breaking news
Palnadu
-
యువ వైద్యులకు అండగా ఉంటాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్యవిద్యను పూర్తి చేసుకుని, సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులను పై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్లు చేయడం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని మండిపడ్డారు. యువ వైద్యులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారికి పీఆర్ వచ్చే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో వేధింపులకు ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వర్గాలను వేధించి పరాభవిస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. వారంతా ప్రభుత్వంపై శాంతి యుతంగా నిరసనకు దిగితే ఈడ్చి పారేశారు. ఉన్నత చదువులు చదివి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని 'డాక్టర్స్ డే' అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం అవమానించింది.పేద కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యనభ్యసించడంతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకండా వేధించడానికి ప్రభుత్వానికి మనసెలా ఒప్పిందో అర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏడాదే ఉంటే ఏపీలో మాత్రం మూడేళ్లపాటు చేయాలనే నిబంధన పెట్టి వేధిస్తున్నారు. ఇంటర్న్షిప్ చేసిన వారిని రిలీవ్ చేయడం లేదు. పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టడమో, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడమో లేదా పీజీలు రాసుకుంటున్నారు.కానీ ఒక్క ఏపీలో మాత్రమే ఇంటర్న్షిప్ చేసిన దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను తెలియపర్చడానికి హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిస్తే ఆయన వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. దీంతో మెడికల్ విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి పూనుకుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువ వైద్యులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ని కలిశారు. వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుని వారికి న్యాయం చేసేదాకా పోరాడుతుంది.వైద్య రంగంపై చంద్రబాబు నిర్లక్ష్యంరాష్ట్రంలో మొత్తం వైద్య రంగాన్నే చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. సీఎంగా వైఎస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం, సీట్లు అక్కరలేదని కేంద్రానికి లేఖ రాయడం, నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేయించడం వంటి చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధుల వైద్య విద్య ఆశలపై నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంబీబీయస్ డాక్టర్లు, పీజీ డాక్టర్లను నియమించుకోకుండా ఎలా వైద్యం అందించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో వైద్యారోగ్యశాఖలో ఐదేళ్లలో 54 వేలమంది నియామకం జరిగితే అందులో డాక్టర్లే 3800 మంది ఉన్నారు.మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ లేరంటూ వైద్యం నిరాకరిస్తున్నారు. వైద్య విద్య పూర్తిచేసుకుని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు చేయకుండా వేధిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఆయుష్మాన్ భారత్లో కలిపే పేరుతో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి లేకుండా ఆపరేషన్లు జరిగితే ఇప్పుడు కూటమి పాలనలో యూజర్ చార్జీల పేరిట రోగులను దోచుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో కోపేమెంట్ల పేరుతో వసూలు చేసి ఆస్పత్రులను నడిపించుకోవాల్సిన పరిస్థితి ఆస్పత్రి యాజమాన్యాలది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. -
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
‘మిషన్ ఉన్నతి’తో రైల్వే ఉద్యోగులకు మేలు
లక్ష్మీపురం: ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, కార్యాచరణ కొనసాగింపునకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పట్టాభిపురం కార్యాలయంలో మంగళవారం ‘మిషన్ ఉన్నతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మిషన్ ఉన్నతి కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించేలా కీలకమైన స్థానాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులు స్వయంగా వారి జూనియర్లకు పదోన్నతి ఉత్తర్వులను అందజేయిస్తున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఆయా విభాగాలలో ఆరుగురు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందగా వారి చేతుల మీదుగా వారి తరువాత విధులు నిర్వహించే సిబ్బంది పదోన్నతులు పొందడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఏడీఆర్ఎం సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎఫ్ఎం అమూల్య బి.రాజ్ పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి
చిలకలూరిపేట: విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ పిలుపు నిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపు నిచ్చిన టీడీపీ ఇప్పుడు అదాని మేలు కోసం స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంతో పాటు సర్దుబాటు చార్జీల విధానాన్ని తొలగించాలని కోరారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలందరిపై భారం పెరుగుతుందని, ముందుగానే డబ్బు చెల్లించి రీచార్జి చేయించుకున్నా, బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సహాయ కార్యదర్శి బొంతా దానియేలు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ -
ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చిన జీఎస్టీ
● సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సుజిత్ మల్లిక్ ● ఘనంగా జీఎస్టీ దినోత్సవం లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : జీఎస్టీతో దేశం ప్రగతి పథంలో దూసుకువెళుతుందని, జీఎస్టీ అమలు మంచి ఫలితాలు ఇచ్చిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. జీఎస్టీ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తియైన సందర్భంగా మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాలులో జరిగిన జి.ఎస్.టి దినోత్సవ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. జి ఎస్.టి చెల్లించటం గౌరవప్రదంగా భావించాలని సూచించారు. దేశ పౌరులు, వ్యాపారస్తులు చెల్లించే వస్తుసేవల పన్ను దేశ నిర్మాణానికి, దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో జీఎస్టీ ప్రారంభమైన ఏడాది రూ.2,850 కోట్లు ఆదాయం సమకూరగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.7,300 కోట్లు ఆదాయం లభించిందన్నారు. అలాగే గుంటూరులో జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రారంభంలో 19 వేల మంది ఉండగా, ఇప్పుడు 75 వేల మందికి చేరారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ జీఎస్టీతో దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎఫ్ట్రానిక్స్ ఎం.డి దాసరి రామకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీ లో వచ్చిన సాంకేతిక సమస్యలు, సందేహాలు వీడాయన్నారు. సి.పి.డబ్లు.డి చీఫ్ ఇంజినీర్ ముక్కామల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ జీఎస్టీ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం అత్యధిక పన్ను చెల్లింపుదారులను సత్కరించి, మెమోంటోలు బహూకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేశారు.కార్యక్రమంలో జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ రెజ్వాని, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవి కుమార్, మరియదాసు సూపరింటెండెంట్లు ఆర్.పి.పి.కుమార్, యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి, సురేష్ మణి చిట్టెం వెంకటేశ్వరరావు, పూర్ణ సాయి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైడేతో డెంగీ నివారణ
నరసరావుపేట: డెంగీ దోమల నివారణకు ప్రతి ఒక్కరూ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ పనికిరాని వస్తువులు, తొట్లలో ఉండే నీటిని పూర్తిగా మార్చాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. మంగళవారం జాతీయ డెంగీ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డాక్టర్ రవి మాట్లాడుతూ డెంగీ వ్యాధి వైరస్ వలన ఒకరి నుంచి మరొకరికి ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా వస్తుందన్నారు. ఈ దోమ మంచినీటిలో పెరుగుతుందన్నారు. ఇళ్లలో నిల్వుండే మంచినీటిలో గుడ్లు పెట్టి తన సంతానాన్ని వృద్ధి చేస్తాయన్నారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా పిల్లలకు కాళ్లు, చేతులు కప్పేలా పూర్తిగా డ్రస్ వేయాలని, పడుకునే సమయంలో దోమతెరలు తప్పకుండా వాడటం చేయాలని సూచించారు. జ్వర లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని అన్నారు. తొలుత కార్యాలయంలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ రాజేశ్వరి, ఏఎంఓ చుక్కా వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవి -
ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తోందని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్లు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తా మని హమీ ఇచ్చి రూ.13 వేలే తల్లుల ఖాతాల్లో వేయటం విడ్డూరంగా ఉందన్నారు. కొంత మంది తల్లులకు అర్హత ఉన్నా పథకం వర్తించకపో వటంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇంటి వద్దకు వచ్చే రేషన్ను తొలగించి దివ్యాంగులకు, వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. -
గ్రానైట్ లారీలు పట్టివేత
● బిల్లులు లేకుండా తరలింపు ● స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ గ్రానైట్ లారీలు ● కమర్షియల్ టాక్స్ అధికారుల మెరుపు దాడులు ● అదుపులోకి తీసుకున్న గ్రానైట్ లారీలు నడికుడి మార్కెట్ యార్డ్లో ● విలువను బట్టి పన్ను, జరిమానా వేస్తామన్న అధికారులు పిడుగురాళ్ల: బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నాలుగు గ్రానైట్ లారీలను జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి లారీలను తనిఖీ చేసే కార్యక్రమం పట్టణంలోని బైపాస్ రోడ్డుపై నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొండమోడు నుంచి దాచేపల్లి వైపు వెళుతున్న నాలుగు గ్రానైట్ లోడ్ లారీలను గుర్తించి పట్టుకున్నారు. ఈ గ్రానైట్ లారీలకు సంబంధించి ఎటువంటి బిల్లు లేకపోవడం, సామర్థ్యాన్ని మించి లోడుతో రవాణా చేయటం నిర్వహించడంతో ఈ నాలుగు లారీలను అదుపులో తీసుకున్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి.భార్గవ్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు చేపట్టామని అందులో నాలుగు గ్రానైట్ లారీలు బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నాయని వాటిని గుర్తించామన్నారు. వీటిని అదుపులో తీసుకొని నడికుడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉంచినట్లు తెలిపారు. గ్రానైట్ లోడును బట్టి, గ్రానైట్ విలువను అంచనా వేసి ఆ తరువాత పన్నుతోపాటు అపరాధ రుసుం కూడా విధిస్తామని చెప్పారు. అలాగే లెక్కలు చూసి టాక్స్, ఫైన్ వేయాల్సి ఉంటుందని దానికి కొంత సమయం పడుతుందని వివరించారు. బిల్లులు లేకుండా ఓవర్ లోడ్ తో గ్రానైట్ లారీలు వెళితే అటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అక్రమంగా బిల్లులు లేకుండా గ్రానైట్ లారీలు తరలిస్తే వాటిని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ దాడుల్లో జీఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎం రవికుమార్, జీఎస్టీవో టి పీటర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రకృతి సాగుతో గొప్ప ప్రయోజనాలు
● పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ ● కొత్తపాలెంలోని ప్రకృతి సాగు పంటల పరిశీలన ● ప్రకృతి సాగు పద్ధతి ప్రయోజనాలపై అవగాహన యడ్లపాడు: ప్రకృతి సాగు విధానంతో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. బి తెలిపారు. ప్రకృతి విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమలకుమారితో కలిసి కొత్తపాలెం గ్రామంలో మంగళవారం పర్యటించారు. రసాయనాలు లేని, సహజసిద్ధ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులు మానం శ్రీనివాసరావు, ఐనం హరిబాబు, మానం మణింద్ర, నిక్కీ తిరుపతిరావు, దమ్ము నాగజ్యోతి పంట పొలాలను పరిశీలించారు. వారు సాగు చేసిన బహుళ రకాల పంటలు, అంతర పంటలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మునగ తోటలో దొండ, కాకర, సొర, కనకాంబరం, అరటితోటలో తీగజాతి దోసను, నిమ్మతోటలో కరివేపాకును అంతర పంటగా వేయడాన్ని గమనించారు. వినూత్న పద్ధతిలో సాగు చేసిన తీరు, ఎక్కువ దిగుబడుల్ని సాధిస్తూ.. అన్నింటికీ మించి అధిక లాభాలను ఆర్జిస్తున్నామని తెలపడంతో స్థానిక రైతుల్ని ఆమె అభినందించారు. పురుగు మందుల ఖర్చు తక్కువ.. ప్రకృతి వ్యవసాయ విధానంతో కౌలు రైతుకు మంచి దిగుబడి, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గుతుందన్నారు. సహజ సిద్ధంగా పండించే ఉత్పత్తుల ద్వారా కౌలురైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. అయితే వారికి కౌలుకు ఇచ్చిన భూ యజమానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సాగు విధానం చేయడం వలన నేల సారం వృద్ధి చెందుతుందన్నారు. రైతులు తమ భూముల్ని కౌలుకు ఇచ్చే సమయంలో ప్రకృతి సేద్యం చేసేవారికి మాత్రమే ఇచ్చే ఒప్పందం చేసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రకృతి సాగు సిబ్బంది సౌజన్య, అప్పలరాజు, నందకుమార్, స్వాతి, బేబీ రాణి, వెంకటేశ్వరరావు ఉన్నారు. -
వైఎస్ జగన్కు గోపిరెడ్డి కృతజ్ఞతలు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ పీఏసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులు మంగళవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. ఆయనకు దుశ్శాలువా కప్పి తన నియామకంపై గోపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సౌత్ జోన్కు అర్హత సాధించిన శివకోటేశ్వరమ్మ రెంటచింతల: కేరళలో జరగనున్న సౌత్జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు రెంటచింతల–2 సచివాలయం మహిళా పోలీస్ చిన్నపురెడ్డి శివకోటేశ్వరమ్మ అర్హత సాధించింది. జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన 25 ఏపీ రైఫిల్ షూటింగ్ చాంపియన్ 2025 పోటీలలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి శివకోటేశ్వరమ్మ సౌత్జోన్ పోటీలకు ఎంపికై ంది. ఇంటర్ డిస్ట్రిక్ స్థాయిలో కూడా 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గోల్డ్మెడల్ సాధించిన శివకోటేశ్వరమ్మ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ సౌత్జోన్ స్థాయి పోటీలకు అర్హత సాధించడం ఆమె కృషి, పట్టుదలకు నిదర్శనం. శివకోటేశ్వరమ్మ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించినట్లు తెలిపారు. -
అడ్డాగా మారుద్దాం
పల్నాడును వైఎస్సార్ సీపీనరసరావుపేట: పల్నాడు జిల్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తానని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించటంతో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది మంగళవారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో డాక్టర్ గోపిరెడ్డిని కలిసి అభినందనలు తెలియచేశారు. డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, మాజీ మంత్రి విడదల రజిని, గజ్జల సుధీర్ భార్గవరెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోని నాయకులను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి సలహాలు స్వీకరిస్తూ వారితో సంప్రదింపులు జరుపుతూ పార్టీని పటిష్టం చేస్తానని చెప్పారు. 2029 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెంపున్నారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈఎం స్వామి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు షేక్ రెహమాన్, నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, కార్యనిర్వాహక అధ్యక్షుడు అచ్చిశివకోటి, ఎన్.సురేంద్ర, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి -
క్షుద్రపూజల కలకలం
బల్లికురవ: మూడు రోడ్ల కూడలిలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయడంతో ప్రజలు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. బల్లికురవ–అద్దంకి ఆర్అండ్బీ రోడ్లోని కొమ్మినేనివారిపాలెం, వలపర్ల వెళ్లే క్రాస్ రోడ్డు జంక్షన్లో సోమవారం అర్ధరాత్రి ఆగంతకులు గుమ్మడికాయలు, కుంకుమ, పసుపు పూలతో పూజలు నిర్వహించారు. మంగళవారం ఆ మార్గంలో వెళ్తున్న వారంత ఇవి దాటి వెళ్లాలంటే ఏ ప్రమాదం ముంచుకువస్తోనని భయాందోళన చెందారు. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని వాటిని అరికట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. 18 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత తాడికొండ: అక్రమంగా నిల్వ చేసిన 18 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్న ఘటన మండల కేంద్రమైన తాడికొండలో జరిగింది. వివరాల ప్రకారం తాడికొండ చెరువు కట్టపై రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు సీఎస్ డీటీ దేవరాజు, ఆర్ఐ హనుమంతరావుల ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించగా 35 కిలోల తూకం కలిగిన 18 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. దీనిపై విచారించగా తాడికొండకు చెందిన గుర్రపుశాల ఆనంద్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు స్థానికులు తెలపగా అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఆర్ఎంపీ వద్దే అన్ని సేవలు
యడ్లపాడు: కనీస వైద్య శిక్షణ లేని ఈ వ్యక్తులు ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ ఇచ్చి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పల్లె ప్రజల అమాయకత్వం, చదువులేని స్థితి వీరికి అవకాశంగా మారింది. కొందరు మెడికల్ షాపుల యజమానులే ఇప్పుడు గ్రామాల్లో డాక్టర్ల అవతారం ఎత్తి, రోగులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఫార్మసీ కోర్సులు చేసినవారు కొందరైతే, సదరు కోర్సు పూర్తి చేసిన వ్యక్తుల నుంచి సర్టిఫికెట్లు సేకరించి, మెడికల్ షాపులు నడిపేవారు మరికొందరు. ఇలా మెడికల్ షాపులు పెట్టుకున్నవారు అక్కడే మందులు, ఇంజెక్షన్లు, సైలెన్లు ఇస్తూ, క్రమంగా ఆ షాపులను చిన్నపాటి ఆసుపత్రులుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో నిరాదరణ, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యపరీక్షల రూపంలో జరిగే ఆర్థిక దోపిడీకి భయపడి నిరుపేద, మధ్యతరగతి ప్రజలు వీరిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. కమీషన్ల దందా: ప్రైవేట్ ఆసుపత్రుల అండదండలు కొందరు ఆర్ఎంపీల దందా కేవలం మందుల అమ్మకాలకే పరిమితం కాలేదు. రోగులకు పరీక్షలు అవసరమైతే నిర్దిష్ట ల్యాబ్లకు పంపి, భారీగా కమీషన్లు దండుకుంటున్నారు. ఆర్ఎంపీ వైద్యం, మెడికల్షాప్, ల్యాబ్లు, రిఫరల్ సేవలు అన్నీ కలిసి మెడికల్ సిండికేట్ మాఫియాలా నడుస్తున్నాయని బహిరంగ రహస్యమే. కరోనా సమయంలో సైకిళ్లపై తిరిగి వైద్యం చేసిన ఆర్ఎంపీలు ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగడమే ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మందుల షాపులే మినీ ఆస్పత్రులు అద్దెకు దొరుకుతున్న ఫార్మసీ సర్టిఫికెట్లు గ్రామాలు, పట్టణాల్లోభారీగా ఆర్ఎంపీ క్లినిక్లు పట్టించుకోని జిల్లా వైద్యశాఖ జగ్గాపురంలో బాలిక మృతి ఒక ఉదాహరణ మాత్రమే... ఆర్ఎంపీ వైద్యం ఎంత ప్రమాదకరమో జగ్గాపురం బాలికకు ఇటీవల యడ్లపాడులో జరిగిన విషాదకర ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. బొంతు కోటేశ్వరరావు కుమార్తె శాలిని(9) అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సమస్య ఉండగా ఎలాంటి పరీక్షలు లేకుండా వైద్యం చేయడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణకు వెళ్లిన వైద్యాధికారులే అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో బయటపడింది. అలా చేయకుండా సెటిల్మెంట్లతో వెలుగు చూడని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఆర్పీఎం సంఘాలు, మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ యూనియన్లు రంగంలోకి దిగి వివాదాలను సద్దుమణిగేలా చూస్తాయి. వీటిపై నిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారంటూ ప్రజల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం మేరకు ఆర్ఎంపీలు ప్రిస్క్రిప్షన్స్ రాయటం, ఇంజక్షన్లు చేయడం, సైలెన్స్ పెట్టడం వంటి ఇన్ఫెషెంట్ సేవలు అందించరాదు. ప్రథమ చికిత్సకు సర్టిఫికెట్ ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆర్ఎంపీలపై చర్యలు తప్పవు. జగ్గాపురంలో బాలికకు వైద్యం వికటించి ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే యడ్లపాడులోని సదరు మెడికల్ షాపును మూత వేయించాం. నిర్వాహకుడిపై కేసు నమోదైంది. – బి రవి, జిల్లా వైద్యాధికారి పల్నాడు -
జలజీవన్ మిషన్ తీరుపై విచారణ
గుంటూరు వెస్ట్: వర్షపు నీటిని వడిసి పట్టడమే లక్ష్యంగా కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతి పరిశీలించడానికి కేంద్ర జల శక్తి శాఖ పరిశీలకులు కిరణ్కుమార్ కర్లపు, రేష్మి పిళ్లైతో కూడిన అధికారుల బృందం రెండు రోజులుగా జిల్లాలో పర్యటించింది. పలు ప్రాంతాల్లో స్థానికులతో మమేకమై ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న ఫారం ఫాండ్, వాననీటి సంరక్షణ, నిర్మాణాలు, అమృత్ సరోవర్లు, నర్సరీలు, పండ్లు, పూలతోటలు పెంపకం, తదితర విషయాలను పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో చేపడుతున్న పనులు బాగున్నప్పటికీ వాటిని వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడు చేయకపోవడం వల్ల పురోగతి మార్గాలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుతుపవనాలు రావడానికి ముందు, తరువాత నీటి లభ్యతను లెక్క వేయడంలో భాగంగా రానున్న అక్టోబరు నెలలో మరోసారి జిల్లాలో పర్యటిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితోపాటు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కారు డ్రైవర్కు రెండేళ్లు జైలు శిక్ష గుంటూరు లీగల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన కారు డ్రైవర్కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు 5వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కోలారు లత మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021లో పేరేచర్ల జంక్షన్ వద్ద భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు డ్రైవర్ మాలంపాటి శ్రీకాంత్ రెడ్డి ఢీకొట్టాడు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుంటుపల్లి వెంకటేశ్వరరావు మృతిచెందగా, ఆయన భార్య తీవ్రగాయాలపాలైంది. ఈఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. సాక్షాధారాలతో జిల్లా ఐదో అదనపు సివిల్ కోర్టులో సమర్పించగా, పూర్వపరాలు, సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి కె.లత ముద్దాయికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఏపీపీ ఎ.పవన్ కుమార్, కోర్టు పర్యవేక్షణ అధికారి సీఐ నరసింహారావు , అప్పటి దర్యాప్తు అధికారి ఎస్సై నరహరిలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ మొత్తాలను చెల్లించాలి
ఈయూ రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు నరసరావుపేట: ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రావాల్సిన గ్రాట్యూటీ, లీవ్ ఎన్క్యాష్ మెంట్ సెటిల్మెంట్ మొత్తాలను వెంటనే ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో 36 ఏళ్లు డ్రైవర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.కోటేశ్వరరావు అభినందన సభ డిపో ఆవరణలో మంగళవారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన దామోదరరావు మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వైద్యసౌకర్యాలు కల్పించేందుకు విలీనంకు ముందున్న రెమ్స్ స్కీమ్ కల్పించాలని, అదేవిధంగా 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ అరియర్స్ కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా పదవీ విరమణ చేస్తున్న కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. డిపో కార్యదర్శి చందు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా మాజీ డీపీటీఓ యన్వీ. శ్రీనివాసరావు, డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు యూనియన్ రాష్ట్ర నాయకులు యం.హనుమంతరావు, కె.నాగేశ్వరరావు, యం.డి.ప్రసాద్, జి.నారాయణరావు, కృష్ణారావు, కోటేశ్వరరావు, జోనల్ నాయకులు వాకా రమేష్, బాబు సామ్యూల్, బెజవాడ రవి, జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్యదర్శి జి.తిరుపతిరావు, గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కరిముల్లా, విజయ్కుమార్, బాపట్ల జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అన్ని డిపోల నాయకులు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
అమ్మో.. ఇంటింటికా?
హామీలకు మంగళం.. ప్రశ్నిస్తే ఏం చెప్పగలం? సాక్షి, నరసరావుపేట: అలవిగాని హామీలు, అసత్యప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయకపోగా, అప్పటివరకు ప్రజలకు అందుతున్న సేవలు, పథకాలను అటకెక్కించారు. ముఖ్యంగా సూపర్–6 లో పేర్కొన్న పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత జిల్లా అయిన పల్నాడులో రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు నేటి నుంచి టీడీపీ నేతలను సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ పేరుతో ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేయాలని ఆదేశించారు. ఏడాది పాలనలో మనం ఏం సాధించామని ఇంటింటికి తిరగాలని ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. పర్యటనలో ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని అంతర్మథనంలో ఉన్నారట. ఏడాదిగా మొహం చాటేసి... సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తరువాత జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా ఉంటున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నిత్యం ఏదో కార్యక్రమం పేరట ప్రజల్లోనే ఉండేవారు. వారి కష్టసుఖాలను ఇంటింటికి వెళ్లి తెలుసుకొని సత్వరమే పరిష్కారం చూపారు. కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలంలో ఎమ్మెల్యేలు పల్లెల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పల్లెలకన్నా విదేశాలకే ఎక్కువ వెళ్లారని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలను వదలి ప్రజలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి జాడేది...? ఏడు దశాబ్దాలుగా పల్నాటి ప్రజల కల వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం. గతంలో ఎంతో మంది నేతలు అనుకున్నా ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ, వన్యప్రాణ సంరక్షణ వంటి కీలక అనుమతులను కేంద్రం నుంచి తేవడంలో సఫలీకృతం కాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరికపూడిశెల ప్రాజెక్టు అనుమతులపై ప్రత్యేక దృష్టిపెట్టి కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి కీలక అడుగువేశారు. మొదటి దశ పనులను ప్రారంభించారు. అంతలో ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చంద్రబాబు మొదలు స్థానిక నేతల వరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీలిచ్చారు. అయితే ఏడాదైనా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ప్రజలు వాపోతున్నారు. ● జలజీవన్ మిషన్, వైఎస్సార్ కరువు నివారణ పథకం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి ● ఏడాదైనా జేజేఎం పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందించలేకపోతున్నారు ● కీలకమైన జాతీయ రహదారుల పనులు ముందుకుసాగడం లేదు. ముఖ్యంగా నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి భూసేకర నేటికీ పూర్తికాలేదు ● మాదిపాడు బ్రిడ్జి పూర్తి చేయలేదు ● పల్నాడు జిల్లాకే తలమానికమైన పిడుగురాళ్ల మెడికల్ కళాశాల భవితవ్యం కూటమి ప్రభుత్వంలో అయోమయంలో పడింది. సుమారు 50 ఎకరాల్లో రూ.540 కోట్లతో కడుతున్న కళాశాల నిర్మాణ పనులలో కీలకమైనవి గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా పూర్తికావొచ్చాయి. మిగి లిన అరకొర పనులు పూర్తిచేసేందుకు ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేక పూర్తికావడంలేదు. ఎప్పుటి నుంచి ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయి, మెడికల్ విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం ఎప్పుడు అన్న వాటికి సమాధానాలు లేవు. ఈ నేపథ్యంలో ఏడాది పాలనలో మీరు సాధించిన అభివృద్ధి ఏమిటని కూటమి నేతలను ప్రజలు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో కూటమి ప్రజాప్రతినిధుల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి వెళ్లడానికి ఆలోచనలో పడ్డారు. మహిళల్లో ఆగ్రహ జ్వాలలు కూటమి ప్రభుత్వ పాలనపై ముఖ్యంగా మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సూపర్–6లో మహిళలకు ప్రకటించిన హామీలను ఏడాది పాలనలో గాలికి వదిలేశారు. ముఖ్యంగా మహిళలకు నెలా నెలా రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైందో ఎప్పుడు అమలు చేస్తారో చెప్పడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జీవితకాల ఆలస్యంగా నడుస్తోంది. ఉచిత సిలెండర్లు పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నా నగదు బదిలీ సక్రమంగా జరగడంలేదు.. విచారణ కోసం ప్రకటించిన టోల్ఫ్రీ నెంబర్లు పనిచేయవు. టీడీపీ ఎమ్మెల్యేలలో అంతర్మథనం నేటి నుంచి సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఏడాది దాటినా అమలుకు నోచుకోని హామీలు ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వత్రా విమర్శలు ఏడాదిగా పెండింగ్లో వరికపూడిసెల, మెడికల్ కళాశాల పనులు తీవ్ర సంక్షోభంలో మిర్చి, పొగాకు, కంది రైతులు అతీగతీ లేని అన్నదాత సుఖీభవ పెండింగ్లో ధాన్యం కొనుగోలు నగదు ప్రజలు నిలదీస్తారేమోనని భయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు రోడ్డెక్కిన రైతన్న వ్యవసాయం ఏడాదిగా తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంది. ముఖ్యంగా మిర్చి, పత్తి. పొగాకు, కంది పంటల రైతులకు గిట్టుబాటు ధరలు లేక మార్కెటింగ్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోయారు. రోడ్డెక్కి తమకు విత్తనాలు, ఎరువులు కావాలని, పండించిన పంటలను కొనుగోలు చేయాలని, గిట్టుబాట ధర కల్పించాలని రైతులు నిరసనలు చేపట్టడానికే ఏడాది సరిపోయింది. మరోవైపు రైతులకు అన్నదాత సుఖీభవ పేరిట ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్న సాయంలో తొలి ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో ఏడాదీ ఇప్పటివరకు అతీగతీ లేదు. పంటలు పెట్టి అప్పులపాలైన రైతులకు పెట్టుబడి పెట్టడానికి కూడా డబ్బులు లేక ఖరీఫ్ సాగు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యం డబ్బులు నేటికీ వారి ఖాతాల్లో జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా రూ.6 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగులు, విద్యార్థులు కూటమి ప్రభుత్వం తమను పూర్తిగా వంచించిదని తీవ్ర ఆవేదనలో ఉన్నారు. -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం కావాలి
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజిఆర్ఎస్)కు అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి 180 అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. ఆశా వర్కర్ల నియామకాల్లో పాదర్శకత పాటించాలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 1294 ఆశా వర్కర్ల పోస్టులు ప్రకటించింది. వీటి నియామకాల్లో రాజకీయ జోక్యం లేకుండా అర్హత కల్గిన వారిని రిజర్వేషన్ ప్రకారం నియమించాలి. సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వకుండా రాజకీయ నాయకులను కలవాలని చెబుతున్నారు. దీని వలన రాజకీయ నాయకులు చెప్పిన వారికే దక్కే అవకాశం కన్పిస్తుంది. అందువలన పారదర్శకతతో రిజర్వేషన్లు పాటిస్తూ నియామకాలు జరపాలి. – బీసీ సంక్షేమసంఘ నాయకులు హామీ మేరకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి. నరసరావుపేట నియోజకవర్గంలో తమకు 3వేలు దరఖాస్తులు రాగా వాటినన్నింటిన సచివాలయాల వారీగా ఇచ్చాం. వాటిని వెంటనే ఆన్లైన్ చేయాలి. అందుకు ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయాలి. –కాసా రాంబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాపనయ్యనగర్ వాసులకు పట్టాలు అందజేయాలి పట్టణంలోని ప్రకాష్నగర్ బాపనయ్యనగర్లో 30 ఏళ్ల నుంచి పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. పట్టాలు ఇవ్వా ల ని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ స్థలం అని అధికారులు చెబుతున్నా ఓ వ్యక్తి కొంత భూమిని ఆక్రమించి చుట్టూ ప్రహరీ కట్డాడు. నివాసం ఉండేవారిని విచారించి అర్హులైన వారికి వెంటనే పట్టాలు అందజేయాలి. –షేక్ జాన్పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు 180 అర్జీలు స్వీకరించిన జేసీ, అధికారులు -
రోటరీ క్లబ్లకు పలు సేవా పురస్కారాలు
చిలకలూరిపేట: రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురంలకు పలు సేవా పురస్కారాలు లభించాయి. హైదరాబాద్లో ఆదివారం రాత్రి నిర్వహించిన రోటరీ సంస్థ అవార్డుల కార్యక్రమంలో క్లబ్ సభ్యులకు ఈ అవార్డులు అందజేశారు. తోపుడు బండ్ల పంపిణీ, విద్యార్ధులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ, పేద మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేటకు 15 అవార్డులు, రోటరీ క్లబ్ పండరీపురంకు 8 సేవా పురస్కారాలతో పాటు 10 ప్రోత్సాహక సర్టిఫికెట్లు లభించాయి. కార్యక్రమంలో రోటరీక్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షుడు ఆళ్ల వేమనరెడ్డి, రోటరీక్లబ్ ఆఫ్ పండరీపురం అధ్యక్షుడు వారణాసి శరత్కుమార్, ఆయా క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. అసిస్టెంట్ గవర్నర్గా రాఘవయ్య రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురంకు చెందిన పోలిశెట్టి రాఘవయ్య 2025–26 సంవత్సరానికి క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన
వినుకొండ: జిల్లాస్థాయి పోటీలకుఆరు విభాగాల్లో ఆరుగురు ఎంపికై నట్లు పీఈటీ రాధాకృష్ణ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో జఫ్రుల్లా పాల్గొని మాట్లాడుతూ, తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో120 మంది విద్యార్థినీ విద్యార్థులు ఎంపికయ్యారని అందులో ఆరు విభాగాలల్లో ఎంపికై న విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఆయన అభినందించారు. వ్యాసరచనలో సుధారాణి ఉప్పలపాడు, వక్తృత్వం యజ్ఞశ్రీ బొగ్గరం, పాటల పోటీలుౖ వె.హేమలత వేల్పూరు, డాయ్రింగ్ ఎస్.కె.మస్తాన్ వినుకొండ కథలు సి.హెచ్.లక్ష్మయ్య ఇనిమెళ్ల, నాటికల్లో వేల్పూరు విద్యార్థులు ఎంపికవ్వగా వారిని ఎంఈవో అభినందించారు. రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలవాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొత్త బైపాస్ వద్ద గుర్తు తెలియని మృతదేహం యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో, నూతన బైపాస్ రోడ్డు పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందడం స్థానికులు గమనించారు. ఆదివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యడ్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతిచెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని, అతని శరీరంపై ఉన్న మాసిన దుస్తులు, అలాగే శారీరక పరిస్థితిని బట్టి గత కొన్ని రోజులుగా సరైన ఆహారం, నీరు లేకపోవడం వల్లే మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అతను స్థానికంగా యాచ కత్వం చేస్తూ జీవనం సాగించే వ్యక్తిగా గుర్తించి నట్లు తెలిపారు. మృతుడికి సోమవారం పంచనామా నిర్వహించిన అనంతరం చిలకలూరిపేట మున్సిపాలిటీ అధికారులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై అనుమానస్పదంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. -
పాఠశాలకు పూర్వవైభవం తెస్తాం
యడ్లపాడు లూథరన్ హైస్కూల్ పూర్వవిద్యార్థులు యడ్లపాడు: వందలాది మంది విద్యార్థులతో కళకళలాడుతూ దర్శనమిచ్చే యడ్లపాడు లూథరన్ హైస్కూల్ ఖాళీ తరగతి గదులతో వెలవెలబోతోందని పూర్వవిద్యార్థుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పూర్వ విద్యార్థుల సంఘం, గ్రామపెద్దలు లూథరన్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఏఈఎల్సీ ప్రతినిధుల మాటల్ని నమ్మి, భావితరాల విద్యా భవితను దృష్టిలో ఉంచుకుని యడ్లపాడు కమిటీ హైస్కూల్ నిర్వహణ బాధ్యతల్ని మాత్రమే వారికి అప్పగించినట్లు తెలిపారు. ఏఈఎల్సీ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత 20 ఏళ్లుగా లూథరన్ హైస్కూల్లో ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరిందని ఆరోపించారు. చివరకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మండల కేంద్రంగానూ, పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యడ్లపాడు నుండి మెరుగైన ఆధునిక విద్యా వసతులు వెతుక్కుంటూ విభిన్న సామాజిక శ్రేణుల కుటుంబాల నుంచి విద్యార్థులు ఇతర గ్రామాలలోని పాఠశాలలకు వలస వెళ్లడం బాధాకరమన్నారు. ఈనేపథ్యంలో 15 ఏళ్ల క్రితమే పాఠశాల పూర్వవిద్యార్థులు సంఘటితమై దాని పూర్వవైభవానికై నడుం బిగించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే దాతల సహకారంతో రూ.40 లక్షలు సమీకరించి తరగతి, కార్యాలయ గదులపై స్లాబుల పునరుద్ధరణ పనులు, మౌళిక సదుపాయాలు, అలాగే హైవే నుంచి పాఠశాల వరకు ఉన్న ప్రధాన మార్గాన్ని ప్రభుత్వ నిధులచే సిమెంట్ రోడ్డుగా మార్చిన విషయాలను గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభ్యున్నతి కోసం గ్రామానికి చెందిన నాటి పెద్దల నిర్మించిన హైస్కూల్ గ్రామ ఉమ్మడి ఆస్తి అని, దీనిని ఎటువంటి ప్రేవేటు వ్యక్తుల ఆక్రమణకు గురికానివ్వమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థులు, హైస్కూల్ నిర్మించిన దాతల వారసులు, గ్రామపెద్దలు ముత్తవరపు రామారావు, నూతలపాటి కాళిదాసు, పోపూరి వెంకటరత్తయ్య, చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, బెజ్జం రాజశేఖర్, పి సునీల్, కాసు రామస్వామిరెడ్డి, చాగంటి చెంచారెడ్డి, నంబూరు శివరామకృష్ణ, జరుగుల అంజేశ్వరరావు, పోపూరి రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ముఖ్యంగా మహాత్మాగాంధీ గ్రామీణ పనికి ఆహార పథకం (ఎన్ఆర్ఇజీఎస్)లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ పిలుపుమేరకు ఆ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో నెలకొన్న అనేక సమస్యలపై పార్టీకి చెందిన సర్పంచులు, నాయకులతో కలిసి నరసరావుపేటలోని కలెక్టరేట్కు వచ్చారు. పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పనికి ఆహార పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు డబ్బులు ఇవ్వకుండా దోచుకుంటున్నారని, కూలీలకు ఇచ్చే రూ.300లో సగం తమకు ఇవ్వమని ఫీల్డ్ అసిస్టెంట్లు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఫోన్లో ఏవిధంగా బెదిరించారో ఆ వీడియో, ఆడియో పెద్ద ఉదాహరణ అన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ నిధులను పంచాయతీలకు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం వివిధ పథకాల కోసం వాడుకుంటుందన్నారు. నిధులు లేక పంచాయతీలలో లైట్లు, శానిటేషన్, తాగునీటి సరఫరా, జీతాలు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. సర్పంచులు ఎంపీటీసీలకు, గౌరవవేతనం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం పంచాయతీలో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్లు ఉన్నారని, పంచాయతీ సెక్రటరీలను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు తీర్మానాలు చేయించకుండా, పనులు చేయకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం రూ.3వేలు గౌరవ పొందుతున్న సర్పంచ్లకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేయకుండా కూటమి అన్యాయం చేసిందన్నారు. గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీలు 1350 మందికి ఇంతవరకు పోస్టింగులు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు ఆలా లక్ష్మీనారాయణ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పడాల చక్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పచ్చవ రవీంద్రబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి, మండల అధ్యక్షులు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు ముండ్రు హరినారాయణ, అమరావతి మండల సేవాదళ్ అధ్యక్షులు వైఎన్ పాపారావుయాదవ్, పార్టీ నరసరావుపేట మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, అన్ని గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1150 కోట్ల నిధులను తక్షణమే చెల్లించాలి గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలి కలెక్టర్కు విన్నవించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగ నాయకులు, సర్పంచ్లు -
అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలి
చిలకలూరిపేట: వివక్ష లేకుండా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలని వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు కోరారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో సోమవారం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత వహించారు. ఎజెండాలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులపై చర్చ రాగా, వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో మాత్రమే కాకుండా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిల్ట్ తొలగింపు విషయంలో మాట్లాడుతూ పట్టణ పరిధిలో భారీగా మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగించామంటున్నారు... తొలగిస్తే మురుగు సమస్య ఎందుకు తలెత్తుతున్నది? సరిగ్గా తొలగించలేదా అని ప్రశ్నించారు. పట్టణ పరిధిలో వెలువడే మురుగునీరు గణపవరం వద్ద కుప్పగంజి వాగులోకి సరిగా ప్రవహించే పరిస్థితి లేక పంట పొలాల్లో మురుగునీరు నిల్వ ఉండి రైతులు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం తెలిపారు. తిరిగి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విశ్వనాధ సెంటర్లో భారీ వృక్షాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసిన విషయమై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో ఇదే విషయం ఎత్తినప్పుడు పోలీసు కేసు పెడతామని, సంబంధిత వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ చెట్టు నరికివేత విషయంలో మున్సిపాలిటీ హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఈ ప్రశ్నకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లభించకపోవడం విశేషం. ఇదే విషయాన్ని 27వ వార్డు కౌన్సిలర్ అన్నపరెడ్డి శ్రీలక్ష్మి కూడా ప్రశ్నించారు. అమృత్ పథకం ఎప్పటికి పూర్తి అవుతుంది, ఈ పథకం కింద పైపులైన్లు ఏర్పాటు చేసిన సందర్బంగా ఏర్పడిన గోతులు ఇంకా చాలా చోట్ల పూడ్చాల్సి ఉందని సభ్యులు ప్రశ్నించారు. దీనికి మున్సిపల్ డీఈఈ అబ్దుల్ రహీం మాట్లాడుతూ అమృత్ పథకం పనులు పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్డ్మెంట్ వారు నిర్వహిస్తున్నారని, సీసీ ప్లాచ్వర్కులు వారే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. చెత్త తొలగించేందుకు అద్దె టాక్టర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు, మున్సిపల్ ట్రాక్టర్లు ఏమయ్యాయంటూ పదో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ప్రశ్నించారు. మున్సిపల్ ట్రాక్టర్లు రిపేర్లకు వచ్చిన క్రమంలో అద్దె ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నామని డీఈఈ తెలిపారు. 12వ వార్డు కౌన్సిలర్ యడ్ల ఇందిరా మాట్లాడుతూ తన వార్డు పరిధిలోని తూర్పుమాలపల్లెలో ఒక్క అభివృద్ధి పని నిర్వహించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు వార్డు వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని మాట్లాడుతూ తూర్పు మాలపల్లెలో అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలని మున్సిపల్ ఏఈని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు. వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహణ -
వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గోపిరెడ్డి
సాక్షిప్రతినిధి,గుంటూరు: వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులుగా మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ వస్తోంది. ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటే మరో కేసు బనాయిస్తూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ గ్రూపు తగాదాలలో జరిగిన హత్యలను కూడా పిన్నెల్లి సోదరులపై పెట్టి కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సమన్వయం చేసుకుంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముందుకువెళ్లనున్నారు. -
చిరుద్యోగులపై కక్ష సాధింపు
విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లపై కూటమి ప్రభుత్వం వేటు కక్షతో తొలగించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నా సోదరుడు రషీద్ను వినుకొండ పట్ణణం నడిబొడ్డులో టీడీపీ గుండాలు నరికి చంపారు. ఇప్పటి వరకు నా కుటుంబానికి న్యాయం జరగలేదు. దీనిపై కోర్టులో పోరాడుతున్న నన్ను వేధించేందుకు కూటమి నేతలు తంగెడ సబ్ స్టేషన్లో 2010 నుంచి షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న నన్ను తొలగించారు. అక్రమ కేసును బూచిగా చూపి నాపై కక్ష తీర్చుకుంటున్నారు. నాకు, నాకుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాను. –ఎస్కే ఖాధర్ బాషా, తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్, వినుకొండ సాక్షి, నరసరావుపేట: బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. గత ప్రభుత్వంలో నియామకాలు జరిగాయన్న ఒకే ఒక్క సాకుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్డీఏ అనుబంధ సిబ్బంది, రేషన్ డీలర్లు, ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వాహన సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు, మార్కెట్యార్డు సిబ్బంది ఇలాంటి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూటమి నేతల ప్రోద్బలంతో తొలగించారు. ఇదే కోవలో విద్యుత్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న వారిపై వేటు వేసి వేధిస్తోంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించి కూటమి నేతలు సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అకస్మాతుగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో షిఫ్ట్ ఆపరేటర్లు దిక్కుతోచన స్థితిలోకి వెళ్లి మానసికంగా కృంగిపోతున్నారు. ఏ తప్పు చేయకపోయినా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తొలగించడంతో కుటుంబంలో సమస్యలు పెరిగి కాపురాలు కూలిపోతున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై బలవన్మరణాల వరకు వెళుతున్నారు. రూ.లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంటూ... విద్యుత్ సబ్స్టేషన్లలో తొలగిస్తున్న ఉద్యోగాలు ముఖ్యంగా సత్తెనపల్లి, వినుకొండ నియోజకవర్గాలలో ఎక్కువగా ఉంటున్నాయి. ఆయా నియోజకవర్గాలలో కూటమి నేతలు ఈ వేధింపులు అధికంగా చేస్తున్నారని ఉద్యోగాలు కోల్పోయిన ఆపరేటర్లు వాపోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ సబ్స్టేషన్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారు, వారి స్థానంలో కొత్తగా తీసుకుంటున్న వ్యక్తి ఎవరు, అతన్ని సిఫార్సు చేస్తున్న నేతల పేర్లతో కూడిన జాబితా సైతం తయారుచేశారు. ఇది బహిర్గతం అవ్వడంతో ఏ స్థాయిలో కూటమి నేతలు అరాచకం సృష్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తొలగించిన స్థానాల్లో కొత్తవారిని నియమించేందుకు కూటమి నేతలు రూ.4–5 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఆత్మహత్యలే శరణ్యం... ఐదేళ్లుగా చేజర్ల విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న నన్ను ఏ కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల వద్ద గోడు వెలిబుచ్చినా పట్టించుకున్న నాథుడు లేడు. పార్టీల పేరుతో బడుగు బలహీనవర్గాలకు చెందిన మాపై కూటమి నేతుల కక్షకట్టి ఉద్యోగాలు తొలగించి జీవితాలను రోడ్డు పాల్జేశారు. మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం. –బనావతు రవినాయక్, తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్, చేజర్ల సబ్స్టేషన్ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులన్న సాకుతో... విద్యుత్ సబ్స్టేషన్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడక ముందే షిఫ్ట్ ఆపరేటర్లుగా జిల్లాలో 200 మందికి పైగా పనిచేసేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారిని ఎవర్ని తొలగించే కార్యక్రమం చేపట్టలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నియామక పరీక్షలో షిఫ్ట్ ఆపరేటర్లకు కొంత ప్రాధాన్యత ఇవ్వడంతో సుమారు 40 మంది దాకా జీఎల్ఎంలుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ క్రమంలో ఖాళీ అయిన పోస్టులలో మాత్రమే వైఎస్సార్సీపీ నియామకాలు చేపట్టింది. ఇందులో పార్టీలు, వర్గాలు చూడకుండా అర్హులైన బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగాలు కల్పించారు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియామకాలు పొందిన వారిపై కూటమి నేతలు కక్షకట్టారు. వారందరిని విద్యుత్ శాఖ అధికారుల ద్వారా ఒత్తిడి చేయించి ఉద్యోగాల నుంచి ఒక్కొక్కరుగా తొలగించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 40 మందిని తొలగించినట్టు సమాచారం. ఇదే క్రమంలో శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఉయ్యాల తిరుపతిరావు(30) 2019లో వేల్పూరు విద్యుత్ సబ్స్టేషనులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తిరుపతిరావుకు తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన స్వాతితో మూడేళ్ల కిందట వివాహమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతిరావుపై అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి తిరుపతిరావు ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఒకవైపు ఉపాధి కోల్పోయి, మరోవైపు కుటుంబంలో కలతలు రావటం భార్యాభర్తల మధ్య విభేదాలు రావటంలో తిరుపతిరావు ఆదివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది కూటమి ప్రభుత్వ హత్యేనని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు, ఉద్యోగాలు కోల్పోయిన షిఫ్ట్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులతో ఆత్మీయ కలయిక
యడ్లపాడు: వంకాయలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వడ్డేపల్లి నరసింహ(రావు)రాజు నేతృత్వంలో తొలిసారిగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ కలయిక ఏర్పాటైంది. మాజీమంత్రి విడదల రజిని ఆదేశాల మేరకు సోమవారం సంగం గోపాలపురంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ అండగా నిలవాలని సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి కోటిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కందుల శ్రీకాంత్, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ దరియావలి, నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులు మంగు ఏడుకొండలు, రూరల్ మండలం అధ్యక్షులు దేవినేని శంకరరావు, యడ్లపాడు మండల ఎంపీపీ పిడతల ఝాన్సీ దయాసాగర్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహ(రావు) జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని కేక్ కట్చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీవో రామారావు సేవలు అభినందనీయం
జిల్లా డ్వామా పీడీ సిద్దా లింగమూర్తి శావల్యాపురంః మహాత్మాగాంఽధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో 21 సంవత్సరాల పాటు మెరుగైన సేవలు పారదర్శకంగా అందించి అందరి మన్ననలు పొందటం అభినందనీయమని జిల్లా డ్వామా పీడీ సిద్దా లింగమూర్తి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పధకం విభాగంలో ఏపీవో కటారపు రామారావు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా పీడీ సిద్దా రామలింగమూర్తి మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారన్నారు. ఉపాధి పథకంలో తన వృత్తినే దైవంగా భావించి తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం పలువురికి ఆదర్శమన్నారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఏపీవో కటారపు రామారావు దంపతులను పూల మాలలు దుశ్శావాలు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, ఏపీవోలు కె.నాగేశ్వరరావు, ఆంజనేయరాజు, పుష్పారాజ్, లక్ష్మణరావు, మండల క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షులు అన్నవరపు వెంకటేశ్వరరావు, చెరుకూరి బాలకృష్ణ, ఉపాధి అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
అక్రమ డ్రగ్స్ రవాణ నిందితులు అరెస్ట్
చిలకలూరిపేటటౌన్: బెంగళూరు నుంచి గుంటూరుకు అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న నిందితులు గుంటూరు బ్రాడీపేటకు చెందిన చల్లా గోపి, సంగడిగుంటకు చెందిన షేక్ ఫారుక్ సహా ఐదుగురిని చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు నేతృత్వంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.50 వేల విలువైన 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ నిందితులు బెంగళూరులోని డ్రగ్ సరఫరాదారుల నుంచి మాదకద్రవ్యాలను తీసుకువచ్చి, గుంటూరులో యువత మధ్య అక్రమ వ్యాపారం చేయడానికి ప్రయ త్నించారని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరిని కోర్టుకు హాజరు పరిచినట్లు వెల్లడించారు. -
పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయండి
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కేంద్ర జలశక్తి అధికారులు కర్లపు కిరణ్కుమార్, రేష్మపిళ్లై కోరారు. జిల్లాలో కేంద్ర జలశక్తి ద్వారా అమలౌతున్న పథకాల తీరుతెన్నులను పరిశీలించేందుకు వచ్చిన వారు సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జలజీవన్మిషన్, నీటిలభ్యతస్థాయి, అమృత 2.0, కాంపా, చిన్ననీటిపారుదల పథకాలు, జిల్లా నీటియాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న పథకాల పురోగతిని సమీక్షించారు. చేసిన పనుల తాలూకా ఫొటోలను ఆన్లైన్లో వెంటనే అప్లోడు చేయాలని కోరారు. ద్వామా పీడీ శంకర్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి అధికారులు కర్లపు కిరణ్కుమార్, రేష్మపిళ్లై -
నష్టపరిహారం సెంటుకు రూ.లక్ష ఇప్పించండి
చిలకలూరిపేట రూరల్ పరిధిలోని గంగన్నపాలెం, కోమటినేనివారిపాలెం తదితర గ్రామాల రైతులకు చెందిన సుమారు 7.15 ఎకరాల భూమి నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారికి తీసుకున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10లక్షల మాత్రమే నష్టపరిహారం ఇస్తామంది. మార్కెట్ విలువ ఎకరా రూ.97లక్షలుగా ఉంది. కనీసం సెంటుకు రూ.లక్ష మేర నష్టపరిహారం చెల్లిస్తేనే మాకు నష్టం లేకుండా ఉంటుంది. ప్రైవేటు రేటు ప్రకారం తమ భూములు రూ.2 కోట్లు పలుకుతున్నాయి. –నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి బాధితులు -
జీఎస్టీ నమోదుచేయని వ్యాపారాలను గుర్తించాలి
కార్యాలయంలో జీఎస్టీపై సమీక్ష చేసిన జేసీ సూరజ్నరసరావుపేట: జిల్లాలో జీఎస్టీ నమోదుచేయని వ్యాపారాలను గుర్తించి పన్ను పరిధిని విస్తరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో జిల్లా స్థాయిలో జీఎస్టీ వసూళ్లు సమర్ధ నిర్వాహణపై జేసీ అధ్యక్షతన సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. వివిధశాఖల మధ్య సమన్వయం చేసుకోవటం ద్వారా పన్ను పరిపాలన మెరుగుపడుతుందని, తద్వారా పన్ను వసూళ్లు సమర్ధవంతంగా చేయవచ్చని పాల్గొన్న అధికారులు నిర్ణయించారు. దీనిలో ముఖ్యాంశాలు..మొండి బకాయిదారుల ఆస్తుల గుర్తింపుకు రెవెన్యూశాఖ, బ్యాంకు సహకారం ద్వారా పాత బకాయిలను వసూలుచేయటం, మైనింగ్ అక్రమ రవాణా ద్వారా ఎగవేసే పన్నును అరికట్టాలని, రాష్ట్ర పన్ను ఆదాయం పెంచేందుకు స్థానిక కొనుగోళ్లను తప్పనిసరి చేయాలని, జిల్లా స్థాయి అధికారులు వారి శాఖలలో టీడీఎస్ నిబంధన పాటించేలా చూడాలని, ఇంజనీరింగ్, పలు శాఖల నుంచి డేటా సేకరించి వృత్తిపన్ను పర్యవేక్షించాలని, మోసగాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు పోలీసుశాఖ సహకారం తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ధారించారు. దీనిలో గుంటూరు–2 జేసీ బి.గీతామాధురి, డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం
గుంటూరు ఎడ్యుకేషన్: బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రత్యేకమైన కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పెరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు జూలై మొదటి వారంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని పిలుపునిచ్చారు. ● రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ బదిలీల చట్టం ద్వారా జరిగిన బదిలీల, ప్రమోషన్లలో ఉన్న అసంబద్దాలను సరిజేయడానికి యూటీఎఫ్ అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేసిందని, తద్వారా మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెలిపారు. ● రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించి, పెండింగ్లో ఉన్న డీఏలు, ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ విద్యారంగ వికాసం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం పనిచేసే సంఘంగా యూటీఎఫ్లో సభ్యులుగా చేరాలని కోరారు. ఈసందర్భంగా ఊరి బడిలో పిల్లల్ని చేరుద్దామని వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, కోశాధికారి గయాసుద్దౌలా పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
పంచాయతీలకు నిధులు జమ చేయాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దారి మళ్లించిన నిధులను పంచాయతీలకు జమ చేయాలని వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రూపొందించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమస్యపై సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సర్పంచులు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పంచాయతీలకు రావాల్సిన జనరల్ ఫండ్స్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను తల్లికి వందనం పథకానికి దారి మళ్లించారని చెప్పారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న సర్పంచులు 80 శాతం మంది వైఎస్సార్ సీపీకి చెందిన వారు కావటం వలన పంచాయతీలకు నిధులు ఇవ్వడంలేదని అన్నారు. కనీసం శానిటేషన్ కూడా చేయలేని పరిస్థితి పంచాయతీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకంలో ఉన్న కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సగం కూలీ డబ్బులు తమకి ఇస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారని విమర్శించారు. మీకు ఇంత, మాకు అంత అనే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పేద వాళ్లకు పనిలేకుండా చేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల చక్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీలకు సంబంధించిన నిధులు తల్లికి వందనం వంటి పథకాలకు దారి మళ్లించడం అన్యాయమని అన్నారు. దీనివల్ల ఒక పంచాయతీలో కూడా చిన్నపని కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం కూడా సర్పంచులకు వర్తింపజేయకుండా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. కొనకంచివారిపాలెం సర్పంచి, పంచాయతీరాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ముండ్రు హరినారాయణ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన తీర్మానాల్లో పంచాయతీ సర్పంచులను ఎక్కడ భాగస్వాములను చేయకుండా కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతున్నారని అన్నారు. గ్రామసభలకు సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా తీర్మాణాల్లో కూడా సర్పంచుల సంతకాలు లేకుండా తమ స్టాంపులు వాడుకొని ఉపసర్పంచులతో సంతకాలు పెట్టించుకుని కలెక్టర్లకు పంపించి ఆమోదింప చేసుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారికి ఈ విషయంపై వినతిపత్రాలు అందించాననే కారణంతో తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన నిధులు దారి మళ్లించారని, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలకు కూడా నిధులు ఇవ్వడంలేదని చెప్పారు. కనీసం పనివారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని వివరించారు. జిల్లా ఉపాధ్యక్షులు పచ్చవ రవీంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికై న సర్పంచులకు ఏ హక్కులు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రూ.కోట్లు ఖర్చుపెట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించటం ఎందుకని ప్రశ్నించారు. పంచాయతీ సర్పంచులకు జీతాలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడంలేదని చెప్పారు. రొంపిచర్ల మండల పార్టీ కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, అమరావతి మండల సేవాదళ్ అధ్యక్షులు వైఎన్ పాపారావు, గెల్లి మల్లికార్జునరావు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ -
సిఫార్సు బదిలీలు!
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఈ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా, కేవలం సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. సిఫార్సు ఉన్నవారికే ప్రథమ ప్రాధాన్యం 2019లో సచివాలయ మహిళా పోలీసులకు వచ్చిన ర్యాంకు, వారి అర్హత, టెక్నికల్ క్వాలిఫికేషన్ బట్టి వారికి ఆయా సచివాలయాల్లో పోస్టింగ్ కల్పించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో కేవలం వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే బదిలీలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆ విధంగా కాకుండా ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికై నా బదిలీ చేస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఖరాకండిగా చెబుతుండంతో సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని మహిళా పోలీసుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఒక్కో లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు ! ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 1100 మంది దాకా మహిళా పోలీసులు ఉన్నారు. వీరందరికీ ఆదివారం కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఇందులో రూరల్ ప్రాంతంలో పనిచేసే మహిళా పోలీసులు అర్బన్ ప్రాంతానికి వచ్చేందుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒక్కో సిఫార్సు లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి గుంటూరు నగరంలో పోస్టింగ్ కోసం ఒక్కో మహిళా పోలీసు 5 నుంచి 10 దాకా వారి వారి పలుకుబడిని బట్టి సిఫారసు లేఖలు తెచ్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం, సీనియార్టీ, ర్యాంక్తో పనిలేదు? ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ ఛాలెంజడ్, కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ వంటి రోగులతో పాటు, స్పౌజ్ కేటగిరి వారికి ప్రథమ ప్రాధ్యానం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవేమీ అమలు జరగడం లేదు. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు లేఖలే పనిచేస్తుండడంతో అర్బన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు రూరల్కు బదిలీ అవుతామేమోననే భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ ఉన్నవారికే ప్రాధాన్యం! గుంటూరు సిటీకి వచ్చేందుకు ఒక్కో లేఖకు రూ.50వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఆందోళనలో మహిళా పోలీసులు -
వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం పాత్ర కీలకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి లీగల్ విభాగం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన అంబటిని ఆదివారం సత్కరించారు. అరండల్పేటలోని లీగల్ విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ముందుగా న్యాయవాదులు, లీగల్ విభాగం నేతలు అంబటిని సత్కరించి, అభినందనలు తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన నేపథ్యంలో లీగల్ విభాగం సన్మానించటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. గతంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు లీగల్ విభాగం కృషి ఎనలేనదన్నారు. 2024 ఎనికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ శ్రేణులపై, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, కూటమి పెట్టే ప్రతి అక్రమ కేసుపై లీగల్ విభాగం ద్వారా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైతం న్యాయవాదుల కృషి ఎంతగానో ఉండబోతోందన్నారు. మహత్తర శక్తిగా లీగల్ విభాగం ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి కుట్రలను చేధిస్తూ.. వైఎస్సార్ సీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు తామున్నామనే ధైర్యాన్ని కలిస్తున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో లీగల్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. గుంటూరు పశ్చిమలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురువేసేందుకు న్యాయవాదుల ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. కూటమి పాలనలో అనేక అక్రమ కేసులు చూస్తున్నామని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, కొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, సయ్యద్ బాబు, సోమసాని ఝాన్సీ, మంజుల, పోకల వెంకటేశ్వర్లు, హబీబుల్లా, వాసం సూరిబాబు, లలిత, వరదాయని, శ్యామల, ఇందిరా, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు లీగల్సెల్ ఆధ్వర్యంలో అంబటికి సత్కారం -
చేరికలు శూన్యం
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు లేక మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలే ఇందుకు ఉదాహరణ. పల్నాడు జిల్లావ్యాప్తంగా 179 ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటివరకూ ఒకటో తరగతిలో కనీసం ఒక్క విద్యార్థి సైతం చేరకుండా ఉండటం విద్యారంగ చరిత్రలో ఇదే మొదటిసారి. దీనావస్థలో ప్రభుత్వ విద్య విలీనం పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో కలిపేయడం, మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు అంటూ ప్రాథమికస్థాయిలో విద్యార్థులకు విద్యను దూరం చేయడం వంటి కారణాలతో ప్రాథమిక స్థాయిలో పునాది వేయాల్సిన ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు లేక పాఠశాలలు దీనావస్థలోకి వెళ్లిపోయాయి. ఈ విధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను పరిశీలిస్తే ఒక పల్నాడు జిల్లాలోనే 179 పాఠశాలలు ఉండటం గమనార్హం. వికటించిన ప్రయోగాలు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో సంబంధిత పాఠశాలల్లోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేసిన కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పేరుతో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేసింది. గ్రామంలోని వేర్వేరు కాలనీల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న నాలుగైదు ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటే పాఠశాల ఉండాలనే ప్రభుత్వ విధానంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే దూరమయ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. కిలోమీటర్ల కొద్దీ నడవలేక.. పాఠశాలకు వెళ్లిరావడం దూరాభారం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి రోజూ కిలోమీటర్లు కొద్దీ నడిపించేందుకు ఇష్టపడక, ఆర్థిక భారమైనా స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రభావంతో గ్రామాల్లో మిగిలిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడే ప్రమాదం ఏర్పడింది. ప్రాథమిక పాఠశాలలకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చివేయడంతో విద్యార్థుల ప్రవేశాలు సైతం పడిపోతున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో సజావుగా..ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతబడలేదు. ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చి, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా పాఠశాలలు సక్రమంగా కొనసాగే పరిస్థితులను నాడు కల్పించారు. అయితే నేడు కూటమి పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయోగాలతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కోల్పోయే దుస్థితి ఏర్పడింది. పల్నాడు జిల్లాలోని 179 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ వైఎస్సార్ సీపీ పాలనలో సజావుగా ప్రభుత్వ పాఠశాలలు -
జీఆర్ఎఫ్ డీఎస్పీ అక్కేశ్వరరావు
అవసరమైతే కాల్పులు పిడుగురాళ్ల: రైళ్లలో నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని గుంటూరు డివిజన్ జీఆర్ఎఫ్ డీఎస్పీ పి. అక్కేశ్వరరావు హెచ్చరించారు. రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైళ్లలో నేరాలను అరికట్టేందుకు గుంటూరు డివిజన్లో ఆర్పీఎఫ్, జీఆర్ఎఫ్ సంయుక్తంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ ట్రైన్లలో కొద్ది రోజులుగా ఏసీపీ(అలారం చైన్ పుల్లింగ్), సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ ద్వారా వేగంగా వెళ్లే ట్రైన్లను నేరగాళ్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే ఏ బోగీ నుంచి ఈ ట్యాంపరింగ్ జరిగిందనేది తమకు వెంటనే కచ్చితమైన సమాచారం వస్తుందని తెలిపారు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే వేగంగా వెళ్తున్న ట్రైన్ ఒక్కసారిగా నెమ్మదించడంతో విధుల్లో ఉన్న గుంటూరు డివిజన్లోని తెనాలి ఎస్సై వెంకటాద్రి, కానిస్టేబుల్ శేషయ్య, తదితరులు అప్రమత్తం అయ్యారన్నారు. దొంగలు రాళ్లు విసరడంతో ఎస్సై, కానిస్టేబుల్ కాల్పులు జరిపారని తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని తనతోపాటు గుంటూరు డివిజన్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్ కుమార్ పరిశీలించారని తెలిపారు. డీఐజీ ఉత్తర్వుల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, నెల్లూరు తదితర ప్రాంతాలకు పంపినట్లు పేర్కొన్నారు. దుండగులను పట్టుకొని చట్టపరంగా తగిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. దోపిడీలు, దొంగతనాలకు పాల్పడితే కాల్పులు జరిపైనా ప్రయాణికులకు రక్షణ కల్పిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా కాపాడటమే తమ విధి అన్నారు. కార్యక్రమంలో గుంటూరు అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్ కుమార్, జీఆర్పీ సీఐ పి.కరుణాకర్ రావు, ఎస్ఐలు హుస్సేన్, మోహన్, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా సుభద్రమ్మశోభాయాత్ర
తాడేపల్లిరూరల్: తాడేపల్లిలో ఆదివారం అత్యంత వైభవంగా సుభద్ర అమ్మవారి శోభాయాత్ర జరిగింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా సుభద్ర అమ్మవారికి ఇస్కాన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీతానగరం శ్రీమద్విరాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి వివిధ రకాల పూలు, సారెలతో ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ సీతమ్మవారి పాదాల వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా యువతులు, చిన్నారులు కోలాటాలు, నృత్యాలతో అలరించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
వరుస దోపిడీలతో హడలెత్తిస్తున్న ఉత్తరాది దొంగల ముఠా
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వరుస రైలు దోపిడీలు ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రిపూట ప్రయాణిస్తున్న దూరప్రాంత రైళ్లను సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్, చైన్ లాగడం వంటివి చేసి స్టేషన్ల మధ్య నిర్మానుష్య ప్రాంతాలలో దొంగలు ఆపుతున్నారు. బోగీలలో చొరబడి బంగారు నగలు, నగదు, ఫోన్లు వంటి విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. రైళ్లలో భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటం, ఉన్నా కొందరి నిర్లక్ష్యంతో దొంగలు యథేచ్ఛగా ప్రయాణికులను దోచుకొని పారిపోతున్నారు. గతంలో క్రాసింగ్ కోసం ఆగినప్పుడు ప్రయాణికులను దోచుకునేవారు. రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు దొంగలు కిటికీలలో చేతులు పెట్టి లోపలున్న ప్రయాణికుల విలువైన వస్తువులను లాక్కెళ్లేవారు. ఇటీవల కాలంలో మరింత బరి తెగించి సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేస్తున్నారు. రైళ్లకు సిగ్నల్ దొరక్కుండా చేసి నిర్మానుష్య ప్రాంతంలో ఆగేలా చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా పిడుగురాళ్ల ప్రాంతంలో ఇదే తరహాలో దోచుకెళ్లారు.సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేసి..తాజాగా శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో న్యూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న సిగ్నల్ వ్యవస్థను దుండగులు ట్యాంపరింగ్ చేయడంతో సిగ్నల్ పనిచేయక విశాఖ నుంచి చర్లపల్లి వెళుతున్న స్పెషల్ రైలు ఆగింది. ఇదే అదనుగా దొంగలు ఇద్దరు మహిళల నుంచి 50 గ్రాముల బంగారు గొలుసులు దోచుకున్నారు.24 గంటలు గడవకముందే..ఇది జరిగి 24 గంటలు గడవకముందే పిడుగురాళ్ల సమీపంలోని తుమ్మల చెరువు స్టేషన్ సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఏకంగా రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపే వరకు వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కు విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల ప్రాంతంలో రెండు కిలోమీటర్ల దూరంలో తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ ఉండగానే స్లో అయింది. వెంటనే ఎస్ఐ వెంకటాద్రి తన సిబ్బందితో దొంగల వెంటపడ్డారు. విజిల్స్ వేయటం, లాఠీ శబ్దం చేయటం, లైట్లు వేయటంతో లైట్ ఫోకస్కు దొంగలు అప్రమత్తమై ట్రైన్ బోగీలో నుంచి దిగిపోయారు. దొంగలు రాళ్లు విసరడంతో ఎస్సై తన తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. కానిస్టేబుల్ శేషయ్య తన 303 గన్తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగలు పారిపోయారు. ప్రయాణికులకుగానీ, రైల్వే ఆస్తులకుగానీ ఎటువంటి నష్టం జరగలేదు. దొంగలు ఐదుగురు నుంచి ఏడుగురు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో 3 నెలల క్రితం కూడా ఓ దోపిడీ జరిగింది. గతేడాది ఆగస్టు నెలలో వరుసగా తుమ్మలచెరువు, నడికుడి ప్రాంతాలలో చైన్నె, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లలో దొంగలు దోచుకున్నారు.హడలెత్తిస్తున్న ఉత్తరాది ముఠారైలు దోపిడీలు, దొంగతనాలు ఉత్తరాది దొంగల ముఠా పని అని జీర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన పార్థీ గ్యాంగ్, షోలాపూర్, మీర్జాపూర్, జూమ్కేడ్, బీడ్ తదితర ప్రాంతాలకు చెందిన నేరస్థులు రైళ్లలో ఇలా దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నేరాలు చేసే క్రమంలో వీరు చేస్తున్న రైల్ సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ రైల్వే భద్రతకు ప్రమాదకరంగా మారుతోంది. దీని వల్ల ప్రమాదాలు జరగడంతోపాటు సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని రైళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
విశాఖ ఎక్స్ప్రెస్లో దొంగల ముఠా హల్చల్.. రైల్వే పోలీసుల కాల్పులు
సాక్షి, పల్ల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్లుగా గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో, దొంగల ముఠా పారిపోయింది. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు. -
డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
చిలకలూరిపేట టౌన్: డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరానికి చెందిన చల్లా గోపి, షేక్ షారూక్ 25 గ్రాముల డ్రగ్స్తో శుక్రవారం మండల పరిధిలో ఓ రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారంతో అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు ఇరువురిని తనిఖీ చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు. శనివారం రూరల్ సీఐ సుబ్బనాయుడు ఇరువురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు తాడేపల్లి రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ముత్యాలనగర్లో శనివారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కార్మికులకు జీతాలు పెరగక, పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 18,500 రూపాయలు జీతం ఇవ్వాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. జూలై 1న అన్ని పట్టణాలలో మున్సిపల్ కార్మికులతో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జూలై 4న ధర్నా చౌక్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులతో పెద్దఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తాడేపల్లి పట్టణ నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు. -
మేలు రకం విత్తనాలతో మిరపసాగు
నరసరావుపేట రూరల్: మేలు రకపు విత్తనాలతో మిరప సాగును రైతులు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. మిరప పంటపై జిల్లాలోని ఉద్యాన సహాయకులకు మున్సిపల్ సమావేశ మందిరంలో శనివారం శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన వెంకట్రావు మాట్లాడుతూ భూమిలో కర్భన శాతం పెంచే విధంగా జీలుగ, జనుము విత్తనాలను, పశువుల ఎరువును వేయాలని సూచించారు. నేలను లోతుగా దుక్కులను దున్నడం వలన చీడపీడలను నివరించవచ్చని తెలిపారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ జిల్లాలో సాగు చేసేందుకు అనువైన మిరప రకాలను తెలియజేశారు. ఎల్సీఏ–643 నల్లతామర పురుగు ఉధృతిని తట్టుకుంటుందని తెలిపారు. ఎల్సీఏ 334 ఎగుమతికి అనుమైన రకమని వివరించారు. ఎల్సీఏ 353,ఎల్సీఏ 625, ఎల్సీఏ 680,ఎల్సీఐ 684, ఎల్సీఏ 657 రకం విత్తనాలను రైతులు సాగు చేయాలని తెలిపారు. నారు పెంచేందుకు సెంటుకు 650గ్రాములు, ఎదబెట్టేందుకు ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం అవసరమవుతుదని తెలిపారు. సంకర రకాలైతే ఎకరానికి 80 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుందన్నారు. డిజిటల్ గ్రీన్ కో–ఆర్డినేటర్ మస్తాన్వలి మాట్లాడుతూ మిరప సాగు చేసే రైతులు ఈ–మిర్చి యాప్ను డౌన్లోడ్ చేసుకుని రైతు వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యవసాయ అనుబంధ సేవలకు చెందిన ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చని తెలిపారు. ఉద్యాన అధికారులు ఎస్కె నబీరసూల్, మోహన్, సురేష్, అంజలిభాయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు -
ప్రత్యేక పీజీఆర్ఎస్కు 20 అర్జీలు
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ఆయన అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 20 అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ● సమస్య తెలియజేసేందుకు పట్టణంలోని బాబాపేట నుంచి ఓ దివ్యాంగురాలు రాగా ఆర్డీఓ ఆమె వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. తాను 90శాతంకు పైగా దివ్యాంగతనంతో ఉన్నానని తనకు ప్రస్తుతం రూ.6వేలు మాత్రమే ఇస్తున్నారని, తనకు రూ.15వేలు పింఛన్ అమలుచేయాలని కోరారు. సమస్యను పరిశీలించాల్సిందిగా డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణిని కోరారు. డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాలవారి సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోని ప్రతి నెల నాల్గవ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి
అమరావతి: ప్రపంచానికి పురాణాలను అందించింది వేదవ్యాస భగవానుడైతే ఆ పురాణాలను సామాన్యుడికి సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచించిన అభినవ వ్యాసుడు పురాణ ప్రవచన సార్వభౌముడు, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి అని ప్రముఖ ప్రవచన కర్త నోరి నారాయణమూర్తి అన్నారు. శనివారం రాత్రి స్థానిక యోగాశ్రమంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి శతజయంతి వర్ష సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసభకు మల్లాది రామనాధశర్మ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా నోరి నారాయణమూర్తి మాట్లాడుతూ దేశ, విదేశాలలో పురాణప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి మాత్రమేనన్నారు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టువల్ల పురాణ ప్రవచన ప్రముఖుల్లో ప్రథములుగా గుర్తించబడ్డారన్నారు. నాటి కిరోసిన్ దీపాల వెలుగులో పురాణం చెప్పేరోజులనుంచి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఆడిటోరియంలో చెప్పే వరకు సమారు 70 సంవత్సరాల మల్లాదివారి సుదీర్ఘ ప్రవచన ప్రయాణం సాగిందన్నారు. ● శనగవరసు రామ్మోహన శర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖాతి గాంచిన శైవక్షేత్రమైన అమరారామంలో జన్మించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి అమరావతి ఆణిముత్యమన్నారు. ● మాచిరాజు వేణుగోపాల్ మాట్లాడుతూ అమరావతిలోనే చంద్రశేఖరశాస్త్రి బాల్య విద్యాభ్యాసం గడవడంతోపాటు, తొలిరోజుల పురాణ ప్రవచనం ఇక్కడే చేసి, ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి మరోసారి వన్నె తెచ్చారన్నారు. ● ప్రముఖప్రవచనకర్త పుల్లాభట్ల వేంకటేశ్వర్లు మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో శృంగేరి శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుడిగా పురాణాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో భక్తిభావతత్పరతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడు చంద్రశేఖరశాస్త్రి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రా లలో ప్రవచనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రశేఖరశాస్త్రి అనటంలో అతిశయోక్తి లేదన్నారు. విశ్రాంత న్యాయమూర్తి మందాడి చలపతిరావు, మల్లాది రామచంద్రశర్మ, అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కౌశిక ప్రసాద్లు మాట్లాడారు. ఈసభకు అమరావతి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రవచన కర్త నోరి నారాయణ మూర్తి -
ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు తల్లికి వందనం కూడా వర్తింపజేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె కమిటీ అధ్యక్షుడు డి.ప్రభాకరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా శనివారం నెహ్రూ బొమ్మ సెంటరులో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అరకొర జీతాలను అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ కార్మికులను పథకాలకు దూరం చేస్తు న్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, 12వ పీఆర్సీ అమలుకు అనుగుణంగా కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం అవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్, యూనియన్ నాయకులు రవి, రాఘవేంద్రరావు, శివ, యువరాజు, తదితరులు పాల్గొన్నారు. -
కుట్రదారుల పాలిట సింహస్వప్నం వైఎస్ జగన్
నరసరావుపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భూతమని ఒక కొత్త పేరు పెట్టి, ఆ భూతాన్ని భూస్థాపితం చేసేపనిలో ఉన్నామని నాలుగోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు నేరపూరితంగా, సంస్కారహీనంగా మాట్లాడటం.. దానికి తానా తందానా అంటూ అనుకూల మీడియా వంతపాడడం, భూస్థాపితం ఎప్పుడు చేస్తారు, ఈ ఐదేళ్లలోనేనా అని పాత్రికేయతకే మచ్చతెచ్చేలాగా ఆ మీడియా ప్రశ్నించడం చాలా అభ్యంతరకరం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కళంకమని సోషల్ యాక్టివిస్టు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉండగా తాను ప్రజలకిచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం నవరత్న సంక్షేమ పథకాలను ఠంఛనుగా ఐదేళ్లూ అందించడమే కాక, చరిత్రలో నిలిచిపోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లుగా ఆయన్ను విధ్వంసకారుడు అని తమ అనుకూల మీడియా ద్వారా కూటమి నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి పేరిట అనైతిక పొత్తులు పెట్టుకుని, ఈవీఎంలతో సహా వ్యవస్థలను మేనేజ్ చేసి, గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇకనైనా బాబు బుద్ధి తెచ్చుకోవాలి మరో పక్క వైఎస్ జగన్ ఓడినప్పటికీ నీతికి నిలబడి గెలిచాడని, కోట్లాది జన హృదయాలలో నిలిచాడన్నారు. అందుకనే వైఎస్ జగన్ కుట్రదారుల పాలిట సింహ స్వప్నమయ్యాడని తెలిపారు. 164 సీట్లు సాధించినా కూటమి నాయకులకు మనశ్శాంతి కరువైందన్నారు. పెట్టుబడుల సదస్సుల్లో కూడా వైఎస్ జగన్పై నిందలు వేయటం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ర్యాలీ ప్రమాదంలో సింగయ్య మరణాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కల్పించిన ఫేక్ వీడియోతో జగన్పైకి నెట్టి, జైలుపాలు చేయాలని చూడటం నీచ నికృష్ట రాజకీయానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు వేసిన మొట్టికాయలకై నా బాబు బుద్ధి తెచ్చుకుని కక్షపూరిత రాజకీయాలకు, రెడ్బుక్ రౌడీయిజానికి స్వస్తి చెప్పి, మొదటి ఏడాది బాకీపడ్డ సూపర్సిక్స్ పథకాలను వడ్డీతో సహా ప్రజలకు అందజేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈదర గోపీచంద్ -
గ్రావెల్ లారీలను అడ్డుకున్న జనసేన నాయకులు
చిలకలూరిపేట: అటవీ, అసైన్డ్ భూములను అక్రమంగా తవ్వి దోపిడీకి పాల్పడుతుంటే, సంబంధిత అధికారులు నిద్ర నటిస్తున్నారని... మామూళ్ల మత్తులో వారు జోగుతున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యడ్లపాడు మండలం వంకాయలపాడు, చెంఘీజ్ఖాన్పేట పంచాయతీల మధ్య అటవీ, అసైన్డ్ భూముల్లో కొంతమంది అక్రమ మైనింగ్కు పాల్పడుతూ గ్రావెవెల్ తరలించుకుపోతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు జనసేన నాయకులు ఆ ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రావెల్ తరలించుకుపోతున్న మూడు టిప్పర్ లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ తాము అవినీతిని అడ్డుకుంటామని వెల్లడించారు. ఆరు పొక్లెయిన్లు, 15 టిప్పర్ లారీలతో అటవీ, ప్రభుత్వ భూముల్లో భారీగా గ్రావెల్ అక్రమ తవ్వకాలకు, దోపిడీకి పాల్పడుతున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేస్తే తహసీల్దార్ను పంపిస్తానని చెప్పారని, తహసీల్దార్కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వస్తానని, సంబంధిత లారీల తాళాలు తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. లారీల తాళాలు తీసుకొని 3గంటలు వేచి చూసినా తహసీల్దార్ రాకుండా కేవలం ఒక వీఆర్వోను పంపించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత వ్యక్తులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అడ్డుకున్న మూడు టిప్పర్ లారీల తాళాలను మీడియా సమక్షంలో వీఆర్వోకు అందజేశారు. కార్యక్రమంలో జనసేన చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి సుభాని, నాయకులు ఖాదర్బాషా, మునీర్ హసన్, మేకల రామారావు, దరదాసుల శరత్, బాపన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అధికారుల సహకారంతోనే అక్రమ మైనింగ్ అంటూ ఆరోపణ -
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు అవసరం
నరసరావుపేట: నీళ్లు, దోమల ద్వారా వచ్చే వ్యాధుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ అవి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి కె.రవీంద్ర రత్నాకర్ అధ్యక్షతన జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సబ్ యూనిట్లలో నూతనంగా చేరిన 65మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వ్యాధులు సంభవిస్తే తక్షణమే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఎంఎల్హెచ్పీలకు సహాయ సహకారాలు అందజేస్తూ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ నవంబరు వరకు మలేరియా, డెంగీ, చికున్గున్యా, పైలేరియా, మెదడువాపు వ్యాధులు లాంటి సీజనల్ వ్యాధులు విషయంలో ఫ్రైడే డ్రైడేను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. దోమల నిర్మూలనతో పాటు అవి పుట్టకుండా, కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్ నజీరు, ఏఎంఓ చుక్కా వెంకటేశ్వర్లు, కుంచాల శ్రీనివాసరావు, సబ్యూనిట్ అధికారులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవి -
ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే 20 శాతం నుంచి 30 శాతం మేరకు పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.18 నుంచి 20 వేల మధ్యలో ఉండగా, కార్పొరేట్ స్కూల్లో అది రూ. 28 వేలుగా ఉంది. కార్పొరేట్ పాఠశాలలో 6వ తరగతికి రూ.35 వేలు, టెన్త్కు రూ.40వేలు వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60వేలు, టెన్త్కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పబ్లిషర్లతో డీల్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టేశాయి. ప్రైవేటు పబ్లిషర్లతో డీల్ కుదర్చుకుని, ఎమ్మార్పీలకు ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్సులు విక్రయిస్తున్నాయి. వీటితో పాటు యూనిఫాం, బెల్టు, టై సహా అన్నీ వారి దగ్గరే తల్లిదండ్రులు కొనాలి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని, యూనిఫాంను ఫలానా దుకాణంలో కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. నాణ్యమైన విద్య..మిథ్య ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధన జరిగాలి. అయితే, ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్య పుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నాయి. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ద్వారానే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ, నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తూట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధన చేస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు పాఠశాలల్లోనూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడించింది. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా క్యాంపస్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆన్లైన్లో పుస్తకాలకు ఆర్డర్ పెట్టాలి. పుస్తకాలను కొనుగోలు చేసే విధానాన్ని విద్యాశాఖాధికారులు పక్కాగా పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆన్లైన్ విధానానికి స్వస్థి పలకడంతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉండగా, అధిక లాభాలను ఆర్జించిపెట్టే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలనే విక్రయిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ అకడమిక్ కేలండర్కు విరుద్దంగా సొంత సిలబస్ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏటా పెరుగుతున్న ఫీజులు నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు పుస్తకాలు, యూనిఫాం కొనడానికి అప్పులు క్యాంపస్లలోనే యథేచ్ఛగా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తక విక్రయాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే బోధించాలనే నిబంధనకు తూట్లు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల కొనుగోలు తప్పనిసరి చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆన్లైన్ ఆర్డర్ విధానంతో పక్కాగా పర్యవేక్షణ ఆ పద్ధతికి స్వస్తి పలికిన కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేందుకు వీల్లేదు -
పల్నాడు
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 202513వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీగుంటూరు నగరంలోని అరండల్పేటకు చెందిన జగదీష్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలను ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.20వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం అదనంగా రూ.4 వేలు, రెండో తరగతిలో చేర్పించిన అమ్మాయికి రూ.22వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం రూ.5వేలు చెల్లించాలని చెప్పడంతో గుండె గుభిల్లుమంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికి రూ.500లోపే కదా అని జగదీష్ అడిగితే ప్రభుత్వ పుస్తకాలను మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన వాటిని క్యాంపస్లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం సూచించింది. నెలకు రూ.15వేలు సంపాదిస్తున్న జగదీష్కు ఇద్దరు పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చదివించడం భారంగా మారింది. ఇది ఒక్క జగదీష్కే పరిమితమైన సమస్య కాదు.. పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు పడుతున్న సమస్యలకు ఇది ఒక ఉదాహరణ. 7న్యూస్రీల్ -
అయితానగర్ను భయపెట్టేందుకే దాడి
తెనాలి: పాలకులు పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని ఎప్పుడు.. ఎవరిని వేధించాలని చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ దృక్పథాన్ని, సంస్కృతిని తీసుకురావాలని, ప్రశ్నించే తత్వానికి ఈ సదస్సు వేదిక కావాలని శనివారం రాత్రి తెనాలిలో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దళిత చైతన్యానికి, ఉద్యమాలకు గుండెకాయ వంటి అయితానగర్ను భయభ్రాంతులకు గురిచేసేందుకు యువకులపై బహిరంగ దాడి చేశారని ఆరోపించా రు. పోలీసుల తీరునూ, వారిని సమర్థిస్తున్న పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. తెనాలిలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ తెనాలి అయితానగర్లోని కమ్యూనిటీ హాలులో జరిగిన సదస్సుకు సమన్వయకర్త పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలు, వివిధ దళిత, ప్రజాసంఘాలు మొత్తం 24 పైగా నిర్వాహక కమిటీగా జరిపిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులే కేసు పెట్టి, తీర్పులిచ్చి, శిక్షలు వేసేస్తుండటం దారుణమని పేర్కొన్నారు. తెనాలి పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘనను సీపీఎం ఖండిస్తోందని తెలిపారు. మానవ హక్కులను కాపాడుకోవడమే మనముందున్న సమస్యగా స్పష్టం చేశారు. ● సీపీఐ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల దారుణంపై ప్రజాప్రతినిధులు, చివరికి హోం మంత్రి సహా సిగ్గుపడకపోగా సమర్థిస్తారా? అంటూ నిలదీశారు. ● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బహిరంగంగా శిక్షించమని ఏ చట్టం చెబుతోందని అన్నారు. ● ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు, వాస్తవంగా పెట్టీ కేసు మాత్రమేనని తెలిపారు. దీనిపై పలు సెక్షన్లతో కేసులు పెట్టటం ఏమిటని ప్రశ్నించారు. ● రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ అయితానగర్లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతోనే కుట్ర మొదలైందని చెబుతూ అందుకే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషనులో స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరును చేర్చినట్టు తెలిపారు. ● ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితులు ఐకమత్యంగా పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. ● విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల చర్య కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని చెప్పారు. ● వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే సాగర్ మాట్లాడుతూ పోలీసుల దాడివెనుక పోరాట స్ఫూర్తి కలిగిన అయితానగర్ను భయభ్రాంతులను చేయాలనే పాలకుల కుట్ర ఉందని తెలిపారు. ● మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిశోర్ మాట్లాడుతూ ఇంత ఆందోళన జరిగినా కనీసం పోలీసులపై చర్య తీసుకోలేదంటే దళితులపై ప్రభుత్వ చులకనభావమేనని పేర్కొన్నారు. ● సభాధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నేత జి.శాంతకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వై.నేతాజీ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ , కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, మాల ఉద్యోగుల సంఘం నేత కిశోర్బాబు, కులనిర్మూలన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, ఇండియన్ లీగల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ నేత మణి, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకా చంద్రశేఖర్, భగత్సింగ్, వేముల మురళి, నీలాంబరం, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రం, ఆర్పీఐ అంబేడ్కరైట్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవిప్రసాద్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడారు. దళిత బహుజన ఫ్రంట్ కొరివి వినయ్కుమార్ స్వాగతం పలికారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో వక్తలు పోలీసుల తీరు, సమర్థిస్తున్న పాలకుల వైఖరిపై ఆగ్రహం తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా సంఘాల రాష్ట్ర నేతలు -
ఉద్యోగుల సస్పెన్షన్పై విచారణ
నాదెండ్ల: గణపవరం గ్రామీణ పశువైద్యశాల వైద్యాధికారి సాంబశివారెడ్డి, వెటర్నటీ లైవ్స్టాక్ సిబ్బంది పవన్కుమార్ ఇటీవల సస్పెండ్కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై పశు సంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు శనివారం విచారణ చేపట్టారు. ఈ నెల 19న 3.30 గంటల సమయంలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ, పాడి పరిశ్రమల స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి రాజశేఖర్ గణపవరం పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో వైద్యాధికారి సాంబశివారెడ్డి, సిబ్బంది పవన్కుమార్ లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. ఈ విషయమై శనివారం డైరెక్టర్ దామోదర్నాయుడు రికార్డులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. స్థానిక పశుపోషకులను విచారించారు. వైద్యాధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఇళ్లకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు. ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేటరూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మేదరమెట్ల అంజమ్మ, మస్తాన్రావు విద్యాసంస్థల చైర్మన్ ఎంవీ శేషగిరిరావు, అనంతలక్ష్మీ దంపతులు విరాళంగా రూ.3 లక్షలు అందజేశారు. ఆలయ కార్యాయంలో ఈవో నలబోతు మాధవిదేవిని కలిసి విరాళం చెక్ను దాతలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ పాల్గొన్నారు. వెబ్సైట్లో మెరిట్ కార్డులు నరసరావుపేట ఈస్ట్: జాతీయ ఉపకార వేతన పరీక్షలో ఎంపికై న 168 మంది విద్యార్థుల మెరిట్ కార్డులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు ఉపకార వేతనం పొందేందుకు వెంటనే బ్యాంక్ ఖాతా తెరిచి తమ ఆధార్ను లింక్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల వెబ్సైట్ www. bre.ap.gov.in ద్వారా తమ మెరిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలను ఒక్క అక్షరం తేడా లేకుండా సరిచూసుకోవాలని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రిత్వశాఖ స్కాలర్షిప్ పోర్టల్ www.rchoarrhipr .gov.in నమోదు చేసుకొని దరఖాస్తును అప్లోడ్ చేయాలని తెలిపారు. సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్, జిల్లా నోడల్ ఆఫీసర్ ద్వారా ధృవపరుచుకోవాలన్నారు. మెరిట్ కార్డులను త్వరలో డిప్యూటీ డీఈఓ కార్యాలయాల ద్వారా పాఠశాలలకు పంపిస్తామని తెలిపారు. కార్డులోని వివరాలను సరిచూసుకొని ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందచేయాలని వివరించారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో షబీనా ప్రతిభ మంగళగిరి టౌన్ : జాతీయ స్థాయిలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం దావన్గిరిలో జరుగుతున్న జూనియర్ నేషనల్ ఎక్యూప్ట్ ఉమెన్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సందాని శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్ షబీనా 84 కిలోల విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. స్క్వాట్ 202.5 కిలోలు, బెంచ్ ప్రెస్ 97.5 కిలోలు, డెడ్ లిఫ్ట్ 182.5 కిలోలు, ఓవరాల్ 482.5 కిలోల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 514.20 అడుగుల వద్ద ఉంది. ఇది 138.9118 టీఎంసీలకు సమానం. -
సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’
నెహ్రూనగర్: సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు పారదర్శకతకు పాతర వేశారు. అసలు ఖాళీలు చూపించకుండానే నిర్వహించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని యూఎల్బీస్(అర్బన్ లోకల్ బాడీస్) అయిన గుంటూరు నగరపాలక సంస్థ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీల పరిధి లోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం జరిగింది. ఇందులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఉన్నారు. పారదర్శకతకు పాతర మామూలుగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఖాళీలను బట్టి నడుస్తుంది. ముందుగా దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజెడ్, క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత సీనియార్టీ, ర్యాంక్ని బట్టి ఉంటుంది. అయితే, అధికారులు ఇవేమీ పాటించలేదు. సచివాలయ వివరాలను మూడు ఆప్షన్స్గా చూపించి, ఫారం ఫిల్ చేసి ఇచ్చేసి వెళ్లిపోండంటూ చెప్పడంతో ఉద్యోగులు విస్తుపోయారు. ఈ నెల 30వ తేదీలోగా అలాట్ అయిన సచివాలయానికి సంబంధించిన పోస్టింగ్ కేటాయిస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. అసలు తాము ఇచ్చిన ఆప్షన్స్ ఫాం అయిన ఉంటుందా ? లేక చెత్త బుట్టలో వేస్తారో ! అని ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. వార్డు టూ వార్డు ట్రాన్స్ఫర్లపై మండిపాటు వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా యూఎల్బీ టూ యూఎల్బీ(అర్బన్ లోకల్ బాడీ)కు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని కొంత మంది మహిళా సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. వార్డు టూ వార్డు పెట్టుకోవడం ద్వారా ఇంకా దాన్ని ట్రాన్ఫర్లు అనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఖాళీలు చూపించకుండా బదిలీలు ప్రక్రియ చేపట్టిన అధికారులు ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోవాలని సూచన 30న సచివాలయం ఎలాట్మెంటు అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల మండిపాటు ఎమ్మెల్యేల లెటర్లకే ప్రాధాన్యం ? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు జరిగింది. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు 11,082(అర్బన్, రూరల్లకు కలిపి) మంది సెక్రటరీలు ఎంపికయ్యారు. వీరిలో మొదటి బ్యాచ్కు పోస్టింగ్స్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, పలువురు ఒకే సచివాలయానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర నుంచి సిఫార్సుల లెటర్లు తీసుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లే ఆధారంగా బదిలీలు జరిగే అవకాశం ఉందంటూ కొంత మంది సీనియర్ సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించి బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారో ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు మిన్నకుండిపోయారు. -
ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన: మహేష్ రెడ్డి
సాక్షి, నరసరావుపేట: కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉంది అని ఆరోపించారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడేది లేదన్నారు.మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీ మొత్తం చంద్రబాబు ఫ్యాక్షనిజం నడుపుతున్నారు. నిన్నటి ఓటమి రేపటి గెలుపునకు నాంది కావాలి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే భయమెందుకు?. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉంది. వైఎస్ జగన్ తొమ్మిది కార్లు, వంద మందితో వెళ్లాలట!. అనైతిక రాజకీయ ఒరవడికి కూటమి ప్రభుత్వం నాంది. భూస్థాపితం చేస్తారా?. ఎలా చేస్తారు?. ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై, కార్యకర్తలపై అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారుచిన్న పాపను 14 మంది అత్యాచారం చేస్తే వారిని ఎన్కౌంటర్ చేయాలి కదా?. తెనాలిలో యువకుల్ని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుంటే వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించడం తప్పా?. కుప్పం నియోజకవర్గం ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే మీరు ఏం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యురిటీ ఇవ్వకపోవడం వల్లనే సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు చనిపోవడం జరిగింది. వైఎస్ జగన్ 2010లో పార్టీ పెట్టిన అప్పటి నుండి చంద్రబాబు.. వైఎస్ జగన్ని తొక్కాలని చూస్తున్నాడు. అందుకే అనైతిక పొత్తులు పెట్టుకున్నారు.. కానీ, విఫలం అయ్యారు. ఎన్నికల్లో మహిళలకు నెలకు 1500 ఇస్తా అన్నారు అది నమ్మి మహిళలందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు మొదలు అవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. ఆసుపత్రులకు ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. పల్నాడులో మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయడం లేదు. అందుకే మేము సెల్ఫీ వీడియోతో నిరసన తెలియజేసాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు పెట్టే కేసులకు భయపడేది లేదు. ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని తెలిపారు. -
‘రప్పా రప్పా శ్రీకాంత్’కు రిమాండ్
సత్తెనపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న టీడీపీ సానుభూతిపరుడు బొల్లెద్దు రవితేజ వైఎస్సార్సీపీ అభిమానిగా మారి రప్పా రప్పా అంటూ ఓ పోస్టర్ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పట్టణ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4గా ఉన్న ప్రకాశం జిల్లా మిన్నెకల్లుకు చెందిన ఆరేటి వెంకట మల్లికార్జునరావు అలియాస్ మల్లిఖార్జున్ అలియాస్ మల్లి సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో నివసిస్తున్నాడు. మల్లిని పట్టణ పోలీసులు ఈ నెల 23న కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఏ–3గా ఉన్న సత్తెనపల్లి రాజులకాలనీకి చెందిన నాగ శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం సత్తెనపల్లి మొదటి అదనపు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4 ఆరేటి వెంకటమల్లిఖార్జునరావుల బెయిల్కు దరఖాస్తు చేయగా న్యాయమూర్తి బెయిల్ తిరస్కరించి న్యాయవాది సమక్షంలో విచారణకు కస్టడికి ఇచ్చారు. -
సి‘ఫార్సు’ల బది‘లీలలు’
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అర్బన్ లోకల్ బాడీస్లో పనిచేసే సచివాలయ సెక్రటరీలకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం, ఆదివారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్వెంట్ సెక్రటరీలు, వార్డ్ ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు హాజరుకావాలి. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ ప్రాంతంలో కూడా ఈ నెలఖారులోపు నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. వీరికి ప్రాధాన్యత వార్డు సచివాలయ సెక్రటరీల బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజ్డ్ సిబ్బందికి, మెడికల్ గ్రౌండ్స్ కింద క్యాన్సర్, హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడీ, మానసిక వ్యాధుల కలిగిన పిల్లల తల్లిదండ్రులకు, స్పౌజ్ కేటగిరి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్లులోపు సర్వీస్ ఉన్నవారికి రిక్వస్ట్ మీద బదిలీలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వారికి కేటాయించిన సచివాలయంలో పరిధిలోనే విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్బీ)అయితే సొంత వార్డులో పోస్టింగ్ రాదు. రూరల్ ప్రాంతాల్లో అయితే సొంత మండలంలో పోస్టింగ్ కేటాయించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11082 మంది సెక్రటరీలు గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ కలుపుకుని 1344 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 11082 మంది సెక్రటరీలు పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది సెక్రటరీలు డెప్యూటేషన్పై వెళ్లిన వారు ఉన్నారు. వీరు కూడా కౌన్సెలింగ్కు హాజరై మిగుల ఉద్యోగుల కింద ఉండనున్నారు. వీలైతే డెప్యూటేషన్పై పనిచేసే సెక్రటరీలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కార్పొరేటర్ల దందా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సెక్రటరీలు వేరే సచివాలయానికి బదిలీ కావడానికి ఆయా ప్రాంత కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు లేఖలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గళ్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో బూర్ల రామాంజనేయులు దగ్గర నుంచి తమకు అనుకూలంగా ఉండే సచివాలయ ఉద్యోగులను పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లెటర్లు ఇప్పిస్తున్నారు. దీనికి గానూ ఒక్కో సెక్రటరీ నుంచి రూ.20 నుంచి 25 వేలు దాకా కార్పొరేటర్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి సెక్రటరీల బదిలీలకు కౌన్సెలింగ్ నచ్చిన సచివాలయంలో పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేల నుంచి సిఫార్సుల లేఖలు లెటర్లు ఇప్పిస్తామంటూ కార్పొరేటర్లు నగదు వసూలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్న సెక్రటరీలు -
పారదర్శకంగా జరపాలి
గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. ఉద్యోగుల సీనియారిటీ/ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ చేపట్టాలి. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఉన్న ప్రతి ఉద్యోగి పోస్ట్ను ఖాళీగా చూపించాలి. కౌన్సెలింగ్ సమయంలో ఏ ఒక్క ఖాళీ కూడా బ్లాక్ చేయకుండా చూడాలి. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం. 5, 6లో విధివిధానాలను కచ్చితంగా పాటించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిపార్సు లేఖల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చూడాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం -
తక్కువ ధరకే కూరగాయలు
రైతు బజార్ల ఏర్పాటు వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన తాజా కూరగాయలు, ఆకుకూరలు లభిస్తాయి. రైతులతోపాటు మాలాంటి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం రాయితీపై ఉల్లి, టమోటా, నూనెలు, పప్పులు లాంటివి విక్రయించేందుకు రైతు బజార్లు ఎంతో ఉపయోగపడతాయి. పిడుగురాళ్లలో రైతు బజారు ఏర్పాటు ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం అధిక ధరలకు కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. – ఎం.జ్యోతి, జానపాడు, పిడుగురాళ్ల మండలం -
రాజధాని రైతులపై ‘పూలింగ్’ పిడుగు
సాక్షి ప్రతినిధి, గుంటూరు / తాడికొండ: రాజధాని పరిసర ప్రాంత అన్నదాతల నెత్తిన మళ్లి భూ సమీకరణ పిడుగు పడనుంది. రెండు రోజుల కిందట కేబినెట్ భేటీలో మరో 43వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరమంటూ సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెదవి విరుస్తున్న రైతులు ప్రస్తుతం సమీకరించిన 33 వేల ఎకరాల భూమి గడచిన 12 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, వారికే న్యాయం జరగనప్పుడు తాము భూ ములు ఇస్తే ఏం చేస్తారంటూ రైతులు పెదవి విరిస్తున్నారు. రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. మళ్లీ భూసమీకరణ అంటే ఎలా ? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సమీకరణ సమయంలో ఇచ్చిన ఒప్పందాలు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చేసిన లే–అవుట్లను అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాని ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు.. దానికి రోడ్లు, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. త్యాగం చేసిన రైతులకు నష్టం ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం మినహా భూములిచ్చి త్యాగం చేసిన రైతులకు గత 12 ఏళ్లల్లో ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రానున్న నాలుగేళ్లలో సమీకరణ ప్రక్రియ పూర్తి కాదని, ఒకవేళ భూములిస్తే తరువాత తమ సంగతేంటనేది ఆ ప్రాంత రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. రైతుల్లో పలు సందేహాలు ఇటీవల తాడికొండ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో స్థానిక రైతులు పలు సందేహాలు లేవనెత్తారు. ఒక వేళ పూలింగ్కు తీసుకుంటే కౌలు రూ. 40 నుంచి రూ.50వేలు ఇవ్వాలని కొంత మంది కోరారు. మరికొంత మంది అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భూ సమీకరణ జరుగుతున్నప్పుడు చిన్న గ్రామాలు తొలగిస్తే తమ సంగతేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రామాలు తొలగించమని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ రైతులు నమ్మడం లేదు. తమ గ్రామాలు తొలగించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇవ్వమని కరాఖండిగా చెబుతున్న రైతులు ముందు 33వేల ఎకరాల్లో అభివృద్ధి చేసి చూపించిన తరువాత తాము పూలింగ్కు సహకరిస్తామని, ఇప్పుడికిప్పుడు తమ భూములు వదులుకోబోమని కరాఖండిగా రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారి భూములు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న నేపథ్యంలో పూలింగ్ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారే ప్రస్తావిస్తుండటం గమనార్హం. రైతుల్లో వ్యతిరేకత పరిధి విస్తరణ పేరుతో 43వేల ఎకరాల సమీకరణ భూముల రేట్లు అధికంగా ఉండటంతో ఇచ్చేందుకు రైతుల విముఖత అవసరాల మేరకే తీసుకోవాలంటూ సీఎంని కోరిన అధికార పార్టీ నేతలు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో తమ భూములకు గండికొట్ట వద్దంటున్న రైతులు రెండు గ్రామాలు కాలగర్భంలో కలిసిపోతాయని భయపడుతున్న గ్రామస్తులు తాడికొండ మండలానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఇటీవల పొన్నెకల్లు గ్రామంలో జరిగిన పీ –4 సదస్సుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అందులో రైల్వే లైనులు, అంతర్గత రహదారుల వరకు భూ సమీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అన్ని పొలాలు పూలింగ్కు ఇవ్వాలంటే సుముఖంగా లేమంటూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అనుకున్నదే తడవుగా భూ సమీకరణ పేరుతో నిర్ణయం తీసుకుని మంత్రివర్గ భేటీలో ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు తీకున్న నిర్ణయంపై రైతులు బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం పూలింగ్కు తీసుకున్న భూములకు ధరలు తగ్గి, తీవ్రంగా నష్టపోతామంటూ గతంలో పూలింగ్కు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తమ పరిస్థితి మారిందని వాపోతున్నారు. తరతరాలుగా ఉన్న పంట భూములను ప్రభుత్వం తీసుకునేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు చాలని గతంలో ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయ వినామాశ్రయం పేరుతో తమ పొట్ట గొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రణమిల్లిన భక్తజనం
మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై ఉత్సవాల నేపఽథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను నోడల్ అధికారి టి.చంద్రకుమార్ పరిశీలించారు. నోడల్ అధికారి వెంట దుర్గగుడి ఈవో శీనా నాయక్, ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు.ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపఽథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులోని ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకుంది. కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతోపాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సారె సమర్పణకు తరలివస్తున్న భక్తబృందాలు -
భారీ అగ్నిప్రమాదం
వ్యర్థాల గోదాములో వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ గోదాములో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి పదేళ్లుగా ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు గోదాములో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. కనీస అనుమతులు కూడా లేవని సమాచారం. మున్సిపల్, అగ్నిమాపక కేంద్రం అధికారులు మంటలను అదుపు చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనరు సుభాష్ చంద్రబోస్, ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో రూ.1.10 కోట్ల మేరకు ఆస్తినష్టం వాటలిట్లిందని బాధితుడు తెలిపారు.● రూ.1.10 కోట్ల మేర ఆస్తి బుగ్గిపాలు ● తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో భారీ నష్టం -
నేడు పానకాల స్వామి ఆలయంలో దీపాలంకరణ
మగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం(పానకాల స్వామి)లో శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. కాలువలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు పెదకాకాని: ప్రయాణికులతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం త్రుటిలో తప్పింది. తణుకు నుంచి అరుణాచలం తీర్ధయాత్రకు 39 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు బయలుదేరింది. వారు శుక్రవారం రాత్రి పెదకాకాని శివాలయంలో నిద్ర చేసి ఉదయం బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. డ్రైవర్ సర్వీసు రోడ్డులో బస్సును నడుపుతున్నాడు. పెదకాకాని మండలం నంబూరు అరబిక్ స్కూల్ సమీపంలోకి చేరుకునే సరికి బస్సు నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు వంతెనపైకి ఎక్కి ఆగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో కేకలు వేశారు. పలువురి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. నేడు ఎస్సీ,ఎస్టీల ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆయన కోరారు. జిల్లా వ్యవసాయాధికారిగా జగ్గారావు నరసరావుపేట: జిల్లా వ్యవసాయాధికారిగా ఎం.జగ్గారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాధా రణ బదిలీల్లో భాగంగా కమిషనర్ కార్యాలయం నుంచి పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఆయన నియమితులయ్యారు. గత మూడేళ్లుగా విధుల్లో ఉన్న ఐ.మురళిని కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రపంచ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వంశీకృష్ణ జాతీయ పోటీలలో రెండు బంగారు పతకాలు కై వసం సత్తెనపల్లి: ఈ ఏడాది ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన క్రీడాకారుడు పసుపులేటి వంశీకృష్ణ ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు. కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర జట్టులో ఉన్న పసుపులేటి వంశీకృష్ణ రెండు బంగారు పతకాలు సాధించి, పల్నాడు జిల్లా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశాడు. వంశీకృష్ణ డెడ్లిఫ్ట్లో 83 కేజీల విభాగంలో 285 కేజీలు ఎత్తి బంగారు పతకం సాధించాడు. మొత్తం 737.5 కిలోలు బరువు ఎత్తి ఓవరాల్గా మరో బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికై న వంశీకృష్ణను శుక్రవారం పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ, కోచ్ పసుపులేటి సురేష్, ప్రెసిడెంట్ జిమ్ రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, కత్తి పవన్, మాతంగి రాహుల్ గౌతమ్, జి.రమేష్, శాంతయ్య, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాకారులు అభి నందించారు. -
నేరుగా విక్రయించే అవకాశం
నాతో పాటు పలువురు రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించడానికి గురజాల నియోజకవర్గంలో రైతు బజార్ అందుబాటులో లేదు. దీంతో దళారులు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం మా నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కష్టపడి పండించిన మాకు ఏమాత్రం లాభం ఉండటం లేదు. రైతు బజార్లు ఉంటే నేరుగా వినియోగదారులకు విక్రయించే వీలుంటుంది. – గురువారెడ్డి, గురజాల నియోజకవర్గం వైఎస్సార్సీపీ రైతు విభాగ అధ్యక్షుడు -
రైతు బేజారులు
పల్నాడుశనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం శుక్రవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. అమ్మవారికి బోనాలు పిడుగురాళ్ల: ఆషాఢ మాసం నేపథ్యంలో స్థానిక భవానీనగర్లోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం అమ్మ వారికి మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. ముగిసిన సదరం క్యాంప్ తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. సాక్షి, నరసరావుపేట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తే తగిన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు సైతం మధ్యవర్తులు లేకుండా రైతుల నుంచే కొనుగోలు చేయడం వల్ల తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు లభిస్తాయి. దీని వల్ల ఇరువురికి లాభం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే రైతు బజార్లు తెరపైకి వచ్చాయి. ఒకే ఒక్కటి.. అదీ అంతంతే.. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిఽధిలో ప్రస్తుతం చిలకలూరిపేటలో మాత్రమే రైతు బజారు అందుబాటులో ఉంది. మిగిలిన చోట్ల కర్షకులు, వినియోగదారులు నష్టపోతున్నారు. జిల్లాలో ముఖ్యంగా నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ నియోజకవర్గాలలో కూరగాయలు, ఆకుకూరలు పెద్ద సంఖ్యలో పండిస్తారు. వీటిని నేరుగా రైతులే విక్రయించాలంటే గుంటూరు, విజయవాడ వంటి నగరాలలో ఉన్న రైతుబజార్లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రవాణా చార్జీలు తడిసిమోపడవడంతో రైతులు లాభం కళ్ల చూసే అవకాశం లేకుండాపోతోంది. దీన్ని ఆసరాగా తీసుకొని దళారులు చెప్పిందే తుది ధర అవుతోంది. వినియోగదారులపై భారం... రైతు బజార్లు లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నట్టే వినియోగదారులు సైతం మోసపోతున్నారు. మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరలు విక్రయించే వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. రైతులకు అవకాశం ఇస్తే ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. మరోవైపు ఒక్కోసారి టమోటా, ఉల్లి వంటి నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటినప్పుడు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ ధరలకు రైతు బజార్లలో విక్రయిస్తోంది. జిల్లాలో రైతు బజార్లు లేకపోవడంతో స్థానికులకు ఇవి చేరడం లేదు. రైతు బజార్ల వల్ల పలువురికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 7న్యూస్రీల్ అందుబాటులోని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు మేలు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలలో రైతు బజార్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టి పెడితే వాటి ఏర్పాటు సులువవుతుంది. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పల్నాడు బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ పక్కన రైతు బజార్ కోసం కేటాయించిన స్థలం, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకుని పేట ప్రజలకు రైతు బజారును వెంటనే అందుబాటులోకి తీసుకురావచ్చు. వినుకొండ ఎన్నెస్పీ స్థలంలో రైతు బజారు కోసం కొంత స్థలాన్ని గతంలో కేటాయించారు. అందులో ఇకనైనా తగిన ఏర్పాట్లు చేసి రైతు బజారు ఆరంభించాలనేది ప్రజల ఆకాంక్ష. సత్తెనపల్లిలో మార్కెట్ యార్డులో రైతు బజారు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగం లేకుండా పోతోంది. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెడితే తిరిగి వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందని రైతులు, వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి వంటి చోట్ల సైతం రైతు బజార్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. కూటమి నేతలు, ప్రభుత్వ అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తే రైతు బజార్ల ఏర్పాటు సులువు కానుంది. రైతులు, వినియోగదారులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. చెమట చిందించి సాగు చేసిన రైతుకు పంట విక్రయం పెద్ద సమస్యగా ఉంది. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసే వారికి అందుబాటులో రైతు బజార్లు లేక బేజారవుతున్నారు. దూర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిద్దామంటే ఖర్చులే తడిసిమోపడవుతున్నాయి. స్థానికంగా దళారుల దందాకు అన్నదాతలే బలవుతున్నారు. ఇటు తక్కువ ధరకు కూరయగాలు, ఆకుకూరలు వంటివి లభించిక వినయోగదారులు నష్టపోతున్నారు. మొత్తానికి ప్రజలకు అవస్థలు అన్నీఇన్నీ కావు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఏర్పాటుకు నోచుకోని రైతుబజార్లు రైతు బజార్లు లేక ఇటు రైతులు, అటు వినియోగదారులకు ఇబ్బందులు ఇతర ప్రాంతాలకు వ్యయప్రయాసలతో వెళ్లి విక్రయించాల్సిన దుస్థితి అధిక ధరలకు వ్యాపారుల వద్ద కూరగాయలు కొంటున్న వినియోగదారులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుకు రైతులు, ప్రజలు డిమాండ్ -
ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాననడం అవివేకం
పిడుగురాళ్ల: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు జగన్ భూతాన్ని భూస్థాపితం చేస్తాం అనటం అవివేకమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాసు మహేష్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజా తీర్పుకు మించింది ఏదీ లేదని, జగన్ మోహన్ రెడ్డి అనే భూతాన్ని భూస్థాపితం చేస్తాం అనడం ఆయన రాజకీయ అనుభవానికి పరాకాష్ట అన్నారు. ఇక టీడీపీనే 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పొత్తులతో తప్పితే చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేయడం చేతకాదని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అందించకుండా ప్రజలకు మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి అందించలేదని, ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారు.. అదీ ఇవ్వలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ ఇవ్వకుండా మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా ఉన్న ప్రజా నేత జగన్ మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాననడం దుర్మార్గమన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శించడం సాధారణమే కానీ చంద్రబాబుకు ఎందుకో తెలియదు కానీ జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రత్యేకమైన కోపం దాని ప్రభావం వల్లే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం తీసిన అక్రమ మట్టి తరలింపు! కరెంటు స్తంభాన్ని ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి వినుకొండ: టీడీపీ నేతల అక్రమ మట్టి తరలింపులో ఓ నిండు ప్రాణం బలైంది. వినుకొండ రూరల్ మండలం దొండపాడు సమీపంలో మునిస్వామి కొండ ప్రాంతం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తుండగా ట్రాక్టర్ పానకాల సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో పానకాలపాలెం గ్రామానికి చెందిన ఎం.నాసరయ్య (48) ట్రాక్టర్ డ్రైవర్ విద్యుత్ స్తంభం విరిగి మీదపడి విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాల ద్వారా రూ. కోట్ల విలువ చేసే మట్టిని అక్రమంగా తరలించడం పరిపాటిగా మారింది. ఈవిషయమై ఈనెల 23న ‘సాక్షి’ పత్రికలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ కథనాన్ని ప్రచురించినప్పటికీ దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ మైనింగ్ను ఆపకుండా వదిలేయడం వల్లే ఈప్రమాదంలో డ్రైవర్ మృతికి కారణమైందని పలువురు వాపోతున్నారు. సంఘటనా స్థలంలో ట్రాక్టర్ రోడ్డుకు అడ్డంగా పడడంతో అక్రమంగా మట్టి తరలిస్తున్న మరో పది ట్రాక్టర్లు నిలిచిపోయాయి. గత్యంతరం లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. మృతుడికి భార్య లక్ష్మి ఉన్నారు. గుండెపోటుతో వలస కార్మికుడి మృతి నర్సంపేట రూరల్: గుండెపోటుతో వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ లాడ్జిలో శుక్రవారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన చలవాది రాంబాబు (44) నర్సంపేటకు 20 రోజుల కిందట వలస వచ్చాడు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో బిర్యానీ మాస్టర్గా పని చేస్తూ లాడ్జిలోని ఓ గదిలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హోటల్లో పని ముగించుకుని లాడ్జికి చేరుకున్న రాంబాబు శుక్రవారం ఉద యం పనికి వెళ్లకపోవడంతో హోటల్ సిబ్బంది వచ్చి చూడగా అచేతనంగా పడి ఉన్నాడు. లాడ్జి నిర్వాహకుల సమాచారంతో పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పవర్ లిఫ్టింగ్ ఓవరాల్ చాంపియన్ లక్ష్మి చీరాల రూరల్: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సమరోతు లక్ష్మి, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లక్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండలో డిగ్రీ చదువుతోంది. రాష్ట్ర జట్టు తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. జగన్ అంటే చంద్రబాబుకు ఎనలేని కోపం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ, గుడిపూడి పొలిమేర వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మోదుగుల రమాదేవి (62) సత్తెనపల్లిలో అల్లుడు పంచుమర్తి శ్రీనివాసరావు వద్దకు వచ్చి తిరిగి లక్ష్మీపురం గ్రామం వెళ్లేందుకు అల్లుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నందిగామ, గుడిపూడి పొలిమేర వద్ద కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం పడిపోయింది. రమాదేవికి, అల్లుడు శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. రమాదేవి తలకు బలమైనగాయం కావడంతో హుటాహుటిన సత్తెనపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే రమాదేవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త సాంబశివ రావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమాదేవి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. -
మాజీ సైనికుల సంక్షేమం కోసం కృషి
జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీల వినుకొండ: వూజీసైనికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి ఆర్.గుణశీల వెల్లడించారు. శుక్రవారం మాజీసైనికుల సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్సర్వీస్ మ్యాన్లకు రావాల్సిన సంక్షేమాలు అందించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. అనంతరం మాజీ సైనికోద్యోగుల డిపెండెంట్స్కు గుర్తింపు కార్డులు అందించారు. వీరనారీలకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.ఈశ్వరయ్య, సెక్రటరీ పాపిరెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, బి.బాలరాజు, కె.వెంకటేశ్వర రావు, జాస్తి రవిశంకర్లతోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ పొన్నూరు: మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన నిధులను స్వాహా చేసిన గ్రేడ్– 3 పంచాయతీ కార్యదర్శి డి. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయికుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ములకుదురు గ్రామానికి సంబంధించి రూ. 76,963, మాచవరం రూ. 5,97,509, చింతలపూడి రూ.3,66,909 కలుపుకుని మొత్తం రూ. 10,41,381ను వెంకటేశ్వరరావు పంచాయతీలకు జమ చేయలేదు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డెఫ్యూటీ మండల పరిషత్ అధికారిని ఆదేశించారు. రెవెన్యూ రికవరీ చట్టప్రకారం వసూలు చేసి, పంచాయతీలకు జమ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి అందులో పేర్కొన్నారు. -
అట్రాసిటీ కేసు పూర్వాపరాల పరిశీలన
రాజుపాలెం: మండలంలోని ఇనిమెట్లలో గల ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిమిత్తం సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు శుక్రవారం పరిశీలనకు వచ్చారు. గ్రామానికి చెందిన నాగమ్మ డ్వాక్రా గ్రూపు సభ్యులు అదే గ్రామానికి చెందిన యానిమేటర్ ఎస్కె మస్తాన్వలిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీని నిమిత్తం సత్తెనపల్లి డీఎస్పీ ఇనిమెట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చేరుకుని నాగమ్మ డ్వాక్రా గ్రూపు సభ్యులను విచారించారు. గ్రూపుకు సంబంధించిన డబ్బులను యానిమేటర్ మస్తాన్వలి తమకు సంబంధం లేకుండా కాజేశాడని, ఆ డబ్బుల గురించి అడుగగా మమ్మలను కులం పేరుతో ధూషించాడని చెప్పారు. నోటికొచ్చినట్లు తిట్టడమే గాక మీరు తక్కువ జాతివారు, మాదిగ కులం పేరెత్తి తిట్టాడని డీఎస్పీకి డ్వాక్రా సభ్యులు వివరించారు. వెంటనే స్పందించిన డీఎస్పీ మీరు చెప్పిన వివరాల ప్రకారం మస్తాన్వలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ కూచిపూడి రమేష్, నందిగం మరియదాసు, గోవిందు ముత్తయ్య, నాగేశ్వరరావు, నాగమ్మ డ్వాక్రా గ్రూపు లీగర్ నందూరి కుమారి, గోవిందు వీరమ్మ, గుజ్జర్ల ముసలమ్మ, తాళ్లూరి వెంకాయమ్మ, మందా సంతోషమ్మ, తదితరులు ఉన్నారు. -
ఆభరణాల కోసం వియ్యపురాళ్లు హత్య
పట్టణ శివారులో ఈనెల 19న జరిగిన జంట హత్యల కేసులో ప్రైవేటు బీమా కంపెనీ ఏజెంటు కుసుమకుమారిని ఏ–1 ముద్దా యిగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒంటరిగా ఉంటున్న వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70)ను పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో వారు నివాసముంటున్న ఇంటి కిందిభాగంలోనే హత్యకు గురయ్యారు. వారి ఒంటిపై బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. సీసీ కెమెరా నిందితులను పట్టిచ్చింది. ఈ కేసులో కుసుమకుమారితోపాటు ఇద్దరు యువకులను పోలీసులను అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు ఆటో డ్రైవర్ కాగా, మరొకడు మైనర్ కావడం గమనార్హం. మారీసుపేట రెండుగేట్ల మధ్య ఒక ఇంటిలో వీరు ప్రణాళిక రచించుకోవడం, రెక్కీలు నిర్వహించడం, ఆ ప్రకారం నేరాలకు పాల్పడుతూ వచ్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. -
జిల్లాలో 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
నరసరావుపేట: జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం తొమ్మిది మండలాల్లో 65.2 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. అత్యధికంగా పెదకూరపాడులో 17.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా గురజాల 4.8, దాచేపల్లి 3.4, అచ్చంపేట 6.2, క్రోసూరు 5.4, అమరావతి 16.8, సత్తెనపల్లి 4.6, రాజుపాలెం 2.4, నరసరావుపేట 4.4 మి.మి వర్షం కురిసింది. రోడ్డు ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మృతి రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామ సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మృతి చెందాడు. రాత్రివేళ హైవేపై వేగంగా వెళ్తున్న సిమెంట్ కంటైనర్ బ్రేక్ వేయడంతో అదే మార్గంలో వెనుక వస్తున్న గూడ్స్ కంటైనర్ ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలు నకరికల్లు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గూడ్స్ కంటైనర్ డ్రైవర్ రెండు లారీల మధ్య ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ అధికారులు, రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీతో లారీని తొలగించి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీశారు. గాయాలతో ఉన్న గూడ్స్ కంటైనర్ డ్రైవర్ను హైవే అంబులెన్స్ వాహనంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. రొంపిచర్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాన నీటితో ధ్యాన బుద్ధుడు విగ్రహానికి ముప్పు అమరావతి: రాజధానిలో ఐకాన్గా గుర్తింపు పొందిన 125 అడుగుల ధ్యాన బుద్ధ విగ్రహానికి వాన నీటితో ముప్పు పొంచి ఉందని, వెంటనే మరమ్మతులు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన విగ్రహాన్ని సందర్శించారు. విగ్రహానికి రెండు రంధ్రాలు పడ్డాయని, దీనివల్ల వర్షం నీటితో దెబ్బ తింటోందని తెలిపారు. లీకులతో సీలింగ్ కూడా ధ్వంసమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వినతి పత్రం అందించామని ఆయన వెల్లడించారు. -
అమ్మో.. కిలేడీ కిల్లర్స్!
తెనాలి: గతేడాది జూన్లో స్థానిక యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజిని, తనకు పరిచయస్తురాలైన నాగూర్బీని ఆటోలో ఎక్కించుకుని తెనాలి–నారాకోడూరు రోడ్డులోని వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్తో రజిని బ్రీజర్ కొనిపించింది. అదే కాలనీవాసి వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి బైకుపై వీరిని వెన్నంటి వచ్చింది. ముగ్గురూ నిర్మాన్యుష ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీకి ఇచ్చారు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకుని రజిని, వెంకటేశ్వరి తాపీగా ఇంటికి వచ్చారు. నాగూర్బీ మృతదేహం వెలుగులోకి రావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ను గుర్తించి ప్రశ్నించడంతో రజని గురించి చెప్పాడు. ఆమె ను తీసుకొచ్చి విచారించాక మరిన్ని సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. నాగూర్బీ హత్యనే కాదు..రజని, వెంకటేశ్వరితోపాటు ఆమె తల్లి రమణమ్మ కలిసి 2022 నుంచి మరో ముగ్గురిని సైనేడ్తో హత్య చేశారని, వీరి అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. అప్పు ఎగ్గొట్టేందుకు హత్య మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బు లు, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మి స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న రూ.20 వేల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు. భార్యతో చేతులు కలిపి హత్యకు పథకం తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్, ఇన్స్యూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. చివరిసారి పథకం పారలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. వీరికి సైనేడ్ విక్రయించిన నేరంపై మరొకరిని అరెస్టు చేశారు. ఆడతనానికి మాయని మచ్చ ! ఆభరణాల కోసం హత్యలు చేస్తున్న మహిళలు నాడు సైనేడ్తో నలుగురి హత్య నేడు దాడిచేసి ముగ్గురి హత్య అన్నీ పట్టపగలు.. బెరుకులేని దారుణాలు పోలీసుల అప్రమత్తతతో జైలుపాలు -
60 గజాల స్థలంలో నిర్మాణాలకు సడలింపులు
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్, పట్టణాభివృద్ది రంగాన్ని పారదర్శకంగా, వేగవంతంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో జీఓ నెం.114 ద్వారా ఏపీ బిల్డింగ్ రూల్స్–2017 కీలకమైన సవరణలు తీసుకొచ్చిందని ఏపీ కానఫెడరేషన్ ఆప్ లైసెన్స్డ్ ఇంజనీర్లు, సర్వేయర్లు, ఆర్కిటెక్చర్లు (క్లెసా,ఏపీ) అధ్యక్షులు కొమ్మసాని కమలాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాక్షికి వివరాలు తెలియచేశారు. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన భవన నియమావళిలో చేసిన సవరణల ప్రకారం 50 చదరపు మీటర్లు (60) గజాల లోపు స్థలాల్లో భవన నిర్మాణానికి సడలింపు ఇచ్చిందన్నారు. ఆ స్థలాల్లో గ్రౌండ్, గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ భవన నిర్మాణానికి పూర్తి ఫీజుల మినహాయింపు ఇస్తూ కేవలం రూ.1టోకెన్ ఫీజుతో ఆన్లైన్న్లో దరఖాస్తు చేసుకోనే అవకాసం ఇచ్చిందన్నారు. కంప్లీషన్, ఆకుపెన్సీ సర్టిఫికేట్ అవసరం లేకుండా చేసిందన్నారు. మూడు మీటర్ల లోపు సెట్బాక్ ఉన్న ప్రదేశాల్లో టీడీఆర్ వినియోగాన్ని అనుమతించిందన్నారు. పాత పట్టణాలకు ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. అపార్ట్మెంట్లు, మాల్స్, హోటల్స్, ప్రభుత్వ భవనాల్లో సీసీటీవీ, ఎల్ఓటీ, డీటీహెచ్, కేబుల్ టీవీ వంటి వసతులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని, వాటిలో 90 రోజుల ఫుటేజ్ స్టోరేజ్ తప్పనిసరిగా ఉండాలని సూచించిందన్నారు. 300 నుంచి 500 చదరపు మీటర్ల స్థలాల్లో సెల్లార్కు అనుమతించిందని, నిర్మాణ సమయంలో పక్క భవనాలకు హానీ కలగకుండా స్ట్రక్చరల్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందన్నారు. భూమిని విరాళంగా ఇచ్చినవారికి ఆర్డీబీ ప్రకారం టీడీఆర్ ద్వారా ప్రోత్సాహం ఇచ్చిందని, అయితే తొమ్మిది మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్లకు టీడీఆర్ వర్తించదని పేర్కొన్నారు. యుఎల్బీ, యూడీఎ లెవెల్లో గడువు మూడేళ్ల వరకు మాత్రమే ఉండేలా సవరణలు చేస్తూ పదిశాతం బిల్డ్అప్ ఏరియాను రిజిష్టర్డ్ మార్టగేజ్ డీడ్ ద్వారా మున్సిపాలిటీకి హాండోవర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. నిర్మాణ భద్రత కోసం ఇండెమ్నిటీ బాండ్, స్ట్రక్చరల్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందన్నారు. గత కొన్నిరోజులుగా క్లెసా తరపున సమర్పించిన సూత్రాలు, ప్రజాభిప్రాయాలను పరిగణలతో ఈ మార్పుల రూపకల్పనకు ప్రభు త్వం శ్రీకారం చుట్టిందని తాము భావిస్తున్నామన్నారు. ఈ జీవో అమలుతో భవన అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని, చిన్న గృహ నిర్మాణాలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యం కలుగుతుందని అన్నారు. జీఓ 114 ద్వారా స్పష్టంచేసిన ప్రభుత్వం క్లెసా ఏపీ అధ్యక్షులు కె.కమలాకరరెడ్డి వెల్లడి -
వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలోని వినుకొండలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చెత్త సేకరించే కంపెనీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైరింజన్లతో మంటలను అర్పుతున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
వేగవంతం చేయాలి
వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 99వేల క్వింటాళ్ల పొగాకు ఉందని తెలిసింది. ఇందులో సగం కొన్నారని చెబుతున్నా.. ఇంకా 45,000 క్వింటాళ్లు రైతుల వద్ద ఉంది. ప్రభుత్వం కేంద్రం ద్వారా రోజుకు 200 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తే కనీసం ఆర్నెల్లకు పైగా సమయం పడుతుంది. ప్రభుత్వం ఆలోచించి కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు, ఎక్కువ మొత్తంలో కొనేలా చూడాలి. – వడ్డేపల్లి నరసింహారావు(రాజు), వైఎస్సార్ సీపీ యడ్లపాడు మండల అధ్యక్షుడు ● -
డ్రగ్స్తో జీవితాలు దుర్భరం
నరసరావుపేట: సమాజ హితం కోసం మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్కుమార్, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పల్నాడురోడ్డులోని ఏరియా హాస్పటల్ నుంచి కలెక్టరేట్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్స్ వరకు వాకథాన్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ సమష్టి కృషి ద్వారానే సాధ్యమవుతుందన్నారు. సరదాగా మొదలై, చివరకు బానిసలుగా మార్చి జీవితాలను సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి విక్రయించేవారు, సేవించే వారిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972కు కాల్చేసి తెలియచేయాలని కోరారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వాకథాన్లో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఈగల్ ఎస్ఐ శామ్యూల్రాజు, కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు, నర్సింగ్ విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ‘జిందాల్’ ప్లాంట్ సందర్శనయడ్లపాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం జిందాల్ ఫ్యాక్టరీను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వారు జిందాల్ ఫ్యాక్టరీని సందర్శించారు. సీఎం హెలిప్యాడ్ గ్రౌండ్ను పరిశీలించి భద్రత చర్యలపై చర్చించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై నరసరావుపేటలో వాకథాన్ పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, విద్యార్థులు -
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం
అమరావతి(అచ్చంపేట): జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేసేందుకు 8 మండలాలను ఎంపిక చేసినట్లు జిల్లా ఉద్యానశాఖాధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. మండలంలోని మాల్లాదిలో గురువారం ఉద్యానశాఖ, వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఉద్యానశాఖాధికారి మాట్లాడుతూ అమరావతి మండలంలోని మల్లాదిలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేపట్టడం జరిగిందన్నారు. రైతులకు ఒక హెక్టార్కి 150 మొక్కలు చొప్పున విదేశీ మొక్కలకు ఒక్కొక్క మొక్కకు రూ.193, దేశీయ మొక్కకు రూ.133 చొప్పున రూ.29,000 రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. సాగు ప్రోత్సాహంలో భాగంగా హెక్టారుకు 50శాతం రాయితీపై నాలుగు సంవత్సరాలకు రూ.21000లకు మించకుండా రాయితీ ఇవ్వనున్నామన్నారు. అమరావతి మండలం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ ఏరియా మేనేజర్ యం.నవీన్ తెలిపారు. నియోజకవర్గ ఉద్యానశాఖాధికారి ఎన్.సురేష్, డ్రిప్ ఇరిగేషన్ ఎంఐఏఓ మోషే నాయక్, గ్రామ ఉద్యానవన అసిస్టెంట్లు, వ్యవసాయ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యానశాఖాధికారి వెంకట్రావు -
చిన్నారులు పోటీతత్వం పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులు క్రీడా సాధన ద్వారా పోటీతత్వాన్ని అలవరచుకోవాలని ఏసీఎంఈ స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంధ కృష్ణ తెలిపారు. గుంటూరు ఫెన్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు రూరల్ మండలం పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్ ప్రాంగణంలో జరిగిన అండర్–10, 12 బాలబాలికల జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శారీరక పటుత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడలో సాధన చేయాలని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50 మంది చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సౌగంధ కృష్ణ, అశోక్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డీఎస్ క్రిష్టోఫర్, పీఈటీ రాజేష్ ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ● అండర్ 12 బాలుర విభాగంలో.. సాబర్ విభాగం: చైతన్య కృష్ణ, పృథ్వీ వినయ్, ఫాయిల్ విభాగం: ఇ.కౌశిక్. బాలికల విభాగంలో.... సాబర్ విభాగం: ఆరోహి, హన్సిక, ఎప్పి విభాగం: జోష్నిక, లక్ష్మీ కార్తిక, ఫాయిల్ విభాగం: శ్లోక, హస్నా. ● అండర్–10 బాలుర విభాగంలో... ఫాయిల్ విభాగం: రిశాంక్, సంజయ్, ఎప్పి విభాగం: హర్షవర్ధన్. బాలికల విభాగంలో.. ఎప్పి విభాగం: దీక్షిత, తన్మయి శ్రీ. -
దుర్గమ్మకు ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు దుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయంలోని మూల విరాట్కు, ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆరో అంతస్తులో వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, మిఠాయిలు సమర్పించారు. అమ్మ వారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలు, భక్తుల కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. సారె సమర్పించిన అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఏసీ సీహెచ్.రంగారావు, ఏఈఓలు ఎన్.రమేష్బాబు, వెంకటరెడ్డి, తిరుమలరావు, జంగం శ్రీనివాస్, కె.గంగాధర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్యులకు క్రీడలతో ఉపశమనం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు నిత్యం క్రీడా సాధన చేయాలని డాక్టర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (డీఎస్సీవో) కార్యదర్శి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో నిర్వహించిన క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పని ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఆటవిడుపు కోసం ప్రతి ఏడాది వైద్యుల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు భాగంగా క్యారమ్స్తోపాటు క్రికెట్, చెస్, కల్చరల్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సుమారు 50 మంది పేరొందిన వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఎస్సీవో అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారమ్స్ పోటీలకు ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ రిఫరీగా వ్యవహరించారు. -
‘దారి తప్పుతున్న కూటమి ఏడాది పాలన’ పుస్తకావిష్కరణ
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ అనే పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ● విజయ్కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత గ్యాస్ నగదు పడక ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ● తల్లికి వందనం మొదటి సంవత్సరం డబ్బులు వేయకుండా రెండవ సంవత్సరం వేశారని, అయినా కరెంటు బిల్లులు, కార్లు అని అనేక మందికి నగదు వేయలేదన్నారు. ● అంగన్వాడీలు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో వారికి కూడా నగదు వేయకపోవడం దారుణమన్నారు. ● గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లు పెడితే పగలగొట్టమని నారా లోకేష్ పిలుపునిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ● కూటమి ప్రభుత్వం వచ్చి మోడల్ స్కూల్ పేరుతో 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూళ్లకు విలీనం చేయడంతో ఉన్న స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని, ఆ స్కూల్ను కూడా మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ధరణికోట విమల, పెండ్యాల మహేష్, గుంటూరు మల్లేశ్వరి, గుంటుపల్లి బాలకృష్ణ, నాయకులు ఎం.హరిపోతురాజు, గుంటుపల్లి రజని, స్పందన, జడ రాజకుమార్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. -
కొనలేక పొగ !
యడ్లపాడు: మార్క్ఫెడ్ ద్వారా నల్లబర్లీ పొగాకును కొనేందుకు జిల్లాలో మైదవోలు – వంకాయలపాడు పరిధిలోని స్పైసెస్ పార్కులో ఈనెల 20న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని లోపాలు, అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమశాతం ఉండరాదని, చెక్కులో ఏఒక్క ఆకు, సూర చేర్చరాదని, ఇంటివద్దే పొగాకు గ్రేడింగ్ చేయాలని, రైతుసేవా కేంద్రంలో నమోదై ఉండాలని, సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ విధిగా చేసుకోవాలని, షెడ్యుల్ ప్రకారంగా మొబైల్ కు సందేశం వచ్చిన రోజే రైతు తమ ఉత్పత్తులను తేవాలని ఆంక్షలు విధించడం రైతులను ఆదుకోవడమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనేసరికి ఖరీఫ్ ముగిస్తే..! అధికారిక లెక్కల ప్రకారం...జిల్లాలో 8900 మంది రైతులు 99వేల క్వింటాళ్ల పొగాకు సాగు చేశారని చెబుతున్నా, నమోదు చేసుకోనివారు ఇంకా ఉన్నారు. కంపెనీలు, వ్యాపారులకు వీరివద్ద సగం పొగాకును కొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. రోజుకు 200 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయడం సాధ్యం కాదని కేంద్రం ప్రారంభ సభలోనే అధికారులు స్పష్టం చేశారు. మరి మిగిలిన సగం కొనుగోళ్లకు పట్టే కాలంలో ఖరీఫ్ సీజన్ ముగిసి పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడో ధరపై అయోమయం కేంద్రంలో ప్రస్తుతం పొగాకు నాణ్యత ఆధారంగా రూ.6వేలు (నాసిరకం), రూ.9వేలు (మధ్యస్థం), రూ.12వేలు (ఉత్తమ నాణ్యత)గా ధరలు నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సైతం మొదట రెండు రకాల ధరలను ప్రకటించి, ఆ తరువాత మూడో ధరను తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యమేమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి తెచ్చిన పొగాకులో అత్యధికంగా రూ.9వేల ధరకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రూ.9వేలకు కొనుగోలు చేసిన చెక్కులను రూ.12వేలకు మార్పు చేయాలని, అప్పుడే తమ పెట్టుబడి నష్టం పోకుండా, అప్పుల నుంచి కొంత ఊరట లభిస్తుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ‘పచ్చ’పాతంపై అభ్యంతరం సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసిన వారికే ఎంపికై న తేదీలో పొగాకు కొనుగోలు జరుగుతుందని ప్రకటించిన అధికారులు, మెసేజ్లు రాకపోయినా కొందరి బేళ్లను కొనుగోలు చేస్తుండడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెసేజ్ లు రాకమునుపే కేంద్రంలో నాలుగు రోజులు 183 క్వింటాళ్ల కొనుగోళ్లు ఎలా జరిగాయని ప్రశ్నిస్తున్నారు. స్థానిక టీడీపీ ముఖ్యనేత సిఫార్సుతో వ్యాపారులకు మేలు చేస్తున్న అధికారుల తీరుతో, వాస్తవ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహసనంలా నల్లబర్లీ కొనుగోలు ప్రక్రియ రకరకాల ఆంక్షలు.. అక్రమాలు సందేశాలు రాకుండానే కొందరికి చెక్కులు.. కొనుగోళ్లు రెండే ధరలన్న ప్రభుత్వం.. మూడో ధర ప్రకటించడంపై అనుమానం మొత్తం కొనేలోపు ఖరీఫ్ దాటుతుందని రైతుల ఆందోళన -
పల్నాడు
శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025వారాహి అలంకరణలో బగళాముఖి చందోలు(కర్లపాలెం): వారాహి నవరాత్ర మహోత్సవాలలో భాగంగా చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారికి వారాహి అమ్మవారి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూలు, పండ్లు సమర్పించారు.గతేడాది ఐదు ఎకరాల్లో మిరప, రెండు ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. మిర్చి ధర సరిగా లేకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. పొగాకు సంగతి సరేసరి. ఈ ఏడాది మిర్చి సాగుచేయాలంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు వాతావరణం అనుకూలించక, పరిస్థితులు సహకరించక ధైర్యం సరిపోవడం లేదు. – బూచి అంజిరెడ్డి, మేళ్లవాగు, బొల్లాపల్లి మండలం. గతేడాది మిర్చి పంటలో వచ్చిన నష్టాలతో రైతులు మిర్చి సాగుకు ఆలోచిస్తున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది మిర్చినారుకు డిమాండ్ తగ్గింది. ఇప్పటివరకు నారు పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కూడా ఓ కారణం. మిర్చి నారుకు గతంలో లాగా డిమాండ్ లేకపోతే దానిపైనే ఆధారపడి ఉన్న నర్సరీ నిర్వహకులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. – గోపిరెడ్డి బాలారెడ్డి, నర్సరీ నిర్వహకుడు, రెంటచింతల7న్యూస్రీల్రూ.5 లక్షలు నష్టపోయానుమిర్చినారుకు డిమాండ్ లేదు -
దగా చేసిన కూటమి సర్కారు
2023లో క్వింటా మిర్చి రూ.20 వేలకు పైగా అమ్ముడుపోగా గత ఖరీఫ్లో కనీసం రూ. 8 వేలు కూడా పలకని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచారు. మంచి ధర వస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఆ రోజే అమ్ముకొని ఉంటే కనీసం కోల్డ్ స్టోరేజ్ బాడుగు ఖర్చు అయినా మిగిలేదని బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశపడ్డ రైతులు దగాపడ్డారు. మిర్చి ధరల స్థిరీకరణ చేసి మద్దతు ధర ఇస్తుందని ఆశపడగా ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నాలు చేయలేదు. దీంతో రైతులు నిండా మునిగి మిర్చి పంట అంటే భయపడే పరిస్థితికి వచ్చారు. -
మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
మార్టూరు: దేశంలో ఐదు దశాబ్దాల క్రిందటి ఎమర్జెన్సీలో ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మేధావులు తదితర అన్ని రంగాలకు చెందిన వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు మోదీ పాలనలో అంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గంగయ్య మాట్లాడారు. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మేధావులు, ఉద్యోగులు, ప్రజల హక్కులు కాలరాశారన్నారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించి.. అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, తదితర రాజ్యాంగ వ్యవస్థలను నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలిపారు. దీనివలన రైతులు, కార్మికులు, ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా సంస్కరణల బాట పట్టించాల్సింది పోయి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు పాదాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలను పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎదురుకోవాలని లేకుంటే గత ఎమర్జెన్సీ పాలన మించిన గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని సిరుల పంటగా విశ్వసిస్తారు. అయితే కూటమి సర్కారు తీరుతో ఈ ఏడాది మిర్చి రైతుకు ఘాటు తగిలింది.. ఫలితంగా నేడు జిల్లాలో మిర్చి సాగు చేసిన ఏ ఒక్క రైతు ఇంట ఆనందం లేదు. ధర పతనంతో రైతు కుదేలు కాగా.. ఆదుకుని ‘మద్దతు’గా నిలవాల్సిన ప్
సాక్షి, నరసరావుపేట: మిర్చి పంట సాగుకు రైతులు వెనుకాడుతున్నారు. గతంలో సిరులు పండించిన మిరపసాగుకు నేడు కనీసం పెట్టుబడి కూడా దక్కడం లేదు. దీంతో పల్నాడు రైతులు మిరప పంట వైపు వెళ్లడానికి ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది మిర్చి సాగు అమాంతం పడిపోనుందని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 57 వేల హెక్టార్లలో మిర్చి సాధారణ సాగుగా ప్రకటించినప్పటికి కనీసం 35 వేల హెక్టార్లలో సాగు కూడా కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఖరీఫ్లో మిరప పంట సాగు చేసిన రైతులకు పెట్టుబడి రాకపోగా రూ.లక్షల్లో నష్టపోయారు. ఓ వైపు తెగులు సోకడం, మరోవైపు పెట్టుబడి ఖర్చు అమాంతం పెరిగడంతోపాటు దిగుబడి తగ్గింది. అరకొర వచ్చిన మిర్చిపంటను అమ్ముకుందామంటే ధరలు గతంలో ఎన్నడూలేనివిధంగా పతనం అవ్వడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. కొందరు రైతులకు పెట్టుబడి కాదుకదా కనీసం కూలీ, రవాణా ఖర్చులు కూడా రాని దుస్థితి. మిరప విత్తనాలకు డిమాండ్ నిల్ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఖరీఫ్ వ్యవసాయ కార్యక్రమాలు మందకొడిగా నడుస్తున్నాయి. వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నా యి. దీంతో నారుపోయడానికి రైతులు వెనుకాడుతు న్నారు. సాధారణంగా మే చివరి నుంచి జిల్లాలోని నర్సరీలలో మిరప నారు విత్తనాలు వేస్తారు. అయితే ప్రస్తుతం రైతులు మిర్చిసాగుకు వెనుకాడుతుండటంతో నర్సరీలు బోసిపోతున్నాయి. మరోవైపు గతంలో మిర్చి విత్తనాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచి రైతులను దోపిడీ చేసేవారు. అయితే ఈ ఏడాది మిర్చి విత్తనాలకు ఏమాత్రం డిమాండ్ లేక వ్యాపారాలు సాగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.52 లక్షల 10 గ్రాముల మిర్చి విత్తనాల ప్యాకెట్లు అవసరమని అధికారులు లెక్కకట్టారు. మరోవైపు రైతులు మిర్చి పంట సాగు వదలి ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. పత్తి, బొప్పాయి, కూరగాయలు, పండ్లతోటల వైపు ఆలోచిస్తున్నారు. మిరప విత్తనాలు కొనేవారే లేరంటున్న వ్యాపారులు ఇప్పటివరకు మిర్చి నారు పోయని నర్సరీ యజమానులు గతేడాది భారీ నష్టాన్ని మిగిల్చిన పంట ధరలు అమాంతం పతనమైనా పట్టించుకోని కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల చూపు జిల్లాలో 57 వేల హెక్టార్లలో సాగు అంచనా వేసిన ఉద్యాన శాఖ అధికారులు -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయస్థాయిలో ప్రథమం
స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన సత్తెనపల్లి క్రీడాకారుడు సత్తెనపల్లి: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పల్నాడు జిల్లా యువకుడు ప్రతిభ చాటాడు. కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరిలో ఈ నెల 22 నుంచి 30 వరకు జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ సీనియర్ మెన్, జూనియర్, సబ్ జూనియర్, ఉమెన్ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో రాష్ట్ర జట్టులో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు ఎన్.శరత్ బంగారు, రజత పతకాలతో ఓవరాల్గా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి పల్నాడు జిల్లా ప్రతిష్టను ఇనుమడింప చేశాడు. జాతీయస్థాయి స్క్వాట్లో శరత్ 303 కేజీలు ఎత్తి సరికొత్త జాతీయస్థాయి రికార్డు సృష్టించి, బంగారు పతకం సాధించాడు. డెడ్ లిప్ట్లో రజతం, 74 కిలోల విభాగంలో మొత్తం 723 కిలోలు ఎత్తి కాంస్య పతకం సాధించాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారుడు ఎన్.శరత్ను బుధవారం పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ పసుపులేటి సురేష్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిమ్ రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, కత్తి పవన్, మాతంగి రాహుల్ గౌతమ్, జి.రమేష్, శాంతయ్య తదితరులు అభినందించారు. -
మిర్చి రైతులను గాలికొదిలిన చంద్రబాబు
పిడుగురాళ్ల: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత చెప్పేది కొండంత అనే చందగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై అశ్రద్ధ వహిస్తుందన్నారు. మిర్చి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా సుమారు రూ.25,000 పలికిన మిర్చి ధర కూటమి ప్రభుత్వంలో రూ.6వేలకు పడిపోయిందన్నారు. ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు కనీస మద్దతు ధర రూ.11,700 ఉండబోతుందంటూ ఆర్భాటపు ప్రకటన చేశారన్నారు. అంతేకాకుండా అప్పటికే తక్కువ ధరకు అమ్మిన రైతులకు మిగితా డబ్బుని తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని కూడా చెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు మిర్చి రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో మిర్చి రైతులు ప్రస్తుతం మిర్చి వేసేందుకు భయపడుతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ఈ నెల 20 తేదీలోపు అమలు చేస్తామని ప్రకటించారని, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అశోక్కుమార్ ప్రశ్నించారు. -
సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట
లక్ష్మీపురం: ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం వీఆర్ఏలు నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పేరుతో హామీలు అమలు చేశామంటూ పెద్దఎత్తున సభలు నిర్వహిస్తూ ఉత్సవాలు చేసుకుంటోందని విమర్శించారు. వాటిలో వీఆర్ఏలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని తెలిపారు. మంత్రి నారా లోకేష్ నాడు నిర్వహించిన యువగళం, పాదయాత్రలో అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులతో సమావేశం జరిపి, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది నేటికీ అమలు కాలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు వేతనాలు ఇస్తోందని, ఇక్కడ ప్రభుత్వాలు ఆదిశగా ఎందుకు ఆలోచించట్లేదని ఆయన ప్రశ్నించారు. వీఆర్ఏలకు గతంలో డీఏను వేతనంతో కలిపి ఇచ్చే వాళ్లని, ప్రస్తుతం విడిగా ఇవ్వడంతో పెరుగుదల లేదని పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేతనాలు పెంపు లేని కారణంగా వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీఆర్ఏలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు ఉంటున్నారని, వారి సమస్యల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్, వాచ్మెన్ పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పోరాటం చేస్తామని లక్ష్మణరావు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క సాంబశివరావు, షేక్ కరీమున్నిసా, షేక్ ఆదం షఫీ, ఎన్. రామారావు, హనుమంతరావు, ప్రతాప్, పాండు, రాజేష్, రవి, వెంకయ్య పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరసన -
యడ్లపాడులో పట్టపగలు దారుణం
● జాతీయ రహదారి పక్కన యువకుడి మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు ● గుర్తించి మంటలు ఆర్పిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది యడ్లపాడు: యడ్లపాడులో అత్యంత దారుణమైన, హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నిత్యం వాహనాలతో కిటకిటలాడే జాతీయ రహదారి పక్కనే, పట్టపగలు ఓ యువకుడిని ఫ్లెక్సీలో చుట్టి నిప్పుపెట్టిన ఘటన బుధవారం కలకలం రేపింది. యడ్లపాడులోని 16వ నంబర్ జాతీయ రహదారి, సర్వీస్ మార్గం మధ్యలో ఉన్న మురుగు కాల్వలో గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడి మృతదేహాన్ని ఫ్లెక్సీలో చుట్టి పడేసి నిప్పంటించారు. సరిగ్గా ఉదయం 8:30 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఆ వైపుగా వెళ్తుండగా, కాల్వలోంచి మంటలు ఎగసిపడటం చూసి అనుమానంతో దగ్గరకు వెళ్లారు. మంటల్లో మనిషి శరీరం కాలిపోతుండటం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, తమ కారులోని వాటర్ క్యాన్తో మంటలను ఆర్పేశారు. కానీ, అప్పటికే దుండగుల దారుణానికి ఆ యువకుడి ముఖం తప్ప దేహం అంతా పూర్తిగా కాలిబూడిదైపోయింది. ● సమాచారం అందిన వెంటనే నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వర్, చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్వాడ్ను రప్పించి ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. అనంతరం, మృతదేహాన్ని ఫోరెన్సిక్, పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా కలకలం పట్టపగలు, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం నియోజకవర్గంలో కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులతో పాటు పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు ఈ యువకుడు ఎవరు? ఎక్కడివాడు? దుండగులు అతడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? హత్యకు గల కారణాలు ఏంటి? ఇది ముమ్మాటికీ హత్యే అయితే, ఎక్కడ చేసి ఇక్కడకు తెచ్చారు? పట్టపగలే నిప్పంటించేంత తెగించి ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు? వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం పోలీసులకు సవాలుగా మారాయి. మృతుడి ఆచూకీ కోసం సంఘటన స్థలం వద్ద తీసిన చిత్రాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించినట్లు సమాచారం. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వర్ పర్యవేక్షణలో పోలీసులు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. -
కూటమి ప్రభుత్వంలో ఆశాభంగం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ వేతనాలు పెరుగుతాయని, అర్హులకు పదోన్నతులు ఇస్తారని ఆశించి వీఆర్ఏలు భంగపడ్డారని, ఏ ఒక్క సమస్యా పరిష్కరించలేదని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు షేక్ బందగీసాహెబ్ అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. బందగీసాహెబ్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కోసం తమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20వేలమంది గ్రామ రెవెన్యూ సహాయకులుగా సుదీర్ఘ కాలం నుంచి తక్కువ వేతనంతో దిగువ స్థాయిలో పనిచేస్తూ రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. రీ సర్వే పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని, పనిభారం పెంచి టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలు తోడయ్యాయన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. అనంతరం డీఆర్ఓ ఏకామురళి, అదే సమయానికి అక్కడకు వచ్చిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతిపత్రం అందజేశారు. సత్తెనపల్లి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరావు, సుబ్బారావు, నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్, సీనియర్ నాయకులు పౌలేష్, మండల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం కలెక్టరేట్ ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన డీఆర్ఓకు వినతిపత్రం అందజేత -
బడులను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్
విజయపురి సౌత్: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావు బుధవారం మాచర్ల మండలం ఎత్తిపోతల (7 మైలు) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఇంటర్మీడియట్ వరకు బడిని అప్గ్రేడ్ చేయించాలని గిరిజన నాయకులు, ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, అభినందించారు. తర్వాత బ్రహ్మానందపురం తండాను సందర్శించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. విజయపురి సౌత్లోని పీటీజీ పాఠశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ సాంబయ్య, డీటీడబ్ల్యూ జోత్న్స, తహసీల్దార్ కిరణ్ కుమార్, పీటీజీ పాఠశాల ప్రిన్సిపల్ మురళీ శ్రీనివాస్, గిరిజన సలహా మండల సభ్యులు రావుల కొండలు, జెడ్పీటీసీ మల్లుస్వామి, మాజీ సర్పంచ్ కరంటోత్ పాండు నాయక్, నాగేశ్వరరావు నాయక్, బొల్లా వెంకటేశ్వర్లు చౌదరి, బాలాజీ నాయక్ బామల నాయక్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు బదిలీ నరసరావుపేట: జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లు (డీటీ)లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు టి.కొండారెడ్డిని నకరికల్లుకు, అరుణదేవిని బెల్లంకొండకు, షేక్ సాల్మన్ను నాదెండ్లకు, ఎస్.శ్యామలతను పెదకూరపాడుకు, కె.శ్రీనివాసరావును నరసరావుపేటకు, బి.సుబ్బారావును శావల్యాపురానికికు, పి.తులసీరామ్ను నూజెండ్లకు, జి.వెంకటరమణను రెంటచింతలకు, పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి, కె.రాజశేఖర్ నాయక్ను వెల్దుర్తికి, పి.వెంకటరెడ్డిని రొంపిచర్లకు, కె.బాలవెంకటేష్ను ముప్పాళ్లకు, ఎన్.అనూరాధను యడ్లపాడుకు, షేక్ బాషాను మాచర్లకు, ఎం.రాజాను అమరావతికి, సీహెచ్.లక్ష్మీప్రసాద్ను సత్తెనపల్లికి, పి.నరసయ్యను బొల్లాపల్లికి, ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి, జి.విద్యాసాగర్ను కారంపూడికి బదిలీ చేశారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలువినుకొండ: పట్టణంలోని షిరిడీ సాయిబాబా దేవస్థానంలో 34వ గురుపౌర్ణమి మహోత్సవాల సందర్భంగా బుధవారం భారీ గణపతి రూపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గంజాయి హాట్స్పాట్లను
తనిఖీ చేయండి నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్స్పాట్లను పోలీసులు పూర్తిగా తనిఖీచేసి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎన్డీపీఎస్ కేసులు, ఎన్డీపీఎస్ చట్టం కింద గతంలో నమోదైన కేసులు, కొత్త కేసులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్ అబ్యూస్ అవగాహన, నివారణను ప్రోత్సహించేందుకు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యాసంస్థల్లో ఈగిల్ క్లబ్లను ఏర్పాటుచేసి, క్లబ్ సభ్యుల వివరాలతో డేటాబేస్ నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినం సందర్భంగా జిల్లావ్యాప్తంగా వాకథాన్ నిర్వహణకు సూచనలు జారీ చేశారు. అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, డీఈఓ చంద్రకళ, ఈగిల్ అధికారి, సామాజిక సంక్షేమ అధికారి శామ్యూల్ రాజీవ్, డీఆర్ఓ ఏకా మురళి, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ, మాతా జ్ఞానమ్మ డీ–అడిక్షన్ సెంటర్ (ఎన్జీఓ) ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించిన కలెక్టర్ -
గుంటూరు వైద్య కళాశాల విద్యార్థుల ప్రతిభ
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాల యం సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కీంకు గుంటూరు మెడికల్ కాలేజ్కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. తమ పరిశోధనా ప్రాజెక్టుల ఆధారంగా ఈ సంవత్సరానికి వారిని ఎంపిక చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిపాదనలను కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయి కమిటీలు పరిశీలించాక ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులకు మంగళవారం రూ. 10 వేల వంతున చెక్కులను పరిశోధన గ్రాంటుగా అందించారు. ఈ నిధులు ప్రాజెక్ట్ నిర్వహణ, డేటా సేకరణ. ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పరిశోధన చేసి, తమ ప్రతిభను విశ్వవిద్యాలయ స్థాయిలో చాటనున్నారు. ఇది విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమేకాకుండా భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదగడానికి సహాయపడుతుందని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.సుందరాచారి అన్నారు. ఎంపికై న విద్యార్థులను గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యాపకులు అభినందించారు. -
ఉపాధి పనుల్లో లోపాలు
రికవరీలకు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆదేశాలు యడ్లపాడు: ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నివేదికను ప్రతిపాదిస్తూ ఎంపీడీవో కార్యాల యం వద్ద మంగళవారం బహిరంగ సభ (ప్రజావేదిక) నిర్వహించారు. 024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు మండలం పరిధిలో 1125 పనులను రూ.9,40,60,750 ఉపాధి నిధులతో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ఈ పనుల్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి వెల్లడించారు. ఎంపీపీ పిడతల ఝాన్సీసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీడీవో వి.హేమలతాదేవి, ఏపీడీ హీరాలాల్, ఏపీవో విజయకుమారి, ఏపీవో డి.సుందర్రావు, టీఏ మాధవి, ఎస్ఆర్పీ బి.ఆవులయ్య పాల్గొన్నారు. పీడీ వెల్లడించిన వివరాల ప్రకారం జంగిల్ క్లియరెన్స్ పనులకు సంబంధించి సరైన ఆధారాలు లేకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అలాగే శ్రామికుల మస్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. పంటకాల్వల పూడిక తీతల పనుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. పనుల ప్రదేశాల్లో నేమ్బోర్డుల ఏర్పాటు చేయని విషయాలు వెలుగు చూశాయన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ పను లు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. 5 శాతం రాయితీ జీవోను చూపకుండా 20 శాతం చెల్లింపులు చేయడం వంటి విషయాలు బయటపడ్డాయన్నారు. గత 16వ విడతలో రూ.1.73 లక్షల రికవరిలో ఇంకా రూ.63,390 బకాయి ఉందన్నారు. దీనిని వెంటనే రికవరీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. వైఎస్సార్ సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఖతార్లో ఉద్యోగావకాశాలు గుంటూరు వెస్ట్/ఎడ్యుకేషన్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్ దేశంలో టీఐసీ అండ్ ఏ, ఆర్సీ మల్టీ వెల్డర్ సర్వీసుల కింద ఉద్యోగం చేయాలనుకునే పురుష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఐటీసీ విద్యార్హతలతో 24 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, సంబంధిత వృత్తి నైపుణ్యంలో నాలుగేళ్ల కనీస అనుభవం ఉండాలని తెలిపారు. టీఐజీ అండ్ ఏఆర్సీ మల్టీ వెల్డర్కు వేతనం నెలకు రూ.51,939 నుంచి, టీఐజీ అండ్ ఏఆర్సీ వెల్డర్కు రూ.42,478 నుంచి ఉంటుందని వివరించారు. కనీసం రెండేళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందనానరు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన, వైద్య, రవాణా సదుపాయాలతో కూడిన ఈ ఉద్యోగావకాశాల కోసం అభ్యర్థులు ఈ నెల 25లోపు 99888 53335, 87126 55686 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటించే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ఆ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యానగర్, రింగ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు. నగరపాలక సంస్థ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎటువంటి సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణ మూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్లతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. -
డయేరియాపై అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించి వ్యాధి బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ‘స్టాప్ డయేరియా క్యాంపెయిన్’పై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు జరిగే క్యాంపెయిన్లో ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జింక్, ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో సహజసిద్ధంగా కలిగే నీళ్ల విరోచనాలపై తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. క్యాంపెయిన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ పోలీస్
గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా పోలీసుల తీరు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగం అమలులో గుంటూరు జిల్లా పోలీసులు రెండు ఆకులు ఎక్కువే చదివారు. మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడమే విధిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనపై ఆంక్షలు విధించిన పోలీసులు.. దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలో చురుకుగా ఉండే నేతలకు నోటీసులు జారీ చేశారు. కేసులు నమోదు చేస్తూ వేధింపులకు దిగుతున్నారు. తెరపైకి పాత అక్రమ కేసులు ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఇప్పుడు తిరగతోడుతున్నారు. ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పేర్ని నాని తదితరులపై బీఎన్ఎస్ 223, 189(2), 329(4), 292, 126(2), 195(1) రెడ్విత్ 190 బీఎన్ఎస్, 125 ఆర్పీఏ 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ పర్యటనకు రాని పేర్ని నాని పేరు కూడా అప్పట్లో నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. తాజాగా ఆ కేసులో అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం కారు స్వాధీనం తాజాగా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య మృతి చెందడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుని నల్లపాడు స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ డ్రైవర్తోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల పేరిట బెదిరింపులు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు, నోటీసులు విమర్శలకు దారి తీస్తున్న ఉన్నతాధికారుల వైఖరి వైఎస్సార్సీపీకి ఆదరణ పెరగడంతో కూటమి సర్కార్ కుట్ర పాలకుల మెప్పు పొందేందుకు పలువురు పోలీసులు తహతహ పాత కేసులు తిరగతోడుతూ ఎప్పడికప్పుడు కొత్తగా నమోదు అధికార పక్షమైతే ఓకే... వైఎస్ జగన్ ఇంటిపైకి తాటికాయలు విసిరిన వారిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి ఇలా విసిరినా.. కేస విషయంలోనే ఎంతో ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న కారణంగా సాక్షి కార్యాలయంపై అమరావతి జేఏసీ పేరుతో కొందరు మూకుమ్మడిగా వచ్చి విధ్వంసం సృష్టించినా ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడంలో గుంటూరు పోలీసులు ముందుంటున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు చూపిస్తున్న ఉత్సాహంపై పోలీసుల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం సడలిపోయేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. పర్యటన ముందు కూడా నోటీసులు ఇచ్చి కార్యక్రమానికి వెళ్లవద్దంటూ బెదిరింపులకు గురిచేశారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, స్వర్ణలత, పార్టీ మహిళా విభాగం నేత గనిక ఝాన్సీలకు ర్యాలీకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇస్తామని భయపెట్టిన నేపథ్యంలో ఝాన్సీ, స్వర్ణ ర్యాలీకి వెళ్లలేదు. అయినప్పటికీ పాత గుంటూరులో వీరిద్దరూ ర్యాలీకి వెళ్లినట్లు కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
ఇళ్లు కట్టిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్టు
తెనాలి రూరల్: పేదలకు ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు‘ పథకంలో భాగంగా తెనాలి మండలంలోని పెదరావూరు, బుర్రిపాలెం, నేలపాడు గ్రామాలలో పలువురికి స్థలాలను మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టాలు అందజేశారు. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ. 1.80 లక్షలు మంజూరు చేశారు. ఆ క్రమంలో ఎస్జీ బిల్డింగ్ వర్క్స్ పేరిట పట్టణ మారీసుపేట 24వ వార్డు శాంతినగర్కి చెందిన కాంట్రాక్టర్ కం ఏజెంట్ ఎం. పున్నారావు తెరపైకి వచ్చాడు. తాను తక్కువ ఖర్చుతో సకాలంలో ఇళ్లు కట్టిస్తానని సుమారు 175 మంది లబ్ధిదారులను నమ్మించాడు. వారి నుంచి అటు ప్రభుత్వం ఇచ్చిన నగదు, ఇటు లబ్ధిదారుల సొంత డబ్బు అందినకాడికి దండుకుని కొద్దిపాటి పనులు మాత్రమే చేశాడు. లబ్ధిదారులను ఇన్నాళ్లు ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 58 మంది బాధితులను విచారించి మంగళవారం పున్నారావును అరెస్ట్ చేశామని రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. ఇదే తరహాలో పేదలను మోసం చేసిన మరో ఏడుగురు కాంట్రాక్టర్లపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. -
లోక్ అదాలత్ ఇచ్చేది అంతిమ తీర్పే
సత్తెనపల్లి: లోక్ అదాలత్లో ఇచ్చేది అంతిమ తీర్పుగా భావన చేయాలని మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆధ్వర్యంలో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న పోలీసు అధికారులతో జూలై 5వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన సెక్షన్లు, ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని ఆయా ఎస్.హెచ్.వో లకు సూచనలు చేశారు. ముందు సత్తెనపల్లిలో ఉన్న న్యాయమూర్తులు, ఎస్.హెచ్.ఓ లతో గుంటూరు జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి నాగరాజు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియాఉద్దీన్లు వర్చువల్గా జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష చేశారు. అనంతరం స్థానిక న్యాయమూర్తులు స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, మొదటి అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జె. సుజన్ కుమార్, ఆయా పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లు పాల్గొన్నారు. సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి జాతీయ లోక్ అదాలత్పై ఎస్హెచ్ఓలతో సమీక్ష -
ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి
ిపడుగురాళ్ల: రైతులు విక్రయించిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించక పోవడం రైతులను మోసం చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు మే 9 నుంచి ధాన్యం బకాయిలు చెల్లింపులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రబీలో రైతులకు ఇంకా రూ. కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ధాన్యాన్ని అమ్మిన రైతులకు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద రైతులు వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రబీ పంట డబ్బులు తక్షణం చెల్లించకపోతే రైతులు ఖరీఫ్ సాగు చేయడం కష్టమని తెలిపారు. రైతులు క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తే ఆహార సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. సాగు చేసుకోవడానికి అందించాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహం సాగు సాయం కూడా రైతులకు ప్రభుత్వం అందించట్లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళారీ వ్యవస్థను రద్దుచేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించారన్నారు. రైతుల సాగు చేసిన పంటలు కొనుగోలు జగన్ ప్రభుత్వమే చేసిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం రైతుల సమస్యను పరిష్కారం చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్ కుమార్ -
శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి..
గుంటూరు జిల్లా పోలీసులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సి ఉన్నా కూటమి పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో అత్యుత్సాహం చూపుతున్నారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారు. అడ్డగోలుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం ఉంటే చాలు.. ఎవరిమీద పడితే వారిమీద కక్ష సాధిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భార్యపై అనుమానంతో వ్యక్తి హత్య
భట్టిప్రోలు(వేమూరు): భార్యపై అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి భట్టిప్రోలులో చోటుచేసుకుంది. వేమూరు రూరల్ సీఐ వీరాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన చాగళ్లమర్రి రత్నరాజు, జంపని సురేష్ స్నేహితులు. రత్నరాజు తాపీ పనిచేస్తుండగా, సురేష్ వడ్రంగి పనిచేస్తున్నాడు. రత్నరాజు భట్టిప్రోలు గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు గొడవపడడంతో ఆమె భట్టిప్రోలులోని పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి రత్నరాజు భట్టిప్రోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్ సెంటర్లో జంపని గ్రామానికి చెందిన జంపని సురేష్ తారసపడ్డాడు. దీంతో రత్నరాజు అతనిని ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. రత్నరాజు తన చేతిలో ఉన్న కత్తితో సురేష్ను పొడిచి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. -
బర్లీ కొనుగోలులో జాప్యం తగదు
జిల్లా రైతు సంఘం నాయకులు పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకును రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తే తగదని.. మరింత వేగవంతం చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు మంగళవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి రోజుకు 200 బేళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఇదే విధంగా కొనుగోలు సాగితే రైతుల వద్ద ఉన్న పంట అంతా అమ్ముడుపోయేందుకు ఆరు, ఏడు నెలలు పైగానే సమయం పడుతుందన్నారు. జాప్యం చేయకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. రోజుకు కనీసం 1000 బేళ్లు చొప్పున పాగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నిర్ణయించిన హై గ్రేడు ధర రూ.12 వేలు, లోగ్రేడ్ ధర రూ.6 వేలు చొప్పున ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారన్నారు. మధ్య గ్రేడు పొగాకు ధర క్వింటా రూ.9 వేలు నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బండి శంకరయ్య మాట్లాడుతూ పొగాకు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పొగాకు కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కే శ్రీనివాసరావు, ఎం డేవిడ్, ఎర్రం శ్రీనివాసరెడ్డి, వీ పుల్లారెడ్డి, కే నాగురు తదితరులు పాల్గొన్నారు. -
ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులా?
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి డిమాండ్ చేశారు. యడ్లపాడు పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కె.బుజ్జి అధ్యక్షతన ఆశవర్కర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆశ వర్కర్ల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేసి తీరా అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినా నేటికీ ఒక్క సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించలేదన్నారు. పైగా రాజకీయంగా స్థానిక టీడీపీ నాయకులే వేధింపులకు గురి చేయడం, ఆశ వర్కర్లను తమ విధుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రస్తుతం చేస్తున్న చిరుద్యోగులను తొలగిస్తున్న విషయాలను గమనించి న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు రెడ్కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. బ్రిటీష్ కాలానికి ముందే పోరాడి, ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేవలం నాలుగు కోడ్లుగా మార్చి తీరని ద్రోహం చేస్తుందన్నారు. దీనిని నిరసిస్తూ జులై 9వ తేదీన జరిగే ఆశ వర్కర్ల సమ్మెలో అందరూ భాగస్వాములై తమ సమస్యల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీ ఎన్నిక సమావేశం అనంతరం ఆశ వర్కర్ల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షురాలు పి.నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎం.మల్లేశ్వరి, పి.సుశీల, ప్రధాన కార్యదర్శి వేళంగిని దేవి, కోశాధికారి, సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆశవర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి యడ్లపాడు పీహెచ్సీలో సమావేశం జూలై 9 సమ్మెకు సిద్ధం కావాలంటూ పిలుపు -
జీజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓ బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా డాక్టర్ బుజ్జ వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1992లో పీజీ వైద్యవిద్యను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో చదివారు. 1997లో శంషాబాద్ సివిల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చారు. 2006 –10 వరకు గాంధీ అసుపత్రిలో పనిచేస్తూ బదిలీపై ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో స్టాటిటిక్ ప్లానింగ్ విభాగంలో పనిచేశారు. 2012లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పదోన్నతి పొంది రాష్ట్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా 2022 వరకు విధులు నిర్వర్తించారు. తర్వాత నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తూ బదిలీపై గుంటూరుకు వచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనకు ఆసుపత్రి వైద్యులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. -
నేటి నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టండి
● జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ● నేటి నుంచి కేంద్ర బృందాలు గ్రామాల సందర్శన నరసరావుపేట: ఏఎంఎస్ కేంద్ర బృందాలు బుధవారం నుంచి గ్రామాలు సందర్శన చేసి స్వచ్ఛతపై సర్వే నిర్వహిస్తున్నందున జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలు అందరూ గ్రామాల్లో ఉండి పారిశుద్ధ్య నిర్వహణలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2025 వర్క్షాప్ నిర్వహించి పంచాయతీరాజ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. కేంద్ర బృందాలు సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్, హౌస్ హోల్డ్ అసెస్మెంట్, పబ్లిక్ ప్లేసెస్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ, సిటిజన్ ఫీడ్ బ్యాక్లపై సర్వే నిర్వహించి గ్రామాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే పంచాయతీరాజ్ సిబ్బందికి వేయి మార్కుల పరీక్ష వంటిదని పేర్కొన్నారు. సర్వేను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర బృందానికి సహకారం అందించి జిల్లాను ర్యాంకింగ్లో ముందుంచాలని ఆదేశించారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, డీఎల్డీఓలు ఎం.వెంకటరెడ్డి, రాజగోపాల్, గబ్రు నాయక్, నరసరావుపేట డీఎల్పీఓ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఏడుకొండలు హాజరయ్యారు. -
భూ వివాదం బంధాల మధ్య చిచ్చురేపింది
● సోదరుల మధ్య ఘర్షణ ● ఆస్పత్రి పాలైన తమ్ముడు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లెలు యడ్లపాడు: భూ వివాదం రక్తసంబంధాలను దాటుకుని దాడికి పురిగొల్పింది. ఫలితంగా అన్మదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు తీవ్రంగా గాయపడగా, చెల్లెలు అన్నపై ఫిర్యాదు చేసిన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎలుకా సాంబయ్య, వీరమ్మ దంపతులకు వెంకటరావు, వీరాంజనేయులు, వెంకమ్మ ముగ్గురు సంతానం. తండ్రి మోకాళ్ల నొప్పులతో నడవలేని పరిస్థితి, తల్లికి పక్షవాతం కారణంగా కుమార్తె వెంకమ్మ ఆదరణలో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల వీరాంజనేయులు భార్య కాలం చేయడంతో అతని కుమార్తెను ఆమె చూసుకుంటుంది. తల్లి వీరమ్మ పేరిట రెండు ఎకరాల పొలం ఉంది. కొద్దిరోజులుగా అందులో సగం తనకు పంపిణీ చేయాలంటూ పెద్ద కుమారుడు వెంకటరావు కుటుంబ సభ్యుల్ని కోరగా, అలా సాధ్యం కాదని మిగిలిన ఇద్దరు అడ్డు చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో ఈనెల 22వ తేదీన అన్నదమ్ముల మధ్య గొడవ రాజుకుంది. ఆగ్రహావేశంతో అన్న తమ్ముడి తలపై రోకలి బండతో మోదాడు. దీంతో తీవ్రగాయాలైన తమ్ముడిని కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం బాధితుడి సోదరి వెంకమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. -
అమరేశ్వర స్వామికి ఆదాయం
అమరావతి (పెదకూరపాడు): అమరావతిలోని అమరేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించి ముప్పాళ్ళ మండలం మాదల, దమ్మాలపాడు గ్రామాల్లోని సుమారు 70 ఎకరాల భూములను బహిరంగ వేలం వేయగా, గత ఏడాది కంటే రూ.8,14,500 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి రేఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2022–23, 2024–25 కాలానికి గతంలో రూ. 6,13,000 ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం 2025–26, 2026–27 సంవత్సరాలకు రూ.14,27,500 ఆదాయం సమకూరిందన్నారు. గతంతో పోల్చుకుంటే రూ. 8,14,500 ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు.పులిచింతల వద్ద మొసళ్లుఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు జలాశయంలోనే కాదు. ఇటీవల కాలంలో ప్రాజెక్టు మీదకు కూడా మొసళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు కావడంతో రాకపోకలు కొనసాగించాలంటే ప్రాజెక్టు మీద నుంచే వెళ్లాలి. కొంత మంది ప్రాజెక్టు మీదుగా నడిచి కూడా వెళుతున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా మొసళ్లతో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని వాహనారులు, పాదచారులు గుర్తుంచుకోవాలి.ఆలయ నిర్మాణానికి విరాళంనరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వేమ వెంకటేశ్వరరావు, నాగ రజిని దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవిదేవిని మంగళవారం ఆలయ కార్యాలయంలో కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఐషర్ లారీలో మంటలునరసరావుపేట రూరల్: షార్ట్ సర్కూట్తో మంటలు చేలరేగి ఓ లారీ దగ్ధమైన ఘటన కోటప్పకొండ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు... బొప్పాయి లోడ్ కోసం పశ్చిమబెంగాల్ నుంచి ఐషర్ వాహనం కోటప్పకొండకు వచ్చింది. లారీని రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్, క్లీనర్ టిఫిన్ చేస్తుండగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. సమీపంలోని వారు గమనించి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఇంజన్, క్యాబిన్కు మంటలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ పరిశీలించారు.భక్తి శ్రద్ధలతో చండీహోమంనగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించా రు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమం చేపట్టారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణా హుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. -
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు
చినగంజాం: రైతులు రాబోయే సీజన్లో పొగాకుకు ప్రత్యామ్నాయంగా వివిధ పంటలు సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు రత్నకుమారి సూచించారు. మండలంలోని చింతగుంపల, కడవకుదురు గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి ఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రత్నకుమారి మాట్లాడుతూ.. మండలంలో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో రైతుల నమోదు ప్రక్రియ జరుగుతోందన్నారు. ముందస్తుగా మార్క్ఫెడ్ నుంచి షెడ్యూల్ ఇస్తామని, ఆ షెడ్యూల్ ప్రకారం పొగాకు కొనుగోలు కేంద్రాలకు ఉత్పత్తులను తీసుకెళ్లాలన్నారు. అనంతరం వేరుశనగ పైరును పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసుకోవాల్సిందిగా సూచించారు. కౌలు రైతు కార్డులు పంపిణీ చేస్తున్నామని, అర్హులైన వారు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో వీఏఏలు సంధ్య, కిషోర్, గ్రామ రైతులు పాల్గొన్నారు. గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యం బాపట్ల: గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమన్వయంతో యంత్రాంగం పని చేయాలని బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్.ప్రభాకరరావు చెప్పారు. మంగళవారం స్థానిక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2025 గురించి జరిగిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో డీపీఓ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తడి, పొడి వ్యర్థాల నిర్వహణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు తీరు పరిశీలన నిమిత్తం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం వస్తోందని తెలిపారు. స్వచ్ఛతపై వివిధ అంశాలను చూసి మార్కులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి గ్రామాలకు మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. గ్రామీణ మంచినీటి సరఫరా జిల్లా ఎస్ఈ అనంతరాజు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం వంటి వాటిలో ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. డీడీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, డెప్యూటీ ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, ఎంఆర్సీలు, పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పౌడా సమావేశంలో 15 అంశాలు ఏకగ్రీవ ఆమోదం
నరసరావుపేట: స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన మంగళవారం పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పౌడా) కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన అధికారులు అజెండాలో ప్రభుత్వం విడుదల చేసిన 15 అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. పౌడా అభివృద్ధికి చేయాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ పి.మధుకుమార్, ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజానాయక్, విద్యుత్శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సీహెచ్.రాంబొట్లు, పర్యాటక శాఖ జిల్లా అధికారి జి.నాయుడమ్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి జి.అనీల్కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి జి.కృష్ణారావు, పౌడా ప్లానింగ్ అధికారి పాల్గొన్నారు. వాగులో లారీ బోల్తా ప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సీపీవోగా ఏ.షాలెమ్రాజు బాపట్ల: బాపట్ల జిల్లా ప్రణాళిక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఏ.షాలెమ్ రాజు జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సీపీఓగా పనిచేసిన కె. శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న షాలెమ్ రాజు నియమితులయ్యారు. ప్రణాళిక శాఖలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. -
గుంటూరు కాపు హాస్టల్లో ప్రవేశాలకు ప్రకటన
గుంటూరు రూరల్: నగర శివారు గోరంట్ల గ్రామం హోసన్నా మందిరం వెనుక ఉన్న కాపు విద్యార్థి వసతి గృహంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలగ అభ్యుదయ సంఘం కార్యదర్శి బాలిశెట్టి విజయ్కుమార్ మంగళవారం తెలిపారు. వసతి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, దూరప్రాంతాలకు చెందిన కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకూ చదువుతున్న విద్యార్థులు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీపీటీ, సివిల్ సర్వీసులు, గ్రూప్స్, ఎస్ఎస్సీ, బ్యాంక్ పీవో వంటి పోటీ పరీక్షలు రాసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోను నంబర్లు 85208 71568, 86865 55999 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో పూరిబండి శ్రీకాంత్, డేగల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకను కలసి వినతి పత్రం సమర్పించారు. వివిధ కేటగిరీలకు చెందిన 5,147 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా.. వారిలో కొంత మంది బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లారన్నారు. మిగిలిన వారిలో ఎక్కువమంది పాతస్థానాల నుంచి రిలీవ్ కాలేదని పేర్కొన్నారు. వీరివల్ల మిగిలిన టీచర్లు సైతం ఆగిపోవాల్సి వస్తోందని, ఎంటీఎస్ టీచర్లతోపాటు సర్ప్లస్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయడం ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. క్యాడర్ వివరాలు అప్డేట్ చేసి, వేతనాలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేర్లను సంబంధిత ప్రైవేటు పాఠశాలలు డ్రాప్బాక్స్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఈవోను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి. వెంకటేశ్వర్లు, కె.సాంబశివరావు, ఎం.గోవిందు, బి. ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్కుమార్, ధనలక్ష్మి, ప్రసన్న ఉన్నారు. -
నాతో సీఐ అసభ్యంగా ప్రవర్తించారు
నరసరావుపేట రూరల్: ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లిన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాబాయి జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. షాపింగ్మాల్లో జరిగిన వివాదం గురించి మాట్లాడేందుకు ఈనెల 15న పోలీస్స్టేషన్కు వెళ్లానని, సీఐ తన కులాన్ని ప్రస్తావిస్తూ అసభ్యకరంగా దూషించాడని పేర్కొన్నారు. మూడు గంటలు స్టేషన్లో నిర్బంధించారని, ఇతర అధికారుల ముందు తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్కు వస్తే చెప్పు తీసుకొని కొడతానని, బ్రోతల్ కేసు నమోదు చేసి లోపల వేస్తానని సీఐ బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యతి్నంచానని వివరించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. -
వరి విత్తనాలు సిద్ధంగా ఉంచాలి
నరసరావుపేట రూరల్: ఖరీఫ్ సీజన్లో జిల్లాకు సరిపడా వరి విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి సూచించారు. నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు మండలాల పరిధిలోని వరివిత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 53,650 హెక్టార్లలో వరి సాగవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం 26,825 క్వింటాళ్ల వరి విత్తనం అవసరం అవుతుందని తెలిపారు. ఈ అంచనాల మేరకు బీపీ, జేజీఎల్, కేఎన్ఎమ్, ఎన్ఎల్ఆర్, అంకుర్ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ రకాలను డీలర్ల వద్ద అందుబాటులో ఉంచి అవసరం మేర సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. విత్తన దుకాణాదారులు ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలను అధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఏడీఏ మస్తానమ్మ, ఏఓలు శాంతి, పి.శివలలిత, వ్యవసాయ విస్తరణ అధికారి బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళి -
తప్పుడు విధానాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
● కొనసాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా ● విడదీసిన 3,4,5 తరగతులను మళ్లీ కలపాలి ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు దూళ్ళిపాళ్ల రమాదేవి సత్తెనపల్లి: ప్రజలకు సూపరిపాలన అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేస్తుందనిసీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు దూళ్ళిపాళ్ల రమాదేవి విమర్శించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో రమాదేవి ఆధ్వర్యంలో సీపీఎం బృందం సోమవారం పర్యటించింది. అనంతరం సత్తెనపల్లి పుతుంబాక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి అక్రమ రవాణా అరికట్టవచ్చునన్నారు. రేషన్ షాపుల వద్దకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దకే రేషన్ బియ్యం వాహనాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూల్కు తరలించడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 3,4 నెలల పాటు పెండింగ్లో పెడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారి సంగతి తేలుస్తానని అనడం సరికాదన్నారు. దేవుళ్లను, మతాలను రక్షించడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చారా? లేదా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. సీపీఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, పట్టణ కార్యదర్శి డి.విమల తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో సీట్లకు 89 మంది విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: రాజీవ్గాంధీ సాంకేతిక, విజ్ఞాన విశ్వ విద్యాలయాల్లో (ట్రిపుల్ ఐటీ) ప్రవేశాలకు గుంటూరు జిల్లా నుంచి 89 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సోమవారం ప్రకటించిన జాబితాలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి టెన్త్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్మీడియెట్తో పాటు బీటెక్తో ఆరేళ్ల ప్రోగ్రామ్కు అర్హత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 94.78 శాతం మేరకు ఉన్నట్లు ప్రవేశాల జాబితాలో పొందుపర్చారు. గుంటూరు జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీల వారీగా నూజివీడు–31, ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ– 16, ఒంగోలు–35, శ్రీకాకుళంలో–7 చొప్పున ఉన్నారు. ఎంపికై న విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్సైట్తో పాటు ప్రభుత్వ వాట్సాప్ సేవల నంబరు 95523 00009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా క్యాంపస్లలో ఈనెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు జరగనున్న కౌన్సెలింగ్కు విద్యార్థులు హాజరు కావాలి. ● గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పి.నాగసాయి రోషిణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో అత్యధికంగా 573 మార్కులు సాధించడం ద్వారా ప్రవేశం పొందిన ఆమెను డీఈవో సీవీ రేణుక, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.పద్మజ అభినందించారు. -
హౌసింగ్ కాలనీలపై సత్వరం నివేదిక ఇవ్వండి
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం నరసరావుపేట: హౌసింగ్ కాలనీల అభివృద్ధిపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇదివరకు చేపట్టిన హౌసింగ్ కాలనీ అభివృద్ధి పనులుకు సంబంధించి పురోగతి ధ్రువీకరణపై సమీక్ష చేశారు. పనుల తనిఖీ నిమిత్తం జిల్లాలో మొత్తం 18టీమ్లను ఏర్పాటు చేయగా, మొత్తం 741 పనులకు ఇప్పటివరకు 277 పనులు మాత్రమే తనిఖీ పూర్తిచేసి ఉన్నారని, మిగిలిన 464 పనులు తనిఖీ వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. తనిఖీలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తిచేసిన అన్ని పనులకు ఒక వారంలోపు నివేదికను డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్కు సమర్పించాలని ఆదేశించారు. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జె.ప్రభాకర్, తనిఖీ బృంద సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఫలక్నుమా’లో ఆరుగురు బాల కార్మికులు గుర్తింపు రాజుపాలెం: నడికూడి గవర్నమెంట్ రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాధ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. వారి తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. -
27న క్రోసూరులో జాబ్మేళా
క్రోసూరు: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 27న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.వి.రమాదేవి సోమవారం తెలిపారు. ఈ జాబ్డ్రైవ్ను పెదకూరపాడు నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళాలో సుమారు 10 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. జీతం విద్యార్హతను బట్టి సుమారు రూ.12000 – రూ.35,000 ఉంటుందని తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్కు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ చదువుకుని, 18–40 మధ్య వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునన్నారు. మరిన్ని వివరాలకు 7779858789, 8074393466 నంబర్లలో సంప్రదించాలన్నారు.రైలు నుంచి జారిపడి ప్రయాణికుడు మృతిదాచేపల్లి: రైలు నుంచి జారిపడి ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. లింగంపల్లి నుంచి నర్సాపూర్ వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి గుర్తు తెలియని ప్రయాణికుడు జారిపడి మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపారు. నర్సాపూర్ రైలు నడికుడి రైల్వే స్టేషన్కు చేరుకునే సమయంలో జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు రైలు వాకిట్లో కూర్చొని నిద్రపోతూ ప్రమాద వశాత్తూ జారి కిందపడటంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారుగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతుడు ఇటుక రంగు పైన ఎరుపు, తెలుపు, నలుపు చెక్స్ బారుచేతుల చొక్కా, బ్లూ రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడన్నారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామని, పూర్తి వివరాలకు నడికుడి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ వి.శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. వివరాలకు 8074274484, 9949063960 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.ఉరివేసుకుని యువకుడి బలవన్మరణంచిలకలూరిపేట టౌన్: పట్టణంలోని టిడ్కో గృహాల్లో విషాదం చోటు చేసుకుంది. 52 ఎకరాల టిడ్కో గృహాల్లో నివసిస్తున్న యువకుడు దేవగిరి తేజారెడ్డి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని తన స్నేహితుడి నివాసంలో జీవితం ముగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజారెడ్డి పర్చూరు మండలం అన్నవరం గ్రామానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందగా, తండ్రి రెండో వివాహం చేసుకుని వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజారెడ్డిని నాయనమ్మ పెంచింది. అయితే కొంతకాలం కిందట ఆమె మృతిచెందడంతో అతను పూర్తిగా ఒంటరివాడయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించిన తేజారెడ్డి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడల్లా టిడ్కో గృహంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతాడు. ఇదే విధంగా ఆదివారం స్నేహితుడి ఇంటికి రావడంతో సాయంత్రం 4 గంటలకు మిత్రుడు పనిమీద బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చి గది తలుపులు తీయగా తేజారెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు, గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు సమాచారం అందించడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్బన్ సీఐ పి.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.పొలాల్లో అస్థిపంజరం లభ్యంతెనాలి రూరల్: పొలాల్లో అస్థిపంజరాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో నేలపాడు పంచాయతి పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తూర్పు వైపున ఉన్న పొలంలో అస్థిపంజరాన్ని గుర్తించారు. పోలీసుల ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎముకల గూడు పక్కన గళ్ల లుంగీ ఉంది. ఇదే పాఠశాల సమీపంలో బిచ్చగాడు నెల రోజులుగా కనబడకుండాపోయాడని, అతని అస్థిపంజరం అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాలికపై ‘అమ్మా’నుషంతాడేపల్లి రూరల్ : వ్యభిచారంలోకి దించిన కన్నతల్లిపై మైనర్ కూతురు తాడేపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తితో సహజీనం చేస్తూ వడ్డేశ్వరం వచ్చి నివసిస్తోంది. తన 17 ఏళ్ల కూతురిని కూడా అతనితో ఉండాలంటూ ఒత్తిడి చేయడంతో పాటు వ్యభిచారం వృత్తిలోకి దింపింది. ఈ బాధలు భరించలేక బాలిక పక్కింట్లో నివాసముంటున్న మహిళ సాయంతో తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగుల వినతి నెహ్రూనగర్: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్ లోకల్ బాడీ(యుఎల్బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్తో పాటు స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్ నాయకులు అబ్దుల్ రజాక్, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్ పాల్గొన్నారు. అండర్–14 టెన్నిస్ విజేత విన్సెంట్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, వీవీవీ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్–14 టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ సింగిల్స్ విజేతగా కె. విన్సెంట్, రన్నర్గా జి.దిశాంత్ నిలిచారు. డబుల్స్ విభాగంలో దిశ, విన్సెంట్ జోడీ విన్నర్గానూ జి.దిశాంత్, కల్యాణీలు రన్నర్స్గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్ క్లబ్ డెరెక్టర్ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా బుజ్జిబాబు గుంటూరు ఎడ్యుకేషన్ : న్యూజిలాండ్లో అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం కో–ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న నెల్లూరి బుజ్జిబాబు ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు గుంటూరుకు చెందిన ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్గా న్యూజిలాండ్లోని తెలుగువారిని సమన్వయపర్చడంతో పాటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా బుజ్జిబాబుకు అభినందనలు తెలియజేశారు. టోల్గేట్ వద్ద గంజాయి పట్టివేత మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కాజ టోల్ గేట్ వద్ద భారీగా గంజాయి, మెత్ డ్రగ్స్ను ఈగల్ టీమ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి వైజాగ్కు బస్సులో వెళుతున్న యువకుడు భారీగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఈగల్ టీమ్ సోమవారం కాజ టోల్ గేట్ వద్ద నిఘా వేసింది. గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయితో పాటు రూ. 3 లక్షల విలువైన మెత్ను స్వాధీనం చేసుకుంది. యువకుడిని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించింది. గంజాయి, మెత్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..ఎంత మంది ఉన్నారనే ? అంశాలపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుమారుడి ఆచూకీ లేదయ్యా..!
పదిరోజులుగా ● ప్రేమించిన అమ్మాయి పిలిస్తే వెళ్లాడు.. అనంతరం కనిపించడం లేదు ● యువతి తల్లిదండ్రులపై అనుమానం ● జిల్లా ఎస్పీకి యువకుడి తల్లి ఫిర్యాదు ● పోలీసు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు నరసరావుపేట రూరల్: ప్రేమించిన అమ్మాయి పిలిస్తే వెళ్లిన తన కొడుకు తిరిగి రాలేదని, పది రోజులైన ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడంలేదని నాదెండ్ల మండలం గురిజవోలుకు చెందిన పల్లపు కోటేశ్వరమ్మ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన యువతిని తన కుమారుడు విజయకుమార్ ప్రేమిస్తున్నాడని, ఇది ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు ఆమెను నరసరావుపేట మండలం దొండపాడులో ఉంచారని తెలిపింది. యువతి దొండపాడు రమ్మని చెప్పడంతో వెళ్లిన విజయకుమార్ వెళ్లాడని తిరిగి రాలేదని వాపోయింది. సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏదైనా అఘాయిత్యం చేసి ఉంటారనే ఆందోళనను ఆమె వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ వివాదాలు వంటి 100 ఫిర్యాదులు అందాయి. బ్యాంకుకు నగదు చెల్లించకుండా మోసం తమ వద్ద వసూలు చేసిన లోన్ నగదును బ్యాంక్కు కట్టకుండా యానిమేటర్ మస్తాన్వలి మోసం చేసినట్టు రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామానికి చెందిన నాగమ్మ మహిళా గ్రూపు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజుపాలెం యూనియన్ బ్యాంక్లో రూ.10లక్షలు తీసుకోగా బ్యాంక్ అకౌంట్ను యానిమేటర్ నకరికల్లుకు మార్చారని తెలిపారు. తరువాత లోన్ నగదును బ్యాంక్కు చెల్లిస్తానని ప్రతి నెల యానిమేటర్ తీసుకొన్నాడని వివరించారు. లోన్ నగదు చెల్లింపు పూర్తయిందని తమతో చెప్పారని, ఇప్పుడు రాజుపాలెం బ్యాంక్ నుంచి రూ.5.50లక్షలు చెల్లించాలని నోటీసులు వచ్చాయని వాపోయారు. నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు.. ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి నగదు తీసుకొని జిల్లా సర్వేయర్ పేరుతో నకిలీ సంతకాలతో షేక్ జిలాని, మహబూబ్ సుభానిలు మోసం చేసినట్టు రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన బత్తుల నాగేశ్వరరావు ఫిర్యాదు చేసాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని తెలిపారు. -
సమ్మెలోకి అవుట్ సోర్సింగ్ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ విభాగ అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఈనెల 9న కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. కార్మికులకు జీతాలు పెంచమని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు మధుబాబు తెలిపారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు, డ్రైవర్లకు అప్పుడున్న జీతంపై రూ.6000 అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనులు చేసే కార్మికులకు కమిటీ వేసి దాని సిఫార్సు మేరకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈనెల రెండో తేదీన జరిగిన జాయింట్ మీటింగ్లో ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామని చెప్పి, ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వివరించారు. రిటైర్మెంటు వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
రెడ్క్రాస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఏర్పాటైంది. సోమవారం కలెక్టరేట్లో డీఆర్ఓ ఏకా మురళి అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో చైర్మన్గా మేదరమెట్ల రామశేషగిరిరావు, వైస్ చైర్మన్గా కేఎంఎన్వీ శ్రీనివాసగుప్తా, కోశాధికారిగా డాక్టర్ నంద్యాల రాంప్రసాదరెడ్డిలను నియమించారు. అలాగే మేనేజింగ్ కమిటీ సభ్యులుగా పూర్వ అధ్యక్షులు డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డి, డాక్టర్ ఎస్.రాంప్రసాద్, డాక్టర్ సృజన, బత్తుల మురళి, బీవీఎల్ ప్రసాద్, పి.నరసింహారావు, విన్సెంట్పాల్, భుజంగరావు నియమితులయ్యారు. పరిశీలకులుగా ఏపీ స్టేట్ కోశాధికారి రామచంద్రరాజు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న సభ్యుల చేత డీఆర్ఓ ప్రతిజ్ఞ చేయించారు. గత మూడేళ్లు జరిగిన సేవా కార్యక్రమాలు, ఫైనాన్షియల్ నివేదికను సమర్పించారు. అలాగే గత మూడేళ్లుగా సేవలు అందజేసిన డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డి, కమిటీ సభ్యులను సన్మానించారు. -
నమ్మించి..నట్టేట ముంచి...
యద్దనపూడి: ఆరుగాలం కష్టించి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొందరు.. ప్రతి నెలా వచ్చే సామాజిక పింఛన్లో కొంత మిగుల్చుకొని మరికొందరు.. తమ పిల్లల భవిష్యత్ కోసం మరికొందరు నెలనెలా పోస్టాఫీసులో పొదుపు చేస్తూ వస్తున్నారు. వారికి చేయూత అందించాల్సిన పోస్టుమాస్టర్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు నియోజకవర్గంలో నాగండ్ల, చెరుకూరు, నాగులపాలెం బ్రాంచ్ల్లో వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీస్లో పోస్టుమాస్టర్ నకిలీ పాస్పుస్తకాలతో ఖాతాదారులను మోసం చేసిన విషయం వెలుగు చూసింది. పూనూరు పోస్టాఫీసులో కల్యాణ్రావు 22 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నాడు. పోస్టాఫీస్కు వచ్చే వారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో సూమారు 1200కు పైగా ఖాతాదారులు పోస్టుమాస్టర్పై నమ్మకంతో నెలనెలా పొదుపు సొమ్ము కడుతూ వస్తున్నారు. గడువు ముగిసినా నగదు ఇవ్వకపోవడంతో.. గడువు ముగిసినా నగదు ఇవ్వకపోవటంతో కొందరు ఖాతాదారులు చీరాల ఏఎస్పీ శ్రీనివాసరావుకి ఏప్రిల్ నెల15న ఫిర్యాదు చేశారు. 19వ తేదీన తనిఖీకి వచ్చిన శ్రీనివాసరావు విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చాడు. దీంతో కొందరు ఈ విషయాన్ని విజయవాడలోని పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పోస్టాఫీస్ విజిలెన్స్ అధికారులు మే 22వ తేదీన పూనూరు పోస్టాఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో పోస్టుమాస్టర్ అవినీతి బండారం బట్టబయలైంది. తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల ఏఎస్పీ శ్రీనివాసరావును హిందుపురం బదిలీ చేశారు. పూనూరు పోస్టుమాస్టర్ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విచారణాధికారిగా ఒంగోలు ఏఎస్పీ మధుసూదనరావును వేశారు. కానీ విచారణ మాత్రం నత్తనడకన సాగటంతో ఖాతాదారులు తమ సొమ్ము వస్తుందో రాదోనంటూ భయపడుతున్నారు. చేతివాటం ప్రదర్శిస్తున్న పోస్టుమాస్టర్లు తాజాగా పూనూరు పోస్టుమాస్టర్ లీలలు నకిలీ పాస్ పుస్తకాలతో ఖాతాదారులకు శఠగోపం లబోదిబోమంటున్న ఖాతాదారులు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ అవకతవకలు వాస్తవమే.. పూనూరు పోస్టాఫీస్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. 1200 మంది ఖాతాదారులు ఉండగా ఇప్పటి వరకు 50 శాతం పుస్తకాలు పరిశీలించాం. పూర్తిస్థాయి విచారణ ముగియగానే ఆధారాలు ఉన్నవారికి తిరిగి వడ్డీతో సహా నగదు చెల్లిస్తాం. చాలా మంది ఆధారాలు లేకుండా డబ్బు ఇచ్చినట్లు ఫోర్జరీ సంతకాలతో నగదు తీసుకున్నాడని చెప్తున్నారని వారిని కూడా పిలిచి ఒక లిస్టు తయారుచేసి న్యాయం జరిగేలా చూస్తాం. –సాధిక్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఒంగోలు -
అడుగడుగునా అడ్డగింత
నరసరావుపేట రూరల్: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు చేసిన మోసంపై యువత కన్నెర్ర చెసింది. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వ మోసాలతో నష్టపోయిన యువత, విద్యార్థులు పోరుబాట కార్యక్రమంలో పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కార్యక్రమానికి తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరి గౌతమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్రెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొనుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. హామీలన్నీ నెరవేర్చాల్సిందే.. నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ నేతలు దుయ్యబట్టారు. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రూ.7200కోట్లు నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడిందని వాటన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, ఏడాదైనా జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కొన్ని కాలేజీల్లో పరీక్షలకు సైతం విద్యార్థులను అనుమతించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం కల్పించుకుని వెంటనే యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుండా యువాగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందని నినదించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని నినదించారు. ఎస్పీ కార్యాలయం వద్దకు ర్యాలీ చేరుకున్న సమయంలో పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. 50మందికే అనుమతిస్తామని చెప్పడంతో నాయకులు, యువత, విద్యార్థులు ముందుకు కదిలారు. వీరు వెళ్లిన తరువాత పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో యువత, విద్యార్థులు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి)కి హుండీ కానుకల ద్వారా రూ.3,70,41,400 ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేర్చారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ పర్యవేక్షించగా అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు, దేవదాయ శాఖ సిబ్బంది, వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
211 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్)వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన వారిచే 211 అర్జీలు స్వీకరించారు. కలెక్టరు మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు వుండాలని స్పష్టం చేశారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో సాగునీటి కాలువలు మురుగునీటి మయమై ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ కృష్ణా డెల్టా ఆయకట్టు సుమారు 5.71 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందని తెలిపారు. కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు రైతులంతా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి సాగునీటి కాలువల పరిస్థితి నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం, అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, నాయకులు పాపారావు, రైతులు పాల్గొన్నారు.హైవేలపై ప్రమాదాల నివారణకు ఆధునిక వాహనాలుఆర్టీఓ బి. సత్యనారాయణ ప్రసాద్పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక వాహనాలను ప్రవేశపెట్టినట్లు ఆర్టీఓ బి.సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కార్యాలయంలో సోమవారం నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు పెట్రోలింగ్ ఆధునిక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వాహనాలు 5, 9 నంబర్ల జాతీయ రహదారులపై నిత్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు. నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండీ, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ పాల్గొన్నారు.శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభంనెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా బ్రిడ్జి మీదకు బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు రాకుండా డైవర్ట్ చేశారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లాడ్జి సెంటర్ వద్ద, డొంక రోడ్డు నుంచి కొత్తపేట వైపు వెళ్లేటప్పుడు మలుపుల వద్ద డివైడర్లు ఏర్పాటు చేశారు.నాట్యంపై రాత పరీక్షలు ప్రారంభంకూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లమో రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాధశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షకు 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. -
యువతను వంచించిన సర్కారు
నరసరావుపేట: విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి, విద్యాదీవెనలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో జరుగుతున్న పీజీఆర్ఎస్కు హాజరై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎనుముల మురళీధర్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అన్నెం పున్నారెడి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పుతోళ్ల వేణుమాధవ్, వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు బూదాల కల్యాణ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, చిలకలూరిపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ప్రభు పాల్గొన్నారు. -
ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ
తెనాలి: పట్టణానికి చెందిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ 40వ వర్ధంతిని సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ వి.బాలమోహన్దాస్ సెమినార్ హాలులో ఉదయం 11 గంటలకు ఏర్పాటయే సభలో డాక్టర్ నాయుడమ్మపై రూపొందించిన సావనీరును ఆవిష్కరిస్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధర్రావు, చైన్నెలోని సీఎస్ఐఆర్–సీఎల్ఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణ వి.కాంత్ పాల్గొంటారు. కార్యక్రమాన్ని యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తోలు పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం తోలు శుద్ధి చేసే ప్రక్రియకు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే పరిశ్రమకు సమస్యగా ఉన్న మకిలి మాయమైంది. కొన్ని వర్గాలకే పరిమితమైన చర్మ పరిశ్రమ అందరిదైంది. చర్మకారుల నైపుణ్యం పెరిగింది. కులాని కతీతంగా చర్మ పరిశ్రమ విస్తరించి, ఆ రంగంలోనూ దేశానికి కీర్తిని తీసుకొచ్చింది. నిశ్శబ్దంగా సాగిన ఈ విప్లవాన్ని సాధించిన ఘనత ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మకు దక్కుతుంది. ‘జన్మతః రైతును...వృత్తిరీత్యా అస్పృశ్యుడను’ అని చెప్పుకున్న నాయుడమ్మ, తన వృత్తితో చర్మ పరిశ్రమను ఇతర పరిశ్రమలకు దీటుగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండల గ్రామం యలవర్రు డాక్టర్ నాయుడమ్మ స్వస్థలం. 1922 సెప్టెంబరు 10న జన్మించారు. దగ్గర్లోని తురుమెళ్లలో హైస్కూలు విద్య, గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ తర్వాత, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్ టెక్నాలజీలో బీఎస్సీ చేశారు. 1943లో చైన్నెలో లెదర్ టెక్నాలజీలో చేరారు. అమెరికాలోని లీహై విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ చర్మశుద్ధిపై ఎంఎస్, డాక్టరేట్ పొందారు. 1951లో తిరిగొచ్చి, చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఆ సంస్థను సాటిలేని పరిశోధన సంస్థగా రూపొందించే కృషితో 1958లో అదే సంస్థ డైరెక్టర్గా నియమితులయ్యారు. పరిశోధనలు చర్మకారులకు వరప్రసాదాలు నాయుడమ్మ పరిశోధనలు దేశీయ చర్మ పరిశోధనకు, చర్మకారులకు వరప్రసాదాలు. ఆయన సారథ్యంలో సీఎల్ఆర్ఐ సంస్థ, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో గణనీయమైన పాత్ర వహించింది. పలు దేశాలు చర్మ సంపద సద్వినియోగానికి నాయుడమ్మ సలహాలను స్వీకరించాయి. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా వివిధ దేశాల్లో తోళ్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విషయాల శాఖ కార్యదదర్శిగా, భారత విజ్ఞానశాస్త్ర పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా ఏకకాలంలో ఆరుసార్లు పనిచేశారు. సీఎస్ఐఆర్ డీజీ ఇరత దేశాల్లో ఉన్నతోద్యోగాల్లో ఉన్న భారతీయ శాస్త్ర సాంకేతిక నిపుణులను స్వదేశానికి రప్పించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శాస్త్ర సాంకేతిక కమిటీకి రథసారథి 1980లో అభివృద్ధి చెందిన దేశాల్లోని శాస్త్ర సాంకేతిక కమిటీకి అధ్యక్షులుగా నాయుడమ్మ అనేక సృజనాత్మక పథకాలను ప్రవేశపెట్టారు. ఆసియా ఖండానికి చెందిన అసోసియేషన్ ఫర్ సైన్స్ కో–ఆపరేషన్కు వ్యవస్థాపక సభ్యునిగా వ్యవహరించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్గా, ఐక్యరాజ్యసమితి సీనియర్ సలహాదారుగా, కెనడాలోని అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధన కేంద్రం గవర్నర్గా, సైన్స్ టెక్నాలజీ హైపర్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా పనిచేశారు. చర్మవిజ్ఞానంపై 200 పరిశోధన పత్రాలు, 100 వ్యాసాలను సమర్పించారు. నాయుడమ్మ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వ పద్మశ్రీ గౌరవం సహా ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డును, పలు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. 1985లో జూన్ 23న ఆయన ప్రయాణిస్తున్న ఎంపరర్ కనిష్క–బోయింగ్ 747 విమానం బాంబు పేలుడుకు గురై పేలిపోయింది. దేశం ఒక మహోన్నత శాస్త్రవేత్తను కోల్పోయింది. దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధికి కృషి నేడు 40వ వర్ధంతిని ఏఎన్యూలో నిర్వహిస్తున్న సందర్భంగా నివాళి -
జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి
కూటమి నేతలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలు చేయడం లేదు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆ విషయమే మరిచిపోయారు. ఉద్యోగ ప్రకటన వస్తుందని లక్షలాది మంది విద్యార్థులు, యువత కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. గ్రూప్–1,2,4 ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలి. అప్పటివరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి. – ఆకాష్ గుజ్జర్లపూడి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
సెంటు ప్రభుత్వ భూమి ఆక్రమించినా
వినుకొండ: వినుకొండలో తాను ప్రభుత్వ భూమి ఆక్రమించానని స్థానిక టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేయిస్తున్నారని.. ఎక్కడైనా సెంటు భూమి ఆక్రమించినట్లు తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనలేక తన పరువునకు భంగం కల్గించేలా అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. అసత్య ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి జగన్ పర్యటలనకు వేలాదిగా జనాలు రావడం చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణమన్నారు. జగన్ పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలో వేరే వాహనం తగిలి ఓ వృద్ధుడు మృతిచెందితే జగన్ కాన్వాయ్ తగిలి మృతి చెందాడని కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ జగన్ కాన్వాయ్లో వాహనం వల్ల చనిపోలేదని చెప్పినా విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సత్తెనపల్లిలో ఓ అభిమాని గుండెపోటుతో చనిపోతే ఆ మరణం కూడా జగన్ ఖాతాలో వేసి పైశాచిక అనందం పొందుతున్నారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారని, సింహాచలం అప్పన్న దేవాలయంలో గోడ కూలి 8 మంది మృతి చెందారని, కందుకూరు సభలో 8 మంది మృతిచెందారని, గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిరుద్యోభృతి ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే హామీ నెరవేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీనాయకులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా అసత్య ప్రచారాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రెంటచింతల: రెంటచింతల గ్రామ సమీపంలోని గొట్టిముక్కల మేజర్ కాలువ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆంజనేయస్వామి మాన్యం కాలనీకి చెందిన దేవరకొండ నాసరయ్య నర్సరీ పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా దుర్గి మండలం ఓబులేశునిపల్లెకు చెందిన గాజుల ఆంజనేయులు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తూ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. నాసరయ్యకు ఎడమకాలు విరిగింది. ఆంజనేయులుకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 ద్వారా గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
తెలుగు ప్రాచీనతకు దర్పణం ‘వ్యాస మంజూష’
అద్దంకి: తెలుగు సాహిత్యంలోని ప్రాచీనతను తెలియజేస్తూ దాన్ని నూతన దృక్పథంతో ఆవిష్కరించిన పుస్తకమే ‘వ్యాస మంజూష’ అని సాహితీవేత్త, శాతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. డీవీఎం సత్యనారాయణ రచించిన ‘వ్యాస మంజూష’ పుస్తక పరిచయ సభ పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈసభా కార్యక్రమానికి సాహితీవేత్త మోటుపల్లి రామదాసు అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం ‘వ్యాస మంజూష‘లోని ప్రత్యేకతలను సభకు వివరించారు. గాడేపల్లి దివాకరదత్తు, ఆర్వీ రాఘవరావు, జాగర్లమూడి ప్రతాప్ వంటి సాహితీ ప్రియులు తమ లఘు పరిచయాలతో పుస్తకంలోని విశేషాలను వివరించారు. శ్రీనాథుని కనకాభిషేక విశేషాల నుంచి ‘పాయసమెరుక’ చర్చకు అన్న పద్యం వరకు వీనుల విందుగా చదివి వివరించారు. ఈ గ్రంథంలో శ్రీనాథుని ప్రాచీన కవిత్వాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేసిన రచయిత, శ్రీనాథ–పోతనల సాహితీ బంధాన్ని విశ్లేషించారని సాహితీవేత్తలు ప్రశింసించారు. రచయిత సత్యనారాయణ కవిత్వం ఆలోచింపజేస్తుంది.. శ్రీనాథుని రచనలలో ప్రత్యక్షమైన ఆంధ్ర వంటకాల ప్రస్తావన, అల్లసాని ేపెద్దన, మొల్ల, గురజాడ, విశ్వనాథ, త్యాగయ్య, అన్నమయ్య వంటి కవుల విశేషాల గురించి రచయిత చేసిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునేలా ఉందని సాహితీవేత్తలు కొనియాడారు. డీవీఎం సత్యనారాయణ వాచో విధేయత, నిత్య పరిశీలన, వినయ శీలత, ప్రజాకర్షణ పటిమలు ఆయనను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిని సాధించే సాహితీశిఖరంగా తీర్చిదిద్దగలవని వక్తలు ప్రశంసించారు. సభ అనంతరం పుట్టంరాజు బుల్లెయ్య–రామలక్ష్మమ్మల ట్రస్టు తరఫున శ్రీరామచంద్రమూర్తి, శైలజ రచయితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహితీ కౌముది అధ్యక్షుడు వారణాసి రఘురామశర్మ, కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీసుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, పాటిబండ్ల శ్రీమన్నారాయణ, గోగులమూడి శేషగిరి, ఆర్టిస్టు బాలు, పీసీ హెచ్ కోటయ్య, కే రామమోహనరావు ఎ.యోగయ్య, మలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, మక్కెన వెంకటేశ్వర్లు, వినుకుండ సుధాకర్, అళహరి హరిప్రసాద్బాబు, కందికట్టి సత్యనారాయణ, పెండ్యాల అంకయ్య, కేఎస్ఆర్ కోటేశ్వరరావు, పుట్టంరాజు సాయికుమార్, బాచిన పూర్ణచంద్రరావు, కూరపాటి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా పుస్తకావిష్కరణ రచయిత సత్యనారాయణకు సత్కారం -
ఖతార్లో ఉద్యోగాలకు అవకాశం
క్రోసూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఖతార్ దేశంలో వెల్డర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి తమ్మాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 24 నుంచి 45 సంవత్సరాలు, పురుషులు ఐటీఐ లేదా ఐటీసీ, పూర్తి చేసి 4 సంవత్సరాలు అనుభవం ఉండాలని చెప్పారు. నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 25 వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. http// nai punyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 సంప్రదించాలని కోరారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం నూజెండ్ల: నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఐనవోలు ఎస్సై బీవీ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు అందజేస్తామన్నారు. మృతుని వయస్సు సుమారు 35 నుండి 40 సంవత్సరాలలోపు ఉండొచ్చని, నడుముకు రాయి కట్టి ఉండటాన్ని బట్టి హత్య జరిగి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గీత కార్మికుల సమస్యలపై దృష్టి సారిస్తాం ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి నిజాంపట్నం: గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. మండలంలోని కళ్లిఫలం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుందన్నారు. గీత కార్మికుల ఉత్పత్తులను గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్నారు. తాటి కల్లు నుంచి తాటి బెల్లం తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది సుభాషిణి పాల్గొన్నారు. -
సైక్లింగ్ చాంపియన్ షిప్ నిర్వహణ అభినందనీయం
చీరాల: నియోజకవర్గంలో మొదటిసారిగా చీరాల సైక్లింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఆదివారం ప్రారంభించారు. వాడరేవు నుంచి ప్రారంభించిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను 60 కిమీ, 20 కిమీల విభాగంలో నిర్వహించారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారులు, నాయకులు పాల్గొన్నారు. 60 కిమీ విభాగంలో విజేతలు సిద్ధార్థ్ లింగ్ (కర్ణాటక) రూ.లక్ష, అర్హద్ ఫరీద్ (ఢిల్లీ) రూ.50 వేలు, నవీన్ కర్ణాటక రూ.30 వేలు, 20 కిమీల విజేతలు ఎస్.అబ్రహాం (తమిళనాడు) రూ.50 వేలు, రాజు పాండీ (తమిళనాడు) రూ.30 వేలు, సోహెల్ రియాజ్ (మహారాష్ట్ర) రూ.20 వేలు బహుమతులు గెలుచుకున్నారు. చీరాల వన్టౌన్, రూరల్ సీఐలు ఎస్.సుబ్బారావు, పి. శేషగిరిరావు, ఎస్సైలు ఎ.చంద్రశేఖర్, పి. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి క్రీడాకారుల రాక -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వంగూరు మరియదాసు కుమారుడు యశ్వంత్(18) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంత్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష రాసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను ఇద్దరు స్నేహితులతో కలిసి వాహనంపై దాచేపల్లి వచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో దాచేపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ముందుగా కట్టెల లోడుతో వస్తున్న ఎద్దుల బండిని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో యశ్వంత్ కడుపులోకి కట్టె దిగబడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. యశ్వంత్ని వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం యశ్వంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. చదువులో చక్కగా రాణిస్తూ కుటుంబానికి అండగా ఉన్న యశ్వంత్ మృతితో తంగెడ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు వినిపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
అమరావతి: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మండలంలోని నరుకుల్లపాడులో ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. వివరాలు.. మండలంలోని నరుకుళ్లపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నల్లిబోయిన వినోద్, గుంటూరులోనూ, బోదా గోపి, సుద్దపల్లిలోనూ గత ఏడాదిగా తలదాచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, సీతరామయ్య మరి కొంతమంది నల్లిబోయిన వెంకటసుబ్బారావు, పెదవీరబాబు, చినవీరబాబు ఇంటిమీద దాడికి వెళ్లారు. మధ్యాహ్నమే వినోద్, గోపిలు వెళ్లిపోయారని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకుని పోలీసులు రావటంతో గొడవ సద్దుమణిగింది. ముందు జాగ్రత్త చర్యగా సీఐ అచ్చియ్య శనివారం రాత్రి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్సార్ సీపీకి చెందిన బొంతా శ్రీను, ఇంటి ముందు కూర్చుని పేపర్ చదువుకుంటుండగా టీడీపీ చెందిన చింకా వెంకటేశ్వర్లు కర్రతో దాడి చేయగా అతని ఎడమ చేతికి గాయమై అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇరువర్గాలను బైండోవర్ చేసినట్లు సీఐ అచ్చియ్య తెలిపారు. -
సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలతో నాయకుల్లో చలనం
పిడుగురాళ్ల: వైఎస్సార్ మెడికల కళాశాల, ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలని చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలు పడడంతో స్థానిక నాయకుల్లో చలనం వచ్చిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తాను చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలు పడటం వలనే స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో చేపట్టిన వైఎస్సార్ మెడికల్ కళాశాల, ఆస్పత్రిని పరిశీలించినట్లు చెప్పారు. అయితే మెడికల్ కాలేజీ 2019 జనవరి 20న మంజూరు అయిందని శ్రీనివాసరావు చెబుతన్నారని, కనీసం పేపర్ చూసి కూడా చదవలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు రాయపాటి శ్రీనివాస్ మంజూరు చేయించాడని చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీ మీద అవగాహన లేకపోవడం హాస్యాస్పదం అన్నారు. మూడేళ్లలో 70శాతం పనులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 మార్చి 2020లో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేసినట్లు వివరించారు. 2020 జనవరిలో కరోనా వచ్చిందని, 2021 కరోనా వలన పనులు చేపట్టలేకపోగా, మిగిలిన మూడేళ్లలోనే మెడికల్ కాలేజీ 60 నుంచి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హాస్పటల్ను 90 శాతం పూర్తి చేశామని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. యరపతినేని వంద కోట్లతో ఇల్లు యరపతినేని రూ.వంద కోట్లతో 2019లోనే గుంటూరు ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. ఏది ఏమైనా ప్రతిపక్షమా, పాలకపక్షమా కాకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని కాసు పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో కప్పం కట్టాలని 40 రోజులు మూసి వేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. చివరికి వైఎస్సార్ సీపీ తరఫున మేము ఉద్యమం చేస్తాం.. అనగానే తెల్లారే ఓపెన్ చేయించారని గుర్తు చేశారు. జానపాడు ఆర్ఓబీని రూ.52 కోట్లతో పనులు మొదలుపెడితే సంవత్సరం నుంచి ఆపివేశారని ఆరోపించారు. తిరిగి మళ్లీ మేమే ఆర్ఓబీ నిర్మించకపోతే ఉద్యమం చేస్తాం అనగానే వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ సెల్ఫీలు విడుదల ఉద్యమం చేపట్టడంతో నేడు సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలు పడటంతో యరపతినేని సందర్శించడం జరిగిందని కాసు మహేష్ రెడ్డి ఆ వీడియోలో వివరించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి -
వైఎస్సార్ మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలి
పిడుగురాళ్ల: డాక్టర్ వైఎస్సార్ వైద్యశాల, కళాశాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కోరారు. ఆదివారం పల్నాడు హాస్పిటల్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు. పల్నాడు ప్రజలకు హెల్త్ కేర్ యాక్సెస్ ప్రతి ఒక్కరికి అందుతుందని చెప్పారు. వైద్య విద్య, ఉపాధి, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రమాదాలు చోటుచేసుకున్నా గుంటూరు వరకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించి గతప్రభుత్వంలో 30 శాతం మాత్రమే పూర్తిందనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకురాకపోతే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలసి ప్రత్యక్ష పోరాటానికి దిగితామని ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ -
కూటమి సవతి తల్లి ప్రేమ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిపై పని చేస్తున్న ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. బదిలీల్లో అన్యాయాన్ని నిలదీస్తూ ఆదివారం గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో 339 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిమిత్తం వీరిని ఆదివారం గుంటూరులోని డీఈవో కార్యాలయానికి రావాల్సిందిగా విద్యాశాఖాధికారులు సమాచారం పంపారు. అయితే, ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల కారణంగా పల్నాడు జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఆయా మండలాలకు పంపేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గుంటూరులోని డీఈవో కార్యాలయంలో డీఈవో సీవీ రేణుక అధ్యక్షతన కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో పని చేస్తున్న 1998, 2008 డీఎస్సీల క్వాలిఫైడ్స్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారుల అన్యాయాన్ని ఎండగడుతూ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, ఆందోళనకు దిగారు. మానవత్వంతో ఉద్యోగాలు ఇచ్చిన జగన్ 1998, 2008 డీఎస్సీల ద్వారా ఎంపికై న క్వాలిఫైడ్స్ అభ్యర్థులకు అప్పటి ప్రభుత్వాలు ఉపాధ్యాయులుగా నియామకాలు కల్పించలేదు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశారు. రాష్టవ్యాప్తంగా ఆందోళనలు సైతం నిర్వహించారు. ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో నెలకు రూ.30వేల వేతనంతో ఎంటీఎస్ పద్ధతిపై ఉపాధ్యాయులుగా పోస్టింగ్స్ ఇచ్చారు. అధికారుల వైఖరికిపై తీవ్ర నిరసన తాజాగా ఉపాధ్యాయ బదిలీలతో పల్నాడు జిల్లాలోని మారుమూల మండలాల్లో పాఠశాలలు ఖాళీ అయ్యాయి. అక్కడకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో పని చేస్తున్న ఎంటీ ఎస్లను పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియామక సమయంలో వారికి సొంత మండలంలోనే పని చేసేందుకు వెసులుబాటు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి విరుద్ధంగా ఒక్కో ఉపాధ్యాయుడిని 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు బదిలీపై పంపాలనే అధికారుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికీ 50 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చిందని, కేవలం రూ.30వేల వేతనంతో ఇళ్లు, పిల్లలను వదిలి దూర ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లి, ఏ విధంగా పని చేయాలనే ఆవేదనతో కౌన్సెలింగ్ను బహిష్కరించారు. ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు ఎంటీఎస్ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన విద్యాశాఖాధికారులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బ్లాక్ చేసిన ఖాళీలను ఓపెన్ చేశారు. 339 మంది ఉపాధ్యాయులకు 620 ఖాళీలను ప్రదర్శించి, కౌన్సెలింగ్ ప్రారంభించారు. పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న పాఠశాలలకు పంపేందుకు విద్యాశాఖ ప్రయత్నం డీఈవో కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ బాయ్కాట్ సొంత మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ 1998, 2008 డీఎస్సీ క్వాలిఫైడ్స్కు ఎంటీఎస్ ప్రాతిపదికన నియామకాలు కల్పించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 339 మంది టీచర్లు -
మోసాలను ఎండగడతాం
కూటమి నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నెల నెలా ఇస్తామన్న రూ.3 వేల భృతిని వెంటనే అందరికీ మంజూరు చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బకాయి పడ్డ డబ్బులను కూడా వారి ఖాతాలలో జమ చేయాలి. కూటమి సర్కార్ యువతను మోసగిస్తున్న తీరును ఎండగట్టి వారి తరఫున పోరాడేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నేడు యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. – కందుల శ్రీకాంత్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
ఆడబిడ్డని చెప్పి.. పిండాన్నిచిదిమేసి..
తల్లి పొత్తిళ్లలో వెచ్చని ఆత్మీయ స్పర్శకు చిరునవ్వులొలకాల్సిన ఆ శరీరం.. చెత్తకుప్పల్లో మాంసపు ముద్దగా మారింది. పిండమై ఎదుగుతున్నప్పుడు భువిపైకి తీసుకొచ్చి ఊపిరి పోయాల్సిన డాక్టరే.. నిబంధనలను పక్కన పెట్టిన దుస్థితి. ఆడబిడ్డ వద్దని తల్లే నిర్దయగా నిర్ణయం తీసుకుంది. కానీ ఆ డాక్టర్ కాసుల కక్కుర్తితో ఒప్పుకోవడంతో అమ్మతనం ఓడిపోయింది. దీంతో ఆరు నెలల పిండాన్ని కర్కశంగా చిదిమేశారు. తీరా అబార్షన్ అయ్యాక మగబిడ్డ అని తెలిసి తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. ఇలాంటి అమానవీయ అబార్షన్లు తరచూ జరుగుతున్నా వైద్యాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. నరసరావుపేట టౌన్: సమాజంలో ఆడపిల్ల అనే వివక్ష నేటికీ చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉంది. భ్రూణహత్యల నిరోధక చట్టం వచ్చినా, కేసుల ఉచ్చులతో భయపెట్టినా ఆడబిడ్డపై కాసుల కత్తి ఘాట్లు పెడుతూనే ఉంది. లింగ నిర్ధారణ చేయొద్దంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ఆస్పత్రుల వద్ద దిష్టిబొమ్మల్లా వేలాడుతున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ప్రాంతంలో కొందరు వైద్యుల కాసుల కక్కుర్తి ఆడబిడ్డలను భూమిపైకి రాకుండానే చిదిమేస్తోంది. తాజాగా పట్టణంలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శంగా నిలుస్తోంది. వివరాలు... చిలకలూరిపేట పట్టణానికి చెందిన గర్భిణి కొన్ని నెలలుగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో సేవల కోసం వచ్చింది. ప్రస్తుతం 6వ నెల గర్భంతో ఉంది. కడుపులో నొప్పిగా ఉండటంతో శనివారం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు వచ్చింది. డాక్టర్ లింగ నిర్ధారణ చేసి పుట్టబోయేది ఆడ శిశువు అని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు ఆడ సంతానం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పవని లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఇదంతా చేయకూడదని తెలిసీ డాక్టర్ కూడా పట్టించుకోలేదు. పైగా ఆడబిడ్డ అని గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేశారు. తర్వాత పిండాన్ని పరిశీలిస్తే పుట్టబోయేది మగ బిడ్డని తేలింది. ఎన్నో ఆశలతో మగ సంతానం కోసం ఎదురుచూస్తుంటే ఇలా చేశారంటూ దంపతులు బోరున విలపించారు. ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. యాజమాన్యం సెటిల్మెంట్ చేసుకుంది. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పట్టణంలోని కొన్ని స్కానింగ్ సెంటర్లతోపాటు వైద్యశాలకు అనుబంధంగా ఉన్న స్కానింగ్లలో లింగ నిర్ధారణ యథేచ్ఛగా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కొందరు స్కానింగ్ నిర్వాహకులు ఇచ్చే సమాచారంతోనే భ్రూణహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. చర్యలు తీసుకుంటాం లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం చట్టరీత్యా నేరం. అబార్షన్ చేసి గర్భంలో పిండాన్ని తొలగించిన వ్యవహారంపై విచారణ జరుపుతాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రవి డీఎంహెచ్ఓ నరసరావుపేటలో అడ్డగోలుగా లింగ నిర్ధారణ పరీక్షలు ఆడ బిడ్డ అని చెప్పి అబార్షన్కు ఒప్పించిన వైనం ఆరు నెలల పిండాన్ని చిదిమేసిన డాక్టర్ అబార్షన్ చేశాక మగ బిడ్డ అని తేలడంతో బోరుమన్న తల్లిదండ్రులు సెటిల్మెంట్ చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం లింగ నిర్ధారణ పరీక్షలపై చోద్యం చూస్తున్న వైద్యాధికారులు -
బాబు మోసాలపై యువత పోరు
పల్నాడుసోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 20257ఆషాడ ఉత్సవాలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళి ఆలయంలో ఆషాడం సందర్భంగా జూన్ 29న నిమ్మకాయల దండలతో, జూలై 6న గాజులతో అలంకారం చేయనున్నారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం ఆదివారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. వాహన తనిఖీలు నకరికల్లు: స్థానిక వై జంక్షన్ వద్ద కారంపూడి రోడ్డులో ఎస్ఐ చల్లా సురేష్ ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. పత్రాలు లేని 12 మందిపై కేసులు నమోదు చేశారు. సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగం ఇస్తారని పల్నాడు జిల్లాలోని 527 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల పరిధిలోని సుమారు 6.51 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ పిల్లలు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలను మాన్పించి తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లకు పంపారు. ఉద్యోగ నియామకాల పరీక్షలకు దాదాపు ఇంటికి ఒకరు చొప్పున సిద్ధమవుతున్నారు. నరసరావుపేటతోపాటు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లకు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. చేస్తున్న ఉద్యోగాలు మానేయడంతో ఇంటి నుంచి డబ్బులు అడగాల్సి వస్తోందని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్లో మొదటి హామీ అయిన 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే నెల నెలా రూ.3 వేలు భృతి ఏడాదిగా అమలుకు నోచుకోలేదు. దాని ప్రకారం వెంటనే ఎటువంటి షరతులు లేకుండా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం ప్రకారం సగటున ఇంటికో నిరుద్యోగి అనుకున్నా జిల్లాలో 6.51 లక్షల మందికి నెలకు రూ.195.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపఽథ్యంలో సుమారు రూ.2,345.76 కోట్లు వారికి ఇప్పటికే బకాయిపడింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఏదీ? ‘జాబ్ రావాలంటే బాబు రావాలి.. జాబ్ వచ్చే వరకు నిరుద్యోగ భృతి’ అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ ఐదేళ్లు ఏం చేశారన్నది అందరికీ తెలిసిందే. 2014–19 మధ్య యువతను మోసం చేసిన చంద్రబాబును నమ్మి మరోసారి మోసం పోయామని యువత ఆందోళన చెందుతోంది. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం తెలుగు తమ్ముళ్లకు మాత్రమే మద్యం, ఇసుక, మైనింగ్ వంటి వాటిలో అక్రమ సంపాదనకు అవకాశం లభిస్తోందని యువత వాపోతున్నారు. మరోవైపు విద్యార్థులకు మంజూరు చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులపై విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్రంలో విద్యా, వసతి దీవెనల రూపంలో సుమారు రూ.6 వేల కోట్ల బకాయిలు పడ్డట్టు సమాచారం. ఈ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు. న్యూస్రీల్జిల్లాలో నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య శాశ్వత ఉద్యోగాలు కల్పించిన వైఎస్ జగన్ 2019లో అఽధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల పేరిట శాశ్వత ఉద్యోగాలను కల్పించి పల్నాడు జిల్లాలో 4,703 మంది యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. అలాగే 10,276 మందికి గ్రామ, వార్డు వలంటీర్ పేరిట ఉపాధి కల్పించి వారితో ప్రజలకు సేవ చేయించారు. మెడికల్ డిపార్ట్మెంట్లో మరో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్ పేరిట వేలాది మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించారు. యువత ఉద్యోగాలు పొందేందుకు ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందజేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరి కూటమి సర్కారు కూడా శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాలను కల్పించాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఏడాదిగా ఆశగా ఎదురుచూస్తున్న జిల్లా యువత చేస్తున్న పనులు మానేసి కోచింగ్ సెంటర్లలో చేరిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో ఆందోళన ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల భృతి పేరిట మోసం సుమారు 6.51 లక్షల మందికి అందని సాయం మరోసారి నిరుద్యోగులను నిండా ముంచిన చంద్రబాబు వైఎస్ జగన్ హయాంలో భారీగా శాశ్వత ఉద్యోగాల కల్పన ప్రభుత్వం తీరుపై నేడు వైఎస్సార్సీపీ యువజన విభాగం నిరసన యువతకు కచ్చితంగా ఉద్యోగం ఇస్తాం.. లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇవేమీ అమలు కాలేదు. మళ్లీ యువతను చంద్రబాబు నిండా ముంచేశారు. తొలి సంతకం చేసిన మెగా డీఎీస్సీలో మెగా లేకుండాపోయింది. అరకొర పోస్టులతో ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిపైనా తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు గ్రూప్–1, 2, 4 తదితర ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. అన్యాయానికి గురైన యువతకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాటు పట్టింది. అందులో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘యువత పోరు’కు పిలుపునిచ్చింది. నరసరావుపేట లింగంగుంట్లలోని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేయనున్నారు. -
సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్’ కుట్ర రాజకీయం
సాక్షి, గుంటూరు: సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసింది. వైఎస్ జగన్పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. సింగయ్య మరణాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. 18వ తేదీన 1:20 గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతిపై మీడియా సమావేశం నిర్వహించారు.ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత కుట్రకు తెరలేపిన టీడీపీ, ఎల్లో మీడియా.. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. సింగయ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ఎస్పీ సతీష్ అధికారికంగా ప్రకటించారు. అయినా వైఎస్ జగన్పై టీడీపీ, ఎల్లో మీడియా బురదచల్లుతోంది. -
ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు
నిజాంపట్నం: మండల కేంద్రమైన నిజాం పట్నంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్కు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 64 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్మెంట్ మేళాలో ఎంఎస్ మహేంద్ర ఆటో పయనీర్ వరల్డ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్, నిర్మల ఇండస్ట్రీస్, పవర్ సర్వీసెస్, బెంగళూరు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్లతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేశారన్నారు. ఎంపికై న వారికి అప్రంటీస్ శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో భృతి అందించనున్నట్లు వివరించారు.మార్టూరులో గడ్డివామి దగ్ధంమార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. స్థానిక తూర్పు బజారుకు చెందిన పుట్టా విలాస్ బాబు గొడ్ల చావిడిలో ఉన్న వరి గడ్డి వామిపై బాణసంచా పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 వేల ఆస్తినష్టం జరిగినట్లు రైతు వాపోయారు.మోసానికి ప్రతిరూపం చంద్రబాబుఅద్దంకి: ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకొచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరవాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు అంటే మోసం అనేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తన తండ్రి తరువాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం అని ప్రజలు అనుకునేలా చేశారని తెలిపారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవి వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
పట్నంబజారు: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరగుంట సమీపంలోని స్కైలోన్ అపార్ట్మెంట్లో నివసించే నరహరి శైలజ (54) భర్త శ్రీనివాసరావుకు మార్కెట్లో కిరాణా దుకాణం ఉంది. ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం జిన్నాటవర్ సెంటర్లోని ఒక దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసేందుకు శైలజ వచ్చారు. అక్కడ కొనుగోలు చేసి కిందకు దిగారు. అప్పుడే గుంటూరు– 1 డిపో నుంచి క్రోసూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆపబోయాడు. ఈ క్రమంలో శైలజ బస్సు ముందు నుంచి నడిచి వెళ్తుండగా, గమనించని డ్రైవర్ ముందుకు నడిపాడు. బస్సు టైర్ కింద పడి శైలజ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. -
భార్యను హతమార్చి, గొంతు కోసుకున్న భర్త
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : భార్యపై అనుమానంతో గొంతు కోసి హత మార్చి.. తానూ గొంతు కోసుకొని భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గుంటూరు నగరంలోని కన్నవారితోటలో శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతురాలు లక్ష్మి కుమారుడు శివ తెలిపిన వివరాల ప్రకారం...కన్నవారితోటలోని రఘురామ్నగర్ గోరీలదొడ్డి ప్రాంతానికి చెందిన దారబోయిన లక్ష్మి (40), భర్త రాజులకు ఇద్దరు సంతానం ఉన్నారు. లక్ష్మి ఇళ్లల్లో పని చేస్తుంటుంది. భర్త వంట పనులు, కూలీ పనులకు వెళుతుంటాడు. లక్ష్మికి 17 ఏళ్ల కిందట వేరే వ్యక్తితో వివాహమైంది. భర్త వేధింపులు భరించలేక అతడ్ని వదిలేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కళాశాలలో వంట పని చేసుకుంటూ బతుకుతోంది. అదే కళాశాలలో వంట పని చేసే రాజు పరిచయం కాగా, ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరు కన్నవారితోటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొద్ది కాలంగా రాజు, భార్యని అనుమానించడం ప్రారంభించాడు. నిత్యం మద్యం తాగి అసభ్యపదజాలంతో వేధించడం ప్రారంభించాడు. రెండు నెలలుగా పనికి వెళ్లకుండా భార్యని కూడా ఇంట్లోనే ఉండాలంటూ వేధిస్తున్నాడు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు సమాచారం అందించడంతో నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూసే సరికి ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. అప్పటికే లక్ష్మి మృతి చెందింది. రాజు కొనఊపిరితో ఉన్నాడు. పోలీసులు అతడ్ని జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, నగరంపాలెం ఎస్ఐ రమాదేవి సిబ్బందితో ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. లక్ష్మిని భర్త మెడ వంచి వెనుక భాగం నుంచి కత్తితో కోసి ఉన్నట్లు గుర్తించారు. అదే కత్తితో రాజు గొంతు కోసుకున్నట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. లక్ష్మి మృతదేహాన్ని జీజీహెచ్కి తరలించారు. కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రికి తరలించిన పోలీసులు గుంటూరు కన్నవారి తోటలో ఘాతుకం -
వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు తగదు
పిడుగురాళ్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అధికార పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకుని నిన్ను చంపేస్తే తప్పేముంది. అంటూ అధికారపార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ -
యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్ జీవితం
తెనాలి: సైన్యంలో దేశ రక్షణ విధుల్లో కొనసాగి, బయటకొచ్చాక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీడారంగ అభివృద్ధికి తోడ్పడుతూ సమాజసేవలో కొనసాగుతున్న చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ జీవితం నేటియువతకు స్ఫూర్తిదాయకమని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కె.రావు అన్నారు. రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న సీబీఆర్ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా తపాలా శాఖ తీసుకొచ్చిన ప్రత్యేక కవరును శనివారం సాయంత్రం తెనాలిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్రాజా అధ్యక్షత వహించారు. రాజేంద్రప్రసాద్ నినాదం ‘విన్ ఫర్ ఇండియా...డై ఫర్ కంట్రీ’ తనను ఎంతగానో ఆకర్షించిందని బీకే రావు చెప్పారు. రాజేంద్రప్రసాద్ సేవల్ని గుర్తించి తపాలశాఖ ప్రత్యేక కవరును విడుదల చేయడంఅభినందనీయమని తెలిపారు. తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు మాట్లాడుతూ దేశభక్తుడి గురించి ప్రత్యేక కవరును విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు. సైనిక్ వెల్ఫేర్ బోర్డు బ్రిగేడియర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సంపాదించిన డబ్బును సమాజసేవకు వినియోగిస్తున్న మాజీ సైనికుడు సీబీఆర్ ప్రసాద్ను భారత ప్రభుత్వం గుర్తించాలని అభిప్రాయపడ్డారు. సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు బిడ్డలకు సంపదను ఇవ్వొద్దని, కష్టపడి ఎదిగేలా వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. 18 ఏళ్ల వరకే తల్లిదండ్రుల పెంపకం ఉండాలని, ఆ తర్వాత సైన్యంలోకి పంపాలని సలహానిచ్చారు. సభలో ఆంధ్రప్రదేశ్ పూర్వ సైనిక్ సేవాపరిషత్ అధ్యక్షుడు కల్నల్ రాంబాబు, ఆచార్య డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి, మాజీ సైనికుల సంఘం రాష్ట్ర నేతలు మోటూరి శంకరరావు, అయినంపూడి రత్నప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
బస్సులు లేక ప్రయాణికులకు ఇక్కట్లు
పట్నంబజారు: అంతర్జాతీయ యోగ డే సందర్భంగా జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు వైజాగ్కు తరలి వెళ్లడంతో ప్రయాణికులు రెండు రోజులుగా ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో శనివారం నిర్వహించిన యోగాంధ్రా కార్యక్రమానికి గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బస్సులను తరలించారు. గుంటూరు డిపో –1 నుంచి 35, గుంటూరు డిపో –2 నుంచి 35, తెనాలి డిపో –25, మంగళగిరి–20, పొన్నూరు– 20, బాపట్ల– 18, రేపల్లె –22, చీరాల – 18, అద్దంకి నుంచి 22 బస్సులను యోగాంధ్రాకు తరలించారు. దీంతో పల్లె ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు బస్సులు కిక్కిరిసి కనిపించాయి. మూడు కార్గో బస్సులను మెకానిక్లతో కలిపి వైజాగ్కు పంపడంతో ఇక్కడ గ్యారేజీల్లో వారి కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. ఫిట్గా లేని బస్సులను గ్యారేజీ నుంచి బయటకు తీయకుండా అలాగే ఉంచారు. కొన్ని సర్వీసులు మాత్రమే నడిపారు. గతంలో సైతం రాజధాని ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు బస్సులను తీసుకెళ్లడంతో ఇబ్బందులు పడినట్లు ప్రయాణికులు వాపోయారు. వైజాగ్కు తరలించడంతో అవస్థలు -
జాబ్మేళాలో 60 మందికి ఉద్యోగాలు
పిడుగురాళ్ల: జాబ్ మేళాలో 60 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఇ.తమ్మాజీ రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం మెగా జాబ్మేళా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆదేశాలతో ఈ జాబ్మేళా నిర్వహించారు. తమ్మాజీ రావు మాట్లాడుతూ జాబ్మేళాకు 10 కంపెనీలు హాజరు కాగా, 214 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, అందులో 60 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బి.వి.కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్ర నాయక్, పిడుగురాళ్ళ స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ పి. శ్రీకాంత్, వీరాంజినేయులు, రమ్య, అంజిరెడ్డి, సురేష్, మస్తాన్, కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఇ.తమ్మాజీ రావు