటరాయుడు, మాజీ డెప్యూటీ సీఎం అంజాద్బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ జ్యూడీషియల్ జడ్జి జడ శ్రావణ్కుమార్లు కూడా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందని, ఏడుకొండల వెంకన్నతో పెట్టుకుంటే కర్మ రిటర్న్ అవ్వటం తఽథ్యమని హెచ్చరించారు. శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందని అంటూ కొత్త ఆరోపణలకు తెరదీస్తున్నారన్నారు. వీరి వెంట పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఉన్నారు. -
డాక్టర్ మేరీ గ్లౌరీ సేవలు మరువలేనివి
గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సేవకు ప్రతిరూపంగా నిలిచే గుంటూరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో 36 ఏళ్లు సుదీర్ఘంగా వేలాది మంది రోగులకు చికిత్సలు చేసి, తన చేతి స్పర్శతో వారిని ఆరోగ్యవంతులుగా చేసిన దివంగత డాక్టర్ మేరీ గ్లౌరీకి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆమెను సెయింట్గా గుర్తించే క్రమంలో రెండవ దశ అయిన పూజ్యనీయ (వెనరబుల్గా) స్థానాన్ని పొందడం గుంటూరుకే గర్వకారణమని గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక సెయింట్ జోసెఫ్స్ పాఠశాల ఆవరణలో డాక్టర్ మేరీ గ్లౌరీకి దక్కిన గౌరవ పురస్కారం సందర్భంగా జె.యం.జె. సభ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవం నిర్వహించారు. 17, 22 తేదీల్లో శాప్ లీగ్స్ క్రీడా పోటీలు గుంటూరు వెస్ట్(క్రీడలు): శాప్ ఆదేశాల మేరకు 31 క్రీడాంశాల్లో శాప్ లీగ్స్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 బాల బాలికలు, యువతీ యువకుల చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసి ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–18 యువతీ యువకుల జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు శాప్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు స్కేటింగ్ కోచ్ షేక్ అబ్దుల్ సలామ్ 94934 47566, సైక్లింగ్ కోచ్ కనకరావు సెల్ నెంబర్ 63011 77119ను సంప్రదించాలని కోరారు. -
ఆయిల్పామ్ సాగుతో మెరుగైన లాభాలు
నాదెండ్ల: దీర్ఘకాలిక ఆయిల్పామ్ సాగు వల్ల రైతులు లాభాలు ఆర్జించవచ్చని చిలకలూరిపేట ఉద్యానవన శాఖాధికారి ఆర్. శ్రీలక్ష్మీ చెప్పారు. ఉద్యానవన శాఖ, గోద్రేజ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో గణపవరం, బుక్కాపురం గ్రామాల్లో రైతులకు ఆయిల్పామ్ సాగుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. సారవంతమైన నేల, సాగునీటి వసతి ఉంటే ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. చీడపీడల యాజమాన్యం, ఎరువుల నిర్వహణ, యంత్రాల వినియోగం, ఆధునిక సాగు పధ్ధతులపై రైతులకు ఉద్యానవన శాఖ నుంచి నిరంతరం సహాయ సహకారాలు లభిస్తాయన్నారు. ఉద్యానవనశాఖ అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులు డాక్టర్ సుభాష్, ఉద్యానవన, వ్యవసాయ, సచివాలయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
దూర విద్యలో పరీక్షలే మిథ్య!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ అధ్వానంగా మారింది. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి గత 20 రోజులుగా పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు గత నెలలోప్రారంభమయ్యాయి. వివాదాలు కూడా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దుతున్నామంటూ అధికారులు చేస్తున్న హడావుడి చూసి అందరూ విస్తుపోతున్నారు. ఏఎన్యూ(పెదకాకాని): రాష్ట్ర వ్యాప్తంగా 114 కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు జరుగుతున్నాయి. పర్యవేక్షకులను కో ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ నియమించారు. స్క్వాడ్లను కూడా నియమించాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం. సంస్కరణల పేరుతో జరుగుతున్న పరిణామాలు ఆధిపత్య పోరును చాటుతున్నాయి. రెండవ సెమిస్టర్లో ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో ఒక స్క్వాడ్ను ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన టీం.. పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని, విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతున్నారని గుర్తించింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ ఒక్క సెంటర్ నిర్వాహకుడిని కూడా బాధ్యుడిని చేసిన సంఘటనలు లేవు. ఈ వివాదాలను సాకుగా చూపిస్తూ వర్సిటీని చక్కదిద్దేందుకు ఎఫ్ఏసీ ఇవ్వాలని ఓ అధికారి ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రాలన వారికి పరోక్షంగా సహకారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే వ్యవస్థను చక్కదిద్దవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పరీక్షల కో ఆర్డినేటర్ బుధవారం నుంచి 14 మంది మందితో 7 స్క్వాడ్లను ఎంపిక చేయడం అధికారుల మధ్య భేదాభిప్రాయాలను స్పష్టం చేస్తోంది. పరీక్షల పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందడం కోసమే ఈ ఆరాటమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకత పేరుతో రహస్యంగా తనిఖీ బృందాలను రాష్ట్రమంతా తిప్పుతుండగా... కొందరు అధికారులు కూడా కొన్ని సెంటర్ల నిర్వాహకులతో తెరవెనుక సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు మాత్రం వర్సిటీ అధికారుల పోరులో తమను బలి పశువులను చేస్తున్నారని వాపోతున్నారు. ఈ పరిణామాలపై విసిగిపోయిన కొందరు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు... పరీక్షలకు ముందుగానే ఏ అధికారిని ఏ విధంగా కలిశామో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సెంటర్ను రద్దు చేశాం.. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై దూర విద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లును వివరణ కోరగా... ‘గత నెలలో పొదిలి సెంటర్ను రద్దు చేశాం. ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలపై ఏ సెంటర్పైనా చర్యలు తీసుకోలేదు. వివరాలు సేకరిస్తున్నారు. స్క్వాడ్ ఎంపిక సహజంగా కోఆర్డినేటర్ ద్వారానే జరుగుతుంది. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని అనుసరించాల్సిందే’ అని తెలిపారు. చర్యలు తీసుకుంటాం.. దూర విద్య పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ను వివరణ కోరగా... ‘రెండో దశలో ముగ్గురు సభ్యులతో ఉన్నతాధికారులు ఒక స్క్వాడ్ను ఎంపిక చేశారు. సమాచారం కూడా కొంతమేర గోప్యంగా ఉంచారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. ప్రస్తుతం 14 మందితో 7 స్క్వాడ్లను ఎంపిక చేశా. రాష్ట్రంలోని 114 సెంటర్లను షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేయాలని కోరాం. అక్రమాలకు పాల్పడితే పరీక్ష కేంద్రాల నిర్వాహకులను బాధ్యులను చేయడంతోపాటు చూసి రాతలకు పాల్పడే విద్యార్థులపైనా చర్యలు తీసుకుంటామని’ తెలిపారు. -
టీడీపీలో చిటపటలు
భగ్గుమన్న వర్గ విభేదాలు టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంతపార్టీకి చెందిన రేషన్ డీలర్లను తొలగించాలన్న ప్రయత్నం కాస్తా బెడిసి ఎమ్మెల్యే ఇంటిముందే టీడీపీ వర్గీయులే ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సైతం ఒక్కసారిగా భగ్గుమంది. అధికార పార్టీకి చెందిన వారే చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం ముందు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం చూసేవారికి సాధారణంగా కానవస్తున్నా అంతర్గతంగా ఆధిపత్యపోరే కారణమని తెలియవస్తోంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన సొంత పార్టీ వర్గీయులు -
మెప్మా కుంభకోణంలో ఉద్యోగులపై వేటు
నరసరావుపేట: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో నకిలీ గ్రూపులు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వ్యవహారంలో ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పీడీ మురళీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెప్మాలో జరుగుతున్న అవతకవకలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా స్వయంగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలో సుమారు 150 వరకు నకిలీ గ్రూపులు సృష్టించి రూ.20 కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందారనే ఆరోపణలు వైఎస్సార్సీపీ నుంచి వెల్లువెత్తాయి. వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ మెప్మా పీడీ, డీఎస్పీ, నరసరావుపేట ఆర్డీఓలతో ఒక విచారణ కమిటీ వేశారు. వీరు పలువురిని విచారించిన తర్వాత జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేశారు. దీనిపై కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల సిటీ మిషన్ మేనేజర్లు తుమ్మా దీప, ఉమర్ వలి, జి.శ్రీనివాసరావు, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం.మల్లికార్జునరావు, జి.భూదేవి, బి.విజయప్రణతి, కె.శ్రీనివాసరావు, డి.బాలాంజనేయులును సస్పెండ్ చేసినట్లు మెప్మా పీడీ మురళీకృష్ణ పేర్కొన్నారు. -
ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ముఖ్యం
భక్తులకు ఎస్పీ, పోలీసు అధికారులకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశంనరసరావుపేట: భక్తులు ప్రశాంత వాతావరణంలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా పోలీసులు విధులు నిర్వర్తించేలా చూడాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన తిరునాళ్లకు సంబంధించిన వివరాలను గుంటూరు ఐజీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఐజీకి పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు వివరించారు. తిరునాళ్లకు సంబంధించి రూట్ మ్యాప్ ద్వారా తీసుకుంటున్న వివరాలను తెలియచేశారు. దీనిపై ఐజీ పలు సూచనలు చేశారు. భక్తులతో మంచిగా వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో స్వామిని దర్శించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నిర్ణీత ప్రదేశాలలో వాహనాలు నిలిపేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాలు, ప్రభల ప్రదర్శన ప్రాంతాలు, దేవుని దర్శించుకునే సమయంలో రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ (ఏఆర్) సత్తిరాజు, నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఈ సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం తెలిపారు. కార్యక్రమాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబులు పర్యవేక్షించారు. 145 మంది హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. గురువారం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, హాజీ హసన్ బాషా పాల్గొన్నారు. తెనాలి: నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీవారాహి అమ్మవారి దేవస్థానంలో ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ మాచిరాజు వేణు గోపాల్, పెనుగొండ పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పాల్గొన్నారు. ముందుగా వారాహి అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉచిత కోటి కుంకుమార్చనను మహిళలతో చేయించారు. ఈ సందర్భంగా శ్రీవారాహి అమ్మవారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నిర్వాహకులు చివరిగా అతిథులను సత్కరించారు. దాచేపల్లి : మండలంలోని సారంగపల్లి అగ్రహారంలో లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం కనుల పండువలా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పురోహితుడు జానపాటి సీతారామశర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం జరిపించారు. పుణ్యదంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి సూర్యవేణుగోపాల కృష్ణ శ్రేష్టి, కృష్ణకుమారి దంపతులు, ఎల్ కే శర్మ ఇందిరాదేవి దంపతులు వ్యవహరించారు. ఈవో గోపీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వీఐపీ దర్శన టికెట్లకు విశేష స్పందన
ఆన్లైన్లో త్రికోటేశ్వర స్వామి దర్శన టికెట్లు విక్రయంనరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన వీఐపీ దర్శనం ఆన్లైన్ టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంచారు. దేవదాయ శాఖ టెంపుల్స్ వెబ్సైట్లో ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక దర్శనం (రూ.100), శీఘ్ర దర్శనం (రూ.200) టికెట్లతో పాటు వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం టికెట్లు ఇందులో ఉన్నాయి. ఈనెల 9వ తేదీ సాయంత్రం 4గంటల నుంచే ఆన్లైన్లో టికెట్లు విక్రయాన్ని ప్రారంభించారు. అభిషేక దర్శన టికెట్లు 3వేలు, వీఐపీ దర్శన టికెట్లు 2వేలు, శీఘ్ర దర్శనం 11వేలు, ప్రత్యేక దర్శనం 9వేలు టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా పోలీసులు జారీ చేసే కారు పాసులు, వీఐపీ బస్ పాస్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పాస్లు కలిగి ఉన్న కార్లును కొండ దిగువున టోల్గేట్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో వీఐపీ పాస్లతో కొండపైకి చేరుకుంటారు. కారు పాసులు విచ్చలవిడిగా జారీ చేస్తుండటంతో కొండ దిగువున పార్కింగ్ సమస్య తలెత్తుతుంది. జాగరణ జరిగే సమయంలో పెట్లూరివారిపాలెం రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడానికి కార్లు రద్దీ ప్రధాన కారణంగా ఉంది. పెట్లూరివారిపాలెం రోడ్డు నుంచే ఆర్టీసీ బస్సులు కొండకు చేరుకుంటాయి. టోల్గేట్ సమీపంలో కారు పార్కింగ్ వద్ద మెయిన్రోడ్డుపై తరచూ కార్లు నిలిచిపోతుంటాయి. ఇక్కడే ట్రాఫిక్ జామ్ ప్రారంభమవుతుంది. వాహనాల రద్దీతో కిలోమీటర్ల మేర నిలిచిపోయి భక్తులు ట్రాఫిక్లో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. వీఐపీ పాస్లను రద్దు చేసినట్టుగా కారు పాసుల్లో కూడా కోత పెడితే ట్రాఫిక్ జామ్ సమస్యను కొంత వరకు తగ్గించవచ్చని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కారు పాస్ల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఏపీఆర్జే కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య సోమవారం రాత్రి గ్యాంగ్వార్ జరిగిన ఘటన కలకలం రేగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఈ నెల7వ తేదీన కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో బైపీసీ, ఎంఈసీ విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి పెద్దదైంది. దీంతో సోమవారం రాత్రి మెస్లో భోజనాలు చేసేటప్పుడు మళ్లీ గొడవ మొదలైంది. లెక్చరర్లు, వార్డెన్ల సమక్షంలోనే విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో విజయపురిసౌత్కు చెందిన ఎంఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి జరపాల వెంకటేశ్వర్లునాయక్కు కంటికి తీవ్ర గాయమవ్వగా ఎంఈసీ విద్యార్థులు శ్రీనివాస్, చంద్రశేఖర్లకు తలకు బలమైన గాయాలయ్యాయి. కంటికి గాయమైన వెంకటేశ్వర్లు నాయక్ను విజయపురిసౌత్ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకై గుంటూరు శంకర కంటి ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలైన ఇద్దరు విద్యార్థులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ కళాశాలను సందర్శించి గొడవకు కారణం తెలుసుకొని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కళాశాలలో విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి ఘర్షణలు పడడం, విద్యార్థులకు తీవ్రగాయాలై ఆస్పత్రుల పాలవడం తదితర ఘటనల్లో కళాశాల లెక్చరర్లు, హాస్టల్ వార్డెన్ల నిర్లక్ష్యం ప్రస్పుటంగా కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ప్రభల భక్తికి ప్రతీక
పల్నాడుబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● పురుషోత్తమపట్నంలో భారీ విద్యుత్ ప్రభల నిర్మాణం ● ఒకే ప్రాంతం నుంచి 11 ప్రభలు ● కోటప్పకొండ తిరునాళ్లకు సిద్ధమవుతున్న పల్నాడు భక్తి శ్రద్ధలతో ప్రభలు కట్టి దక్షిణామూర్తిని దర్శిస్తే పుణ్యం దక్కుతుందని ప్రతీతి. తిరునాళ్లకు ప్రభలను నిర్మించటం మనదైన, అరుదైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భారీ ప్రభలకు కోటప్పకొండ తిరునాళ్ల పెట్టింది పేరు. మహాశివరాత్రికి రూ.లక్షలు వెచ్చించి ప్రభలు కట్టి చేదుకో...కోటయ్యా...మమ్మాదుకో కోటయ్యా అంటూ దైవ నామస్మరణ చేస్తూ కొండకు వెళ్లటం ఆనవాయితీగా వస్తుంది. – చిలకలూరిపేట కోటప్పకొండకు తరలివెళుతున్న పురుషోత్తమపట్నం ప్రభలు (ఫైల్) సిద్ధమవుతున్న విడదల వారి ప్రభ విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సాధారణంగా ఒక గ్రామం నుంచి ఒకటి లేదా రెండు ప్రభలు నిర్మించటం పరిపాటి. అయితే చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం ప్రభల నిర్మాణానికి పెట్టింది పేరు. ఈ ఒక్కచోట నుంచే 11 ప్రభలు నిర్మాణం చేసుకుంటూ ఉండటం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఒకదానికి మించి మరో ప్రభను రూ.లక్షలు వెచ్చించి విద్యుత్ దీపాలు అలంకరించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ప్రభల నిర్మాణంలో పురుషోత్తమపట్నం వాసులు పూర్తిగా తలమునకలయ్యారు. సుమారు 136 ఏళ్ల కిందట పురుషోత్తమపట్నం నుంచి ఒకే ఒక్క గ్రామ ప్రభను నిర్మించి తిరునాళ్లకు తీసుకువెళ్లేవారని పెద్దలు చెబుతారు. తరువాత కాలంలో క్రమేణ ఇళ్ల పేర్లతో ప్రభలు నిర్మించి తిరునాళ్లకు వెళ్లటం ఆనవాయితీగా మారింది. ఇక్కడ గ్రామప్రభతో పాటు విడదల వారి ప్రభ, బైరావారి ప్రభ, తోటపుల్లప్పగారి ప్రభ, చిన్నతోటవారి ప్రభ, యాదవరాజుల ప్రభలు రెండు భారీ విద్యుత్ ప్రభలు. వీటికి తోడు తోట కష్ణమ్మగారి ప్రభ, బ్రహ్మంగారి గుడి వీధి ప్రభ, మండలనేనివారి ప్రభలు రెండుమధ్యస్థమైనవి. ఇందులో ఏడు భారీ విద్యుత్ ప్రభలు ఒక్కొక్కటి రూ. 18 లక్షలు నుంచి రూ.20లక్షలు పైబడి వెచ్చించి తీర్చిదిద్దుతున్నారు. లైటింగ్ ఏర్పాటుకే ఒక్కో ప్రభకు రూ.14 లక్షలు పై బడి ఖర్చు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. తిరునాళ్లకు ముందురోజు ప్రభలను రాతి చక్రాల బండ్లపై క్రేన్ల సహాయంతో యువకులు మోకులు చేతబట్టి భక్తి శ్రద్ధలతో నిలబెట్టే కార్యక్రమం చేపడతారు. ప్రభలను నిర్మించటం వాటిని కోటప్పకొండకు తరలించటం ఒక యజ్ఞంలా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సహకరించినా, సహకరించకున్నా ప్రతి ఏటా క్రమం తప్పకుండా తమ సంప్రదాయ ప్రభల నిర్మాణానికి ఎలాంటి లోటు తలెత్తకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. తిరునాళ్లకు ముందు రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తిరునాళ్ల నాటికి కొండవద్దకు చేరుకోవటానికి సిద్ధమవుతారు. -
సంభ్రమాశ్చర్యాలు
● మెడికల్ ఎగ్జిబిషన్కు విశేష స్పందన ● భారీగా తరలివస్తున్న విద్యార్థులు ● ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న మెడ్ఫ్యూజన్సిద్ధమవుతున్న బైరా వారి ప్రభ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్.... కేవలం విద్యార్థులనే కాకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మెడ్ఫ్యూజన్ మెడికల్ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటుంది. సందర్శకుల రాక రోజు రోజుకు పెరుగుతుండడంతో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి ఆధ్వర్యంలో వైద్య బృందం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నారు. అనస్తీషియా విభాగం నిర్వహించిన ఎగ్జిబిషన్ విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనస్తీషియా విభాగంలో ఏర్పాటు చేసిన ఫొటో బూత్ వద్ద విద్యార్థులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఫొటో బూత్ ద్వారా అనస్తీషియాలజిస్టు చేసే వివిధ విధులు, ఆయన పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వైద్య విభాగం ప్రత్యేకమే.... గుంటూరు వైద్య కళాశాలలో ఉన్న ప్రతి వైద్య విభాగం కూడా మెడికల్ ఎగ్జిబిషన్లో పాల్గొంది. ఆయా వైద్య విభాగాల ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న విజ్ఞాన విషయాలు, ఆరోగ్యకరమైన అంశాలు, అందరిని ఆకట్టుకుంటున్నాయి. అనస్తీషియా వైద్య విభాగం ఆధ్వర్యంలో కాలక్రమంలో జరిగిన మార్పులు, అభివృద్ధిని బయోస్కోప్ ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. వివిధ నరాలను ఉత్తేజితం చేసినప్పుడు శరీర అవయవాలు ఎలా స్పందిస్తాయో చూపించే ఎగ్జిబిట్కు విశేష ఆదరణ లభించింది. విద్యార్థుల చేతుల ద్వారానే ఇంట్యూబేషన్ ప్రక్రియను ప్రాక్టికల్గా చేయించి చూపించారు. దీంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనాటమీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానవ అస్థి పంజరాలు, శరీర అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, మెదడు వంటి అవయవాలు కళ్లతో చూసి ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతున్నారు. తల్లి కడుపులో ఉండే పసి పిండాలను రసాయనాల్లో నిల్వచేసి చూపిస్తున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఫార్మాకాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మందుల తయారీ, ఏఏ జబ్బులకు ఏఏ మందులు పని చేస్తున్నాయో తెలిపే చార్ట్లు, పెథాలజీ వైద్య విభాగం, రేడియాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వ్యాధులను ఏ విధంగా గుర్తిస్తారనే విషయాలు ఆకట్టుకుంటున్నాయి. న్యూరాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది. మెదడుకు వచ్చే సమస్యలు, చికిత్సలు తెలిపేలా ఏర్పాటు చేసిన చార్ట్లు, చిత్రాలు పిల్లల చిట్టిమెదడులో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. పిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చిన్నారులను , విద్యార్థులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వైద్య విభాగం దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంది. -
టీడీపీ నేతల ఆందోళన
ఎమ్మెల్యే ప్రత్తిపాటి నివాసం వద్ద చిలకలూరిపేట/యడ్లపాడు: సొంత పార్టీ వర్గీయులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద మంగళవారం రాత్రి టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంఘటన సంచలనంగా మారింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రామ మాజీ సర్పంచ్ వర్గీయులైన రేషన్ డీలర్లను తొలగించి కొత్తవారికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పావులూరి పిచ్చయ్య ఆధ్వర్యంలో యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ వర్గీయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ డీలర్లను ఈ నెల డీడీలు కట్టవద్దని ఎందుకు ఆదేశించారు... ఉన్న వాళ్లను తొలగించేందుకే కదా అంటూ ఆందోళన నిర్వహించారు. దీనికి అధికారుల నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో ఆగ్రహించిన తిమ్మాపురం గ్రామస్తులు చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం
మాదల(ముప్పాళ్ళ): కుటుంబ కలహాల నేపధ్యంలో వ్యక్తి ఇంట్లోని దర్వాజాకు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాదల గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంఘటనకు సంబందించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వల్లెపు దుర్గారావు(42) ఆరు నెలల క్రితం భార్యతో కలిసి విజయవాడ పనులకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. భార్యకు ఆమె అక్క భర్తతో వివాహేతర సంబంధం ఉందనే విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పదిరోజుల క్రితం మాదల వచ్చి ఉంటున్నాడు. సోమవారం విజయవాడ నుంచి భార్యను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడగా అక్కడ కూడా గొడవ పడి వెళ్లిపోయాడు. దీంతో భార్య తిరిగి విజయవాడ వెళ్లగా దుర్గారావు మాదలలోనే తన తల్లి వద్దే ఉంటున్నాడు. తల్లి తెల్లవారుజామున లేచిచూడగా దుర్గారావు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట చేయగా దుర్గారావు కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లోనే దర్వాజాకు ఉరిపోసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే దుర్గారావును చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై దుర్గారావు సోదరుడు చెన్నకేశవరావు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. -
అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ ● ఎస్పీతో కలసి ఏర్పాట్లపై సమీక్ష నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచే భక్తులకు త్రికోటేశ్వరస్వామి దర్శనం ప్రారంభిచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లలో ట్రాఫిక్ నిర్వహణపై కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభలు ఉదయం 11గంటలలోపే కొండ వద్దనున్న ప్రభల ప్రాంగణానికి చేరుకునేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. కొండపైకి 120 బస్సులు నడపాలని, షిఫ్టుల వారీగా సిబ్బందిని, అదనపు బస్సులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా పౌర రవాణా అధికారికి సూచించారు. నరసరావుపేట, చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే బస్సులకు ఆయా దారుల్లోనే వేర్వేరు బస్టాండ్లు ఏర్పాటు చేయాలని, డ్రోన్లు, సీసీ టీవీలతో కొండ ప్రాంగణం నిత్య పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొండపై నిర్మించిన నూతన మొబైల్ టవర్ ట్రయల్ రన్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఆర్టీఓ జి.సంజీవరావు, ఆర్టీసీ డీపీటీఓ జి.అజితకుమారి, ఆర్డీఓ కె.మధులత, డీఎస్పీ ఎం.హనుమంతరావు, తహసీల్దార్ వేణుగోపాలరావు, పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడండి -
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల:గుంటూరుకు చెందిన ఎన్.సుధా రాణి టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. విజయపురిసౌత్: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వాణి రాణి మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు http://apgpcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7569333798 ఫోన్ నంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు. రేపల్లె: పట్టణంలో ని శాఖా గ్రంథాలయాన్ని ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యురాలు మగతాల పద్మజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పత్రికా విభాగం, పుస్తక విభాగం, రిజిస్టర్లు, రికార్డులు, శిక్షణ ఫౌండేషన్ కంప్యూటర్ రిజిస్టర్లను పరిశీలించారు. పట్టణంలోని చంద్రమౌళి పార్కులో గ్రంథాలయానికి సంబంధించిన 15 సెంట్ల భూమిలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట:జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించిన మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి షేక్ జమీర్బాషాను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్కు పిలిపించి అభినందనలు తెలియచేశారు. విద్యార్థి తల్లితండ్రులు, డీఈవో రామారావు, ప్రధానోపాధ్యాయులు టి.రవికాంత్ను సైతం అభినందించారు. జమీర్బాషా జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా, ఏపీ నుంచి నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్కు చెందిన జమీర్బాషా ఎంపికయ్యారు. ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి తన ప్రతిభను చాటుకున్నారు. జమీర్బాషాకు ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు శుభాకాంక్షలు తెలియచేశారు. తెనాలి:పట్టణానికి చెందిన సంగీత సంస్థ శ్రీ సీతారామ గానసభ శాసీ్త్రయ సంగీత ఉత్సవా లు మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఆరంభించారు. తొలుత త్యాగరాజస్వామి, గానసభ వ్యవస్థాపకులు నారుమంచి సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు పిరాట్ల నారాయణమూర్తి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగీత ఉత్సవాన్ని ప్రారంభించారు. మొదట రోజు విజయవాడకు చెందిన కుమారి మల్లాది సింధు రాజేశ్వరి సంగీత కచేరి హృద్యంగా సాగింది. వాగ్దేవి కీర్తనలను ఆలపించారు. వయొలిన్పై మీద విజయవాడకు చెందిన అంబటిపూడి కామాక్షి, మృదంగంపై విజయవాడకు చెందిన మాస్టర్ మల్లాది శివానంద ఎస్.ఎస్.వి వాయి ద్య సహకారం అందించారు. గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి పర్యవేక్షించారు. -
పరిశ్రమలకు భూముల బదిలీ ప్రక్రియ పూర్తిచేయండి
ఆర్డీఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమలకు కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆర్డీఓలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసీ భూముల కేటాయింపు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పరిశ్రమలకు భూముల బదలాయింపు ప్రక్రియ కీలకమన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు జిల్లాలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మండల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నారు. నూతన పరిశ్రమలను ప్రోత్సహిస్తూ జిల్లా, నియోజకవర్గస్థాయి ర్యాంప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా పరిశ్రమల అధికారి ఎస్వీ సురేష్, ఏపీఐఐసీ జెడ్ ఎం.నరసింహారావు, ఎల్డీఎం రామ్ప్రసాద్, డీసీసీబీ సీఈఓ ఫణి కుమార్ పాల్గొన్నారు. -
పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్ సీపీ నేతల ములాఖత్
వెల్దుర్తి: జంట హత్యల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను సోమవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ వెల్దుర్తి మండల నాయకులు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వెల్దుర్తి నాయకులు ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించి వారిని ఇబ్బందులకు గురిచేయటం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి సోదరులపై కుట్రతో జంట హత్యల కేసును బనాయించిందన్నారు. ఇలాంటి అక్రమ కేసులు తమ నాయకులను ఏమీ చేయలేవన్నారు. ములాఖత్ అయినవారిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాయంకుల గోపాల్, మండాది సర్పంచ్ శీలం సైదారెడ్డి, కండ్లకుంట సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడికొండ పుల్లారెడ్డి, కండ్లకుంట మాజీ సర్పంచ్ అమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావు నరసరావుపేట టౌన్: మహాశివరాత్రి సందర్బంగా కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హెచ్చరించారు. సోమ వారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన జరిగే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా సాధారణ ప్రభలు 100, విద్యుత్ ప్రభలు 30 నుంచి 40 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలయాల పరిసరాలలో డెకరేషనన్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలు, విద్యుత్ ప్రభల వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభల నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీసభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారుల సమన్యయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్కి అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల ఉత్సవాలు జరిగేలా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్లు ఊడ్చి పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన సమస్యలు పరిష్కరించి..ఆకలి తీర్చాలని విజ్ఞప్తి కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ● ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకట రామయ్య, కె.సత్యనారాయణ, బి.రఘురామ్, పి.సత్యనారాయణ, వై.రామచంద్రరావు, పి.సుబ్బారావు, కె.వీరయ్య, ఏలూరు, కోనసీమ జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట: వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలన దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. జేసీ మాట్లాడుతూ సమష్టి కృషితోనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. వెట్టిచాకిరి ఒక సామాజిక దురాచారమని, భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, కార్మిక శాఖ అధికారులు, నీడ్స్, డీఆర్బీసీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై పోస్టర్ ఆవిష్కరణ.. నరసరావుపేట: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. ఈ వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేఎస్ రాంప్రసాద్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహా -
భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు అందాయి. నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో పాటు పలు మోసాలకు సంబంధించిన 99 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భూ వివాదలపై 27, ఆర్థిక సమస్యలపై 24, భార్యభర్తల వివాదాలు 14, ఆస్తి వివాదాలు 11, ఉద్యోగాల పేరుతో మోసాలపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను డీఎస్పీ ఆదేశించారు. లండన్లో ఉద్యోగం అంటూ మోసం హోటల్ మేనేజ్మెంట్ రంగంలో లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేసినట్టు సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెపాలెంకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. 2024 డిసెంబర్లో నగదు తీసుకుని ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, మోసానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తప్పుడు లెక్కలతో ‘ఫైనాన్స్’ వేధింపులు కారంపూడి మండలం కాకానివారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి 2023లో పాతఆటోను ఫైనాన్స్లో రూ.2.20లక్షలకు తీసుకున్నాడు. ఇందుకు గాను రూ.25వేలు డౌన్ పేమెంట్ కట్టి ప్రతి నెల రూ.9వేలు చెల్లించేవిధంగా ఒప్పందం చేసుకున్నాడు. 24 నెలల పాటు డబ్బులు చెల్లించినా బండి క్లియరెన్స్ ఇవ్వకుండా ఆటో ఫైనాన్స్ వారు వేధిస్తున్నారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. రైల్వే ఉద్యోగం పేరిట టోకరా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన యువకుడు కేతనకొండ ఆర్కే కాలేజీలో పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతూ మానేశాడు. ఆ సమయంలో కడపకు చెందిన వ్యక్తి పరిచయమై రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35.18లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపాడు. పలు మార్లు ఫోన్లో సంప్రదించగా రూ.3లక్షలు తిరిగి ఇచ్చాడని, ఇప్పుడు ఫోన్లో కూడా స్పందించడం లేదని న్యాయం చేయాలని వేడుకున్నాడు. పీజీఆర్ఎస్కు 99 అర్జీలు స్వీకరించిన మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ -
ముగిసిన కొండవీడు ఉత్సవాలు
చరిత్ర, వినోదం మేళవించిన వేడుక యడ్లపాడు: చారిత్రక వైభవానికి నిలయమైన కొండవీడు కోట ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. రెండు రోజుల పాటు పర్యాటకులను, సందర్శకులను అలరించిన ఈ వేడుకలు గతాన్ని స్మరించుకున్నాయి. పగటివేళ కొండపై ఏర్పాటు చేసిన హెలిరైడ్, ఫ్లవర్ స్టాల్, బోటింగ్, శాండ్ ఆర్ట్, ట్రెక్కింగ్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పోటాపోటీగా సాగాయి. సాయంత్రం కొండ దిగువన ఏర్పాటు చేసిన లేజర్ షో, బాణసంచా కాల్పులు, సినీ గాయని గీతామాధురి సంగీత విభావరి, జబర్దస్త్ కళాకారుల కామెడీ స్కిట్లు, వెస్ట్రన్ డానన్స్లు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి బీజీ జనార్థనరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పల్నాడు బీజేపీ అధ్యక్షుడు ఏలూరి, గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్లా, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ సంజనా సింహ, ఆర్డీవో మధులత, డీఎఫ్వో జి. కృష్ణప్రియ, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు హాజరై ప్రసంగించారు. -
వక్ఫ్బోర్డు స్థలంలో షాపుల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే
నరసరావుపేట: స్థానిక మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వక్ఫ్బోర్డు స్థలం టీఎస్ నంబరు 1422లో చేపట్టిన షాపుల నిర్మాణాన్ని యథాతఽథంగా ఆపేయాలని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వరవకట్టకు చెందిన షేక్ అబ్దుల్ఖాజా, అరండల్పేటలో మహబూబ్ సుభాని వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్న షేక్ జానీమౌలాలి వక్ఫ్బోర్డు, మున్సిపాల్టీ ముందస్తు అనుమతులు లేకుండా వక్ఫ్బోర్డు సంస్థ స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్డుమెంట్, స్టేట్ వక్ఫ్బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కలెక్టరేట్లోని ఇన్స్పెక్టర్ ఆడిటర్, అహలే సున్నత్ జామియా మసీదు సంఘం అధ్యక్షులు షేక్ కరిముల్లా, సెక్రటరీ షేక్ రహమత్ఆలీ, కోశాధికారి షేక్ ఖాసీంపీరా, మెంబర్ షేక్ సుభాని, నాయబ్బజారుకు చెందిన షేక్ రహమత్ఆలీ, షేక్ మదీనా రసూల్, బాబాపేటకు చెందిన షేక్ మహబూబ్, వేముల చిరంజీవి, వేముల శంకరనారాయణ, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్లను ప్రతివాదులుగా చూపిస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో ఈనెల రెండో తేదీన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జానీమౌలాలి ఈనెల నాల్గున స్థానిక మున్సిపల్ అధికారులు, విజయవాడ వక్ఫ్బోర్డు సీఇవో, ఈనెల ఏడున వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్కు రాతపూర్వకంగా తెలియచేశారు. అయినప్పటికీ నిర్మాణాలు ఆపకుండా జరుగుతుండటంతో సోమవారం తాను జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి అయిన ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, విద్యుత్శాఖ డీఇలను కలిసి నిర్మాణాలను ఆపాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. పనులను ఆపని పక్షంలో కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ వినతిపత్రంలో పేర్కొన్నామని షేక్ జానీమౌలాలీ వెల్లడించారు. కాంప్లెక్స్కు విద్యుత్ కనెక్షన్ల పెట్టిన దరఖాస్తులను నిలిపివేసి కోర్టు ఉత్తర్వులు అమలుచేయాలని విద్యుత్ శాఖాధికారులను సైతం కోరారు. -
● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ● 15న కోటప్పకొండ తిరునాళ్ల ● అధ్వాన్నంగా రోడ్లు
కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మూడుసార్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం సమీక్షలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరునాళ్లకు మరో మూడు రోజులే సమయం ఉన్నా పనుల్లో వేగం కనిపించడం లేదు. రహదారుల పరిస్థితి ఆధ్వానం ... కోటప్పకొండకు చేరుకునే ప్రధాన రహదారుల మినహా మిగిలిన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిలకలూరిపేట మేజర్ కెనాల్ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. ప్రభలు కొండకు చేరుకునే సమయంలో అర్ధరాత్రి ఈ మేజర్ కెనాల్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఈ రోడ్డును వినియోగిస్తారు. అలాగే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే కొండకావూరు రోడ్డులో కూడా మరమ్మతు పనులు చేపట్టలేదు. యూటీ నుంచి క్రషర్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తారు. ఈ రోడ్దు దుమ్ముతో నిండిపోయి ఉంది. చినతురకపాలెం నుంచి గొనెపూడి, గురవాయపాలెం నుంచి గొనెపూడి రోడ్లు మరమ్మతు పనులు ప్రారంభించలేదు. వడివడిగా పనులు జాతర జరిగే కొండ దిగువున ప్రధాన రోడ్లులో విద్యుత్ దీపాలు ఏర్పాట్లు పనులను ఆర్అండ్బీ ఎలక్ట్రీకల్ విభాగం ప్రారంభించింది. ప్రధాన రోడ్డులో ఐరెన్ పోల్స్కు విద్యుత్ దీపాలు బిగించే పనులు నిర్వహిస్తున్నారు. బారికేడింగ్ పనులు ప్రారంభించలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నూతన ట్రాన్స్ ఫార్మర్స్ను ఏర్పాటు చేసే పని విద్యుత్ శాఖ చేపట్టింది. మేజర్ కెనాల్ వద్ద భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు పనులు ప్రారంభం కాలేదు. క్యూలైన్ వద్ద చలువ పందిళ్లు ప్రధాన ఆలయ గాలిగోపురానికి నూతనంగా రంగులు వేసే పని పూర్తిచేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించే పనులు చేపట్టారు. భక్తులకు ఎండ వేడిమి లేకుండా క్యూలైన్ ప్రారంభంలో చలువ పందిళ్ళు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. లడ్డూ, అరిసే ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్లో మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. -
ఇంకెప్పుడు స్వామీ..!
పల్నాడుమంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కోటప్పకొండ తిరునాళ్లకు 618 బస్సులు మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాలకు గడువు దగ్గర పడుతుంది. ఈ నెల15వ తేదీ మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే తిరునాళ్ల ప్రారంభమైనట్టు భక్తులు భావిస్తారు. ఇందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఏర్పాట్లు కొలిక్కి రాలేదు. కొండకు వచ్చే రహదారులు గోతులమయంగా ఉన్నా ఆ శాఖ ఇప్పటి వరకు మరమ్మతు పనులు చేపట్టలేదు. – నరసరావుపేట రూరల్ కొలిక్కిరాని కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.1380 టీఎంసీలు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 538.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 12,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.6400 వరకు పలికింది. 7 -
మంగళగిరిలో మేఘాలయ ఎన్హెచ్ఎం బృందం పర్యటన
మంగళగిరిటౌన్:గుంటూరు జిల్లా మంగళగిరి లో మేఘాలయ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం పర్యటించింది. ఈ మేరకు అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ అవలంబిస్తున్న విధానాలను మంగళగిరిలోని పలు యూపీహెచ్ సెంటర్లలో సోమవారం బృందం సమీక్షించింది. ఇందిరానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పథకాల అమలు పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న మాత్రలు, ఇతర చర్యల గురించి వైద్య అధికారులు వివరించారు. కార్యక్రమంలో మేఘాలయ ఎన్హెచ్ఎం సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇందిరానగర్ యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్కు జాతీయ గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు వినుకొండ:క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ గీసిన మహేంద్ర మాత మేదరి చిత్రటానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు లభించింది. జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్థమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన జెస్టిస్ను పలువురు అభినందించారు. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ చిలకలూరిపేట: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పీవీ లక్ష్మీ సత్యనారాయణాచార్యులు ఏఈగా విధు లు నిర్వహిస్తున్నారు. ఓ అప్రోచ్రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పెద్ద మస్తానయ్యకు రూ.8 లక్షలు బిల్లు చెల్లించేందుకు మూడు శాతం అంటే రూ. 24 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించటంతో, ముందస్తు వ్యూహం ప్రకారం రూ. 24వేలు లంచం తీసుకుంటుండగా ఏఈను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు పాల్గొన్నారు. గాయత్రీ మాత ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు గుంటూరురూరల్: చౌడవరం గ్రామం దాసరిపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పంచముఖి గాయత్రీ మాత దేవాలయంలో 74వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గాయత్రీ మాత సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి పట్టుచీరె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మహోత్సవాల నిర్వహణను దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ వడ్డే రామిరెడ్డి, సెక్రటరీ వడ్డే విజయభాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలి
నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అధికారులతో కలిసి 105 అర్జీలు స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరం ద్వారా మూడు డివిజన్లకు చెందిన ఆర్డీఓలు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా గురజాల డివిజన్ నుంచి తొమ్మిది, సత్తెనపల్లి ఎనిమిది, నరసరావుపేట నుంచి 20 అర్జీలు స్వీకరించారు. అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు అందజేశారు. -
జిల్లాలో 237 ఫోన్లు రికవరీ
బాధితులకు అందజేసిన బాపట్ల ఎస్పీ బాపట్లటౌన్: జిల్లాలో జనవరి మాసంలో రూ.50 లక్షల విలువైన 237 ఫోన్లను రికవరీ చేశామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాధితులకు ఫోన్లను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ఐటీ కోర్ బృందం, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి, వివిధ ప్రాంతాల్లో పోయిన 237 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైన, విలువైన వస్తువుగా మారిందన్నారు. కేవలం సమాచార మార్పిడికే కాకుండా, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక లావాదేవీలు ఇతర పలు వివరాలను ప్రతి ఒక్కరు ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకుంటే దానిలో ఉన్న సమాచారాన్ని తిరిగి పొందడం కష్టసాధ్యంగా ఉంటుందన్నారు. ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే www.ceir.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు. ఆ పోర్టల్లో బ్లాక్ స్టాలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షనన్ను ఎంచుకుని, ఫోన్ ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొన్న రసీదు కాపీని అప్లోడ్ చేయాలన్నారు. ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా పోయిన ఫోన్న్ను ఎవరైనా వాడాలని ప్రయత్నిస్తే ఆ ఫోన్ సిగ్నల్ పనిచేయకుండా బ్లాక్ అవుతుందన్నారు. తద్వారా ఫోన్ ట్రేసింగ్ సులభమవుతుందన్నారు. బిల్లులు లేని ఫోన్లను కొని అనవసరమైన ఇబ్బందుల్లో పడవద్దని ప్రజలను ఎస్పీ సూచించారు. -
ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవా పురస్కారం
తెనాలి: తెనాలి కెమెరా క్లబ్కు చెందిన ఫొటోగ్రాఫర్, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్లోని కేబీఆర్ ఫంక్షన్హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్ఏఎఫ్యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్ ప్రిన్సిపాల్ ఆనంద్, హెచ్ఓడీ కమల్రాయ్ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు. నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, పోలీస్ బందోబస్త్ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తాత్కలికంగా రద్దు చేశామని, అర్జీదారులు గమనించాలని అన్నారు. గోవాడ(వేమూరు): మహాశివరాత్రిని పురస్కరించుకుని గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘంటా నిర్మలమ్మ దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యార్థం తెనాలి కుమార్ పంప్స్ అధినేత సబ్రహ్మణ్యం రూ.70 వేల విలువైన ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం దాతలు ఆలయంలో పూజలు నిర్వహించారు. నిమిషాల్లో దగ్ధమైన క్యాబిన్ తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కొలనుకొండ వద్ద ఒక లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఓవర్లోడ్తో వెళుతున్న ఇసుక లారీ కొలనుకొండ ప్రాంతానికి వచ్చే సరికి లారీ క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ లారీ దిగి ప్రాణాలతో బయట పడ్డారు. వారి కళ్లముందే నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపం, ఓవర్ లోడ్ వల్ల లారీ ఇంజిన్ వేడి ఎక్కి ఈ మంటలు వ్యాపించి ఉంటాయని పలువురు లారీ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ఆదివారం భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. కల్పవల్లికి భక్తజనం నీరాజనం పలికారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి పాల పొంగళ్లు, చలువ కావిళ్లు, జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లు కానుకగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉయ్యూరు పట్టణం అంతా వీరమ్మతల్లి నామస్మరణతో భక్తజన సంద్రంగా మారింది. పలువురు భక్తులు ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి సేవలో తరించారు. -
‘రెవెన్యూ’ ఎన్నికల కోలాహ లం
నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఎ) జిల్లా అధ్యక్షుడిగా మాచవరం తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసరావుపేటలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెంచలరెడ్డి పేర్కొన్నారు. అసోసియేట్ అధ్యక్షులుగా దాచేపల్లి తహసీల్దార్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కారంపూడి తహసీల్దార్ ఆర్.వెంకటేశ్వర్లునాయక్, నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు శిరిగురి నాగరాజకుమారి, బొల్లాపల్లి తహసీల్దార్ ఏవీ సుధాకర్, పల్నాడు జిల్లా కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ షేక్ బాజి ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా అచ్చంపేట తహసీల్దార్ సీహెచ్.శ్రీనివాసరావు, కార్యదర్శిగా క్రోసూరు తహసీల్దార్ వీవీ.నాగరాజు, సంయుక్త కార్యదర్శులుగా పెరుసుమల నరసయ్య, నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయానికి చెందిన నంద్యాల ఆంజనేయులు, వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు వి.నాగవల్లి, రెంటచింతల తహసీల్దార్ కార్యాలయ ఎంఆర్ఐ ఎం.మనమోహన్ప్రసాదు, కోశాధికారిగా సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.కోటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కలెక్టరేట్లోని జూనియర్ అసిస్టెంట్ పి.వీరప్రతాప్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గురజాల ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ వి.వెంకటరెడ్డి, మాచవరం తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు పి.నరేష్ ఎన్నికయ్యారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా .. రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై న నాగమల్లేశ్వరరావును ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది సత్కరించారు. పిడుగురాళ్ల ప్రజలు తమ తహసీల్దార్ జిల్లా స్థాయి గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు -
పోటీల్లో పాల్గొంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశాతాడేపల్లి రూరల్: చిన్నవయసులోనే ఈత నేర్చుకోవడమే కాకుండా పోటీల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా మాట్లాడుతూ ఈత అనేది ఒకరకమైన వ్యాయామ క్రీడ అని పేర్కొన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అని అన్నారు. ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతుల చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె. లక్ష్మీశాను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆశీస్సులతో గత 26 సంవత్సరాలుగా కృష్ణానదిలో ఈత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి 88 సంవత్సరాల వయస్సు వారు మొత్తం 634 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మొత్తం 8 కేటగిరీలలో ఆడ, మగ పోటీదారులకు విడివిడిగా 16 గ్రూపులుగా పోటీలు నిర్వహించామని తెలిపారు. వేసవి కాలంలో సుమారు 300 మంది పిల్లలకు ఈత నేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరి యార్లగడ్డ రమేష్కుమార్, కన్వీనర్ వడిపినరాము, వైస్ ప్రెసిడెంట్ గోపాలం సాంబశివరావు, కె.వి.రామయ్య, ఎ. రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
లబోదిబోమంటున్న మహిళ
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోలకంపాడు నుంచి ఉండవల్లి దళితకాలనీకి వెళ్లే కరకట్టపై పట్టపగలు నలుగురు మహిళలు ఉండగా ఒక మహిళను టార్గెట్ చేసి ఆమె అరువు తెచ్చుకున్న బంగారపు గొలుసును చైన్స్నాచర్లు లాక్కెళ్లిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి పరిధిలోని దళిత కాలనీకి వెళ్లే కరకట్టపై ఉదయం కోటిచుక్కల లక్ష్మి తన బంధువులతో కలసి శుభకార్యానికి వెళుతున్నారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి వీరిని దాటుకుని వెళ్లారు. రెండునిమిషాల వ్యవధిలో తిరిగి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మి మెడలోని బంగారం గొలుసును, సూత్రాలతో సహా లాక్కెళ్లారు. ఈక్రమంలో కోటిచుక్కల లక్ష్మి కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చైన్ స్నాచర్లు పరారయ్యారు. పక్కనే ఉన్న మహిళలు బండి ఢీకొందని అనుకున్నారు. కానీ మెడలో తాడు లాక్కెళ్లారని చెప్పడంతో మిగిలిన మహిళలు పెద్దగా కేకలు వేశారు. అప్పటికే ద్విచక్రవాహంపై వారు పరారయ్యారు. కోటిచుక్కల లక్ష్మి బంధువుల ఇళ్లలో శుభకార్యానికి వెళుతూ.. పక్క ఇంటిల్లోని వారు గొలుసును అరువుకు తెచ్చుకుని మెడలో వేసుకుంది. సుమారు 30 గ్రాములు ఉండే ఆ బంగారు గొలుసు లాక్కెళ్లడంతో గొలుసు యజమానికి డబ్బులు ఎలా కట్టాలని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చి బాధిత మహిళ వద్ద వివరాలు తెలుసుకున్నారు. నలుపు, ఎరుపు ద్విచక్రవాహనంపై ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు వెనుక కూర్చున్నారని, వారిలో ఒక టక్ చేసుకుని ఉన్నారని లక్ష్మి తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఐ ఖాజావలి పలుచోట్ల సిసి కెమెరాలను పరిశీలించగా ఆమె చెప్పిన గుర్తులతో ఉన్న యువకులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుకుంటూ ఉండవల్లి సెంటర్వైపు వెళ్లారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న బిహార్కు చెందిన వ్యక్తులు అని పోలీసులు భావిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఖాజావలి సూచించారు. -
వినుకొండ ఫొటోగ్రాఫర్కు ‘సిగ్మా’ అవార్డు
వినుకొండ: పట్టణానికి చెందిన కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో వివాహ ఆచారాల కేటగిరిలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్–2026లో భాగంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన పోటీలలో వెడ్డింగ్ మూమెంట్స్ ఫొటోకు అవార్డు దక్కింది. హైదరాబాద్లో ఆదివారం జరిగిన అవార్డు ప్రదానం కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా సుబ్బారావు అవార్డు అందుకున్నారు. సుబ్బారావును పల్నాడు జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్బీకే, వినుకొండ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు సూర్య, బ్రహ్మం, వెంకటేష్, పెద్దమల్లయ్య, శ్రీకాంత్, సీపీ కృపాకర్, వేణు, నరేంద్ర అభినందించారు. పిడుగురాళ్ల ఫొటోగ్రాఫర్లకు అవార్డులు పిడుగురాళ్ల: ిపడుగురాళ్ల పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్లోని ఈఎంఆర్సీ–ఉస్మానియా యూనివర్సిటీ సమర్పణలో ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ ఫొటో పరివార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ పరివార్ విశిష్టసేవా పురస్కార వేడుకల్లో పిడుగురాళ్ల పట్టణనికి చెందిన ఫొటోగ్రాఫర్లు సీదా రామరావు, రామిశెట్టి చంద్రశేఖర్రావు, రామినేని భరత్కుమార్లు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డును అందుకున్నారు. -
టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు
పెదకూరపాడు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని జలాలపురం గ్రామానికి చెందిన వ్యాపారి, సీనియర్ నాయకులు సరిపూడి రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. జలాలపురంలోని తన స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గెలుపు కోసం సొంత డబ్బులు ఖర్చు చేశానన్నారు. గ్రామంలోనే టీడీపీకి చెందిన వారు నాపై హత్యాయత్నం చేసినా ఎమ్మెల్యే ప్రవీణ్ కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై దాడి చేసిన వారే నాపై కేసులు పెట్టించారని తెలిపారు. పార్టీలో న్యాయం జరగదని భావించి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు ఏటుకూరి బ్రహ్మయ్యకు అందజేస్తామన్నారు. తనతోపాటు తన అనుచరులు కూడా త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. -
ఆకట్టుకున్న ‘ఆ ఊరు – ఈ ఊరు’
కొనసాగిన ‘భారత్రంగ్ మహోత్సవ్’ నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం ఆదివారం మూడో రోజుకి చేరింది. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించారు. దేశ, విదేశీ భాషలు, విభిన్న కళారూపాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రముఖ రచయితలు, కళాసంస్థలు, నాటక పరిషత్ నిర్వాహకులు, కళాకారులు తరలివచ్చారు. బళ్లారి రాఘవయ్య ఓపెన్ థియేటర్లో పాటలు, ఆటలు, కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాపరిషత్ నిర్వాహకులను సత్కరించారు. అనంతరం నటమిత్రారు హవ్యాసి కళా సంఘం (తిరుత్తహల్లి, కర్నాటక) ప్రదర్శించిన ఆ ఊరు – ఈ ఊరు నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరు కుటుంబ నేపథ్యంతో సమాజంలోని లోపాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, ప్రేక్షకులను ఆలోచనల లోకంలోకి తీసుకెళ్లింది. ఈ నాటకం జి.బి.జోషి రచించగా, హుళుగప్ప కట్టిమాని దర్శకత్వం వహించారు. కన్నడ భాషలో ప్రదర్శించినా.. కళాకారుల హావభావాలు, అభినయాలు భాషా అవరోధాలను చెరిపివేస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి. -
కొనసాగుతున్న వైద్య ప్రదర్శన
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో మెడ్ ఫ్యూజన్ పేరుతో ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న వైద్య ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగింది. డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనాటమీ, జనరల్ సర్జరీ సహా పలు విభాగాల ప్రదర్శనను సందర్శించారు. వాటి వివరాలను తమ కుమార్తెకు వివరిస్తూ, చూపించారు. వైద్య విద్యార్థులతో ముచ్చటించారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి శాలువాతో సత్కరించారు. ఒక్కరోజే 4,184 మంది సందర్శన... ఆదివారం 4,184 మంది ప్రదర్శనను సందర్శించారని ప్రిన్సిపల్ తెలిపారు. ముందస్తుగా వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని రావాలని సందర్శకులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల వద్ద నేరుగా టికెట్లు తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా సమస్యను నివారించవచ్చని తెలిపారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో అత్యంత పురాతనమైన పునీత తోమాసవారి ఉత్సవాలను ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రార్థన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు మేత్రాసన విశ్రాంత బిషప్ రెవరెండ్ గాలిబాలి, జిల్లా వ్యాప్తంగా పలు చర్చిల నుంచి వచ్చిన 40 మంది విచారణ గురువులతో దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అత్తలూరు తోమాస చర్చి ఫాదర్ చాట్ల కస్పార్ మాట్లాడుతూ అందరూ దైవం పట్ల విశ్వాసంతో, తోటి మానవుల పట్ల కరుణతో జీవించాలన్నారు. ఏసుప్రభువు మానవులకు చేసిన అనేక మంచి కార్యాలకు కృతజ్ఞతగా ఈ పండుగను నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు గంటలకు కొవ్వొత్తులతో వీధులలో ప్రదర్శన నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించిన తేరుపై ఏసుప్రభువు విగ్రహాన్ని ఉంచి పురవీధులలో తేరు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో విచారణ గురువులు, మఠ కన్యలతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మ వరల్డ్ కప్ నమూనా తయారీ చీరాల: అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ నమూనా తయారు చేశారు. క్రికెట్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పును 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లీగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు. నకరికల్లు: సీనియర్ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మండలంలోని అడ్డరోడ్డులో గల అభయాంజనేయ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. కొండవీడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకుడు విను కొండ కొండామాచార్యులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాజేంద్ర ప్రసాద్ను కలిసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. -
ఇంటర్కు ఇన్విజిలేటర్లేరీ?
పల్నాడుసోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ఇన్విజిలేషన్ విధులకు గుంటూరు జిల్లాలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ఈ నెల 10వ తేదీన ముగియనున్నాయి. థియరీ పరీక్షలపై దృష్టి సారించిన అధికారులకు ఇన్విజిలేటర్ల కొరత ఇబ్బందికరంగా మారింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 36.1837 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 539.40 అడుగులకు చేరింది. సాగర్ నుంచి కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు వదులుతున్నారు.జిల్లాలోనే అధికం ప్రైవేటు అధ్యాపకులకు బాధ్యతలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పర్చూరు (చినగంజాం): పర్చూరు కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. పర్చూరులోని కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె భవనంలోకి కోర్టును మారుస్తున్న క్రమంలో ఆదివారం అద్దె భవనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు పర్చూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.జాన్బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వై.లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కోర్టు పాత భవనం శిథిలావస్థకు చేరినందున దాని స్థానంలో కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు అద్దె భవనంలో కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొత్త భవన నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా కోర్టు నిర్వహణ అవసరాలను గుర్తించి ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత విభాగాలకు సూచించారు. కోర్టు భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, ప్రకాశం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి, జిల్లా సెషన్స్ రిటైర్డ్ జడ్జి ఎ. భారతి తదితరులు పాల్గొన్నారు.చంద్రబాబు సర్కార్ తీరుతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ–క్రాప్ నమోదు నత్తనడకను తలపిస్తోంది. పంటల విస్తీర్ణంలో ఇప్పటికి సగం మాత్రమే నమోదు చేశారు. వ్యవసాయ విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందికి సర్వేల పేరుతో పనిభారం పెంచడంతో ఈ–క్రాప్ నమోదు నీరసంగా సాగుతోంది. గడువులోగా పూర్తి స్థాయిలో నమోదుకు అవకాశం కనిపించటం లేదు. ఫలితంగా రైతులు నష్టపోయే ప్రమాదముంది. నత్తనడకన ‘ఈ–క్రాప్’ 7ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు -
శ్రీశైలం మల్లన్న తలపాగా గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామికి అలంకరించే తలపాగాకు మంగళగిరిలో గ్రామోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో తలపాగాకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఓం నమశ్శివాయ నామస్మరణతో తలపాగాను శిరస్సుపై ఉంచుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరు సుబ్రహ్మణ్యస్వామి, మాడిశెట్టి శివశంకరయ్యలు మాట్లాడుతూ మల్లి కార్జున స్వామి వారి పెండ్లికుమారుని ఉత్సవం, దేవాంగులు నేసిన తలపాగా వస్త్ర విశిష్టత గురించి కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి అధ్యక్షులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కారు దగా
తెనాలి: గుంటూరు జిల్లాలో తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల పరిధిలో గల వ్యవసాయ సబ్ డివిజనులో 51,170 ఎకరాల విస్తీర్ణంలో రైతులు రబీ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో మొక్కజొన్న 26 వేలు, జొన్న 22 వేలు, మినుములు, పెసలు 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సబ్ డివిజనులో 43 రైతు సేవ కేంద్రాలు ఉండగా, 35 మంది వీఏఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. పంటల ఈ–క్రాప్ నమోదును డిసెంబరులో ఆరంభించారు. దుగ్గిరాలలో 19,918 ఎకరాలకు 10,965, తెనాలిలో 17,020 ఎకరాలకు 9,007, కొల్లిపరలో 14,232 ఎకరాలకు 6,553 ఎకరాలకు మాత్రమే ఈ–క్రాప్ నమోదు చేయగలిగారు. ప్రస్తుతానికి 26,526 ఎకరాలకే ప్రక్రియ పూర్తి అయింది. ముంచుకొస్తున్న గడువు ఈ–క్రాప్ నమోదుకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనుంది. ఆలోగా పూర్తి చేస్తారన్న భరోసా రైతులకు చిక్కటం లేదు. ఇందుకు ప్రధాన కారణం సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర రిజిస్ట్రేషను వంటి పనులను అప్పగించడమే. రోజూ మధ్యాహ్నం నుంచి సచివాలయ ఉద్యోగులు ఈ విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సచివాలయం పరిధిలోని వీఏఏలు ఉదయం తమ పనులతోపాటు మధ్యాహ్నం నుంచి సర్వే, రిజిస్ట్రేషను పనులకు వెళ్లాల్సి వస్తోంది. పనిభారంతో అవస్థలు పడుతున్నారు. తరచూ సర్వర్లు మొరాయిస్తుండటం మరో సమస్య. దీంతో ఈ–క్రాప్ నమోదు పనుల్లో జాప్యం జరుగుతోంది. గతంలో సచివాలయం నుంచే నమోదుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం తప్పనిసరిగా పొలాలకు వెళ్లి, పంట వివరం, రకం వంటివి నమోదు చేయాలి. ఎన్నో ఉపయోగాలు ఈ–క్రాప్ నమోదు రైతులకు ఎంతో కీలకం. మార్కెట్లో ధాన్యానికి ధరలు లేనపుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్ నమోదుతోనే అవకాశం ఉంటుంది. పంట రుణాలు తీసుకోవాలన్నా, పంటల బీమా చేసుకుని ఏదైనా ప్రకృతి విపత్తుతో పంట దెబ్బతింటే నష్టపరిహారం పొందటానికీ సదరు ఈ–క్రాప్ నమోదయితేనే వర్తిస్తుంది. అయినప్పటికీ మూడు మండలాల్లో సగం విస్తీర్ణంలో ఇంకా నమోదు చేయకపోవటంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సబ్ డివిజనులో రబీలో సాగవుతున్న పంటలకు ఈ–క్రాప్ నమోదు చేస్తున్నాం. గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా ముందుకొచ్చి పంటల నమోదుకు తోడ్పడాలని కోరుతున్నాం. – ఆర్.విజయబాబు, ఏడీఏగత ఖరీఫ్ సీజనులో మోంథా, దిత్వా తుపాన్లకు పంట నష్టపోయిన రైతులు ఎవరికీ పరిహారం అందనేలేదు. వరి పొలంలో 33 శాతం పైబడి పంట నష్టపోతేనే ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారాన్ని నిర్ణయించారు. తెనాలి మండలం కంచర్లపాలెంలో కొద్దిపాటి విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు నివేదిక పంపారు. పైసా పరిహారం అందలేదని చెబుతున్నారు. అలాగే 2024–25లో కొద్దిమంది రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, ఆయిలింజన్లు, డ్రోన్లు, రోటావేటర్లు వంటి వ్యవసాయ సంబంధిత పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుత సంవత్సరానికి వీటి పంపిణీ నిమిత్తం బడ్జెట్ కేటాయింపే జరగలేదని అంటున్నారు. బాబు పాలనలో అన్ని రకాలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
అడ్డగోలుకు అడ్డుకట్ట
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సమావేశపు అజెండాను తిరస్కరిస్తూ చైర్పర్సన్ హెనీ క్రిస్టినాకు లేఖ అందజేస్తున్న ఒకటో స్థాయీ సంఘ సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని మరోసారి బహిష్కరించిన వైఎస్సార్ సీపీ సభ్యులు రూ.కోట్లాది పనులను ఏకపక్షంగా ఆమోదించడంపై నిరసన ప్రభుత్వం నుంచి స్టాంప్ డ్యూటీ నిధులు తెచ్చుకోలేని దుస్థితి జెడ్పీ చైర్పర్సన్తో విభేదించిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు బడ్జెట్ ప్రతిపాదనలు మినహా ప్రణాళిక–ఆర్థికాంశాల అజెండాలకు తిరస్కరణ -
కేంద్ర బడ్జెట్ ఓ విక‘సిక్’ బడ్జెట్
ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు రెంటచింతల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ సామాన్యులకు ఓ విక‘సిక్’ బడ్జెట్ అని దీనివలన వారికి ఒరిగేదేమి లేదని కేవలం ఇది కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని కన్నెగంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షుడు, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశ,దిశ లేని బడ్జెట్ మాత్రమే కాక స్పష్టతలేని ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మెండిచేయి చూపించారని విమర్శించారు. కీలక రంగాలకు సరైన కేటాయింపులు లేవని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు యువత, మహిళ, కౌలురైతు, విద్యారంగం ఉద్యోగులకు శ్రామిక, పేద, మధ్య తరగతి వర్గాలకు పన్ను సడలింపులో ప్రత్యేక ఉపశమనం లేదన్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గించడంతోపాటు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయాలకు సంబంధించి బడ్జెట్లో పరిష్కారమార్గాలు చూపలేకపోయారన్నారు. ప్రజలు బాధలు తీర్చలేని నిరాశ బడ్జెట్అని, ఆర్థిక వ్యవస్థను దిగజార్చే బడ్జెట్ అన్నారు. దేశంలో 147 కోట్ల మందికి ఒక్కొక్కరి తలపై 1.34 లక్షల అప్పు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు కేటాయించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. విశాఖ ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది ఏంలేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను సైతం విస్మరించారని గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. -
తప్పులపై తప్పులు చేస్తున్న చంద్రబాబు
● ఎన్డీడీబీ నివేదికతో చెంపలేసుకొని భగవంతుడిని క్షమాపణ కోరాలి ● వైఎస్సార్ సీపీ వారికి సంబంధం ఉన్నట్లు సీబీఐ నివేదిక ఎక్కడా చెప్పలేదు ● 2018కు చెందిన హర్ష డెయిరీనే నేటి బోలేబాబా డెయిరీ ● విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: టీటీడీ లడ్డూ ప్రసాదంపై చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని, ఇకనైనా ఆ అంశానికి తెరదించి ఆ దేవదేవుడికి క్షమించమని లెంపలేసుకుని వేడుకోవాలని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు తిరుమల నెయ్యిలో ఎటువంటి జంతు సంబంధమైన కొవ్వు కలవలేదని నివేదిక ఇచ్చినప్పటికీ ఇంకా అబద్ధాలు చెప్పటం మానలేదని అన్నారు. 2018లో టీడీపీ హయాంలో హర్ష డెయిరీ పేరుతో నెయ్యి టీటీడీకి సరఫరా చేసిన సంస్థే పేరుమార్చుకొని ఇప్పుడు బోలెబాబా పేరుతో నెయ్యి సరఫరా చేస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందనేది వాస్తవం అన్నారు. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మతాన్ని తెరపైకి తీసుకొచ్చి నాటకాలు మొదలుపెట్టాడని విమర్శించారు. ఏకసభ్య కమిషన్ నియమిస్తానని చంద్రబాబు చెబుతున్నాడని, ఇది కేవలం వైఎస్ జగన్ లడ్డూ కల్తీ చేయించారని రాయించుకోవడం కోసమేనని అన్నారు. అయోధ్యకు పంపిన 1.25 లక్షల లడ్డూల్లో కల్తీ జరిగిందని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారని, వాస్తవానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో అయోధ్యకు పంపించిన లడ్డూలు 4వేల కేజీల నెయ్యితో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు సౌరబ్ బోరా, మై హోం రామేశ్వరరావులు కలిసి తయారు చేయించి పంపించారని ఇది కూడా పవన్ కళ్యాణ్ తెలియదా అని ప్రశ్నించారు. అనిల్కుమార్ సింఘాల్ తప్పు చేశారని చెప్పిన చంద్రబాబు తిరిగి ఆయన్నే ఎందుకు నియమించారని ప్రశ్నించారు. రూ.265 కోట్లు వైఎస్సార్ సీపీ వాళ్లు ఈ వ్యవహారంలో దోచుకున్నారని మాట్లాడారని, సిట్ దర్యాప్తులో ఎక్కడ కూడా వారి పేర్లు ప్రస్తావించలేదన్నారు. సమావేశంలో ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి మాట్లాడగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు, మాజీ కౌన్సిలర్ బత్తుల పద్మలత పాల్గొన్నారు. -
వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజులో భాగంగా ఉదయం స్వామివారికి పెళ్లికుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గణపతిపూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు మల్లేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిని దర్శించిన భక్తులకు పవిత్ర చేకూరి సకల శుభాలు అందుకుంటారనేది భక్తుల నమ్మకం. పట్టణానికి చెందిన జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు పెండ్లి కుమారునికి మధుపర్కాలు సమర్పించారు. మంగళగిరికి చెందిన అంబటి వెంకట సుబ్బారావు కుమారుడు విశ్వేశ్వరరావు, జక్కా వెంకటరత్నం కుమారుడు నాగ వెంకట గోపాలరావు స్వామివారి గ్రామోత్సవ కై ంకర్యపరులుగా వ్యవహరించారు. కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. -
ప్రైవేట్ భాగస్వామ్యంతో
● కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ● ప్రారంభమైన కొండవీడు ఫెస్ట్–2026 టూరిజం అభివృద్ధి యడ్లపాడు: ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలనుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. చారిత్రక ప్రదేశం కొండవీడు కోట ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కొండవీడు ఫెస్ట్–2026 పేరిట జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తొలిరోజు ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా కొత్తపాలెం వాసులు ఘాట్రోడ్డుకు వెళ్లే మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి అరకు కాపీ సెంటర్ను ప్రారంభించారు. అక్కడ నుంచి కలెక్టర్, ఆర్డీవో మధులతతో కలసి హెలీప్యాడ్ ప్రాంతానికి చేరుకుని, భద్రత వివరాలను తెలుసుకుని హెలీప్యాడ్ను ప్రారంభించాలని ఆదేశించారు. కొండపై స్వాగత ద్వారం వద్ద కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి ఆనం, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కోటలోకి ప్రవేశించి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. కొండపై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. వెదుళ్ల చెరువును సమీపించి బోటింగ్ చేశారు. చివరిగా సభావేదిక వద్దకు చేరుకుని కల్చరల్ సెంటర్ ఆఫ్ది విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగరెడ్డి ‘అమరావతికి సరిజోడు కొండవీడు’ చరిత్ర పుస్తకం, యడ్లపాడు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ రూపొందించిన కొండవీడు ప్రత్యేక గీతం, బకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. టీడీపీనేత నన్నపనేని రాజకుమారి, శిల్పారామం చైర్మన్ పద్మజారెడ్డి, డీఎఫ్వో జి కృష్ణప్రియ, గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ గోల్కొండ గ్రూప్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి కొండవీడులో రీసార్ట్ నిర్మాణానికి రూ.వంద కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అటవీశాఖ అనుమతుల్ని తీసుకుంటామని తెలిపారు. రామిరెడ్డి మాట్లాడుతూ సమగ్రంగా ప్రాజెక్టు రిపోర్టు రూపొందిస్తే రూ.100 కోట్ల వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రి ఆనం మాట్లాడుతూ పూర్వ ఎలాంటి సాంకేతిక లేని రోజుల్లో మూడు చెరువులు ఒకదాని తర్వాత మరొకటి నిండేలా చేయడం నాటి రాజుల దూరదృష్టికి దర్పణం అన్నారు. శివాలయం పునర్నిర్మాణానికి నిధులు కేటాయించేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ బాల్య దశలోనే ఇలాంటి ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లి గత చరిత్ర, సంస్కృతి గురించి తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. ముందుగా నరసరావుపేట, యడ్లపాడు ప్రాంతాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కొండవీడు ఉత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు పలు విభాగాల్లో అధికారులు పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో విజేతలకు జ్ఞాపికలను అతిథుల చేతుల మీదుగా అందించి అభినందించారు. విజేతల వివరాలు..నృత్య విభాగంలో..ఎన్.ముత్యాలు, శాసీ్త్రయ నృత్యం, నారాయణ ఇ.ఎమ్ స్కూల్, యడ్లపాడు, మున్సిపల్ బాయ్స్ హైస్కూల్, నరసరావుపేట. పాటల పోటీల్లో..ఆంధ్రా స్కూల్, నరసరావుపేట, ఎంజేపీఎపీబీసీడబ్ల్యూసిడెన్షియల్ స్కూల్, నరసరావుపేట, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, నరసరావుపేట, వక్తృత్వంలో...సెయింట్ జోసెఫ్ హైస్కూల్, చిత్రలేఖన పోటీల్లో...ఎంజేపీఎపీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, నరసరావుపేట, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, నరసరావుపేట, హర్డ్ హైస్కూల్, నరసరావుపేట విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచినట్లు అధికారులు తెలిపారు. -
నైతికత ముఖ్యం
విద్యతో పాటు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఏఎన్యూ(పెదకాకాని): ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అనే అంశంపై ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన జీవితం ప్రతి విద్యార్థి విజయానికి మార్గమన్నారు. గురువు గౌరవాన్ని కాపాడలేని చదువు వ్యర్ధమన్నారు. విలువలతో కూడిన విద్య అభ్యసించిన వారు తప్పక విజయం సాధిస్తారన్నారు. కష్టపడిన వారు ఎప్పటికీ నష్టపోరని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా, బెనారస్ యూనివర్సిటీ స్థాపనకర్త మదన్మోహన్ మాలవ్య, భూదాన ఉద్యమదాత ఆచార్య వినోభా బావే వంటి మహనీయులు సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజేతలుగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాసంస్థ, గురువులు గర్వించేలా సమాజంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలం, రెక్టార్ ఆర్.శివరాంప్రసాద్లు ప్రసంగించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. పెట్టుబడులతో స్వర్ణ బాపట్లగా అభివృద్ధి బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పెట్టుబడులతో ‘స్వర్ణ బాపట్లగా’ జిల్లా రూపుదిద్దుకోనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పర్యాటక, సేవా, వైద్య రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పెట్టుబడిదారులతో శనివారం ఆయన స్థానిక కలెక్టరేట్లో హైబ్రిడ్ మోడ్లో సమావేశం నిర్వహించారు. పర్యాటకంగా అభివద్ధి చెందుతున్న బాపట్లలో మీ పెట్టుబడులు పెట్టండి, చట్టబద్ధంగా అన్ని వనరులు మేము కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. మీ పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు డీపీఆర్ సిద్ధం చేసి ఇవ్వండి అవసరమైన అనుమతులు, భూమి కేటాయిస్తామన్నారు. బాపట్లలో రూ.4,555 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 20 మంది పెట్టుబడిదారులు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు బాపట్ల: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఏపీజిపిసిఇటిడాట్ ఏపీ సి ఎఫ్ ఎస్ ఎస్ డాట్ ఇన్ వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈనెల 19వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుందని, జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ కల్చరల్: కళా సాంస్కృతిక రంగాల పూర్వ వైభవానికి సంస్కార భారతి కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. భరతముని జయంతి సందర్భంగా సుమధు కళానికేత్, సంస్కార భారతి మహానగర్ శాఖ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి నృత్య పోటీలను శనివారం అయోధ్యనగర్లోని కళావేదికపై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సంస్కార భారతి పనిచేస్తుందని చెప్పారు. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అంశాల్లో యువతకు, చిన్నారులకు శిక్షణ తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. నాట్యాచార్యులు సుధీర్రావు, పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రతినిధి దుర్భా శ్రీనివాస్, సంస్కార భారతి సంస్థ బాధ్యలు బోడి ఆంజనేయరాజు పాల్గొన్నారు. జాతీయ స్థాయి నృత్య పోటీలను గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదిక, ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు కల్యాణ మండపం, కోదండ రామాలయం, అయోధ్యనగర్లోని హైందవి, శ్రీధర్మ పరిషత్ వేదికలపై సోలో విభాగంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు. -
సంకల్పం ఉంటే.. సక్సెస్ మీ వెంటే
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ ‘ క్రీడల్లో ఓటమి అనేది బలంగా ఎదిగేందుకు లభించే గొప్ప అవకాశమని, ప్రతి అపజయం ఒక విజయంలాంటిదే.. అది మనల్ని రేపటి గెలుపునకు సిద్ధం చేస్తుంది’ అన్నారు. చదువులో రాణించే తెలివైన విద్యార్థులు ఒక్కోసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని, కానీ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఎప్పుడూ మానసిక ఉల్లాసంతో ఉంటారని తెలిపారు. కుంగుబాటుకు లోనైనప్పుడు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం లేదా క్రీడల్లో పాల్గొనడం ద్వారా తిరిగి ఉత్తేజాన్ని పొందవచ్చన్నారు. చేబ్రోలు: ‘జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం ఉంటే రాణించవచ్చు, చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలి’ అని 2025 ఏషియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా పిలుపునిచ్చారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 19వ ఎడిషన్ జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ శనివారం వైభవంగా ముగిసింది. ఆఖరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏషియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా విచ్చేశారు. సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు రూ.15 లక్షల విలువైన నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలలో సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. -
సైబర్ మోసం.. రూ.3.89 లక్షలు మాయం
ఈపూరు(శావల్యాపురం): ఈపూరు మండలంలోని అంగలూరు గ్రామానికి చెందిన ఎరువుల షాపు యజమాని గణపర్తి ఉదయ్కుమార్ సైబర్ నేరానికి గురై రూ. 3.89లక్షలు పోగొట్టుకున్నట్లు ఎస్ఐ వేణుగోపాలరావు శనివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. గణపర్తి ఉదయ్కుమార్ సెల్ఫోనుకు కాల్ రాగా కంప్యూటరు వాయిస్తో నేను రైతన్న మాట్లాడుతున్నాను అని చెప్పగా ఫేక్ కాల్గా గుర్తించగా రెండు సెకన్లు వ్యవధిలో కాల్ కట్ చేశాడు. తక్షణమే 8 సందేశాలు వచ్చి నగదు కట్ అయినట్లు గుర్తించి మోసానికి గురైనట్లు నిర్థారణ చేసుకొని సత్వరమే 1930 నంబరు ఫోను చేసి అప్రమత్తం అయినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విలేకర్ల సమావేశంలో తెలిపారు. నేడు పల్నాడు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఎ) జిల్లా యూనిట్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం ఆర్డీఓ కాంపౌండ్లోని రెవెన్యూ భవన్లో నిర్వహిస్తున్నామని జిల్లా యూనిట్ అధ్యక్షులు ఎన్.నాగమల్లేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కమిటీ ఎన్నికలకు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్లు, కలెక్టరేట్ యూనిట్కు చెందిన నాలుగు డివిజన్ల కార్యవర్గ సభ్యులు, జిల్లా బాడీ సభ్యులు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికల అధికారులుగా నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెంచలరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దివ్య దుర్గాదేవి వ్యవహరిస్తారన్నారు. సంబంధిత కార్యవర్గ సభ్యులు జిల్లా బాడీ సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరై, నూతన బాడీ ఎన్నికను విజయవంతం చేయాలని కోరారు. కొనసాగిన భారత్ రంగ్ మహోత్సవ్ నగరంపాలెం (గుంటూరు వెస్ట్): నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీవేంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్– అంతర్జాతీయ నాటక ఉత్సవం శనివారం రెండో రోజుకి చేరింది. అంతరించిపోతున్న చెక్క భజన, బురక్రథను విద్యార్థులు ప్రదర్శించారు. బాల కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలాండ్ దేశం వారు ప్రదర్శించిన ఉమాదేవి అబ్సర్వస్స్ వాండా డైనోస్కా ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసింది. పోలాండ్కు చెందిన థియేటర్ మలబార్ హోటల్ బృందం ఈ నాటకాన్ని ఆంగ్లం–పోలిష్ భాషల్లో ప్రదర్శించగా, రచన, దర్శకత్వ బాధ్యతలను లికాజ్ చోట్కౌస్కి నిర్వహించారు. ఉన్నత విద్యను విధ్వంసం చేసే బిల్లును రద్దు చేయాలి ఏఎన్యూ(పెదకాకాని): రాష్ట్ర హక్కులను కాలరాస్తూ ఉన్నత విద్యను విధ్వంసం చేసే బిల్లును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్–2025 బిల్లును వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులతో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఏర్పడిన యూజీసీ, ఏఐసీటీఈ, ఎసీటీఈలను రద్దు చేసి, వీటిని హెచ్ఈసీఐ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా విద్య కేంద్రీకరణకు కేంద్రం పాల్పడుతోందన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్లు మాట్లాడారు. నకిలీ పురుగు మందులు గుర్తించడం కీలకం కొరిటెపాడు(గుంటూరు): నకిలీ పురుగు మందులు గుర్తించడంలో లాబోరేటరీలు కీలకంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు మనజీర్ జిలాని సుమూన్ కోరారు. గుంటూరులోని పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. పురుగుమందుల శాంపిల్స్ పరీక్షా విధానం, విశ్లేషణ ఫలితాలు ఇన్సైట్ యాప్లో నమోదు చేయడంపై ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి, యనలిస్ట్లను అడిగి తెలుసుకున్నారు. మనజీర్ జిలాని సుమూన్ మాట్లాడుతూ పురుగుమందుల శాంపిల్స్ను తప్పిదాలు లేకుండా పరీక్ష చేసి, నకిలీ పురుగుమందులను అరికట్టాలని సూచించారు. గుంటూరు పురుగుమందుల ల్యాబ్కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ వచ్చేలాగా కృషి చేయాలని సూచించారు. -
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
సూరేపల్లి(భట్టిప్రోలు): మహా శివరాత్రిని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో కొలువైన కేదారేశ్వర వాయులింగ ఆలయంలో శివపార్వతుల కల్యాణం, తిరునాళ్ల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విశ్వేశ్వరబాబు ఆధ్వర్యంలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభను, గూడు బండ్లను అందంగా తీర్చిదిద్దారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రాత్రి 7 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామి వారికి భక్తులచే స్వయంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకుపల్లి: గ్రామ దేవత నెల్లెమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శనివారం ఆరుంబాక గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రావూరు నాగేశ్వరరావు, డేగల పాపారావు, రావూరి వెంకట సుబ్బయ్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ గాజులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి రెండు రోజుల తిరునాళ్ల వైభవంగా జరుగుతోంది. రెండవ రోజు శనివారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి ఆవరణలో ఉన్న శివపార్వతుల గుడిలో శివపార్వతుల కల్యాణాన్ని దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రికి ప్రభలు కట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వాములు గోవిందమాంబల కల్యాణాన్ని జరిపించారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి బ్రహ్మంగారికి గోవిందమాంబలకు పూజలు చేశారు. తెనాలి టౌన్: జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందడం అభినందనీయమని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ కొనియాడారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అభినందన సభలో నందివెలుగు సర్పంచ్ ధూళ్ళిపాళ్ల పవన్కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఉద్యోగం పొందిన నాగేశ్వరరావులను దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, సీడీపీవో విజయగౌరి, డిప్యూటీ ఎంపీడీవో వైవిడి ప్రసాద్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకుమాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ సబ్డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి వినియోగం విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 3.95 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులు, ఇతర అనుమానితుల కదలికలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో గంజాయి కేసులో పట్టుబడి, జువైనల్ హోంలో ఉన్న ఓ మైనర్ ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ వెంకటరంజిత్కుమార్, మరికొంత మంది గంజాయి వ్యాపారంలో పాల్గొంటున్నట్లు నిర్ధారించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా కొనసాగించామన్నారు. నిఘాలో శుక్రవారం కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపట్ల పెదనందిపాడు రహదారిలో ఉన్న డంపింగ్ యార్డు వద్ద గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా, వారు విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి బాపట్ల, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు బాపట్లకు చెందిన దేవరకొండ వెంకట రంజిత్కుమార్, బాపట్లకు చెందిన జూటు చైతన్య పరమేశ్వరరావు, మచిలీపట్నంకు చెందిన జొన్నకూటి ఉదయ కిరణ్, బాపట్లకు చెందిన మల్లెల ఆరాధన రాజా, పొట్లూరు గణేష్ అలియాజ్ బుడ్డ గణేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్ ఏకానాథ్ సిబ్బంది నరసింహ, అశోక్, ప్రసాద్, శ్రీను, చిరంజీవి తదితరులను డీఎస్పీ అభినందించారు. -
ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం
లక్ష్మీపురం: గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఫీడ్బ్యాక్ బోర్డుపై గుర్తు తెలియని యువకుడు శుక్రవారం అల్లాహు అక్బర్ భూమ్ అని రాసి బాక్స్లో వేయడంతో బాంబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిబిషన్కు పలువురు విద్యార్థులు వస్తున్నారు. వారి ఫీడ్బ్యాక్ కోసం బోర్డు ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడలోని నాగార్జున నర్సింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వచ్చారు. ఫీడ్ బ్యాక్ బోర్డు వారిలో ప్రదీప్ సాహిత్య అనే యువకుడు ఇలా రాశాడు. బాంబు బెదిరింపు అనుకుని ఎగ్జిబిషన్ను కొద్దిసేపు నిలిపి వేశారు. నగరంపాలెం పోలీసులకు సమాచారం అందడంతో ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఓ యూట్యూబ్ చానల్కు చెందిన యువకుడు దీని గురించి అడిగి, బాంబు కలకలం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ కళాశాల ప్రాంగణం అంతా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవ్వాలనే ఇలా చేసినట్లు చెప్పిన విద్యార్థి ప్రదీప్ సాహిత్యను మందలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొంత పూచీకత్తుపై పంపించేశారు. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కోసం స్లిప్ రాసిన విద్యార్థి -
జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కమిటీ
వినుకొండ : పల్నాడు జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బ్రహ్మయ్య (నరసరావుపేట), ప్రధాన కార్యదర్శిగా సునీత (ఈపూరు), అసోసియేట్ అధ్యక్షులుగా ఆరిఫ్ (వినుకొండ), కోశాధికారిగా మల్లికార్జున (బొల్లాపల్లి) తదితరులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం వినుకొండ ఏడీఏ రవికుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏడీఏ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. నరసరావుపేట టౌన్: నరసరావుపేట సబ్ కోర్టు ఏజీపీగా పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది చెన్నుపాటి నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అభినందించారు. -
భారత్ రంగ్ మహోత్సవం ప్రారంభం
ఐదురోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా–వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్, అంతర్జాతీయ నాటక ఉత్సవం శుక్రవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో ఐదురోజులు కొనసాగనున్న ఈ ఉత్సవాలను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలాశర్మ, బెంగళూరు ప్రతినిధి వీణాశర్మ, ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, నాటకరంగ ప్రముఖుడు కందిమళ్ళ సాంబశివరావు, నటుడు గోపీనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలాశర్మ మాట్లాడుతూ నాటకం కేవలం వినోద సాధనం మాత్రమేకాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తిమంతమైన మాధ్యమమని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయిలో థియేటర్ ఆర్ట్స్కు లభిస్తున్న ప్రాధాన్యతను ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం వివరించారు. అనంతరం కోరస్ రిపెర్టరీ థియేటర్ (మణిపురి) ఆధ్వర్యంలో కనుప్రియ నాటకాన్ని ప్రదర్శించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గుంటూరు, నరసరావుపేట, యడ్లపాడు నుంచి వచ్చిన విద్యార్థినుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. -
సందడిగా విజ్ఞాన్ మహోత్సవ్
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. విజ్ఞాన మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా–నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం (చాంపియన్ మూవీ) మాట్లాడుతూ నటుడిగా ఎదగాలంటే భాషపై పట్టు అవసరమని, మంచి నటుడిగా మారాలంటే భాషలో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థు లకు సూచించారు. మంచి విమర్శలను అంగీకరించడం ద్వారా మాత్రమే వ్యక్తి ఎదుగుదల సాధ్యమని వివరించారు. జీవితాన్ని, పుస్తకాలను, సినిమాలను గమనిస్తే అనేక మంచి ఆలోచనలు వస్తాయన్నారు. భవిష్యత్తులో ఇంట్లో కూర్చొని కూడా ‘అవతార్’ తరహా సినిమాలను రూపొందించే స్థాయికి సాంకేతికత ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు -
ప్రకృతి వ్యవసాయం భావితరాలకు వరం
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయం భావితరాలకు వరమని డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. మండలంలోని పెదరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఏటీఎం మోడల్ను శుక్రవారం ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ నిరంతరం ఆదాయం అందించే ఏటీఎం మోడల్ను ప్రతి రైతు తప్పనిసరిగా అవలంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీట్రూట్, చెట్టు చిక్కుడు, ముల్లంగి, ఉల్లి, క్యారట్, కొత్తిమీర, కాకర, టమాటా వంటి పంటలను సాగు చేయడం ద్వారా ప్రతి నెలా ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రధాన పంటలకు అయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా ముందుగానే రైతులకు తిరిగి లభిస్తుందని వివరించారు. విభిన్న రకాల పంటలను సాగు చేయడం వలన భూమిలో జీవవైవిద్యం పెరిగి నేల మరింత సారవంతంగా మారుతుందని తెలిపారు. రసాయన వ్యవసాయం వలన నేల, నీరు, మానవ ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారానే సుస్ధిర వ్యవసాయం సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది సౌజన్య లక్ష్మీ, బేబిరాణి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనమే..అభిమానమై
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు తాడేపల్లి రూరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటనను ముందుగా కనకదుర్గ వారధి నుంచి బస్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్, భవానీపురం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి ఉంది. పోలీసులు, ప్రభుత్వం రాత్రికి రాత్రి రూటు మార్చి వెస్ట్ బైపాస్లో వెళ్లాలని సూచించారు.శుక్రవారం ఉదయం 11.35 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటకు రాగా అప్పటికే ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఆయన కాన్వాయ్ను అనుసరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్కి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. 11.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రాతూరు అండర్పాస్కు వచ్చేటప్పటికి 12.06 గంటలు అయ్యింది. అక్కడి నుంచి జాతీయ రహదారిపై అభిమానుల మధ్య వైఎస్ జగన్ కాన్వాయ్ మంగళగిరి, తెనాలి ఫ్లై ఓవర్కు 12.15గంటలకు చేరుకుంది. కాజా టోల్గేటు 12.25కి, మంగళగిరి వెస్ట్ బైపాస్కు 12.40, వెంకటపాలెం టోల్గేటుకు 1.30 గంటలకు చేరింది. మహిళలతో కరచాలనం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెస్ట్ బైపాస్లో కృష్ణానది బ్రిడ్జిని 2.05 గంటలకు దాటి గొల్లపూడి గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ మధ్యలో తాడేపల్లి ఓల్డ్ టోల్గేట్ అండర్ పాస్ వద్ద పాతూరు, తాడేపల్లి సర్వీస్ రోడ్లో ఒక చోట, పాతూరు క్రాస్రోడ్లో తన వాహనం నుంచి బయటకు వచ్చి నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. కాజా వద్దకు భారీగా మహిళలు తరలిరాగా వారితో కరచాలనం చేశారు. కాజా టోల్గేటు వద్ద గుంటూరు నుంచి విజయవాడ వచ్చే రూట్లో మూడు నిమిషాలు ఆగి రోడ్డు వెంబడి ఉన్న కార్మికులకు, అభిమానులకు అభివాదం చేశారు. వెస్ట్ బైపాస్కు చేరుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు భారీగా వచ్చి స్వాగతం పలకడంతో అక్కడ ఐదు నిమిషాలు ఆగారు. నందిగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం వెంకటపాలెం టోల్గేటు వద్దకు వచ్చే సరికి మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకులు నందిగం సురేష్ ఆధ్వర్యంలో రాజధాని ప్రజలు భారీగా తరలి వచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలికి భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. మహిళలు, యువకులు పూలవర్షం కురిపించారు. కాన్వాయ్లో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలతోపాటు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కొమ్మూరు కనకారావు తదితరులు ఉన్నారు. అడుగడుగునా అడ్డంకులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. తాడేపల్లి నివాసం నుంచి జగన్ కాన్వాయ్ బయలుదేరింది. భరతమాత సెంటర్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ను ముందుకు కదలనిచ్చి వెనుక వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. తాడేపల్లి ఓల్డ్ టోల్గేటు వద్ద, వెస్ట్ బైపాస్ ఎంట్రన్స్లో వెంకటపాలెం వద్ద జగన్ కాన్వాయ్ను ముందుకు పంపి మిగిలిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట సేపు ప్రతి ఒక్కచోట అరగంట సేపు వాహనాలను నిలిపివేసి ఆటంకాలు కల్పించారు. ఫ్లెక్సీలతో యువత కేరింతలు వైఎస్ జగన్ ఇంటి నుంచి బయటకు రాగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోయింది అధికారం అని, అభిమానం కాదు అంటూ ఫ్లెక్సీలతో యువకులు నృత్యాలు చేశారు. వైఎస్ జగన్ అభిమాని ఒకరు వేంకటేశ్వరస్వామి చిత్రపటంతోపాటు సత్యమేవ జయతే అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఓ మహిళ చిన్నారిని తీసుకుని రావడంతో ఆ చిన్నారిని జగన్ స్వయంగా ఎత్తుకుని ముద్దాడారు. వెస్ట్ బైపాస్రోడ్లో ఎక్కడా ప్రజలు పైకి వచ్చే అవకాశం లేకపోయినా ముళ్ల పొదలను, గ్రిల్స్ను దాటుకుంటూ రోడ్డుపైకి వచ్చి జగన్ను చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. -
ఘనంగా భక్తాంజనేయ ఆలయ వార్షికోత్సవం
సత్తెనపల్లి: పట్టణంలోని మహారాష్ట్ర వీధిలో భక్తాంజనేయ స్వామి ఆలయ 26వ వార్షికోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృత అభిషేకాలు, హోమం, విశేష అలంకార కార్యక్రమాలు నిర్వహించారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి వేదాంతం విజయనరసింహాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పిరోజి, కొత్త రామకృష్ణ, కిషోర్, బాజీ నాయన, పవన్, రాజేశ్వరి, వసుంధర, సుకన్య, ఉష, వెంకటేశ్వర్లు, శివాజీ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం వార్షికోత్సవం తెనాలి టౌన్: కొలకలూరు సమీపంలోని పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు రెండురోజులపాటు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వగాయత్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి నిర్వహణలో ఈ వేడుకలు నిర్వహించారు. వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేంద్రరావు, సావిత్రి దంపతులు శాంతి హోమం జరిపించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి యర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్బాబు, సభ్యులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ యడ్లపాడు: కొండవీడుకోట ఫెస్ట్ –2026 ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొండవీడుకోటను సందర్శించారు. కొండకింద, వేదిక, ఫుడ్కోర్టులు, వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే స్టాళ్లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పోలీస్శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో డీఎస్సీ హనుమంతరావు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 180 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చుక్కపల్లి గుంటూరు లీగల్: గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చుక్కపల్లి రమేష్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఘనంగా శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షికోత్సవం చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.2750 టీఎంసీలు. కుష్ఠువ్యాధి నియంత్రణ ర్యాలీ భట్టిప్రోలు: భట్టిప్రోలులో శుక్రవారం జాతీయ కుష్ఠు వ్యాధి నియంత్రణ ర్యాలీ నిర్వహించారు. తొలుత కుష్ఠు నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.7,200, మోడల్ ధర రూ.6,400 వరకు పలికింది. 7 -
గనులు భూగర్భశాఖలో ఏసీబీ సోదాలు
ఒంగోలుసిటీ:ఒంగోలులోని గనులు, భూగర్భజలా ల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకుతరలించింది. ఆసిఫ్ది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయన గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశారు. ఏడాదిగా ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతోపాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యు మెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారు లు తెలిపారు. అక్రమ ఆస్తు ల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22ఎకరాల వ్యవసా య భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమా రు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీనోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటారు సైకిల్, విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు తెలిపారు. ఇవికాక అసిఫ్ హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్లో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. టొయోటా హై రైడర్ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో ఒక లాకర్ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు చెప్పారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వేయర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు -
సోషల్ మీడియాలో పోస్ట్పై విచారణ
సత్తెనపల్లి: సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని పోలీస్స్టేషన్ కు పిలిపించి శుక్రవారం విచారణ చేపట్టారు. పట్టణానికి చెందిన కొణతం స్వాతి వైఎస్సార్సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగాను, మున్సిపల్ కో–ఆప్షన్ మెంబర్గాను వ్యవహరిస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో పట్టణంలో జరుగుతున్న అక్రమాలను వెల్లడిస్తూ పోస్ట్ చేశారు. ఇది తమ నాయకులను ఉద్దేశించి చేశారంటూ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు నాగరాజు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు స్వాతికి 41 నోటీసు అందించారు. అందులో భాగంగా స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. ఆమె మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని వివరాలు సేకరించి మరోసారి విచారణకు పిలిపిస్తామని చెప్పిపంపించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు జానీ, జిల్లా ఎస్టీ సెల్ చేవూరి మధుబాబు, సత్తెనపల్లి సోషల్ మీడియా అధ్యక్షులు కాటేపల్లి శేషుయాదవ్, లీగల్ సెల్ ఏడుకొండలు, అరవింద్లు స్వాతిని కలిసి సంఘీభావం తెలిపారు. -
దళితులపై మారణకాండ ఆపాలి
గుంటూరు వెస్ట్: ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు టి.ఎం. రమేషన్ దారుణ హత్యపై ప్రభుత్వం విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని రాష్ట్ర కో–కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ను దారుణంగా కొట్టిచంపారన్నారు. దీనిని దళిత, ప్రజా సంఘాలు ఖండించాయని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి విజయ్ కుమార్, కారుమూరు బెర్నార్డ్ మాదిగ, ఎస్ప్రసాదరావు మాదిగ, కె.వీరబాబు మాదిగ వినతిపత్రం అందజేశారు. బాపట్ల టౌన్: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతిచెందారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ (57) ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తెనాలిలోని హరిత హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక దేహాన్ని పొన్నూరు మండలం, గాయంవారిపాలెంలోని వారి స్వగృహం నందు ఉంచగా, బాపట్ల సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, బాపట్ల పట్టణ సీఐ ఆర్.రాంబాబు, ఇతర పోలీసు అధికారులు, సహద్యోగులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణ 1990 సంవత్సరంలో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలోకి ప్రవేశించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతిచెందారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్ఐ భౌతిక దేహానికి పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. లక్ష నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గాయంవారి పాలెం సమీపంలో గల స్మశాన వాటికలో పోలీస్ అధికార లాంఛనాలతో ఏఎస్ఐ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో గత ఏడాది నవంబరులో జరిగిన అండర్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ ఐదో సెమిస్టర్ పరీక్షలకు 6,991 మంది హాజరు అయ్యారని తెలిపారు. వారిలో 6,721 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. రీవాల్యూయేషన్కు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, యూజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. సబ్జెక్ట్కు ఫీజు రూ.1,640 కాగా, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు కూడా అంతేనని వివరించారు. వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో అస్సాంకు చెందిన కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని వాజ్పేయి విగ్రహం సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అతడు అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జేబులో డ్రైవింగ్ లైసెన్సు కూడా ఉంది. రాజధాని భవన నిర్మాణ కూలీగా లేదా డ్రైవర్గా వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరుకు చెందిన మల్లవరపు జీవారత్నం (58) గత నెల 28వ తేదీన పేరేచర్ల నుంచి టెంట్ హౌస్ సామగ్రిని ఆటోలో తీసుకుని గుంటూరు వైపుగా వెళుతున్నాడు. ఈ క్రమంలో చిన్నపలకలూరు రైల్వే గేటు సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. జీవరత్నంకు తీవ్రగాయాలు కాగా... స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ జీతాల ప్యాకేజీ కింద రూ. 1.11 కోట్ల బీమా క్లయిమ్ చెక్కును బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు గురువారం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ అధికారి సతీష్కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రూ. 1.11 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించబడుతుందన్నారు. ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కీర్తి వెంకటరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు. ఆయన భార్య నన్నూరమ్మకు ఈ క్లయిమ్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా చెక్కును అధికారికంగా అందజేశామని పేర్కొన్నారు. బ్యాంకు గుంటూరు ప్రాంతీయ కార్యాలయ ఏజీఎం, రీజనల్ హెడ్ కిరణ్రెడ్డి, విజయవాడ ప్రాంతీయ కార్యాలయ డీజీఎం, రీజనల్ హెడ్ అనుపమ్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వయిజర్ బ్రిగేడియర్ సంజయ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. -
మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
పెదకాకాని: పెదకాకాని శివాలయంలో ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై గురువారం సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్న సంతర్పణ, ప్రసాదాల పంపిణీ ఉంటాయని పేర్కొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ వేడుకను అధిక సంఖ్యలో భక్తులు తిలకించేలా ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే డి.0 నరేంద్రకుమార్ మాట్లాడుతూ శివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, సామాన్యులకు కూడా సకాలంలో స్వామి వారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డక శిరీష, తహసీల్దార్ పి.కృష్ణకాంత్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసరావు, మంగళగిరి డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, సీఐ టీపీ నారాయణస్వామి, పంచాయితీ కార్యదర్శి ప్రసాద్, ఈఓపీఆర్డీ కె. శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెదకాకాని శివాలయంలో 12 నుంచి బ్రహ్మోత్సవాలు -
కేఎల్యూకు పురస్కారాలు
తాడేపల్లి రూరల్ :వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ గోల్డ్ అవార్డులు వచ్చాయని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్ గురువారం పేర్కొన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డెలాయిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డ్స్ కార్యక్రమంలో ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన ఈ అవార్డులు ప్రదానం చేశారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు వీటిని స్వీకరించారని తెలిపారు. -
అంబటి కుటుంబానికి పరామర్శ
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా కన్వీనర్ జయప్రకాష్ (జేపీ), ఉంగుటూరు కన్వీనర్ పప్పుల శ్రీనివాసరావు, నూజివీడు కన్వీనర్ మేకా ప్రతాప్ అప్పారావులు గురువారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై, కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసిన టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా విధ్వంసం సృష్టిస్తే పార్టీ శ్రేణులు భయపడతాయని అనుకోవడం టీటీపీ అవివేకం అన్నారు. అంబటి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. రాంబాబు ఇంటిని కాపు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు పరిశీలించి, అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. -
రేపు 9, 11వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష
నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు సిద్ధం చిలకలూరిపేటటౌన్: నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు మద్దిరాల జేఎన్వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ఈ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో 2031 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 9వ తరగతికి 838 మంది, 11వ తరగతికి 1193 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పరీక్షల నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 10 గంటలకంటే ముందే చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ రెండూ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. అడ్మిట్కార్డులో పొందు పరిచిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సరి చూసుకోవాలని తెలిపారు. అడ్మిట్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడంలో ఏవైన ఇబ్బందులు, సందేహాలు ఉంటే నవోదయ ప్రిన్సిపాల్ సెల్ 9014307677, 9494676751 నంబర్లలో సంప్రదించ వచ్చన్నారు. కొరిటెపాడు(గుంటూరు): కారు డ్రైవింగ్, కంప్యూటర్ ట్యాలీ కోర్స్ల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి కారు డ్రైవింగ్, 9వ తేదీ నుంచి ట్యాలీ కోర్స్లో శిక్షణ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. వివరాలకు 0863 – 2336912, 97006 87696, 81253 97953, 99499 30155, 97034 05066 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు. -
ఉద్యోగుల బకాయిలు సత్వరం విడుదల చేయాలి
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త వినతిపత్రాల ఆందోళనలో భాగంగా గురువారం సంఘం పల్నాడుజిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు అంశంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరాయని తెలిపారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి విడుదలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన కార్యచరణ రాలేదన్నారు. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. అలాగే రానున్న బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు నిధులు కేటాయించాలని తెలిపారు. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యులతో పాటు 58 మంది శాసనమండలి సభ్యులకు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నట్టు వివరించారు. తమ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ డి.వి.సుబ్బారావు, సంఘం తాలూకా అధ్యక్షురాలు ఎం.ఫ్లోరెన్స్, ఉపాధ్యక్షుడు వందనం బాబు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ -
హక్కు లేని భూయజమానులు!
అచ్చంపేట: 300 సంవత్సరాలనుంచి తరతరాలుగా అనుభవిస్తున్న అనుభవదారులకు ఆ భూములపై ఎంతమాత్రం హక్కులు లేవు. బ్యాంకులలో రుణాలు పుట్టవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసిన రాయితీలు రావు. కనీసం ఆడపిల్లలకు పసుపు కుంకాల కింద గిఫ్ట్గా ఇద్దామన్నా ఆ భూములు రిజిష్టరు కావు. కొనుగోళ్లు, అమ్మకాలు కేవలం నమ్మకం, కాగితాలపై రాతలకే పరిమితమవుతాయి తప్ప రిజిస్ట్రేషన్లు జరగవు. ఈనాం, అగ్రహారం, సత్రం భూములు కావడం వల్లే.. మండలంలో కోగంటివారిపాలెంలో సుమారు 1380 ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. ఆ భూములను అదే గ్రామంలోని రైతులతో పాటు పొరుగు గ్రామాలకు చెందిన 450మంది సాగుచేసుకుంటున్నారు. సుమారు 300 సంవత్సరాలుగా రైతులు ఆ భూములను సాగుచేసుకుని జీవిస్తున్నారు. అయితే వారు ఆ భూములలో పంటలు వేసుకుని వచ్చే ఫలసాయాన్ని అనుభవించడానికి తప్ప మరే ఇతర అవసరాలకు ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆ భూములను విపత్కర పరిస్థితులలో విక్రయించుకోలేరు.. బ్యాంకులలో తనఖాలుపెట్టి రుణాలు పొందలేరు.. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను పొందలేరు.. కనీసం తమ ఆడపిల్లలకు పసుపు కుంకమ కింద కూడా ఇవ్వలేని దారుణపరిస్థితులలో ఆ గ్రామ రైతులున్నారు. కారణం భూములన్నీ అగ్రహారం, ఈనాం, సత్రం భూములు కావడంవల్లే ఈ దుస్థితి. ● ఈ భూములపై తమకు హక్కు కల్పించాలని కోరుతూ ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా తమ గోడు వినిపించుకోవడం లేదంటున్నారు. కంటి తడుపుచర్యగా తమ భూములను జిల్లా సర్వేయర్లచేత సర్వే చేయించి హద్దులు వేయించారని, కానీ ఆన్లైన్చేసి తమకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన యేడాదిన్నర కాలంలో నలుగురు తహసీల్దార్లు మారారని, కొత్త తహసీల్దార్లు వచ్చిన ప్రతిసారి చేద్దాం... చూద్దామని కాలయాపన చేశారని గ్రామస్తులు వాపోతున్నారు. భూములు మొత్తం అగ్రహారం బ్రాహ్మణులవే... గ్రామంలోని భూములు మొత్తం బ్రాహ్మణులవే. జమిందారుల కాలంలో వీరికి దేవాలయాలలో ధూప దీప నైవేద్యలు నిర్వహించేందుకు, వారి పాండిత్యానికి మెచ్చి కానుకల రూపంలో, గ్రామాలకు వచ్చిపోయే బాటసారులకు వసతులు కల్పించేందుకుగాను ఇచ్చిన భూములు. ఆ కాలంలో ఈ భూములపై వచ్చే ఆదాయం చాలకపోవడంతో గ్రామం నుంచి వలసలు వెళ్లిన కొందరు బ్రాహ్మణులు సుమారు 200 సంవత్సరాలక్రితం భూములను కొంతమంది గ్రామంలోని రైతులకు, పొరుగు గ్రామాలలోని రైతులకు అమ్ముకున్నారు. పక్క గ్రామాలైన రుద్రవరం, చిగురుపాడు, అంబడిపూడి గ్రామాలకు చెందిన కొందరు రైతులు వీరివద్ద భూములను కొనుగోలు చేసినవారిలో ఉన్నారు. సదావర్తి సత్రం నిర్వహణకు కేటాయించిన 80 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు రెండు, మూడేళ్లకు ఒకసారి బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఆ భూములపై యేడాదికి సగటున ఎకరాకు రూ.15,000చొప్పున 75 ఎకరాలకు రూ.11.25లక్షల ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తూనే ఉన్నామని రైతులు చెబుతున్నారు. మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి కాలగమనంలో చట్టంలో వచ్చిన అనేక మార్పులను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని ఈ భూములపై తమకు హక్కు కల్పించే అవకాశాలున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 300సంవత్సరాలుగా అంటే మూడు, నాలుగు తరతరాలుగా ముత్తాతలు, తాతలు, తండ్రుల నాటి కాలం నుంచి అనుభవిస్తున్న తమకు భూములపై హక్కులు కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ తమను మభ్యపెడుతున్నారే తప్ప తమకు న్యాయం చేయడం లేదనేది రైతుల వాదన. తరతరాలుగా అనుభవిస్తున్నా సొంతదారులు కాలేని వైనం కనీసం పసుపు కుంకుమ కింద కూతుళ్లకు భాగం ఇవ్వలేని తల్లిదండ్రులు భూములపై పుట్టని అప్పులు.. అందని ప్రభుత్వ సాయం అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం రైతుల దుస్థితి భూములపై హక్కుకై అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మా అభ్యర్థనలు మొత్తం బుట్టదాఖలు అవుతున్నాయే తప్ప అధికారులెవ్వరు దృష్టి పెట్టడంలేదు. భూ హక్కు చట్టం ప్రకారం దున్నేవాడితే భూమి అయినప్పుడు మేం మూడు, నాలుగు తరాలుగా భూములను అనుభవిస్తున్నా ఎందుకు హక్కు కల్పించడంలేదో అర్థం కావడం లేదు. భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం వల్ల బ్యాంకుల్లో అప్పులు పుట్టడంలేదు. ప్రభుత్వం నుంచి రావలసి రాయితీలు రావడంలేదు. ఈ క్రాప్ చేసుకునే వెసులుబాటు కూడా లేకపోవడంతో ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కూడా దక్కడంలేదు. ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవలసి వస్తోంది. – బోనం నాగిరెడ్డి, సర్పంచ్, కోగంటివారిపాలెం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామంలోని సాగుభూములన్నింటినీ ఆన్లైన్ చేసేందుకు జిల్లా సర్వేయర్ల బృందం వచ్చి రెండు మూడు సార్లు సర్వే చేశారు. ఉన్నతాధికారులు కూడా రైతులకు హక్కులు కల్పించే అవకాశాలు ఉన్నాయంటూ రికార్డులను కూడా తయారు చేశారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మా పరిస్థితి భూములుండి కూడా లేనట్లయింది. అధికారులు ఇప్పటికై నా ఈ భూములపై దృష్టి పెడితే అనుభవదారులకు హక్కు కల్పించి ఆన్లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే అవకాశాలున్నాయి. – సుంకర శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్, కోగంటివారిపాలెం -
అభిషేక సేవలు నిలిపివేత
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి అభిషేక సేవలు వారం రోజులుగా నిలిచిపోయాయి. గతంలో ఎన్నూడూ లేని విధంగా స్వామి వారి మూలవిరాట్ అభిషేకాలను ఈ ఏడాది పది రోజుల ముందుగానే నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆలయ అర్చకుల్లో అధికంగా ఉన్న కుటుంబాలకు అశోచం రావడం, మిగిలిన అర్చకులు పని భారంతో స్వామి వారి కై ంకర్యాలను నిర్వహించలేమని చెప్పడంతో మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. దీంతో ఆలయంలో అర్చకుల మధ్య వివాదం మరోసారి వెలుగు చూసింది. మరో పది రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో స్వామి వారికి అభిషేకాలు నిలిపివేయడంపై భక్తుల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. పోస్టుల భర్తీలో అన్యాయం త్రికోటేశ్వరస్వామి వారికి వందల సంవత్సరాలుగా కొండకావూరి వంశస్తులు వంశపారంపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తున్నారు. స్వామి వారి కై ంకర్యాల కోసం కొండకావూరి వంశస్తులు రెండు తెగులుగా విడిపోయారు. ప్రథమ భాగంలో 10, ద్వితీయ భాగంలో తొమ్మిది మంది ఉన్నారు. అశోచ సమయాల్లో రెండో భాగం వారు కై ంకర్యాలు నిర్వహించేవారు. 1999లో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒంతులు తీసివేసి ఎనిమిది మంది అర్చకులకు ఉద్యోగాలు కల్పించారు. వీరిలో ప్రథమ భాగంలో వారికి రెండు పోస్టులు, ద్వితీయ భాగం వారికి ఎనిమిది పోస్టులు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రథమ భాగంలోని కుటుంబాల వారు తమకు అర్చక పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరిగిందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నిరాశలో భక్తులు కోటప్పకొండకు వచ్చే భక్తులు స్వామి వారి అభిషేక సేవలో ఎక్కువగా పాల్గొంటారు. వారం రోజులుగా అభిషేకాలు నిలిపివేయడంతో భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. మహాశివరాత్రి వరకు స్వామి వారి అభిషేకాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అభిషేక మండపంలో నిర్వహించే అభిషేకాల్లో భక్తులు పాల్గొనాలని సూచిస్తున్నారు. అర్చకుల మధ్య వివాదమే అభిషేకాల నిలిపివేతకు కారణమని తెలుస్తోంది. తిరునాళ్లకు 15 రోజులు ముందు నుంచి అభిషేకాలు నిలిపివేయడం గతంలో ఎన్నడూ లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి అర్చకత్వంలో ప్రా ధాన్యం వలనే వివాదం ఏర్పడినట్టు సమాచారం. పర్వదినాల సమయాల్లో మెజారిటి అర్చకులు ఉన్న ద్వితీయ భాగంలోని వారికి అశోచం వస్తే కైంకర్యాలు నిలిపివేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశాం. అర్చకులను డిప్యూటేషన్పై తీసుకువచ్చి అభిషేక మండపంలో అభిషేకాలు నిర్వహిస్తున్నాం. స్వామి వారి కై ంకర్యాలు యథావిధిగా జరుగుతున్నాయి. అర్చక స్వాములకు అశోచం వచ్చినా స్వామి వారి సేవలు కొనసాగుతున్నాయి. –డి.చంద్రశేఖర్, ఈవో, కోటప్పకొండ తాజా వివాదం ఆలయంలో మూడు అర్చక పోస్టులు భర్తీకి దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారి చేసింది. ఈ పోస్టులను కూడా ద్వితీయ భాగం వారు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోస్టుల భర్తీలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని, ఈవో డి.చంద్రశేఖర్ ఒక్కొక్క పోస్టును రూ.10లక్షలకు విక్రయిస్తున్నారని అర్చకులు గతంలో ఆరోపించారు. దీంతోపాటు ప్రథమ భాగం అర్చకులు పోస్టుల భర్తీలో తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయస్థానాలను, దేవదాయ శాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తాజాగా భర్తీ చేస్తున్న మూడు పోస్టులు కూడా ద్వితీయ భాగం వారికి ఇస్తే అశోచం వచ్చిన సమయంలో స్వామి వారి కై ంకర్యాలు నిలిచిపోతాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే వారు ఎనిమిది మంది ఉన్నారని మూడు పోస్టులు వారికి ఇస్తే 11 మంది అవుతారని వాదన వినిపిస్తున్నారు. స్వామి వారి కై ంకర్యాలను పూర్తిస్థాయిలో ముగ్గురు అర్చకస్వాములు నిర్వహించడం సాధ్యం కాదని ప్రథమ భాగంలోని కుటుంబాలకు చెందిన వారు చెబుతున్నారు. -
అద్భుత పర్యాటక కేంద్రంగా కొండవీడు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాచిలకలూరిపేట: ీసఆర్డీఏ పరిధిలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కొండవీడు నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఫెస్ట్ను పురస్కరించుకొని ప్రచారకార్యక్రమంలో భాగంగా గురువారం చిలకలూరిపేటలో 2కే రన్ నిర్వహించారు. ముందుగా కొండవీడు ఫెస్ట్ పోస్టర్ను ఆవిష్కరించి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొండవీడు విశిష్టతను తెలిపే విధంగా కొండవీడు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. కొండవీడు ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్, బోటింగ్, హార్స్ రైడింగ్, ఫ్లవర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పర్యాటకుల ఆనందానికి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడు ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో డీఎఫ్వో కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ కరిముల్లా, రాష్ట్ర సాంస్కృతిక విభాగం నాయకులు కందిమళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాల్లో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్నరసరావుపేట: డ్వాక్రా స్వయం సహాయక సంఘాల రుణాలలో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా సుమారు 120 ఫేక్ సంఘాలు సృష్టించి రూ.20 కోట్ల వరకు అక్రమాలు బయటపడటం, తాజాగా డ్వాక్రా మహిళల డబ్బుతో ఆర్పీ ఉడాయించటంపై పలువురు మహిళలు సత్తెనపల్లిరోడ్డులో ధర్నా నిర్వహించారు. ఈనేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో మెప్మా, డీఆర్డీఎ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలిన విషయాల ఆధారంగా తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ ఫొటోలు, జోడించి కృత్రిమ సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అవసరమైతే వారి ఆస్తులను జప్తు చేసే చర్యలు చేపట్టాలని, ఆస్తుల అమ్మకాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్డీఎ పీడీ ఝాన్సీరాణి, జిల్లా సహకార ఆడిటర్ నాగశ్రీనివాసరావు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పన, డీఎస్పీ రమణ పాల్గొన్నారు. -
వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన
తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో కొలువైన వారాహి దేవస్థానంలో ఈనెల 11–15 తేదీల్లో జరగనున్న అమ్మవారికి కోటి కుంకుమార్చనలో ప్రజలందరూ పాల్గొనాలని పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురువారం కోటి కుంకుమార్చన ఆహ్వాన పత్రికను బాలస్వామీజీ ఆవిష్కరించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో యోగ గురువు ముద్దాభక్తుని రమణయ్య, వీ–ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామమోహనరావు, తుంగల శ్రీనివాస్, వారాహి అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు, సంగీత టీచర్ పోతూరి వెంకట ఆదిలక్ష్మి, పెనుగొండ ప్రమీలరాణి, గోపు ప్రభారాణి, కోట లక్ష్మీకుమారి, ముద్దాభక్తుని సామ్రాజ్యం, వరలక్ష్మి, లక్ష్మి, సువర్ధ తదితరులు పాల్గొన్నారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం గొరిగపూడిలోని ఓ ప్రైవేట్ గోడౌన్ పై విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు బుధవారం రాత్రి దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 450 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె సీఎస్డీటీ ఓంకార్ తెలిపారు. వీటిని అక్రమంగా నిల్వ చేసిన నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరుఎడ్యుకేషన్: జేకేసీ కళాశాల రోడ్డు లోని జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాలలో (జేసీ లా) ఈ నెల 7, 8వ తేదీల్లో 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి వేమన కుప్పుస్వామి తెలిపారు. గురువారం జేసీ లా కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్ బాబుతో కలిసి పోటీలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న మూట్ కోర్టు పోటీలకు దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల నుంచి 32 కళాశాలల విద్యార్థులు టీంలుగా పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్ పోటీలను ప్రారంభించనుండగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ముగింపు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. పోటీలకు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. తాడికొండ: ఈనెల 7వ తేదీన క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గురువారం ఉద్దండరాయునిపాలెం వద్ద జరగనున్న కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆహ్వానితులు అందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలకిక చేరుకోవాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పలు అంశాలపై సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజ లు, అధికారుల సహకారంతో హింసను రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. సాల్మన్ హత్య బాధాకరం గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగతమైన వివాదాల వలనే సంఘటన జరిగినట్లుగా నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇది ప్రేరేపితమైన సంఘటన కాదని, కేవలం యాధృచ్ఛికమైందన్నారు. తాడికొండ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాలు బుధవారం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద స్థల పరిశీలన చేసి పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్టిజీఎస్ అధికారులు ప్రకార్ జైన్, గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ పాల్గొన్నారు. గుంటూరు లీగల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై గురువారం స్పెషల్ మొబైల్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు తీసుకున్న చర్యలపై న్యాయవాదులు, లీగల్ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. బాపట్లటౌన్: భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మండలంలోని ఈస్ట్ బాపట్లలో బుధవారం భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. జేడీఏ ఎం.విజయనిర్మల మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దానికి తగినట్లుగా ఎరువులను వినియోగించుకోవాలన్నారు. విచక్షణా రహితంగా ఎరువులు వాడటం వలన పొలంలో శత్రు పురుగులతోపాటు మిత్రపురుగులు చనిపోయి పైరుకు నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ, రైతు సాధికార సంస్థ సిబ్బందికి మట్టినమూనాల సేకరణపై శిక్షణ, అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అత్తర్ హుస్సేన్, ఏడీపీఎం జక్కుల మోహన్, ఏఓ కె.శారద, వీఏఏ టి.గోపికృష్ణ, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
●ప్రతి ఒక్కరూ సందర్శించి అవగాహన పెంచుకోవాలి ●ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 30 సంవత్సరాల తరువాత ఏర్పాటు చేసిన మెడికల్ ఎగ్జిబిషన్ను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి శరీర అవయవాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఏర్పడడంతోపాటు, అనారోగ్యం బారిన పడకుండా ఎలా ఉండాలో కూడా తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలోకి పిల్లలు వచ్చేందుకు ఎగ్జిబిషన్ ప్రేరణ ఇస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా వీక్షించాలన్నారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ వైద్య విభాగంలో స్పెసిమెన్స్ ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్ను వీక్షించడం ద్వారా పలు విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఇతర బోధనా సిబ్బందిని మంత్రి అభినందించారు. జింకానా దేశానికే ఆదర్శం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో మాతృ సంస్థ అభివృద్ధికి సేవలు చేస్తున్నారని, జింకానా దేశానికే ఆదర్శమని మంత్రి సత్యకుమార్ చెప్పారు. పూర్వ విద్యార్థులు అంకిత భావంతో కళాశాలకు చేస్తున్న సేవ ఎంతో విలువైనదని, అలాంటి గుంటూరు వైద్య కళాశాల ఏపీకే గర్వకారణమన్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలి ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్యాన్సర్ బారిన పడి ప్రతి రోజూ మరణిస్తున్నారని, క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేలా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు చేస్తున్న సేవల గురించి మీడియాకు వివరించారు. గుంటూరు జీజీహెచ్లో నాట్కో ట్రస్టు సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తొలుత మంత్రి ఎగ్జిబిషన్ను గంటకుపైగా తిలకించారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వి. సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి, పలు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు పోటీలు
●న్యూకేటగిరీలో ప్రథమస్థానం కై వసం చేసుకున్న ఇర్లపాడు ఎడ్లు ●ఆరు పళ్ల విభాగంలో పెదకాకాని ఎడ్లకు ప్రథమస్థానం నాదెండ్ల: మండల కేంద్రమైన నాదెండ్లలో కొలువైయున్న నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో ఎడ్ల యజమానులను ఉత్సాహపరిచారు. మంగళవారం రాత్రి ఆరు పళ్ల విభాగంలో పోటీలు పూర్తయ్యాయి. మొత్తం ఎనిమిది జతలు పాల్గొనగా గుంటూరు జిల్లా, పెదకాకాని ఆలా రాజేష్ యాదవ్, ఖాదర్ మస్తాన్కు చెందిన ఏఆర్వై అండ్ ఎంకేఎం బుల్స్ 3,500 అడుగుల దూరాన్ని లాగి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ప్రత్తిపాడు పమిడి అంజయ్యచౌదరి ఎడ్ల జత 3,396 అడుగుల దూరంలాగి రెండో స్థానం, నరసరావుపేట మండలం రావిపాడు వై మనోజ్చౌదరి ఎడ్ల జత 3250 అడుగుల దూరం లాగి మూడోస్థానం, పత్తిపాడు పమిడి అంజయ్యకు చెందిన మరో ఎడ్ల జత 2,754 అడుగుల దూరం లాగి నాలుగోస్థానం, బాపట్ల జిల్లా దరవాడికొత్తపాలెం మంచాల రమాదేవి ఎడ్ల జత 2750 అడుగుల దూరం లాగి ఐదోస్థానం, కాకుమాను మండలం కొండబాలవారిపాలెం పెద్ది రవీంద్రబాబు ఎడ్ల జత 1988 అడుగుల దూరం లాగి ఆరోస్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు, షీల్డులు అందించారు. న్యూకేటగిరి విభాగంలో... బుధవారం ఉదయం న్యూకేటగిరి విభాగంలో హోరాహోరీగా జరిగిన పోటీల్లో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ సర్పంచ్ మంగు రమాదేవి, ఏడుకొండలు ఎడ్ల జత 4,783 అడుగుల దూరం లాగి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో 14 ఎడ్ల జతలు పాల్గొనగా, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ ఎడ్ల జత 4,507 అడుగుల దూరం లాగి రెండో స్థానం, కృష్ణాజిల్లా, ఘంటసాలకు చెందిన ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ ఎడ్ల జత 4,231 అడుగుల దూరం లాగి మూడోస్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్లను అందించారు. బుధవారం సాయంత్రం వరకూ న్యూకేటగిరీలో జరిగిన పోటీల్లో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు మండు ఏడుకొండలు ఎడ్ల జత ప్రథమస్థానంలో నిలవటంతో అభిమానులు కేరింతలతో సందడి చేశారు. గురువారంతో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో, చివరిరోజు శుక్రవారం జాక్పాట్ విభాగంలో పోటీలతో ముగియనున్నాయి. -
మచ్చే కదా అని వదిలేస్తే ముప్పే..!
సత్తెనపల్లి: శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తెల్ల రాగి మచ్చలు ఉంటే జాగ్రత్త .. ఎందుకంటే ఆ మచ్చలతోనే ప్రమాదం పొంచి ఉంది. శరీరంపై ఎక్కడ మచ్చలు ఉన్నా మొహమాటం పడకుండా వైద్య సిబ్బందికి చూపించాలి. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వైద్యులకు తెలియజేయాలని చెబుతున్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగంగా ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వేలో భాగంగా అనుమానిత మచ్చలు, తెలుపు, రాగి మచ్చలతోపాటు పొడలు శరీరంపై ఉంటే నిర్భయంగా ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి తెలియచేయాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలోని 28 మండలాల పరిధిలో 530 గ్రామ పంచాయతీలు, 13 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 26 అర్బన్ హెల్త్ సెంటర్లు పరిధిలో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. గత నెల 30న జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ జిల్లా అధికారిణి డాక్టర్ యు.మాధవీలతలు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. దీంతో ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆరు నెలలకు ఒకసారి చేస్తున్న సర్వేలో 2025 ఏప్రిల్ ఒకటి నుంచి 2026 జనవరి ఆఖరి వరకు జిల్లాలో 62 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 పీబీ (పాసివ్ బ్యాసిలరీ) కేసులు కాక 45 ఎంబీ(మల్టీబ్యాసిలరీ) కేసులు ఉన్నాయి. ఇవి కాక జిల్లాలో 77 కుష్ఠువ్యాధి కేసులు ఉండడంతో వారికి ఎండీటీ కోర్సుతో మందులు ఇచ్చి వైద్య సేవలు అందించడంతో కుష్ఠువ్యాధి నుంచి కోలుకొని యథాస్థితికి తీసుకు వచ్చారు. వ్యాధి లక్షణాలు ఇవే... ● కాళ్లు, చేతులపై స్పర్శ జ్ఞానం లోపించడం ● ముఖంపై చర్మం నూనె రాసినట్లు నిగనిగలాడుతుంది ● ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం ● చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం ● చేతుల నుంచి వస్తువులు జారిపోవడం ● వేళ్లు వంకర్లు తిరగడం, చర్మం పాలిపోవడం, రాగి రంగులోని స్పర్శ లేని మచ్చలు ● కుష్ఠు వ్యాధికి సంబంధించిన మచ్చలపై చెమట పట్టకపోవడం, కనుబొమ్మలు లేదా వెంట్రుకలు రాలిపోవడం చికిత్స ఇలా ... బహుళ ఔషధ చికిత్స (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా కుష్ఠువ్యాధి పూర్తిగా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రారంభ దశలో గుర్తించి సక్రమంగా చికిత్స చేయించుకుంటే కుష్ఠువ్యాధితో పాటు అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు. 6 నుంచి 12 నెలల పాటు ఎండీటీ మందులతో చికిత్స తీసుకుంటే కుష్ఠు పూర్తిగా నయం అవుతుంది. మందులతో చికిత్స తీసుకుంటే కుష్ఠువ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సర్వేలో వివరాలు నమోదు చేస్తూ.. సర్వేలో భాగంగా శరీరంపై మచ్చలు, అధిక మోతాదులో పొడలు ఉంటే సిబ్బంది వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వ్యక్తిని పరిశీలించి కుష్ఠువ్యాధి అవునో కాదో నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కుష్ఠువ్యాధిగా తెలితే సంబంధిత వ్యక్తి పేరు నమోదు చేసుకొని చికిత్స ప్రారంభిస్తారు. కుష్ఠువ్యాధి మైక్రో బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ప్రతి ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఏఎన్ఎం, సూపర్వైజర్, ఆశా కార్యకర్తలు ఈ నెల 13 వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయనున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు, స్వయం సహాయక సంఘాలకు, మురికివాడల్లో ప్రజలకు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సర్వే చేయడానికి వస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి ప్రజలు సహకరించాలి. కుష్ఠువ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత భయపడాల్సిన పనిలేదు. ఎండీటీ మందు వాడితే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. శరీరంలో తెలుపు, రాగి మచ్చలను గుర్తించి అనుమానిత వ్యక్తుల పేర్లు నమోదు చేసి వైద్యాధికారులు దృష్టికి తీసుకువెళ్లి వారికి ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నాం. –డాక్టర్ యు.మాధవీలత, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణాధికారిణి, పల్నాడు ఇంటింటా కుష్ఠువ్యాధి నిర్ధారణ సర్వే స్పర్శ లేని మచ్చలతో ప్రమాదం మచ్చలుంటే చూపించాలంటున్న వైద్యులు ఈ నెల 13 వరకు కొనసాగనున్న సర్వే -
అంబులెన్స్కు స్వచ్ఛందంగా దారిచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
గుంటూరు రూరల్: సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వం కలిగిన వారు వైఎస్సార్ సీపీ శ్రేణులని బుధవారం మరో సారి నిరూపించారు. విషయమేమిటంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు నగరంలోకి రానుండగా.. స్వాగతం పలికేందుకు ఏటుకూరు బైపాస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అశేష జనసందోహం ఎదురు చూస్తున్నారు.. ఈక్రమంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి వెళ్లేందుకు అంబులన్స్ రావడంతో అంతా అడ్డుతొలగి.. స్వచ్ఛందంగా దారిచ్చారు. అంతేకాకుండా.. దారిపొడవునా యువకులు ద్విచక్ర వాహనాలపై వెళుతూ రోడ్డుపై ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు అంబులెన్స్ వస్తుంది... పక్కకు తొలగండి అంటూ అంబులెన్స్కు దారిచ్చి పంపారు. -
నేతలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులుసాక్షి ప్రతినిధి, గుంటూరు: అడుగడుగునా అంతులేని అభిమానం... ఎక్కడికక్కడ కట్టడికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించినా ఆగని జనసందోహం... ఇవీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో కనిపించిన దృశ్యాలు. అధికార పార్టీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం పరిశీలించి, కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగుడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెడ్బుక్ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. వైఎస్ జగన్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆయన్ను చూసేందుకు పోటెత్తారు. తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్లోని రాంబాబు ఇంటికి ఆయన చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. తరలివచ్చిన అభిమానులు కుంచనపల్లి క్రాస్రోడ్స్, కాజ టోల్గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. అంబటి ఇంటికి చేరే సరికి సాయంత్రం 4.35 గంటలు అయ్యింది. మరోవైపు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటివరకూ ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జనసందోహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకుల మధ్య కూడా జగన్ పర్యటన విజయవంతం అయ్యింది. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద పెట్టి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలివచ్చారు. గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. పల్నాడు జిల్లా నుంచి ఎవ్వరూ రాకుండా దిగ్బంధించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరీ అడ్డంకులు సృష్టించారు. బందోబస్తు హడావుడి ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు రూరల్ మండలం బొంతపాడు వై జంక్షన్ వద్ద డీఎస్పీలు భానూదయ, అరవింద్తోపాటు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, రోప్ పార్టీలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. డ్రోన్ కెమెరాలతో పర్యటనపై డేగ కన్ను వేశారు. శనివారం రాత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ మూకలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్ను వైఎస్ జగన్ పరామర్శించారు. అంబటి ఇంటికి వెళుతున్న దారిలో ఏటుకూరు బైపాస్లోగల ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ కార్యాలయం వద్ద టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన అశోక్, పూర్తిగా ధ్వంసమైన కారును జగనన్న తన వాహనం నుంచి అభిమానుల మధ్యనే పరిశీలించారు. ఎట్టకేలకు... ఉదయం 10 గంటల నుంచి అంబటి నివాసం దగ్గరకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులను పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. సిద్ధార్థనగర్కు వెళ్లే అన్ని రహదారులను మూసి వేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేశారు. గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి నివాసానికి వచ్చేందుకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. ముఖ్య నేతలు హాజరు కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, విడదల రజిని, పేరి నాని, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, సింఽహాద్రి రమేష్, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురేష్, సమన్వయకర్తలు షేక్ నూరిఫాతిమా, వనమా బాలవజ్రబాబు (డైమండ్బాబు), దొంతిరెడ్డి వేమారెడ్డి, అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్బాబు, బలసాని కిరణ్, ఈవూరు గణేష్, డాక్టర్ సుధీర్రెడ్డి, అవినాష్, నాయకులు పోతుల మహేష్, షేక్ గులాం రసూల్, నిమ్మకాయల రాజనారాయణ, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న జగనన్నఅంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో పాల్గొనేందుకు సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన 37 మంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక వాహనంలో గుంటూరు బయలుదేరారు. సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుంటూరు సమీపంలోకి చేరుకోగానే హైవేపై జన సంద్రం పోటెత్తింది. జననేతను చూసేందుకు అభిమానులు మండే ఎండను సైతం లెక్కచేయక బారులు తీరారు. అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో హైవేతోపాటు ఏటుకూరు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో మెయిన్ హైవేపై నుండి సర్వీసు రోడ్డులోనికి జగన్ కాన్వాయ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించింది. కాన్వాయ్ కనిపించగానే జననేతను చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు హైవేపైకి పరుగులు పెట్టారు. చేతులు ఊపుతూ, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో జగన్ కారుపై నుండే ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని, భయపడవద్దని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘మాజీ మంత్రి అంబటి కాపు కులంలో ఒక టైగర్. విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టడం తగదు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలన్నింటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీ సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని’’ హెచ్చరించారు. -
ప్రతిష్టాత్మకంగా కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరునాళ్ల ఏర్పాట్లపై మూడవ సమీక్షా సమావేశం మంగళవారం కోటప్పకొండలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఆనంతో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, దేవదాయ శాఖ కమిషనర్ రాంచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఎఫ్ఓ కృష్ణప్రియలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గత ఏడాది స్వామి వారిని లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని, ఈ ఏడాది ఈ సంఖ్య 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వలన దర్శనానికి వచ్చే మహిళల సంఖ్య అధికంగా ఉంటుందని, అంచనాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగ హోదాలో ఈ ఏర్పాట్లకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఆన్లైన్లో వీఐపీ టికెట్ అమ్మకాలు దేవదాయ శాఖ కమిషనర్ రాంచంద్రమోహన్ మాట్లాడుతూ.. తిరునాళ్ల రోజు స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీ భక్తుల కోసం ఈ ఏడాది నుంచి టికెట్ విధానం తీసుకువస్తున్నట్టు తెలిపారు. ధరను రూ.300గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 10 వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి రోజు 1500 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు. టికెట్ తీసుకున్న యాత్రికులు సూచించిన టైమ్స్లాట్లో దర్శనానికి రావాల్సి ఉంటుందని సూచించారు. ఉచిత దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాప్రతినిధుల సిఫార్స్ లెటర్ల మేరకు ఆలయ ఆవరణలో తిరునాళ్ల రోజు వీఐపీ టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. భక్తులను చేరవేసేందుకు 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. 95 బస్సులు కింద నుంచి కొండమీదకు నడపుతున్నట్టు వివరించారు. -
రూ. కోటితో ఉడాయించిన ఆర్పీ
నరసరావుపేట టౌన్: డ్వాక్రా మహిళల డబ్బులతో ఉడాయించిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు రోడ్డెక్కారు. బుధవారం సత్తెనపల్లి స్టేడియం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు బాధిత మహిళలు మాట్లాడుతూ చంద్రబాబునాయిడు కాలనీలో ఆర్పీగా పనిచేస్తున్న చల్లా కోటేశ్వరి 30 గ్రూప్ల వద్ద సుమారు రూ. కోటి వరకు సేకరించి బ్యాంక్లో జమ చేయలేదన్నారు. ఏడాదిగా ఇలా చేస్తున్నా విషయం రెండు నెలల క్రితం తమకు తెలిసి ఆమెను అడిగేందుకు వెళ్లగా ఆర్పీ ఇంటికి తాళం వేసి ఉందన్నారు. డ్వాక్రా రుణాలకు సంబందించి డబ్బులు చెల్లించాలని బ్యాంక్ల నుంచి నోటీసులు అందాయన్నారు. బ్యాంక్ ప్రతినిధులు ఇళ్ల వద్దకు వచ్చి డబ్బులు జమచేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, మెప్మా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. నెల అవుతున్నా ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. దీంతో తామంతా రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నా చేయటంతో రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవటంతోపాటు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. -
మహాదత్తునికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలో శ్రీ దత్తపీఠంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజలు బుధవారంతో ముగిశాయి. ఉదయాన్నే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో మహాదత్తహవనం చేసి పూర్ణాహుతి నిర్వహించి భక్తుల గోత్రాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను శ్రీదత్తపీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 2025 మార్చి 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 3వ తేదీ వరకు లెక్కింపు చేశారు. 11 నెలలకుగాను రూ.4,70,918 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవదాయ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, తెనాలి దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించే కొండవీడు ఫెస్ట్ ద్వారా కొండవీడు వైభవాన్ని తిలకించేందుకు ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియా ద్వారా తన సందేశాన్ని రిలీజ్ చేశారు. తెలుగుజాతి ఘనచరిత్ర, వీరత్వానికి ప్రతీక కొండవీడు కోట అన్నారు. చరిత్ర, వైభవాన్ని నేటితరానికి పరిచయం చేస్తూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హలీరైడ్, బోటింగ్, శాండ్ ఆర్ట్, లేజర్షో, క్రాకర్స్షో, హార్స్ రైడింగ్తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. గాయకులు గీతామాధురి, సమీరా భరద్వాజ్, జబర్దస్ట్ కళాకారులు అలరించనున్నారని తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. పలు పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి చూసి ఆనందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్జేసీ చంద్రశేఖర ఆజాద్ బుధవారం ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్తో కలిసి పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, పాలు సరఫరా పాయింట్లను పరిశీలించారు. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు సాధారణ దర్శనాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, వీఐపీలు స్వామి వారి దర్శనానికి వచ్చిన సమయంలో తగు ఏర్పాటు చేయాలని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్కు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆర్జేసీ సూచించారు. -
అప్రమత్తంగా ఉండాలి
ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండాలి. క్యాన్సర్ రాకుండా తాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారం తీసుకునేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. క్యాన్సర్ కణాలతో సలాడ్లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. పీచు పదార్థం ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు శారీరక వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా, పొగాకు నమలటం లాంటి దురలవాట్లకు దూరండా ఉండాలి. – డాక్టర్ కందుల రామ్, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు. -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
ప్రథమస్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లా గిత్తలు రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176 వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా జరిగాయి. సీనియర్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనను చూడటానికి అనేక ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హూజూరునగర్కు చెందిన ఏఎస్పీ సుంకు సురేందర్ రెడ్డి ఎడ్లు 2,656.8 అడుగులు దూరంలాగి ప్రథమ బహుమతి రూ.2.70 లక్షల విలువైన రాయల్ ఇన్ఫీల్డ్(బుల్లెట్)ను కై వశం చేసుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,637.10 అడుగుల దూరంలాగి 2వ బహుమతి రూ. 1.40 లక్షల విలువైన యూనికార్న్ బైక్ను దక్కించుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ ఎడ్లు 2,519 అడుగులు దూరంలాగి 3వ బహుమతి కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరంకు చెందిన కాసనేని రాజాచౌదరి, వల్లభనేని మోహన్రావు ఎడ్లు 2,511.2 అడుగుల దూరంలాగి లాగి 4వ బహుమతి, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 2,502.4 అడుగులు దూరంలాగి 5 వ బహుమతి, నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు గ్రామానికి చెందిన బీరం సుబ్రమణ్యేశ్వరరెడ్డి, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన బాపతి కొండారెడ్డి కంబైన్డ్ డెడ్లు 2,342 అడుగుల దూరంలాగి 6 వ బహుమతి, వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,141.4 అడుగుల దూరంలాగి 7 వ బహుమతి, నంద్యాల జిల్లా పెద్దకోట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి ఎడ్లు 2,110.4 అడుగులతో 8 వ బహుమతి, నంద్యాల జిల్లా టి.హుసేనాపురం గ్రామానికి చెందిన ఎం. రామచంద్రారెడ్డి ఎడ్లు 2,042 అడుగులు దూరంలాగి 9 వ బహుమతి, కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామా నికి చెందిన అక్కినేని ముకుల్ సత్య చౌదరి ఎడ్లు 1,815 అడుగులు లాగి 10వ బహుమతి రూ. 14 వేలను గెలుచుకున్నాయి. ● అదేవిధంగా 11, 12, 13, 14, 15 జతలకు పోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ విభాగంలో 15 జతలు పాల్గొనగా నిర్వహించిన బలప్రదర్శనలో మొత్తం 8 విభాగాలలో 123 జతల ఎడ్లు పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, గొంటు సుమంత్రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బి. రామకృష్ణ, ఎం. రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, జె. రాజేష్రెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, దుర్గి శ్రీనివాసరావు వ్యవహరించారు. -
అంగన్వాడీలకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం
సత్తెనపల్లి: 2026–27 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీలకు వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోను బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం సత్తెనపల్లిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ ఈనెల 12న అంగన్వాడీ కేంద్రాలు మూసేసి ప్రాజెక్ట్, మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ నిరసనలు జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చిందన్నారు. 2026–27 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్తో సహా దాదాపు ఒక కోటి మంది స్కీం వర్కర్ల దుస్థితి, హక్కులపై మాట్లాడకపోవడాన్ని కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఐసీడీఎస్, ఇతర స్కీమ్ వర్కర్లకు ప్రాథమిక సేవల పథకాలలో మౌలిక సదుపాయాలు, సేవలు నాణ్యత పై బడ్జెట్ మౌనంగా ఉందన్నారు. కేటాయింపుల్లో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. ప్రాజెక్టు గౌరవాధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాల ద్వారా కార్మికులకు కనీస వేతనాలు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు కేవలం రూ. 2,700, అంగన్వాడీ సహాయకులకు నెలకు రూ.1,350 వేతనంగా చెల్లిస్తుంద న్నారు. 2018 నుండి సామాన్య ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సేవలను అందించే ఈ గ్రాస్ రూట్ స్థాయి కార్మికుల వేతనంలో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎం.హరిపోతురాజు మాట్లాడారు. ముందుగా బడ్జెట్ ప్రతులు దగ్ధం చేసిన అనంతరం సీడీపీఓ టి.శ్రీలతకు వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి అహల్య, సెక్టార్ లీడర్లు ప్రభావతి, ముంతాజ్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఉన్నారు. -
ముందే గుర్తిస్తే.. మెరుగైన వైద్యం
గుంటూరు మెడికల్ పూర్వం రాచపుండుగా పిలిచే క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం తప్పదనే వారు. క్యాన్సర్ సోకగానే వ్యాధికి మందు లేదనే భయాందోళనలతో అనేక మంది చనిపోయేవారు. నేడు ఆధునిక వైద్యం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించే అత్యాధునిక నిర్ధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా కట్టడి చేసే వ్యాక్సిన్లు సైతం మార్కెట్లోకి వచ్చాయి. యువ క్రికెటర్ యువరాజ్సింగ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. వ్యాధి పట్ల అవగాహన కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదిగే గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పొగాకు ఉత్పత్తుల కారణంగా 40 నుండి 45 శాతం, కాలుష్యం వల్ల 8 నుంచి 10 శాతం, మద్యం వల్ల మూడు శాతం క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్ద రోజూ దాదాపు 10 నుంచి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. సంవత్సరం ఓపీ రోగులు ఆపరేషన్లు 2021 11,719 168 2022 13,105 417 2023 14,648 753 2024 16,359 823 2025 19,598 1,131 -
నిలిచిన మీటర్ రీడింగ్
సత్తెనపల్లి: మూడు రోజులుగా విద్యుత్ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామం విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లులు తీయడం ఆలస్యమైతే .. విద్యుత్ వినియోగంలో స్లాబ్ పెరిగి పోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో ఆర్థికంగా అతలాకుతులం అవుతుంటే .. మరింతగా బిల్లులు పెరిగితే ఎలాగనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా 7,48,449 గృహ, వాణిజ్య సర్వీసులు, 594 వరకు హెచ్టీ సర్వీసులు ఉన్నాయి. నెలకు ఎల్టీ సర్వీసులకు 309.6 మిలియన్ యూనిట్ల, హెచ్టీ సర్వీసులకు 179.17 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. ప్రతి నెల ఎల్టీ సర్వీసుల నుంచి రూ. 51.12 కోట్లు, హెచ్టీ సర్వీసుల నుంచి రూ. 87.72 కోట్లు బిల్లులు విద్యుత్ శాఖకు వినియోగదారులు చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 246 మంది విద్యుత్ మీటర్ రీడర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 11వ తేదీ లోపు మీటరు రీడింగ్ తీస్తారు. ఒక మీటర్కు రీడింగ్ తీసినందుకుగాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్ పట్టణ ప్రాంతాల్లో రూ. 6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్ చేయటంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ. 0.75 పైసలు పెంచారు. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, రీడింగ్ పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహమింపులు పోగా .. విద్యుత్ మీటర్ రీడర్ కు చేతికి ఒక్కో మీటర్కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్క మీటర్ రీడర్ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్ తీస్తారు. దీన్నిబట్టి చూస్తే వారి ఆదాయం ప్రతినెలా కేవలం రూ. 7 వేల నుంచి రూ. 10 వేల లోపే ఉంటుంది. ప్రాంతాన్ని, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో సంస్థలో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు సిబ్బందికి ఉపాధి దక్కదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకిచిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం వాటిని అమర్చేందుకు వేగంగా అడుగులు వేయడంపై రైతుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండి పడుతోంది. వినియోగదారులు విద్యుత్ రీచార్జీపై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. విద్యుత్తు లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి రంగంలో సంక్షోభం నెలకొంటోంది. సాఫీగా సాగే వ్యవస్థలను సైతం గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే అనేక వ్యవస్థల నిర్వీర్యానికి ఆజ్యం పోసిన సర్కారు తాజాగా విద్యుత్ స్పాట్ బిల్లింగ్పై పడింది. విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపక పోవడంతో వారు సమ్మె బాట పట్టారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్న సమయంలో మీటర్ రీడర్లు ఆందోళన చెందారు. దీంతో స్పందించిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలోనే ఉపాధి కల్పిస్తామని భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేసింది. -
వైభవం.. సాయిబాబా మందిర వార్షికోత్సవం
మంగళగిరి టౌన్: దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి గాంచిన మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో వున్న భగవాన్ శ్రీ సత్యషిరిడీసాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం బాబాకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ ఆధ్వర్యంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. పలువురు ప్రముఖులు వార్షికోత్సవానికి హాజరై బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిన్నారులకు, పెద్దలకు వినోదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, హ్యాండ్ల్యూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రధాన కార్యదర్శి సిసోడియా, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు, రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహనరావు, ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా కోమటి జయరాం, రిటైర్డ్ డీజీపీ మాలకొండయ్య, గంగాధర్ నాదెళ్ళ, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పంతల సురేష్, ఎన్ఆర్ఐలు యలమంచిలి జగదీష్బాబు, కావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ధన్యవాదాలు తెలిపారు. -
గొలుసు దొంగల విజృంభణ
నరసరావుపేట టౌనన్: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో చోటు చేసుకున్న గొలుసు చోరీ కేసుల్లో పురోగతి లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరులు చెలరేగిపోతున్నారు. నరసరావుపేటలో అసలు పోలీసింగ్ ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇవిగో నిదర్శనాలు.. బయటకు రావాలంటే బెంబేలు.. పట్టణంలో ఓ వైపు గొలుసు దొంగతనాలు, మరో వైపు ద్విచక్రవాహన చోరీలు పెరిగి పోవటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తులో ఇద్దరు యువకులు బైకులపై వచ్చి బంగారు గొలుసులు లాక్కెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహన దొంగతనాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలకు రక్షణ కరువైందని యజమానులు వాపోతున్నారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. జిల్లా కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నా చోరులు కనీసం లెక్క చేసే పరిస్థితులు కనిపించడం లేదు. చంద్రబాబు పాలనలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ నుంచి.. బజారుకు వెళ్తున్న గృహిణి వరకు... ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. పోలీసులకు బహిరంగ సవాల్ విసురుతున్నారు. -
అనధికార లే అవుట్లు ధ్వంసం చేసిన సీఆర్డీఏ
అమరావతి: మండలపరిధిలోని కర్లపూడి, లేమల్లె, ఎండ్రాయి, నరుకుళ్ళపాడు, అమరావతి, ధరణికోట, పెదమద్దూరు, వైకుంఠపురం, నెమలికల్లు గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను ఏపీ సీఆర్డీఏ ఆధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. సీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగం అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 22 ఎకరాలలోని 15 అనధికార లే అవుట్లను ధ్వంసం చేశారు సీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ గుంటూరు జోనల్ జాయింట్ డైరెక్టర్ మహాలక్ష్మి దొర, జోనల్ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ పావని, వార్డ్ ప్లానింగ్ – రెగ్యులేషన్ సెక్రటరీ రవీంద్రలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జాయింట్ డైరెక్టర్ మహాలక్ష్మి దొర మాట్లాడుతూ మండలంలోని కర్లపూడిలోని సర్వే నెంబర్లు 292 295, 297, 299, 325, 332 సర్వేనెంబర్లలో ఎండ్రాయిలో 89,198, నరుకుళ్లపాడులో 123, ధరణికోటలో 346,99, అమరావతిలో 64, 65,151, పెదమద్దూరులో 77, వైకుంఠపురంలో 264, నెమలికల్లులో 122 సర్వేనెంబర్ల భూముల్లో ఏర్పాటవుతున్న అనధికార లేఅవుట్లను ధ్వంసం చేశామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
జీజీహెచ్లో ఉచితంగా వైద్య సేవలు
గుంటూరు జీజీహెచ్లోని నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్ను అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించాం. రోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ వైద్య సేవలు, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నాట్కో ట్రస్టు, ప్రభుత్వ భాగస్వామ్యంలో సుమారు రూ. 45 కోట్లతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 125 పడకలతో ఈ సెంటర్ నిర్మించాం. మరో రూ.18 కోట్లతో 125 పడకల క్యాన్సర్ సెంటర్ను నిర్మిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ఆపరేషన్లు, మందులూ ఉచితం. –నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ
వినుకొండ: వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తూ పదోన్నతిపై ఆర్ఓగా వినుకొండలోనే విధులు నిర్వహిస్తు దర్శి అదనపు మున్సిపల్ కమిషనర్గా వ్యవహిస్తూ.. మహేష్ ఇటీవల అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయ్యారు. దీనిపై ఏసీబీ అధికారుల విచారణ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్తోపాటు మున్సిపల్ మేనేజర్లను ఆర్ఐ మహేష్కు సంబంధించి సర్వీసు వివరాలు తెలుసుకున్నారు. ఏసీబీ అధికారుల రాకతో మున్సిపల్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఏఎన్యూ(పెదకాకాని): రెగ్యులర్ బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో 2025లో జరిగిన బీఈడీ మూడో సెమిస్టర్కు 6534 మంది హాజరు కాగా వారిలో 5650 మంది ఉత్తీర్ణులయ్యారు. 86.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఈనెల 12వ తేదీలోగా రీవాల్యేషన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీవాల్యేషన్ దరఖాస్తులను పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 13వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రీవాల్యేషన్ ఫీజు రూ.1860 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు రూ.2190 గా నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలన్నారు. -
బడ్జెట్లో చేనేత కార్మికులకు మొండిచెయ్యి
సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగ కార్మికులకు మొండిచేయి చూపిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఫణిదం చేనేత సహకార సంఘం బిల్డింగ్ సమీపంలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి మాత్రం కేవలం రూ.200 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని బీజేపీ నేతలు పార్లమెంటులో మాట్లాడారన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల కాలంలో రూ. 5,093.56 కోట్లు మాత్రమే కేటాయించి చేనేతను మరణశయ్యపైకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ లూమ్ను ప్రోత్సహిస్తూ చేనేతను దెబ్బతీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన పావలా వడ్డీ, యారన్ సబ్సిడీ, రిబేట్ కింద ఇవ్వవలసిన రూ. 23 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.200 యూనిట్లు ఉచిత కరెంటు, చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ. 25 వేలు స్కీం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరిగే చలో మంగళగిరి మహాగర్జనలో చేనేత కార్మికులు, చేనేత శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చలో మంగళగిరి మహాగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎ.వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి.ప్రభాకర్ రావు, వి.చిన్నదిబ్బయ్య, మోపర్తి బాబు రాజు, జి.యేసు రత్నం, బిట్రా పానకాలు, గడ్డం సుస్సులోవ్, కట్ట రమాదేవిలు పాల్గొన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ -
అందుబాటులో ఆధునిక వైద్యం
క్యాన్సర్ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జెనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా వ్యాధిని చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తెలుస్తుంది. ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. బీఆర్సీఏ–1, 2 పరీక్షల ద్వారా కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతరులకు వస్తుందా రాదా అని నిర్ధారించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్సుల ద్వారా అనేక రకాల క్యాన్సర్లకు ఉచిత వైద్య సేవలు లభిస్తున్నాయి. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు -
జీఎస్టీ సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
పన్ను ఎగవేతలు అరికట్టండి నరసరావుపేట: జిల్లాలో పన్ను ఎగవేతలను అరికట్టాలని, చట్టప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రతి రూపాయి వసూలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జీఎస్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు పన్ను వసూళ్ల విషయంలో పన్నుల శాఖకు సహకరించాలన్నారు. శాఖల వారీగా వ్యాపారాలలో ఉన్న సంస్థల వివరాలు పన్నుల శాఖకు ఇవ్వాలన్నారు. ఆయా సంస్థలు సక్రమంగా పన్నులు చెల్లించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలం వ్యాపారంలో కొనసాగ గలవని స్పష్టం చేయాలన్నారు. గుంటూరు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్ పాత్రో, డిప్యూటీ కమిషనర్ జి.మురళీకృష్ణ, ఎల్డీఎం రామ్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మెగా జాబ్మేళా సద్వినియోగం చేసుకోండి సత్తెనపల్లిలోని మెయిన్రోడ్డులో గల డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల ఆరున నిర్వహించే మెగా జాబ్మేళాను విజయవంతం చేయాలని ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి తమ్మాజీరావు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం జాబ్మేళాకు చెందిన వాల్పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా, పరిసర ప్రాంత యువతీయువకులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిలో సుమారు 30కి పైగా బహుళ జాతి కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. నెల జీతం విద్యార్హతను బట్టి సుమారు రూ.13 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంటుందన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ చదివి 18–35ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగులు ఉదయం 9– సాయంత్రం 4 గంటల మధ్య నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.


