Palnadu
-
రైతులపై రుణ భారం
చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, మధ్యతరగతి వర్గాల బతుకులు అధ్వానంగా మారాయి. పంట సాగు చేయడం మొదలు దాన్ని విక్రయించే వరకూ నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినా పరిహారం సొమ్ములు రాక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా అన్నదాతలను రెన్యూవల్ కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. పంట, బంగారం రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ కట్టాలంటూ బ్యాంకులు తేల్చి చెబుతుండడంతో వడ్డీ వ్యాపారులు కర్షకులు ఆశ్రయించి నష్టపోతున్నారు. సత్తెనపల్లి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన కొత్త బంగారు, పంట రుణాల నిబంధనలు రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి. గతంలో కేవలం వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను మరో ఏడాది పాటు రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం అసలు, వడ్డీ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తేనే పాత అప్పును క్లోజ్ చేసి... ఒక రోజు తరువాత మళ్లీ కొత్త రుణం మంజూరు చేస్తున్నారు. ఈ విధానంతో రైతులే కాకుండా చిరు వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. అన్నదాతలకు కష్టాలు జిల్లాలో వ్యవసాయ పెట్టుబడులు, వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో పంట రుణాలు, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందడం సర్వసాధారణం. బ్యాంకుల్లో పంట, బంగారు రుణాలు తీసుకున్న రైతులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సాధారణంగా మే, జూన్, జూలై మాసాల్లో వ్యవసాయం కోసం పట్టాదారు పాస్పుస్తకాలు పెట్టి రుణాలు తీసు కుంటారు. మరి కొందరు బంగారు ఆభరణాలు కుదవ పెట్టి రుణాలు తీసుకుంటారు. వాటిని ఏటా వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకుంటారు. అయితే బ్యాంకుల్లో తీసు కున్న అప్పునకు వడ్డీ కడితే చాలు రెన్యూవల్ చేస్తారు. అయితే ప్రస్తుతం బ్యాంకులు వడ్డీతో పాటు గత ఏడాది తీసుకున్న అసలుతో కలిపి చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలనే నిబంధనలు పెట్టారు. దోచుకుంటున్న వడ్డీవ్యాపారులు రెక్కాడితే కానీ డొక్కాడని రైతన్నలు రుణాలు రెన్యూవల్ చేయించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అసలుతోపాటు వడ్డీ కట్టాలని బ్యాంకర్లు చెబుతుండడంతో చేసేదిలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వడ్డీ వ్యాపారులు బ్యాంకుల ముందే తిష్ట వేసి డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న రైతులను గుర్తించి వారికి అధిక వడ్డీలకు ఇచ్చి దోచుకుంటున్నారు. వారం వ్యవధిలో చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని బ్యాంకులో ఉన్న అసలు, వడ్డీ డబ్బులు అందిస్తున్నారు. బ్యాంకులు రెన్యూవల్ చేసిన రోజే డబ్బు తిరిగి రైతుకు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకులు రుణ మొత్తాన్ని వారం రోజులకు చెల్లిస్తుండడంతో వడ్డీ వ్యాపారులకు అడిగినంత చెల్లించాల్సిన దుస్థితి. జిల్లాలో అత్యధికంగా రైతులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సహకార పరపతి సంఘాల్లో వ్యవసాయ పంట రుణాలు, బంగారు రుణాలు తీసుకుంటారు. రూ. లక్షకు వారానికి వడ్డీ రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పాత విధానాన్ని కొనసాగించాలని రైతులు, పేద, మధ్య తరగతి కుటుంబాలు మొర పెట్టుకుంటున్నాయి. కేవలం వడ్డీ మాత్రమే తీసుకొని పునరుద్ధరించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులను అప్పు కోసం ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని వారు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఏదీ కలిసి రావడం లేదు. సంక్షేమ పథకాలు అందక, గిట్టుబాటు ధరలు లేక, పంట నష్టపరిహారం అందక, ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వడ్డీ వ్యాపారులు చేతికి చిక్కి రైతులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం ఎన్ని అగచాట్లు పడాలో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేదని, ప్రభుత్వం కనీసం ఈ ఏడాదైనా అన్నదాత సుఖీభవ మొత్తాన్ని ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఈసారి వ్యవసాయం కత్తి మీద సామే అవుతుందంటున్నారు. -
పిడుగురాళ్లపై భానుడి పగ
పిడుగురాళ్ల: ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని పిడుగురాళ్ల ప్రాంతంలో ఎండ తీవ్రత భారీగా స్థాయిలో పెరిగింది. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా గత రెండు రోజుల్లో 47. 6 నుంచి 48.1 డిగ్రీల వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ ప్రాంత ప్రజలు షాక్ అయ్యేలా నమోదు అయ్యాయి. అదే క్రమంలో శుక్రవారం కూడా అత్యల్పంగా 31 డిగ్రీల నుంచి అత్యధికంగా 46.8 డిగ్రీల వరకు నమోదు అయింది. మరో వారం రోజులపాటు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎండ దెబ్బకు ప్రజల రాకపోకలకు కూడా ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్ సైతం మధ్యాహ్న సమయంలో ఖాళీగా దర్శనమిచ్చింది. నిత్యం ప్రజలతో, వ్యాపారులతో కళకళలాడే ఐలాండ్ సెంటర్, పిల్లుట్ల రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. చిరు వ్యాపారులు సైతం తోపుడు బండ్లపై దుప్పట్లు వంటివి ఏర్పాటు చేసుకొన్నారు. అత్యవసరంగా బయటకు వచ్చే మహిళలు, యువకులు టవల్, ఇతర వస్త్రాలు వంటివి ధరిస్తున్నారు. చిన్నారులు ట్యూషన్కు వెళ్లేందుకు తలకు రుమాళ్లు ధరించి, గొడుగులు వేసుకొని వెళ్తున్నారు. పరిశ్రమలు ఎక్కువ... చెట్లు తక్కువ... పిడుగురాళ్ల పట్టణంలో సున్నపు పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో లైమ్ సిటీ అనే పేరు వచ్చింది. ఈ లైమ్సిటీలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, చెట్లు లేకపోవటంతో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. దీనికి తోడుగా పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు, అద్దంకి నార్కెట్పల్లి నిర్మించే సమయంలో పెద్ద పెద్ద చెట్లను అడ్డగోలుగా తొలగించారు. తిరిగి రోడ్లను నిర్మించిన తర్వాత మొక్కలను నాటలేదు. ఇటీవలే జానపాడు రోడ్డులో కూడా రైల్వే బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు విస్తరణలో భాగంగా భారీ చెట్లను తొలగించారు. తిరిగి మొక్కలు నాటలేదు. అలాగే పట్టణంలో కూడా రోడ్డు విస్తరణ చేసినపుడు పెద్ద చెట్లను తొలగించారు. పిల్లుట్ల రోడ్డు విస్తరణ, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా మొక్కలు నాటక పోవటంతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సున్నపు పరిశ్రమలో బొగ్గురాయిని కాల్చి సున్నంలా తయారు చేసే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతలలో కాల్చటం కూడా కారణంగా చెబుతున్నారు. భూగర్భజలాలలో ఉన్న రాయిని వెలికి తీయటం వలన కూడా ప్రకృతిలో ఉష్ణోగ్రతలు మార్పులు జరగటం వలన గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలోనే పిడుగురాళ్లలో అత్యధికంగా నమోదు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఖాళీగా దర్శనమిస్తున్న ఐలాండ్ సెంటర్ కూలీలు లేక ఖాళీగా దర్శనమిస్తున్న సున్నపు పరిశ్రమ -
బంగారంలోనూ మాఫియా!
నరసరావుపేట టౌన్: నరసరావుపేట బంగారం వ్యాపారానికి ఎంత ప్రసిద్ధి చెందిందో.. అదే స్థాయిలో అక్రమ బంగారం వ్యాపారానికి కూడా కేరాఫ్ అడ్రస్గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అక్రమ మార్గంలో బంగారం రవాణాకు పాల్పడుతున్నారు. చైన్నె, కేరళం రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని బంగారం బిస్కెట్లను రహస్యంగా తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తూ కొందరు వ్యాపారులు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచటంతో అక్రమ వ్యాపారులకు కనకవర్షం కురిపిస్తోంది. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారంపై అధిక పన్నులు ఉండటంతో స్మగ్లింగ్ ద్వారా వచ్చే బంగారం మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తోంది. ఈ తేడానే అక్రమార్కులకు భారీ లాభాలను చేకూర్చుతోంది. ఫలితంగా రోజు రూ.కోట్ల ల్లో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. రూ.45 లక్షలతో పట్టుబడ్డ మధ్యవర్తి నరసరావుపేటకు చెందిన హనీఫ్ గత మంగళవారం చైన్నెలో అక్రమ బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా చిలకలూరిపేట రూరల్ పోలీసులకు చిక్కాడు. లెక్క చూపని సుమారు రూ.45 లక్షలు అతని వద్ద స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. దీంతో అక్రమ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం వెలుగు చూసింది. చైన్నెలో పన్ను చెల్లించని బంగారం బిస్కెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నరసరావుపేటలో కొంతమంది హోల్సేల్ వ్యాపారులకు కొన్నేళ్లుగా సరఫరా చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటివరకు కొంతమంది ముఠా వేల సంఖ్యలో బిస్కెట్లు రహస్యంగా తరలించి వ్యాపారులకు విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు హనీఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో నరసరావుపేట అక్రమ వ్యాపారుల్లో వణుకు పుడుతోంది. తమ పేర్లు బయట పడతాయన్న భయంతో అప్రమత్తమైన వ్యాపారులు ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి జారుకున్నారు. మరికొంత మంది వ్యాపారులు బంగారం నిల్వలను రహస్య ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ పోలీసులకు రూ.45 లక్షల నగదుతో పట్టుబడ్డ నరసరావుపేట వాసి హనీఫ్ (ఫైల్) అక్రమ బంగారం వ్యాపారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. చట్టబద్ధంగా దిగుమతి చేసుకొనే బంగారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అయితే స్మగ్లింగ్ ద్వారా వచ్చే బంగారం మార్కెట్లోకి చేరటంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల మేరకు గండి పడుతోంది. విదేశాల నుంచి అక్రమంగా వచ్చే బంగారం మార్కెట్ ధరకంటే తక్కువగా లభిస్తుండటంతో ఒక్కో బిస్కట్పై సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లాభం వస్తుందని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో బంగారంపై ఉన్న 6 శాతం ట్యాక్స్ను ఇటీవల 15 శాతానికి పెంచటంతో అక్రమ రవాణాకు మరింత ప్రోత్సాహం పెరిగింది. దిగుమతి పన్నులు చెల్లించకుండా తక్కువ ధరకు వచ్చిన బంగారాన్ని స్థానిక మార్కెట్లో జీఎస్టీ సైతం లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. బహిరంగ ధర కంటే కొంత తక్కువ ధరకు విక్రయించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో వ్యాపారుల్లో ఎక్కువ శాతం ఈ అక్రమ కార్యకలాపాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ బంగారం అక్రమ వ్యాపారం ఒకరిద్దరితో పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. చైన్నె, కేరళం రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వ్యక్తులు, రవాణా చేసే యువకులు వాటిని దాచిపెట్టి చివరకు మార్కెట్లో విక్రయించే వ్యాపారులు ఇలా ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మార్కెట్లో బిల్లులు లేని బంగారం బిస్కెట్లను కోడ్ భాషలో (ఎస్పీ) అని పిలుస్తున్నారు. సాధారణ వ్యాపార లావాదేవీల మాదిరి కాకుండా రహస్య సంకేతాలతో ఈ వ్యాపారం సాగుతొంది. స్మగ్లింగ్ ముఠా ప్రతి రోజు నలుగురు నుంచి ఐదుగురు యువకులను చైన్నెకు పంపుతున్నట్లు సమాచారం. అక్కడ బిల్లులు లేని బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసి బస్సులు, రైలు మార్గం ద్వారా నరసరావుపేటకు తీసుకొస్తున్నారు. కొంత మంది యువకులకు ఇది ఉపాధిగా మారింది. పట్టుబడితే ప్రధాన నిందితుల వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు నిర్వాహకులు తెరవెనుక మంతనాలు నడుపుతారని తెలుస్తోంది. -
ల్యాప్టాప్ లంచం డిమాండ్కు షోకాజ్ నోటీస్
తెనాలి: ‘పేరు మార్చాలంటే ల్యాప్ట్యాప్లు ఇవ్వాల్సిందే’...శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. అధికారులు క్రమశిక్షణ చర్యలకు దిగారు. పట్టణంలో కొత్తగా వివిధ అపార్టుమెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు, తమ పేరిట పన్ను విధింపునకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 మంది దరఖాస్తుదారులు, ఆ పరిధిలోని సచివాలయం బాధ్యతలు చూస్తున్న మున్సిపల్ ఉద్యోగిని కలిసి పన్ను మార్పు చేయించమని కోరారు. సదరు ఉద్యోగి రెండు ల్యాప్ట్యాప్లు కొని ఇస్తేనే పేరు మార్పు చేస్తానని షరతు విధించారు. నెలలు గడుస్తున్నా ఇంటి పన్నుకు పేరు మారకపోవటంతో ప్లాట్ల యజమానులు మున్సిపల్ అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. దీనిపై అధికారులు విచారించినపుడు ఆ ఉద్యోగి వాస్తవమేనని అంగీకరించాడు. హెచ్చరికలతో వదిలేసిన అధికారులు ఈ వ్యవహారమంతా ‘సాక్షి’లో ప్రచురితం కావటంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. గురువారం రాత్రి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంటు ఏడుకొండలుకు షోకాజ్ నోటీసు జారీచేశారు. సమాధానం ప్రకారం అనంతర చర్యలు ఉంటాయని అధికారులు తెలియజేశారు. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
పట్నంబజారు: గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపేట పోలీసు స్టేషన్ సీఐ ఎం.వీరయ్యచౌదరి వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అప్పిఆలూరు గ్రామానికి చెందిన హిరేకాంక్షి నిషార్ అహ్మద్ అలియాస్ ఆరీఫ్ అనే యువకుడు విశాఖపట్నం వెళ్లి ఆరు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. తిరిగి వస్తూ గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి కర్ణాటక రాష్ట్రం వెళ్లేందుకు వివరాలు అడుగుతున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిషార్ అహ్మద్ వద్ద ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
అమెరికాలో పల్నాడు జిల్లా ఫాదర్ వేళంగిణిరెడ్డి మృతి
అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువుకు చెందిన విచారణకర్త రెవ.ఫాదర్ తుమ్మా వేళంగిణిరెడ్డి (45) సువార్త ప్రచారం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి గుండెపోటుతో గురువారం మృతి చెందారు. వీరి స్వగ్రామం తాళ్లచెరువు కాగా ఇదే గ్రామంలోని బాలయేసు చర్చిలో విచారణకర్తగా పనిచేశారు. ప్రస్తుతం పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటవారిపాలెంలో విచారణకర్తగా పనిచేస్తున్నారు. ఆయన ప్రతి యేటా మే నెలలో సువార్త ప్రచారం కోసం అమెరికా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా వెళ్లి గుండెపోటుతో మృతి చెందినట్లు బంధవులు తెలిపారు. వీరు దివ్యవాణి టీవీ ఛానల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేశారు. ఆయన సోదరుడు సాగర్థామస్రెడ్డి సినిమా డైరెక్టర్కా గా, తల్లి నిర్మలామేరి విశ్వాసురాలు. తండ్రి పీటర్రెడ్డి దైవసేవకులుగా పనిచేస్తూ క్యాన్సర్ వ్యాధితో మృతిచెందారు. ఆయన విచారణ గురువులుగా ఫిరంగిపురం, రెంటచింతల, పాటిబండ్ల, యనమదల, పెద్దపలకలూరు తదితర ప్రాంతాలలో పనిచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాళ్లచెరువు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పాలువాయిలో విషాదం రెంటచింతల: మా ఇంటి దీపాలు ఆరిపోయాయి...మేం ఎవరి కోసం బతకాలి అంటూ ఆ కన్నతల్లులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోధిస్తున్న తీరు అక్కడినున్న వారిని కంటితడి పెట్టించింది. మృతి చెందిన బంగారి, భాస్కర్లు వరుసకు అన్నదమ్ములు. వెంకయ్య వారికి వరసకు బావమరిది. ముగ్గురూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారని వారి బంధువులు తెలిపారు. కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలకు ఒక్కొక్కరే కుమారులు. వీరు ఈ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ‘మేం ఏ పాపం చేశామయ్యా... 20 సంవత్సరాలుగా మా కంటి పాపలా చూసుకుంటే ఎదిగిన కుమారులు మా కళ్లముందు రక్తపు మడుగులో పడిపోయారు... దేవుడు మాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు...’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చలించిపోయారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతోపాటు మరో యువకుడు మృత్యువుతో పోరాడుతుండటంతో పాలువాయి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. చూపరులు సైతం కంటతడి పెట్టుకున్నారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
నరసరావుపేట టౌన్: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. విజేత థియేటర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెంది ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు టూటౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు. యడ్లపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రమైన యడ్లపాడు 16వ జాతీయరహదారిపై రామాలయం సమీపాన ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది. రోడ్డు మధ్యలోని డివైడర్ను దాటుతుండగా అదే సమయంలో వేగంగా వస్తున్న వాహనం అతన్ని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నిలుపుదల చేయకుండా వెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, అతని వయస్సు సుమారు 35 నుండి 45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతను భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా భావిస్తున్నామని తమ ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. వినుకొండ: పట్టణంలోని పాత ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రాన్స్ఫార్మర్ పేలిన వెంటనే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు అప్రమత్తమై, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. -
పల్నాడు
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2126 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం 523.90 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,000, గరిష్ఠ ధర రూ.6,200, మోడల్ ధర రూ.4,300 వరకు పలికింది. 7 -
పలు రైళ్లు తాత్కాలిక రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉన్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ – గుంటూరు(రైలు నంబర్ 57201), గుంటూరు – మాచర్ల (57203), మాచర్ల – నడికుడి (57206), నడికుడి–మాచర్ల (57205), మాచర్ల –గుంటూరు (57204), గుంటూరు – విజయవాడ (57202), విజయవాడ – గుంటూరు (67229), గుంటూరు–రేపల్లె (67223), రేపల్లె–తెనాలి (67224), తెనాలి– విజయవాడ (67222), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె– తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233), రేపల్లె–గుంటూరు (67234), గుంటూరు– రేపల్లె (67235), మార్కాపురం రోడ్ – తెనాలి (67239), తెనాలి – గుంటూరు (67236), గుంతకల్లు–మార్కాపురం రోడ్ (57407) రైళ్లు ఈనెల 23, 24, 30, 31 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు. మార్కాపురం రోడ్డు– గుంతకల్లు (నంబర్ 57408) రైలు ఈ నెల 24, 25, 30, జూన్ 01వ తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రేపల్లె –మార్కాపురం రోడ్డు (67238) రైలు గుంటూరు, మార్కాపురం రోడ్డు మీదుగా ఈనెల 23, 24, 30, 31 తేదీల్లో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు. వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వేక్షిత్ జ్యూయలర్స్లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను, నగదును అపహరించారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. షాపు లోపల డిజిటల్ వీడియో రికార్డు బాక్స్ని, సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. షాపులో పోలీస్ కుక్కలు పసికట్టకుండా కారం చల్లినట్లు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన గోల్డ్ షాపులో ఇలాంటి భారీ చోరీ జరగడంతో స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గుంటూరు రూరల్: మండలంలోని చిన్నపలకలూరు రైల్వే గేట్ వద్ద నల్లపాడు–బండారుపల్లి స్టేషన్ల మధ్య రైల్వే గేట్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణానికి శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టీనా పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, మెరుగైన కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా భద్రతను పెంపొందించడం అవసరమన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి.శోభారాణికి అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. గతేడాది ఆగస్టు నుంచి ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు, పల్నాడుజిల్లా డీఎంహెచ్ఓగా గతంలో విధులు నిర్వహించారు. రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్టుగా పనిచేస్తూ ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. జి.శోభరాణిని ఆర్టీ కార్యాలయం డీడీ పాల్ సుధాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, విజయకుమార్, సీనియర్ అసిస్టెంట్లు శ్రీక్రాంత్, బి.శ్యామ్అనిల్ అభినందించారు. -
కారు, ద్విచక్రవాహనం ఢీ
నలుగురికి గాయాలు మాచర్ల రూరల్: కారు, ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ పరిధిలోని శ్రీశైలం రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి వెల్దుర్తి వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయటానికి ప్రయత్నించే సమయంలో గొట్టిపాళ్ల నుంచి మాచర్ల వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు పులిమెల కోటయ్య తలకు తీవ్ర గాయాలై, ఎడమ కాలు విరిగింది. మరొక వ్యక్తి పులిమెల అశోక్కు కారు గ్లాసు ముఖం పై గుచ్చుకుంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ మేరకు పట్టణ ఎస్ఐ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. -
వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులకు రాష్ట్ర పదవులు
ఆందోళనలో బాఽధితులు మాదల(ముప్పాళ్ల): మండలంలోని మాదల గ్రామానికి చెందిన మందుల దుకాణం వ్యాపారి సుమారు రూ.20లక్షల వరకు అప్పులు తీసుకొని అదృశ్యమవటంతో అప్పులిచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. సదరు వ్యాపారి మాదల గ్రామంలోని ప్రదాన కూడలిలో అద్దె ఇంట్లో ఉంటూ మందుల దుకాణం నిర్వహిస్తూ గ్రామంలోను, సత్తెనపల్లిలోను పలువురి వద్ద వడ్డీకి నగదు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారంతా ఒత్తిడి చేస్తుండటంతో కాలయాపన చేస్తూ మాదల గ్రామంలో తనకున్న 147 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ఈ ఏడాది మార్చి 23, 2026న విజయవాడకు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే గ్రామం విడిచివెళ్లిపోయాడు. వ్యాపారి నుంచి అప్పలు ఇచ్చిన వారందరికీ ఈ నెల 18 వ తేదీన ఐ.పీ నోటీసులు అందటంతో ఖంగుతిన్నారు. వడ్డీకి ఆశపడి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇచ్చింది కాక నోటీసులు రావటంతో గ్రామంలో కలకలం నెలకొంది. కోర్టు నుంచి నోటీసులు అందుకోవటంతో బాఽధితులు లబోదిబో మంటున్నారు. బాఽధితుల్లో ఒకరైన యర్రంశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి సదరు వ్యాపారి 2024 ఏప్రిల్ 4వ తేదీన రూ.రెండు లక్షలు మద్యవర్తి ద్వారా తీసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లోను ఫిర్యాదు చేశారు. -
సముద్రతీరంలో మృతదేహం లభ్యం
చీరాల: మండలం వాడరేవులోని సముద్రతీరానికి శుక్రవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహం కొట్టుకువచ్చిందని రూరల్ ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎడమచేతి ఉంగరం వేలుకు ఎరుపు రాయి కలిగిన బంగారపు ఉంగరం ఉందన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చీరాల రూరల్ ఎస్ఐ 9121102144, చీరాల రూరల్ సర్కిల్ సీఐ 9121102143 నంబర్లుకు సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ కూర్మనాథ్
రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇంకొల్లు(చినగంజాం): రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కారంచేడు, ఇంకొల్లు మండలాల్లోని గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్, క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన అక్కడ ఉన్న రైతులు, రెవెన్యూ సర్వే సిబ్బందితో మాట్లాడారు. డైరెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని.. భూ రికార్డులు ప్రక్షాళన రైతులకు కచ్చితమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవెన్యూ సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక భూ సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని కారంచేడు, ఇంకొల్లు, చెరువు గ్రామాల్లో డైరెక్టర్ సమక్షంలో సిబ్బంది, రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో ఎస్ లవన్న, మల్టీ జోన్ 2 ఆర్జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే సహాయ సంచాలకులు శేషగిరిరావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ అల్తాఫ్, కారంచేడు, ఇంకొల్లు తహసీల్దార్ నాగరాజు, శ్రీనివాస్లతో స్థానిక మండల రెవెన్యూ సర్వే సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట టౌన్: ముస్లిం మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకులు శుక్రవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్ని నెలలుగా వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటంతో రోజురోజుకు అతని ఆగడాలు పెరిగిపోయాయన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ముస్లిం మహిళ పట్ల దారుణంగా వ్యాఖ్యలు చేశాడన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వన్టౌన్ సీఐ ఫిరోజ్ ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు మస్తాన్వలి, మౌలాలి, లియాజ్ బాషా తదితరులు ఉన్నారు. గుంటూరు మెడికల్: పిడుగురాళ్ల ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.వి.సుందరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశం శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని డీసీఆర్ సమావేశ మందిరంలో నిర్వహించబడనని వెల్లడించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులు, ఇతర అంశాలు ఉన్న అభ్యర్థులు అవసరమైన ఆధారాలతో హాజరై తమ అభ్యంతరాలను డీపీసీ సభ్యుల ముందు వినిపించవచ్చని తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పారదర్శకంగా పరిశీలించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి పేర్కొన్నారు. భువనగిరి(బీబీనగర్): ఏపీని నుంచి వలస వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురగోముల గ్రామంలో డెయిరీ ఫాంలో పనిచేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల శౌరిబాబు తన భార్య మౌనికతో కలిసి నెమురగోముల గ్రామంలోని ఓ డెయిరీ ఫామ్లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా శౌరిబాబు పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వెళ్తుంటాడు. గత రెండు నెలలుగా పింఛన్ కోసం స్వగ్రామానికి వెళ్లకపోవడంతో అతడి సోదరుడు మల్లేశ్వర్రావు శుక్రవారం నెమురగోముల గ్రామానికి వచ్చాడు. ఇక్కడ శౌరిబాబు లేకపోవడం, అతడి భార్య పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
ఖాతార్నాక్ సమస్యలు
నరసరావుపేటలోని ఓ బిర్యానీ సెంటర్కు పది రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి బిర్యానీ తిన్నాడు. రూ.220 బిల్లు చెల్లించాడు. నాలుగు రోజుల తరువాత ఆ హోటల్ నిర్వాహకుడి బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. స్థానిక అరండల్పేటలోని బ్యాంక్కు వెళ్లి దీనిపై ఆరా తీయగా ఆన్లైన్ క్రికెట్ యాప్ వినియోగించే బుకీ ఖాతా నుంచి ఈ లావాదేవీ జరిగిందని అధికారులు తెలిపారు. నిత్యం వందల మంది హోటల్కు వచ్చి తిని ఫోన్ పే చేస్తుంటారని, వారేం చేస్తారో ఎలా తెలుస్తుందని యజమాని వాపోయారు. తనకు రూ.220 బిర్యానీ నిమిత్తం జమ అయ్యిందని, బుకీతో సంబంధలేదంటూ లెటర్లు మీద లెటర్లు ఇస్తే రెండు నెలల తరువాత ఖాతా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎందరో అమాయకులకు సైబర్ నేరాలు, క్రికెట్ బుకీలతో సంబంధం లేకపోయినా ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి.సాక్షి, నరసరావుపేట: క్రికెట్ బెట్టింగ్, సైబర్ క్రైం, మనీలాండరింగ్ వంటి వాటితో ఏమాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేకపోయినా కొందరి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నోయో తెలియక బ్యాంకులకు వెళ్లిన వారు పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది. మీ ఖాతాకు క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వినియోగించే వారి నుంచి నగదు లావాదేవీలు జరిపిన వ్యక్తి నగదు జమ చేశాడని చెబుతున్నారు. మీ ఖాతాలు తిరిగి వినియోగించాలంటే సదరు క్రికెట్ బుకీపై కేసు నమోదైన పోలీసుస్టేషన్కు వెళ్లి ఎన్ఓసీ తీసుకురావాలని పేర్కొంటున్నారు.కొన్నిసార్లు కేసులు ఉత్తర భారతదేశంలో నమోదు కావడంతో అక్కడికి వెళ్లలేక ఖాతాలను అలానే వదిలేసిన సందర్భాలు లేకపోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు బ్యాంక్ సిబ్బంది మామూళ్లు తీసుకొని ఫ్రీజ్ అయిన ఖాతాలను తెరిపించే దందాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న సమస్యలు ముఖ్యంగా వ్యాపారాలు, అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేసే వారే ఉంటున్నారు. దీంతో చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న వారి ఖాతాలు నెలల కొద్దీ ప్రీజ్ అయ్యి కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఏటీఎం కేంద్రాల వద్ద...బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వినియోగదారులలో ఆన్లైన్ లావాదేవీల తరువాత ఎక్కువ మంది ఏటీఎం కేంద్రాల వద్ద మోసపోతున్నారు. నగదు జమ కోసం వచ్చిన వారితో కొందరు క్రికెట్ బుకింగ్ ఏజెంట్లు మాట కలుపుతున్నారు. బంగారం కొంటున్నామని, దుకాణదారుడు నగదు రూపంలో అడుగుతున్నారని, క్యాష్ ఇస్తే చెప్పిన ఖాతాలో తమ మిత్రుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు జమ చేస్తారని చెబుతున్నారు. సులభంగా పని అవుతుండటంతో కొందరు సరేనని చెప్పి తమ వద్ద తెచ్చుకున్న నగదును క్రికెట్ బుకీలకు ఇస్తున్నారు.నగదు ఆన్లైన్లో జమ చేయించుకుంటున్నారు. అయితే సదరు క్రికెట్ బుకీలు ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడితే వారి ఖాతాలను పరిశీలించినప్పుడు వారితో ఏమాత్రం సంబంధం లేని నగదు అందజేసిన వ్యక్తి ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. అదే విధంగా కొందరు నగదు ఉపసంహరణ సమయంలో సైతం తాము క్యాష్ ఇస్తామని.. తమ మిత్రుడి ఖాతాకు ఫోన్ పే చేయాలని చెబుతున్నారు.వెయిటింగ్ లేకుండా వెంటనే నగదు మార్పిడి అవుతుందన్న ఉద్దేశంతో కొందరు అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేయడం ఏమాత్రం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరు నగదు ఇస్తున్నారు, ఎవరికి పంపుతున్నామో తెలియని వాటికి దూరంగా ఉండాలన్నారు. క్రికెట్ బుకీలు, సైబర్ క్రైం, ఇతర ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తుల ఖాతాలైతే సామాన్యులకు కూడా ఇబ్బందులు తప్పవు.ఎఫ్ఐఆర్ నమోదైన చోటకు వెళ్లాల్సిందే...అపరిచిత వ్యక్తులతో నగదు మార్పిడి వల్ల ఖాతాలు ఫ్రీజ్ అవ్వడంతోపాటు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయించుకోవడానికి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని ఖాతాలు ఉత్తరభారత దేశంలో ఉండటంతో అక్కడికి వెళ్లలేక కొత్త ఖాతాలు తెరిచిన సందర్భాలు లేకపోలేదు. సైబర్ మోసాల్లో నగదు కోల్పోయిన వారి కంటే ఖాతాలు స్తంభించిన వారి బాధలు వర్ణనాతీతం. ఫ్రీజ్ చేసిన ఖాతాలను తామేమీ చేయలేమని బ్యాంక్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కేసు నమోదైన చోటుకు వెళ్లి నో అబ్జక్షన్ సర్టీఫికెట్ (ఎన్ఓసీ) తెస్తేనే ఖాతాను పునరుద్ధరించగలమని చెబుతున్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి జాగ్రత్త పడటమే సులువైన మార్గమని అంటున్నారు. -
పరీక్షలు సమన్వయంతో నిర్వహించండి
నరసరావుపేట: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించే పదవ తరగతి రెగ్యులర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఎపాస్ (ఏపీఓఎస్ఎస్) ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నీ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ నారదముని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఆయా విభాగాల అధికారులతో కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ నాలుగు వరకు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని 399 పాఠశాలల నుంచి 3112 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు. నరసరావుపేట డివిజన్లో 13, సత్తెనపల్లి డివిజన్లో 11తో మొత్తం 24 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిని సమన్వయపర్చేందుకు 24 మంది చీఫ్ సూపరిండెంట్లు, 24మంది డిపార్టుమెంట్ అధికారులు, పరీక్షల పర్యవేక్షణకు మూడు ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అపాస్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహిస్తారని చెప్పారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ రెండు నుంచి ఆరు వరకు జరుగుతాయన్నారు. ఎస్ఎస్సీ పరీక్షలకు 765మంది, ఇంటర్మీడియెట్ పరీక్షలకు 1828తో కలిపి మొత్తం 2593మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ పరీక్షలు జరిగేందుకు 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలుచేయాలని, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేసి మాల్ ప్రాక్టీస్కు అవకాశంలేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాచర్ల రూరల్ : మాచర్లలోని లక్ష్మీచెన్నకేశవస్వామికి విద్యాసంస్థల అధినేత జున్నా శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు రూ.4లక్షల విలువైన సువర్ణ విష్ణు చక్రం గురువారం అందజేశారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కొమెర అనంతరాములు, ఈఓ సైదయ్యలకు అందించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాతలు సమర్పించిన సువర్ణ చక్రం లక్ష్మీచెన్నకేశవస్వామి ఎడమ చేతికి అలంకరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి భవిష్యత్తులో మరింత సహాయ సహకారమందిస్తామన్నారు. కార్యక్రమంలో జున్నా పద్మావతి, చక్రధర్రెడ్డి, వెంకట దీప్తి, అభిరామ్రెడ్డి, అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రథసారధి సుంకె వాసు పాల్గొన్నారు. మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా చెస్ అకాడమి నేతృత్వంలో గురువారం పల్నాడు జిల్లా అండర్–13 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక బీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ పోటీలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. ఎంపికై న వీరు ఈనెల 23 నుంచి మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నట్లు కోచ్ కిరణ్ తెలిపారు. మొదటి స్థానం అమర్నాఽథ్ యాదవ్, ద్వితీయ స్థానం సాత్విక్, బాలికల్లో మొదటి స్థానం మేఘశ్రీ కోమలి, ద్వితీయ స్థానం సుస్మితలు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులకు ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ షేక్ నాగూర్వలి, రంగమ్మ చిన్న పిల్లల హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దశరఽథ్లు అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆవుల వీరాంజనేయులు తదితరులున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 32 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్కు 2,156 మంది హాజరు కాగా మరో 168 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఏడు కేంద్రాల్లో నిర్వహించిన ఒకేషనల్ పరీక్షకు 211 మంది హాజరయ్యారు. కాగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 31 కేంద్రాలలో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,026 మంది హాజరు కాగా మరో 106 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విద్యార్థులు 143 మందికి గాను 125 మంది హాజరయ్యారు. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతుండడంతో తగిన చర్యలు తీసుకోవాలని ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సూచించారు. తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అన్నవరం సొసైటీలో అవకతవకలు నిజమే
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు ● రైతుల ఫిర్యాదుతో విచారణ ● అధికారుల విచారణతో వెలుగులోకి అక్రమాలు ● సొసైటీలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశం ● అదేశాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆర్థిక, పరిపాలనపరమైన అవకతవకలు జరిగినట్టు జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు స్పష్టంచేశారు. రైతుల ఫిర్యా దుతో జరిపిన విచారణలో అవకతవకలు వెలుగు చూసినట్టు తెలిపారు. సహకార చట్టం సెక్షన్ 52 కింద పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23వ తేదీన తనిఖీలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. సొసైటీలో అక్రమాలపై ‘అక్రమాలకు సహకారం’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై నాగరాజు స్పందించారు. అన్నవరం పీఏసీఎస్లో అవకతవకలు జరిగాయని, సొసైటి సీఈథో దొప్పలపూడి శ్రీనివాసరావు, అప్పటి అధికార పర్సన్ ఇన్చార్జ్ నర్రా సురేంద్రబాబు వీటికి పాల్పడినట్టు సొసైటీ పరిధిలోని 45మంది రైతులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదుపై సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ డి.రవికుమార్ను విచారణ జరిపి ఆర్ధిక, పాలనాపరమైన అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు తెలిపారు. సహకార చట్టం సెక్షన్ 52 ప్రకారం సొసైటీ తనిఖీ నిర్వహించాలని ఆయన సిఫార్స్ చేసినట్టు వివరించారు. ఈ మేరకు సొసైటీలో తనిఖీలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం తదు పరి ఉత్తర్వులు వచ్చేవరకు తనిఖీలు నిలిపివేస్తూ ఈ నెల 23వ తేదీన మెమో ద్వారా ఆదేశించినట్టు తెలిపారు. సొసైటీలో అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తనిఖీ లు నిలిపివేస్తూ ఆదేశాలు తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు కొనసాగి ఉంటే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చేవని వారు చెబుతున్నారు. -
చక్కటి ప్లాట్ పామ్
జిల్లాలో విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగు సాక్షి, నరసరావుపేట: పల్నాడు రైతులకు గత రెండేళ్లుగా వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లా రైతులు అధికంగా పండించే మిర్చి సాగు చేసినా ఒక్కోసారి కనీసం పెట్టుబడి రాకపోగా అప్పుల పాలవుతున్నారు. మరోవైపు పత్తికి పంటకు చీడపీడలు అధికంగా వస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదు. పొగాకు కొనేవారు లేక రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెట్ట రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆయిల్ పామ్ తోటలంటే పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలే గుర్తుకువస్తాయి. రెండు మూడేళ్లుగా పల్నాడులో ఆయిల్ పామ్ సాగు క్రమంగా పెరుగుతోంది. సాగుకు అనుకూల వాతావరణం, భూసారం, నీటి లభ్యత వంటి అంశాలపై ఉద్యాన శాఖ చేసిన సర్వేలో తొలి విడతలో 8 మండలాలను అనుకూలంగా గుర్తించారు. ఇందులో పిడుగురాళ్ల, అమరావతి, రాజుపాలెం, బెల్లంకొండ, నాదెండ్ల, ఈపూరు, మాచవరం, సత్తెనపల్లి మండలాలు ఉన్నాయి. సాగు చేసిన రైతుల నుంచి ఆయిల్ పామ్ గెలలను నేరుగా పొలంలోనే కొనుగోలు చేస్తారు. వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థకు ఆరు మండలాలు, గోద్రేజ్ ఆగ్రోవేట్ సంస్థకు రెండు మండలాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆయా రైతులకు ఆయిల్ పామ్ సాగులో మెలకువలు నేర్పడంతోపాటు మద్దతు ధరకే ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేస్తాయి. 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం... పల్నాడు జిల్లా వ్యాప్తంగా తొలివిడతలో 8 మండలాల పరిధిలో రెండు కంపెనీల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,236 మంది రైతులు 2,906 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ఈ ఏడాది 23 మండలాల పరిధిలో నాలుగు కంపెనీల ఆధ్వర్యంలో సుమారు 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఆయిల్ పామ్ దిగుమతిపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం రైతులకు ప్రోత్సహకాలు అందిస్తోంది. అందుకు వంట నూనెల మిషన్ ఏర్పాటు చేసి ఆయిల్ పామ్ సాగు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు మొక్కలను ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరానికి 52 మొక్కలను 9/9 మీటర్లకు ఒకటి చొప్పున నాటాల్సి ఉంది. హెక్టారుకు 130 మొక్కలను ఉచితంగా అందజేస్తారు. ఒక మొక్కకు రూ.193 చొప్పున 130 మొక్కలకు కలిపి రూ.25,090 రాయితీ లభిస్తుంది. తోట నిర్వహణకు హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగేళ్లపాటు అందిస్తారు. అంతర పంటల సాగుకు మరో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.5,250 చొప్పున అందజేయనున్నారు. మొత్తం నాలుగేళ్లలో హెక్టాకు రైతుకు రూ.67,090 వరకు అందనుంది. బిందు సేద్యం పరికరాలను సైతం రాయితీపై అందజేస్తారు. విద్యుత్ సౌకర్యం లేని రైతులకు పీఎం–కుసుమ పథకం ద్వారా సోలార్ మోటార్లు అందిస్తారు. ఆయిల్ పామ్ హెక్టారుకు సగటున 25 నుంచి 30 టన్నుల గెలలు దిగుబడి అవుతుంది. టన్ను ధర సుమారుగా రూ.18 వేల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. రెండు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశా. గతంలో పండిస్తున్న కూరగాయలను అంతరపంటగా వేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఎరువులు, మొక్కలు రాయితీ మీద వస్తున్నాయి. పండించిన పంటను స్థానికంగా బల్క్ డిపోకు తరలించి కంపెనీలకు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో పల్నాడులో ఆయిల్ పామ్ ఆధారిత కంపెనీలు ఏర్పడితే రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగి మరింత సాగుకు ఊతం లభిస్తుంది. – నారిశెట్టి చంద్రయ్య, రైతు, గణపవరం, నాదెండ్ల మండలం పల్నాడు జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ కృషి చేస్తోంది. ఎంపిక చేసిన 8 మండలాల్లో ఇప్పటికే 2,906 ఎకరాల్లో పామ్ సాగైంది. పామాయిల్ మొక్కలను రైతులకు ఉచితంగా అందజేస్తాం. సాగుకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు అంతర్ పంటల సాగుకు రాయితీ అందిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో సాగును మరింత పెంచుతాం. – ఇంటూరు వెంకట్రావు, పల్నాడు జిల్లా ఉద్యానశాఖ అధికారి తొలి దశలో 8 మండలాల్లో ప్రారంభం జిల్లా వ్యాప్తంగా 1,408 ఎకరాల్లో ఇప్పటికే తోటలు ఉచితంగా మొక్కల పంపిణీ, డ్రిప్, అంతర పంటలకు సబ్సిడీ మిర్చి, పత్తి వంటి పంటల నష్టాల నుంచి తేరుకునేందుకు మొగ్గు చూపుతున్న రైతులు -
నిప్పుల కొలిమి
రెంటచింతలలో 47.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు రెంటచింతల: రెంటచింతలలో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 47.2 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామం భగభగ మంటూ మండింది. రెంటచింతల మండలంలోని గోలి, జెట్టిపాలెం, పశర్లపాడు తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలో నల్ల నాపరాయి నిక్షేపాలు అత్యధికంగా ఉండటం కారణంగా ఈ ప్రాంతంలో వేసవిలో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కొద్ది రోజులుగా గ్రామంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతకు వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9గంటల తరువాత ఇళ్లలో నుంచి బయటకు రావడంలేదు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026@48.1 పిడుగురాళ్ల: పిడుగురాళ్లలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం ఏకంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో స్థానికంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం 47.6 డిగ్రీలు నమోదయి పెరుగుతూ పోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పిడుగురాళ్ల, చుట్టుపక్కల ప్రాంతంమంతా అగ్నిగుండంగా మారింది. అత్యవసరమైతేనే ప్రజలు తమ ఇళ్లల్లో నుంచి బయటికి వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉష్ణోగ్రత భారీస్థాయిలో నమోదవుతోంది. వడదెబ్బకు వృద్ధురాలు మృతి మాచర్ల రూరల్: తీవ్రమైన వడగాల్పులకు, ఎండ దెబ్బకు తాళలేక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మాచర్ల మండలం రాయవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని 23వ వార్డు, యాదవ బజారులో నివసిస్తున్న శాఖమూరి హేమలత (65) పూజలు చేసేందుకు తరుచూ పలు దేవాలయాలను సందర్శిస్తుంటుంది. ఈ నేపథ్యంలో గురువారం రాయవరం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి అనంతరం స్పృహ తప్పి పడిపోయింది. గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై రూరల్ పోలీసులను వివరణ అడగ్గా కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2542 టీఎంసీలు. -
ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ
రూ.1.20 లక్షల నగదు అపహరణ నరసరావుపేట టౌన్: ఎలక్ట్రికల్ దుకాణం తాళాలు పగులగొట్టి కౌంటర్లో రూ.1.20 లక్షలు నగదు అపహరించుకెళ్లిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వరవకట్ట నుంచి కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో ఆజాద్ ఎలక్ట్రికల్ షాప్ తాళాలను గుర్తుతెలియని దుండగులు పగలగొట్టి దుకాణంలోని నగదు అపహరించుకు వెళ్లారు. దుకాణ యజమాని ఆజాద్ రోజు మాదిరిగానే షాప్నకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. ఉదయం వచ్చి చూసే సరికి షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. కౌంటర్లో నగదు కనిపించక పోవటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వంశీకృష్ణా చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చిలకలూరిపేటటౌన్: ప్రమాదవశాత్తు వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సూదావారిపాలెంకు చెందిన ప్లంబ్లింగ్ వర్కర్ ఇమ్మడి శ్రీనివాసరావు(50) రోజు సాయంత్రం వేళ ఇంట్లో భోజనం చేసిన తర్వాత సమీపంలో ఉన్న బావిపై కూర్చొని కాలక్షేపం చేయడం పరిపాటి. అయితే మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంలో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అనుమానంతో బుధవారం ఉదయం బావి వద్దకు వెళ్లి చూడగా అందులో ఇరుక్కొని విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. భార్య మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పిడుగురాళ్ల: ఆర్టీసీ బస్సు డ్రైవర్కు కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు, రూ. 1100 జరిమానా విధించినట్లు పట్టణ సీఐ ఎస్.వెంకట్రావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు...2018లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాసరెడ్డి పిడుగురాళ్ల బస్టాండ్ ఎదురు నిర్లక్ష్యంగా మలుపుతిప్పుతున్న క్రమంలో యూసప్ అనే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పటి ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. దీనిపై పిడుగురాళ్ల పట్టణ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి టి.ప్రవళిక బుధవారం తీర్పు వెలువరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 1100 విధించినట్లు సీఐ తెలిపారు. వ్యవసాయ కళాశాలలో ప్రపంచ తేనెటీగల దినోత్సవంబాపట్ల: తేనెటీగలు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, పంటల పరాగసంపర్కంలో తేనెటీగల సేవలు వ్యవసాయ దిగుబడులను పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి అన్నారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తేనె ఉత్పత్తితో పాటు తేనెటీగల పెంపకం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉత్తమ వాణిజ్య రంగమని వివరించారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. తేనె ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలలో శిక్షణ పొందితే స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. రైతులు, యువత తేనెటీగల పెంపకాన్ని అనుబంధ వ్యవసాయ వృత్తిగా స్వీకరించాలని సూచించారు. తేనెటీగలపై పరిశోధన చేస్తున్న ఎం.సాయికుమార్ తన పరిశోధనలోని పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాల బాధిత పసుపు రైతుల వినతి కొరిటెపాడు(గుంటూరు): దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు రూ.7,000 చొప్పున పరిహారం చెల్లించాలని బాధిత రైతులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇన్సూరెన్న్స్ సొమ్ము కలిపి క్వింటాకు రూ.5,000 చొప్పున ఇస్తామని ఫైనల్ సెటిల్మెంట్గా భావించి తమతో సంతకాలు చేయించారని వెల్లడించారు. అయితే దానికి తాము అభ్యంతరం తెలిపామని, 2024 జూలైలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వద్ద రూ.7,000 చొప్పున ఇస్తామని కోల్డ్స్టోరేజీ యాజమాన్యం ఒప్పందానికి వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంబంధించి ఇచ్చిన మార్పు లేఖను అంగీకరించి, తాము తయారుచేసిన పత్రాన్ని యాజమాన్యం అంగీకరించే వరకు నగదు పంపిణీ నిలిపివేయాలని అధికారులను కోరడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ రూ.5,000 పరిమితం చేసి ఫైనల్ సెటిల్మెంట్గా రసీదులు ఇవ్వడం అన్యాయమని బాధిత రైతులు ఎల్.భాస్కరరెడ్డి, రాజేష్, కళ్లం సీతారామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపురం: బక్రీద్ రోజున అనధికార జంతు వధ నిషేధమని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. గోవులను వధించరాదని, అధికారికంగా ఽధ్రువీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అనధికార జంతు వధపై సమాచారం అందించాలని కోరారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్– 8688831391, పశు సంవర్ధక శాఖ– 8333086999, గుంటూరు మునిసిపాల్ కార్పొరేషన్ – 9849908363, పొన్నూరు మునిసిపాలిటీ – 9849905834, తెనాలి మునిసిపాలిటీ – 9849905830, ఎంటీఎంసీ– 7093320018, తెనాలి సబ్కలెక్టర్– 9849904008, రెవెన్యూ డివిజినల్ అధికారి, గుంటూరు – 9849904006, జిల్లా పంచాయతీ అధికారి– 9492758041. -
భానుడు భగభగ
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 524.00 అడుగు లకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం. సత్తెనపల్లి: వేసవిలో మండుతున్న ఎండలు ప్రజలను ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మునుపెన్నడు లేని విధంగా మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండలో బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాధులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తు న్నాయి. జిల్లాలోని ఏరియా వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదని అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ, టైఫాయిడ్, అతిసార, పచ్చకామెర్లు వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. వడదెబ్బకు ఆస్కారం ఎక్కువ ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతోంది. దీనివల్ల మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థాలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే హీట్స్ట్రోక్ లేదా సన్స్ట్రోక్ అంటారు. ఇది ప్రాణాంతకంగా మారుతోంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, నీటి శాతం తగ్గి సత్తువలేని స్థితికి చేరడాన్ని వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు గట్టిపడటం, చర్మం ఎర్రగా మారడం, వాంతులు కావడం, మూర్ఛ రావడం, తలనొప్పి తదితర లక్షణాలు ఉంటే వడదెబ్బగా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు.. వడదెబ్బ బారిన పడకుండా రోజుకు 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. పండ్లు, నిమ్మరసం, పలచటి మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రసం ఎక్కువగా తీసుకోవాలి. తెల్లటి దుస్తులు ధరించడం శ్రేయస్కరం. మసాలాలు, కారం, నూనె, ఫాస్ట్ ఫుడ్, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ తగిలితే ఆ వ్యక్తిని ఏదైనా చల్లని ప్రాంతం, నీడలో పడుకోబెట్టాలి. చల్లని నీటితో చర్మాన్ని తుడిచి, బట్టలను తడపాలి. ఆ వ్యక్తికి గాలి తగిలేలా చూసి, చల్లని తాగునీటి అందించాలి. ఐస్ పెట్టడం కానీ, కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలి. అతిసార బాధితులకు.. అతిసార సోకిన వారికి నీళ్ల విరోచనాలు అవుతాయి. పిల్లలు, వృద్ధులకు చాలా ఇబ్బంది. సకాలంలో స్పందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, శరీరంలో నీటి శాతాన్ని కోల్పోవడం జరుగుతుంది. నిల్వ ఉన్న ఆహారం, నీరు తీసుకోకూడదు. ఎలక్ట్రాల్ పౌడర్తో నీటి శాతం, లవణాలు పెంచుకోవచ్చు. పచ్చకామెర్లు వస్తే... తాగునీరు కలుషితమైతే పచ్చకామెర్లు వస్తాయి. దీన్ని హెపటైటిస్–ఏ అని కూడా అంటారు. చర్మం పచ్చబడటం, మూత్రం పచ్చగా రావడం, చర్మంపై దురద, ఆకలి మందగించడం, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శుభ్రమైన నీటినే తాగాలి. నూనె వినియోగం బాగా తగ్గించాలి. టైఫాయిడ్ వస్తే ఇలా.. ఇది అపరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. అతి జ్వరం, అలసట, నిస్సత్తువ, కడుపునొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటివి టైఫాయిడ్ లక్షణాలు. అలాగే చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. శుభ్రమైన తాగునీటిని, ఆహారాన్ని తీసుకోవాలి. బయట దొరికే చిరుతిళ్లు పూర్తిగా మానేయాలి. వైద్యుడిని సంప్రదించి మందులను వాడాలి. జిల్లాలో ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉపాధి హామీ కూలీలపై భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. చిరు వ్యాపారులు ఎండ తీవ్రత తట్టుకోలేక దుకాణాలను మూసి వేస్తున్నారు. 40–42 డిగ్రీల సెల్సియస్ నుంచి ఉష్ణోగ్రత ప్రతిరోజు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధిక ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలో భానుడు నిప్పుల వర్షం కురిపించాడు. ఎండల దెబ్బకు గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. బుధవారం గ్రామంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.3గా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రెంటచింతల గ్రామంలో ఈ ఏడాది నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కొన్ని రోజులుగా 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతోపాటు ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతోపాటు భూమి నుంచి సుర్రుమంటూ వచ్చే వెచ్చని సెగలతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధాన రహదారితోపాటు గ్రామంలోని అంతర్గత రహదారులు నిర్మానుష్యంగా మారాయి. భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో అత్యవసరమైతే తప్ప గ్రామస్తులు ఇట్లోంచి బయటకు రావడం లేదు. తీవ్రమైన ఉక్కపోతకు తట్టుకోలేక పలు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలకు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు, గర్భిణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
పిడుగురాళ్లలో 47.6 డి గ్రీలు
పిడుగురాళ్ల: పల్నాడు అంటేనే వేసవిలో భానుడు భగభగ అంటాడు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తాపానికి అల్లాడిపోయారు. మంగళవారం 45.6 డిగ్రీలు నమోదైంది. బుధవారం ఏకంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. చిరువ్యాపారులు సైతం గొడుగులను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎండలు మండుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సున్నపురాయి క్వారీలు, పరిశ్రమలు ఉండటంతోనే ఉష్ణోగ్రత భారీగా పెరిగిందని చెబుతున్నారు. అచ్చంపేటలో 44 డిగ్రీలు అచ్చంపేట: మండలంలో బుధవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిత్యం రద్దీగా అచ్చంపేట ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. వడగాల్పులు ఎక్కువ కావడంతో జనం బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. అచ్చంపేట – సత్తెనపల్లి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు పలుచగా కనిపించారు. -
ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
నిందితుల వద్ద నుంచి రూ.6లక్షలు నగదు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనంనరసరావుపేట రూరల్: రూ.3వేలు చెల్లిస్తే రూ.3లక్షలు, ఆతర్వాత రూ.కోటి వస్తాయంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసినట్లు రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు, ఒక ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం రూరల్పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటరావు, నాగండ్ల వంశి, అదే మండలం కావూరు గ్రామానికి చెందిన దేవళ్ల నరసింహారావు, తెలంగాణ రాష్ట్రం మంచీర్యాల జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన పెండ్యాల నీరజలను అరెస్టు చేశామన్నారు. కేశానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో ధూళిపాళ్ల సైదావలి ఇంటివద్ద నిందితులు ఓ కార్యాలయం ఏర్పాటుచేసి నరసరావుపేట మండలం చుట్టుపక్కల ప్రజలకు మాయమాటలు చెప్పి రూ.3వేలు డిపాజిట్ చేస్తే తొలుత రూ.3లక్షలు అకౌంట్లో వేస్తారని, ఆ తర్వాత రూ.కోటి, ఆ తర్వాత రూ.25కోట్లు అకౌంట్లో వేస్తారంటూ నమ్మబలుకుతూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారన్నారు. దీనిపై మండలంలోని కేసానుపల్లి గ్రామ వీఆర్ఓ పామిశెట్టి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టుచేశామన్నారు. రూరల్ ఎస్ఐ కిషోర్ పాల్గొన్నారు. -
అనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు
యడ్లపాడు: కార్మికుల సంక్షేమాన్ని, సామాజిక బాధ్యతను అత్యున్నత ప్రాధాన్యతగా భావించే బోయపాలెంలోని శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు దక్కింది. మేడే సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏటా అందించే ఈ అవార్డులు ఈ ఏడాది విజయవాడ కేంద్రంగా ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు పరిశ్రమల యాజమన్యాలు అందుకున్నాయి. కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలో విశేష కృషి చేసిన సంస్థలను ప్రభుత్వం గుర్తించి వీటిని అందించనట్లు ఆశాఖ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో పల్నాడు జిల్లా బోయపాలెంకు చెందిన శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లు సంస్థ ఎండీ సామినేని కోటేశ్వరరావు, ఈడీ ఫణికుమార్ మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. మిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ గుర్తింపు పరిశ్రమల నిబద్ధతను మరింత పెంచుతాయన్నారు. సంస్థకు దక్కిన ఈ గౌరవం కేవలం తమ ఒక్కరిది మాత్రమే కాదని, కార్మికులందరి సహకారం అన్నారు. అలాగే ఈ అవార్డు జిల్లాతో పాటు ఇది ఏపీ టెక్స్టైల్ రంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు, కార్మిక కమిషనర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ.. యువకుడు మృతి
మరొకరికి తీవ్ర గాయాలునరసరావుపేట రూరల్: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని జొన్నలగడ్డ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. నాదెండ్ల మండలం జంగాలపల్లికి చెందిన మద్ది శ్రీకాంత్(24) పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పట్టణంలో పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమై వస్తుండగా.. జొన్నలగడ్డ చప్టా వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నల్లపాడుకు చెందిన వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేష్ను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు. -
కేసీపీకి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అవార్డు
మాచర్ల రూరల్: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కలక్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అవార్డును సీనియర్ మేనేజర్ కె.వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దాలుగా కేసీపీ సిమెంట్స్ నాణ్యతలో రాజీ పడకుండా, కార్మికుల భద్రత, వారి కుటుంబ సంక్షేమలో యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ, శ్రమశక్తి అవార్డును అందించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఉత్పత్తిలో నాణ్యత, ఉద్యోగుల భద్రతలో మరింత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు పోతామన్నారు. రాష్ట్రస్థాయిలో కేసీపీ సంస్థకు బెస్ట్ అవార్డు రావడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆనంద వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. నరసరావుపేట: జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతి లాల్ దండే మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన పథకాలను గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం పథకాలతో గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి కనెక్షన్లను అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, గ్రామస్థాయి ఎఫ్టీకే పరీక్షలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్, వీఆర్ఓ వెంకయ్యలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహా బుధవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తెనాలిరూరల్: ప్రేమ పేరుతోబాలికను వేధించిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు. బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతూ ప్రతి రోజు సాయంత్రం గ్రామంలో ఇళ్లకు వెళ్లి పాలు పోస్తుండేది. బాలికను వేమూరుకు చెందిన వర్రె గోపి ప్రేమించమంటూ వేధించేవాడు. 2020 మే 24వ తేదీన పాలు పోసేందుకు వెళుతున్న బాలిక సైకిల్ను గోపి అడ్డగించి తనను ప్రేమించాలని ఇబ్బంది పెట్టాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి వేమూరు ఎస్ఐ ఎల్.లోకేశ్వరరావు కేసు నమోదు చేశారు. కేసు బుధవారం విచారణకు రావడంతో పరిశీలించిన తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి ఐ. ఇందిరాప్రియదర్శిని, నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష విధించారు. ఐపీసీ సెక్షన్ 341 కింద నెల రోజుల జైలు శిక్ష, జరిమానా చెల్లించని పక్షంలో 15 రోజుల జైలు శిక్ష విధించారు. సెక్షన్ 12 పోక్సో యాక్టు కింద ఏడాది జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్షలన్నీ ఏక కాలంలో అనుభవించాలన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు. -
మహిళలు, చిన్నారులభద్రతపై అవగాహన
వినుకొండ: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహ హింస బాధితులు 181, అత్యవసర సేవల కోసం 112, మహిళలపై వేధింపులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1091, చైల్డ్ సేఫ్టీ కోసం 1098 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ బ్రహ్మయ్య, సీఐ సుభాషిణి, పట్టణ కమిషనర్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు గుంటూరు ఎడ్యుకేషన్: ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు సొసైటీ రాష్ట్ర కన్వీనర్ డి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతిలో 540, జూనియర్ ఇంటర్లో 420, సీనియర్ ఇంటర్లో 900 మార్కులకు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. జూన్ 15వ తేదీలోగా దరఖాస్తులను ‘133–8–1878, హిమనీనగర్ 3వ లైన్, నగరాలు, అమరావతిరోడ్డు, గుంటూరు–522035’ చిరునామాకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 99594 14333, 79894 78961, 63043 57686 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సమస్యలు పరిష్కరించని చంద్రబాబు సర్కారు
నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, అందువల్ల గురువారం కలెక్టర్కు సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ పేర్కొన్నారు. బుధవారం కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల ముఖ్య మండల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా బందగీ సాహెబ్ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా వీఆర్ఏలకు జీతాలు పెరగలేదని, పక్క రాష్ట్రాలలో వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో జీతాలు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందన్నారు. అధికారులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చదువుకున్న వీఆర్ఏలు ఎప్పటికై నా ప్రమోషన్ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ప్రమోషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, ప్రభుత్వం వీఆర్ఏల రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. గురువారం జరిగే కలెక్టర్కు సామూహిక రాయబార కార్యక్రమంలో వీఆర్ఏలు అందరూ పాల్గొని, తమ గళం వినిపించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సంఘం సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి మునాఫ్, క్రోసూరు మండల అధ్యక్షుడు డేవిడ్, దుర్గి మండలం అధ్యక్షుడు వెంకటేష్, నరసరావుపేట, పెదకూరపాడు మండల అధ్యక్షుడు రోశయ్య, కొండలు, ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.2958 టీఎంసీలు.
రాబోయే నాలుగు రోజులపాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు వైద్య శాఖ అందుబాటులో ఉంచాలి. ఉపాధి హామీ కూలీలకు పని వేళల్లో మార్పులు చేయాలి. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలి. మూగ జీవాలకు ఇబ్బంది కలగకుండా, వాటికి తగిన నీటి సౌకర్యం, షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలి. వడగాల్పుల తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – సంజనా సింహ, ఇన్చార్జ్ కలెక్టర్, పల్నాడు జిల్లా -
తాగునీరు ఇవ్వరు గానీ ఊరూరా సారా ఏరులై పారిస్తారా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య వినుకొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వినుకొండలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రూ.500 కోట్లతో పూర్తయ్యే వరికపూడిశెల ప్రాజెక్టును క్యాబినెట్ పూర్తిగా విస్మరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు కేవలం అమరావతి, పోలవరం జపమే చేస్తున్నారన్నారు. ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం, ఊరూరా బెల్ట్ షాపులు పెంచి మద్యం ఏరులై పారిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాడుడే బాదుడు అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. 35 శాతం వ్యాట్ ట్యాక్స్తో ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. అసలే ద్రవ్యోల్బణం పెరిగి, నిరుద్యోగం తాండవిస్తుంటే ముగ్గురు, నలుగురు పిల్లలను కనమనడం హాస్యాస్పదమని చెప్పారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కన్నారు... మరి ప్రజలకు ఈ ఉచిత సలహాలెందుకని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దళితులు క్రైస్తవంలోకి మారింత మాత్రాన వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేయడం తగదని, వారికి సీపీఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీవరప్రసాద్, నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం నేత ఉలవలపూడి రాము పాల్గొన్నారు. -
తవ్వారు.. వదిలేశారు.. ఉసురు తీశారు
● పైపులైన్ మరమ్మతుల కోసం తీసిన గుంతతో ప్రమాదం ● చీకట్లో గుంత తాలూకా మట్టిదిబ్బను ఢీకొన్న బైక్ ● అక్కడికక్కడే వ్యక్తి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మోటార్ బైక్పై వస్తున్న ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో నివాసం ఉండే షేక్ మొహమ్మద్ (38) కార్పెంటర్గా జీవనం కొనసాగిస్తాడు. ఇతనికి భార్య షేక్ జాహెదాతో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు షేక్ మాలిక్తో పాటు ఏడో తరగతి చదువుతున్న షేక్ మొహమ్మద్ ఆలి ఉన్నారు. సోమవారం రాత్రి 11.30 సమయంలో చిలకలూరిపేట నుంచి తన మిత్రుడు షేక్ సర్ధార్తో కలసి మోటార్బైక్పై పసుమర్రుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. ● మృతుడి నివాసమైన పసుమర్రు మసీదు వీధి ప్రాంతం శోక సంద్రంలో మునిగి పోయింది. చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తీరా ప్రమాదం జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయాక ఉదయాన్నే సంబంధిత గుంతను మూసివేయడం విశేషం. ఇదే పని సకాలంలో చేసి ఉంటే ఒక ప్రాణం నిలిచి ఉండేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తవ్వాం..పనిచూసుకున్నాం.. వదిలేశాం.. మాపని మేం చేసేశాం ఎవరెటు వచ్చి పడి చస్తే మాకేం.. అనుకున్నారేమో పురపాలక సిబ్బంది పనిముగించుకుని తాపీగా ఇళ్లకెళ్లిపోయారు. గుంత లోతుగా ఉందని, గుంత చుట్టూ వేసిన మట్టికుప్ప ఎత్తుగా ఉందని, రాత్రిళ్లు ఎవరైనా కనబడక వచ్చి అందులో పడతారనే కనీస స్పృహలేకుండా.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా గత పదిరోజులుగా గాలికి వదిలేశారు. చీకట్లో పాపం ఆ గుంత, చుట్టూ ఉన్న మట్టి కనబడక ఓ అమాయకుడు మృత్యవాత పడగా.. అతనిపై ఆధారపడిన భార్య, 9,7 తరగతులు చదువుతున్న పిల్లలు రోడ్డున పడ్డారు. పురపాలక నిర్లక్ష్యం ఓ అన్నెం పున్నెం ఎరుగని వ్యక్తిని బలితీసుకుని, ఓ కుటుంబంలో పెనువిషాదం నింపగా.. ఉదయాన్నే వచ్చిన సిబ్బంది గుంతతో పాటు తమ తప్పులను కప్పేయాలని చూడడం విశేషం. సుమారు పది రోజుల కిందట చీరాల రోడ్డులో కక్కెరదాసయ్య గోడౌన్ల సమీపంలో పైపులైన్ మరమ్మతుల కోసం రోడ్డు మార్జిన్లో గుంత తీయించిన మున్సిపల్ సిబ్బంది దానిని పూడ్చి వేయించకుండా వదలివేశారు. గుంత చుట్టూ బ్యారికేడ్, లేదా రేడియం రిబ్బన్ వంటిది ఏర్పాటు చేయలేదు. ప్రమాద ప్రదేశం చీకటిగా ఉండటం, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే చీరాల రోడ్డులో ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్ కారణంగా ద్విచక్రవాహనం రోడ్డు మార్జిన్ దిగింది. ఈ క్రమంలో పైప్లైన్ మరమ్మతుల కోసం గుంత తీసి వేసిన మట్టి దిబ్బను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొహమ్మద్ తల సమీపంలో ఉన్న రాళ్లకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చొన్న సర్ధార్ తీవ్ర గాయాలపాలుకాగా సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మొహమ్మద్ మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. భర్తను కోల్పోయి భార్య, తండ్రిని కోల్పోయిన కుమారులు, కొడుకును కోల్పోయి వృద్ధులైన తల్లిదండ్రులు ఫరీసా, ఫాతిమాలు విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. -
టీడీపీ ఆఫీసుకోసం చెరువునే ఎండబెట్టారు
● పార్టీ కార్యాలయం పేరుతో యథేచ్ఛగా మట్టి తరలింపు ● చెరువులోని నీటిని బయటకు తరలించి మరీ తవ్వకాలు ● చెరువులో పెద్ద ఎత్తున గోతులు.. వందలాది ట్రిప్పులు ● పట్టించుకోని అధికారులు ముప్పాళ్ళ: మట్టి కోసం ఏకంగా నిండుకుండలా ఉండే ముప్పాళ్ళ చెరువునే ఎండబెట్టారు తెలుగుదేశం పార్టీ ముప్పాళ్ల నాయకులు. ముప్పాళ్ళలోని పెదనందిపాడు బ్రాంచి కాలువ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం పేరుతో ముప్పాళ్ళ చెరువును ఖాళీ చేశారు. ఎల్నినో ప్రభావంతో ప్రమాదం పొంచి ఉందని, వర్షాలు కురిసే అవకాశం లేదని, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని, చెరువుల్లో ఉన్న నీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటిని బయటకు వెళ్లబెట్టకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. ఇక్కడ అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకుండా పోయింది. జలధార పేరుతో చెరువులను బలోపేతం చేయాల్సింది పోయి చెరువులోని నీటిని బయటకు పంపి మట్టి అమ్ముకుంటున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు గాలికొదిలేశారు. చెరువులో పెద్ద ఎత్తున గోతులు పెట్టి వందలాది ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్స్టేషన్ ఎదురు గుండా మట్టి ట్రాక్టర్లు తరలివెళుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రైతులు పొలాల్లో మట్టిని తరలించుకోవాలంటే సవాలక్ష అనుమతులు కావాలంటూ ఇబ్బందులు పెట్టే అధికారులు ఏమీ తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చెరువులో నీటిని వెళ్లబెట్టడమే కాకుండా, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం పై ఆ పార్టీలోని వారే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్పీ స్థలంలో పార్టీ కార్యాలయమా..? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి భూమిలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణపనులు చేపట్టారు. అప్పట్లోనే సాగర్ ఆయకట్టు పరిధిలో దిగువ భూములకు నీటి తరలింపు కోసం నిర్మించిన కాలువలకు ఇరువైపులా 100 అడుగుల మేర ఖాళీ స్థలాన్ని వదిలి పెట్టి కాలువలు తవ్వారు. ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రమాదం సంభవించి కాల్వలకు గండి పడితే పక్కనే ఉన్న ఎన్ఎస్పీ స్థలంలోని మట్టిని కట్టలకు వినియోగించుకోవాల్సి ఉండేందుకు వినియోగించుకోవాల్సి ఉంది. రైల్వే, ఎన్ఎస్పీ స్థలాలు ఆక్రమించటం చట్టరీత్యా నేరం. అలాంటి స్థలాల్లో అనుమతులు లభించటం కూడా అరుదు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు చట్టాలు వర్తించకుండా పోయాయి. ఏకంగా ఎన్ఎస్పీ కాలువకు సంబంధించిన 0.20 సెంట్ల భూమినే కబ్జా చేస్తున్నారు. అందులో ఏకంగా నిర్మాణాలకు తెర లేపారు. ఎన్ఎస్పీ అధికారులు కూడా ఏమీ తెలియనట్లుగానే మౌనముద్ర వహిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాల్లోను, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాల్లోను రాజకీయ పార్టీలకు చెందిన భవనాల నిర్మాణాలు జరిగే ఆస్కారం లేక పోలేదనే అనుమనాలు పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎన్ఎస్పీ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతున్నారు. -
25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు రెగ్యులర్ పదవ తరగతి విద్యార్థులతోపాటు, ఓపెన్ స్కూలింగ్ పదవ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలలో మొత్తం కలిపి మూడు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించడం జరుగుతుందని, పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లను నియామకం పూర్తి చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీంబాషా మాట్లాడుతూ 18 పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని, సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అధికారులందరు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రేషన్ కార్డుదారులకు కష్టాలు
ఈ–కేవైసీ పూర్తి కాకుంటే సరుకులు నిలిపివేతజిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్ కార్డుదారులకు సరుకుల సరఫరా నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్ షాపుల వద్దకు వెళ్లలేక పలువురు రేషన్ తీసుకోవడం లేదు. దీంతో కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలూ ఆగిపోనున్నాయి. సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని 28 మండలాల్లో 1,289 చౌక దుకాణాలు ఉన్నాయి. 6,41,180 మంది రేషన్ కార్డులలో 18,47,940 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు 17,97,721 మంది ఈ–కేవైసీ పూర్తి చేయించుకున్నారు. 0–5 సంవత్సరాలలోపు చిన్నారులు 19,595 మంది ఉండగా వారికి ఈ–కేవైసీ అవసరం లేదు. ఇక మరో 30,624 మంది వివరాలు పెండింగ్లో ఉన్నాయి. 5 నుంచి 80 ఏళ్లలోపు వారు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. వీరంతా ఈ నెలాఖరులోపు ఈ– కేవైసీ చేయించుకోకుంటే రేషన్తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలస పోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, వేలిముద్రలు పడక పోవటం, చౌకదుకాణాల డీలర్ల నిర్లక్ష్యం, తదితర కారణాలతో ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు. ఎక్కువగా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో 2,040, పిడుగురాళ్లలో 2,014, చిలకలూరిపేటలో 1,888, మాచర్లలో 1,823, వినుకొండలో 1,798, సత్తెనపల్లిలో 1,537 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీకి దూరంగా ఉన్నారు. స్పెషల్ డ్రైవ్ చేయించకపోతే వీరందరికీ రేషన్తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. నెలాఖరు వరకు అవకాశం... ఈ–కేవైసీ నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. గత ఏడాది మార్చి నుంచి జూన్ వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివిధ కార్యక్రమాలలో భాగంగా ఈ–కేవైసీ చేయించారు. రేషన్ కార్డుదారుల్లోని కుటుంబ సభ్యులు ఎవరు వేలిముద్ర వేసినా సరుకులు ఇస్తారు. ప్రత్యేకించి మృతుల పేర్లు తొలగించే విధానం లేకపోవడంతో వారికి రేషన్ పంపిణీ జరుగుతోంది. తాజాగా ఈ–కేవైసీ తప్పనిసరి చేయడంతో వీరి వివరాలు తొలగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే వారుంటే వారిని గుర్తించనున్నారు. ప్రస్తుత ప్రక్రియతో రేషన్కార్డుల్లోని మృతులు, అనర్హుల వివరాలు తొలగి అసలైన లబ్ధిదారులకే నిత్యావసర సరకులు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మండలాలు : 28 రేషన్ కార్డులు : 6,41,180 రేషన్ కార్డుల్లోని సభ్యులు : 18,47,940 మొత్తం చౌకదుకాణాలు : 1,289 ఈ–కేవైసీ చేయించుకోనివారు : 30,624 -
నేడు జూపుడి ప్రభాకరరావు మామిళ్లపల్లి రాక
పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు చేసిన దాడిలో నష్టపోయి, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులను పరామర్శించి సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకరరావు బుధవారం మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్నారని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. మంగళగిరి టౌన్: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విశాఖపట్నం అగనంపూడికి చెందిన వరసాల ప్రవీణ్కుమార్(32) మంగళగిరి మండలంలోని నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్ సెల్లో పనిచేస్తున్నాడు. ఈనెల 15వ తేదీ కుటుంబ సభ్యులందరూ కాకినాడ వెళ్లడంతో ప్రవీణ్కుమార్ కూడా కాకినాడ వెళ్లాడు. 17వ తేదీ కాకినాడ నుంచి తిరుగు ప్రయాణంలో బస్సులో బయలుదేరి 18వ తేదీన మంగళగిరికి చేరాడు. మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద బస్సుదిగి రాజీవ్ సెంటర్కు వచ్చే క్రమంలో ప్రవీణ్కుమార్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సహ ఉద్యోగి సునీల్ మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చికిత్స పొందుతూ ప్రవీణ్కుమార్ మృతి చెందాడు. మృతుడు తండ్రి జేమ్స్రాజ్ ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 112 దొంగతనాల కేసులు నమోదు నగరంపాలెం: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడే చిల్లర సురేష్ అలియాస్ చల్లా సురేష్పై పీడీ యాక్ట్ను గుంటూరు జిల్లా పోలీసులు ప్రయోగించారు. ఈ మేరకు అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 112 దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. అతను అనేకమార్లు జైళ్లకు వెళ్లినా నేర ప్రవత్తి మారలేదన్నారు. ప్రజల్లో భయాందోళనలు స్పష్టిస్తున్న చిల్లర సురేష్పై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నల్లపాడు పీఎస్ పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు నిఘాలో వెల్లడైందని అన్నారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్వర్మకు సిఫార్సు చేశారని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిఫార్స్తో ముద్దాయిపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. 38 ఏళ్ల వయసున్న చిల్లర సురేష్ పై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 2024 –26 వరకు సుమారు 112 చోరీల కేసులు నమోదైనట్లు జిల్లా పోలీసులు తెలిపారు. -
లెక్క చూపని రూ.45.30 లక్షలు పట్టివేత
చిలకలూరిపేట టౌన్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారిపై రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును ఆపి సోదా చేశారు. ఎటువంటి పత్రాలు లేని రూ.45.30 లక్షల నగదు వెలుగుచూసింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్ను విచారించారు. చైన్నెలో బంగారం కొనుగోలుకు వెళ్తున్నట్లు అతను తెలిపాడు. ఆధారాలు చూపలేకపోవడంతో ఎస్ఐ నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు. -
తీవ్ర వడగాలులకు అవకాశం
నరసరావుపేట: రాబోయే నాలుగు రోజుల పాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ ఆదేశించారు. ఈ మేరకు ఆమె జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు పని వేళల్లో మార్పులు చేసి, నీడ, చల్లని తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించాలని అన్నారు. గ్రామ, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఎండల వల్ల మూగజీవాలకు ఇబ్బంది కలుగకుండా, వాటికి తగిన నీటి సౌకర్యం, షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): స్థానిక బగళాముఖి అమ్మవారిని ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద మాజీ న్యాయమూర్తి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం వారికి పండితులు వేదాశీర్వచనాలను అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కె.చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తిలు జడ్జికి అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందజేశారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని మాజీ జడ్జి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొల్లాపల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ట్రాన్స్కో పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ పి.విజయకుమార్ సిబ్బందికి సూచించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సెక్షన్ పరిధిలో 33/11 కేవీ, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, రావులాపురం, గండి గనుముల సబ్స్టేషన్లను ఎస్ఈ మంగళవారం తనిఖీ చేశారు. సబ్స్టేషన్ సిబ్బందికి, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు. కరెంటు కోతలు, లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు. తనిఖీల్లో వినుకొండ డీఈఈ తన్నీరు శ్రీనివాసరావు, రేమిడిచర్ల సెక్షన్ ఏఈ బాణావత్ రామాంజనేయులు నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అరుణ్ రిచర్డ్ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్కుమార్, పీఆర్ఓ ఆర్.పి.పి. కుమార్లు స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ తిక్కన కాన్ఫరెన్సు హాలులో మంగళవారం గుంటూరు రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెకానిక్ ఇన్చార్జులతో ఆర్ఎం డి.సాంబ్రాజ్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో అధికారుల పనితీరు, ఆదాయ మార్గాలు పెంపొందించేలా కేఎంపీఎల్ విధానాలపై సమీక్షించారు. బస్సులు మార్గంమధ్యలో ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీకి తగ్గట్టు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. -
స్వర్ణకారులు రోడ్డున పడకుండా ప్రత్యామ్నాయం చూపండి
సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల బంగారు నగల విక్రయాలు పూర్తిగా పడిపోతున్నాయని, కొనేవారు లేక వ్యాపారులు, ఆర్డర్లు లేక వృత్తిదారులు అల్లాడుతున్నారని ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శిరసాల వాసుబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన స్వర్ణకార సంఘం పిలుపు మేరకు నిర్వహించిన బంద్కు యూనియన్ పూర్తి మద్దతు తెలియ జేస్తుందన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో వాసుబాబు మాట్లాడుతూ.. సాక్షాత్తు ప్రధానమంత్రి సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకండి అని పిలుపు నివ్వటం వల్ల స్వర్ణకార వృత్తిపై, వారి కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి నెల కొందన్నారు. ఆర్టీజీఎస్ కాకుండా అప్రైజర్స్ కూడా ఆర్థికంగా నష్టాలు పాలవుతార న్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు వెంటనే వెనక్కి తీసుకొని స్వర్ణకారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకునే విధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. స్వర్ణకారులు రోడ్డున పడకుండా ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలన్నారు. గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ తరఫున స్వర్ణకార సంఘం చేస్తున్న ఆందోళన, బంద్లకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ నయీమ్ అహ్మద్, యూనియన్ బాధ్యులు చిన్ని, సందీప్, వెంకటా చారి, సభ్యులు తదితరులు ఉన్నారు. ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుబాబు -
ఒకే ఒక్కరు!
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఒకే ఒక్క డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం పలు జిల్లాల నుంచి గుంటూరు జీజీహెచ్కు వస్తున్న రోగులు సత్వర వైద్య సేవలు లభించక అవస్థలు పడుతున్నారు. విధులు నిర్వహిస్తున్న ఆయన ఏదైనా అవసరానికి సెలవు పెడితే ఆ రోజు పీజీ వైద్య విద్యార్థులే రోగులను చూడాల్సిన దుస్థితి పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్లో నెలకొంది. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ పోస్టు ఒకటి, అసోసియేట్ పోస్టు ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రెండు ఉన్నాయి. ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీగా పనిచేస్తున్న డాక్టర్ నాగార్జున కొండ వెంకటసుందరాచారికి రెండేళ్ల క్రితం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా, అడిషనల్ డీఎంఈగా పదోన్నతి రావడంతో ఆయన వైద్య కళాశాలకు బదిలీ అయ్యారు. దీంతో రెండేళ్లుగా ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా పనిచేస్తున్న డాక్టర్ బిందు నర్మద, డాక్టర్ భార్గవిలకు రెండు నెలల క్రితం అసోసియేట్లుగా పదోన్నతి వచ్చి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. దీంతో న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్గా విధుల్లో ఉన్న డాక్టర్ గాజుల రామకృష్ణ ఒక్కరు మాత్రమే వైద్య విభాగంలో సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టడంతో న్యూరాలజీ రోగులకు ఓపీ చూసే వారే లేకుండా పోయారు. న్యూరాలజీ ఓపీ విభాగంలో మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే సేవలు అందిస్తున్నారు. జిల్లాతోపాటు పల్నాడు, బాపట్ల, ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన రోగులు సైతం వస్తున్నారు. డాక్టర్ ఎన్.వి.సుందరాచారి విభాగాధిపతిగా పనిచేస్తున్న సమయంలో దాతల సహాయంతో స్ట్రోక్ యూనియన్ను, స్ట్రోక్ ఐసీయూ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్లీప్ ల్యాబ్, ఇతర స్పెషాలిటీ ల్యాబ్లను సైతం ఏర్పాటు చేశారు. దీంతో న్యూరాలజీ విభాగంలో ఓపీకి రోజూ 200 నుంచి 300 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు. పక్షవాతం సంబంధిత రూ. 50 వేల ఖరీదు చేసే ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తుండటంతో బాధితులు రెగ్యులర్గా వస్తున్నారు. వైద్య సిబ్బంది లేక రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ భారమంతా పీజీ వైద్యులపై పడుతోంది. న్యూరాలజీ పీజీలో చేరిన వైద్య విద్యార్థులు... సీనియర్ వైద్యుల పోస్టుల ఖాళీ వల్ల నాణ్యమైన బోధన అందుకోవడం లేదు. రోగుల వైద్యచికిత్సల పని భారంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది ఎంబీబీఎస్, పీజీ కళాశాల అడ్మిషన్ల సమయంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంపీ) నిబంధనల ప్రకారం పీజీ సీట్లు వైద్య కళాశాలలో కొనసాగాలంటే ప్రొఫెసర్, అసిస్టెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు ఉన్నాయి. డాక్టర్ సుందరాచారి చొరవతో వైద్య కళాశాల న్యూరాలజీ విభాగం ఏర్పడిన 40 ఏళ్ల తరువాత ఇవి మంజూరయ్యాయి. ప్రస్తుతం వైద్య పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. పీజీ వైద్య విద్యార్థులు సైతం చేరేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు లభించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పీజీ వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన జరిగేలా ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. -
తెనాలి జిల్లా వైద్యశాలలో విజిలెన్స్ తనిఖీలు
తెనాలిఅర్బన్: సెకండరీ హెల్త్ విభాగ విజిలెన్స్ ఉన్నతాధికారి బి.చిన్నకోటయ్య నాయక్ ఆధ్వర్యంలోని బృందం సోమవారం జిల్లా వైద్యశాలలో తనిఖీ చేసింది. పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఎంఆర్ఐ, డయాలసిస్ విభాగాలను వారు పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యశాల ఆవరణలోని అన్ని విభాగాలను, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి వివరాలు సేకరించారు. సమయానికి వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని సూచించారు. అవసరం లేకపోయిన రోగికి ఎంఆర్ఐ స్కాన్లు రాయవద్దని, దీనిపై పలు ఫిర్యాదలు అందుతున్నాయని చెప్పినట్లు సమాచారం. డయాలసిస్ విభాగంలో అనాధికారికంగా నగదు డ్రా చేశారనే ఫిర్యాదులు రావడంతో వీటిని పరిశీలించేందుకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బృంద సభ్యుల్లో బయోమెడికల్ ఇంజినీర్ సందీప్, డాక్టర్ స్వప్న సింధు, డాక్టర్ స్వప్నలు ఉన్నారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి.సౌభాగ్యవాణి, ఆర్ఎంవో డాక్టర్ మల్లిఖార్జునరావు, డాక్టర్ మజీద బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్(ఏఐఎస్బీఐఎస్ఎఫ్) పిలుపు మేరకు గుంటూరులోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న ధర్నాచౌక్ వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్–గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపడుతున్న పోరాట ఆవశ్యకతను వారు వివరించారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ వీఎస్ఆర్ సుధాకరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీలు వి.నరేంద్ర కుమార్, పీఎస్ రంగసాయి, షేక్ ఇబ్రహీం, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) నాయకులు కిషోర్, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, పావని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ జనరల్ సెక్రటరీ ఎస్.రాజేష్ ఖన్నా, వీరితో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ విద్య ఆర్జేడీ జె.పద్మ పేర్కొన్నారు. సోమవారం ఏసీ కళాశాల సమవేశ మందిరంలో ఈనెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జేడీ పద్మ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీటి వసతితోపాటు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా చూడటంతోపాటు ప్రతి గదిలో ఫ్యాన్లు పని చేయాలని స్పష్టం చేశారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని, ఎటువంటి పొరపాట్లు జరిగినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రంజిత్బాషా వర్ుచ్యవల్ విధానంలో పలు సూచనలు చేశారు. సమావేశంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్, ఓఎస్డీ రమేష్, ఆర్ఐవో జి.సునీత, డీఈసీ సభ్యులు కె.సుచరిత, శిరిల్ పాల్, బీజే రామారావు పాల్గొన్నారు. -
ఘరానా దొంగలముఠా అరెస్ట్
బాపట్లటౌన్: బ్యాంక్లో ఉన్న బంగారం విడిపించి ఇస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి నుంచి రూ. 17 లక్షలు లాక్కొని పరారైన ఘరానా దొంగల ముఠాను వెదుళ్లపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈమేరకు బాపట్ల డీఎస్పీ సిహెచ్ చంద్రమౌళి సోమవారం వివరాలు వెల్లడించారు. బాపట్ల మండలం, స్టువార్టుపురం గ్రామానికి చెందిన అంగడి గౌతమ్ అలియాస్ బ్రూస్లీ తన బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టానని, వాటిని విడిపించకపోతే వేలం వేస్తారని, వాటిని విడిపించేందుకు రూ. 17 లక్షలు నగదు కావాలని, విడిపించిన బంగారం మీకు అప్పగిస్తానంటూ చీరాల మండలం, గవినివారిపాలెం గ్రామానికి చెందిన దబ్బకూటి నానిని నమ్మబలికారు. గౌతమ్ మాటలు నమ్మిన దబ్బకూటి నాని ఈనెల 8వ తేదీన రూ. 17 లక్షలు తీసుకొని వెదుళ్ళపల్లి సెంటర్కు చేరుకున్నారు. ముందస్తు పథకం పన్నిన అంగడి గౌతమ్ బాపట్ల మండలం, వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవర నరసింహారావు అలియాస్ చింటూ, పరసా శివప్రసాద్లతో కలిసి దబ్బకూటి నాని దగ్గర నుంచి రూ. 17 లక్షల నగదు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈనెల 9వ తేదీన వెదుళ్లపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు సోమవారం చీరాల మండలం, తోటవారిపాలెం సమీపంలోని వైన్షాపు దగ్గర ఉన్న విషయం తెలుసుకొని వారిని అరెస్ట్చేశారు. వారిలో అంగడి గౌతమ్ దగ్గర నుంచి రూ. 1000, దేవర నరశింహరావు నుంచి రూ. 14,21,100, పరసా శివప్రసాద్ వద్ద నుంచి రూ. 1200 చొప్పున మొత్తం రూ. 14,22,300 రికవరీ చేశారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ బి.హరికృష్ణ, వెదుళ్ళపల్లి ఇన్ఛార్జి ఎస్ఐ ఎస్.రవీంద్ర, వెదుళ్ళపల్లి ఏఎస్ఐ డి.పుష్పారావు, చీరాల క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుల్ బి.అచ్చియ్య, చీరాల క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ తన్నీరు శ్రీను, క్రైం పార్టీ కానిస్టేబుల్ బి.బాలచంద్ర, కర్లపాలెం కానిస్టేబుల్ శ్రీనవీన్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పెట్రో మంటపై పోరుబాట
వినుకొండలో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులు లింగంగుంట్లలో పెట్రలో బంక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి, పార్టీ శ్రేణులు సాక్షి, నరసరావుపేట: ప్రజల నడ్డివిరిచేలా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, వాటి భారాన్ని వెంటనే తగ్గించాలని వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పల్నాడు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే ఇంధన భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. రిక్షాలు, సైకిళ్లు తొక్కుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. సామాన్య ప్రజలు సైతం పెద్దఎత్తున పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ధరలు వెంటనే తగ్గించాలి ఎన్నికలలో ఓట్లు, సీట్లు కోసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామినిచ్చి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల పై భారం మోపుతున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, తగిన సమయంలో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఽనిరసన, ధర్నాలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు మంటలను తగ్గించాలని ఆయన డిమాంద్ చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారన్నారు. సామాన్యులపై భారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామన్యులపై అధిక భారం పడుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ సోమవారం నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి లింగంగుంట్లలోని ప్రభుత్వ పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంక్ వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ధర్నా అనంతరం కలెక్టర్ట్కు వెళ్లి ఇంచార్జి కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ 2014– 2019 మద్యకాలంలో పెట్రోల్, డీజిల్పై రూ.4లు వ్యాట్ను అప్పటి చంద్రబాబు వసూళ్లు చేసిందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హాయాంలో ఎప్పుడూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదని స్పష్టంచేశారు. ఇక్కడే రూ.10 అధనం.. వినుకొండలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ పరిశీలకులు బాసు లింగారెడ్డిల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లాయర్స్ స్ట్రీట్, నరసరావుపేట రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మురళికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన మాటల కోటలు దాటించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయిల్ ధరలు తక్కువగా ఉంటే... మన రాష్ట్రంలో లీటరుకు రూ.10 అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. పెదకూరపాడులో భారీ ర్యాలీ.. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు ఆదేశాల మేరకు పెదకూరపాడులో సోమవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి భారీ ర్యాలీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ జెండా చెట్టు మీదగా కచే రీ సెంటర్ మీదగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు, తాడికొండ నియోజకవర్గ పరిశీలకులు ఈదా సామి రెడ్డి, ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య తదితరులు మాట్లాడారు. అనంతరం పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిల్ ధరలు అధికం పెట్రో ధరల పెంపులో దేశంలోనే రాష్ట్రానికి అగ్రస్థానం దక్కుతుందని మాజీ మంత్రి విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం చిలకలూరిపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్ఆర్టీ రోడ్డులోని మాజీ మంత్రి రజిని నివాసం వద్ద నుంచి పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కాలినడకన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విడదల రజని మాట్లాడుతూ ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి తరుణంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాల్సి పోయి, మరింత పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం దారుణ భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతి పక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సంపద సృష్టి ఇదేనా..? గల్లీగల్లీ తిరిగి చంద్రబాబునాయుడు సంపద సృష్టిస్తానని, సృష్టించిన సంపదతో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి సంపద సృష్టించకుండా అప్పులను సృష్టిస్తున్నాడని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పెట్రో ధరలు తగ్గించాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పిడుగురాళ్లలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం డీటీ శర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే ఇంధన ధరలు అత్యధికమన్నారు. పెట్రో ధరల పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో డాక్టర్ గజ్జల రిక్షా తొక్కుతూ శ్యాంసుందర్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ వరకు చేరు కొని నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, నిత్యావసరాలు, ఇలా అనేక రకాల ధరలు పెంచుకుంటూ పోయారన్నారు. ధరలు పెంచడమే బాబు విజన్ అంటూ ఎద్దేవా చేశారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బియ్యం, కందిపప్పు, వంట నూనెలు వంటి నిత్యావసర ధరలు సామాన్యుల జేబులు ఖాళీ చేయగా.. దొరకడమే గగనమై గ్యాస్ బండ నెత్తిన పిడుగులా మారగా.. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో కుదేలై కుటుంబ పోషణ కష్టంగా మారి, ఏం తినేటట్లు లేము.. ఏం కొనేటట్లు లేమంటూ.. చస్తూ, బతుకుతూ, బతుకీడుస్తున్న సామాన్యుడిపై తాజాగా కూటమి ప్రభుత్వం ‘పెట్రో’ ధరల బాంబు వేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ సామాన్యుడి పక్షాన నిలిచి తన గళం వినిపించింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దెబ్బకు పెరిగిన నిత్యవస రాలతో సామాన్యుడి బతుకు దుర్భరం అయిందని, పెరిగిన ‘పెట్రో’ ధరలతో మరింత కుదేలయ్యారన్నారు. వెంటనే పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.3374 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 524.00 అడుగులకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.4,500 వరకు పలికింది. మాచర్లలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు 7 -
టవర్ ఎక్కి యువకుడు హల్చల్
వినుకొండ: పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్పై ఓ యువకుడు ఎక్కి గంటపాటు హల్చల్ చేశాడు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు చెందిన కందుకూరి కాటంరాజు సోమవారం సాయంత్రం టవర్ ఎక్కాడు. తన భార్య భాను సుమారు ఏడాది కిందట రెండో వివాహం చేసుకున్న తరువాత తనతో కలిసి ఉండటం లేదని, వెంటనే కాపురానికి రావాలని డిమాండ్ చేస్తూ టవర్పైకి ఎక్కినట్లు సమాచారం. టవర్పై నిలబడి యువకుడు కొంతసేపు ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడితో మాట్లాడారు. కుటుంబసభ్యులు, స్థానికులు కలిసి నచ్చజెప్పడంతో చివరకు అతను సురక్షితంగా టవర్ దిగివచ్చాడు. ఈ ఘటనతో నరసరావుపేట రోడ్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. యువకుడు టవర్ దిగడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
మెరిట్కు అన్యాయం చేస్తున్న డీఈఓపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: నిబంధనలు అతిక్రమించి మెరిట్కు అన్యాయం చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కోరారు. సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా డీఆర్ఓ నారదమునికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్ర శిక్షకు చెందిన జీసీడీఓ, ఏఎల్ఎస్సీఓ పోస్టుల డిప్యుటేషన్పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. సదరు పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్టులు మే ఒకటిన సిద్ధమైనప్పటికీ డీఈఓ నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని అభ్యర్థులకు అదనపు మార్పులు కలపాలనే దుర్బుద్ధితో మెరిట్ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా ఆపేశారన్నారు. 10రోజుల జాప్యం తరువాత తాను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలిపారన్నారు. డిస్ట్రిక్ రిసోర్స్పర్సన్ ట్రైనింగ్ ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే అదనపు మార్కులు కలపాల్సిన అవసరం ఉండగా డీఈఓ తాను ఎంచుకున్న అభ్యర్థులకు డీఆర్పీ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేకున్నా అదనపు మార్పులను కలిపి ఆ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపారన్నారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మస్తాన్, విశ్వనాథ్ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించిన ఎస్ఎఫ్ఐ నాయకులు -
నాగార్జునకొండ కార్యాలయంలో మ్యూజియం డే వేడుకలు
విజయపురిసౌత్: స్థానిక నాగార్జునకొండ కార్యాలయంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మ్యూజియం క్యూరేటర్ కమల్హాసన్ మ్యూజియం డే విశిష్టతను, మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ దేవాంఽద్రనాఽథ్ బోయి నాగార్జునకొండ మ్యూజియంలో రాబోయే రోజులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆర్కియాలజిస్ట్ దేవాంఽద్రనాథ్ బోయి, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జయచంద్రనాయుడు, మిర్యాలగూడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకృష్ణ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పురావస్తుశాఖ డీఈ సాంబశివరావు, సీనియర్ సీఏ ఢాకారెడ్డి, ఎస్ఎస్ఏ ధనలక్ష్మి, హెచ్ఏ వెంకటనరేష్, సీఏ మల్లికార్జున, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. -
కాపురం సరిదిద్దేందుకు వచ్చిన వారిపై దాడి
నాగవరం(క్రోసూరు): కాపురం సరిదిద్దేందుకు వచ్చి భార్య తరపు వారిపై భర్త కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి దాడి చేశారు. దాడిలో వృద్ధురాలు మృతి చెందింది. దీంతో నాగవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఐ రవిబాబు తెలిపిన వివరాలు.. మండలంలోని నాగవరం గ్రామానికి చెందిన మస్తాన్వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. అత్తమామలకు చెందిన ఎకరన్న పొలం రాయించుకు రావాలని భార్యను ఇటీవల పుట్టింటికి పంపాడు. కుమార్తె కాపురాన్ని సరిదిద్దేందుకు కరిష్మా తల్లి అల్లాబీ, అమ్మమ్మ ఫాతిమా(75)లు ఆదివారం నాగవరం చేరుకున్నారు. అక్కడ మాటామాట పెరిగింది. దీంతో మస్తాన్వలి తండ్రి వలి, తల్లి సైదాబీ, సోదరులు ఇమాంసా, ఇబ్రహీంలు వారిపై దాడి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆటోలో సత్తెనపల్లి బయలు దేరుతుండగా మార్గంమధ్యలో ఫాతిమా మృతి చెందింది. తీవ్రగాయాలైన అల్లాబీ, కరిష్మాలు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వృద్ధురాలు మృతి నాగవరంలో ఉద్రిక్తత -
ఆశ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఆపాలి
నరసరావుపేట: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఆశ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని బాధిత కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రామస్థాయిలో అధికార పార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు డి.శివకుమారి మాట్లాడుతూ గతంలో ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కొంతకాలం వేధింపులు తగ్గినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ నూజెండ్ల, శావల్యాపురం, బొల్లాపల్లి, కారంపూడి తదితర మండలాల్లో ఆశా కార్యకర్తలపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని అన్నారు. రాజకీయ కారణాలతో ఉద్యోగ పరంగా ఇబ్బందులు సృష్టించడం, తప్పుడు ఆరోపణలు చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల విషయంలో అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని రక్షణ కల్పించాలని, రాజకీయ వేధింపులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రత్నకుమారి, కోశాధికారి ధనలక్ష్మి వేధింపులు ఎదుర్కొంటున్న ఆశాలు పాల్గొన్నారు. ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా -
ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలి
కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన నరసరావుపేట: విద్యుత్ బస్సుల పేరుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో దశలవారీగా ప్రైవేటీకరణ జరుగుతోందని, ఇది సంస్థ భవిష్యత్తు, వేలాది మంది కార్మికుల ఉపాధికి తీవ్ర ముప్పుగా మారుతోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, పీజీఆర్ఎస్లో ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతిని, ప్రజలకు అందుతున్న చౌక, నాణ్యమైన రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. 26వ తేదీన నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, సంస్థను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ నాగమల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజా, కోశాధికారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: అర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 162 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు మానిటర్ చేయాలని, గడువు తీరకముందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. డీఆర్ఓ నారదముని, డీపీఓ గోపీనాయక్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. రీ సర్వేలో తప్పులు జరగకూడదు నరసరావుపేట: గ్రామాల్లో జరిగే రీ సర్వేలో ఎటువంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి రీ సర్వే, రెవెన్యూ అంశాలపై టెలి కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలోని భూ సమస్యలు పరిష్కరించడంలో మండల సర్వేయర్లు, వీఆర్ఓలకు ప్రముఖ పాత్ర ఉందన్నారు. యాప్ ద్వారా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలని గ్రామ సర్వేయర్లకు ఆదేశించారు. గ్రామాలలో రాజకీయాలు పక్కన పెట్టి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదే విధంగా మంగళవారం గురజాల డివిజన్, బుధవారం సత్తెనపల్లి డివిజన్, గురువారం నరసరావుపేట డివిజన్ పరిధిలో వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ -
భార్య, భర్తల వివాదాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: భార్యభర్తల వివాదాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ జేవి సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో పాటు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 68 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఆస్తి వివాదాలపై 12, ఆర్ధిక వివాదాలపై 8, భూ వివాదాలపై ఏడు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వచ్చే మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. విచారణను వేగంగా పూర్తిచేసి చట్టప్రకారం న్యాయం చేయాలని సూచించారు. సాయిబాబా గుడి కోసం తక్కువ ధరకు ఇచ్చిన స్థలాన్ని వేరొకరికి విక్రయించారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అల్లూరివారిపాలెం రోడ్డులో సాయిబాబా గడి నిర్మిస్తామంటే తక్కువ ధరకే 8 సెంట్లు భాస్కరశర్మ, సత్యవతిలకు విక్రయించాం. గుడి నిర్మిస్తేనే స్థలాన్ని అప్పగిస్తానని చెప్పాం. గుడి నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో స్థలం నా ఆధీనంలోనే ఉంది. రిపోర్టర్ సహకారంతో భాస్కరశర్మ, సత్యవతిలు ఆ స్థలంలో మరోవైపు ఫెన్సింగ్ వేశారు. దీనిని ప్రశ్నిస్తే రూ.20లక్షలు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. –వేములపాటి వెంకరెడ్డి, లింగంగుంట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ -
23,24 తేదీల్లో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు
పోస్టర్ ఆవిష్కరించిన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ)రాష్ట్ర 9వ మహాసభలు ఈనెల 23.24 తేదీల్లో గుంటూరు నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎం.లక్ష్మి ప్రధాన కార్యదర్శి బి.పద్మ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ మహిళలపై ఇంటా, బయట చూపుతున్న వివక్ష, అణిచివేత, పీడన, హింసలకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) దేశవ్యాప్తంగా పనిచేస్తుందన్నారు. మహిళా దృక్పథంతో పోరాడి సాధించిన హక్కుల్ని, చట్టాల్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం మహిళా సంస్కరణ పేరుతో వాటిని నిర్జీవం చేస్తుందని విమర్శించారు. ఉన్న హక్కులు నిలబెట్టుకొని, లేని హక్కులు సాధించుకునేందుకు (పీవోడబ్ల్యూ) భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రాష్ట్ర మహాసభల్లో రూపొందిస్తామని చెప్పారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘ ఉపాధ్యక్షులు ఎన్.విష్ణు ఆర్. గంగాభవాని రాష్ట్ర నాయకులు కె.దుర్గ, శివపార్వతి, బాజీ, గీత తదితరులు పాల్గొన్నారు. లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు తెనాలిరూరల్: బాలికను మాయ మాటలతో ప్రలోభ పెట్టి లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.... మండలంలోని హాఫ్పేట గ్రామానికి చెందిన బాలస్వామి ఓ బాలికతో తరచూ మాట్లాడుతూ మాయ మాటలతో ప్రలోభ పెట్టాడు. బాలికపై లైంగికదాడి చేయడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా బాలస్వామిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి వైద్యశాలకు తరలించారు. -
కృష్ణమ్మ గర్భాన చారిత్రక సౌందర్యం
బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జున కొండ విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయం మధ్య ఉన్న నాగార్జునకొండ మ్యూజియంకు ఎనలేని ప్రశస్తి ఉంది. వేసవిసెలవుల్లో ప్రతి విద్యార్థితో పాటు పెద్దలు విజ్ఞానం.. విహార యాత్రలో భాగంగా బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జున కొండను సందర్శించాల్సిందే. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం ఎందరో యాత్రికులు అనునిత్యం నాగార్జునకొండను సందర్శిస్తారు. చైనా, టిబెట్, శ్రీలంక తదితర దేశాల వారైతే ఇక్కడి తథాగతుని ప్రతిమకు ప్రార్థనలు జరుపకుండా వెనుకకురారు. ప్రపంచంలోనే మానవ నిర్మిత ఐలాండ్ మ్యూజియంలలో రెండవదయిన ఈమ్యూజియం విశిష్టత క్లుప్తంగా... ఇక్ష్వాకుల రాజధాని పూర్వం మహాయాన బౌద్ధ ప్రవక్త అయిన ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. బుద్ధదంత ధామమయమైన మహాస్థూపం, విశాలమైన వివిధ భిక్షువిహారాలు ఉన్నాయి. వీటన్నింటితో ఇక్ష్వాకుల రాజధానిగా విలసిల్లిన విజయపురి ప్రాంతం నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో ముంపునకు గురి కాకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు అక్కడ విశేష సామగ్రిని పరిరక్షించి నేడు నాగార్జున కొండలో ప్రదర్శిస్తున్నారు. నాగార్జునకొండ మ్యూజియంలో నాగార్జునకొండ లోయలో బౌద్ధ శిధిలావశేషాలు, ఇక్ష్వాకుల విజయపురి శిథిలాలు ఏవిధంగా పొందుపర్చారో వాటిని అదేవిధంగా పునర్నిర్మించారు. ఈమ్యూజియంలో మహాస్థూపంపై ఏర్పాటు చేసిన శిలా శిల్ప ఫలకాలు, ఆయకాస్తంభాలు, వివిధ విహారాలు, విశ్వవిద్యాలయాల్లోను లభించిన ఫలకాలను బుద్ధవిగ్రహాలను జాతక కథ క్రమాలను, బుద్ధచరిత్రాంశ శిల్పాలను తదితర వస్తు సామాగ్రిని క్రమపద్ధతిలో అందంగా పొందుపరిచారు. ఇక్ష్వాకు వంశీయుల శిలాశాసనాలు,వారి జీవిత విశేషాలు బౌద్ధస్తంభాలు తదితర మైనవి కూడా ఈమ్యూజియంలో ఉన్నాయి. నాటి విశ్వవిద్యాలయానికి మచ్చుతునక అనుపు ఈవిశ్వవిద్యాలయం శిథిల అవశేషాలు నాగార్జునకొండలోయలో ఏవిధంగా ఉన్నాయో అదే విదంగా ఆ ఇటుకలతోనే అనుపు వద్ద అమర్చారు. కష్ణానదితీరాన విశాలమైన విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొని ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులమై గురుశిష్య నివాసాలు ఒకేదగ్గరుండి సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమైన సయస్త విద్యల్లో పేరుపొంది ప్రపంచఖ్యాతి గాంచింది. స్నానఘట్టాలు నాగార్జునకొండపై ఇక్ష్వాకు రాజసౌధ ప్రాంగణంలో కష్ణానదితీరం నానుకోని నిర్మించిన స్నానఘట్టాలు ఉండేవి. ఇవికేవలం స్నానాలకే కాక వస్తు సామగ్రిని నౌకలద్వారా రవాణా చేయడానికిగాను నావల రేవులుగా కూడా వాడి ఉంటారని భావిస్తున్నారు. ఈస్నాన వేదికలను నున్నని నాపరాళ్లతో పరచబడినవి. ఇక్కడ స్నానానికి ఎంతో సౌకర్యంగా ఉండేది. హారతీ దేవాలయం విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో హారతీ దేవాలయం దాని దిగువన చతురస్త్రాకారంలో ఒకపెద్ద సరస్సు ఉంది. దీనికి నలువైపుల మెట్లతో ఒడ్డు ప్రాంతాలున్నాయి. మెట్లతో గ్యాలరీల మాదిరిగా ఉండటంతో దీని క్రీడాప్రాంగణం వేరే ప్రాంతంలో బయల్పడి నందున ఆసంశయం తీరింది. హారతీ దేవాళయంలో ప్రవేశానికి ముందు ఈసరస్సులో స్నానమాచరించేవారు. ఆకాలంలో పిల్లలకు మశూచి వచ్చినా, దంపతులకు సంతానం లేకున్నా హారతీ దేవిని దర్శించి పూజలు చేసేవారని ప్రతీతి. సింహళ విహారం మహాచైత్యం పక్కన సింహళవిహార శిథిలాలున్నాయి. ఈవిహారంలో బుద్ధ విగ్రహాన్ని స్థాపించారు. సింహళీయులు, ఈవిహారంలో నివసించి, నాగార్జునకొండలో పలుకుబడి సంపాదించుకున్నారని ప్రతీతి. చాంతిసిరి ఈవిహారానికి ఎన్నోధానధర్మాలు చేసినట్లు చరిత్రద్వారా వెల్లడవుతుంది. ఇవేకాక ఇంకా కూర్మక్షతి కుండం, ఇక్ష్వాకు రాజసౌధాలు, సతీసహగమన ఘట్టం, ఇక్ష్వాకురాజులు అశ్వమేథ యాగశాల తదితర మైన కట్టడాలు కూడా నాగార్జునకొండలో ఉన్నాయి. ఎలా చేరుకోవాలి.. నాగార్జున కొండకు చేరడానికి నాగార్జునసాగర్ నుంచి ఏపీ వైపు నుంచి( రైట్బ్యాంకునుంచి), తెలంగాణ వైపు(హిల్కాలనీ నుంచి) లాంచీలు ఉంటాయి. లాంచీప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యాత్రికులు అక్కడ ఎక్కువ సమయం గడిపేందుకు వీలుండదు. లాంచీలు కేవలం గంట సమయం మాత్రమే కేటాయించడంతో అన్ని విశేషాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న యాత్రికులకు నిరాశే మిగులుతుంది. బుద్ధధాతువును సందర్శించే యోగం కూడా అందరికి లేదు. కేవలం వీఐపీలకు మినహా ఎవరికీ అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్ది యాత్రికులు అక్కడ ఉండే విధంగా వసతులు కల్పిస్తే కానీ నాగార్జునకొండ మ్యూజియం ఏర్పాటుకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది బుద్ధధాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈస్థూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సారానాథ్లో ఉంచి పూజిస్తున్నారు. ఇది శారీరక స్థూపాల జాతికి చెందినది. దీని అంతర్భాగంలో బుద్ధభగవానుని అస్థికలు అమర్చబడ్డాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రము దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మించి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్థూపాకారాన్ని తయారు చేసి ఉపరితలాన్ని చుట్టుపక్కల పాలరాతి పలుకలు కప్పి అర్థగోళాకారంగా అందంగా నిర్మించారు. -
ప్రజల సమస్యలను ఎత్తిచూపిన ప్రదర్శనలు
మాచర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. వెంకట రంగారెడ్డిది మాచర్ల మండలం కంభంపాడు గ్రామం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామం వదిలి వెళ్లి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు అరెస్టు చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచనుననట్లు పోలీసులు తెలిపారు. వెంకట రంగారెడ్డిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇప్పటికే నెమలిదిన్నే వెంకట రంగారెడ్డిపై 14 అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్టు చేశారు. 15వ కేసును బనాయించి 15వ సారి జైలు పంపే పనిలో పోలీసులు ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టం నాగిరెడ్డి (36) ఆర్టీసీ బస్టాండ్లో నిద్రిస్తుండగా ఈ నెల 16న అతనిపై మాచవరం మండలం చెన్నయపాలెం గ్రామానికి చెందిన భీమవరపు వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు, నిందితుడు ఇద్దరూ పట్టణంలో యాచిస్తూ రాత్రుళ్లు ఆర్టీసీ బస్టాండ్లో నిద్రిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా మృతుడు నాగిరెడ్డి, నిందితుడు వెంకటేశ్వరరావును మద్యం సేవించేందుకు డబ్బుల కోసం వేధిస్తూ అనేక మార్లు దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో కక్ష పెంచుకొని అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయటంతో నాగిరెడ్డి మృతి చెందాడన్నారు. హత్యకు ఉపయోగించిన కర్రను, రక్తపు మరకల దుస్తులను నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. పర్చూరు(చినగంజాం): మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న తొమ్మిదో జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. కళానికేతన్ వీరన్నపాలెం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటిక పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. ఆదివారం రాత్రి ప్రదర్శించిన నాటిక పోటీలకు సంబంధించి యార్లగడ్డ రాజేష్, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా చిట్టినేని రవీంద్రబాబు, హరిచందన దంపతులు నటరాజ పూజ కార్యక్రమం నిర్వహించారు. దెబ్బ తింటున్న సంప్రదాయాలు.. ప్రదర్శనలో ముందుగు విశాఖపట్టణం తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ నాటిక అభివృద్ధి పేరుతో వస్తున్న కొత్త పుంతలకు అనుగుణంగా తమ పెద్దల చేతివేలు పట్టుకొని సాగే సంప్రదాయం దెబ్బతింది అనే సారాంశంతో సాగింది. కొండ ప్రాంతంలో జీవనం చేసే సోమన్న కుటుంబం భూమిని స్వేచ్ఛగా సాగు చేసుకొని పంటలు పండించుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ పెద్దల నుంచి సంక్రమించిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన తన పెద్దల చిటికెన వేలు పట్టుకొని వారి అడుగుజాడల్లో నడచిన సోమన్న ఆయన కొడుకు రెంజింను కూడా అలాగే నడిపించాడు. నాగరి కథ అభివృద్ధి పేరుతో వారి మనవడు కొత్త పుంతలను ఆహ్వానించాడు. తండ్రి చిటికెన వేలు విడిచి ప్రభుత్వాధికారులకు తన భూమి హక్కులను, చిటికెన వేలు కూడా సమర్పించుకున్నాడనేది సారాంశం. ‘జనరల్ బోగీ’ల్లో ఎన్నో కష్టాలు.. రెండో ప్రదర్శన కొలకలూరు శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ అనే నాటిక రైలులో జనరల్ బోగీల్లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను గురించి కొనసాగింది. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల అవస్థలు గురించి తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే వారి వివరాలు రైల్వే వాళ్ల దగ్గర ఉండవు. ప్రమాదం జరిగిన సందర్భాలలో వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ సాగిన నాటిక. మూడో నాటిక దీపం కింద ‘చీకటి’ అనే నాటికను వీరన్నపాలెం గ్రామంలోని నటులు ప్రదర్శించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోరంట్ల యమునా కుమార్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జెట్టి హరిబాబు ఆహ్వానం పలుకగా ముఖ్య అతిథిగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరి సత్యనారాయణ, గౌరవ అతిథులుగా పేర్ని వీరనారాయణ, గోరంట్ల రమేష్, యార్లగడ్డ రజిని, కొల్లా వెంకట్రావు, దండమూడి ఏలీషా చౌదరి, కఠారి రమేష్ నాయుడు పాల్గొనగా కళానికేతన్ కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. -
యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి
ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో–క్రికెట్ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, విజయాలను సాధించడానికి క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. టోర్నమెంట్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నగేష్బాబు, డీఎస్పీ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎ.శాంతిరాజు, శ్వాస ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ అనిత జ్యోతి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన వేంకటేశ్వర బాల కుటీర్ పాఠశాలలో జరుగుతున్న మెన్ అండ్ విమెన్ టీమ్ చాంపియన్ షిప్– 2026 పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఆద్యంత రామన్ నాయుడు, కేజీ అఖిల్, కె.హర్షవర్ధన్, ముక్కుపాటి చేతన్, ఉమెన్ విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, అనన్య గొల్లపల్లి, కంచర్ల అంజుశ్రీలు విజయం సాధించారు. పోటీల నిర్వాహకుడు విజయ్కుమార్ మాట్లాడుతూ గెలుపొందిన ఎనిమిది మంది రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్రరాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపాల్ సుధామాధవి బహుమతులు ప్రదానం చేశారు. అర్బిటర్గా అనిల్ వ్యవహరించారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కర్నూలులో ఈ నెల 24న జరిగే 12వ సీనియర్ రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పది మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెహబూబ్ షంషేర్ ఖాన్ మెమోరియల్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కోచ్ నాంచారమ్మ, నాగేశ్వరరావుల పర్యవేక్షణలో గుంటూరు జిల్లా జట్టు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు గుంటూరు జిల్లా నుంచి సీహెచ్ గౌతమ్, మేదర నాగచైతన్య, బి.నాగ చైతన్య, బి.స్వర్ణసుజిత్, కే అభినవసాగర్, అకిశెట్టి విష్ణుదేవరాయలు, షేక్ నస్రిన్, షేక్ నజరీన్, లక్ష్మీపావని, జి.జాన్వీలు ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై విభాగాలలో ఎంపికై నట్లు వెల్లడించారు. బాపట్ల: ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం బాపట్ల జిల్లా కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదామును జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్తో కలసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ గోదాం వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, ఎన్నికల పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక నటీనటులకు శిక్షణ ఒక వరం
తెనాలి: ఔత్సాహిక నటీనటులకు నటశిక్షణ ఒక వరమని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయక్ అన్నారు. మా–ఏపీ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా స్థానిక అంబేడ్కర్ కాలేజీలో జరిగిన సినీనటన శిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్రాజా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి శ్రీనివాసనాయక్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఔత్సాహికులు సినిమా నటనపై కనీస అవగాహనకు రాగలిగామని చెప్పటంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం దిలీప్రాజా చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పారు. అవసరమైన చర్చల సందర్భంలో మా–ఏపీకి ఆహ్వానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మూడురోజుల నటశిక్షణ తీసుకున్న 60 మందికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆడిషన్ల పేరుతో, కార్డుల పేరుతో డబ్బులు వసూలుచేస్తున్న సంఘాల పట్ల ఔత్సాహికులు అప్రమత్తంగా ఉండాలని దిలీప్రాజా సూచించారు. డీఓపీ మైనేని హరిప్రసాద్, మహిళా దర్శకురాలు నాగశ్రీ, శకనాల చంద్రశేఖర్, స్టయిల్ రవి, పాత్రుడు, వర్మ, జాలా రాజకుమారి, బాషా తదితరులున్నారు. -
పాస్పోర్ట్ అప్పగించిన మాజీ మంత్రి రజిని
నరసరావుపేట టౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని తన పాస్పోర్ట్ను ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో అందజేశారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి విడదల రజినిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు కేసును కొట్టివేయాలని ఆమె రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, ప్రతి ఆదివారం చిలకలూరిపేట పట్టణ పోలీస్స్టేషన్లో సంతకం పెట్టటంతోపాటు పాస్పోర్ట్ను విచారణ అధికారి అయిన డీఎస్పీకి అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో విడదల రజిని మొదట చిలకలూరిపేట పట్టణ పోలీస్స్టేషన్లో సంతకం పెట్టారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావుకు పాస్పోర్టును అందజేశారు. ఆమె వెంట మైనార్టీ నాయకుడు దరియావలి, న్యాయవాది నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
నిరసనకు సిద్ధం
‘పెట్రో’భారంపై సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు ఇచ్చిన హామీలు అంతా మోసమేనని తేలుతోంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని అప్పట్లో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ధరలు తగించకపోగా పెంచుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీల పెంపు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. యుద్ధ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ పాలకులు మంట పెట్టారు. లీటర్ పెట్రోల్పై రూ. 3.35, డీజిల్పై రూ.3.16 చొప్పున ధర పెంచడంతో ప్రత్యక్షంగా వాహనదారులపై ఆ భారం పడింది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు సహా అన్ని రకాల సామగ్రిపై పడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ తీరుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూ.కోట్లల్లో భారం జిల్లావ్యాప్తంగా 194 పెట్రోల్, డీజిల్ బంకులు (ఫిల్లింగ్ స్టేషన్లు) ఉన్నాయి. రోజుకు జిల్లాలో 4.20 లక్షల లీటర్ల డీజిల్, 2.35 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలతో జిల్లాలో పెట్రోల్ లీటరు రూ.113కు చేరింది. డీజిల్ రూ. 100.69కి పెరిగింది. ఆ ప్రకారం నెలకు మొత్తం దాదాపు రూ.6.34 కోట్ల మేర భారం అదనంగా పడుతోంది. మరోవైపు దాదాపు అన్ని రంగాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా రవాణా రంగాన్ని ఈ పెంపు నిర్ణయం సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసరాలు, వంటనూనెలు, కూరగాయలు, ఇలా అన్ని రకాల వస్తువులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దిగుమతి, ఎగుమతి చేస్తుంటారు. ఇంధన ధరల పెంపుతో వీటి ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి గత నెలలో వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వారం రోజులపాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను రేషన్ విధించారు. వరి కోతలపై ప్రభావం పడి రైతులు సకాలంలో పనులు చేయలేకపోయారు. ఫలితంగా అకాల వర్షాలతో కొంత నష్టపోయారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై వైఎస్సార్ సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసన చేపట్టనున్నారు. ఆర్డీవోలు, తహసీల్దారులకు వినతి పత్రాలు అందించనున్నారు. ఎన్నికలకు ముందు కూటమి... తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు విస్మరించింది. ధరలు మరింతగా పెంచడం ద్వారా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం మోపడంతోపాటు రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. -
రాకెట్ వేగంతో ముంచేశాడు!
సాక్షి, నరసరావుపేట: అతడు నోరు విప్పితే రాకెట్, నాసా, ఇస్రో, సోలార్ సిస్టమ్, స్విస్ బ్యాంక్, టాక్స్ ఫ్రీ... వంటి పదాలను అలవోకగా మాట్లాడుతుంటాడు. ఇవన్నీ చూసి ఏ నాసా శాస్త్రవేత్తో అనుకుంటే వేలాది మంది బాధితుల జాబితాలో మీరూ చేరినట్టే. అతనో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయని ఆర్థిక నేరస్థుడు. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని ఎదగాలనుకునే మనస్తత్వం అతినిది. అతనే చిలకలూరిపేట రూరల్ మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు. మొదట్లో ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఇలా రూ.కోట్లు సంపాదించలేమని అనుకున్నాడో ఏమో.. తనకు పరిచయమైన కొందరు కేటుగాళ్లతో కలసి రాకెట్ ల్యాబ్ పేరిట కొత్త దందాకు తెరదీశాడు. దండుకోవడమే పని రూ.10 వేలు కడితే రూ.10 కోట్లు ఖాతాలో వేస్తామంటూ నమ్మించాడు. సింగపూర్ బ్యాంక్ ఖాతాలో రూ.3 లక్షలు జమ అయ్యాయని, వాటిని తీసుకోవాలంటే ఈ– కేవైసీతోపాటు మరో రూ.3,500 కట్టాలంటూ ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని మరికొంత దండుకునే ప్రయత్నం చేశాడు. అతని కుమారుడు వంశీ, పీఏ నీరజల సహాయంతో మూడు రోజుల క్రితం నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీలో రాకెట్ ల్యాబ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ సమాచారంతో శనివారం నరసరావుపేట రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదుతో వెంకట్రావు, వంశీ, పీఏ నీరజలపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కిషోర్ తెలిపారు. అప్పుడే అప్రమత్తమై ఉంటే... నాగండ్ల వెంకట్రావు తొలుత స్వగ్రామం గొట్టిపాడులో నాసా పేరుతో ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు. ఇందులో ఓ 20 మంది ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి రూ.2 లక్షల వరకు వసూల్ చేసి మోసం చేశాడు. దీనిపై వెంకట్రావుపై అదే గ్రామానికి చెందిన చప్పిడి బాలస్వామి ఫిర్యాదుతో ఈ ఏడాది మార్చి 9వ తేదీన చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులకు ఇవ్వాల్సిన నగదు వెనక్కి ఇచ్చిన వెంకట్రావు ఫిర్యాదుదారులపై కౌంటర్ కేసులు, మీడియా సమావేశాలతో బెదిరింపులకు దిగాడని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులపై సైతం వెంకట్రావు బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారించి అతడి ఆట కట్టించి ఉంటే నరసరావుపేటలో రాకెట్ ల్యాబ్ పేరుతో మరోసారి ఇలా మోసానికి దిగేవాడు కాదని బాధితులు వాపోతున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేటలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో వేల సంఖ్యలో రాకెట్ ల్యాబ్ బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారనే సమాచారం తెలుసుకున్న కొందరు బాధితులు కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఫోన్లు చేస్తున్నారు, తాము వచ్చి వెంకట్రావు మోసాలపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఇంత జరిగినా పోలీసు విచారణలో వెంకట్రావు మాత్రం తాను నిజాయతీపరుడినేనని చెబుతున్నట్లు సమాచారం. చందాదారులు అనవసరంగా హైరానా పడ్డారని, స్విస్ ఖాతాలలో తప్పకుండా నగదు జమ అవుతాయని చెప్పారు. కేరళ నుంచి తమ భాగస్వామి వచ్చి మొత్తం వివరిస్తాడని నమ్మబలుకుతున్నాడట. ఏది ఏమైనా ఇప్పటికే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో యూపిక్స్ స్కాం, సాయిసాధన చిట్ఫండ్స్ స్కాంలతోపాటు పలువురు వ్యాపారులు ఐపీ పెట్టడంతో గతేడాదిగా వరుస ఆర్థిక మోసాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు గట్టిగా వ్యవహరించకపోతే మరింత మంది బాధితులు నష్టపోయే ప్రమాదముంది. -
నేడు మామిళ్లపల్లికి జోగి రమేష్ రాక
పొన్నూరు: మండలంలోని మామిళ్ళపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు సోమవారం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు జోగి రమేష్ విచ్చేస్తున్నారని పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడలో ప్రబలిన డయేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు వైద్యాధికారులు ఆదివారం ప్రకటించారు. స్థానిక తెలుగు బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు ఒక్క డయేరియా కేసు కూడా రాలేదని వైద్యాధికారులు తెలిపారు. జ్వరం కేసులు మాత్రం నాలుగు వచ్చినట్లు వివరించారు. అస్వస్థతకు గురైన బాధితులందరూ పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లును అందజేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు. చేబ్రోలు, వేజండ్ల, పరిసిర ప్రాంతాలకు చెందిన వైద్యాఽధికారులు, సిబ్బంది వైద్య సేవలు అందజేశారు. వట్టిచెరుకూరు, చేబ్రోలు ప్రాంతాలకు చెందిన రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు. పరిస్థితి సాధారణ స్థితికి రావటంతో సోమ, మంగళవారాల్లో మెడికల్ క్యాంపును తీసివేసే అవకాశం ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ఇంకొల్లు(చినగంజాం): ఆటో హ్యాండిల్ అదుపు తప్పడంతో పంట కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి ముసలయ్య (58) తన ఆటోలో ఒంగోలు నుంచి ఇంకొల్లు గ్రామానికి కొబ్బరి బొండాల లోడుతో వస్తున్నాడు. మరికొద్ది సేపట్లో ఇంకొల్లు చేరుకునే క్రమంలో కొణికి గ్రామం దాటిన తరువాత అతని ఆటో హ్యాండిల్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో ముసలయ్య ఆటోను నియంత్రించలేకపోవడంతో ఆటో పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో నీటిలో బోల్తా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 30 ఏళ్లుగా ముసలయ్య ఆటో డ్రైవర్గా ఉన్నాడు. భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జీ సురేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి పోస్టుమార్టం నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు. ముగ్గురికి తీవ్రగాయాలు కారంచేడు: ఆటోను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన ఒక కుంటుంబ ఆటోలో ఏడుగురితో కలిసి పల్నాడు జిల్లా కోటప్పకొండ దైవ దర్శనం కోసం చేసుకొని తిరిగి చీరాల వస్తున్నారు. ఈ క్రమంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వస్తున్న కారు కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది చీరాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చీరాల: చీరాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్పై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. స్థానిక జయంతిపేటకు చెందిన వాసిమళ్ల హరీష్ చీరాల ఆర్టీసీ డిపోలో హైర్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్లోకి వస్తుండగా చీరాల మండలం కీర్తివారిపాలేనికి చెందిన చుక్క సుబ్రహ్మణ్యం, ఏలిక రమేష్లు హరీష్ వద్దకు వచ్చి ఒక మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందనే నెపంతో తనను చంపాలని ఉద్దేశంతో తనతో గొడవపడ్డారన్నారు. ఈ క్రమంలో ఇరువురు కులం పేరుతో దూషించారని, రమేష్ తనను కిందకు పడవేయగా సుబ్రహ్మణ్యం కత్తితో కడుపులో పొడిచారన్నారు. చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అవుట్పోస్టు పోలీసులు క్షతగాత్రుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. -
మూడోసారీ మారువేషంలో..
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ శనివారం అర్థరాత్రి మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. తలపాగా పెట్టుకుని, ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ వ్యక్తి మాదిరిగా పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. డాక్టర్ యశస్వి రమణ ఆస్పత్రి సూపరింటెండెంట్గా 2024 అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని ఆస్పత్రి అధికారులు పరిష్కరించలేకపోతున్నారని మీడియాలో వరుసగా కథనాలు రావటంతో 2025 నవంబర్లో బిచ్చగాడి వేషం ధరించి రాత్రిళ్లు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. మళ్లీ రెండోసారి 2025 డిసెంబర్లో మార్చురీ విభాగం వద్ద డబ్బులు తీసుకుంటున్నారని మీడియాలో కథనాలు రావటంతో మారు వేషంలో మార్చురీ వద్ద తనిఖీలు చేశారు. నేడు తాజాగా మూడోసారి ఆస్పత్రిలో మారు వేషంలో తనిఖీలు చేశారు. మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఆయనకు ఏ విధమైన లోపాలు కనిపించకపోవటం, ఆస్పత్రిలో అందరూ విధుల్లో ఉండటం, రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవటం వంటి విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మారు వేషం వేసిన ప్రతిసారి సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసి ఆయన వైరల్ అయ్యారే తప్పా రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మూడుసార్లు తూతూ మంత్రమే.. సాధారణంగా ఆస్పత్రిలో రాత్రిళ్లు విధుల్లో కొంత మంది వైద్య సిబ్బంది, వైద్యులు ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ అసిస్టెంట్ సర్జన్, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉండరనేది నగ్నసత్యం. ఒకవేళ ఎవరైనా బాధితులు చికిత్స కోసం వచ్చి ఎమర్జెన్సీ వార్డుల్లో మరణిస్తే దానిని ధ్రువీకరించి డ్యూటీ అసిస్టెంట్స్ డాక్టర్స్, సర్జన్స్ సంతకాలు చేయాల్సి ఉంది. కాని వీరు ఉండకపోవటంతో పీజీ వైద్యులతో సంతకాలు చేయించటం లేదా కొన్ని సార్లు ఉదయం డ్యూటీ డాక్టర్స్ వచ్చే వరకు భౌతిక కాయాలను ఉంచి సంతకాలు చేయించి తరలిస్తున్నట్లు ప్రతి ఒక్కరు చెవులు కొరుక్కుంటున్నారు. కాని సూపరింటెండెంట్ తనిఖీలు ఇలాంటి లోపాలు ఏమీ కనిపించలేదు. ఆయన తనిఖీలు చేసిన శనివారం, ఆదివారం సమయాల్లో సాధారణంగా పెద్ద డాక్టర్స్ రాకుండా జూనియర్స్పైనే పని వదిలి వెళ్లటం ఇక్కడ పరిపాటే. శనివారం రాత్రి వేళల్లో సూపరింటెండెంట్ తనిఖీలు చేసిన సమయంలో అందరూ విధుల్లో ఉన్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారువేషాల్లో తన సొంత పబ్లిసిటీ కోసం తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదాలను గుర్తించలేదు. ఎవరిపైనా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. -
ఖాతార్నాక్ సమస్యలు
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026 ఖాతా తెరుచుకోవాలంటే ఎఫ్ఐఆర్ నమోదైన పోలీస్స్టేషన్కి వెళ్లాల్సిందే బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్ నిందితుల వలలో అమాయకులు కేసు మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో మరిన్ని వెతలు ఏటీఎం కేంద్రాల వద్ద నగదు మార్పిడి సమయంలో మోసాలకు ఆస్కారం నరసరావుపేటలోని ఓ బిర్యానీ సెంటర్కు పది రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి బిర్యానీ తిన్నాడు. రూ.220 బిల్లు చెల్లించాడు. నాలుగు రోజుల తరువాత ఆ హోటల్ నిర్వాహకుడి బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. స్థానిక అరండల్పేటలోని బ్యాంక్కు వెళ్లి దీనిపై ఆరా తీయగా ఆన్లైన్ క్రికెట్ యాప్ వినియోగించే బుకీ ఖాతా నుంచి ఈ లావాదేవీ జరిగిందని అధికారులు తెలిపారు. నిత్యం వందల మంది హోటల్కు వచ్చి తిని ఫోన్ పే చేస్తుంటారని, వారేం చేస్తారో ఎలా తెలుస్తుందని యజమాని వాపోయారు. తనకు రూ.220 బిర్యానీ నిమిత్తం జమ అయ్యిందని, బుకీతో సంబంధలేదంటూ లెటర్లు మీద లెటర్లు ఇస్తే రెండు నెలల తరువాత ఖాతా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎందరో అమాయకులకు సైబర్ నేరాలు, క్రికెట్ బుకీలతో సంబంధం లేకపోయినా ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. -
వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించకుండా చూడాలి
నరసరావుపేట: ఓటర్ల క్రమబద్ధీకరణ ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) పనిచేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రామిరెడ్డిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో బీఎల్ఏల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే నెల నుంచి ‘సర్’ ద్వారా ఓటర్ లిస్టుల ప్రక్షాళన మొదలు పెట్టబోతుందని అన్నారు. పార్టీ వారికి చెందిన ఓట్లు తొలగింపునకు గురికాకుండా చూసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు, పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక టీంగా ఏర్పడాలని సూచించారు. రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల కన్వీనర్ రవీంద్రారెడ్డి వీడియా ప్రజంటేషన్ ద్వారా సర్ కార్యక్రమం గురించి వివరించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, ఎన్కే ఆంజనేయులు, పాలపర్తి వెంకటేశ్వరరావు, కనకా పుల్లారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు అచ్చిశివకోటి, గడ్డం వెంకటరావు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ... సత్తెనపల్లి: ‘సర్’పై బూత్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జోనల్ ఇన్చార్జ్ కందుల రవీంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సదస్సుకు సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అధ్యక్షత వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వలంటీర్ల వింగ్ జిల్లా అధ్యక్షుడు ఎం. ఉమామహేశ్వరరరెడ్డి, జిల్లా బూత్ అధ్యక్షుడు ఇందూరి నరసింహారెడ్డి, నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు కాల్వపల్లి బ్రహ్మారెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమ రావు, నక్కా శ్రీనివాసరావు, రాజారపు శివనాగేశ్వరరావు, కొర్లకుంట వెంకటేశ్వర్లు, సయ్యద్ గోరా, మేడ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వాకుమళ్ల చెంచిరెడ్డి, యర్రం పున్నారెడ్డి, రసూల్, ఆదినారాయణ, సాంబ శివరావు పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయం చేసుకొని సర్ నిర్వహించాలి పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ పార్టీ శ్రేణులకు గజ్జల దిశానిర్దేశం -
రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు
● గిఫ్ట్ మనీ పేరుతో నయా మోసం ● నరసరావుపేటలో కార్యాలయం ప్రారంభం ● స్థ్ధానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ● పోలీసుల విచారణతో వెలుగుచూసిన భారీ స్కాం ● పోలీసుల అదుపులో నిర్వాహకుడు వెంకట్రావు ● పలు రాష్ట్రాల్లో ఇదే తరహా మోసాలు నరసరావుపేట రూరల్: పది వేలు చెల్లిస్తే పది కోట్లు ఇస్తామంటూ స్కీమ్ను ప్రారంభించి అమాయక ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ శివారు ప్రాంతమైన కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు కార్యాలయాన్ని ప్రారంభించాడు. వెంకట్రావు కోకోనట్ మర్చంట్ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో స్కీమ్లో సభ్యుల నుంచి నిర్వాహకులు ఈకేవైసీ తీసుకుంటున్నట్టు సేకరిస్తున్నట్టు గుర్తించారు. గిఫ్ట్ మనీ పేరుతో టోకరా.. రాకేట్ ల్యాబ్ పేరుతో వెంకట్రావు గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గిఫ్ట్ మనీ స్కీమ్ను నిర్వహిస్తున్నాడు. స్కీమ్లో చేరిన సభ్యులు మొదటగా రూ.10 వేలు చెల్లిస్తే రూ.10 కోట్లు వరకు లబ్ధిపొందవచ్చని నమ్మబలుకుతున్నాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో అధిక సంఖ్యలో స్కీమ్లో సభ్యులుగా చేరుతున్నారు. ఇందుకోసం 500 మంది వరకు ఏజెంట్లు ఈ స్కీమ్లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దాదాపు నాలుగు వేల మందిని స్కీమ్లో సభ్యులుగా చేర్చినట్టు తెలుస్తుంది. స్కీమ్లో చేరి రూ.10 వేలు చెల్లించిన నాలుగు రోజుల తరువాత సింగపూర్లో వారి పేరుపై అకౌంట్ ప్రారంభించి రూ.3 లక్షలు జమ చేసినట్టు నమ్మించేందుకు నకిలీ సందేశాలు పంపుతారు. నెల రోజుల తరువాత రూ.10 కోట్లు జమ చేస్తామని నమ్మబలికి ఇప్పటికే రూ.కోట్లులో వసూలు చేసినట్టు సమాచారం. బ్లాక్ మనీనీ వైట్గా మార్చే పేరుతో.... పిడుగుపాటు వలన ఏర్పడే ఖోగోళిక పదార్థం అమ్మడం వలన లక్షల కోట్లు వచ్చాయని, బ్లాక్ మనీనీ వైట్ చేసే క్రమంలో పేదలకు సాయం చేస్తున్నట్టు వెంకట్రావు తెలపడంతో పోలీసులు విస్తుపోయారు. సభ్యులుగా చేరిన వారి అకౌంట్లో రూ.10 కోట్లు జమ చేసి అందులో సగం తాము తీసుకోవడం ద్వారా వైట్మనీగా మార్చుతున్నట్టు వివరించాడు. ఇందుకోసం సింగపూర్లో అకౌంట్ తెరిచేందుకు సభ్యుల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు తెలిపాడు. ఈ స్కీమ్ వెనుక పెద్దల ప్రేమేయం ఉందని నిర్వాహకుడు చెప్పుకొస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో పాటు రెవెన్యూ, పోలీసు, న్యాయాధికారులు తమకు అండగా ఉన్నారంటూ పోలీసులను బెదిరించాడు. వెంకట్రావు మాటలపై అనుమానంతో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఇదంతా బోగస్గా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్కీమ్ నిర్వాహకుల్లో ఒకరు కేరళలో ఉన్నారని, ఆతన్ని కూడా విచారించిన తరువాత చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు తెలిపాడు. చిలకలూరిపేటతో పాటు పలు చోట్లు వెంకట్రావు మోసాలపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. -
అక్రమాలకు ‘సహకారం’
● అన్నవరం పీఏసీఎస్లో అవినీతిపై ఫిర్యాదులు ● విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● వెలుగులోకి సీఈవో శ్రీనివాసరావు అక్రమాలు, వేధింపులు ● సీఈవో వైఖరితో ఉద్యోగి ఆత్మహత్య ● విచారణ నిలిపివేయాలని సహకార మంత్రికి ఎమ్మెల్యే లేఖ ● అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ● పాలకుల తీరుపై అన్నదాతల తీవ్ర ఆగ్రహం నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సదస్సు నిర్వహించారు. సమాధాన్ సమరోహ 2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నవారు ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని కోరారు. దీనికోసం ఈ నెల 31వ తేదీలోపు నిర్దేశిత గూగుల్ ఫారం పూరించి తమ అంగీకారం తెలియజేయాలన్నారు. ప్రజల అవగాహన కోసం ముద్రించిన ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీపీ కట్ట కాళిదాస్, మొదటి పట్టణ సీఐ షేక్ టి.ఫిరోజ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం, ఎస్ఐ వంశీకృష్ణ, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షలో పల్నాడు జిల్లా 87.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఐసెట్ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 511 మంది నమోదు కాగా పరీక్షకు 449 మంది హాజరయ్యారు. వీరిలో 392 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 201 మంది పురుషులు, 191 మంది మహిళలు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు అర్హులు. పథకాలను మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోండి మాచర్ల రూరల్: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సైనిక సంక్షేమ ఉమ్మడి జిల్లా శాఖాధికారి ఆర్.గుణశీల కోరారు. శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుందని సాగు భూమితో పాటు పిల్లల చదువులలో రిజర్వేషన్, క్యాంటీన్లో సబ్సిడీపై అందించే వివిధ వస్తువులను సకాలంలో తీసుకోవాలని కోరారు. విద్యకు స్కాలర్షిప్, కుమార్తె వివాహానికి నగదు, వైకల్య గ్రాంటు, ఈసీహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందుకోవాలన్నారు. మృతిచెందిన మాజీ సైనికుల భార్యలకు గుర్తింపు కార్డులను అందించారు. ఇటీవల అంగవైకల్యం పొందిన ఇన్నారెడ్డి గృహానికి వెళ్ళి పరామర్శించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేపీ సిద్ధంరాజు, ప్రధానకార్యదర్శి తాటి వినోద్బాబు, కోశాధికారి ఆర్ గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులు వి.మరియదాసు, సభ్యులు కారంకి శ్రీనివాసరావు, రామారావు, పి.బాబు, ఇన్నారెడ్డి, శేఖర్, రవి పాల్గొన్నారు.పొన్నూరు: మామిళ్లపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదివారం రానున్నారని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మామిళ్లపల్లి అడ్డరోడ్డు నుంచి మామిళ్లపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. లక్ష్మీపురం: ఓ ఇంట్లో 25 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. ముత్యాలరెడ్డినగర్ 8వ లైన్ ప్రాంతానికి చెందిన దుగ్గెంపూడి ప్రభాకర్రెడ్డి కన్స్ట్రక్షన్ పని చేస్తుంటారు. భార్య భూలక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న 25 సవర్ల బంగారం, అలాగే బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీన్ని గమనించిన ప్రభాకర్రెడ్డి ఆయన సతీమణి భూలక్ష్మి, ఇంట్లో పని చేసే మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మూడు దశాబ్దాలుగా అన్నవరం సొసైటీలో తిష్ట వేసిన వ్యక్తి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తట్టుకోలేక గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళా ఉద్యోగిని కూడా జీతాలు ఇవ్వకుండా వేధించాడు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని విన్నవించారు. దీంతో అక్రమాల డొంక కదిలింది. దీనిని ఆదిలోనే ఆపాలని సదరు ఉద్యోగి ఏకంగా కూటమి ఎమ్మెల్యేతో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విచారణను ప్రభుత్వం నిలిపివేసింది. రొంపిచర్ల మండలం అన్నవరం పీఏసీఎస్ అవినీతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు పలు మార్లు ఫిర్యాదులు అందాయి. సొసైటీ పరిధిలోని రైతులతోపాటు సిబ్బంది సైతం అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్... జిల్లా సహకార అధికారిని విచారణకు ఆదేశించారు. సొసైటీ రికార్డులను పరిశీలించి రైతులను అధికారులు విచారించారు. పీఏసీఎస్లో అవినీతి నిజమేనని నిగ్గు తేల్చారు. విచారణలో రూ.16.86 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించారు. సెక్షన్ 52 ప్రకారం పూర్తి స్థాయి విచారణకు జిల్లా సహకార అధికారి నాగరాజు ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదేశించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న దొప్పలపూడి శ్రీనివాసరావు అవినీతిలో కీలక సూత్రధారి అని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. శ్రీనివాసరావు భార్య ఉషారాణిని సొసైటీ ఉద్యోగినిగా చూపిస్తూ 2014–19 కాలానికి రూ.6.12 లక్షలు వేతనంగా డ్రా చేశాడు. అయితే ఉషారాణిని కార్యాలయంలో ఎప్పుడూ చూడలేదని విచారణలో అధికారులకు రైతులు తెలిపారు. గతంలో శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ కాలానికి కూడా సొసైటీ నుంచి జీతాలు, పాత బకాయిలను సొసైటీ మినిట్ పుస్తకంలోని ఖాళీ పేజీలలో నకిలీ తీర్మానాలు సృష్టించి మొత్తం రూ.8.94 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. రైతు నుంచి వసూళ్లు చేసిన రూ.1.90 లక్షలను బ్యాంక్లో జమ చేయనట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గతంలో సొసైటీలో పెయిడ్ సెక్రటరీగా పనిచేసిన జేపీ కుమార్కు ఇవ్వాల్సిన మొత్తం రూ.3.45 లక్షలను కూడా శ్రీనివాసరావు నకిలీ తీర్మానాలతో డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే చదలవాడ అండ అన్నవరం పీఏసీఎస్లో జరిగిన అవినీతిపై పూర్తి స్ధాయి విచారణ జరిగితే మరింత అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావించిన సీఈవో శ్రీనివాసరావు... ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును ఆశ్రయించాడు. సీఈవోపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఎమ్మెల్యే నేరుగా సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏప్రిల్ 2వ తేదీన లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్నవరం పీఏసీఎస్పై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి వంతు పాడుతూ ఎమ్మెల్యే విచారణ నిలిపివేయాలని కోరడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ప్లాస్టిక్ రహిత సమాజంతో మేలు
నరసరావుపేట: ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్ లభిస్తుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ థీమ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. రెండు కార్యాలయాల వద్ద ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కార్యాలయంలో మొక్క నాటి నీరు పోశారు. ఆర్డీఓ కె.బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫెరెన్స్లో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు, పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక. క్షేత్రస్థాయి సమస్యలు, జాయింట్ ఎల్బీఎం, 22–ఏ, అన్ – సర్వేయిడ్ – అన్ – సెటిల్డ్ గ్రామాలు, ఎస్టేట్, ఈనాం గ్రామాల సమస్యలు, ఈనాం భూములకు సంబంధించి ఉన్న న్యాయపరమైన, రెవెన్యూ చిక్కులు, ఎండీఆర్, వెబ్ ల్యాండ్, అడంగల్ రికార్డులు, వ్యవసాయ సాగు పట్టాలు, ఇళ్ల పట్టాలు, టైటిల్ డీడ్లు తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి, పరిష్కారానికి సమగ్ర నివేదికలను రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. వాటి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. -
డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేయాలి
అచ్చంపేట: డప్పు కళాకారులంకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి గార్లపాటి దాసు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బుల్ల రాజారావు పిలుపు మేరకు శనివారం మండలంలోని చిగురుపాడు ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులంతా పనులులేక దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లు నిండిన వారందరికి పింఛన్లు మంజూరు చేయాలని, నివేశన స్థలాలు లేనివారికి రెండు సెంట్లు స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టించాలని కోరారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి డప్పు కళాకారులకు ఐడీ కార్డులు మంజూరు చేసి ఆర్టీసీ బస్సులలో రాయితీలు, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయాలలో దండోరా ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు స్థాపించి, ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రెండు లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకా భాస్కరరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ శిఖా తిమోతి, ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ తుడుం ఇమ్మానియోలు, మండల కార్యదర్శి తాళ్లూరి సైదులు పాల్గొన్నారు. -
గర్భిణుల వద్దకే వైద్యం
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ ఏరియా వైద్యశాల్లో గర్భిణుల రక్త పరీక్షల కోసం పడుతున్న తీవ్ర ఇబ్బందులపై గర్భిణుల సహనానికే పరీక్ష అన్న శీర్షికతో ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. పల్నాడు బస్టాండ్ వద్ద ఉన్న పాత వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో లింగంగుంట్లలో నిర్మించిన 200 పడకల ప్రభుత్వ ఏరియా వైద్యశాల్లో 15 రోజుల క్రితం గైనిక్ విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే గ్రౌండ్ఫ్లోర్లో గైనిక్ విభాగాన్ని ఏర్పాటు చేసి రక్త, మూత్ర పరీక్షల నిర్వహణ మాత్రం మూడవ అంతస్తులో ఏర్పాటు చేశారు. ఉన్న లిఫ్ట్ సాంకేతిక సమస్యతో తరుచూ మోరాయిస్తుంది. లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవటంతో గర్భిణులు రక్త, మూత్ర పరీక్షల కోసం మూడు అంతస్తుల మెట్లు ఎక్కుతూ నానా అవస్థలు పడుతున్నారు. మరొకరి సహాయంతో ఇబ్బందులు పడుతూ పరీక్షల కేంద్రానికి చేరుకుంటున్నారు. దీనిపై స్పందించిన వైద్యాధికారులు రక్త సేకరణ కేంద్రాన్ని గ్రౌండ్ఫ్లోర్లో శనివారం ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బంది అక్కడ విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. వచ్చిన గర్భిణుల వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ను సేకరించారు. -
రసాయనాల కోరల్లోంచి... ప్రకృతి ఒడిలోకి
యడ్లపాడు: ఆధునిక జీవనశైలిలో మనిషి ఆరోగ్యం రసాయనాల కోరల్లో చిక్కుకుంటోంది. పళ్లెంలో వడ్డించే ప్రతి ముద్దా విషతుల్యమవుతున్న తరుణంలో ప్రత్యామ్నాయం ప్రకృతి సాగు విధానమే శరణ్యం. పల్నాడు జిల్లాలోని 527 గ్రామాల్లో ఇప్పటికే 396 గ్రామాల్లో ప్రకృతి సేద్యం వైపు రైతుల అడుగులు పడ్డాయి. జిల్లాలోని 348 రైతు సేవా కేంద్రాలలో 240 కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉండగా, మిగిలిన వాటిలో వ్యవసాయ, ఉద్యాన సహాయకులు అందుబాటులో ఉన్నారు. వీరు ఘన, ద్రవ జీవామృతాల తయారీపై ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపే రైతులకు మెలకువలు నేర్పుతున్నారు. రసాయనాల్లేని ఆహారమే అసలైన అమృత భాండాగారమని భావించిన జిల్లా యంత్రాంగం ఒక బృహత్తర సంకల్పంతో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. కేవలం పొలాల్లోనే కాకుండా, ప్రతి ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంతో పాటు ఇంటి పెరటిని ఒక పోషక విలువల వనంగా(న్యూట్రీ, టెర్రస్ గార్డెన్) మార్చడమే ధ్యేయంగా ప్రణాళిక చేస్తోంది. ప్రకృతి సాగు జిల్లా లక్ష్యం.. జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి కేరాఫ్ అడ్రస్గా మార్చాలని కలెక్టర్ కృతికా శుక్లా కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది 82,598 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణాన్ని చేపట్టాలని ఆ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సుమారు 70 వేల మంది రైతులను ఈ విధానంలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళిక చేసింది. వివిధ రకాల పంటలను కేవలం ప్రకృతి పద్ధతుల్లో చేసేలా వారిని చైతన్యం చేయనుంది. ఖరీఫ్ సీజన్కు ముందుగా పీఎండీఎస్ సాగుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకృతి సాగులో కీలకమైన పీఎండీఎస్కు 30 రకాల విత్తనాలతో కూడిన 32 వేల విత్తనగుళికలను తయారు చేసి ఆయా కిట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిని జిల్లాలోని 28 బయోరీసోర్సు ఇన్న్ఫుట్ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రకృతి ఎరువులు, కషాయాల తయారీపై అవగాహన పెంచేందుకు మండలస్థాయి ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి ఈ శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
మోదీ విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం
నరసరావుపేట ఈస్ట్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆందోళన వ్యక్తం చేశారు. అరండల్పేటలోని సీపీఐ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విధానాల కారణంగా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుతూ, సామాన్యునిపై ఆర్థిక భారాలు అధికమవుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ దేశ గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తాకట్టు పెట్టి రష్యా నుంచి ఆయిల్, ఇరాన్ నుంచి గ్యాస్ కొనుగోలు నిలిపి వేశారని విమర్శించారు. 5 రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా దేశంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం దేశ ప్రజలను మోసం చేయటమే అని స్పష్టం చేశారు. ఇందుకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రూపాయి పతనావస్థకు చేరి డాలరు మారకం రూ.96.07కు చేరిందని ఎద్దేవా చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సమ్మేళనం జయప్రదం చేయాలని అక్కినేని వనజ కోరారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు వై.చెంచయ్య, జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, గిరిజన సమాఖ్య నాయకులు శ్రీనునాయక్, రాంబాబునాయక్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ -
రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి
నాదెండ్ల: ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా స్లో అవటంతో వేగంగా వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు.. నూతన బైపాస్ రోడ్డుపై గణపవరం పరిధిలోని హైవే కంట్రోల్ రూమ్ సమీపంలో గుంటూరు నుంచి వినుకొండ వెళ్తున్న లారీని గుంటూరులో పత్తి అన్లోడ్ చేసి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. పత్తి లారీ డ్రైవర్ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరుకు చెందిన మన్నెం సుబ్రహ్మణ్యం(37) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపల పట్టివేతపై రెవెన్యూ విచారణ
బొల్లవరం(ముప్పాళ్ల): ‘మట్టిపై కన్నేస్తే... చేపలు దొరికాయ్..’ అంటూ సాక్షిలో వచ్చిన కథనం పై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. మండలంలోని బొల్లవరం గ్రామ సమీపంలో ఉన్న ఏడు ఎకరాల భూమిలో తవ్విని చెరువులో మట్టి తవ్వకాలు చేసేందుకు గాను నీళ్లు వెళ్లే బెట్టే క్రమంలో దొరికిన చేపల ఆదాయం కోసం టీడీపీ నాయకులు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం బయటకు పొక్కటంతో రెవెన్యూ అధికారులు చెరువు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఫొటోలలో సేకరించారు. అక్కడి వారి నుంచి వివరాలు సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆర్ఐ ఆంజనేయులు, వీఆర్వోలు తెలిపారు. చెరువులో నీటిని బయటకు పంపినట్లుగా గుర్తించామని, పరిశీలించే సమయంలో చిన్నపాటి చేపలు బాక్స్ల్లో ఉండటాన్ని గుర్తించారు. అన్ని పనులు వెంటనే నిలిపివేయాలని, పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతితోనే తదుపరి చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు. అనుమతులు లేకుండా పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నకరికల్లుః ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని త్రిపురాపురం సమీపంలో అద్దంకి– నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు.. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలేనికి చెందిన షేక్ మస్తాన్షరీఫ్(34) ద్విచక్ర వాహనంపై సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి కొండమోడుకు బయలుదేరాడు. మార్గంమధ్యలో మండలంలోని త్రిపురాపురం సమీపంలో హైవే డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డీఎస్ఓ నరసింహారెడ్డి నరసరావుపేట ఈస్ట్: శాప్ ఆధ్వర్యంలో వివిధ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలను ఈనెల 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు వివిధ క్రీడా వేదికలపై నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన తేదీలను శాప్ అధికారులు మార్పు చేసినట్టు వివరించారు. సవరించిన తేదీల మేరకు తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నీస్, కాకినాడలోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 29 నుంచి 30వ తేదీ వరకు వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో, విశాఖపట్నం కొమ్మాది స్టేడియంలో ఈనెల 31, జూన్1వ తేదీ వరకు అథ్లెటిక్స్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తారని వివరించారు. ఆయా పోటీలలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న బాల బాలికలు తప్పని సరిగా తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని కోరారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయని క్రీడాకారులు శాప్ క్రీడా యాప్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
సమగ్ర శిక్ష పోస్టుల భర్తీలో మెరిట్కు ప్రాధాన్యం ఇవ్వాలి
నరసరావుపేట: పల్నాడు జిల్లా విద్యా శాఖలో సమగ్ర శిక్ష విభాగం కింద ఖాళీగా ఉన్న జీసీడీఓ, ఏఎల్ఎస్సీఓ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు మాట్లాడుతూ అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్ జాబితా సిద్ధం చేయడంలో విద్యాశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల ఒకటో తేదీ నాటికే మెరిట్ జాబితా సిద్ధమైనా కొందరు అనర్హులకు డీఆర్పీ శిక్షణ పేరిట అదనపు మార్కులు కేటాయించి జాబితాలో మార్పులు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. -
వేధింపులకు ఉద్యోగి బలి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మర్రిపాలెంలో ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు తిరిగి అన్నవరం సొసైటీకి సీఈవోగా వచ్చాడు. అప్పటి నుంచి సిబ్బందిపై వేధింపులు ప్రారంభించాడు. జీతాలు ఇవ్వకుండా బెదిరించడంతో తట్టుకోలేక ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావుతోపాటు సొసైటీ పీఐసీ నర్రా సురేంద్రబాబుపై కేసు నమోదు అయింది. సొసైటీ ఉద్యోగిని పచ్చవ భవానికి 18 నెలలు జీతం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీనిపై ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణలో అవినీతి వెలుగు చూసింది. -
ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎఫ్ఎన్ఓ, ఎల్జీఎస్ ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్సీ, అర్బన్ పీహెచ్సీల్లో 45 పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేశామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పెదకాకాని: చరిత్ర పుస్తకాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలు తెలుసుకునేందుకు దోహదపడతాయని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వలయంలో శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీంజానీ రచించిన మన కవుల చరిత్ర మొదటి భాగం గ్రంథాన్ని వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 70కి పైగా పుస్తకాలను రచించిన అబ్దుల్ హకీంజానిని అభినందించారు. ఈ సందర్భంగా హకీంజానీ మాట్లాడుతూ 500 పేజీలకు పైగా మన కవుల చరిత్ర రెండవ విభాగం త్వరలో వెలువడుతుందన్నారు. -
బస్సును తప్పించబోయి లారీ బోల్తా
చిలకలూరిపేటటౌన్: బస్సును తప్పించబోయి లారీ బోల్తా పడిన ఘటన మండలంలోని కావూరు ప్రాంతంలో జరిగింది. సేకరించిన వివరాల ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి పొగాకు లోడుతో నరసరావుపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లే దానిని తప్పించబోయి అదుపుతప్పి తమవాహనం బోల్తా పడిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో లారీ పాక్షికంగా ధ్వంసం కాగా, పరిస్థితి గమనించి డ్రైవర్ పక్కకు దూకాడు. లారీ డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాచవరం: ప్రమాదవశాత్తూ నేల బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పిన్నెల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలయ్యపాలెం గ్రామానికి చెందిన కొరడాల విశ్వనాథం (45) రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. కొంతకాలంగా గ్రామాన్ని విడిచి పలు గ్రామాల్లో సంచరిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున గొర్రెల కాపరులు నేల బావిలో మతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని చొక్కా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుని వివరాలు గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే రెండు సంంత్సరాలు కాలపరిమితి గల బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో ప్రవేశానికి ఏపీ పీసెట్–2026 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకూ ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏఎన్యూలో 2026–2027 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి రూ.1000 అపరాధ రుసుంతో 20వ తేదీ వరకూ, రూ.2000 అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసిన వారు తమ తప్పులను 24 నుంచి 26వ తేదీలోగా సరిదిద్దుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 28 నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లోని తేది, సమయం ప్రకారం పరీక్షకు హాజరు కావాలన్నారు. ఏపీ పీసెట్ 2026 దేహదారుఢ్య పరీక్ష, క్రీడానైపుణ్య పరీక్షలు జూన్ 3వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్లో ప్రారంభమవుతాయని తెలిపారు. పూర్తి వివరాలు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, సన్ వ్యవస్ధాపకుడు కె.యశ్వంత్ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న శిక్షణ తరగతుల్లో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఐఏఎస్, సివిల్ సర్వీస్ పరీక్షలపై విద్యార్థి స్థాయి నుంచి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరీక్షల విధానం, సన్నద్ధత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కె.యశ్వంత్ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు 94913 36996, 79895 70755, 93469 84938 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్, సన్ వలంటీర్లు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న దిచక్రవాహనం
ఒకరు మృతి–మరొకరికి గాయాలు వినుకొండ: మండలంలోని చీకటీగలపాలెం సమీపంలో గురువారం రాత్రి జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వినుకొండ పట్టణానికి చెందిన కంభంపాటి కార్తీక్ తన స్నేహితుడు క్రాంతితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చీకటీగలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కార్తీక్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న క్రాంతికి తీవ్రగాయాలు కావడంంతో స్థానికులు వెంటనే స్పందించచి చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ప్రతిభ
మంగళగిరిటౌన్: చైనాలో ఈ నెల 10 నుండి 15వ తేదీ వరకు జరిగిన ఏషియన్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారిణి ప్రతిభ చాటి మెడల్స్ సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కరావు తెలిపారు. మంగళగిరిలోని వారి కార్యాలయం నుంచి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర షానూన్ ఈ పోటీల్లో 47 కేజీల విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. షానూన్ ఉత్తమ ప్రదర్శన చేసి పతకం సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. -
మెట్ల పూజ మార్గంలో జారిపడిన శ్లాబు పెచ్చులు
బాలిక తలకు గాయం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి పాత మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి ఓ బాలిక తలకు గాయమైంది. ఈ ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన పద్మావతి తన కుమార్తె స్నేహతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. పద్మావతి మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి వెళ్తోంది. మహామండపం పక్కనే ఉన్న పాత మెట్ల మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి చేరుకుంటుండగా, మెట్ల మార్గంలోని పాత స్టోర్ రూమ్ సమీపంలో కుళాయి వద్దకు వచ్చేసరికి బాలిక స్నేహ నిల్చున చోట పై నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. ఆ పెచ్చు బాలిక తలపై పడటంతో గాయం అయి తీవ్ర రక్తస్రావం అయింది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఉన్న దేవస్థాన ఆరోగ్య కేంద్రానికి బాలికను తీసుకొచ్చారు. అయితే అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నర్సు వైద్యం అందించింది. గాయం నుంచి రక్తస్రావం తగ్గడంతో వెంటనే దేవస్థాన అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యం చేసిన వైద్యులు ఐదు కుట్లు వేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలయ ఈవో శీనానాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ఇద్దరు వైద్యులను నియమించింది. అయితే శుక్రవారం రద్దీ వేళ ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని భక్తులు ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకెళ్లారు. -
రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్యవినుకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఢిల్లీ తరహాలో ఉధృతమైన పోరాటాలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని అవ్వారు కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరిగే అఖిల భారత కిసాన్ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అమెరికా ఆంక్షలకు లొంగి దేశీయ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పత్తి, మొక్కజొన్న రైతులు దళారుల చేతిలో మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు భూములు కట్టబెట్టడం ఆపాలని, మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో పల్నాడు జిల్లా రైతు సంఘం నాయకులు ఏపూరి గోపాలరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్కుమార్, జిల్లా కార్యదర్శి ఆంజనేయులునాయక్, వై.రాధాకృష్ణ, ఎల్ఐసీ యూనియన్ నాయకులు బొంకూరి వెంకటేశ్వర్లు, ఏజీపీ జ్ఞానేశ్వరరావు, న్యాయవాది రామకోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు సురేష్ రాజా, ముని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
ఏపీఎఫ్డీసీ ఎండీ కేఎస్ విశ్వనాథన్తెనాలి: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ చెప్పారు. స్థానిక అంబేడ్కర్ జూనియర్ కాలేజ్లో మా–ఏపీ నిర్వహిస్తున్న మూడు రోజుల ఉచిత సినీనటన శిక్షణ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం రూ.నాలుగు కోట్ల లోపు చిత్రీకరించిన 15 చిన్న బడ్జెట్ సినిమాలకు సబ్సిడీ రూ.10 లక్షల చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సినిమా నటనపై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ ప్రాంతాల ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న మా ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజాను అభినందించారు. ఆంధ్రాలో సినిమాలు చిత్రికరించే నిర్మాతలకు ప్రభుత్వం మౌలిక సదుపాయలను కల్పించడానికి టూరిజం శాఖ సమన్వయంతో కార్యాచరణను సిద్ధం చేసిందని విశ్వనాథన్ వివరించారు. దీనికోసం మా–ఏపీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. శిక్షణ తరగతుల నిర్వాహకుడు, దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ సినిమాలో నటించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణలో ప్రాథమిక అంశాలను బోధిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ఇస్తామని చెప్పారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి డి.మధుబాబు, తూటా రామకృష్ణ, మధుమతి, కెమెరా హరి శ్రీనివాస్, మహిళా దర్శకురాలు నాగశ్రీ, జాలా రాజ కుమారి, స్టైల్ రవి, రమేష్ పాల్గొన్నారు. -
దివ్యాంగులపై దాడులతో టీడీపీ అరాచకం
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డినరసరావుపేట: అభివృద్ధిలో పోటీపడలేని టీడీపీ నాయకులు అమాయకులైన దివ్యాంగులపైనా దాడులు చేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుడు సైదారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గురజాల నియోజకవర్గంలోని తాళ్లచెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు సైదారెడ్డి బతుకుదెరువు కోసం గ్రామంలో చిన్న బడ్డీ బంకు పెట్టుకొని 30 ఏళ్లుగా తన కుటుంబాన్ని పోషించుకుంటుండగా టీడీపీ నాయకులు ఆ బడ్డీ బంకుతోపాటు మరో దివ్యాంగురాలు జాన్బీ షాపును సైతం ధ్వంసం చేశారన్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా, రోడ్ల బాగోగులు పట్టించుకోని వారు అమాయకులైన దివ్యాంగులు సైదారెడ్డి, జాన్బీలపై దాడిచేయటం దుర్మార్గం అన్నారు. వారి కుటుంబాలకు ఆధారమైన కొట్టును ధ్వంసం చేసిన వారికి బుద్దీ, జ్ఞానం ఉండాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండుమూడురోజుల వ్యవధిలోనే తన నియోజకవర్గంలో మొదటిగా వారికే న్యాయం చేస్తామన్నారు. చేతనైతే తమతో అభివృద్ధిలో పోటీ పడాలని టీడీపీ నాయకులకు సూచించారు. తాము రెండు, మూడు కోట్ల రూపాయలతో రోడ్లు వేసి ఇళ్ల పట్టాలు అందజేశామని, సచివాలయాలు కట్టామని, తాగునీటి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. చేతనైతే వాటిని పూర్తిచేయాలని టీడీపీ నాయకులకు సూచించారు. -
మట్టిపై కన్నేస్తే.. చేపలు దొరికాయ్..
బొల్లవరం(ముప్పాళ్ల): మట్టిపై కన్నేసిన అక్రమ దారులకు ఏకంగా లక్షల రూపాయల విలువ చేసే చేపలు దొరికాయి. వాటాలు పంచుకునే విషయంలో టీడీపీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సంఘటన మండలంలోని చాగంటివారిపాలెం రెవెన్యూ పరిధిలోని బొల్లవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొల్లవరం గ్రామానికి సమీపంలో ఏడు ఎకరాల భూమిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు చేపల చెరువును తవ్వించేందుకు శ్రీకారం చుట్టి పనులు చేపట్టారు. పనుల్లో భాగంగా కొంత మట్టిని అమ్ముకోగా, మరికొంత మట్టిని కట్టలు వేయించారు. తర్వాత ఎన్నికలు రావటంతో చెరువు పనులు నిలిచిపోయాయి. వర్షాలకు, కాల్వల ద్వారా తవ్విన చెరువులోకి నీరు చేరింది. కాల్వల ద్వారా వచ్చిన చేపలు చెరువులో ఉండటంతో పెరిగి పెద్దయ్యాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మట్టిని అమ్ముకునేందుకు గాను ఇంజిన్లతో నీటిని వెల్లబెట్టే ప్రయత్నం చేస్తుండగా లక్షల విలువ చేసే చేపలు బయటపడ్డాయి. ఒక్కో చేప మూడు నుంచి నాలుగు కేజీల వరకు కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. చెరువులో లభించిన చేపల విలువ సుమారు రూ. 2 నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మట్టికోసం వస్తే చేపలు దొరకడంతో అక్రమార్కుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న కూటమిలోని మరో వర్గం చేపల ఆదాయంలో మాకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంది. ఇరు వర్గాల వారు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఈ విషయం నియోజకవర్గ నేత వద్దే తేల్చుకుంటామని ఎవరికి వారే భీిష్మించుకుంటున్నారు. -
నైపుణ్యాలే యువత భవితను నిర్ణయిస్తాయి
మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరలో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, శాసనసభ్యులు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్లతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో సంవత్సరానికి సుమారు 6,500 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉందన్నారు. దీనిని అదనంగా 9 వేల మేర పెంచి మొత్తం 17 వేల మందికి శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణ కేంద్రాల కొరతను అధిగమించేందుకు మూతపడిన ఇంజినీరింగ్ కళాశాలలను వినియోగంలోకి తీసుకురావడంపై చర్చిస్తున్నామని చెప్పారు. తెనాలి బుర్రిపాలెంలో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత ఉద్యోగం వచ్చిన వెంటనే కనీసం 20 శాతం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. కనీసం ఆరు నెలల జీతానికి సమానమైన ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని తెలిపారు. తక్కువ ఖర్చుతో లభించే ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత పథకాలపై కూడా యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా పరిశ్రమల అధికారి జయలక్ష్మి, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ సందీప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహేంద్ర పాల్ రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రజలపై ఇంధన భారం
సత్తెనపల్లి: పేద, సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. యుద్ధం బూచిగా ఇంధన ధరలు పెంచడంతోపాటు జేబులు గుల్లవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి వంటింటి బడ్జెట్ తలకిందులైంది. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో ఆ ప్రభావంతో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ. 3 చొప్పున పెంచేసింది. ఖర్చుల భారం కన్నీళ్లు పెట్టిస్తున్నా చంద్రబాబు సర్కారు ధరల నియంత్రణకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాలకుల తీరుపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. నిత్యావసర సరుకులదీ అదే దారినూనెలు సలసల కాగుతున్నాయి. పామాయిల్ కిలో రూ. 110 నుంచి రూ. 130కి పెరిగింది. సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 155 నుంచి రూ. 174, రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 130 నుంచి రూ.160కి చేరింది. కిలో కందిపప్పు రూ.100 నుంచి రూ.120, పెసరపప్పు రూ.90 నుంచి రూ.120, మినపగుళ్లు రూ.105 నుంచి రూ.120, పంచదార రూ.42 నుంచి రూ.46, వెల్లుల్లి రూ.160 నుంచి రూ.220కి పెరిగింది. రెండు నెలల వ్యవధిలో అన్ని రకాల సరకుల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. దీనికి తోడు చికెన్ ధర కిలో ఏకంగా గడిచిన కొన్ని వారాల్లో రూ. 250 నుంచి రూ. 324కు పెరిగింది. పాల ప్యాకెట్లు, పెరుగు, మజ్జిగపైనా ఆయా కంపెనీలు రూ.ఒకటి – రూ.రెండు వరకు పెంచేశాయి. ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో ఆ భారం ఇంకా ఎక్కువగా ప్రజలపై పడనుంది. -
గర్భిణుల సహనానికే పరీక్ష
కడుపులో బిడ్డ కదలాడుతుంటే తల్లి గుండెల్లో ఆనందం ఉరకలేస్తుంది. నెలలు నిండేకొద్దీ పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నామనే భావన మాతృత్వపు మాధుర్యాన్ని గుర్తు చేస్తుంటుంది. కోటి ఆనందాలతో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన నిండు చూలాలి సహనానికి ప్రతిక్షణం పరీక్షగా పరిస్థితి ఉంది. కొద్దిసేపు నడిస్తేనే అలసటతో కూలబడే గర్భిణులకు మూడు అంతస్తులో పరీక్షలకు వెళ్లాలంటే ఎంతో కష్టంగా మారింది. నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలోని ఈ దుస్థితి చంద్రబాబు సర్కారు నిర్వాకానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.నరసరావుపేట టౌన్్: తల్లి కాబోతున్నామనే ఆనందం కన్నా ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం పడుతున్న అవస్థలే గర్భిణులను ఎక్కువగా వేధిస్తున్నాయి. వైద్యశాల మారినా తిప్పలు తప్పటం లేదు. పల్నాడు బస్టాండ్లోని పాత ఏరియా వైద్యశాలలో కొనసాగుతున్న గైనిక్ విభాగాన్ని లింగంగుంట్లలో నిర్మించిన 200 పడకల వైద్యశాల నూతన భవనంలోకి ఇటీవల మార్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సేవల్లో జాప్యం చోటుచేసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న జనరల్ వార్డును ఆధునికీకరించి అందులో గైనిక్ విభాగాన్ని 15 రోజుల క్రితం నూతనంగా ఏర్పాటు చేశారు. వైద్యశాల మారింది గానీ సమస్యలు మాత్రం అదే రీతిలో ఉన్నాయి. పాత ఏరియా వైద్యశాలలో రక్తపరీక్షల కోసం గర్భిణులు మొదటి అంతస్తు ఎక్కలేక నానా అవస్థలు పడేవారు. షిఫ్ట్ చేసిన నూతన వైద్యశాలలోనైనా మెరుగైన సేవలు అందుతాయని భావించారు. ఇక్కడ కూడా రక్తపరీక్షల కోసం మూడు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి రావటంతో నానా అగచాట్లు పడుతున్నారు. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే రీతిలో వారి కష్టాలు ఉన్నాయి. రోజూ గైనిక్ విభాగానికి 400 మంది గర్భిణులు సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వస్తుంటారు. అందులో 150 మంది వరకు ప్రతి రోజు రక్త పరీక్షలు అవసరం అవుతుంటాయి. సోమ, శుక్రవారాల్లో మరో 50 మందికి అదనంగా మూత్ర, రక్త పరీక్షల కోసం వస్తుంటారు. లిఫ్ట్ ఉన్నప్పటికీ తరుచూ సాంకేతిక లోపం కారణంగా పనిచేయటం లేదు. కొన్ని సమయాల్లో విద్యుత్ కోత కూడా ఉంటోంది. నిండు గర్భిణులు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రక్తపరీక్షల కేంద్రం వద్ద రద్దీ ఉండటంతో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది. కూర్చునేందుకు సరిపడ కుర్చీలు లేకపోవటంతో సొమ్మసిల్లుతున్నారు. తాగునీటికీ అవస్థలు ఏరియా వైద్యశాలలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. దాహర్తికి రోగులు, వారి సహాయకులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా క్యూలైనులో గంటలకొద్దీ నిలబడి దాహార్తికి సొమ్మసిల్లి పడిపోతున్నారు. మోటార్ మరమ్మతుల కారణంగా గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రోగుల అవసరానికి సరిపడా నీరు అందుబాటులో లేకపోవటంతో వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారు. రోగులు తల్లడిల్లిపోతున్నా సమస్య పరిష్కారానికి అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని రోగులు మండిపడుతున్నారు. -
జిల్లా స్విమ్మింగ్ జట్టు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసుబ్బరాయ అండ్నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో జిల్లా సీనియర్ స్విమ్మింగ్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలో 20 మంది స్విమ్మర్లు పాల్గొనగా వారిలో 8 మందిని వివిధ కేటగిరిలలో జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈనెల 24వ తేదీన కర్నూలులోని డిఎస్ఏ స్టేడియం స్విమ్మింగ్ పూల్లో నిర్వహించనున్న 12వ సీనియర్ అంతర్ జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామలింగారెడ్డి, కోచ్ జి.సురేష్ అభినందించారు. -
గుంటూరు జిల్లా జైలులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా కారాగారంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. డెస్క్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ వల్ల ఖైదీలకు, వారి బంధువులకు ఉన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు. ఖైదీలు, వారి బంధువులు హెల్ప్ డెస్క్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్, స్టాఫ్, డెప్యూటీ లీగల్ ఎయిడ్ డెఫన్స్ కౌన్సెల్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు మహిళా ప్రాంగణంలోని శిశు గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న పిల్లలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపురంలోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలకు సురక్షితమైన బాల్యం, భవిష్యత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు. వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ జీవన్ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించేలా కృత్రిమ మేధపై ఆవిష్కరణలు ఉండాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు. చిన్న, సన్నకారు, కౌలు రైతుల జీవితాలలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, సుస్థిరంగా మార్చే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యాన నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంనందున్న సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయంలో కృతిమ మేధస్సుపై వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయం పూర్తిగా డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థల వైపు పయనిస్తుందని చెప్పారు. ఈ డేటా కచ్చితత్వం రైతు సేవ కేంద్రాలలో లభ్యమయ్యేలా చూడాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐకార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ లీడర్ డాక్టర్ రవినారాయణసాహూ, సీఆర్ఐడీఏ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీఎం సుబ్బారావు వ్యవసాయ, అనువర్తనాలు విభాగంలో గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వీఎం చౌదరి, ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన డాక్టర్ రాజేంద్ర మాచవరం మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సెక్రటరీగా డాక్టర్ మణి వ్యవహరించారు. నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.త్రిపాఠి, హైదరాబాద్ అటారీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ మీరా, డాక్టర్ ఎంవీ రమణ, యూనివర్సిటీ అధికారులు, వివిధ పరిశోధన సంస్థలు, స్టార్టప్ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): పరిశ్రమల రక్షణలో శిక్షణ పొందిన సేఫ్టీ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ (4 సంవత్సరాలు), 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్న్ను శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పి. బ్రహ్మాజీరావు, హెడ్ ఆప్ ది ఫైర్ అండ్ సేప్టీ విభాగం అరుణ్కుమార్ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
డయేరియా కలకలం
చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో కొత్తరెడ్డిపాలెం దళితవాడలో శుక్రవారం సుమారు వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావటంతో స్థానికంగా కలకలం రేగింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడ ప్రాంతంలో గత మూడు రోజులుగా ప్రార్థన కూటములు జరిగాయి. హాజరైన భక్తులకు మొదటి రెండు రోజులు శాకాహార భోజనం అందించారు. చివరి రోజు గురువారం రాత్రి చికెన్ బిర్యానీని అందజేశారు. బిర్యానీ తిన్న కొంతమంది అస్వస్థతకు గురవటంతో శుక్రవారం తెల్లవారుజామున రాజేష్, వజ్రం, జయరాణిలను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ప్రైవేటు వైద్యుని వద్ద మరి కొంతమంది చికిత్సలు పొందారు. ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది. ప్రత్యేక వైద్య శిబిరం స్థానిక తెలుగు బాపిస్టు చర్చిలో అత్యవసరంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో వచ్చారు. కుర్చీలలో, బల్లల మీద కూర్చోబెట్టి సైలెన్ ఎక్కించారు. తర్వాత సమీపంలోని పీహెచ్సీ నుంచి బెడ్లను తెప్పించి బాధితులకు సైలెన్ సీసాలు పెట్టారు. వైద్య చికిత్సలు మొదలు పెట్టారు. నీరసంగా ఉన్న మరో నలుగురిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు, వట్టిచెరుకూరు ప్రాంతాల నుంచి రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు. అధ్వానంగా పారిశుద్ధ్యం దళితవాడ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఎక్కడ మురుగు అక్కడే, చెత్తా చెదారం నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వస్తున్నారనే సమాచారంతో పంచాయతీ సిబ్బంది హడావుడిగా చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో పడ్డారు. రోజూ తమ ప్రాంతానికి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రావటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్య సేవలకు ఆదేశం బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పరిస్థితిని సమీక్షించారు. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మూడు రోజుల పాటు ప్రార్థన కూటమి జరిగిందని, అక్కడ బిర్యానీ తిన్న తర్వాత గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైనట్లు బాధితులు వివరించారు. వైద్య సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించటంతోపాటు అనుమానితులందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాధితులకు మంచి ఆహారం అందజేయాలన్నారు. బెడ్లు, పరుపులు, కూలర్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారిని ఆదేశించారు. ప్రస్తుతం 44 మంది అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్కు అధికారులు వివరించారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ గ్రామంలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని డీపీవో సాయికుమార్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నీటి నమూనాలు సేకరించి నివేదికను అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి ఆదేశాలు జారీ చేశారు. ప్రార్థన కూటమి నిర్వహించిన సంఘ పెద్దతో కలెక్టర్ మాట్లాడారు. చికెన్ ఎక్కడ కొనుగోలు చేశారు.. ఎన్ని గంటలకు తయారు చేసి, ఎప్పుడు భోజనాలు పెట్టారు.. వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. యడ్లపాటినగర్లోని షాపులో చికెన్ కొనుగోలు చేసినట్లు తెలపటంతో షాపులో తనిఖీ చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దారు కె. శ్రీనివాసవర్మ, ఎంపీడీవో ఊహారాణి తదితరులు పాల్గొన్నారు. అదుపులోనే పరిస్థితి గుంటూరు వెస్ట్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 11, 12, 13 తేదీల్లో బాప్టిస్ట్ ప్రేయర్ హాలులో ప్రార్థన కూటములు జరిగాయన్నారు. 13వ తేదీ రాత్రి దాటిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారని, అక్కడికి రాని వారి ఇంటికి ఆహారాన్ని పంపించినట్లు తెలిసిందన్నారు. 14న ఉదయం, కొంత మంది మధ్యాహ్నం కూడా తిన్నారని తెలిపారు. దాదాపు 100 మంది భోజనం చేయగా 44 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. నలుగురి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. ముందు రోజు నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు పదుల సంఖ్యలో వచ్చినప్పటికీ వైద్యసిబ్బంది స్పందించికపోవటంతో బాధితుల సంఖ్య అధికమైంది. తెనాలి, గుంటూరు వైద్యశాలలకు బాధితులు వెళ్లటంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. డీఎంహెచ్వో కె.విజయలక్ష్మి, తెనాలి డిప్యూటీ డీఎంహెచ్వో అన్నపూర్ణమ్మలు మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వ,చ్చారు. ఇంటింటికీ తిరిగి పరిస్థితిని అంచనా వేశారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధితుల సంఖ్యను గుర్తించే పని చేపట్టారు. గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో 38 డయేరియా కేసుల నమోదుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం అధికారులతో చర్చించారు. కలుషిత ఆహారం కారణంగా ఈ కేసులు నమోదైనట్లు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి వివరించారు. ముగ్గురిని చేబ్రోలు పీహెచ్సీకి తరలించి, అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. -
సేవల్లోనూ తీవ్ర జాప్యం
గర్భిణులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రక్త, మూత్ర పరీక్షల కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక కొన్నేళ్లుగా ఇక్కట్లకు గురవుతున్నారు. వస్తున్న వారికి సరిపడా సిబ్బంది లేకపోవటంతో పరీక్షల ప్రక్రియ నత్తనడకగా సాగుతోంది. సిబ్బందిని పెంచాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. పరీక్షల కోసం గంటల సమయం పడుతోంది. రిపోర్టులు చేతికి అందటానికి అదనంగా మరో రెండు గంటలు వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. ఉదయం పరీక్షలు చేయించిన వారికి మధ్యాహ్నం రిపోర్టులు అందుతున్నాయి. మధ్యాహ్నం పరీక్షలు చేయించిన వారికి సాయంత్రం లేకుంటే రెండవ రోజు రిపోర్టులు ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక రోజు వృథా అవుతోంది. దీనికి తోడు విద్యుత్ అంతరాయంతో ఉక్కపోతకు గురై గర్భిణులు అల్లాడుతున్నారు. -
ప్రాధాన్యత రంగాలకు మరిన్ని రుణాలు
నరసరావుపేట: ప్రాధాన్యత రంగాలకు, కౌలు రైతులకు 2026–27 మార్చి 31 నాటికి సకాలంలో రుణాలు అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బ్యాంకులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా డీసీసీడీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. గత ఏడాది బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రొఫైల్ను ఆర్బీఏ ఎల్డీఎం ఎ.రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం జి.శరత్లు జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఎంపీ లావు మాట్లాడుతూ రుణాలు విరివిగా ఇచ్చి పేదల అభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమలకు నిర్దేశిత రుణాలను ఇవ్వకపోవడంపై బ్యాంకుల నుంచి సమాధానం కోరారు. ఆర్బీఐ మేనేజర్ ఆర్.రవీంద్రబాబు జిల్లాలోని ప్రజలందరికీ లక్ష్యాల మేరకు రుణాలను అందించాలని కోరారు. ఆర్బీఐ అధికారి కిరణ్కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రైల్వేలైను నిర్మాణంపై దృష్టి పల్నాడు జిల్లాలో రైల్వేలైను నిర్మించడానికి 15 రోజుల్లో అన్ని శాఖల ఇంజినీర్లు అప్రూవల్స్, డీపీఆర్ మూడు రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలకు అందజేయాలని, వారంతా ఫీల్డ్కి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి, రైల్వేవారికి తగిన సహాయ సహకారాలు అందజేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రైల్వేశాఖ గతిశక్తి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ పీవీ.నాయుడు, రైల్వే కన్సల్టెన్సీ సయ్యద్ చాన్బాషా, రెవెన్యూ, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్ సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై అధికారులకు కొన్ని సూచనలు చేశారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ డీపీఆర్లు పూర్తిచేసి అప్రూవల్స్ వచ్చే విధంగా రైల్వే శాఖకు సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించారు. మూడు రెవెన్యూ డివిజన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు రపాల్గొన్నారు. -
శుభకార్యంలో నగలు, నగదు చోరీ
● పారిపోతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన నిందితుడు ● గాయపడటంతో బయటపడిన అసలు విషయం వినుకొండ: ఓ యువకుడు బుధవారం రాత్రి త్రిపురాంతకంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తన చేతివాటం ప్రదర్శించాడు. రూ. 4 లక్షల నగదు, బంగారంతో స్కూటీపై పరారయ్యాడు. కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అసలు విషయం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం, చింతలచెరువు రైల్వే బ్రిడ్జి సమీపంలో తన ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. అతని ముఖానికి, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ దారిన వెళ్లే వారు వెంటనే 108 కి సమాచారం అందించారు. సిబ్బంది మహబూబ్ బాషా, నరేష్బాబులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. ఇలా తెలిసింది... తన పేరు యెహోషువా అని, తమది కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామమని, తాము చాలా కాలం క్రితం విజయవాడ వెళ్లి స్థిరపడ్డామని 108 సిబ్బందికి క్షతగాత్రుడు సమాచారం ఇచ్చాడు. తాను బంధువుల ఇంట్లో శుభకార్యానికి త్రిపురాంతకం వెళ్లొస్తున్నట్లు తెలిపాడు. కాటంవారి పల్లె గ్రామ చరిత్రలో ఆ పేరుగల కుటుంబం లేదని స్థానికులు తెలిపారు. అయితే క్షతగాత్రుడు కావాలని తమ వివరాలు చెప్పకుండా దాటవేసినట్లు 108 సిబ్బందికి అర్థమైంది. క్షతగాత్రుడి వద్ద ఫోనులో నంబరు తీసి అతని భార్యకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. తన భర్త రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకుని ఉడాయించాడని, బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుండం వాటిని తెచ్చాడని భార్య తెలిపింది. త్రిపురాంతకం నుంచి ఉడాయించగానే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయటంతో ఫోన్ నంబరు సిగ్నల్ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది వెంటనే ద్విచక్ర వాహనం, నగదు, ఆభరణాలను పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం వినుకొండలోని వైద్యశాలకు తరలించారు. -
అక్రమ వసూళ్లను నిరసిస్తూ రైతుల ఆందోళన
నాదెండ్ల: మైనింగ్ శాఖకు చెందిన ఏఎంఆర్ కంపెనీ చెక్పోస్టు సిబ్బంది రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. సాతులూరు వద్ద గుంటూరు–కర్నూలు రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని చందవరం సెంటర్లో ఉన్న ఏఎంఆర్ కంపెనీ చెక్పోస్టు సిబ్బంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లను వేధిస్తున్నారని విమర్శించారు. రైతులు తమ పొలాల్లో మెరక మట్టిని తోలుకుంటున్నారని, ట్రాక్టర్కు రూ.500 చెల్లించాలంటూ రైతులపై ఏఎంఆర్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. గ్రామంలోని ఓ మహిళ తన పొలంలోని మెరక మట్టిని ట్రాక్టర్లలో ఇతర పొలాలకు తోలించిందని, అందుకు ఏఎంఆర్ సిబ్బంది అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఒక్కో ట్రాక్టర్కు రూ.500 చెల్లించాల్సిందేనంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. డబ్బులు చెల్లించకుంటే కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్ సంస్ధ నుండి రైతులను కాపాడాలని, ఈ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుని చెక్పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల ఆందోళనతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె నిరంజన్, నరసరావుపేట రూరల్ సీఐ సుబ్బరావు, నాదెండ్ల, నరసరావుపేట రూరల్ ఎస్సైలు ఆర్ వెంకటేశ్వరరావు, కిశోర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏఎంఆర్ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. -
బైకును కళాశాల బస్సు ఢీకొని ఇద్దరు మృతి
నాదెండ్ల: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సాతులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు టైరు పేలి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన వేమూరి అశోక్ (35) వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. ఇదే గ్రామానికి చెందిన జమ్ముల సీతారామయ్య (22) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై నరసరావుపేటలోని ఓ హోటల్ నుంచి పార్శిల్ తీసుకుని పొనుగుపాడుకు బయలుదేరారు. సాతులూరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు రాగానే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల బస్సు టైరు పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఒకరు బస్సు టైరు కింద పడి మృతి చెందగా, మరొకరిని బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె. నిరంజన్, ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పారిపోయాడు. బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉచితమే.. లేనిది బస్సే!
పల్నాడుశుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026 చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ప్రయాణికులకు తీవ్ర కష్టాలు 7సాక్షి, నరసరావుపేట: బస్సులలో ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం కారణంగా బస్సు ఎక్కే సమయంలోనే తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వినుకొండ బస్టాండ్లో గత కొంతకాలంగా మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బస్సు వెనక్కి తీసుకుంటుండగా ఒకసారి, గ్యారేజ్ నుంచి వస్తున్న బస్సును గేటు వద్దే ఎక్కే ప్రయత్నంలో రెండోసారి నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాజాగా బుధవారం పిడుగురాళ్ల వెళ్లే బస్సు ఎక్కే సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. వేల్పూరుకు చెందిన మోక్షజ్ఞ అనే బాలిక టైర్ కింద పడి కాలికి గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలకు కారణం ఈ పథకానికి అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో ఉంచకపోవడమేనని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పథకం అమలు చేసే ముందు కొత్త బస్సులను కొనుగోలు చేసి వాటి సంఖ్య పెంచుతామన్న చంద్రబాబు ప్రభుత్వం... ఆ దిశగా కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ఆర్టీసీ బస్టాండుల వద్ద ఉచిత బస్సు ఎక్కాలంటే యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. బస్సు రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు గుమిగూడి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొన్నిసార్లు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరుగుతోంది. పథకం అమలు తరువాత పెరిగిన అక్యూపెన్సీ ప్రకారం బస్సులను పెంచడం, అన్ని సర్వీసులకు ఉచితం అమలు చేయకపోవడమే వీటన్నింటికి కారణం. తెనాలి: స్థానిక మార్కెట్యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5200, మోడల్ ధర రూ.4000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి ఉండవల్లికి చెందిన కొండా బాలప్రదీప్, విజయశాంతి దంపతులు రూ.1,00,116 విరాళమిచ్చారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా మహిళలతోపాటు సాధారణ ప్రయాణికులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. సరిపడా సర్వీసులు లేక గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు రావడం లేదు. వచ్చిన వాటిలో ఎక్కడానికి కూడా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. సీట్ల కోసం పాట్లు తప్పడంలేదు. మిగిలిన వారు కాలు పెట్టాలన్నా పరిస్థితి కష్టంగా మారుతోంది. సరిపడా బస్సులు లేకపోవడంతో సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
చిరు వ్యాపారులపై టీడీపీ ప్రతాపం
పిడుగురాళ్ల రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టడం సాధారణమైపోయింది. వారు ఆర్థికంగా నిలబడకుండా చేయటం, వ్యాపారాలను దెబ్బతీయడం పాలకులు, తెలుగుదేశం నాయకులకు లక్ష్యంగా మారింది. అభివృద్ది చేస్తామని అధికారంలోకి వచ్చి పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్న దివ్యాంగులపై ప్రతాపం చూపుతున్నారు. 35 ఏళ్ల నుంచి డ్రైనేజీపై చిరువ్యాపారం చేసే దివ్యాంగులపైకి యంత్రాలను తీసుకొచ్చి మరీ దుకాణాలను తొలగింపజేశారు. మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో అధికార పార్టీ నాయకులు తమ దుర్బుద్ధిని మరోసారి చాటుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయటం, వారి సానుభూతిపరుల వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆధారం కోల్పోయిన కుటుంబాలు గ్రామంలోని షేక్ జానీబీ దివ్యాంగురాలు. భర్త కూడా లేరు. 30 సంవత్సరాల నుంచి బొడ్డురాయి సెంటర్లో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఆమెకు ఒక కుమార్తె. ఈ కొట్టు మీద వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పమ్మి సైదారెడ్డి చిన్నతనంలో పోలియో బారిన పడ్డారు. 35 సంవత్సరాల నుంచి బొడ్డురాయి సెంటర్లో డ్రైనేజీపై చిన్న కొట్టు ఏర్పాటు చేసుకొని గతంలో ఎస్టీడీ బూత్ నడిపారు. అనంతరం చిరుతిళ్ల దుకాణం పెట్టుకుస్తున్నారు. బొడ్డురాయి సెంటర్ తుమ్మలచెరువు గ్రామంలో ప్రజలందరికీ తెలిసిన ప్రదేశమని, ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ బొమ్మను ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు భావించి ఇలా వైఎస్సార్సీపీ సానుభూతి పరులను పంపిస్తున్నారని సమాచారం. తమ కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పినా టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగి యంత్రాలతో కొట్లనుతొలగించేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న దుకాణాల తొలగింపు -
ఇజ్రాయిల్లో ఉద్యోగ అవకాశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: యువతకు ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి అధికారి ఎం.క్రిస్టీ అభినవ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వివిధ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హోం బేస్డ్ కేర్ గివర్ ఇన్ ఇజ్రాయెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. 25 నుంచి 45 ఏళ్ల వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు ఈ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగి, ఆంగ్ల భాషా నైపుణ్యంతోపాటు సీఈఎఫ్ఆర్ బీ2 గల అభ్యర్థులు అర్హులన్నారు. రెండేళ్లకు కాంట్రాక్ట్ ఒప్పందం ఉంటుందని, నెలకు దాదాపు రూ.1,99,770 వేతనం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు రూ.2.10 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందని, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు శుక్రవారం లోపు https:// nai punyam. ap. gov. in/ user& registration? page= program& registration సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తును https:// skillinternational@apssdc. in సైట్కు సైతం పంపించాలని చెప్పారు. వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
విద్యార్థులు విజయాల వైపు సాగాలి
మంగళగిరి టౌన్: విద్యార్థులు ఉన్నత స్థానం నుంచి అద్భుత విజయాలవైపు ప్రయాణం సాగించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సీకే కన్వెన్షన్లో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్లతో కలసి పెమ్మసాని కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో అత్యధికంగా బాపట్లలోని కొల్లూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి దివ్యతేజశ్రీ 596 మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి తెలిపారు. 65 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున అందజేశారు. అనంతరం గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా జిల్లాలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఆయా ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని -
రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం
ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ నాదెండ్ల: రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమం చేపట్టిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అన్నారు. నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో గురువారం జరిగిన గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతుల నుంచి 11 అర్జీలు అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఫిర్యాదులను పారదర్శకంగా వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కె బాలకృష్ణ, జిల్లా సర్వేయర్ భానుకీర్తి, తహసీల్దార్ కుటుంబరావు, మండల సర్వేయర్ రాంబాబు, వీఆర్వో రాధాకృష్ణ, గ్రామ సర్వేయర్ కల్యాణ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భూసారాన్ని కాపాడితేనే రైతుకు లాభం కొరిటెపాడు(గుంటూరు): అధిక దిగుబడుల మోజులో రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడితే భూమి సారం కోల్పోతుందని, రైతులు పచ్చిరొట్ట పైర్ల సాగు వైపు మళ్లాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆధునిక వ్యవసాయం రైతుకు లాభాలు తెచ్చినా, అధిక దిగుబడుల లక్ష్యంగా రసాయన వినియోగం భూమిలో చౌడు పెరుగుతోందని, నీటిని నిల్వ చేసుకునే సామర్ాధ్యన్ని సాగుభూమి క్రమంగా కోల్పోతుందని తెలిపారు. భూసారాన్ని పరిరక్షించేందుకు జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలని సూచించారు. పచ్చిరొట్ట పైర్లను 40 నుంచి 50 రోజుల వరకు సాగు చేసి 50 శాతం పూత దశలో భూమిలో కలియదున్నాలని సూచించారు. దీంతో భూమిలోని పోషకాలు అందుబాటులోకి వస్తాయని, సూక్ష్మజీవుల వృద్ధి పెరిగి నేల గుల్లబారి గాలి, నీటి ప్రసరణ మెరుగుపడుతుందని వివరించారు. పచ్చిరొట్ట పైర్లను వేసి సాగు చేసిన పంటల్లో నాణ్యత పెరగడమే కాకుండా 15 నుంచి 20 శాతం అదనపు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. భూసార పరిరక్షణలో రైతులుభాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు మెడికల్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గురువారం విడుదల చేసినట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును cfw. ap. nic. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన... పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో పలు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి గురువారం గుంటూరు వైద్య కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లు పరిశీలించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో 23 రకాల పోస్టులకు 206 మంది అభ్యర్థులను మెరిట్ ద్వారా ఎంపిక చేశారు. వీరిని కౌన్సెలింగ్కు పిలవగా, 36 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరైన అభ్యర్థుల పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇతర అభ్యర్థులతో కలెక్టర్ ఆదేశాల మేరకు భర్తీ చేస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. అభ్యర్థులకు శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. నర్సింగ్ కళాశాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లు మంజూరు.. గోరంట్లలోని ప్రభుత్వ నర్సింగ్కళాశాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లు మంజూరు చేస్తూ హెల్త్ సెక్రటరీ సౌరబ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ సర్వీస్ కోటాలో పది ఎమ్మెస్సీ నర్సింగ్సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ సెట్లో చలపతి ఫార్మసీ విద్యార్థికి రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఫార్మశీ కళాశాల విద్యార్థులు పీజీ సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి విశేష ప్రతిభ కనబరచి సంస్థకు గర్వకారణంగా నిలిచారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ సెట్ పరీక్ష ఏప్రిల్ 28వ తేదీన జరిగిందని తెలిపారు. పీజీ సెట్లో తమ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించడం సంస్థలో అందిస్తున్న నాణ్యమైన బోధన విధానం, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, అధ్యాపకుల అంకితభావం విద్యార్థుల కృషికి నిదర్శనమన్నారు. పరీక్షలో తమ కళాశాల విద్యార్థి బల్లా వెంకటజస్వంత్ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించి సంస్థకు విశిష్ట గౌరవాన్ని తీసుకువచ్చాడన్నారు. ఈ పరీక్షకు మొత్తం 42 మంది విద్యార్థులు హాజరుకాగా 42 మంది ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించారన్నారు. ఇలాగే మరెన్నో విజయాలు సాధిస్తూ సంస్థ ప్రతిష్టను మరింతగా పెంచాలని సంస్థ చైర్మన్ వై.వి.ఆంజనేయులు ఆకాంక్షించారన్నారు. -
యువకుడి హత్యకు యత్నం
సత్తెనపల్లి: హత్యాయత్నానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి చేసిన సంఘటన పట్టణంలోని వడ్డవల్లి చెక్క వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వడవల్లి చెక్కవంతెన ఏరియాకు చెందిన నల్లబోతుల నాగరాజు, భార్య భవానీ హోటళ్లలో కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా భవానీ ఆరు నెలల నుంచి పట్టణంలోని అచ్చంపేట రోడ్లో గల శివాలయం సమీపంలో నివాసముండే పమిడిగుంట్ల మహేష్ను రహస్యంగా కలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన భార్య భవానీని ప్రశ్నించడంతో మహేష్తో ఉన్న వివాహేతర సంబంధం అంగీకరించింది. నాగరాజు, తన కుటుంబ సభ్యులు చెప్పినా భవానీ ఖాతరు చేయకుండా మహేష్తో తిరుగుతుంది. నాగరాజు ప్రశ్నిస్తున్న విషయాన్ని మహేష్కు భవానీ చెప్పడంతో నెల రోజులుగా నాగరాజును చంపుతానంటూ మహేష్ ఇంటి పరిసరాల్లో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. భయపడిన నాగరాజు ఇంటికి రావడం మానేశాడు. కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడంతో ఈనెల 13న సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ విషయాన్ని నాగరాజు భార్య భవానీ తన ప్రియుడైన మహేష్ కు ఫోన్ లో తెలియజేయగా మహేష్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నాగరాజును హతమార్చేందుకు కత్తి తీసుకొని రాగా గమనించిన ఇరుగు పొరుగువారు మహేష్ దాడి చేస్తాడన్న భయంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను కత్తి చూపించి అందర్నీ బెదిరించాడు. నా తమ్ముడు, స్నేహితులతో మళ్ళీ వస్తానని, నాగరాజును కచ్చితంగా చంపుతానని, అడ్డొచ్చిన వారిని కూడా చంపుతానని మహేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 10:30 గంటల సమయంలో మహేష్ తమ్ముడైన ఆకాష్, అతని స్నేహితులైన మధార్వలి, షేక్ ఖాసిం సైదా అలియాస్ అండా ముగ్గురు మోటార్ సైకిల్ పై వచ్చారు. మహేష్ తమ్ముడు అయిన ఆకాష్ తను చేతిలో ఉన్న గొడ్డలితో ఇంటి సమీపముకు వచ్చి నాగరాజును హతమార్చేందుకు యత్నించగా నాగరాజు భయంతో పరుగులు పెట్టాడు. నాగరాజును వెంబడించారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న స్థానికులు అడ్డు పడటంతో ఆకాష్ పెనుగులాడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరు మదార్వలి, ఖాసీం సైదా అలియాస్ అండా స్థానికులకు దొరకడంతో వారిరు వురికి దేహశుద్ధి చేసి విద్యుత్ స్తంభానికి కట్టేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. భవానీ, మహేష్ల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నాగరాజు అడ్డుస్తున్నాడనే ఉద్దేశంతో పథకం ప్రకారం నాగరాజును హతమార్చేందుకు యత్నించారు. దీనిపై నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు హత్యా నేరం క్రింద నల్లబోతుల భవానీ, పమిడి గుంట్ల మహేష్, పమిడిగుంట్ల ఆకాష్, మధార్వలి, ఖాసిం సైదా అలియాస్ అండా పై పట్టణ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
21 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెన్ అండ్ ఉమెన్ టీమ్ చాంపియన్షిప్ సెలక్షన్ పోటీలు స్థానిక శ్యామలానగర్లోని వెంకటేశ్వర బాలకుటీర్లో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు పి.విజయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చెస్ వచ్చిన ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఎంపిక చేసిన టీమ్ను ఈ నెల 27న బాటప్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన బ్రోచర్ను జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ిసీహెచ్ రవీంద్ర రాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపల్ సుధామాధవి, విజయ్కుమార్ తదితరులు ఆవిష్కరించారు. మంగళగిరి టౌన్: ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన అఖిల భారత టేబుల్ టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం ప్రతిభ కనబరిచింది. ఏపీ ఈగల్ బృందం గురువారం వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏపీ ఈగల్ బృందం రెండు కాంస్య పతకాలను సాధించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున పోటీల్లో పాల్గొన్న ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ స్వరూపారాణి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. మహిళల విభాగంలో అప్పా ఎస్పీ శోభామంజరి, స్వరూపా రాణిలు ఉమెన్ డబుల్ విభాగంలో రాణించి మరొక కాంస్య పతకాన్ని రాష్ట్ర ఖాతాలో వేశారని తెలియజేశారు. అఖిల భారత పోలీస్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్శాఖకు చెందిన అధికారులు రెండు పతకాలు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 524.30 అడుగులకు చేరింది. ఈ నీరు 157.2340 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ప్రత్తిపాడు: హైవేపై ముందు వెళుతున్న కార్డును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చిలకలూరిపేట డిపో నుంచి గుంటూరు డిపోకు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆర్టీసీ బస్సు, ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రి సమీపంలో పదహారవ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వెళుతున్న ఇన్నోవా కారును వెనుక నుం,ఇ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. హైవేపై ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బందితో పాటు ప్రత్తిపాడు ఎస్ఐ నరహరి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. అదే సమయంలో బస్సులో కూడా ప్రయాణీకులు ఉండటం, ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అవార్డులకు ఆరోగ్య కేంద్రాలు ఎంపిక గుంటూరు మెడికల్: జిల్లా లోని పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఆయష్మాన్ ఆరోగ్య మందిర్ల అవార్డులు, పారితోషికాలకు ఎంపికై న ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బందిని గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జాతీయ నాణ్యత అంచనా సంస్థ (ఎన్క్యూఏఎస్) రెండు రోజుల పాటు, నవజాత, మాతాశిశు, కౌమార బాలికల సంరక్షణ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ అంశాలపై నిర్వహించిన ప్రమాణాలలో మూడు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. అవార్డులకు ఎంపికై న నందులపేట (తెనాలి) –88.23 శాతం, రెడ్డిపాలెం (గుంటూరు) – 89.56శాతం, అడవితక్కెళ్లపాడు (గుంటూరు) –93.79 శాతం, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మాచవరం, పాండ్రపాడు –92.44శాతం, ఉప్పలపాడు, పెదనందిపాడు 91.75శాతం, ఉప్పలపాడు, పెదకాకాని 82.49శాతంలు అవార్డులకు ఎంపికయ్యాయని తెలిపారు. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రానికి రూ.3లక్షల పారితోషికం, ఒక్కో ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్కు రూ.1.26 లక్షలు ఆరోగ్యకేంద్రాలకు అభివృద్ధి, సిబ్బంది ప్రోత్సాహకాల రీత్యా అందజేయడం జరుగుతోందన్నారు. అవార్డులు పొందిన ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి, మిగతా ఆరోగ్య కేంద్రాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రాల నిర్వహణను, వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు. -
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
సత్తెనపల్లి: విద్యుత్ షాక్కు గురై యువ రైతు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం గోగులపాడు గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోగులపాడు గ్రామానికి చెందిన యువ రైతు తన్నీరు వెంకటేశ్వర్లు (26) గురువారం తనకు చెందిన 2.50 ఎకరాల పొలంలో పచ్చిక కోసం వాగులో నీటిని తన పొలానికి మళ్లించేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా షాక్కు గురై సమీపంలోని వాగు నీటిలో పడి పోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు గమనించి తన్నీరు వెంకటేశ్వర్లను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య భూలక్ష్మి, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో మూడేళ్ల జైలు గుంటూరు లీగల్: గుంటూరులో నివాసం ఉంటూ వివిధ ప్రాంతాల చిరునామాలను ఉపయోగించుకుంటూ అక్రమంగా గంజాయిని రవాణా చేసి విక్రయిస్తున్న మద్దు రామకృష్ణయ్య గంజాయి అక్రమ రవాణా కేసులో మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. కేసు వివరాల ప్రకారం, రేపల్లె వైపు ప్రయాణిస్తున్న ఒక ఆటోలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న సంచిలో సుమారు రెండు కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిపై ఆధారాలతో రేపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించి, విచారణ అనంతరం నిజనిర్ధారణ చేసిన మొదటి అదనపు జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి ముద్దాయి మద్దు రామకృష్ణయ్యకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.20 వేల జరిమా నా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.అశోక వాణి వాదనలు వినిపించారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ సెమిస్టర్ ఫలితాలు విడుదల ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో జరిగిన మాస్టర్ ఆఫ్ సైన్స్ పస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణా ధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్కు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 28వ తేదీ లోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
బస్సుల సంఖ్య తగ్గించారు
గతంలో వినుకొండ నుంచి పిడుగురాళ్ల మధ్య మొత్తం 16 బస్సులు నడిచేవి. ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తరువాత వాటి సంఖ్య 8కి తగ్గించారు. బస్సులు పెంచాల్సిందిపోయి తగ్గించడంతోనే వినుకొండలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు పాయింట్లోకి రాగానే ప్రయాణికులు ఎగబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పట్టుతప్పి పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా పోలీసులను పెట్టి నియంత్రించినా ఉపయోగం లేదు. – ఉలవలపూడి రాము, సీపీఐ పట్టణ కార్యదర్శి, వినుకొండ -
ఏమాత్రం పట్టించుకోరే?
బిల్లులు చెల్లించకపోవడం వల్లే తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో దర్శి ప్రాంతం నుంచి గత వారం ఓ వ్యక్తి నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి వచ్చాడు. రోగంతోనే కుటుంబ సభ్యుల సాయంతో ఓపీ లైన్లో పడిగాపులు కాశాడు. చివరికి ఓపీ చీటీ తీసుకుని డాక్టర్ వద్దకు వెళితే ఏవేవో పరీక్షలు చేయించమన్నారు. పరీక్షల హాలులోకి వెళ్లగా అక్కడా క్యూ లైన్ వెక్కిరించింది. ఎట్టకేలకు పరీక్షలు చేయించుకున్నాడు. సిబ్బంది చెప్పడంతో రోగంతోనే ఇంటిముఖం పట్టాడు. రెండో రోజు వచ్చి రిపోర్టులు తీసుకుని వైద్యుని వద్ద వెళితే మందులు చీటీ చేతిలో పెట్టాడు. ఆ చీటీ తీసుకుని మందులిచ్చే గది వద్దకు వెళితే.. ఇక్కడ లేవు.. బయట తెచ్చుకో అంటూ చీటీ ఇచ్చేశారు... ఇదీ నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నెలకొన్న దుస్థితి. -
విధుల్లో చేరిన ఆర్టీసీ కాల్ డ్రైవర్లు
చిలకలూరిపేట టౌన్ / యడ్లపాడు: గత రెండు రోజులుగా చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను కుదిపేసిన డ్రైవర్ల ఆందోళన ఎట్టకేలకు శుభం కార్డు పడింది. చౌడవరం వద్ద డ్రైవర్ దుర్గాప్రసాద్పై జరిగిన దాడిని నిరసిస్తూ, తమకు రక్షణ కల్పించడంతోపాటు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 35 మంది కాల్ డ్రైవర్లు చేపట్టిన విధుల బహిష్కరణ బుధవారంతో ముగిసింది. జిల్లా రీజనల్ మేనేజర్ టి.అజిత కుమారి జరిపిన చర్చలు తొలుత విఫలమైనప్పటికీ, దాడికి పాల్పడిన వారిపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేయడం, ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో డ్రైవర్లు శాంతించారు. బాధిత డ్రైవర్కు పూర్తి న్యాయం చేస్తామని ఆర్ఎం భరోసా ఇవ్వడంతో వారు తిరిగి బుధవారం విధుల్లోకి చేరినట్లు డిపో మేనేజర్ వై.వేణు తెలిపారు. డిపోనకు చెందిన అన్ని సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించినట్లు ఆయన తెలిపారు. ఈ రెండు రోజుల సమ్మె కారణంగా సకాలంలో సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇతర డిపోల నుంచి వచ్చిన డ్రైవర్లు విశ్రాంతి లేకుండా డబుల్ డ్యూటీలు చేయాల్సి వచ్చింది. ఐదు కీలక సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
పేదగుండెకు గుదిబండ
గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్లో గుండె జబ్బుతో చేరి ఆపరేషన్లు చేయించుకోవాలంటే తప్పనిసరిగా రక్తాన్ని బయట కొనుక్కోవాల్సిందే. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. జీజీహెచ్లో బ్లడ్ బ్యాంకు ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి కొనుగోలు చేయించడం విమర్శలకు తావిస్తోంది. రూ. పది వేల వరకు ఖర్చు గుండె బైపాస్ సర్జరీ చేసే రోగికి ఆరు బ్లడ్బ్యాగులు అవసరమవుతాయి. ప్రైవేటు బ్లడ్బ్యాంకు నుంచి సుమారు దీనికోస రూ. 10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జీజీహెచ్లో బ్లడ్బ్యాంకు నుంచి రక్తాన్ని తెచ్చి వినియోగించేందుకు గుండె ఆపరేషన్ చేసే వైద్యులు (కార్డియో థొరాసిక్ సర్జరీ) సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక్కడి రక్తం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం లేదని, ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని, అందువల్లే బయట నుంచి కొనుగోలు చేయిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదే తరహాలో ఇతర విభాగాల్లోనూ బయట నుంచి రక్తం కొనుగోలు చేయిస్తే ఇక జీజీహెచ్లో ఉండి కూడా ఏం ప్రయోజనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర ఆపరేషన్లు చేస్తున్న వైద్యులు మాత్రం జీజీహెచ్ బ్లడ్బ్యాంకు నుంచి, ఆపరేషన్ చేయించుకుంటున్న రోగుల కుటుంబ సభ్యులు, బంధువుల రక్తదానం ద్వారా రక్తాన్ని సేకరించి రోగికి ఎక్కించి విజయవంతంగా ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్లు ఉచితమైనా.... గుండె బైపాస్ సర్జరీలు ప్రైవేటు ఆసుపత్రిలో పేదలు చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ కొంత మంది డాక్టర్లు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గుంటూరు జీజీహెచ్కు రోగులు వస్తున్నారు. కార్డియోథొరాసిక్ సర్జరీ (సీటీఎస్) వైద్యులు ఇటీవల 225 గుండె ఆపరేషన్లు పూర్తి చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు రూ. 5 లక్షలకుపైగా ఖరీదు చేసే గుండె బైపాస్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. సీటీఎస్ వైద్య విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ప్రత్యేకంగా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం కొనుగోలు చేయించి తెప్పించే విధులు నిర్వహిస్తున్నాడు. వైద్యుల ఆదేశాల మేరకు ఇలా చేయాలని సూచిస్తున్నట్లు సదరు ఉద్యోగి తెలిపారు. ఏడాదికిపైగా ఇలా బయట కొనుగోలు చేయించడపై విమర్శలు వస్తున్నాయి. బ్లడ్బ్యాంకు తీరుపై విమర్శలు జీజీహెచ్ బ్లడ్బ్యాంకులో రక్తాన్ని తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతున్నట్లు గుండె ఆపరేషన్ వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు. రక్తంతోపాటు ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఇతర కాంపోనెంట్స్ కూడా గుండె ఆపరేషన్ చేయించుకునేవారికి అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. రక్తంతోపాటు ఇతర బ్లడ్ కాంపోనెంట్స్ ఆపరేషన్ చేసే రోగులకు ఎక్కించాల్సి వస్తే సదరు ఖర్చు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు, అంతకు మించి పెరగవచ్చు. ఇంత భారం పేద రోగులపై మోపేందుకు గుండె ఆపరేషన్ల వైద్యులు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ వివాదాలకు తెరదించాలి. -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారిని బుధవారం ఏపీ హైకోర్టు న్యాయూమూర్తి జస్టిస్ ఉమామహేశ్వరరావు దంపతులు, ఏలూరు రిటైర్డ్ ఎస్పీ డీవీఎస్ మూర్తి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయం చుట్టూ వారు ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో జరిగిన పూర్ణాహుతి పూజా కార్యక్రమాలలో న్యాయమూర్తి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు, ఎస్పీ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసి ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో పిట్టలవానిపాలెం తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ హెచ్.ఇ.సిలాయ్జాకీ, ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హెచ్.ఇ.ఫిలిప్లు బుధవారం సందర్శించారు. వారు విజయకీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 అడుగుల ఏకశిలా విగ్రహం విఘ్న విమోచక హనుమాన్ను దర్శించుకున్నారు. అనంతరం వారికి చిత్రపటాన్ని, స్వామి వారి శేషవస్త్రాన్ని నిర్వాహకులు బహూకరించారు. ఆలయ విశిష్టతను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు వివరించారు. పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ అందజేశారు. -
నీట్ రద్దుకు బాధ్యతగా కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
లక్ష్మీపురం: ‘నీట్’ రద్దుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారుపు యశ్వంత్ రఘవీర్ డిమాండ్ చేశారు. గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నత విద్య చదవాలని, డాక్టర్ అవ్వాలనే ఆకాంక్షతో నీట్ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాశారని చెప్పారు. కానీ వారి కలలను నీరుగార్చి వారి జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హరియాణా, బిహార్ రాష్ట్రాలలో నీట్ పరీక్ష పేపర్ను 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు అమ్ముకొని లీకేజ్ చేశారని గుర్తు చేశారు. గతంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలలో నీట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసేవారని చెప్పారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యదర్శి సుదర్శనం అమర్నాథ్, నగర నాయకులు మహేష్, సాయి గణేష్ పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై పసుపు కొమ్ముల లారీ బోల్తా
క్లీనర్ మృతి, డ్రైవర్కు గాయాలు పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన బుధవారం పెదకాకాని వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు మండలం, బద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు కడప జిల్లా మైదుకూరులో విత్తన పసుపు కొమ్ములు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి లారీ బాడుగకు మాట్లాడుకుని ఆ విత్తన పసుపు కొమ్ములను లారీలో లోడు చేయించారు. పసుపు కొమ్ములతో బయలుదేరిన బుధవారం ఉదయం పెదకాకాని సమీపంలోకి చేరుకుంది. లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి ప్రక్కనే ఉన్న డివైడర్ను ఢీకొని ఫల్టీ కొట్టింది. లారీలో ఉన్న పసుపు కొమ్ములు రోడ్డుపై చెల్లా చెదురుగా పడటంతో వెనుక నుంచి వెళుతున్న వాహనాలు తొక్కుకుంటూనే ప్రయాణాలు సాగించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కుమార్, క్లీనర్ ప్రసన్నకుమార్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లీనర్ ప్రసన్నకుమార్ పరిస్థితి విషమంగా మారడంతో చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రసన్నకుమార్(24) మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు డ్రైవర్ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసుపు కొమ్ములను ఒక చోటకు చేర్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతుని సోదరుడు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు. -
అక్రమ కేసులు బనాయించి వేధింపులు
పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ కర్నూలు పట్టణ యూత్ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు పెట్టి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అణిచివేతల వలన వైఎస్సార్ సీపీ యూత్ విభాగం ఆగదని, మీరు ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంత రెట్టించిన ఉత్సాహంతో శ్రేణులు పనిచేస్తారని తెలిపారు. ప్రతిపక్షపార్టీగా వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వారిని ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం మైనార్టీ యువకులను టీడీపీ నేతలు టార్గెట్ చేసి అణిచివేయాలని చూస్తున్నారని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. దాడులను నిరశిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. పార్టీ గురజాల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడారు. నియోజకవర్గ యువజన విభాగం అధక్షుడు బి. సాంబశివరావు, పిడుగురాళ్ల మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రసన్న, మాచవరం మండల అధ్యక్షుడు చిన్న రామాంజనేయులు, పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ అబిద్, సయ్యద్ ఇమ్రాన్, కె.రమేష్, జిలానీ అబ్దుల్ మాజిద్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ -
శుభ శకునం కోసం ఎదురొస్తే ప్రాణాలే పోయాయి
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఇంటికొచ్చిన బంధువులను తిరిగి పంపించేందుకు కారుకు శుభ శకునానికని ఎదురు వచ్చిన మహిళను వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన మరోకారు ఢీకొనగా ఆమె మృత్యువాత పడిన ఘటన మండలంలోని కిలేశపురంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి రమేష్, గంగాభవాని(44) దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కుమార్తెను పుట్టింటికి కారులో తీసుకొచ్చిన బంధువులను తిరుగు ప్రయాణంలో పంపించేందుకు తన కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి తల్లి గంగాభవాని శుభశకునం కోసం కారుకు డ్రైవర్ వైపు ఎదురు వచ్చింది. కారు ముందుకు సాగిన మరుక్షణం హైదరాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన మరో కారు వీరిద్దరినీ ఢీకొట్టింది. గంగాభవాని అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జితేంద్రను హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీనివాసులు
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శిగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇజాజ్ అబ్దుల్ రెహమాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డాక్టర్ గుడిసె చంద్రశేఖర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా డాక్టర్ ఇంజేటి బాబ్జిశ్యామ్కుమార్ వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ స్వరూప్కాంత్, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ వేమూరు: అమృతలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ బృందం సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 27 28 తేదీల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అందించే వైద్య సేవలు, కాన్పుల విభాగం పనితీరు, లేబొరేటరీ పనితీరును పరిశీలించారన్నారు. అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన బృంద సభ్యులు, బుధవారం గుర్తింపు పత్రం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్ శృతిని అభినందించారు. ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్ట గుంట శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఐఓబీ కార్యాలయ నిర్మాణానికి ఒప్పందం
కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు. -
పాస్పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహనరసరావుపేట: ఈ–కేవైసీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం డివిజినల్ అధికారులు, తహసీల్దార్లతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకాలకు ఈ–కేవైసీ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులలో వెనుకబడి ఉన్న తప్పనిసరిగా ప్రగతి చూపించాలని, లేనిపక్షంలో చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఇళ్ల గణన పరిశీలన.. జనగణనలో భాగంగా చేపట్టిన ఇళ్ల గణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని రామిరెడ్డిపేటలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఇళ్ల గణనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కేసులు.. నరసరావుపేట: జిల్లాలో బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే బాల్యవివాహాలు చేసే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సకాలంలో అధికారులను అప్రమత్తం చేయటం ద్వారా వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహం, దాచేపల్లిలోని మరో వివాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలన కోసం తీసుకోవలసిన చర్యలపై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ యూనిట్, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో గ్రామస్థాయి, కమ్యూనిటీ లెవెల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థినుల ఇళ్ల వద్ద నిఘా ఉంచాలని, గ్రామస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ టీచర్లు, గ్రామ వెల్ఫేర్ సెక్రటరీ, మహిళా సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు. నీట్ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు. – వల్లెపు ధీరజ్కృష్ణ, విద్యార్థి, గుంటూరు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 7 -
జిల్లా క్రీడాకారులకు అంతర్జాతీయ పతకాలు
మంగళగిరి టౌన్: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్ సబ్ జూనియర్, జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులు -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చాగంటివారిపాలెం (ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందిన సంఘటన జరిగింది. మృతురాలు పక్కనే అదే గ్రామానికి చెందిన యువకుడు రుద్రపాటి చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... క్రోసూరు మండలంలోని 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన షేక్ సైదాబీ (39) చాగంటివారిపాలెంకు చెందిన రుద్రపాటి చంద్రశేఖర్ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. మధ్యాహ్నా సమయంలో ఇంటి యజమాని అంకమ్మ ఇంట్లోకి వెళ్లే సరికి చంద్రశేఖర్, సైదాబిలు పక్కపక్కనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా, సైదాబి మృతి చెంది ఉంది. చంద్రశేఖర్కు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... చంద్రశేఖర్తో సైదాబీకి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే చాగంటివారిపాలెం గ్రామానికి తరచూ వస్తుండేదని స్థానికులు తెలిపారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, చంద్రశేఖర్ను బిర్యానీ కోసం బయటకు పంపించి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సైదాబీ మృతిని తట్టుకోలేక ఎక్కువ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడైంది. సైదాబీకి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. -
‘నీట్’ కల చెదిరిన వేళ
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. నిరాశ, నిస్పృహలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే నీట్కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
చిలకలూరిపేట ఆర్టీసీలో వీడని ప్రతిష్టంభన
● రెండోరోజూ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● ఆర్ఎం రజితకుమారి ఆధ్వర్యంలో చర్చలు చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల విధుల బహిష్కరణ రెండో రోజుకూ చేరడంతో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. తోటి డ్రైవర్పై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు ప్రాణరక్షణ కల్పించే వరకు స్టీరింగ్ పట్టే ప్రసక్తే లేదని కాల్ డ్రైవర్లు భీష్మించుకోవడంతో అధికారులకు ఇది పెను సవాలుగా మారింది. మొత్తం 35 మంది డ్రైవర్లకుగాను ఐదుగురు మాత్రమే విధులకు హాజరుకావడంతో డిపో నుంచి బస్సులు కదలలేదు. సమస్య జఠిలం కావడంతో పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్ టి అజితకుమారి సోమవారం స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. నరసరావుపేట, సత్తెనపల్లి నుంచి ఇతర డ్రైవర్లను రప్పించి, అందుబాటులో ఉన్న వారితో డబుల్ డ్యూటీలు చేయిస్తూ ఆర్టీసీ అధికారులు నెట్టుకొస్తున్నారు. డిపో పరిధిలోని అద్దె ప్రాతిపదికన నడిపే 5 సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో చీరాల, మాచర్ల వంటి మార్గాల్లో కీలకమైన సర్వీసులు లేక సామాన్య ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం చేసేందుకు మంగళవారం తిరిగి ఆర్ఎం రజిత కుమారి చిలకలూరిపేట డిపోను సందర్శించారు. అయితే విధులను బహిష్కరించిన ఆన్కాల్ డ్రైవర్లంతా బాధిత డ్రైవర్ దుర్గాప్రసాద్కు అండగ నిలిచారు. తమ తోటి డ్రైవర్కు న్యాయం చేయాలంటూ దుర్గాప్రసాద్కు మద్దతుగా మంగళవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నారు. దీంతో డ్రైవర్లతో ఆర్ఎం ఫోన్ ద్వారా రెండోరోజు చర్చలు జరిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు ఉంటాయని, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వం తర్వాత కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ, విధుల్లో భద్రతపై శాశ్వత భరోసా లభిస్తే తప్ప ఈ అనిశ్చితి పూర్తిగా తొలగేలా లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ విషయంపై ఆర్ఎం అజిత కుమారిని వివరణ కోరగా బాధిత డ్రైవర్కు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని, ఇదే విషయాన్ని కాల్డ్రైవర్లతో ఫోన్ద్వారా తెలియజేశామని వారు బుధవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు చెప్పారని వివరించారు. -
విజయకీలాద్రిపై హనుమజ్జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్లో స్వదేశ్ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన జాతీయ అన్ఎక్విప్డ్ ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అభినందించారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్కుమార్ రజత పతకం గెలుపొందారు. కోచ్ ఖమురుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్ఖాన్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివే విద్యార్థినులు, విద్యార్థులకు వేరు వేరు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల కార్యాలయాల్లో పొందాలని సూచించారు. ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.సంతోష్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు జయప్రద, రాణమ్మ, రాజేశ్వరి, రామాంజనేయులు, వెంకటేశ్వర నాయక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సంగీతంలో రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డ్
కర్లపాలెం: సంగీతంలో ఓ బాలుడు తన సత్తా చాటాడు. రెండోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు. కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్బాబు, ప్రత్యూషల కుమారుడు జోయల్ విల్సన్బాబు. 7వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్య కళాకారులతో కార్యక్రమం ఏర్పాటైంది. నిమిషంలో సప్తస్వరాలు, గంటపాటు ఆపకుండా కీబోర్డు వాయించటంపై పోటీలు నిర్వహించారు. జోయల్ విల్సన్బాబుకు రికార్డులో స్థానం లభించింది. 2024 డిసెంబర్ 1న విజయవాడలో జరిగిన సంగీత పోటీలలో కూడా జోయల్ విల్సన్బాబు పాల్గొన్నాడు. ఈ నెల 9న విజయవాడలో జరిగిన హల్లెల్ సంగీత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నుంచి దీనికి సంబంధించి జోయల్ విల్సన్ బాబుకు సర్టిఫికెట్, మెడల్ అందాయి. -
హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలు పూర్తి చేయాలి
కారంచేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలను వైద్య సిబ్బంది ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ రత్నమన్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కారంచేడు, దగ్గుబాడు పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లతోపాటు పర్చూరు కో లొకేటడ్ పీహెచ్సీ వైద్య సిబ్బందితోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీలోగా మీ పీహెచ్సీల పరిధిలో ఉన్న 15 ఏళ్లలోపు బాలికలను గుర్తించి వారికి ఈ వ్యాక్సిన్ అందించాలన్నారు. బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం వలన కలిగే మేలు తెలియజేయాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన సర్వైకల్ క్యాన్సర్నును నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. మూడు పీహెచ్సీల పరిధిలోనూ చాలా తక్కువ మందికే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్, పర్చూరు కో లోకేటెడ్ వైద్యాధికారి డాక్టర్ సాయిప్రశాంతి, దగ్గుబాడు పీహెచ్సీ వైద్యాఽధికారి డాక్టర్ డాక్టర్ హరిత, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు. – బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్, భాష్యం మెడెక్స్ కళాశాల, గుంటూరు -
ఉపాధ్యాయులపై సెలవుల్లో ఒత్తిడి తగదు
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు నరసరావుపేట/నరసరావుపేట ఈస్ట్: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు విద్యా ప్రణాళిక షెడ్యూల్ను వాయిదా వేయాలనీ, లేని పక్షంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నరసరావుపేట రూరల్: వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని రావిపాడులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని కాసు వెంగళరెడ్డి కాలనీకి చెందిన కాలే పాపమ్మ(75) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. రెండు రోజుల కిందట వరకు మిరప కూలి పనులకు వెళ్లింది. ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతిచెందింది. రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామం వద్దగల కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విప్పర్ల గ్రామానికి చెందిన కోరా వెంకటేశ్వర్లు(30) మృతి చెందాడు. కోరా వెంకటేశ్వర్లు తన ద్విచక్రవాహనంపై రెడ్డిపాలెం గ్రామం నుంచి తన స్వగ్రామమైన విప్పర్ల గ్రామానికి వస్తూ ఎక్స్ప్రెస్వేని దాటుతుండగా నకరికల్లు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ ప్రాంతంలో మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. విజయపురి సౌత్లోని డౌన్ మార్కెట్కు చెందిన మైలపల్లి గోవింద్ (42) శ్రీశైలానికి వెళ్లే మార్గంలో జోడుతొట్లు వద్ద ఉంటున్నాడు. సోమవారం పిల్లలతో ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు సాగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలో జెండాపెంట వద్ద గోవింద్ మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మాచర్ల: రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రా నాగార్జున బాబు (24) మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. నాగార్జున బాబు భార్య పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం రాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసిన నాగార్జున సంతోషంతో తిరిగి వెళ్తూ మద్యం తాగాడు. అనంతరం వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నాగార్జున మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాపట్ల: వైద్యరంగంలో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా కీలకమని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీపీ యూనిట్లో నర్సులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ బి.ఎస్.నారాయణభట్టు, నవనీతం, చల్లా లావణ్య, డీఎఫ్ఓ యశ్వంత్, జాషువా, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేత నాగార్జునయాదవ్పై మరో కేసు
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్పై పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్్లో మంగళవారం మరో అక్రమ కేసు నమోదు చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ నాగార్జునయాదవ్ గతంలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 2024 డిసెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు 244 రోజులపాటు ఈ నిధులు స్థానిక సంస్థలకు అందలేదని ఆయన గణంకాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు అసత్యమని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని జనసేన నేత రామ సైదులు ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇదే అంశంపై నాగార్జునయాదవ్పై కొద్దిరోజుల కిందట కాకినాడ జిల్లాలో కూడా కేసు నమోదు చేశారు. -
ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్ యూనిట్ల ఏర్పాటు
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీలకు చెందిన గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం వచ్చే ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఏపీసీపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. మంగళవారం జొన్నలగడ్డ రోడ్డులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరై ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజ్ సమస్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్లో చాలా భాగం వచ్చాయన్నారు. పీఎం సూర్యఘర్కు సంబంధించి 40 వేల కనెక్షన్లు, వాటిలో జిల్లాలో మూడు వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ మరో పది వేల యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలకు ఐదు వేల లక్ష్యంతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సాగు కనెక్షన్లపై దృష్టి రైతులకు రోజుకు 42 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ విద్యుత్ కోసం 12 సబ్స్టేషన్లలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 మార్చి చివరికల్లా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు కొంత ఉన్నాయని, వాటిని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన రెవెన్యూ కూడా కొంత బాకీ ఉందన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్, కాలనీల నుంచి విద్యుత్ బకాయిలు సుమారు రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. వాళ్లను కూడా చెల్లించాలని కోరామన్నారు. వేసవిలో ఎక్కడా లో ఓల్టేజ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఏడు నూతన సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, నాలుగు చోట్ల పనులు మొదలు పెట్టారన్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలలో వందశాతం రెవెన్యూ కలెక్షన్ సాధించామని, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు అందకపోవటంతో ఐదు శాతం రెవెన్యూ తగ్గిందన్నారు. టెక్నికల్ డైరక్టర్ మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్ డైరక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ పి.విజయకుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీల గృహాలపై బిగించేందుకు చర్యలు -
టార్గెట్ గుంటూరు !
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైల్వే ప్రయాణికుల భద్రత రైల్వే, పోలీస్ శాఖకు సవాల్గా మారింది. దొంగలు ఉమ్మడి గుంటూరులో తమకు అనువైన ప్రాంతాలను టార్గెట్గా పెట్టుకోవడంతో వారి నుంచి ప్రయాణికులను కాపాడటం రైల్వే పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో దుండగులు రైలు దోపిడీకి విఫలయత్నం చేయడం, పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపడటం కలకలం సృష్టించింది. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు రైల్వే సిగ్నల్ వద్ద రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బృందానికి ఇద్దరు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్పై ఉండటం కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసి రైలును నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వారు అక్కడ వదిలిపెట్టి వెళ్లిన పరికరాలను చూస్తే అర్ధం అవుతోంది. సిబ్బంది కొరతే పెనుసవాలు రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నేరాలు అధిగమించేందుకు ఉన్నంత సిబ్బందితోనే దొంగతనాలకు పాల్పడిన వారిపై కాల్పులు జరిపి ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఈసారి విజయం సాధించారు. సిబ్బంది కొరత వల్ల, సరైన సదుపాయాలు లేకనే ఇలాంటి పరిస్థితి నెలకొందని రైల్వే పోలీస్ అధికారులు వాపోతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐఆర్పీ విభాగాలు ఉన్నాయి. వాటిలో డివిజన్కు కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడం పోలీసులకు పెను సవాల్గా మారుతుంది. ప్రధానంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని జీఆర్పీ పరిధిలో 56 మంది సిబ్బంది ఉండాల్సింది ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్నారు. వారిలో డీఎస్పీ ఆఫీస్, కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు అంటూ సిబ్బందిని కేటాయించగా 12 మంది మాత్రమే సిబ్బంది ఉండటంతో పక్క జిల్లా నుంచి వచ్చిన సిబ్బందితో రాత్రిళ్లు గస్తీ కాయాల్సి వస్తోంది. అదేవిధంగా ఆర్పీఎఫ్ గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలోని 55 మందికి గాను ప్రస్తుతం 33 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వారిలో గుంటూరు ఆర్పీఎఫ్ పరిధిలో రెండు రైళ్లకు సిబ్బందిని బందోబస్తుకు పంపించాల్సి ఉంటుంది. అయితే 33 మందిలో సుమారు పూర్తి స్థాయిలో 25 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో కూడా సిబ్బంది కొరత ఉంది. దీంతో పక్కజిల్లాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి విధులు కేటాయిస్తున్నారు. అసలేం జరిగింది రోజు మాదిరిగానే ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నిడుబ్రోలు పరిసర ప్రాంతంలోని ఆలూరు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పూర్తి స్థాయిలో చేతులకు గ్లౌజులు, మాస్కులు ధరించి, కటర్లతో సహా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తుండగా.. అదే సమయంలో నరసరావుపేట ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్లు తుపాకులతో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను చూసి ముందుగా గాల్లో కాల్పులు జరపగా ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై పట్టాలపై ఉండే కంకర రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయినప్పటికి జీఆర్పీ పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి పది రౌండ్లు కాల్పులు జరిపి వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులు తప్పించుకుని పరారయ్యారు. అయితే ఈ ఘటన అంతా గుంటూరు జీఆర్పీ పరిధిలో చోటు చేసుకున్నప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మాత్రం విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది. దీంతో ఇటు విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు, గుంటూరు జీఆర్పీ పోలీసులతో పాటు పొన్నూరు రూరల్ పోలీసులు సహా గాలింపులు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. -
మా నాన్న టీడీపీ ఎమ్మెల్యే.. నీ భర్తను నాకిచ్చేయ్!
‘‘మా నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె. సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది. ‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది.. .. హానీ ట్రాప్ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ కౌన్సెలింగ్ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది. ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
గణపవరంలో క్షుద్రపూజల కలకలం
నాదెండ్ల: నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. నాదెండ్ల–గణపవరం ఎన్ఎస్పీ కాలువ కట్ట మీద ముగ్గుతో గీతలు గీసి పసుపు కుంకుమ, అరటి నిమ్మకాయలు, కొబ్బరికాయలు పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు స్ధానికులు గుర్తించారు. సోమవారం ఉదయం స్థానిక రైతులు అటుగా వెళ్తూండగా, వింత ఆకృతిలో గీసిన ముగ్గు, పూజా సామాగ్రి చూసి ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. 14న నాట్కో సెంటర్లో పెట్ స్కాన్ ప్రారంభం గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు. 23న ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు గుంటూరు ఎడ్యుకేషన్: అధ్యాపక ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను ఈనెల 23న గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో శత జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ అధ్యాపకుల సంక్షేమం కోసం ఎంజే మాణిక్యరావు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఈనెల 23న జరిగే శత జయంతి ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏఎన్యూ మాజీ వీసీ ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హాజరు కానున్నారని తెలిపారు. -
ఆర్టీసీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోండి
1980లో అమరావతిలో బస్టాండ్ నిర్మాణం కోసం అమరేశ్వర దేవస్థాన సర్వీసు మాన్యంకు చెందిన నాలుగు సెంట్ల భూమిని ఆర్టీసీ సంస్థకు ఇచ్చారు. నెల కిందట దేవినేని సాంబశివరావు అతని అనుచరులు తన మామకు అందులో ఒక సెంటు స్థలం ఉందంటూ పొక్లెయిన్తో స్థలంలోని పంపుహౌస్ను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన అధికారులపై దౌర్జన్యం చేశారు. డిపో మేనేజర్ నాగమణికి పార్టీ తరపున ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ స్థలాన్ని పరిరక్షించి ప్రహరీ నిర్మాణం చేసి పంపుహౌస్ను ధ్వంసం చేసినందుకు నష్టపరిహారం సంస్థకు చెల్లించేలా చూడాలి. –బి.సూరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి, అమరావతి -
అర్జీలు నాణ్యతగా పరిష్కరించాలి
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ నరసరావుపేట: అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతతో అలసత్వం లేకుండా గడువులోపు పరిష్కారం చేయాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన వారిచే 119 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ క్లినిక్కు సంబంధించినవి 15 అర్జీలు ఉండగా అందులో నరసరావుపేట డివిజన్ నుంచి ఏడు, గురజాల, సత్తెనపల్లి డివిజన్ల నుంచి నాలుగు చొప్పున ఉన్నాయి. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. డీఆర్ఓ నారదముని, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం
నరసరావుపేట రూరల్: భూ వివాదాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవి సంతోష్ పీజీఆర్ఎస్లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలనిఅనదపు ఎస్పీ సూచించారు. సమాఖ్య లీడర్ మల్లెల అనీల నాకు తెలియకుండా నాలుగు పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా చేర్చి బ్యాంక్ల నుంచి సుమారు రూ.10లక్షల వరకు రుణం తీసుకుని మోసం చేసింది. బ్యాంక్ నుంచి రుణం చెల్లించమని నోటీసులు రావడంతో విషయం తెలిసింది. దీనిపై అనీలను ప్రశ్నించగా బ్యాంక్కు డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పిందని, రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు నేను చెల్లించనని బెదిరింపులకు పాల్పడుతుంది. ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన అనీలపై చర్యలు తీసుకోవాలి. –కంచర్ల సుజాత, నరసరావుపేట గ్రామంలో నాకు చెందిన 13 సెంట్లలో రెండు సెంట్లలో దుకాణాలు ఏర్పాటుచేసి అద్దెలకు ఇచ్చాను. ఈ స్థలం నాదంటూ పాపిరెడ్డి అనే వ్యక్తి వచ్చి దుకాణాదారులను బెదిరించి అద్దె వసూలు చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా స్థలాన్ని సర్వే చేసి నాదిగా నిర్దారించారు. అయినా పాపిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ దాడికి ప్రయత్నిస్తున్నాడు. నాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి. –దిడిచినాల రామిరెడ్డి, శిరిగిరిపాడు ఉద్యోగం కల్పిస్తానని మోసం చేశారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన రాజా హిందుస్తాన్ నిధి సంస్థలో సేల్స్ ఆఫీసర్గా నియమించారు. నెలకు రూ.45వేలు జీతం అని ప్రకటించి నాలుగు నెలలుగా పని చేయించుకుంటూ జీతం ఇవ్వడం లేదు. ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి. –జంగాల కోటేశ్వరరావు, నరసరావుపేట ఏటీఎం సెంటర్లో సహాయం చేస్తానని చెప్పి యువతి తన అకౌంట్ నుంచి నగదు డ్రా చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన పెదనందిపాడు రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్కు నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లాను. నాకు చదువు లేకపోవడంతో అక్కడే ఉన్న యువతిని డబ్బులు డ్రా చేసి పెట్టమని కోరాను. యువతి పలు నెంబర్లు కొట్టిన తరువాత కార్డు పనిచేయడం లేదని వెళ్లిపోయింది. దీనిపై బ్యాంక్ అధికారులను సంప్రదించగా నా అకౌంట్ నుంచి రూ.26వేలు డ్రా చేసినట్టు చెప్పారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. –షేక్ మీరా అహ్మద్, చిలకలూరిపేట -
న్యాయమూర్తులకు పదోన్నతులు
గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
వేసవి సెలవుల్లో సమావేశాల ఏర్పాటు తగదు
ఎస్టీయూ నాయకులు నరసరావుపేట ఈస్ట్: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన తరువాత కూడా వరుసగా వివిధ సమావేశాల పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులను వేధించటం తగదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్టీయూ నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును కలసి వినతి పత్రం అందజేశారు. పాఠశాలల్లో ఆడ్మిషన్ డ్రైవ్ను ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ, వేసవి సెలవుల మధ్యలో ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయంలో మండల స్థాయిలో పాఠశాల ప్లాన్, హ్యాబిటేషన్, క్లస్టర్ ప్లాన్, మండల ప్లాన్ను ఈనెల 13వ తేదీలోపు పూర్తి చేయాలని గడువు విధించటం సరికాదని తెలిపారు. ఈమేరకు సమగ్ర శిక్ష ప్లాన్ షెడ్యూల్ ప్రకటించటం అభ్యంతరకరమని తెలిపారు. అధికారుల తీరుతో విద్యా శాఖ వెకేషన్ డిపార్ట్మెంటా లేదా నాన్ వెకేషన్ డిపార్ట్మెంటా అని ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నవంబర్ నెలలో స్కూల్ డెవలప్మెంట్, హ్యాబిటేషన్, క్లస్టర్, మండల ప్రణాళికలను పూర్తి చేయాల్సి ఉందనీ, వేసవి సెలవుల్లో షెడ్యూల్ విడుదల చేయటాన్ని ఎస్టీయూ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. వేసవి సెలవులు పూర్తయిన తరువాత మరోమారు షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. డీఈఓ స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళతానని తెలి పా రు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ, జిల్లా ఆర్థిక కార్యదర్శి షేక్.మహబూబ్ సుభానీ, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు షేక్.కరిముల్లా, రాష్ట్ర కౌన్సిలర్ వై.రామయ్య, పి.వి.మల్లికార్జునరెడ్డి, రొంపిచర్ల మండల అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇసుక భూముల్లో నమూనాల సేకరణ
చినగంజాం: ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి స్థానిక వ్యవసాయ భూముల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా భగర్భ గనులు శాఖ అధికారులు సోమవారం ఇసుక నమూనాలు సేకరించారు. జిల్లా భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ దమయంతి ఆధ్వర్యంలో చినగంజాం సర్వే నంబర్ 828, మోటుపల్లి సర్వే నంబర్ 128లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారని ఆరోపించిన ప్రాంతంలో మొత్తం ఆరు నమూనాలను సేకరించారు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన రైతులు అనుమాలశెట్టి శ్రీరామకృష్ణ తదితర రైతులు ఆ ప్రాంతంలో తమ వ్యవసాయ భూములున్నాయని ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వలన తమ భూములకు సాగు నీరు లేకుండా పోతుందన్నారు. గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఆ భూములలో సాధారణ ఇసుక మాత్రమే ఉందని తవ్వకాలు జరగకుండా నిలిపివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నివేదిక పంపారు. అటు తరువాత స్థానిక రైతులు ఆప్రాంతంలో సాధారణ ఇసుక మాత్రమే కాదని విలువైన సిలికాన్ ఇసుక కూడా ఉందని భూగర్భగనులశాఖతో సర్వే చేయించాలని కోరడంతో సంబంధిత శాఖాధికారులు సోమవారం ఘటనా స్థలానికి వచ్చి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో భూగర్భ గనులశాఖ కార్యాలయ సబార్డినేట్ అధికారి మహేష్, రెవెన్యూ అధికారులు నాగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోండి
నాదెండ్ల మండలం చందవరానికి చెందిన గొర్రపాటి శ్రీనివాసరావు తూబాడుకు చెందిన పురుగుమందుల వ్యాపారి పూదోక నాగేశ్వరరావు వద్ద ఏడాది క్రితం రూ.2.09 లక్షల విలువైన పురుగుమందులు కొనుగోలు చేశారు. ఈనెల నాలుగున నాగేశ్వరరావు శ్రీనివాసరావుపై ఒత్తిడి తీసుకొచ్చి మార్కెట్ ధర కంటే తక్కువగా రూ.8.95 లక్షల విలువైన 50 క్వింటాల మిర్చి కొనుగోలు చేశారు. బాకీ రూ.2.63లక్షలు కాగా మిగతా డబ్బులు ఇవ్వమని శ్రీనివాసరావు వ్యాపారిని అడిగినా నకిలీ బిల్లులు చూపించి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నాడు. బాధితుడికి న్యాయం చేయండి. –జి.రామకృష్ణ, కోటనాయక్, వై.వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు -
ఎన్జీ రంగా వర్సిటీలో ఎస్ఎల్టీపీ ప్రోగ్రాం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో స్ట్రేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం ప్రారంభించారు. సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశోధన స్థానాలలో గత సంవత్సరం నిర్వహించిన పరిశోధనలను సమీక్షించారు. పరిశోధనల ఫలితాలను విశ్లేషించి, రైతుల సమస్యలను, వారి అవసరాలను గుర్తించి, వాటికనుగుణంగా రాబోవు సంవత్సరంలో నిర్వ హించాల్సిన పరిశోధనలకు ప్రణాళికలను రూపొందించారు. నేటి నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. జన్యుశాస్త్రం, మొక్కల ప్రజననం, అణు జీవశాస్త్రం, జీవ సాంకేతికత విత్తన విజ్ఞానశాస్త్రం, సాంకేతికత తదితర విషయాలపై చర్చించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ జెర్మ్ ప్లాజమ్ డిజిటలైజ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్.వసుంధర గత సంవత్సర నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వరి, వేరుశనగ, అపరాల పరిశోధనలో అగ్రగామి విశ్వవిద్యాలయం మరింత మెరుగ్గా పనిచేసి యూనివర్సిటీ ఖ్యాతిని పెంచి, రైతులకు సేవనందిచాలని తెలిపారు. -
క్షణికావేశంతోనే..
సాక్షి, నరసరావుపేట: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కార్ల్ మార్క్స్. ప్రస్తుత సమాజంలో అనుబంధాల కంటే ఆర్థిక పరమైన అంశాలకే విలువనిస్తున్నారు. ఆసరాగా ఉండాల్సిన రక్తసంబంధీకులే రాబంధులుగా మారుతున్నారు. అంతవరకు తమలో ఒకరిగా ఉన్న వ్యక్తులు అంతలోనే శత్రువులుగా మారుతున్నారు. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువవుతోంది. ఎంగిలి పాలు తాగిన అన్నదమ్ముల్లే యమకింకరులవుతున్నారు. ఆస్తి కోసమో... క్షణాకావేశమో కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల చిలకలకూరిపేటలో కన్న తల్లిదండ్రులనే చంపాలని కూతురు చేసిన హత్యాయత్నం నేపథ్యంలో మరోసారి ఈ చర్చ మొదలైంది. తల్లిదండ్రుల ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించి.. కనిపెంచిన తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి వస్తుందన్న కారణంతో కూతురు తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టిన ఘటన గత నెల 29వ తేదీన చిలకలకూరిపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని గుర్రాలచావిడిలో నివాసం ఉంటున్న గౌడిశెట్టి సుకన్య, మల్లికార్జునరావులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెకు వివాహమై ఓ కూతురు పుట్టిన తరువాత భర్తతో విడాకులు తీసుకొని పట్టణంలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె కొన్నాళ్లుగా ఆస్తి కోసం తల్లిదండ్రులతో గొడవ పడుతోంది. గత నెల 29న తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. మంటలు వ్యాపించి ఇంట్లో దాచిన బాణసంచా పేలడంతో పెద్ద శబ్దం రావడంతో తల్లిండ్రులకు మెలుకువచ్చి అదృష్టవశాత్తు మంటల నుంచి బయటపడ్డారు. తాము చనిపోతే ఆస్తి వస్తుందని కన్న కూతురు ఈ ఘాతుకానికి పాల్పడిందని తల్లి సుకన్య చిలకలూరిపేట టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు నివ్వెరపోయారు. ఆస్తి కోసం తల్లిదండ్రులనే చంపాలని కూతురు చూడడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం కోసం తండ్రినే... పొలం కోసం కన్నకొడుకే తనను గొంతునులిమి చంపబోతే ఊరి వదిలి పారిపోయానని తనకు రక్షణ కల్పించాలని ఓ తండ్రి సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... దాచేపల్లికి చెందిన అచ్చాల కనకయ్య(70)కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు. అందరికీ పెళ్లికాగా చిన్న కుమారుడికి మాత్రం పెళ్లి కాకపోవడంతో వారితోనే ఉంటున్నాడు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావుకి పదేళ్ల క్రితమే ఆస్తి పంపకాలు చేసేసాడు. అయితే తన బతుకుతెరువు కోసం ఉంచుకున్న కొద్దిపాటి పొలం కోసం తండ్రిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గత నెల ఇదే క్రమంలో తనను గొంతునులిమి చంపబోతే పొన్నూరు ఆంజనేయ స్వామి గుడిలో తలదాచుకున్నానని కనకయ్య ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ముందు గోడువెళ్లబోసుకున్నాడు. కుటుంబ సభ్యులు తన ఆచూకీ కనుగొని మళ్లీ దాచేపల్లికి తెచ్చారని, అయితే తనకు పెద్ద కొడుకు ద్వారా ప్రాణహాని ఉందని ఎస్పీ ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. ఆస్తి కోసమో, పంతం కోసమో సొంత కుటుంబ సభ్యులను సైతం హత్య, దాడులు చేస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. క్షణాకావేశంతో తాము ఏమి చేస్తున్నాం అన్న స్పృహ లేకపోవడంతోనే ఈ హత్యలు చేస్తున్నారు. ఆర్థికపరమైన ఆంశాలు, పట్టింపులే బంధుత్వాలు దెబ్బతినడానికి కారణమని ఎక్కువమంది మా వద్దకు వస్తున్న వారి ద్వారా తెలిసింది. కొంతమందికి మానసిక రుగ్మతల వల్ల ఇలాంటి విపరీతపోకడలకు వెళుతున్నారు. వారిని ముందుగానే గుర్తించి సరైన వైద్యం చేయిచాల్సి ఉంది. మారుతున్న కాలంతోపాటు కుటుంబ విలువలు తగ్గిపోవడం కూడా దీనికి కారణమవుతోంది. –డాక్టర్ సతీష్ అత్తిలి, మానసిక వైద్యుడు, నరసరావుపేట ఏరియా వైద్యశాల -
ఉక్కుపాదం మోపాలి
అక్రమ లే–అవుట్లు, నిర్మాణాలపై నరసరావుపేట: పల్నాడు జిల్లాలో అనుమతులు లేని అనధికార భవన నిర్మాణాలు, అక్రమ లే–అవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, డీపీఓ, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో అక్రమ లే అవుట్లపై ఆన్లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం–2016 ప్రకారం అనధికార లే–అవుట్లను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ ఐదు ద్వారా స్థానిక సంస్థలకు ఈ చట్టంలోని పలు సెక్షన్ల కింద ప్రత్యేక అధికారాలను కల్పించిందని, దీనిని ఉపయోగించుకొని నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులను నిలుపుదల చేయడం, సీలింగ్, కూల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంలో వెనకాడకూడదని స్పష్టం చేశారు. ఆమోదించబడిన ప్లాన్లకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్న వారిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాకుండా పౌరులు ఏదైనా స్థలం లేదా భవనం కొనుగోలు చేసే ముందే సంబంధిత అనుమతులను సరిచూసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం, పటిష్టమైన పర్యవేక్షణ ద్వారానే అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేయగలమని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు కె.బాలకృష్ణ, శ్రీరాములు, మురళీకృష్ణ, డీఎల్డీఓలు వెంకటరెడ్డి, గబ్రూ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల గణన పూర్తిచేయని అధికారులపై చర్యలు జిల్లాలో ఇండ్లగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ హెచ్చరించారు. సోమవారం జిల్లాలో ఇండ్లగణన ప్రగతిపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల ఒకటవ తేదీ నుంచి 30లోగా ఇళ్ల గణనను ఎన్యూమరేటర్లు ఎట్టిపరిస్థితులలోనూ పూర్తిచేయాలన్నారు. ఇళ్ల గణన ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు నిర్దేశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, ఈ విధులలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు రోజూవారీ నిర్దేశించిన మేర లక్ష్యాలను తప్పనిసరిగా సాధించి నెలాఖరులోగా గణన కార్యాక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రెండురోజుల్లోగా నిర్దేశించిన స్థాయిలో ప్రగతి కనపరచని సిబ్బంది శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహా -
మనీషి
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026మాయమవుతున్న‘మాయవయ్యాడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అన్నట్లుగా.. స్వార్ధం నిండిన సమాజంలో మనుషుల్లో మానవత్వం మంట గలిసిపోతుండగా.. అంతంతమాత్రంగానైనా ఉన్న ప్రేమలు అంతర్ధానమవుతున్నాయి. విలువల వలువలు విప్పగా.. మనిషిగా చచ్చి.. అతనిలోని రాక్షసత్వం బట్టబయలై నడిరోడ్డుపై వికటట్టహాసం చేస్తోంది. ఈక్రమంలో తోటివారికి సాయం దేవుడెరుగు.. ఆస్తిపాస్తుల కోసం సొంతవారినే హతమార్చేందుకు వెనుకాడని ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. ఇందులో లింగభేదం ఎంతమాత్రం లేకపోవడం విశేషం. ఆస్తికోసం తోడబుట్టిన వారిని తుదముట్టించిన సోదరి.. కన్నతల్లిదండ్రులపై పెట్రోలు పోసి తగలబెట్టేందుకు యత్నించిన కూతురు.. వృద్ధుడనే కనికరం కూడా లేకుండా తండ్రిని చంప చూసిన కసాయి కొడుకు.. ఇలాంటి ఘటనలో జిల్లాలో నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. -
దళిత యువకులపై టీడీపీ వర్గీయుల దాడి
టాస్క్ఫోర్స్(ముప్పాళ్ళ): తిరునాళ్లలో భాగంగా ఎస్సీ వర్గీయులు బాణాసంచా పేల్చటానికి వీలులేదంటూ టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి అత్తోట కృష్ణ వర్గీయులు పోలీసుల సమక్షంలోనే భౌతిక దాడికి దిగిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గీయులు విద్యుత్ప్రభ పైన ఆర్కెష్ట్రా ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో భాగంగా అదే గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు జొన్నలగడ్డ ప్రసన్న, మాతంగి రత్నబాబు, మరికొందరు దీపావళి మందులు కాల్చేందుకు సిద్ధమవుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి అత్తోట కృష్ణ, గరికపాటి సాంబశివరావు, గరికపాటి కరుణ, ఎర్రంనేడి రవితేజ తో పాటుగా మరికొంతమంది మీకు ఇక్కడేం పనిరా అంటూ... ఒక్కసారిగా దాడికి దిగారు. దాడితో పాటుగా విచక్షణారహితంగా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో దుర్బాషలాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబసభ్యులను సైతం బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు యువత తెలిపారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరగటం గమనార్హం. దాడిలో ప్రసన్న, రత్నబాబులకు స్వల్ప గాయాలయ్యాయి. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఇలాంటి దాడులు చేయడం ఏంటని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై బాధితులు ముప్పాళ్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక
సత్తెనపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే 45వ జాతీయస్థాయి సబ్ జూనియర్స్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాల, బాలికల జట్టును ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరుశరాముడు సోమవారం ప్రకటించారు. బాలుర జట్టు రామ్ తేజ్, ( కెప్టెన్ కృష్ణా జిల్లా), తిరుమల సాయి త్రినేష్ (విశాఖపట్నం), నందన్రెడ్డి (గుంటూరు), కార్తీక్ (కర్నూలు), శ్రీను నాయక్ (అనంతపురం), సురేష్, చితాస్ (పల్నాడు), గణేష్ (అన్నమయ్య), శేషాద్రి (తిరుపతి), అభిలాష్ (అనంతపురం), రిత్విక్ రెడ్డి (నెల్లూరు), ఎతిక్ రత్న (ఏలూరు) ఎంపికయ్యారు. బాలికల జట్టు యశస్విని (కెప్టెన్, చిత్తూరు జిల్లా), భూమిక (విశాఖపట్నం), గీతిక (గుంటూరు) ఊహ (గుంటూరు), సుచరిత (ప్రకాశం) ,హర్షిత (పల్నాడు), స్వాతి కీర్తన (పల్నాడు), శేన్షి (తిరుపతి), శ్రీలత (అన్నమయ్య), అర్చన (నెల్లూరు), జశ్విత రాణి (అనంతపురం), ఎం.హర్షిణి (గుంటూరు)లు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రాణించి విజయంతో తిరిగి రావాలనీ పరశు రాముడు అభినందించారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి కిరణ్కుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి విజయకుమార్ పాల్గొన్నారు. -
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్బీఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. నగరంపాలెం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సెంట్రలైజ్డ్ లంచ్ టైమ్ డిమాన్స్ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్బీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్బీఐ బ్యాంక్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలని, శాశ్వత ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ సెక్రటరీ కాకుమాను కోటి రెడ్డి, నరేంద్ర కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి
చిలకలూరిపేటటౌన్/ యడ్లపాడు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా చిలకలూరిపేట డిపో డ్రైవర్లు సోమవారం ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి చిలకలూరిపేట వస్తున్న బస్సును చౌడవరం స్టాప్వద్ద ఆపకపోవడంతో స్థానికులు కొందరు ఆగ్రహించి డ్రైవర్ జి దుర్గాప్రసాద్పై భౌతిక దాడికి దిగడం ఈ ఉద్రిక్తతకు దారితీసినట్టు తెలిసింది. తమ సహచర ఉద్యోగిపై జరిగిన దాడిని ఖండిస్తూ సుమారు 35 మంది అద్దె ప్రాతిపదికన పనిచేసే (కాల్) డ్రైవర్లు ఉదయం నుంచే విధులను బహిష్కరించి మరుసటిరోజు బస్టాండ్ ఆవరణలో ధర్నాకు దిగారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి, తమకు రక్షణ కల్పించే వరకు బస్సులు కదిలించేది లేదని భీష్మించుకోవడంతో డిపో కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. డిపో మేనేజర్ వై వేణు ఆందోళనకారులతో చర్చలు జరిపి సర్దిచెప్పే ప్రయత్నం ఫలించలేదు. కార్మికులు ససేమిరా అనడంతో పాటు సోమవారం తమ విధుల్ని పూర్తిగా బహిష్కరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఇక్కట్లు... డ్రైవర్ల ఆందోళన ప్రభావం సామాన్య ప్రయాణికులపై తీవ్రంగా పడింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులు గంటల తరబడి నిలిచిపోవడంతో బస్టాండ్లో వేచి ఉన్న మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన డిపో మేనేజర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇతర డ్రైవర్ల ద్వారా కొన్ని సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ, మరో 8 బస్సులు డ్రైవర్లు లేక డిపోకే పరిమితమయ్యాయి. బాధిత డ్రైవర్ ద్వారా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ సిబ్బంది నిరసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది భద్రతపై స్పష్టమైన హామీ లభించే వరకు పోరాటం ఆపబోమని డ్రైవర్ల సంఘం స్పష్టం చేయడంతో డిపో పరిసరాల్లో ఆందోళన వాతావరణం కొనసాగుతోంది.


