Palnadu
-
వైఎస్సార్సీపీ నేత అక్రమ నిర్బంధం.. పరాకాష్టకు ‘కూటమి’ అరాచకాలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఈపూరు మండల వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ కొండవర్జి నాగేశ్వరరావు యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజాగళంలో మాట్లాడినందుకు నాగేశ్వరావును పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మిర్చి పొలానికి రాత్రి కాపలాకు నాగేశ్వరావు యాదవ్ దంపతులు వెళ్లగా.. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ లీగల్ టీం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పొన్నవోలు సుధాకర్రెడ్డిని ఈపూరు పోలీస్ స్టేషన్కు వైఎస్సార్సీపీ అధిష్టానం పంపించింది. దీంతో నాగేశ్వరరావు యాదవ్పై ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. ఈపూరు ఎస్ఐ వదిలేశారు.పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వినుకొండను కూటమి ప్రభుత్వం అరాచకాల అక్రమాలతో అనకొండగా మార్చిందని మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను టీడీపీ గుండాలు అత్యంత దారుణంగా హత్య చేశారు. పది నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. మీడియాతో మాట్లాడినందుకు నాగేశ్వరావు యాదవ్ను తీవ్రవాదిని తీసుకువెళ్లినట్టు పొలం నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో నేను వినుకొండ వచ్చాను. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి ధ్వజమెత్తారు.వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వినుకొండలో దారుణాలు, అక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలను నాయకుల్ని పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భయపెడితే భయపడే రకం ఇక్కడ ఎవరూ లేరు. అన్నిటికి సిద్ధమయ్యే ఉన్నాం. ప్రభుత్వం ప్రజల హక్కులను కాల రాస్తోంది. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని బ్రహ్మనాయుడు హెచ్చరించారు. -
నిర్ణీత గడువులోగారీ సర్వే పూర్తిచేయాలి
నకరికల్లు: భూముల రీసర్వేను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. మండలంలోని కండ్లకుంటలో సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి, సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులతో మాట్లాడారు. రీసర్వేపై ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే సత్వరమే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొలుత స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రాథమిక సేవలు, విద్యుత్ తదితర మౌలిక వసతులు తనిఖీ చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. అనంతరం చల్లగుండ్లలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపే పనులను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కూలీలతో మాట్లాడారు. సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పని ప్రదేశాల్లో టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. పొలాల్లో చెరువులను తవ్వుకుంటున్న రైతులతో మాట్లాడి, పలు సూచనలు ఇచ్చారు. ఈ– శ్రమ కార్డ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్వే అండ్ రికార్డ్స్ అధికారి మధుకీర్తి, డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, డీఈఓ చంద్రకళ, పలు శాఖల అధికారులు ఉన్నారు. కలెక్టర్ పి.అరుణ్బాబు మండలంలోని పలుచోట్ల పరిశీలన -
ప్రశాంతంగా పది పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 25,607మందికి గాను 25,373మంది, ప్రైవేటు విద్యార్థులు 78మంది హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థుల హాజరు 99శాతంగా నమోదైనట్టు ఆమె వివరించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నియమించిన 22 సిట్టింగ్, 13 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాలను సందర్శించినట్టు తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదవ తరగతి దూరవిద్య ఇంగ్లిష్ పరీక్షకు జిల్లాలోని 27 కేంద్రాల్లో 1,118మందికి గాను 977మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నకరికల్లు జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ నకరికల్లు, కారంపూడిలోని నాలుగు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులరెడ్డి సతైనపల్లి డివిజన్లోని ఆరు కేంద్రాలు, దూరవిద్య డైరెక్టర్ ఆర్.నరసింహారావు పట్టణంలోని ఐదు కేంద్రాలు, జాయింట్ డైరెక్టర్ ఎన్.గీత వినుకొండలోని 11 కేంద్రాలు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఎన్.అక్బర్ అలీ గురజాలలోని రెండు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 99శాతం విద్యార్థుల హాజరు పరీక్షల నిర్వహణను పరిశీలించిన అధికారులు -
సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు
ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యవసాయ కూలీలు ఫిబ్రవరి 9న సాయంత్రం మిరప కోతలకు వెళ్లి ట్రాక్టర్పై తిరిగి వస్తూ ప్రమాదంలో మృతి చెందారు. తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ ఒక్కో కుటుంబానికి రూ.25వేలు అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కలెక్టర్ అరుణ్బాబు హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆయా కుటుంబాలకు సాయం అందలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ సాంకేతిక కారణాలతో వెనక్కి వచ్చిందని స్థానిక ఆధికారలు చెబుతున్నారు. గత సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో బాధిత కుటుంబాలు నష్టపరిహారం అందివ్వాలని కోరాయి. బీమా పథకం అమలులో ఉంటే ప్రతి కుటుంబానికీ హక్కుగా రూ.10 లక్షలు దక్కేదని బాధితులు వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం లబ్ధిదారులు మరణించిన వెంటనే గంటల వ్యవధిలో సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వెళ్లి పేరు నమోదు చేసుకొని, మట్టి ఖర్చుల నగదు అందజేసేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: తీవ్ర పని ఒత్తిడితో ఉద్యోగం చేయలేక పోతున్నా.. వద్దు అంటే పెళ్లి చేశారు.. ఇప్పుడు ఉద్యోగం మానేస్తే భార్య తరఫు బంధువుల నుంచి మాట వస్తుంది.. ఒత్తిడి తట్టుకోలేక లోకం విడిచి వెళ్తున్నా..అమ్మా నాన్న నన్ను క్షమించండి ! అంటూ నాలుగు నెలల క్రితం వివాహం అయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు (29) కు నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన సౌజన్యతో నాలుగు నెలల కిందట వివాహం అయ్యింది. హనుమంతరావు రెండేళ్ల నుంచి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పెద్దలు అతనికి నచ్చ చెప్పారు. కొన్ని రోజులు బాగానే ఉండి రెండ్రోజుల కిందట భార్యను పుట్టింట్లో వదిలి నరసరావుపేట బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం నుంచి అతను గది బయటకు రాకపోవడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది మంగళవారం రాత్రి తలుపు బద్దలకొట్టి చూడగా ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ సీహెచ్ విజయ్ చరణ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు వివిధ మార్గాల్లో ప్రయత్నం బండ్ల హనుమంతరావు ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత పలు రకాలుగా ప్రయత్నం చేసి విఫలమై చివరకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భావిస్తున్నారు. కత్తితో మెడ కోసుకునేందుకు మొదట ప్రయత్నం చేశాడు. మృతుడి మెడ భాగంలో ఉన్న గాట్లను పరిశీలించిన పోలీసులు అక్కడ ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. పురుగు మందు తాగిన భార్య భర్త ఆత్మహత్య విషయం తెలుసుకున్నయ సౌజన్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. పని ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్ నాలుగు నెలల క్రితమే వివాహం -
అడ్డదారిలో తగ్గేదేలే !
సాక్షి , టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అక్రమార్కులకు వరంగా మారింది. అడ్డదారిలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వానికి రాయల్టీలు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో కూటమి నేతలు కూడా భాగస్వాములుగా చేరి బరితెగిస్తున్నారు. అడ్డ‘దారి’లో తగ్గేదేలే ! అంటూ విర్రవీగుతున్నారు. తమను అడ్డుకునేదెవరూ అంటూ రెచ్చిపొతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చే గ్రానైట్ లారీలను రాష్ట్ర సరిహద్దు దాటిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండల పరిధిలోని రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల మీదుగా రోజుకి 50కి పైగా లారీలు దాటిపోతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి చేరుతోంది. సరిహద్దు దాటించేందుకు భారీ వసూళ్లు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్ పుష్కలంగా ఉంది. లారీల ద్వారా తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. జాతీయ రహదారులపై అధికారులు తనిఖీలు చేసే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో దాటేలా స్కెచ్ వేశారు. చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లో లారీ బయలుదేరగానే సరిహద్దు దాటించే అక్రమార్కులకు ముందుగానే సమాచారం అందిస్తారు. గురజాలకు గ్రానైట్ లారీ వచ్చిన తరువాత అక్కడే బేరం కుదుర్చుకుంటారు. ఒక్కొ లారీకి రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తారు. కూటమి నేతలు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నారు. వీళ్ల కళ్లుగప్పి గ్రానైట్ లారీ సరిహద్దు దాటితే వెంటబడి, బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడతారు. మామూళ్లు ఇవ్వకపోతే అధికారులకు వీరే ఫోన్లు చేసి పట్టిస్తారు. గురజాలలో బేరసారాలు అక్రమాలకు పాల్పడే వారు సైతం ఎస్కార్ట్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పోలీసులు, మంత్రుల వాహనాలకు పోలీస్ సైరన్లు ఉంటాయి. కానీ గ్రానైట్ వాహనాలను సరిహద్దు దాటించే అక్రమార్కుల వాహనాలకు ఈ సైరన్లు అమర్చుకున్నారు. చీమకుర్తి, మార్టూరు నుంచి గ్రానైట్ వాహనాలు నకరికల్లు మీదుగా కారంపూడి అక్కడ నుంచి గురజాలకు వస్తాయి. అక్రమార్కులు వాహనం వద్దకు వెళ్లి బేరాలు మాట్లాడుకుని గురజాల నుంచి పులిపాడు, శ్రీనివాసపురం, పొందుగల మీదుగా రాష్ట్ర సరిహద్దు దాటిస్తారు. గ్రానైట్ వాహనాలకు ముందుగా కార్లలో, ద్విచక్ర వాహనాల్లో వెళతారు. అధికారులు ఉన్నారా..లేదా ? అని ఆరా తీస్తారు. కిందిస్థాయి సిబ్బంది ఉంటే కొంతముట్టజెప్పి సరిహద్దు దాటిస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇటువంటి అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఒకవేళ లారీలను మైనింగ్, వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఆపితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. సరిహద్దు దాటుతున్న గ్రానైట్, ఇసుక గురజాల వయా శ్రీనివాసపురం మీదుగా రవాణా లారీలను దాటించి సొమ్ము చేసుకుంటున్న కూటమి నేతలు ఒక్కో లారీకి రూ.40వేలకుపైగా వసూలు రోజుకి 50 లారీలకు పైగా రవాణా ఎస్కార్ట్ వాహనాలతో ఓ గ్యాంగ్ పహరా ప్రభుత్వ ఆదాయానికి గండి ఇసుక లారీలు రైట్ రైట్ ఇసుక లారీలుసైత సరిహద్దులు దాటిపోతున్నాయి. అచ్చంపేట, క్రొసూరు రీచ్ల నుంచి కూటమి సైన్యమే సరిహద్దు దాటిస్తోంది. ఒక్కో లారీకి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజుకి 40కిపైగా ఇసుక లారీలు అక్రమంగా సరిహద్దు దాటుతున్నాయి. ఇటీవల అధికారులు దాడులు చేసి గ్రానైట్, ఇసుక లారీలను పట్టుకున్నారు. పెనాల్టీలు చెల్లించిన తరువాత వదిలేయడం గమనార్హం -
డీఆర్డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ
నరసరావుపేట: జిల్లా డీఆర్డీఎ పీడీగా ఝాన్సీరాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె ఒంగోలు జిల్లాలో విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. కలెక్టర్ పి.అరుణ్బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన బాలూనాయక్పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. గేట్లో జశ్వంత్ భవానీకి 6వ ర్యాంక్ నరసరావుపేట ఈస్ట్: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2025 పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన పెంటేల జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించాడు. జశ్వంత్ భవాని తండ్రి రాజశేఖర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ముంబైలో 5జీ సిస్టమ్ ఇంజనీర్గా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గేట్ పరీక్షలకు జశ్వంత్ సిద్ధం అయ్యాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. ఇందులో దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేశారు. 1,27,005 బస్తాల మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,27,005 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,24,077 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,903 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్న ప్రభుత్వం
చిలకలూరిపేట: రాజకీయ అరాచకాలకు పరాకాష్ట కూటమి ప్రభుత్వ పాలన అని... న్యాయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పరిపాలనపై, పేదలపై ప్రేమ లేదని, కేవలం రాజ్య హింసను మాత్రమే ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్డా రాకేష్గాంధీ కేసు విచారణ నిమిత్తం చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బుధవారం ఆయన హాజరయ్యారు. మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించడంలో పురోగతి సాధించిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కోరితే రాష్ట్ర డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వరని, టీడీపీ వారు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే ఏ మాత్రం కేసులు నమోదు చేయరని ఆరోపించారు. అదే టీడీపీకి చెందిన వారు ఫిర్యాదు చేయడం ఆలస్యం, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు రాష్ట్రం నలుమూలల కేసులు నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న ఆరాచక వైఖరిని మర్చిపోమని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పోలీసు అధికారులను న్యాయ స్థానాల ముందు నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు. జర్మనీలో హిట్లర్ పరిపాలన కాలంలో ముందుగా యూదులను వేధించారని, తమను కాదని కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నారన్నారు. అనంతరం కమ్యూనిస్టులను, సోషలిస్టులను కూడా వేధించారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న ప్రభుత్వం తదుపరి సమస్యలపై ప్రశ్నించే ప్రతి గొంతుకను వేధించటం ఖాయమన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు. అన్నీ తప్పుడు కేసులే ! ప్రస్తుతం కేసులు బనాయించి వేధిస్తున్న దొడ్డా రాకేష్ గాంధీ కేసులో పేర్కొన్న ఆరో తేదీ రాత్రి 9గంటలకు గుంటూరులోని శ్యామలానగర్లో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు ఉన్నాయని, అవి న్యాయస్థానంలో అందజేశామని తెలిపారు. ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఫణీంద్ర అదే సమయంలో గుంటూరులోని ఓ సెలూన్లో ఉండగా, మరో ముద్దాయి రామకోటేశ్వరరావు హైదరాబాద్లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఇలాంటి తప్పుడు కేసుల్లో పోలీసుల తరుఫున డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ స్థాయి న్యాయాధికారి హాజరుకావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు వేరే ఉన్నాయని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. రాకేష్గాంధీని కస్టడీకి తీసుకొని తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. భారతదేశంలో పోలీసుల ముందు ఇచ్చిన వాగ్మూలానికి చట్టబద్దత ఉండదని తెలిపారు. బీసీ మహిళ అయిన మాజీ మంత్రి విడదల రజినీని కేసులో ఇరికించి వేధించేందుకే పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను న్యాయపరంగా ఆదుకొనేందుకు, అరాచకాలను అడ్డుకొనేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి సుదీర్ఘ వాదనలు రాకేష్గాంధీకి బెయిల్ మంజూరు చేయాలని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. అతనిని పోలీసు కస్టడికి అప్పగించాలని డీడీవోపీ బర్కత్ అలిఖాన్ పోలీసుల తరఫున వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఆర్డర్లు జారీ చేస్తామని వెల్లడించారు. -
గేట్లో హేమంత్కు 25వ ర్యాంకు
నూజెండ్ల: గేట్–2025 పరీక్ష ఫలితాల్లో ఘంటా హేమంత్ 25వ ర్యాంకు సాధించాడు. ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అతడు ప్రస్తుతం చైన్నె ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులైన ఘంటా నాగేశ్వరరావు, సుజాత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మైక్రోసాఫ్ట్కు ఎంపికయ్యాడు. గేట్ ర్యాంకు ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో హేమంత్ పీజీ చేయటానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ స్కాలర్షిప్లు పొందుతూ చదువుకునే అవకాశాలు ఉంటాయని నాగేశ్వరరావు తెలిపారు. -
సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్న
దొడ్లేరు(క్రోసూరు): సాగర్ నీళ్లు విడుదల కాక, వదిలినా దిగువ పొలాలకు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం దొడ్లేరులో రైతులు ధర్నా చేపట్టారు. రబీలో దాళ్వా వరి సాగు చేస్తున్న వారంతా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువల్లో చుక్క నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. క్రోసూరు మండలం దొడ్లేరు పరిధిలోని కస్తల మైనర్ కింద 500 హెక్టార్ల ఆయకట్టు ఉంది. దీనికి నాగార్జున సాగర్ కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తారు. అవి ఎర్రబాలెం మేజర్ దాటుకుని, చింతపల్లి మేజర్కు వెళ్లే మార్గంలో దొడ్లేరులోని కస్తల మైనర్కు రావాలి. అయితే, నీళ్లందక కస్తల మైనర్ డ్రాప్ కూడా ఎండిపోయింది. పొలాలకు నీళ్లు వచ్చే దిక్కే లేదు. దీనిపై కెనాల్స్ ఏఈ బండి శ్రీనివాసరావును వివరణ కోరిగా 500 క్కూసెక్కులకు గానూ ప్రస్తుతం 350 మాత్రమే సరఫరా అవుతున్నాయని తెలిపారు. వారాబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. నాలుగు రోజులు ఎర్రబాలెం మేజర్కు, తర్వాత నాలుగు రోజులు కస్తల మైనర్కు వదులుతామని తెలిపారు. గురువారం దొడ్లేరు పొలాలకు విడుదల చేస్తామని వెల్లడించారు. పంటలను కాపాడండి నేను పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. కాలువ నీళ్లు రాకపోవడంతో కళ్ల ఎదుటే పంట ఎండి పోతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. –షేక్ బాషా, దొడ్లేరు నీరు అందడం లేదు కాలువకు నీళ్లు విడుదల చేయడం లేదు. చేసినా కింద పొలాలకు అందడం లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. – షేక్ కరీమూన్, దొడ్లేరు పది రోజులుగా ఎండిపోతున్న పంటలు -
జలాల్పురంలో ఆధ్యాత్మిక శోభ
● భక్తిశ్రద్ధలతో పునీత జోజిప్ప మహోత్సవం ● పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు ● ఆకట్టుకున్న సాంఘిక నాటిక పెదకూరపాడు: మండలంలోని జలాల్పురంలో బుధవారం పునీత జోజిప్ప దేవాలయ పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాటిబండ్లి విచారణ గురువులు రెవరెండ్ హదయకుమార్, సహాయక గురువులు సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దివ్య పూజ బలిని నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి హదయకుమార్, సురేష్ మాట్లాడారు. ఆధ్యాత్మక చింతనతో ప్రతి ఒక్కరూ సిలువ మార్గంలో నడవాలని కోరారు. తోటి వారికి సాయం చేస్తూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని కోరారు. పునీత జోజిప్ప మానవాళికి మార్గదర్శమని తెలిపారు. పలువురు గురువులు మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు పునీత జోజిప్ప మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిచారు. బాల ఏసు యువజన నాట్యమండలి కళాకారులు ప్రత్యేక నాటికలను ప్రదర్శించారు. రాత్రి భారీ బాణసంచా కాల్చుతూ, మేళతాళాలతో గ్రామంలో తేరు ఊరేగింపు నిర్వహించారు. -
పత్తి వ్యాపారి ఆత్మహత్య
ప్రత్తిపాడు: పత్తి వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన కాసు నాగిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ పదేళ్లుగా పత్తి కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా బామిని మండలం దమ్మిడిజోలా గ్రామ పరిధిలోని రైతుల దగ్గర పత్తిని కమీషన్ పద్ధ్దతిన బొమ్మా కొండారెడ్డి అనే అతనికి ఇప్పిస్తుంటాడు. అయితే ఆ పత్తికి సంబంధించిన డబ్బులు, కమీషన్ కలిపి నాగిరెడ్డికి రూ.43 లక్షలు కొండారెడ్డి ఇవ్వాల్సి ఉంది.కొంత కాలంగా రైతులు డబ్బులు అడుగుతున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని, రైతుల పత్తికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని కొండారెడ్డిని నాగిరెడ్డి అడుగుతున్నాడు. దీంతో తన దగ్గర డబ్బులు లేవని, పదే పదే డబ్బులు అడిగితే కోర్టులో కేసు వేస్తానని కొండారెడ్డితోపాటు ఆయన సోదరుడు శ్రీనివాస్రెడ్డి నాగిరెడ్డిని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మంగళవారం గ్రామంలోని సాగర్ కాలువ వద్ద ఉన్న సమాధుల వద్ద పురుగు మందు తాగి నాగిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు విషయాన్ని అతని భార్య రాజ్యలక్ష్మికి తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు ఎస్ఐ కె.నాగేంద్ర బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాయి సాధన చిట్ ఫండ్ కేసు గుంటూరుకు బదిలీ
నరసరావుపేటటౌన్: సాయి సాధన చిట్ ఫండ్ స్కాం కేసు గుంటూరు సీఐడీ కోర్టుకు బదిలీ అయ్యింది. సుమారు 600 మంది చిట్స్ సభ్యులు, డిపాజిట్ దారులను భారీస్థాయిలో మోసగించినట్లు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్బారెడ్డి ఫిర్యాదుతో నెల కిందట వన్టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇందులో గ్రావిటీని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సీఐడీకి అప్పగించడంతో పాటు కొన్ని ప్రత్యేక చట్టాలను కూడా జత పరిచింది. దీంతో కేసును సీఐడీ కేసుల విచారణ కోర్టు అయిన గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బుధవారం గుంటూరు సీఐడీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. దీంతోపాటు 13వ అదనపు జిల్లా కోర్టులో పాలడుగు పుల్లారావు కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బదిలీ అయింది. కాగా పాలడుగు పుల్లారావుతో పాటు చిట్ఫండ్లో భాగస్వాములుగా ఉన్న ఆయన భార్య వాణిశ్రీ , కుమారుడు పవన్ కుమార్, కుమార్తె శ్రీహర్షవర్ధిని, అల్లుడు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ నూకవరపు రాజా రమేష్, నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన గాలి కోటయ్యలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. పుల్లారావు ఇప్పటికే కోర్టులో లొంగిపోయి జైల్లో ఉండగా, మిగిలిన వారు పరారీలో ఉండి, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య దాచేపల్లి : మండలంలోని పొందుగల రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం నుంచి తల వేరు అయింది. శరీరంపై నలుపు రంగు బనియన్, ప్యాంట్ ఉంది. సంఘటన స్థలాన్ని జీఆర్పీ ఏఎస్ఐ వెంకట్రామయ్య, కానిస్టేబుల్ రామరాజు పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలకు 9440438256, 9949063960 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సాగర్ ఎర్త్డ్యాం కింద అగ్నికీలలు
● నాలుగు గంటల శ్రమ అనంతరం అదుపులోకి వచ్చిన మంటలు ● కాలిపోయిన సీసీ కెమెరాల కేబుల్వైర్లు ● అగ్నికి ఆహుతైన విద్యుత్ కేబుల్ విజయపురి సౌత్: సాగర్ ప్రధాన డ్యాం ఎడమ వైపున గల ఎర్త్డ్యాం కింద బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు లేచాయి. ఎండిన కార్పె గ్రాస్కు అంటుకోవడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున లేచాయి. దిగువనే ఉన్న శివం పార్కులో ఎండిన గడ్డి ఉండటంతో దానికి మంటలు అంటుకుని గాలి వాటానికి కిలోమీటరు మేర తగలబడింది. మెయిన్ డ్యాంకు సమీపంలో వ్యూ పాయింట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ పోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బంది అధికారులను అలర్ట్ చేశారు. మెయిన్ డ్యాం ముఖ ద్వారం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది, జెన్కో, సాగునీటి శాఖ సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. ఈలోపు ఫైర్ ఇంజన్ వచ్చింది. నాలుగు గంటల శ్రమ అనంతరం ఎట్టకేలకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఎర్త్ డ్యాంపై గల విద్యుత్ కేబుల్స్, సీసీ కెమెరాల కేబుల్స్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి కావడంతో ఎంతమేరకు నష్టం జరిగింది తెలియడం లేదని డ్యాం ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం అంచనా వేస్తామని వెల్లడించారు. -
జాతీయ రహదారిపై లిక్కర్ లారీ బోల్తా
యడ్లపాడు: జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి లిక్కర్ లారీ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి మద్యం లోడుతో సామర్లకోట వెళుతున్న లారీని రోడ్డు పక్కగా ఆపి డ్రైవర్ నిద్ర పోతున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ లిక్కర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిక్కర్ లారీ సర్వీస్ రోడ్డుపై పడిపోగా, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం సీసాలు పగిలి రోడ్డుపై పడిపోయాయి. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని లీకేజీని పరిశీలించారు. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించి, లారీ తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం విజయపురిసౌత్త్: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సరోజిని తెలిపారు. ఆమె కళాశాలలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ కల్లా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ చేరడానికి ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు 26 కేంద్రాల్లో ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఫీజు రూ. 300ను ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. గురుకుల, జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నోట్, టెక్ట్స్ బుక్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, నీట్, సీఏ(సీపీటీ) కోచింగ్ ఇస్తామని తెలిపారు. నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం www.aprrapcfrr.in వెబ్సైట్లో చూడాలని ఆమె సూచించారు. అర్హత గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. జూట్ ఉత్పత్తులతో ఆర్థికాభివృద్ధి సాధించాలి రాజుపాలెం: జూట్ ఉత్పత్తుల తయారీలో శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సీఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ బి. బబిత తెలిపారు. మండలంలోని కొండమోడు మండల పరిషత్ పాఠశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ఆధ్వర్యంలో మహిళలకు జూట్ ఉత్పత్తుల తయారీలో శిక్షణను బుధవారం ప్రారంభించారు. డైరెక్టర్ బబిత మాట్లాడుతూ నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామంలోని ముస్లిం మహిళలకు జూట్ ఉత్పత్తుల శిక్షణను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ ప్రోగ్రాం అధికారి మండూరి వెంకటరమణ, శిక్షకురాలు పి.దుర్గ, కె.ఎన్.ఆర్. విద్యా సంస్థల డైరెక్టర్స్ కోనేటి నరసింహారావు, బాడిసె మస్తాన్రావు పాల్గొన్నారు. మొదటి రోజు శిక్షణకు 50 మంది మహిళలు హాజరయ్యారు. -
తెల్లజొన్న రైతు విలవిల
కొల్లూరు: ఖరీఫ్లో వరి సాగు చేసిన అన్నదాతలు మూడొంతులు పంట అయినకాడికి దళారులకు విక్రయించి నష్టాలను చవిచూశారు. నామమాత్రంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సామాన్య రైతులు పండించిన పంటల విక్రయానికి ఆంక్షలు ఎదురవడంతో దళారులను ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుతం రబీలో సాగు చేసిన పంటకై నా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి పారదర్శకంగా కొనుగోలు చేస్తుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురవుతోంది. దీనంగా తెల్లజొన్న రైతుల పరిస్థితి రబీలో తెల్లజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దీనంగా మారింది. నియోజకవర్గంలో చుండూరు, అమృతలూరు మండలాలలో రైతులు అధిక శాతం మినుము, పెసర సాగు చేశారు. పెసర పంటకు మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు మండలాలలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగైంది. సుమారు 8 వేల ఎకరాలకు పైగా తెల్లజొన్న సాగులో ఉంది. కొనే దిక్కేది? కొల్లూరు మండలంలో 1,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తెల్లజొన్న వేయగా.. ప్రస్తుతం పంట చేతికందింది. రైతులు జొన్న కంకులు కోసుకొని నూర్పిళ్లు పూర్తి చేస్తున్నారు. మండలంలోని కొల్లూరు, క్రాప, అనంతవరం, చిలుమూరు ప్రాంతాలలో తెల్లజొన్న కంకులు కోత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 200 ఎకరాల వరకు జొన్న కోతలు పూర్తయ్యాయి. ఎకరాకు సుమారు రూ. 20 వేలు పెట్టుబడులు పెట్టారు. సగటున 25 బస్తాల దిగుబడి లభిస్తోంది. గతేడాది ఇదే సమయంలో జొన్న క్వింటాకు రూ. 2,400 వరకు లభించడంతో రైతులకు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించకపోవడంతో క్వింటాకు దళారులు రూ. 2 వేలు నుంచి రూ. 2,100 వరకు ఇస్తున్నారు. దీంతో రైతాంగం నష్టపోతోంది. రబీలో సాగు చేసిన పంటల విక్రయాలకు వీలుగా వ్యవసాయ శాఖాధికారులు ఈక్రాప్ బుకింగ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. పంట చేతికందినా విక్రయించే మార్గం శూన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలు, మద్దతు ధర లేక ఆవేదన దళారులకు తక్కువ ధరకే అమ్మాల్సిన దుస్థితి కూటమి సర్కారు తీరుతో నష్టపోతున్న అన్నదాతలు కొనుగోలు కేంద్రాల ఊసేదీ? రబీలో సాగు చేసిన పంటల కొనుగోలుకు వ్యవసాయ శాఖాధికారులు పంట నమోదు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దళారులు చెప్పిన ధరలకే అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పంట కోతలు చివరి దశకు చేరుకునే సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండాపోతుంది. – టి. సురేష్, రైతు అనుమతులొస్తే కేంద్రాలు ఏర్పాటు తెల్లజొన్న ప్రస్తుతం కోత దశకు రావడంతో రైతులు నూర్పిళ్లు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో మార్క్ఫెడ్ నుంచి ఆదేశాలు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం – ఆర్.వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖాధికారి, కొల్లూరు. -
మాలలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర
నరసరావుపేట: రాష్ట్రంలో మాలలు, వారి ఉప కులాలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ మాల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తల జయరావు ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి హాజరైన జాన్పాల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 2021 జనాభా లెక్కలు తేల్చకుండా వర్గీకరణ అమలు చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో వేసిన వన్మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపటాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ చేసిన సూచనలను అమలు చేయకుండా, ఎంపారికల్ డేటా తీయకుండా రాష్ట్ర విభజనకు ముందు ఉన్న 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకొని వర్గీకరణ చేయటం దారుణన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజా పోరాటంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రోజుల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ గోదా బాల, జిల్లా ఉపాధ్యక్షుడు కోండ్రు విజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రపాటి ఎర్రయ్య, నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేబినేట్ ఆమోదంపై మాల మహానాడు ఆగ్రహం -
బీసీ సంక్షేమ సంఘం జిల్లా కో–కన్వీనర్గా తిరుమల
సత్తెనపల్లి: బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా కో–కన్వీనర్గా సత్తెనపల్లికి చెందిన సంకుల తిరుమలరావు (తిరుమల), నియోజకవర్గ అధ్యక్షుడిగా మందడపు శివసాయిలు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంకళరావు యాదవ్ నుంచి తిరుమల, శివసాయిలు మంగళవారం నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల, శివసాయి నియామకంపై పలువురు హర్షం వెలిబుచ్చారు. గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య పిడుగురాళ్ల: గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుత్తికొండ గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన పరిటాల పోతురాజు(60) అనే రైతు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సక్రమంగా లేకపోవటం వలన సోమవారం రాత్రి గడ్డిమందు తన ఇంట్లోనే తాగాడు. గమనించిన భార్య హనుమాయమ్మ వెంటనే హుటాహుటిన పిడుగురాళ్ల ప్రైవేటు హాస్పటల్కు తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం గుంటూరు జీజీహెచ్లో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుమారుడు పరిటాల రామలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ పేర్కొన్నారు. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి నరసరావుపేటటౌన్: మీటర్ రీడర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సంఘ ప్రతినిధులు మంగళవారం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ రాంబొట్లను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి షేక్ యాసిన్, జాయింట్ సెక్రటరీ శివసాయి మాట్లాడుతూ మీటర్ రీడర్స్కి కనీస వేతనం అమలు చేయాలన్నారు. మీటర్ రీడర్స్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. రిచార్జి స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ అందరికీ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలన్నారు. గత 20 ఏళ్లుగా చాలీచాలని జీతంతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ సంఘం రాష్ట్రవ్యాప్త ప్రథమ మహాసభ అనంతరం కార్యచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మీటర్ రీడర్స్ కార్మికులు మార్చి 18న డీఈ ఆఫీస్ ముందు ధర్నా, 20న ఎస్ఈ ఆఫీసు ముందు ధర్నా, 24న కలెక్టర్కు సమస్యలపై వినతి పత్రం సమర్పించడం, 27న సీఎండీ కార్యాలయం ముందు ధర్నా తదితర కార్యచరణ రూపొందించామన్నారు. అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య దామరపల్లి(తాడికొండ): వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల బాధ పెరిగి కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడికొండ మండలం దామరపల్లి గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టం వస్తుండటంతో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చారు. కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపం చెందారు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడికి గురిచేస్తుండటంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో మనస్థాపంతో శ్రీనివాసరావు భార్య అరుణ కుమారి ఈనెల 14న పొలానికి వేసేందుకు తెచ్చిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మంగళవారం ఉదయం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. పట్టాభిపురం సీఐ పోస్టుపై సందిగ్ధం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పశ్చిమ సబ్ డివిజన్లోని పట్టాభిపురం పీఎస్ సీఐ పోస్టుపై సందిగ్ధం నెలకొంది. వీఆర్లో ఉన్న సీఐ ఎం.మధుసూదనరావును ఈనెల 16న పట్టాభిపురం పీఎస్ సీఐగా నియమిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి వరకు విధుల్లో ఉన్న వీరేంద్రబాబును సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కొత్త సీఐగా మధుసూదనరావు అదే రోజు రాత్రి స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్కు బ్రేక్పడినట్లు తెలుస్తోంది. దీంతో సందిగ్ధం నెలకొంది. బుధవారం సాధ్యమైనంత వరకు ఆయనే మళ్లీ సీఐగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. -
రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం
నరసరావుపేట: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రావిపాడు గ్రామ రైతులకు తగిన నష్టపరిహారం ఇస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో భూములు కోల్పోతున్న నరసరావుపేట మండలం రావిపాడు గ్రామస్తులకు నష్టపరిహార చెల్లింపులపై నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జేసీ హాజరై రైతులకు ఈ మేర హామీ ఇచ్చారు. ఆర్డీఓ కె.మధులత, జాతీయ రహదారి విస్తరణ అధికారులు, తహసీల్దార్ వేణుగోపాలరావు, మండల సర్వేయర్ మాట్లాడారు. రైతులు పాల్గొన్నారు. -
రజకుల సత్రం స్థలాన్ని కాపాడండి
నరసరావుపేట: కోటప్పకొండరోడ్డులోని రజకుల సత్రం స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని స్థలాన్ని తిరిగి ఇవ్వాలని అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు కోరారు. మంగళవారం కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ కె.మధులతను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు ఉదయగిరి వెంకటస్వామి మాట్లాడుతూ గుంటూరు బ్రహ్మయ్యకు సేవలు చేసినందుకు గాను 1940లో కోటప్పకొండరోడ్డులోని వారి స్థలంలో ఐదుసెంట్ల భూమిని రజక వర్గీయులైన దడిగె లక్ష్మయ్య, రాఘవులకు ఇవ్వటం జరిగిందన్నారు. ఆ భూమిలో ఐదేళ్లలో సత్ర నిర్మాణం చేసుకోవాలని కండిషన్ పెట్టడంతో కష్టపడి చందాలు వసూలుచేసి అన్నపూర్ణ సత్ర నిర్మాణం చేశారన్నారు. ఆ స్థలాన్ని రజకులకు రిజిష్టర్ చేయటం జరిగిందన్నారు. వారిలో రాఘవులు చనిపోవటంతో అతడి మృతదేహాన్ని సత్రం వెనుక పూడ్చిపెట్టి సమాధి నిర్మాణం చేశారన్నారు. అప్పటినుంచి కోటప్పకొండకు వచ్చే రజక భక్తులకు అన్నపానీయాలు అందజేయటం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో సమాధిని కూలగొట్టి దానిపక్కనే ఉన్న వారి స్థలంలో కలుపుకొని మొత్తానికి ప్రహరీ ఏర్పాటు చేశారన్నారు. ఈ చర్యతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకొని, రజకుల స్థలాన్ని కాపాడాలని వారు కోరారు. నడికోట సూర్యనారాయణ, దమ్మాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దన్నవరపు ఆదిలక్ష్మి, జి.హనుమంతరావు, డి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓను కోరిన అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు -
బియ్యం పంపిణీ సక్రమంగా లేకుంటే చర్యలు
నరసరావుపేట: రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయని ఎండీయూ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.నారదముని హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో ఎండీయూ ఆపరేటర్లపై పలు ఆరోపణలు వచ్చాయన్నారు. దీని వలన జిల్లాకు చెడ్డపేరు వస్తుందన్నారు. బియ్యం సమయానికి పంపిణీ చేయాలని, నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని ఎంఎల్ఎస్ పాయింట్కు తిరిగి అప్పగించి, మంచి బియ్యం తీసుకొని కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే పంపిణీ చేసే సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అందజేయాలన్నారు. ఫిర్యాదులు నమోదైన ఎండీయూ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.నారదముని -
రైతు కుటుంబాలు, స్థానికులకు ఉద్యోగాలు
సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులకు సూచించిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకై పొలాలు ఇచ్చిన రైతు కుటుంబాల్లో అర్హులైన వారికి విధిగా ఉపాధి కల్పించి, ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.అరుణబాబు ఆయా కంపెనీల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్లో భవ్య, చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులతో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా అభివృద్ధికి పరిశ్రమల అవసరం చాలా ముఖ్యమన్నారు. సిమెంట్ పరిశ్రమలు ఉన్న తంగేడ, పెదగార్లపాడు ప్రదేశాలలోని పొలాలు రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తుల తరపున జానీబాషా, సీవీ రావు లేవనెత్తిన ఐదు ప్రధాన అంశాలపై సంబంధిత రెవెన్యూ, పంచాయతీ రాజ్, సర్వే, వ్యవసాయ, ఉద్యాన, హౌసింగ్ తదితర శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 10 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. దాని ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కంపెనీల యజమాన్యాలు ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాతూ పరిశ్రమల యాజమాన్యం స్థానిక ప్రజల మనసు దోచుకొనే విధంగా పలు చర్యలు చేపట్టాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా వ్యవహరించాలని కోరారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఎ.మురళి, గురజాల ఆర్డీఓ మురళి, జిల్లా పరిశ్రమల అధికారి రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి నజీన బేగం, డీపీఓ ఎంవీ భాస్కరరెడ్డి, డీఏఓ ఐ.మురళి, ఉద్యాన శాఖాధికారి సీహెచ్.వి.రమణారెడ్డి, హౌసింగ్ పీడీ ఎస్.వేణుగోపాలరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కంది, శనగ రైతులు పేర్లు నమోదు చేయించుకోవాలి
జిల్లా వ్యవసాయాధికారి మురళి నాదెండ్ల: రబీలో సాగైన కంది, శనగలను ప్రభుత్వం మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నందున ముందుగా రైతులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి చెప్పారు. సాతులూరులో రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న మొక్కజొన్న, మిరప పంటలకు సాగునీరు లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంది మద్దతు ధర క్వింటా రూ.7550లు, శనగ రూ.5650లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్వరలో రైతు సేవా కేంద్రాల ద్వారా రెండు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం డీడీఏ ఎం.శివకుమారి మాట్లాడారు. అనంతరం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించారు. నరసరావుపేట ఏడీఏ మస్తానమ్మ, ఏఓ హరిప్రసాద్, ఏఈఓలు బి.జీవన్నాయక్, వేణుగోపాల్, రామారావు, జీడీసీఎంఎస్ కొనుగోలు ఇన్చార్జి రామారావు పాల్గొన్నారు. -
లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక!
గోల్డ్మెన్ పెరుమాళ్ల రాజేష్ కేసులో కొత్త మలుపు పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో గోల్డ్మెన్ (గోల్డ్ బిస్కెట్ల విక్రయదారుడు) పెరుమాళ్ల రాజేష్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పిడుగురాళ్ల పట్టణంతోపాటు చుట్టుపక్కల పట్టణాల్లోని పలువురు వ్యాపారుల వద్ద రూ.8 లక్షలు విలువ చేసే 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ను రూ.7లక్షలకు ఇస్తానని చెప్పి రూ.కోట్లు వసూళ్లు చేసి పట్టణం విడిచి పారిపోయిన ఘటన ఈనెల 11వ తేదీన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసుకొని బాధితులకు బిస్కెట్లు ఇవ్వకుండానే శ్రీలంకలో తలదాచుకున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తెరపైకి టీడీపీ నేత చేబు పేరు.. ఈక్రమంలో టీడీపీ ఆర్యవైశ్య నాయకుడు చేబు సురేష్ పాత్ర తెరపైకి వచ్చింది. బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు తీసుకొని వస్తానని మాయచేసి వ్యాపారులకు రూ.కోట్లు కుచ్చుటోపీ పెట్టిన రాజేష్ మిత్రుడే ఈ చేబు సురేష్. పెరుమాళ్ల రాజేష్ మార్చి 3వ తేదీ బోర్డు తిప్పేసి శ్రీలంక వెళ్లినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 28వ తేదీన పిడుగురాళ్ల పట్టణంలోని డీబీఎఫ్ బ్యాంక్లో తాను దాచుకున్న బంగారు, వెండి ఆభరణాలతో కూడిన రెండు గోతాలను రాజేష్ తన మిత్రుడైన చేబు సురేష్ వద్ద దాచి ఉంచాడన్న వార్త ఇప్పుడు పట్టణంలో హాట్టాపిక్గా మారింది. అయితే రాజేష్ కనిపించకుండా పోయినప్పటి నుంచి చేబు సురేష్ రాజేష్కు డబ్బు ఇచ్చిన మోసపోయినవారందరితో మీ అందరికీ న్యాయం చేస్తానని, అందుకు కోటికి రూ.లక్ష ఇస్తే పోలీసుల సహాయంతో పెరుమాళ్ల రాజేష్ను పట్టకొచ్చి డబ్బులు వసూళ్లు చేయిస్తానని బాధితులతో మాట్లాడి ఇప్పటికే సుమారు రూ.10 లక్షలు వసూళ్లు చేసినట్లు పలువురు బాధితులు పేర్కొంటున్నారు. తనకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండదండలు ఉన్నాయని, తన్ను నమ్మితే రాజేష్ను పట్టకొచ్చి ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వచ్చేలా న్యాయం చేస్తానని చేబు సురేష్ బాధితులతో చర్చించాడనేది కొసమెరుపు. తెరపైకి టీడీపీ నాయకుడు చేబు సురేష్ పేరు సురేష్ వద్దే రాజేష్ బంగారం, వెండి వస్తువులు దాచినట్లు ఆరోపణలు స్వాధీనం చేసుకున్న పోలీసులు! నిందితుడిని ఎలాగైనా పట్టిస్తానని బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన సురేష్!బంగారు ఆభరణాల గోతాలు స్వాధీనం! ఇదిలా ఉండగా బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయటంతో పిడుగురాళ్ల పట్టణ పోలీసులు కేసును మంగళవారం రంగంలోకి దిగారు. డీబీఎస్ బ్యాంక్కు వెళ్లిన పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన సీసీ ఫుటేజ్ పరిశీలించటంతో రాజేష్ మిత్రుడు సురేష్కు రెండు బంగారు ఆభరణాల గోతాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ విషయమై సురేష్ను పట్టణ పోలీసులు విచారించే కార్యక్రమం మొదలు పెట్టారు. అంతేకాకుండా రెండు గోతాల నగల గోతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెరుమాళ్ల రాజేష్ ముఖ్య అనుచరుడైన వందనపు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పెరుమాళ్ల రాజేష్ కోసం మూడు, నాలుగు బృందాలుగా పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. హైదరాబాద్, కోల్కత్తా, ఇతర ప్రాంతాల్లో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
వైవీ మాతృమూర్తికి కన్నీటి వీడ్కోలు
భారీగా చేరుకున్న అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ప్రతినిధి,బాపట్ల: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో మృతిచెందగా స్వగ్రామం మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు మంగళవారం బంధువులు, పార్టీశ్రేణుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకొని వేలాదిగా కార్యకర్తలు, అభిమానులే కాదు సామాన్య జనమూ తరలి వచ్చారు. ఎంతగా అంటే జనం తాకిడికి జగన్ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ తర్వాత జగన్ వైవీ ఇంటికి చేరుకొని అక్కడ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించి చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, చిన్నమ్మ స్వర్ణమ్మ, చిన్నాన్నలు వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి, సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్రెడ్డిలతోపాటు వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. భుజంతట్టి ఓదార్చారు. అక్కడే ఉన్న తల్లి విజయమ్మ, మేనమామ రవీంద్రనాథరెడ్డి ఇతర బంధువులతో మాట్లాడారు. అర్ధగంట పాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో గడిపారు. వైఎస్సార్ సీపీ నేతలను పేరుపేరునా పలకరించారు. వైవీ ఇంటి నుంచి జగన్ తిరుగు ప్రయాణంలోనూ ఆయన వాహనం ముందు చేరిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. పిచ్చమ్మ భౌతికకాయానికి వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ ఉపముఖ్యమంత్రి మంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, జోగి రమేష్, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ముస్తాఫా, బుర్రా మధుసూదనయాదవ్, జంకె వెంకటరెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు, పార్టీ నాయకులు కరణం వెంకటేశ్, గాదె మధుసూదన్రెడ్డి, వరికూటి అశోక్బాబు, మేరిగ మురళి, చుండూరు రవి, పానెం చిన హనిమిరెడ్డి తదితరులు నివాళు లర్పించారు. వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలకు మేదరమెట్లకు వచ్చిన జగన్ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులు కుటుంబ సభ్యులకు పరామర్శ అర్ధగంటపాటు అక్కడే గడిపిన జననేత -
విద్యార్థులు నైపుణ్యాలకు పదును పెట్టాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు అంతర్గతంగా దాగిన నైపుణ్యాలకు పదును పెట్టాలని ఏఎన్యూ ఉప కులపతి ఆచార్య కె.గంగాధరరావు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంగళవారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వీసీ గంగాధరరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. కళాశాల కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి శ్యాం సుందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అనితాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా ఎంకాం విద్యార్థిని షేక్ షహనాజ్, ఎంబీఏ విద్యార్థి కె.అనంతలక్ష్మి, ఎమ్మెస్సీ మ్యాథ్స్లో వై.నాగమణి, ఫిజిక్స్లో బి.దుర్గా లావణ్య, కంప్యూటర్స్ సైన్స్లో కె.నాగసాయి రమ్య, కెమిస్ట్రీలో జుబేర్ అహ్మద్, ఎంసీఏ విద్యార్థి ఎన్. సాయిలీల ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. బీకాం జనరల్ విభాగంలో టాపర్గా నిలిచిన నరేంద్ర, బీకాం కంప్యూటర్స్లో షేక్ ఫారినా, బీఎస్సీ బీజెడ్సీలో షేక్ ఇషా సుల్తానా, బీబీఏలో జి.శ్వేత, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో టాపర్ పి. గౌస్య ప్రతిభా పురస్కారాలు పొందారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, అధ్యాపకులు బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి, డీవీ చంద్రశేఖర్, ఎస్. శ్రీనివాసరావు, యు. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు శక్తియాప్ దోహదం
నరసరావుపేట: మహిళలు భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలా పనిచేస్తుందని అదనపు ఎస్పీ(పరిపాలన) జేవీ సంతోష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహి ళలు, బాలికల భద్రత కోసం తీసుకొచ్చిన శక్తి యాప్ౖ పె అవగాహన నిమిత్తం మంగళవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ స్కూలు విద్యార్థినులతో స్వీయ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సంతోష్ మాట్లాడుతూ ప్రతీ ఒక్క మహిళ తమ ఫోన్లో యాప్ నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని సూచించారు. అనంతరం యాప్ను ఉపయోగించే విధానం వివరించారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి వారి మనోధైర్యాన్ని పెంపొందించుటకు కావాల్సిన స్వీయరక్షణ మెలకువలను కరాటే ద్వారా ఎదుర్కొనే విధానాలను నిపుణులు ప్రదర్శించారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, మహిళా పోలీస్ సిబ్బంది, శంకర భారతిపురం, తిలక్ స్కూలుకు చెందిన 500మంది విద్యార్థినులు పాల్గొన్నారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. ఇఫ్తార్ సహర్ (బుధ) (గురు) నరసరావుపేట 6.26 4.58 గుంటూరు 6.24 4.56 బాపట్ల 6.24 4.56 వినుకొండ: ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతూ ఎదురు తిరిగిన వాళ్లను చంపుతూ దొంగలు యథేచ్ఛగా హత్యాకాండ సాగిస్తున్నారు. వినుకొండకు గుండెకాయ లాంటి కొత్తపేట ప్రాంతంలో ఏడాది తిరగకుండానే ఇద్దరు వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకొని వారిని హతమార్చి, వారి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరినీ అత్యంత కిరాతకంగా చంపి బంగారాన్ని ఎత్తుకెళ్లడం గమనార్హం. కలకలం రేపిన సావిత్రి హత్య.. సోమవారం రాత్రి కొత్తపేటలో మెయిన్బజారులో వినాయకుడి గుడి వద్ద ఒంటరిగా ఉంటున్న కొప్పరపు సావిత్రి అనే 75 ఏళ్ల మహిళ ఇంట్లోకి పట్టపగలే ప్రవేశించిన దుండగులు ఆమెను హత్య చేసి ఆమె ఒంటిపై బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే ఇంట్లో టీవీ సౌండ్ పెంచి టీవీ చూస్తున్నట్టుగా భ్రమింపజేసి బయట తాళం వేసి పరారయ్యారు. స్కూల్కు వెళ్లి వచ్చిన ఆమె మనవరాలు ఎంతసేపటికీ పిలిచినా పలకక పోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా అప్పటికే సావిత్రి మృతి చెందినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది ఇదే ప్రాంతంలో... ఇదిలా ఉంటే.. గత ఏడాది జూన్ 19వ తేదీన ఇదే కొత్తపేట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పి.కోటిరత్నం అనే 75 ఏళ్ల వృద్ధురాలి మెడలో గొలుసు చోరీకి విఫలయత్నం చేసిన దొంగలు ఆమె ఎంతసేపటికీ గొలుసు వదలకపోవడంతో తలపై రాయితో కొట్టి హత్య చేసి పారిపోయారు. రెండు హత్యలు పట్టపగలే జరగడంతో ఆ ప్రాంతంలో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కోటిరత్నం హత్య జరిగి ఏడాదికావస్తున్నా ఇప్పటికీ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసు జాగిలాలు 7 బంగారం కోసం మహిళలను హతమారుస్తున్న వైనం వినుకొండ కొత్తపేటలో ఏడాది కాలంలో ఇరువురు మహిళల హత్య ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఇంటి సమీపంలో ఘటనలు మహిళల భద్రత ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు న్యూస్రీల్జీవీ ఇంటికి కూత వేటు దూరంలోనే.. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇంటి సమీపంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం భద్రత వైఫల్యాలకు అద్దం పడుతుంది. దొంగలు రాత్రిళ్లే కాకుండా పట్టపగలే ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతుండడం పోలీసు వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉన్నప్పటికీ కేసుల దర్యా ప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం విచా రకరం. ఇప్పటికై నా పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేపట్టి మహిళల భద్రతపై నమ్మకం కలిగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతల గ్రామానికి చెందిన మక్కెన శివతేజ(30) పేరేచర్లలో కొబ్బరి బొండాల దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో పేరేచర్ల నుంచి రెంటచింతలకు స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గ మధ్యలో పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు సమీపంలో శ్రీ లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్, ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో లారీ అతివేగంగా వచ్చి శివతేజ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనటంతో రోడ్డుపై పడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ తెలిపారు. -
మహిళా చైన్ స్నాచర్ అరెస్ట్
మంగళగిరి టౌన్: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఓ మహిళను మంగళగిరి పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ తెలిపిన వివరాల మేరకు... పాత మంగళగిరికి చెందిన రామిశెట్టి సాయిలక్ష్మి నివాసానికి అద్దెకు ఇల్లు కావాలంటూ ఓ మహిళ వచ్చింది. మాట కలిపాక ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని బయటకు పరిగెత్తింది. సాయిలక్ష్మి పెద్దగా కేకలు వేయడంతో ఆ మహిళ చైన్ను అక్కడ వదిలేసి పారిపోయింది. సోమవారం మంగళగిరి రత్నాలచెరువు అండర్పాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలించి విచారించగా విజయవాడకు చెందిన మానసవాణి అని, గతంలో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి 42 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మానసవాణిపై విజయవాడలో సింగ్నగర్, కృష్ణలంకలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని విచారణలో తెలిసినట్లు తెలిపారు. మానసవాణిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు రవీంద్రనాయక్ తెలిపారు. 42 గ్రాముల బంగారం స్వాధీనం -
కొడుకులు అడుక్కుతినమంటున్నారు!
నరసరావుపేట రూరల్: ‘అయ్యా.. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నా స్వశక్తితో సంపాదించిన రెండు ఇళ్లను కొడుకులకు ఇచ్చాను. ఇప్పుడు నేను పక్షవాతంతో పాటు షుగర్, బీపీతో అనారోగ్యానికి గురికావడంతో ఇద్దరు కుమారులూ పట్టించుకోవడం లేదు. పనిచేసే ఓపిక ఉన్న నా భార్యను మాత్రం చిన్న కుమారుడు తన వద్ద ఉంచుకుని దుకాణంలో పని చేయించుకుంటున్నాడు. నేను ఎలా బతకాలని అడిగితే అడుక్కుతినమంటూ కొడుకులు సలహా ఇస్తున్నారు. ఏ పని చేయలేని స్థితిలో ఉన్న నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాచర్లకు చెందిన వృద్ధుడైన ఏడుకొండలు ఆవేదన ఇది.. ఇదేవిధమైన పలు అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చాయి. పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు అర్జీలపై సత్వరం చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి తగదాలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. కన్న కూతురు మోసం చేసింది.. నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉద్యోగరీత్యా కుమారుడు, కోడలు నిజామాబాద్లో ఉంటున్నారు. కుమారుడు నాతో పాటు నా భర్త చిన్నయ్య బాగోగులు చూసేవాడు. కోవిడ్ సమయంలో రెండు నెలలు మా వద్దకు రావడానికి కుమారుడికి వీలుకాలేదు. ఆ సమయంలో నా భర్త అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలోనే నివసించే మా కుమార్తె శాంతకుమారి తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో నా భర్త పేరున ఉన్న రూ.6లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ నగదును డ్రా చేయడంతో పాటు పూర్వార్జితంగా వస్తున్న 1.40 ఎకరాలను తనకు గిఫ్ట్గా ఇచ్చినట్టుగా రాయించుకుంది. తదనంతరం నా భర్త చనిపోవడంతో ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ నగదును నాకు అందించేలా చర్యలు తీసుకోండి. – పి.చిన్నమ్మ, ముసాపురం, పెదకూరపాడు మండలం రెండుసార్లు హత్యాయత్నం చేశారు సత్తెనపల్లిలోని పెద్దమసీదు ప్రాంతంలో నివసించే నాపై గత ఏడాది ఎన్నికల ముందు దాడి జరిగింది. 15 రోజులు ఐసీయూలో చికిత్స పొందాను. నాలుగు నెలల క్రితం మరోమారు హత్యాయత్నం చేశారు. షాదీఖానా బజార్లో తల్వార్తో దాడికి పాల్పడ్డారు. షేక్ ఆదం షరీఫ్ అతని కుమారులు గౌస్, రఫీలతో పాటు ఉమర్, అక్తాబ్ ఈ దాడిలో పాల్గొన్నారు. సత్తెనపల్లి టౌన్ పీఎస్లో వీరిపై ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోలేదు. నాపై కౌంటర్ కేసులను పోలీసులు నమోదు చేసారు. నిందితులు ఇప్పటికీ తల్వార్లతో తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. – షేక్ రఫీ, సత్తెనపల్లి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి మా అమ్మ ఆరే లక్ష్మమ్మ కారంపూడిలో నివసిస్తుంది. గత ఏడాది మార్చి 27వ తేదీన ఆమెను హత్య చేశారు. ఈ కేసులో అనుమానితులుగా ఆరే రమేష్, ఆరే రాంబాబు, పులి శ్రీలక్ష్మి, ఆరే పద్మల పేర్లను పోలీసులకు మేం అందజేశాం. ఆస్తి కోసం గతంలో వీరు ఆమెను చంపటానికి ప్రయత్నించారు. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయలేదు. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలి. – తాళ్ల పద్మ, అడిగొప్పల, దుర్గిమండలం జిల్లా ఎస్పీ ఎదుట వాపోయిన ఓ వృద్ధ తండ్రి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 75 ఫిర్యాదులు స్వీకరణ -
జాతీయ స్థాయి పోటీలకు క్రోసూరు సెయింట్ ఆన్స్ విద్యార్థులు
బేస్బాల్లో ఆంధ్రజట్టుకు ఎంపికై న విద్యార్థులు క్రోసూరు: పంజాబ్ రాష్ట్రం సంగ్రూరులో మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్ బేస్బాల్ నేషనల్ టోర్నమెంట్కు క్రోసూరు సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు హెచ్ఎం సిస్టర్ మేరీ రజిత సోమవారం తెలిపారు. ఎంపిక వివరాలు తెలుపుతూ ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కసుమూరులో బేస్బాల్ రాష్ట్ర జట్టును ఎంపిక చేశాన్నారు. అందులో క్రోసూరు సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు తెలిపారు. ఎనిమిదవ తరగతికి చెందిన వి.గ్రీష్మ బిందు, ఎం.గాయత్రి, అదేవిధంగా ఏడవ తరగతికి చెందిన కె.జాషువా డేనియల్, ఎస్కే అబుబకర్లను ఆంధ్ర జట్టుకి ఎంపిక చేసినట్లు చెప్పారు. తమ పాఠశాల విద్యార్థులు నేషనల్ టోర్నమెంట్కు ఎంపికవడంపై ఎంతో సంతోషంగా ఉందని, ఆంధ్రజట్టు తరఫున పోటీల్లో గెలిచి తమ పాఠశాలకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని మృతదేహం సత్తెనపల్లి: గుర్తు తెలియని మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని నిర్మల నగర్ సమీపంలో గల రైల్వే పట్టాలపై సోమవారం కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నిర్మలా నగర్ రైల్వేగేట్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం రైల్వే పట్టాలపై పడి ఉంది. మృతదేహం పూర్తిగా చిధ్రమై ఉండడంతో గుర్తుపట్టడం అసాధ్యంగా మారింది. -
వినుకొండలో వృద్ధురాలి హత్య
మెడలో బంగారు గొలుసు మాయం వినుకొండ: వినుకొండలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కొత్తపేటలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కొప్పరపు సావిత్రి(70)ని దుండగులు పట్టపగలే హత్య చేసి మెడలోని బంగారు గొలుసు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న టౌన్ సీఐ శోభన్బాబుతోపాటు పోలీసు సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారు గొలుసు కోసమే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటిలో లేకపోవటం గమనార్హం. పగలే హత్య చేసి టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి పరారయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు ఇంటికి కొద్దిదూరంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాగ్స్క్వాడ్ తో పరిశీలన అనంతరం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కేసును త్వరలోనే ఛేదిస్తామని సీఐ తెలిపారు. వైద్యమిత్రల ధర్నా నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా తమకు ఇప్పటికీ సరైన జీతాలు లేక తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని వైద్యమిత్రలు విన్నవించారు. సోమవారం ప్రకాష్నగర్లోని ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయం ముందు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. తాము ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో ఆస్పత్రికి, రోగులకు మధ్య అనుసంధాన కర్తలుగా వుంటూ పేద ప్రజలకు సేవలు అందజేస్తున్నామన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, తమ సర్వీసుని పరిగణనలోకి తీసుకొని ట్రస్ట్ ఉద్యోగిగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని కోరారు. ఉద్యోగ విరమణ తరువాత కుటుంబానికి రూ.15లక్షల గ్రాడ్యూటీ ఇవ్వాలని, అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. గోగులమ్మను తాకిన సూర్య కిరణాలు పెదపులివర్రు (భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మను సోమవారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఏటా ఫాల్గుణ నెలలో అమ్మ విగ్రహంపై కిరణాలు ప్రసరిస్తాయని అర్చకులు దీవి గోపి తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యావతారంలో శ్రీవారు మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి ఆస్ధాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. కై ంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మిళ్లూరి రామచంద్ర శర్మ, కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు. -
లంక పొలాల సమస్య పరిష్కరించాలి
తాడేపల్లి రూరల్: కుంచనపల్లిలోని దళిత లంక పొలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లిలో సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజాచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన రైతులతో మాట్లాడారు. కృష్ణానది ఒడ్డున దళితులకు ఇచ్చిన 30 ఎకరాల లంక పొలాల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సాగు చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, సీపీఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, కుంచనపల్లి గ్రామ శాఖ కార్యదర్శి అమ్మిశెట్టి రంగారావు, నాయకులు నాగపోగు విజయరాజు, అమ్మిశెట్టి రామారావు, కంచర్ల సాంబశివరావు, కొండపల్లి యశోద, సింగంశెట్టి రవికిషోర్, అమ్మిశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు శక్తి యాప్ దోహదం
నరసరావుపేట: ప్రతీ ఒక్క మహిళ శక్తియాప్ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కోరారు. సోమవారం పోలీసు ప్రధాన కార్యాలయానికి ప్రజాసమస్యల పరిష్కార వేదికకు విచ్చేసిన మహిళలకు యాప్ వివరాల కరపత్రాలు పంచి వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం శక్తి పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, లైంగికదాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పల్నాడు జిల్లాలో మహిళలు, గృహిణులు, విద్యార్థినులు వారి ఫోన్లులో శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం, సహకారం పొందాలని కోరారు. అదనపు ఎస్పీ (పరిపాలన) జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాషిణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రాజకీయ బదిలీలకు నిరసనగా ఎన్ఎస్పీ ఉద్యోగుల ఆందోళన నరసరావుపేట: ఎన్ఎస్పీ అధికారులైన సూపరింటెండెంట్ ఇంజినీరు కృష్ణమోహన్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సుబ్బారావుల వేధింపులపై ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. ఎన్ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా వర్క్చార్జ్డ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే వద్ద నుంచి లెటర్ తీసుకొచ్చి రాష్ట్ర నాయకత్వంలో అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేస్తున్న నాగరాజు, కొండారెడ్డిలపై అభియోగాలు మోపుతూ ఇక్కడి నుంచి మాచర్లకు బదిలీ చేశారన్నారు. ఎటువంటి విచారణ లేకుండా అకస్మాత్తుగా బదిలీ చేయటంపై న్యాయ విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని తాము రావటం జరిగిందన్నారు. సమర్ధవంతంగా పనిచేసి అవార్డులు పొందిన చరిత్ర యూనియన్ నేతలకు ఉందని, కేవలం నాలుగైదు నెలల క్రితం అధికారులుగా వచ్చిన వారికి వీరి సమర్ధత ఏవిధంగా తెలుస్తుందని ప్రశ్నించారు. సాగర్ పరిధిలో సరైన ఏఈలు లేకపోయినా లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తూ ప్రతి ఎకరాకు నీరు అందేలా పనిచేస్తున్నారన్నారు. డీఈ, ఈఈలను మారుస్తారా, లేక తమ 60మంది ఉద్యోగులను మారుస్తారా అనేది తేల్చుకోవాలన్నారు. వీరిపై సీఈచే విచారణ చేస్తున్నారని తెలిసిందని, ఆ విచారణ ముగిసేంతవరకు బదిలీ రద్దుచేయాలని కోరారు. బదిలీ ఉపసహరించేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. మంగళగిరి టౌన్ : మంగళగిరి నగర పరిధిలోని బిస్మిల్లా హోటల్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... గత 5 రోజుల నుంచి ఓ వ్యక్తి మంగళగిరి పాతబస్టాండ్ సమీపంలో వున్న బిస్మిల్లా హోటల్ దగ్గర ఉంటున్నాడు. అతని ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని రోజులుగా భోజనం, తాగునీరు అందజేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆ వ్యక్తి మృతి చెందాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
పది పరీక్షలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పల్నాడుజిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 128 పరీక్ష కేంద్రాలలో తొలిరోజు తెలుగు పరీక్షకు 26,497మంది విద్యార్థులకు గాను 99.5శాతం హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రికార్డు స్థాయిలో 72 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. అలాగే డీఈఓ ఎల్.చంద్రకళ పట్టణంలోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను సందర్శించి సీఎస్లకు పలు సూచనలు చేశారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు జిల్లాలోని 27 పరీక్ష కేంద్రాలలో తొలిరోజు నాలుగు కేంద్రాలలో నిర్వహించిన హిందీ పరీక్షకు నలుగురు విద్యార్థులకు గాను ఇద్దరు హాజరైనట్టు తెలిపారు. జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలు తెలుగు పరీక్షకు 99.5శాతం హాజరు 72 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన 6 స్క్వాడ్ బృందాలు -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నల్లపాటి రామారావు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం. ఇతని పేరు మీద తన సొంత గ్రామంలో 3.48 ఎకరాల పొలం ఉంది. రీ సర్వేలో 3.30 ఎకరాలు మాత్రమే నమోదైంది. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ని కలసి రెండు సార్లు అర్జీలు ఇచ్చాడు. చివరికి రెండు నెలల క్రితం సర్వేయర్ వచ్చి పొలం కొలిచినప్పటికీ ఇప్పటికీ సర్వే సర్టిఫికేట్ ఇవ్వలేదని ఫిర్యాదుదారుడు వాపోతున్నాడు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇఫ్తార్ సహర్ (మంగళ) (బుధ) నరసరావుపేట 6.26 4.59 గుంటూరు 6.24 4.57 బాపట్ల 6.24 4.57 గ్రీవెన్స్లో రీ ఓపెన్ అవుతున్న అర్జీలు న్యూస్రీల్ -
సెంటు భూమిలోని పంట కూడా ఎండకూడదు
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి సాగునీరు అందని కారణంగా సెంటు భూమిలో పంట సైతం ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలో రైతుల అవసరాలకు తగ్గట్టు నీరుఅందేలా చూడాలన్నారు. మండలస్థాయిలో కరవు పర్యవేక్షణ సెల్ ప్రారంభించాలన్నారు. పంచాయతీ నిధులతో గ్రామాల్లో తాగునీటి సరఫరా చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో పీ–4 సర్వే 95 శాతం, వర్క్ ఫ్రం హోం 45 శాతం పూర్తయ్యాయన్నారు. జిల్లా ప్రజల చేత అభివృద్ధికి సూచనలు చేసే పీ–4 కన్సల్టెన్సీ సర్వేలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరులోగా రైతు రిజిస్టేషన్లు 60 శాతం పూర్తిచేయాలన్నారు. ఫామ్పాండ్స్ పథకంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం మూడు ఫామ్పాండ్స్ ప్రారంభించేలా చూడాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం ఆర్థికసాయం పెంపు విషయంపై లబ్ధిదారులకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పేదలకు 365 రోజుల ఉపాధి కల్పించాలన్నారు. కాగా, కందిపప్పు, శనగ కొనుగోలు కోసం రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జేసీ సూరజ్ గనోరే ఆదేశించారు. డీఆర్వో ఎ.మురళి, సీపీఓ జి.శ్రీనివాస్, డీపీఓ విజయభాస్కరరెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటరెడ్డి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో మేలు నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) విధానంలో పల్నాడు జిల్లాలోని రైతులందరూ పంటలను సాగు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ కషాయాలు, తెగుళ్లు, పెరటి తోటల పెంపకం, పుస్తకాలు, పాంప్లెట్స్ ఆవిష్కరించి ప్రకతి వ్యవసాయం సిబ్బంది ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు, పురుగుమందుల వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తయారైన ఉత్పత్తులను తినడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. జిల్లా అధికారులందరూ ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. డీపీఓ పి.అమలకుమారి మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. డీఎఫ్ఓ కృష్ణప్రియ, డీఆర్ఓ మురళి, డీఏఓ ఐ.మురళి, స్టేట్ ఎన్ఎఫ్ఏ మన్విత, జిల్లా ప్రకతి వ్యవసాయ సిబ్బంది మేరీ, సౌజన్య, బేబీ రాణి, యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. ●జిల్లాలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న పేద, అర్హులైన 17 మంది దివ్యాంగులైన విద్యార్థులకు ఏపీ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహాయక సంస్థ ద్వారా ఉచితంగా ల్యాప్ టాప్లను కలెక్టర్ పి.అరుణ్బాబు అందజేశారు. -
ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు..
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన వారికి సత్వరమే న్యాయం చేయకపోగా, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు తమ గోడును విన్నివించుకోని రశీదుతో వెళ్లిన వారికి రిక్తహస్తమే దక్కుతోంది. ఫిర్యాదుకు నిర్ణయించిన గడువులోగా పరిష్కారం చూపకపోవడంతో ఫిర్యా దులు రీ ఓపెన్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు కలెక్టరేట్లో 13,695 ఫిర్యాదుల అందగా వాటిలో 12,277 ఫిర్యాదులు పరిష్కారం చూపగా, 1,418 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. సుమారు 500 ఫిర్యాదుల రీ ఓపెన్ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రెవె న్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదుల రీ ఓపెన్ అవుతున్నాయి. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారి కలెక్టర్ కార్యాలయానికి వచ్చినా సత్వరం న్యాయం జరగడంలేదని బాధితులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి ి స్పందన ఉండటం లేదని వాపోతున్నారు. గతంలో సత్వర పరిష్కారం.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ద్వారా స్పందన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేవారు. ఇందులో పనిచేసే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుడు, సంబంధిత అధికారులు, ఆయా మండలాల ప్రత్యేక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేవరకు పనిచేసేవారు. దీనివల్ల ఫిర్యాదుదారులకు సత్వరమే సమస్య పరిష్కారం, లేదా కాకపోవడానికి గల కారణాలు తెలిసేవి. కొత్త ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంకు స్వస్తిపలికారు. ప్రస్తుతం పీజీఆర్ఎస్ సిబ్బంది, ప్రత్యేకాధికారులు ఈ పనిచేస్తున్నా గతంలో లాగా పారదర్శకత ఉండటం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సోమవారం ప్రజా పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులు కొన్ని.. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన అల్లూరివారి పాలెం, ఎస్టీకాలనీ వాసులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు క్యూ కడుతున్న అర్జీదారులు గత పది నెలల్లో కలెక్టరేట్లో సుమారు 500 అర్జీలు రీ ఓపెన్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పదేపదే వెళ్లినా తీరని సమస్యలు గత ప్రభుత్వం హయాంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక కాల్ సెంటర్ సమస్య పరిష్కారం అయ్యేవరకు పర్యవేక్షణ నేడు కలెక్టర్ చెప్పినా కింద స్థాయిలో పట్టించుకోవడం లేదని వాపోతున్న ఫిర్యాదుదారులు మేము 54 మందిమి గత ఐదేళ్లుగా మున్సి పాల్టీలోని పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. మాకు అరకొర జీతాలే చెల్లిస్తున్నారు. మొదట మున్సిపల్ శాఖనుంచి, ఆ తర్వాత ఆప్కాస్ ద్వారా చెల్లిస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐలు కట్ చేస్తున్నారు. వాటికి కార్డు ఇవ్వలేదు. మాకు ఒక్కో నెల ఒక్కోరకంగా జీతం ఇస్తున్నారు. పూర్తి నెల జీతం అందించడం లేదు. మున్సిపల్ ఉద్యోగులనే కారణంతో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఎన్నోసార్లు వినతిపత్రాలు, అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి, నెలకు రూ.21వేలు వేతనం చెల్లించాలి. – కార్మికులు, నాయకులు, పల్నాడు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ -
మద్యం దుకాణాలు సమయపాలన పాటించడం లేదు
నరసరావుపేటలో చాలా మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుంచే షాపులు తెరిచి మద్యం విక్రయాలు చేస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో ఇబ్బందికరంగా ఉంది. పట్టణంలో ప్రముఖ మసీదుల వద్ద ఉన్న మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద మరీ ఇబ్బందికరంగా మారింది.. అలాగే ఈద్గా మైదానంలో రాత్రిళ్లు మద్యం సేవిస్తున్నారు. ఎకై ్సజ్ విభాగం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి. – షేక్ కరిముల్లా, ఎంఐఎం జిల్లా కార్యదర్శి -
వెల్ఫేర్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పించండి
నేను బీకాం చదివాను. కూలి పనిచేసుకుంటున్నా. సచివాలయ వార్డు సెక్రటరీల ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యాను. తీరా బీకాం చదివిన వారు అనర్హులని అప్పుడు ఉద్యోగం ఇవ్వలేదు. నేను నా కుటుంబంతో పాటు పనికోసం హైదరాబాదు వెళ్లాను. నాతో పాటు పరీక్షరాసి ఎంపికై న వారు కోర్టుకు వెళ్లటంతో ప్రభుత్వ ఆదేశాలపై కోర్టు స్టే ఇచ్చింది. దీంతో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నాకు ఆలస్యంగా ఈ విషయం తెలిసింది. కాబట్టి విచారించి నాకు కూడా వార్డు వెల్ఫేర్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా. – పాముల నరేష్, పిడుగురాళ్ల ●దస్తావేజులు ఇప్పించండి -
వైభవంగా మహాశైవక్షేత్ర పునఃప్రతిష్ట
దాచేపల్లి: దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలోని శ్రీ పార్వతిదేవి సమేత చెన్నమల్లిఖార్జునస్వామి వార్ల దేవాస్థానం(మహా శైవక్షేత్రం) పునఃప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతులు శివస్వామి, టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణమచార్యుల బృందం వేదమంత్రాల సాక్షిగా పార్వతీదేవి సమేత చెన్నమల్లిఖార్జునస్వామి, గణపతి, ద్వారపాలకులు, నందీశ్వరుడు, బలిపీటం, శిఖరాన్ని ప్రతిష్టించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పల్నాటి తొలిమహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ నిర్మించిన ఈ మహాశైవక్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల జెడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య, సర్పంచ్ జంగా సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. పునఃప్రతిష్ట సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి అర్చకులు, భక్తులు తరలివచ్చారు. మహాశైవక్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. -
నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయించాలి
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి జె.పంగులూరు: నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి కోరారు. పంగులూరు మండలంలోని చందలూరు దళిత కాలనీ కౌలు రైతులతో సీపీఎం ప్రచార యాత్ర నాయకులు ఆదివారం మాట్లాడారు. పొగాకు అమ్ముడు పోక, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు తెలిపారు. పంట నష్టపరిహారాలు కూడా అందటం లేదని, రాయితీలు కూడా భూ యజమానులకే అందుతున్నాయని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీపీఎం కార్యవర్గ సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ బర్లీ పొగాకును కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీలు ఇస్టానుసారంగా ధరలు తగ్గించడం, ఆలస్యంగా కొనడంతో రైతులు నష్టపోతున్నారని ఆమె తెలిపారు. సీపీఎం బాపట్ల కార్యదర్శి సీహెచ్. గంగయ్య మాట్లాడుతూ కౌలు రైతులంగా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఐకమత్యంతో ఏదైనా సాధించగలమని చెప్పారు. హక్కుల కోసం పోరాడాలని, దాని కోసం సంఘాలుగా ఏర్పడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు రాయిని వినోద్బాబు, పార్టీ మండల కార్యదర్శి రామారావు, ప్రభాకర్, సుధాకర్, కౌలు రైతులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నూజెండ్ల శ్రీనివాసరావు
జాతీయ భావంతో విద్యార్థుల నిర్మాణమే లక్ష్యం బాపట్ల: విద్యార్థుల సమస్యలపై పోరాటంతో పాటు వారిని జాతీయ భావాలతో నిర్మాణాత్మక ంగా తీర్చిదిద్దడమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్ష్యం అని రాష్ట్ర అధ్యక్షులు నూజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. తొలుత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ రీడర్ యు. వరలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజెండ్ల మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. వరలక్ష్మి మాట్లాడుతూ 50 సంవత్సరాల కిందట మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఏబీవీపీ కార్యక్రమాల్లో చేపట్టిన పనులను గుర్తు చేసుకున్నారు. నేటి యువత సమాజంలో రుగ్మతలు రూపుమాపటానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సదస్సుకు వచ్చిన ఏబీవీపీ యువ కెరటాలకు అభినందనలు తెలిపారు. దక్షిణ భారత సంఘటన కార్యదర్శి ఎస్. శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకై క విద్యార్థి యూనియన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000 అందజేస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు 10 నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు వెంటనే భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉండిపోయాయని, వాటిని తిరిగి రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సూళ్లూరు యాచేంద్ర, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, న్యాయవాది కళ్లం హరినాథ్రెడ్డి, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్, నంగు ఏడుకొండలురెడ్డి, వల్లూరి భావన్నారాయణ, మామిడి రాజశేఖర్, బాలాజీ, బిల్లూరి భావన్నారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. సుమన్, కార్యదర్శి పవన్ పాల్గొన్నారు. హామీలు అమలు చేయకుంటే సమ్మె చేస్తాం గుంటూరు మెడికల్: ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్య వర్గ సమావేశం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ హాలులో జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార రావు మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని చెప్పారు. తమ సంఘం తరఫున సుమారు 28 డిమాండ్లను లిఖిత పూర్వకంగా తెలియజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నేటికీ వాటిని పరిష్కరించిన పాపానపోలేదని వాపోయారు. ఇక పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. త్వరలో సమ్మె నోటీసు జారీ చేస్తామన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తమ సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉద్యమానికి జిల్లా శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు సత్వరమే మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు. సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. ముఖ్య సలహాదారు రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు. -
తులసీ తన్మయ్కు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల నర్సింగ్ విద్యార్థిని వి.తులసీతన్మయ్ తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు ఆదివారం తెలిపారు. తెనాలిలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 5వ గుంటూరు (జిల్లా) ఆహ్వాన తైక్వాండో చాంపియన్షిప్–2025 పోటీలో తులసీ తన్మయ్ 49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించినట్టు వివరించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి, నర్సింగ్ విభాగం ఇన్చార్జి ఏవీఎన్ గుప్త తదితరులు అభినందించారు. రైలు కింద పడి మహిళ ఆత్మహత్య నరసరావుపేట టౌన్: కేసానుపల్లిరోడ్డులోని టిడ్కో గృహాల పక్కనే ఉన్న రైలుపట్టాలపై ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుంటూరు –డోన్ ఎక్స్ప్రెస్ రైలు బండి కింద పడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుందని రైల్వే ఎస్ఐ శ్రీనివాసనాయక్ తెలిపారు. మృతురాలు శరీరం నలుపు రంగుతోను, ఒంటిపై నీలం రంగు పూల డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. మృతేదేహాన్ని స్థానిక ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చామన్నారు. సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై కేసు పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురం ఎల్బీఎస్ నగర్కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మోజెస్ విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శప్రాయం
నరసరావుపేట: తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాథ్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో... నరసరావుపేట: రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి పేర్కొన్నారు. అమరజీవి జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్య నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రసాధన కోసం అమరజీవి చేసిన త్యాగం అజరామరం అని కొనియాడారు. ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు -
‘పది’ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాకు వివరాలు తెలియచేస్తూ...పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, పరీక్షకు కేటాయించిన సిబ్బంది, పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు తప్ప ఇతర వ్యక్తులు ఉండకూడదని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని అన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే విద్య నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖ తరుపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన, విద్యార్థులు పరీక్షల సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం కొరకు వెంటనే డయల్:100/112కు సమాచారం అందించాలని కోరారు. ఒకే కాన్పులో ముగ్గురు జననం గుంటూరు మెడికల్: హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు. -
డివైడర్ను ఢీకొని యువకుడు మృతి
మరొకరికి తీవ్ర గాయాలు వెల్దుర్తి: లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొని బైక్పై వెళుతున్న యువకుడు మృతి చెందిన ఘటన వెల్దుర్తి బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వెంకట సత్యం(23), మరిపూడి మణికంఠలు ద్విచక్ర వాహనం పై మాచర్లకు వచ్చి వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి గుండ్లపాడుకు వెళ్తున్న సమయంలో వెల్దుర్తి బస్టాండ్ వద్ద 565 జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తూ, తప్పించబోయి, పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారమివ్వటంతో వారు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని ఇద్దరినీ మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకట సత్యం మృతి చెందాడు. మణికంఠకు తీవ్రగాయాలు కావటంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట వైద్యశాలకు రిఫర్ చేశారు. మృతి చెందిన వెంకట సత్యంకు భార్య రమాదేవి, ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం రమాదేవి నాలుగు నెలల గర్భిణిగా ఉందని బంధువులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు నరసరావుపేట: కేంద్రంలోని బీజేపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన పల్నాడు బస్టాండ్లో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే, విశ్వకర్మ, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఒక హోటల్లో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు కేంద్రంలో బీసీ కులాల జనగణన చేపడతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతోందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తెస్తామని, నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించడానికి బీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజులు ఓసీలతో సమానంగా వసూలు చేస్తున్నారని, వెంటనే లా సెట్, ఎంసెట్, పాలీసెట్, ఇతర అన్ని రకాల సెట్లకు బీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు యామా మురళి మాట్లాడారు. సంఘం నరసరావుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా సుతారం విశ్వేశ్వరరావును నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కాకుమాను రమేష్, నరసరావుపేట, రొంపిచర్ల మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, గాలి సాంబశివరావు, రజక సంఘ నాయకులు చట్టూ శ్రీరాములు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యయోస్తు
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2025 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా విద్యార్థులు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2025 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 40 ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ ఈఏపీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets.a psche.ap.gov.in సైట్కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2025పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతోపాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ఏపీ ఈఏపీసెట్–2025 షెడ్యూల్ విడుదల మే 21 నుంచి 27 వరకు ఏపీ ఈఏపీసెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణ మే 19,20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 40ఇంజినీరింగ్ కళాశాలల్లో 20వేల సీట్లు -
క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు
చేబ్రోలు: జిల్లాలో ఖ్యాతిగాంచిన చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు గూడూరు సాంబశివరావు, శ్రీనివాసశర్మ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయశాఖాధికారి పి.రామకోటేశ్వరరావు వారిని సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఎస్ఐ డి.వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీల్లో కౌన్సెలర్ల నియామకం నరసరావుపేట ఈస్ట్: జిల్లావ్యాప్తంగా ఉన్న 24 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థినులకు మానసిన స్థైర్యం కల్పించేందుకు ఐదుగురు కౌన్సెలర్లను నియమించినట్లు జిల్లా బాలికా సంక్షేమాభివృద్ధి అధికారి డి.రేవతి ఆదివారం తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లోని బాలికలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారిలో ఒత్తిడిని జయించేలా తగు సూచనలను కౌన్సెలర్లు అందిస్తారని వివరించారు. జె.అశోక్, ఎ.శాంతివర్థన్, కె.ప్రేమ్కుమార్, యూసఫ్ షరీఫ్, ఫణింద్రకుమార్లను కౌన్సెలర్లుగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నియమించినట్టు తెలిపారు. రానున్న వారం రోజుల్లో 14 పాఠశాలలోని విద్యార్థినులకు కౌన్సెలర్లు గ్రూప్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్ పరీక్షల విధులకు గైర్హాజరైన టీచర్లకు షోకాజ్ నోటీసులు గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధుల్లో ఇన్విజిలేటర్లుగా నియమించిన 10 మంది ఉపాధ్యాయులకు గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్ ఆదివారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ, నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలల్లో ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే వీరిలో 10 మంది ఉపాధ్యాయులు సోమవారం నుంచి జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల విధులకు హాజరయ్యేందుకు ఆదివారం సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు రిపోర్టు చేయలేదు. దీంతో సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హామీలు నెరవేర్చేందుకు కృషి కేంద్ర మంత్రి పెమ్మసాని పెదకాకాని: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు, పెదకాకాని, కొప్పురావూరు గ్రామాల్లో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను పెమ్మసాని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు త్వరలో తల్లికి వందనం, మహిళలకు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం అమలుతోపాటు అన్నదాతలకు రైతు భరోసా నిధులు విడుదలకు కృషి చేస్తున్నట్టు వివరించారు. -
పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
సత్తెనపల్లి: ఆర్థిక స్తోమత లేని పేద రిమాండ్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియావుద్దీన్తో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను, ఆహారం, దానికి ఉపయోగించే సరుకుల నాణ్యతను పరిశీలించారు. అంతేకాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలించి అన్ని అంశాల పై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్కుమార్ రెడ్డి, సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, ప్యానల్ న్యాయవాది బి.ఎల్.కోటేశ్వరరావు, సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం, తదితరులు ఉన్నారు. జిల్లా న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి సత్తెనపల్లి సబ్జైలు సందర్శన -
మండే ఎండలు.. కాలే కడుపులు!
ముప్పాళ్ళ: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పదివారాలకు పైగానే కూలి డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. ఒక పక్క వేతనాలు అందక, మరో పక్క పనిచేసే చోట కనీస సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూలీల బాధ వర్ణనాతీతంగా మారింది. పని ప్రదేశాల్లో కనీసం నీడ, మంచినీటి సదుపాయం కూడా లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. మరో వైపు కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను రాజకీయ వేధింపులతో తొలగించడంతో ఆయా పంచాయతీలలో ఇన్చార్జ్ మేట్లతో పనులను కొనసాగిస్తుండటంతో పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతుంది. అంతే కాకుండా కనీస వేతనంగా రూ.300 అందజేస్తామని చెప్పినప్పటికీ ఆ దిశగా వేతనాలు గిట్టుబాటు కావడం లేదని వేతనదారులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఫామ్ పాండ్ (సేద్యపు కుంట)నిర్మాణాల లక్ష్యాలు విధిస్తూ ఉపాధిహామీ సిబ్బందిపై ఒత్తిడిలు ప్రారంభయ్యాయి. ఒక వైపు పనులు, మరో వైపు లక్ష్యాలతో ఉపాధిహామీ సిబ్బంది సతమతమవుతున్నారు. నాలుగు వారాల కూలి రావాలి నాలుగు వారాలు ఉపాధి హామీ పనికి వెళ్లాను. ఎండలో చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్లి పనిచేశాం. ఇంత వరకు రూపాయి రాలేదు. అడిగితే మీ ఖాతాల్లోనే జమ అవుతాయని చెబుతున్నారు. మళ్లీ పని చూపించటం లేదు. – దేశిరెడ్డి వేమారెడ్డి, చాగంటివారిపాలెం రెండు రోజుల్లో జమ అవుతాయి ఉపాధి పనులకు సంబంధించి ఇటీవల కొంత వేతనాలు పెండింగ్ వాస్తవమే. జనవరి 15వ తేదీ వరకు బిల్లులు వచ్చాయి. బకాయిలపై ప్రభుత్వానికి నివేదిక అందించాం. మరో రెండు రోజుల్లో బకాయిలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ఎం.సిద్ధలింగమూర్తి, పీడీ, డ్వామా, పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా పరిధిలో 530 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 2,66,000 మందికి జాబ్కార్డులు ఉన్నాయి. మొత్తం 4,54,00 మంది కూలీలు పనులకు హాజరవుతారు. ఈ ఏడాది మొత్తం 39వేల పనులు గుర్తించారు. అందులో 8వేల పనులు పూర్తి కాగా, 31వేల పనులు జరుగుతున్నాయి. 6,915 మంది వందరోజులు పనిదినాలు పూర్తి చేశారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షల వరకు పనిదినాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం అధికారుల అంచనాల ప్రకారం ఒక్కొక్కరికీ రోజుకు రూ.250 నుంచి రూ.270 వరకు వేతనం అందాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం పది వారాలకు గాను సుమారు రూ.22.79 కోట్ల మేర కూలి డబ్బులు రావాల్సి ఉంది. పది వారాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కూలీలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కూలీలకు పది వారాలుగా అందని వేతనాలు జిల్లా వ్యాప్తంగా రూ.22.759 కోట్ల బకాయిలు ఎర్రటి ఎండలోనే పనిచేస్తున్న కూలీలు పని ప్రాంతాల్లో కనిపించని సదుపాయాలు వేతనాల కోసం ఎదురు చూపులు.. -
వైభవంగా పునఃప్రతిష్టా మహోత్సవాలు
గొరిగపూడి(భట్టిప్రోలు): మండలంలోని ప్రసిద్ధి గాంచిన గొరిగపూడి శ్రీ భ్రామరీ దుర్గాదేవి సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానం జీవధ్వజ విమాన గోపుర శిఖర సహిత పునః ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రాచీన ఆలయం జీర్ణోద్ధరణ గొప్ప కార్యమని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు కోటి రూపాయలు, మేరుగ నాగార్జున రూ. 25 లక్షలు, పూర్వ గ్రామ కరణం, పులిగడ్డ వారి వంశస్తులు రూ. 25 లక్షలు అందించారు. గ్రామస్తులు వెండి సామగ్రి అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం శాంతి కల్యాణం అనంతరం అన్న సంతర్పణ జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గరిగపాటి మల్లిక–వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు ఆమంచి సృజన్ కుమార్, కార్యనిర్వాహణాధికారి పాపని రాజేశ్వరరావు పాల్గొన్నారు. గొరిగపూడిలో నాగేశ్వరస్వామి ఆలయం పునరుద్ధరణ రూ.1.50 కోట్లతో నిర్మాణం -
వైభవంగా ముగిసిన శతచండీ మహాయాగం
సత్తెనపల్లి: లోక కళ్యాణార్థం భక్తిశ్రద్ధలతో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శతచండీ మహాయాగం నిర్వహించడం అభినందనీయమని శైవ క్షేత్రాదీశ్వరులు, విశ్వధర్మ పరిరక్షణ వేదిక వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ శివస్వామి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని త్రిశక్తి దుర్గాపీఠంలో హనుమత్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈనెల 6న చేపట్టిన పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శతచండీ మహాయాగం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శివస్వామి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం త్రిశక్తి దుర్గా పీఠాన్ని స్థాపించి భక్తి, జ్ఞాన, సేవ, ధర్మ మార్గాన్ని హనుమత్ స్వామి అందిస్తున్నారన్నారు. లోక కళ్యాణార్థం రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని నవదుర్గాత్మక శత చండీ మహాయాగం నిర్వహించడం విశేషం అన్నారు. పది రోజుల పాటు హోమాలు ప్రత్యేక పూజలు బ్రహ్మశ్రీ కంభంపాటి ఉదయ్ కృష్ణ వారి బృందం అత్యంత వైభవంగా నిర్వహించారన్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి ఒకే పీఠంపై ఉండడం చాలా విశేషమని, అలాగే ప్రసన్నాంజనేయ స్వామి వారు చాలా ప్రత్యేకమన్నారు. ఈ సందర్భంగా సర్వతోభద్ర మండల హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతి హోమాలు, మహా పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణం, ప్రోక్షణ, వేద ఆశీర్వచనం, పండితుల సత్కారాలు చేపట్టి భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు మంచి భవిష్యత్
ప్రొఫెసర్ డాక్టర్ హీరాసింగ్ నగరం: కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని హైదరాబాద్ శ్రీనిధి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ హీరాసింగ్ అన్నారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాలలో శనివారం డిజైన్ థికింగ్ ఫర్ ఇన్నోవేషన్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్లో డాక్టర్ హీరాసింగ్ పాల్గొని మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. డిజైన్ థింకింగ్ అనేది వినియోగదారుల అవసరాలు, కోరికలను అర్ధం చేసుకొని వాటిని కంప్యూటర్ సైన్స్తో పరిష్కరించడమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలలోను మానవాళి జీవనానికి ఎంతగానో ఉసయోగపడుతుందన్నారు. మనిషి చేసే ఎన్నో పనులను ఏఐ సాయంతో చేయగలుగుతున్నాయన్నారు. ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మానవాళి మనుగడకు ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. లక్కిరెడ్డి, బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ ప్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కరస్పాడెంట్ వల్లభనేని బుచ్చియ్యచౌదరి, ప్రిన్పిసాల్ హరికృష్ణ, వైస్ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, అకడమిక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, కంప్యూటర్ సైన్స్ హెచ్వోడీ సజ్జా శ్రీనివాసరావు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ వైద్యసేవ ఉద్యోగులకు న్యాయం చేయాలి
ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17, 24 తేదీల్లో విధుల బహిష్కరణ వినుకొండ: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 17, 24 తేదీల్లో రాష్ట్రం మొత్తం విధులు బహిష్కరిస్తున్నామని ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్టీఆర్వీఎస్ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తుందని, ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి బీమా సేవలు కొనసాగుతాయని తెలిజేసిందన్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో గత 17 సంవత్సరాలుగా ప్రజలకు ఉచిత సేవలందించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బంది ప్రభుత్వాల నుంచి ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. ఇప్పటికై నా సమస్యలను నెరవేర్చాలని భవిష్యత్ పోరాటానికి సిద్ధమయ్యామని తెలియజేశారు. రాష్ట్ర నాయకులు మాచర్ల బుజ్జి, కాకాని అప్పారావు, జిల్లా నాయకులు సింగంశెట్టి వెంకటేశ్వర్లు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రతో పరిసరాలు శుభ్రం
రాజుపాలెం: అందరి భాగస్వామ్యంతో శుభ్రమైన గ్రామంగా తయారు చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు సూచించారు. మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఖాళీ స్థలాల్లో, బజార్లలో పేరుకుపోయిన చెత్తను మహిళలు, అధికారులతో కలసి చీపురు పట్టి ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మండలంలో ప్రతీ గ్రామంలో అధికారులు నిర్వహించాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛ కిట్లు అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి భాస్కరరెడ్డి, తహసీల్దార్ దుర్గేష్ రావు, ఎంపీడీఓ జీవీ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కోనేటి రాయుడికి నీరాజనాలు
రాజుపాలెం: పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన దేవరంపాడు కొండపై స్వయంభూగా వెలసిన నేతి వెంకన్నస్వామి మూడవ శనివారం తిరుణాళ్లకు భక్తులు పోటెత్తారు. సమీప ప్రాంతాల నుంచే గాక సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు దేవరంపాడు కొండకు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే సమయంలో గోవింద నామస్మరణతో కొండ మారుమోగింది. కోనేటి రాయుడికి కోటి దండాలంటు నీరాజనాలు అందించారు. భక్తులు స్వామివారికి పొంగళ్లుచేసి నెయ్యి, బెల్లం, పప్పు వగైరాలు సమర్పించారు. పశుసంపదను కాపాడాలని నెయ్యిని సమర్పించి మొక్కుకున్నారు. తిరునాళ్లలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ గణసతి సురేష్ ఏర్పాట్లు పరిశీలించారు. హుండీలు, విరాళాలు, స్పెషల్, సీఘ్ర దర్శనాలు, తల నీలాలు, లడ్డు, ప్రసాదాల ద్వారా రూ13,47,259లు ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. -
ఉపాధ్యాయ బకాయిలను వెంటనే చెల్లించాలి
ఎస్టీయూ (డి) డిమాండ్ అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్టీయూ(డి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక జేబీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఎస్టీయూ(డి) సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంఘం మండల అధ్యక్షుడు జి.ఆనందరావు అధ్యక్షత వహించారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు అరుణారావు మాట్లాడుతూ పీఆర్సీపై ఇచ్చిన హామీని ప్రభుత్యం నిలబెట్టుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి ఎం.సాంబశివరావు మాట్లాడుతూ పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఎంఈఓ వై.ప్రసాదరావు మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మంటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎస్టీయు(డి) మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో సంఘం మండల గౌరవ అర్యక్షుడిగా అంకం బుజ్జిబాబు, అధ్యక్షుడిగా జి. ఆనందరావు, ఉపాధ్యక్షులుగా పీఎస్ కుమారి, శ్రీనివాసరావు, కార్యదర్శిగా ఎం.అదాలు, సహాయ కార్యదర్శులుగా షేక్ షారాభి, బైమున్నీసా, మహిళా కార్యదర్శిగా అన్నం వేణుకుమారి, ఆర్థిక కార్యదర్శిగా కుంభా సాంబశివరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా వి.అరుణ రావు, ఎం.సాంబశివరావు, డి.కోటేశ్వరరావులు ఎంపికయ్యారు. ఎంఈఓ–2 శివబాబు, జిల్లా నాయకులు దాసరి కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్లతో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేడు మహా శైవక్షేత్రం పునఃప్రతిష్టా మహోత్సవం
దాచేపల్లి: మండలంలోని గామాలపాడు గ్రామంలో మహాశైవక్షేత్ర పునఃప్రతిష్ట మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం జరిగే ఈ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పల్నాటి తొలి మహిళా మంత్రిణి నాయకురాలు నాగమ్మ 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ మహాశైవక్షేత్రం శిథిలావస్థకు చేరుకోవటంతో పునఃప్రతిష్ట చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సుమారుగా 15 ఎకరాల విస్తీర్ణంలో మహాశైవక్షేత్రంలో పలు దేవాలయాల నిర్మాణాలు, ముఖద్వారాలు, మండపాలు నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పర్యవేక్షణలో మహాశైవక్షేత్రం పనులు జరుగుతున్నాయి. పునఃప్రతిష్టకి సంబంధించిన పనులు పూర్తి చేశారు. పురాతన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో పందిళ్లు ఏర్పాటు చేశారు. పుణ్యదంపతులు ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. నేడు మంత్రి, టీటీడీ చైర్మన్ రాక.. మహాశైవక్షేత్రం పునఃప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనేందుకు అతిధులు వస్తున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటుగా పలువురు ప్రముఖులు వస్తున్నారని, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈప్రతిష్ట మహోత్సవంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
నర్సరీ భూముల నష్ట పరిహారంపై విచారణ
రెంటచింతల: మాచర్ల – దాచేపల్లి బైపాస్ రోడ్డు(ఎన్హెచ్–167 ఏడీ) నిర్మాణంలో భాగంగా రెంటచింతలలో రెండు షేడ్ నెట్ నర్సరీలకు సంబంధించి కోల్పోయిన భూములను శనివారం గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు నేషనల్ హైవే అథారిటీ విజయవాడ ఏఈ ప్రకాష్ నేతృత్వంలోని బృందంతో కలిసి పరిశీలించారు. ఇటీవల రెంటచింతల గ్రామానికి దుగ్గింపూడి జోసఫ్రెడ్డి, నరమాల రామకృష్ణ అనే ఇద్దరు రైతులు జాతీయ రహదారి 167 ఏడీ నిర్మాణం వలన తాము ఏర్పాటు చేసుకున్న షేడ్ నెట్ నర్సరీ భూములను కోల్పోయామని, ఇంతవరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని పూర్తిస్థాయిలో విచారించి న్యాయం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులు కోల్పోయిన 787, 788 సర్వే నంబర్లలో ఏర్పాటు చేసిన నర్సరీ భూమిని పునఃపరిశీలించేందుకు ఈ బృందం వచ్చిందన్నారు. జాతీయ రహదారి నిర్మాణం వలన ఒక్కో షేడ్ నెట్ నర్సరీ నిర్వహకులు ఎంత భూమిని కోల్పోయారు.. తదితర వివరాలను సేకరించారు. ఈ రెండు నర్సరీలకు సంబంధించి మొత్తం 0.68 ఎకరాల భూమి కోల్పోయినట్లు మండల ఆర్ఐ పల్లా రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్కు పూర్తి నివేదికను అందజేయనున్నట్లు ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు. వారి వెంట జిల్లా ఉద్యానఅధికారి సీహెచ్వీ రమణారెడ్డి, తహసీల్దార్ మూఢావత్ అర్జున్ నాయక్, జాతీయ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాస్, గురజాల హెచ్ఓ వై.మోహన్, సర్వేయర్ నవులూరి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
తిరుపతమ్మతల్లి తిరునాళ్లలో ఆకట్టుకున్న ప్రభలు
అచ్చంపేట: మండలంలోని కోనూరులో శ్రీలక్ష్మీ తిరుపతమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవంలో గ్రామస్తులు పోటాపోటీగా విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. గ్రామంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీ తిరుపతమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జామువరకు విద్యుత్ వెలుగులతో విద్యుత్ ప్రభలు చీకటిని పాలదోలాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భక్తిశ్రద్ధలతో రూ.4లక్షల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ప్రభ ఎంతో ఆకట్టుకుంది. టీడీపీ, జనసేన పార్టీలవారు కూడా విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భక్తులు మరో విద్యుత్ ప్రభను ఏర్పాటుచేశారు. తెల్లవారు జామున నాలుగు గంటల వరకు విద్యుత్ ప్రభలవద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 4వేలు జనాభాగల గ్రామంలో 5 విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేయడం విశేషం. చుట్టు పక్కల గ్రామాలనుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, ప్రభలవద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అచ్చంపేట సీఐ పి.వెంకటప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విత్తన గుళికల విధానంతో మేలు
డీపీఎం కె.అమలకుమారి నరసరావుపేట రూరల్: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు భూమిని కప్పి ఉంచే విత్తన గుళికల తయారీ విధానాన్ని అవలంభించాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్వవసాయం జిల్లా కార్యాలయంలో సిబ్బందికి నిర్వహిస్తున్న మూడవ రోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరయ్యారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ వేసవిలో ప్రతి రైతు తనకున్న పొలంలో ఈ విత్తన గుళికల విధానం ఆచరించాలని తెలిపారు. దీని ద్వారా భూమిలో తేమశాతం, కార్బన్ ఆవిరి కాకుండా ఉంటాయని తెలిపారు. కార్బన్ శాతం పెరగడం వలన తరువాత సాగుచేసే ప్రధాన పంటకు చీడపీడల ఉధృతి తగ్గుతుందని, మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. ఈ విధానం వలన రైతులకు రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ విత్తనాలు భూమిలో ఆరునెలల పాటు ఎటువంటి చీడపీడల ఆశించకుండా కొద్దిపాటి వర్షానికే మొలకెత్తుతాయని తెలిపారు. దీని ద్వారా రైతు కుటుంబానికి అవసరమైన ఆకుకూరలు లభించడంతో పాటు పశువులకు మేత లభిస్తుందని చెప్పారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమేక్రాజు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యులు కేఏసీ కార్యక్రమంలో పాల్గొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, అప్పలరాజు, మేరి, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్ రాజీనామా
సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్కు తాళం వేశారు. నేను ఛాంబర్కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ దయవల్లే నేను మేయర్ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్ నాయుడు హెచ్చరించారు. -
గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు. రిమాండ్లో ఉన్న పోసానితో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’ అని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. -
రన్యారావుతో నాకే సంబంధం లేదు: పిడుగురాళ్ల వ్యాపారి
పల్నాడు, సాక్షి: పిడుగురాళ్లలో తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ ఓ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడన్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కన్నడ నటి, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు(Ranya Rao) పేరు తెర మీదకు రాగా.. పరారీలో ఉన్నాడని చెబుతున్న సదరు వ్యాపారి ఈ అంశంపై స్పందించాడు. ఏం జరిగిందంటే.. స్థానికంగా తాను మిర్చి ఎగుమతి, బంగారు దిగుమతి చేస్తున్నానని.. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ సదరు వ్యాపారి ప్రచారం చేశాడు. అయితే అతని ఆర్భాటాలు, అప్పటికే అతను చేసిన దానధర్మాలు చూసిన కొందరు అది నిజమేనని నమ్మారు. దాచేపల్లి, కారంపూడి, సత్తెనపల్లి, నరసరావుపేటకు చెందిన కొందరు సదరు వ్యాపారికి డబ్బు ముట్టజెప్పారు. మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామన్న ఆందోళనతో బాధితులు లబోదిబోమన్నారు. అయితే సదరు వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావిస్తుండగా.. అతని పేరిట ఓ వాట్సాప్ సందేశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.తానేం దేశం విడిచి పారిపోలేదని.. ఇండియాలోనే ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, రెండు నెలల టైం ఇస్తే అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఆ ఆడియో మెసేజ్లో చెప్పాడు. వందల కోట్లు ఎగ్గొట్టాడని వార్తల్లో వస్తున్న కథనాలను ఆ వ్యాపారి తోసిపుచ్చాడు. అలాగే.. నటి రన్యా రావుతో లింకులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని ఆ ఆడియో మెసేజ్తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. -
అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి
ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి. కాశీం ఏఎన్యూ: అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి సాధ్యమని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాబూ జగ్జీవన్రామ్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘రోల్ ఆఫ్ బాబూ జగ్జీవన్రామ్ ఇన్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభలో ఆచార్య కాశీం కీలకోసన్యాసం చేశారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ లక్ష్యం ఒక్కటేనన్నారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కోటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎస్.సరళా వందనం, విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారి ఎ.భరత్భూషణ్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఆలోచనా విధానాలను వివరించారు. వీసీ ఆచార్య కె. గంగాధరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, కావలి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ కళాశాల కామర్స్ విభాగాధిపతి ఆచార్య సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సదస్సు డైరెక్టర్ ఆచార్య పీజే రత్నాకర్ నివేదిక సమర్పించారు. అనంతరం సదస్సు పరిశోధనా పత్రాల సావనీర్ను, బాబూ జగ్జీవన్రామ్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. ఆనందబాబు రాసిన కర్మయోగి డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ పుస్తకాన్ని అతిఽథులు ఆవిష్కరించారు. -
వైభవంగా శత చండీ మహా యాగం
సత్తెనపల్లి: పట్టణంలోని భవిష్య పాఠశాల సమీపంలో గల త్రిశక్తి దుర్గాపీఠంలో శతాధిక ప్రతిష్టా బ్రహ్మ, దేవీ ఉపాసకులు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కోశాధికారి, పరమ పూజ్య శ్రీ హనుమత్ స్వామి ఆధ్వర్యంలో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చండీ పారాయణం, శత చండీ హోమం, గురు వందనం, ప్రధాన దేవతా ఆర్చణ, శత చండీ హోమం, లలిత సహస్ర నామార్చన, దీపార్చన, హారతి, మంత్ర పుష్పం, అమ్మవార్లకు దశ విధ అభిషేకాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. బగలాముఖి, రాజశ్యామల, వారాహి హోమాలు, యోగిని మండప హోమాలు నిర్వహించారు.గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 6న ప్రారంభమైన పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శనివారంతో ముగియనుంది. ఆఖరి రోజు శనివారం సర్వతోభద్ర మండల హోమాలు, ప్రాయశ్చిత హోమాలు, శాంతి హోమాలు, మహా పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణం, ప్రోక్షణ, వేదఆశీర్వచనం, పండితుల సత్కారాలు, అన్నదానం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హజరుకానున్నట్లు ధర్మకర్తలు తెలిపారు. -
రేషన్ బియ్యం మూటలు స్వాధీనం
తాడికొండ: తాడికొండ మండలం నిడుముక్కలలో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 16 రేషన్ బియ్యం మూటలను గురువారం అర్ధరాత్రి పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిడుముక్కల దర్గాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈ మూటలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూటలను రేషన్ షాప్ నంబర్ 12కు అప్పగించినట్లు రెవెన్యూ ఆర్ఐ హనుమంతరావు వెల్లడించారు. మాణిక్యవేల్కు నివాళి నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత డాక్టర్ అరుణాచలం మాణిక్యవేల్ (77) అంతిక్రియుల శుక్రవారం జరిగాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అరండల్పేట 10/2వ అడ్డరోడ్డులోని ఆయన నివాస గృహంలో సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి (పశ్చిమ), నసీర్ అహ్మద్ (తూర్పు), ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్తో పాటు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాణిక్యవేల్ అంత్యక్రియలుకొరిటెపాడులోని శశ్మాన వాటికలో జరిగాయి. కుటుంబ సభ్యులు, ట్రిపుల్ ఎక్స్ సోప్ ఉద్యోగు, సిబ్బంది పెద్దఎత్తున తరలివెళ్లారు. -
నూతన పారిశ్రామిక చట్టంపై అవగాహన పెంచుకోవాలి
ఎంఎస్ఎంఈ ఏడీ డాక్టర్ కె.ఎల్.ఎస్.రెడ్డి బాపట్ల: నూతన పారిశ్రామిక విధానాలపై అవగాహన కలిగి ఉండి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను, సహకారాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించవచ్చని ఎంఎస్ఎంఇ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెఎల్ఎస్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులు, వాటిపై అవలంబించాల్సిన విధానాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను స్థాపించేందుకు కావాల్సిన వనరులపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీల గురించి తెలుసుకోవాలని సూచించారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు తక్కువ పెట్టుబడి వ్యయంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని నాణ్యతతో కూడిన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలలో సబ్సిడీలను కూడా తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కో–ఆర్టినేటర్ పి.వీరయ్య, బాపట్ల జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిశెట్టి రత్నగుప్తా, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తూకంలో చేతివాటం
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025తూకాల తక్కెడ వ్యాపారుల చేతుల్లో తకథిమి అంటూ ఊగిసలాడుతోంది. పీజీలు చదివినోళ్లను సైతం బోల్తా కొట్టిస్తోంది. వంటింటి బడ్జెట్ను పైసల సహా లెక్కగట్టే మహిళలను ఏమార్చి ముంచేస్తోంది. కేజీ రాయి అరిగిపోయి వినియోగదారుల జేబులు కరిగిస్తోంది. కూరగాయల నుంచి సరుకుల వరకు ప్రతి వస్తువులోనూ మోసమే ఎదురవుతోంది. ప్రజల్లో ప్రశ్నించే కరువైంది. నిలదీసే అవగాహన లేక, వినియోగదారుల హక్కుల గురించి చెప్పే వారు కానరాక తూకాల తక్కెడలో ప్రజల సొమ్ము ఆవిరవుతోంది. ఇలా నిత్యం తూకాల్లో వినియోగదారులకు ఎదురయ్యే మోసాలపై సాక్షి ప్రత్యేక కథనం. ఇఫ్తార్ సహర్ (శని) (ఆది) నరసరావుపేట 6.25 5.01 గుంటూరు 6.23 4.59 బాపట్ల 6.23 4.59 న్యూస్రీల్ -
వైభవంగా శింగరకొండ తిరునాళ్ల
అద్దంకి/అద్దంకి రూరల్: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, కొండపైనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల 70వ వార్షిక తిరునాళ్ల శుక్రవారం వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీశైలం దేవస్థాన డిప్యూటీ కమిషనర్ రమణమ్మ ప్రత్యేకాధికారిగా, ఏసీ తిమ్మనాయుడు ప్రత్యేక సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉచిత దర్శనం కల్పించారు. వీఐపీ, వికలాంగులకు, వృద్ధులకు, ప్రత్యేక దర్శన క్యూలైన్లతోపాటు, వివిధ ధరలతో దర్శన క్యూలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు మజ్జిగ, తాగునీరుతోపాటు, దర్శనం చేసుకున్న వారికి ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. వివిధ బ్యాంక్ బ్రాంచ్లు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీటిని ఉచితంగా పంపిణీ చేశాయి. ప్రత్యేక పూజలు.. ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు స్వామివారికి చక్కెర పొంగలి వండి, కుండలను నెత్తిన పెట్టుకుని దర్శనంతో మొక్కులు తీర్చుకున్నారు. కొండ మీద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఈవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం, సామూహిక వ్రతాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఆలయ పరిసరాల్లో, విద్యుత్ శాఖ, మోదేపల్లి పీహెచ్సీ, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, ఫైర్, మునిసిపల్తో పాటు, మండల పరిషత్, ఎల్ఐసీ, స్టేట్బ్యాంక్ వివిధ బ్యాంక్ బ్రాంచ్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వాసవీ వనిత క్లబ్ ప్రకాశం ప్రభుత్వ హైస్కూల్1980–81 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటుతో మజ్జిగ, తాగునీరు, పులిహోర పంపిణీ చేశారు.అన్ని సామాజిక సత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం నిర్వహించారు. అద్దంకి డిపో నుంచి ప్రత్యేక బస్సులు అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. వీటితోపాటు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, దర్శి, పొదిలి తోపాటు వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. కొండమీద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెంకటాపురానికి చెందిన పాకనాటి అంజిరెడ్డి, పాకనాటి మధుసూదన్రెడ్డికి చెందిన రెండు బస్సుల్లో భక్తులను ఉచితంగా చేర వేశారు. ఆకర్షణీయంగా అంగళ్లు తిరునాళ్ల సందర్భంగా క్షేత్రానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణాలు, చెరుకు విక్రయ దుకాణాలు, వివిధ వస్తువులతో నిర్వహించిన సంతల్లో భక్తులు వస్తువులను కొనుగోలు చేశారు. తిరునాళ్లలో ఏర్పాటు చేసిన జైంట్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. పోటెత్తిన భక్తులు సత్రాల్లో అన్నదానం వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు మజ్జిగ, తాగునీరు, ప్రసాదాల పంపిణీ 70 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ -
పాతకక్షలతో ఓ వ్యక్తిపై దాడి
రేపల్లె రూరల్: పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని జంగాలపాలెంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న కొమరాబత్తిని శ్యామ్కుమార్పై అదే గ్రామానికి చెందిన కనపర్తి నాగేంద్రబాబు గురువారం రాత్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు నాగేంద్రబాబును అడ్డుకుని తీవ్రంగా గాయపడిన శ్యామ్కుమార్ను రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. విశాఖపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం–చర్లపల్లి ప్రత్యేక రైలు (08579) ఈ నెల 16న సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08580) ఈ నెల 17న ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, అదే రోజు రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడకుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. -
చట్టాలు కాగితాలకే పరిమితం
నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు కల్తీకి గురవుతున్నాయి. వాటిని అరికట్టి వినియోగదారుల సంక్షేమానికి ప్రభుత్వం అమల్లో ఉంచిన చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమౌతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు, మామూళ్ల మత్తులో అధికారులు ఉండటంతో కల్తీ వస్తువులను కొనుగోలుచేసే వినియోగదారుడు నష్టపోవటమే గాకుండా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఽఅధికారుల నిఘా, తనిఖీలు నామమాత్రంగానే జరుగుతుండటంతో నాసిరకం వ్యాపారం దర్జాగా జరుగుతోంది. కల్తీలు జరుగుతున్నట్లు వినియోగ సంఘాల దృష్టికి వస్తున్నా ఏమి చేయలేని పరిస్థితులో ఉంటున్నాం. –కుంచాల స్వామి, పట్టణ వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులు -
నృసింహునికి బ్రహ్మరథం
మంగళగిరి/మంగళగిరి టౌన్: జై నారసింహా.. జైజై నారసింహా నినాదాలతో మంగళగిరి శుక్రవారం మార్మోగింది. శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు 11 రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామి కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలకు ఉభయదేవరులతో స్వామి దివ్యరథాన్ని అధిరోహించారు. మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. గాలిగోపురం నుంచి దక్షిణాభిముఖంగా ప్రారంభమైన రథం మెయిన్ బజార్ మిద్దె సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు కదలింది. అక్కడ ఆంజనేయస్వామి, వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం తిరిగి గాలిగోపురం వద్దకు చేరుకుంది. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు తిలకించి ముగ్ధులయ్యారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాడభూషి వేదాంతచార్యులు వ్యవహరించారు. పద్మశాలీయ శ్రీ లక్ష్మీనృసింహస్వామి రథ చప్పాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమో నారసింహా మంగళాద్రి.. ‘జన’దాద్రి అంగరంగ వైభవంగా నృసింహుని దివ్య రథోత్సవం -
రైతులను భాగస్వాములను చేయాలి
రైతు సాధికారిత సంస్థ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్ నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికలో రైతులను భాగస్వాములను చేయాలని రైతు సాధికారిత సంస్ధ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి వార్షిక కార్యచరణ ప్రణాళికపై శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి జూమ్ కాల్ ద్వారా హాజరైన విజయకుమార్ మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలుగుతుందని తెలిపారు. వాతావరణం కూడా అత్యవసరస్థితిని ఎదుర్కుంటుందని చెప్పారు. ఖరీఫ్ వార్షిక ప్రణాళిక, సార్వత్రిక సూత్రాలు, పలు జిల్లాల్లో వ్యవసాయ విధానాలు, రైతులు పండిస్తున్న ఏ గ్రేడ్, ఏటీఎం మోడల్లో పండిస్తున్న పంటలు, రైతుల విజయ గాథలను వివరించారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ వ్యవసాయ, డీఆర్డీఏ, ఉపాధి హామీ, సెరీకల్చర్, హార్టీకల్చర్ తదితర శాఖల సమన్వయంతో కలిసి ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. నవధాన్యాలు సాగుభూమికి ఎంత మేలు చేస్తాయో వివరించారు. రైతులంతా పీఎండీఎస్ పద్ధతిని అవలంబించి సాగు చేయాలని సూచించారు. 30 రకాల విత్తన పద్ధతిని పాటిస్తే భూములు సారవంతమవుతాయని తెలిపారు. భూమి సంవత్సరమంతా పచ్చగా ఉంటే జీవ వైవిధ్యం పెరిగి భూమి సారవంతమై, చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్రాజు, రాష్ట్ర శిక్షకురాలు శాంతి, జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, అప్పలరాజు, సౌజన్య, మేరి, స్వాతి పాల్గొన్నారు. -
నాటు సారాతో కుటుంబాలు రోడ్డు పాలు
నిజాంపట్నం: నాటు సారా తాగటంతో జీవితాలు నాశనమవ్వటమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు అనేకం ఉన్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటు సారాతో కలిగే దుష్పరిణామాలపై నగరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం ఆధ్వర్యాన మండలంలోని దిండి పంచాయతీ యేమినేనివారిపాలెం గ్రామంలో శుక్రవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నాటు సారా వ్యతిరేక నినాదాలతో గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. తామే కాకుండా తమ కుటుంబ సభ్యుల జీవితాలను సైతం పాడుచేయటం ఎంత వరకు సబబో తామే ఆలోచించాలని సూచించారు. అపరిశుభ్ర వాతావరణంలో అశాసీ్త్రయంగా తయారు చేయటంతో నాటు సారాలో ఎక్కువ మోతాదులో విషపూరిత రసాయనాలు ఉంటాయని, దీన్ని తీసుకోవటంతో ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, శరీరంలో అన్ని అవయవాలు దెబ్బతింటాయన్నారు. ఆర్థికంగా, సామాజికంగా గౌరవ మర్యాదలు కోల్పోయిన వారవతారన్నారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా చట్టరీత్యా నేరమని, ఈ నేరానికి పాల్పడిన వారికి 8 సంవత్సరాల కఠిన శిక్షతోపాటు రూ.5లక్షలు జరిమానా విధిస్తారని తెలిపారు. నాటుసారా తయారు చేసేవారికి అవసరమైన ముడిసరుకులు అందించే వారికి, విక్రయించే వారికి కూడా శిక్షలు తప్పవని చెప్పారు. గ్రామంలో నాటుసారా తయారు కాకుండా ఉండేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎవరైనా నాటుసారా తయారు చేస్తున్నట్లు గమనిస్తే తమకుగాని, 9490455599, 9440902477 నంబర్లకుగాని, 14405 టోల్ఫ్రీ నంబరుకుగాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగరం సీఐ శ్రీరామ్ప్రసాద్, ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్ఐలు ఎస్.రామారావు, పి.రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. నాటు సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరం బాపట్ల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు -
నంది అవార్డులకు 2014లో గ్రహణం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఏపీలోని నందు (నంది అవార్డులు)లు అస్వస్థతకు గురైనట్లు మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్రాజా వ్యాఖ్యానించారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పేరుతో అవార్డులు ప్రదానం చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం 2013 నుంచి నిలిపివేసిన నంది అవార్డుల ప్రదానంపై విధి విధానాలను ప్రభుత్వం రూపొందించాలని కోరారు. నంది అవార్డులకు 2014 నుంచి గ్రహణం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపిక విధానంలో ప్రతిభను మాత్రమే గుర్తించాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమను, సినిమా కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దర్శకులు నరేష్ దోనె, మణివరన్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లాకు చోటు
డాక్టర్స్ వింగ్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా చింతలపూడి అశోక్కుమార్ నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులకు రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలలో స్థానం కల్పిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వెన్నా రాజశేఖరరెడ్డిని రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సంయుక్త కార్యదర్శిగా, డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ను రాష్ట్ర డాక్టర్ల వింగ్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా నియమించారు. గొలుసు లాక్కొని యువకుల పరారీ నరసరావుపేట టౌన్: ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కొని వెళ్లిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్నగర్ 60 అడుగుల రోడ్డు సీబీఐటీ స్కూల్ సమీపంలో నలిశెట్టి సులోచన నడిచి వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించినా ఫలితం దక్కలేదు. ఈ మేరకు బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిశోర్ తెలిపారు. బీజేపీ నాయకుడిపై పలువురి దాడి రేపల్లె రూరల్: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన నగరం మండలం బోరమాదిగపల్లిలో చోటుచేసుకుంది. బోరమాదిగపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నగరం మండల అధ్యక్షుడు జుజ్జువరపు సురేష్కు అదే గ్రామానికి చందిన చందోలు వీరయ్యతో కొంత కాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. వీరయ్య మరి కొంతమంది గురువారం రాత్రి గ్రామ సమీపంలో కాపుకాసి ఇంటికి వెళ్తున్న సురే ష్పై దాడికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో వీరయ్యతోపాటు దాడికి ఉపక్రమించిన వారు పారిపోయారు. సురేష్ను వైద్య చికిత్సల కోసం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరయ్యతోపాటు దాడికి పాల్పడిన వారు మంకీ క్యాప్ ధరించి ఉన్నారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగరం ఎస్ఐ భార్గవ్ తెలిపారు. సురేష్పై దాడి సంఘటన తెలుసుకున్న బీజేపీ నాయకులు బేతపూడి వెంకటేశ్వరరావు, పిన్ని సాంబశివరావులు పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పోరాడే ఓపిక ఉండట్లేదు
జిల్లాలో ఆహార కల్తీలు, తూకాల మోసాలు జరగడానికి వినియోగదారుల్లో అవగాహన, సరైన అధికారులు, సిబ్బందిలేకపోవటమే కారణం. మోసపోయిన వినియోగదారుడు ఫిర్యాదుచేసి కోర్టుకు వెళ్లి తీర్పు వచ్చేంతవరకు ఉండే ఓపిక ఉండట్లేదు. దీని కోసం మా వంతు అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రావట్లేదు. లీగల్ మెట్రాలజీలో జిల్లాకు అసిస్టెంట్ కంట్రోలర్, ఇద్దరు ఇనస్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. కల్తీలు పట్టుకొని నిర్ధారించేందుకు ప్రయోగశాల ల్యాబ్ రాష్ట్రంలో లేకపోవటం దురదృష్టకరం. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ విభాగ అధికారులు కలిసి కల్తీలను పరిశీలిస్తే బాగుంటుంది. –పిల్లి యజ్ఞనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, నరసరావుపేట -
ప్రశ్నించటంతోనే మార్పు
వినియోగదారులు తూకాల్లో మోసాలపై ప్రశ్నించటంతోనే మార్పు మొదలవుతుంది. అధికారులు తనిఖీల సమయంలో మోసాలు గుర్తించి కేసులు, జరిమానాలు విధిస్తున్నారే తప్పా వినియోగదారుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు రావటం లేదు. అధిక శాతం పెట్రోల్ బంక్లో అక్రమాలు, కూల్డ్రింక్ అధిక ధరలు, తూకాల్లో వ్యత్యాసం వంటి వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటనే దాడులు నిర్వహించి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. గత ఏడాది కంటే ఈ ఏడాది కేసులు అధికంగా నమోదు అయ్యాయి. – నల్లబోతుల అల్లూరయ్య, అసిస్టెంట్ కంట్రోలర్, పల్నాడు జిల్లా -
చెదిరిన రంగుల స్వప్నం
పెదకూరపాడు: హోలీ పర్వదినం ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. స్నేహితులతో హోలీ జరుపుకుని రంగులను కడుకునేందుకు వాగులోకి దిగిన 12 సంవత్సరాల బాలుడు మృత్యు ఒడిలోకి చేరాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులను రైతులు కాపాడంతో ప్రాణాపాయం తప్పింది.కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బుస్సాపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల మహేందర్ అలియాస్ చిన్నా(12) పాటిబండ్లలోని ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండుగ కావడంతో పాఠశాలకు సెలవు ఇచ్చారు. ముగ్గురు స్నేహితులు పాటిబండ్ల అభినయ్, కూచిపూడి రాహోల్ విక్రమ్, అంకాల సాద్విక్తో కలిసి మధ్యాహ్నం వరకు మహేందర్ రంగులు పూసుకుని సరదాగా గడిపాడు. తర్వాత రంగులు కడుక్కునేందుకు కొండ కింద ఉన్న చిన్నవాగులోకి దిగారు. నలుగురు సరదాగా ఈత కొట్టారు. ప్రమాదవశాత్తు పాటిబండ్ల మహేందర్ వాగులోకి పూడికతో కూరుకుపోయాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు వాగు పక్కన ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని ఉండిపోయారు. మహేందర్ కూరుకుపోవడంతో మిగిలిన వారు బిగ్గరగా కేకలు వేశారు. అక్కడే వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు వచ్చి ముగ్గురుని కాపాడారు. వాగు అడుగు భాగంలో కూరుకుపోయిన మహేందర్ను బయటకు తీసి పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్ర ప్రయత్నం చేసిన వైద్యులు మహేందర్ను కాపాడేందుకు పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భరత్ సిబ్బందితో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. గంట పాటు సీపీఆర్ను చేసి కాపాడేందుకు కృషి చేశారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నా చిన్నాను కాపాడండి మహేందర్ వాగులో పడిన విషయం తెసుకున్న తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నిర్మలలు హడావుడిగా వ్యవసాయ పనులు మానుకుని వచ్చారు. తల్లి నిర్మల ‘‘నా చిన్నాను కాపాడండి’’ అంటూ వైద్యులను వేడుకున్న తీరు కన్నీరు తెప్పించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విగతజీవిగా ఉండటం చూసి గుండెలవిసేలా తల్లిదండ్రులు విలపించారు. వారికి మహేందర్తో పాటు కూతురు ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం అమరావతి కమ్యూనిటీ వైద్యశాలకు తలించినట్లు ఎస్ఐ గిరిబాబు తెలిపారు.హోలీలో విషాదం 12 సంవత్సరాలు చిన్నారి మృతి రంగులు కడుకునేందుకు వాగులో దిగిన నలుగురు ముగ్గురును కాపాడిన రైతులు బుస్సాపురంలో విషాదం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు -
ఉత్తీర్ణతా ప్రాప్తిరస్తు !
సత్తెనపల్లి : జిల్లావ్యాప్తంగా ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖాధికారులు సమాయత్తమయ్యారు. విద్యార్థులంతా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలను తల్లిదండ్రులతోపాటు ముందుగానే సందర్శించడం మేలు. విద్యార్థులూ... వీటిని పాటించండి ● ఉదయం 8.30 గంటల కల్లా కచ్చితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ● ఉదయం 8.45 నుంచి 9.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసి వేస్తారు. ● విద్యార్థులంతా హాల్ టికెట్పై ముద్రించిన తమ వివరాలు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జెక్టులు, పరీక్ష కేంద్రం పేరు, చిరునామా సరి చూసుకోవాలి. ● తప్పులుంటే ముందుగానే ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలి. ● పరీక్ష కేంద్రంలో ఇచ్చే క్వశ్చన్ పేపర్పై ఏడు అంకెలతో ప్రత్యేక కోడ్ ఉంటుంది. హాల్ టికెట్పై ఉన్న ఎన్రోల్మెంట్ నంబరు ఆధారంగా కేటాయించిన రూముల వారీగా విద్యార్థులను కూర్చోపెడతారు. బార్ కోడింగ్ విధానంలో రూపొందించిన ఓఎంఆర్ షీట్లను విద్యార్థులకు రోల్ నంబరు ఆధారంగా పంపిణీ చేస్తారు. ● రోల్ నంబరు ఆధారంగా విద్యార్థి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్న తరువాత ఇన్విజిలేటర్ వచ్చి బార్ కోడింగ్తో కూడిన ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ బుక్లెట్ అందజేస్తారు. తర్వాత ఓఎంఆర్ షీట్ పూరించే విధానంపై ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా పాటించాలి. దానిపై అనవసరమైన గీతలు, రాతలు రాయరాదు. ● ఇన్విజిలేటర్ ఇచ్చిన ఓఎంఆర్ షీట్పై విద్యార్థి పేరు, పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివీ నిర్ధారించుకోవాలి. ● గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను అక్కడే ఉంచి, పరీక్ష ప్రారంభమైన తరువాత ఇన్విజిలేటర్లు వాటిని స్వాధీనం చేసుకుంటారు. ఉదయం 9.00 గంటలకు ఇన్విజిలేటర్ వచ్చి ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తరువాత, దానిని పూరించేందుకు అవసరమైన సూచనలు చేస్తారు. ● 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైన తరువాత, మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగిసే వరకు విద్యార్థులను బయటకు వెళ్లనివ్వరు. ● గుర్తింపు కార్డు కలిగి, పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు, స్క్వాడ్ బృందాలనే పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు. కేంద్రాల వద్ద పోలీసుశాఖ 144 సెక్షన్ అమలు పర్చడంతో పాటు విస్తృత రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు చదువులమ్మ చెట్టు నీడలో హాయిగా గడిపే విద్యార్థి జీవితంలో పదో తరగతి మొదటి మెట్టు.. భవిష్యత్కు ఆలంబన.. జీవన పరమపద సోపాన పటంలో తొలి అడుగు. పదిలో వచ్చిన మార్కులే భవితవ్యానికి గీటురాయి. గుడ్డిగా పరీక్షలు రాయకుండా కొన్ని టిప్స్ పాటించడం టాప్ మార్కులు సాధించవచ్చు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షల హర్డిల్ను అధిగమిస్తే చక్కని జీవితానికి మార్గం సుగమం అవుతుంది. విద్యార్థులూ.. గెట్ రెడీ ! ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలు పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వ మార్గదర్శకాలు ముందుగానే సందర్శించడం మేలు ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బక్లెట్లో ఏ ఒక్క పేజీని చించినా మాల్ ప్రాక్టీసుగా పరిగణింపు ప్రశ్న పత్రం లీకేజీ అయ్యిందని, బయటకు వచ్చిందని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా, విద్యార్థులు పరీక్షలకు ప్రశాంతంగా హాజరు కావాలి. ఒక వేళ ఏదైనా సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీకేజీకి గురైతే, అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పక్కవారి పేజీలను చూసి సమాధానాలు రాయాలనే ఆలోచన వీడాలి. కాపీయింగ్కు పాల్పడినా, జేబులో స్లిప్పులు పెట్టుకుని వచ్చినా, పరీక్ష కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష రాసే సమయంలో స్లిప్పులు కనిపిస్తే పరీక్షల నుంచి డీబార్ చేస్తారు. ప్రతి విద్యార్థికీ 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్లెట్ను ఇచ్చి, అదనంగా పేపర్లు అవసరమైతే మరొక 12 పేజీల బుక్లెట్ను ఇస్తారు. సైన్స్ పరీక్షకు 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బక్లెట్లలో ఏ ఒక్క పేజీని చింపినా మాల్ ప్రాక్టీసుగా పరిగణించే విధంగా కఠినమైన నిబంధనలు అమలు పరుస్తోంది. -
వనవాసంలో ‘పిన్నెల్లి’ ప్రజలు
సాక్షి, నరసరావుపేట: రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో.. కట్టుబట్టలతో సొంత ఊరిని వీడిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు వనవాసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. కాదన్న వారి ఇళ్లపై మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు.కాపాడాల్సిన పోలీసులు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ గ్రామం వీడి వెళ్లిపోవాలని బాధితులకు సలహాలిచ్చారు. స్వయంగా పల్నాడు ఎస్పీ గ్రామంలో పర్యటించి వెళ్లిన గంటల వ్యవధిలోనే మరోసారి వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డా చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో వందలాది కుటుంబాలు పుట్టిన ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇప్పటికీ పిన్నెల్లి వాసులు సొంతూరికి రాలేని దుస్థితి నెలకొంది. వలస కూలీలుగా....పదుల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు సైతం టీడీపీ మూకల దాడులకు భయపడి వేరే ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకీడుస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతులు ఇప్పుడు అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా గడుపుతున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన పొలాలను ఇతరులు సాగు చేయనివ్వకుండా బీడు పెట్టారు. కొందరి భూములను దౌర్జన్యంగా అక్రమించారు. అంత్యక్రియలకూ అనుమతించలేదు..పిన్నెల్లి నుంచి వలస వెళ్లిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులను కనీసం కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు సైతం రానివ్వకుండా టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారు. పిన్నెల్లికి చెందిన షేక్ అల్లా బ„Š అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆయన శవాన్ని గ్రామానికి తరలించేందుకు టీడీపీ నేతలు ఒప్పుకోకపోవడంతో గుంటూరులోనే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చింది. మాడుగుల అల్లు చనిపోతే కనీసం నలుగురు కూడా లేకుండా అంతిమ సంస్కారాలు పూర్తి చేయాల్సి వచ్చింది.ఆస్తులు ధ్వంసం..ఎన్నికల ఫలితాలు వెలువడగానే పిన్నెల్లిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీకి చెందిన వారెవరూ గ్రామంలో ఉండటానికి వీల్లేదని గ్రామంలో దండోరా వేయించారంటే టీడీపీ నేతల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. ఇప్పటికి 400కు పైగా కుటుంబాలు పిన్నెల్లి గ్రామంలోకి రాలేని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గ్రామం నుంచి వెళ్లగొట్టే క్రమంలో టీడీపీ నేతలు వారి ఇళ్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025అది మా సొమ్మేం కాదుగా.. ఎటుపోతే మాకేంటి ? అనుకున్నట్లున్నారు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు.. మమ్మల్ని ఎవరు అడుగుతారులే.. అని తలపోశారేమో.. లేదా లాలూచీ పడితే లాభమేగా అనుకున్నారేమో.. ఏదైనా మీడియాలోనో ? లేదా వేరేరూపంలో ప్రకటనో ఇస్తే ఎక్కువ మంది వేలానికి వస్తారని భావించినట్టున్నారు. ఇలా చేస్తే తాము కట్టబెట్టాలని భావించిన వారికి న్యాయం చేయలేమని గట్టిగా నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకే పట్టుబట్టి, పీడీఎస్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా వేలం వేసేశారు. ఏదైనా లాభానికి వేలాన్ని ముగించారా అంటే.. ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి.. గతం కంటే తక్కువ ధరకే బియ్యాన్ని ఎంచక్కా దోచిపెట్టారు. ఈ పీడీఎస్ బియ్యానికి సంబంధించి సర్కారు వారి పాట ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇఫ్తార్ సహర్ (శుక్ర) (శని) నరసరావుపేట 6.25 5.02 గుంటూరు 6.23 5.00 బాపట్ల 6.23 5.00 -
అలరించిన వీవీఐటీ రంగస్థల వేడుక
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో నిర్వహించిన థియేటర్స్ డే వేడుక వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ వినోదం, విజ్ఞానం మేళవింపుతో వీవీఐటీ కార్యక్రమానికి వర్ధమాన నటుడు, రంగస్థల యువ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ నందీపురస్కార గ్రహీత రౌతు వాసుదేవరావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా విజేతలకు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ బహుమతులు అందజేశారు. ఈఈఈ విద్యార్థులు రూపొందించిన ‘అవును మా నాన్న రైతే‘ ప్రథమ బహుమతి అందుకోగా, మెకానికల్ విద్యా ర్థులు ప్రదర్శించిన ‘పుష్పవల్లి నిలయం ద్వితీయ బహుమతి అందుకుంది. ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్స్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిన్ డీన్ డాక్టర్ ఎన్.కుమారస్వామి పాల్గొన్నారు. -
లైంగిక దాడుల నివారణపై అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం సమావేశ మందిరంలో పిల్లలపై లైంగిక దాడులను నివారించడంపై డీఈవోలు, ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎంఈఓలు ప్రోగ్రాం ఆఫీసర్స్, డిజేబుల్ వెల్ఫేర్ శాఖ, ఆర్బీఎస్కే సిబ్బందికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎదిగే వయసులో ఉన్న పిల్లలతో కొంత సమయం కేటాయించాలన్నారు. స్నేహపూరితమైన వాతావరణంలో వారితో అన్ని సమస్యలు చర్చించాలన్నారు. పిల్లలు అన్ని విషయాలు పంచుకుంటారని, తద్వారా , వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కార మార్గాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ టి.ఓ.టి, ఆర్. సుప్రజ, సైకాలజిస్ట్ విజయకుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మీ, పిడి ఐసిడిఎస్, తెనాలి, గుంటూరు డెప్యూటీ డీఈవోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, పీడియాట్రిస్ట్ పి.నాగ శిరీష పాల్గొన్నారు. -
జాతీయ రహదారి విస్తరణ పనులపై జేసీ సమీక్ష
శావల్యాపురం: కేంద్ర ప్రభుత్వం సారధ్యంలో 544డీ జాతీయ రహదారి నాలుగు లైన్ల విస్తరణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 544డీ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించే పనులకు సంబంధించిన భూసేకరణపై రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ వినుకొండ నుంచి గుంటూరు వరకు 85 కి.మీ వరకు నిర్మించనున్న రోడ్డుకు రూ.2605 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో నాలుగు మండలాలకు గాను 19 గ్రామాల పరిధిలో 53.3కి.మీ మేర పనులు జరుగుతాయన్నారు. ఇందుకుగాను జాతీయ రహదారి అధికారులు మ్యాప్ సిద్ధం చేసి ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారన్నారు. మొదట దశలో 3ఏ గెజిట్ నోటిఫికేషన్, రెండవ దశలో భూసేకరణ చేసిన భూముల్లో రెవెన్యూ, నేషనల్ హైవే అధికారుల సంయుక్త మార్కింగ్ పనులు.. మూడో దశలో డిక్లరేషన్ ఆఫ్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడం.. నాల్గో దశలో జేసీ సారధ్యంలో రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం.. ఐదవ దశలో జిల్లా కలెక్టరు అనుమతితో భూములను జాతీయ రహదారుల శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మొదటి దశ ప్రారంభమైందన్నారు. సంవత్సరం వ్యవధిలో పనులు పూర్తి చేయటానికి అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ సబావత్ సురేష్నాయక్, జాతీయ రహదారి అధికారులు వెంకటేశ్వర్లు, అశోక్, మండల సర్వేయర్ రాజు, సర్వే అధికారి పేరిసోముల నాసరయ్య, ఆర్ఐ చంద్రబాబు, తదితరులు ఉన్నారు. -
శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహిస్తాం
తాడికొండ: గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ ఈవో జె.శ్యామలరావుతో కలిసిఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ, అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాకలక్ష్మీ, ఎం.శాంతారామ్, ఎం.ఎస్.రాజు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, సీపీఆర్ఓ డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు -
న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయం
పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ సత్తెనపల్లి: నూజివీడు న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయమైన చర్య అని, ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ అన్నారు. న్యాయవాది కొలుసు సీతారాంపై జరిగిన దాడిని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన ఖండించారు. ఈ సందర్భంగా చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు లెక్కచేయలేదంటే సామాన్య పౌరుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధమవుతుందన్నారు. న్యాయవాద చట్టాల సవరణను మేధావులు, ప్రజాస్వామిక వాదులతో కలసి పౌరసమాజం అర్థం చేసుకోకపోవటం వల్ల పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అపరిమితమైన అధికారాలు చట్ట సభలు పోలీసులకు ఇవ్వటమే ఈ పరిస్థితికి కారణమన్నారు. నీటి కాసులపై అవగాహన అవసరం జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ భువనేశ్వరి పెదకూరపాడు: నీటి కాసులపై అవగాహన కలిగి ఉండాలని అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ భువనేశ్వరి అన్నారు. ప్రపంచ గ్లోకోమా (నీటి కాసులు) వారోత్సవాలు సందర్భంగా అమరావతి అమర్ కాలేజీ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ సహకారంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నీటి కాసులపై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ నీటి కాసుల సమస్యను సకాలంలో తెలుసుకోకపోతే అంధత్వ లక్షణాలు, చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వీటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆప్తాల్మిక్ ఆఫీసర్ రామకృష్ణ అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది మనోహర్, సామ్రాజ్యం, అరుణ శ్రీ, త్రిషా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శింగరకొండ తిరునాళ్లకు 12 ప్రత్యేక బస్సులు నరసరావుపేట: ఈనెల 14న శుక్రవారం బాపట్ల జిల్లా శింగరకొండలో జరిగే శ్రీ ఆంజనేయస్వామి తిరునాళ్లకు భక్తులు వెళ్లేందుకు నరసరావుపేట డిపో నుంచి 12 బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. అవి ఏల్చూరు, కొమ్మాలపాడు మీదుగా శింగరకొండకు చేరుకుంటాయన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
టీడీపీ నేతకు రేషన్ బియ్యం అప్పగించేందుకు అధికారుల తాపత్రయం
నరసరావుపేట టౌన్: బంగారమైనా, వస్తువైనా, మరే విలువైనదైనా వేలం వేసినప్పుడు సరైన ధర రాకుంటే, లేదా వేలం పాడుకున్న వారినుంచి ఇబ్బందులు ఎదురైతే మళ్లీ వేలానికి వెళతారు. మొదటిసారి వచ్చిన దానికంటే తక్కువకు పాడితే.. మరోసారి వేలం వేస్తారు. ఇదీ బ్యాంకుల్లోగానీ, మరే ఇతర సంస్థల్లోగానీ సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే పల్నాడు జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ అధికారుల తీరు మాత్రం వేరేగా ఉంది. పీడీఎస్ బియ్యం వేలంలో ప్రభుత్వానికి ఆదాయం చూపించాల్సిన అధికారులు.. ప్రజాప్రతినిధులు చెప్పిన వ్యక్తులకు లబ్ధి చేకూరేలా చక్రం తిప్పారు. ప్రజల సొమ్ముకు పంగనామాలు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఇదీ వేలం కథ... పల్నాడు జిల్లాలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యానికి గతేడాది డిసెంబర్ 18న వేలం నిర్వహించారు. అప్పుడు కిలోకు రూ.32.50 లకు పాడుకున్నారు. అనంతరం సదరు పాట పాడుకున్న వ్యక్తి నగదును పాక్షికంగా చెల్లించడంతో ఆ పాటను రద్దు చేశారు. మరోసారి వేలం నిర్వహించాలని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు భావించారు. అయితే గతంలో వేలం సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించారో వాటినే మళ్లీ పాటించాలి. ముందుగా పత్రిక ప్రకటన ఇవ్వాలి. జిల్లావ్యాప్తంగా ప్రచారం కల్పించాలి. అప్పుడే ఎక్కువమంది వేలానికి హాజరవుతారు. తద్వారా వేలం ధర ఎక్కువ పలుకుతుంది. ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుంది. కానీ ఇవేమీ చేయకుండానే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ ఏడాది మార్చి 7వ తేదీన వేలం వేసేందుకు నిర్ణయించారు. గతంలో కేజీ రూ.32.50లు పలికిన ధరను ఇప్పుడు సగటున కేవలం రూ.22.50లకు అంటగట్టారు. బియ్యం ధర కేవలం మూడు నెలల్లోనే అమాంతంగా తగ్గిపోయింది. దీని వెనుక ప్రజాప్రతినిధులు, జిల్లా పౌరసరఫరాల అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.35 లక్షలు నష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పట్టుబడ్డ రేషన్ బియ్యం వేలంలో ఐదుగురు మాత్రమే పాల్గొనటం గమనార్హం. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు గ్రామానికి చెందిన అక్రమ రేషన్ బియ్యం వ్యాపారి తన బినామీలతో వేలంలో పాల్గొనగా.. ఆయనే తక్కువ ధరకు బియ్యాన్ని దక్కించుకున్నాడు. పాటలో ఎవరూ పాల్గొనకుండా వ్యాపారుల నుంచి అధికారుల దాకా అంతా మేనేజ్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పట్టుబడిన రేషన్ బియ్యానికి గుట్టుచప్పుడు కాకుండా వేలం గతంలో కిలో రూ.32.50లకు పాడుకున్న పాటదారులు ఇదే బియ్యాన్ని రూ.22.50లకు అధికారపార్టీ నేతకు కట్టబెట్టిన వైనం ఇదీ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల తీరు ప్రచారం లేదు.. ప్రకటనా కానరాదు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.35 లక్షలు గండి ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే హడావుడిగా కార్యక్రమం నిబంధనల ప్రకారమే.. పట్టుబడ్డ రేషన్ బియ్యం మూడు నెలల క్రితం వేలం వేయగా కేజీ రూ.32.50ల వరకు పాడారు. అతను రూ.లక్ష చెల్లించి మిగిలిన డబ్బులు కట్టేందుకు ముందుకు రాకపోవటంతో తిరిగి వేలం నిర్వహించాం. మూడు రకాల క్వాలిటీ ఉండటంతో ఒక రకం రూ.24, రెండవ రకం రూ.22, మూడవ రకం రూ.20 లకు వేలంలో పాడారు. వేలం విషయంపై డీఎస్ఓ కార్యాలయం వద్ద నోటీస్ అంటించి ప్రచారం నిర్వహించాం. ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు. – నారదముని, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక
వినుకొండ: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ బృందం సమర్పించిన నివేదికలను పీడీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో అవకతవకలను మొత్తం రూ.48వేలు పెనాల్టీలు విధించారు. అలాగే రూ.4,00,858లు రికవరీ చేయడానికి ఆదేశించారు. కొన్ని అంశాలపై ఏపీడీ విచారణకు ఆదేశిస్తూ రూ.58,876లు కేటాయించారు. గ్రామసభల్లో కూలీలు లేవనెత్తిన అంశాల ఆధారంగా రూ.96,227లు డ్రాప్ చేయాలని నిర్ణయించారు. రైతులు నాటిన మొక్కలను తిరిగి నాటాలని, రోడ్డు పక్కన నాటిన మొక్కలను పునరుద్ధరించాలని ఆదేశించారు. అంతేకాకుండా రూ.10,47,594 విలువైన పండ్ల తోటల మొక్కలు నాటాలని సూచించారు. మొత్తం మీద ఈ సామాజిక తనిఖీల్లో రూ.15,92,679 విలువైన అవకతవకలను గుర్తించారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. -
మహిళల భద్రతకు శక్తి యాప్
శక్తి వాహనాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసరావుపేట: మహిళలు ఫోన్లో శక్తియాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి నుంచి తక్షణ సహాయం పొందాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, లైంగికదాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ను నొక్కితే, లొకేషన్ ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి అక్కడకు చేరతారన్నారు. అనంతరం జిల్లాకు మంజూరైన శక్తి వాహనాలను ప్రారంభించారు. పరిపాలన విభాగం అదనపు ఎస్పీ జేవీ సంతోష్, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, జగదీష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాషిణి, మహిళా ఎస్ఐలు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్ విడుదల.. నరసరావుపేట: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, దానిని నిర్మూలించడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని అరికట్టే దిశలో ఉన్నామని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ విడుదల చేశారు. -
సంక్షేమ పథకాలు, రుణాలపై నివేదిక అందజేయండి
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ఎంతమంది లబ్ధిదారులకు, ఏఏ బ్యాంకులు ఎంత రుణాలు ఇచ్చాయో సవివరంగా నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్ని కోరారు. గురువారం కలెక్టర్ కర్యాలయంలో గతేడాది డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరులుగా మండలాల్లో కూడా ఒక బ్యాంక్ ఉండాలన్నారు. తద్వారా మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసుకొని లబ్ధిదారులకు సులభంగా పథకాలపై అవగాహన కలిగించి లబ్ధి చేకూర్చవచ్చని అభిప్రాయపడ్డారు. పీఎంజేజేవై, పీఎం జనధన్ యోజన వంటి పథకాలలో ఎన్ని పనిచేస్తున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన వారందరికీ రుణాలు ఇచ్చేలా చూడాలన్నారు. బ్యాంకర్లు తమ తమ పరిధిలో వ్యవసాయ పొలాల్లో రోడ్లు వేసేందుకు సీఎస్ఆర్ నిధులు అందించేలా చూడాలన్నారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్్ టి.మాధురి తొలుత సమావేశం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాం ప్రసాద్ డిసెంబర్–2024 నాటి త్రైమాసిక నివేదికను పీపీటీ ద్వారా వివరించారు. ఆర్బీఐ అధికారి సీహెచ్ నవీన్, నాబార్డు డీడీఎం శరత్ బాబు, వివిధ బ్యాంకుల కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. బ్యాంకు అధికారులను కోరిన కలెక్టర్ అరుణ్బాబు, ఎంపీ లావు -
ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలి
నరసరావుపేట రూరల్: వ్యవసాయ అనుబంద శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి సూచించారు. ప్రకృతి వ్యవసాయ 2025 ఖరీఫ్ ప్రణాళికపై క్రోసూరు, వినుకొండ, మాచర్ల డివిజన్లోని సిబ్బందికి గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డీపీఎం అమలకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయ ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు నిర్వహించడం వలన రైతులు త్వరితగతిన అభివృద్ధి చెందుతారని తెలిపారు. ప్రణాళిక తయారిలో సామాజిక, ఆర్థిక, భౌతిక వనరులతో పాటు అన్నిరకాల అంశాలను సమగ్రరూపంలో నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ, డీఆర్డీఏ, ఉపాధి హామీ, సెరికల్చర్, హార్టికల్చర్ శాఖల సమన్వయంతో ప్రణాళిక తయారు చేసుకోవలని తెలిపారు. ఏఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను, వాటి లాభాలను రైతులకు తెలియజేయాలని తెలిపారు. అడిషనల్ డీపీఎం ప్రేమ్రాజు, జిల్లా శిక్షకుడు టి.సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఐఐసీ భూముల పరిశీలన
నరసరావుపేట రూరల్: మండలంలోని కేసానుపల్లి సమీపంలోని ఏపీఐఐసీ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్డీఓ మధులతలు గురువారం పరిశీలించారు. నరసరావుపేట నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ఈ భూముల పరశీలన జరిపారు. ఈ భూములను గత ప్రభుత్వ హాయాంలో ఆటోనగర్కు కేటాయించిన విషయం విధితమే. ఆటోనగర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. ఆటోనగర్కు కేటాయించగా మిగిలిన భూముల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం రొంపిచర్లలో ఏర్పాటుచేయాలని మొదట భావించారు. తాజాగా కేసానుపల్లిలోని ఆటోనగర్కు కేటాయించిన భూములను కూడా పరిగణలోకి తీసుకొన్నారు. ఈ భూముల పై నుంచి హైటెన్షన్ వైర్లు వెళ్లడం, ప్రధాన రోడ్డుకు కిలోన్నర మీటరు దూరం ఉండటం వంటి వాటిని అధికారులు గుర్తించారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. -
వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తెనాలి: చెంచుపేట అమరావతి కాలనీలోని శ్రీగోదా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. ఈనెల 17 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, వేదవిన్నపాలు, ప్రధాన కలశస్థాపన, చతుస్థానార్చనలు, నిత్యపూర్ణాహుతి చేశారు. ఉదయం 10 గంటలకు ‘ధ్వజారోహణం’, గరుడ ప్రసాదగోష్టి తదుపరి తీర్థప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణ, నిత్యహోమం, భేరిపూజ, దేవతాహ్వానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈనె 15వ తేదీన శ్రీస్వామివారి కళాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. వార్షికోత్సవాలకు ముందుగా ఈనెల 9వ తేదీనుండి 11వ తేదీవరకు అధ్యయనోత్సవాలు జరిగాయి. -
వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ కార్యాలయం ప్రారంభం
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రెడ్డినగర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా కార్యాలయం గురువారం ప్రారంభమైంది. కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర లీగల్సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క పెదకూరపాడు నియోజకవర్గంలోనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై 300 పైగా అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు లీగల్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ బాధితులకు జిల్లా లీగల్ సెల్ కార్యాలయం సహాయపడుతుందని వివరించారు. -
కిమ్స్ శిఖరలో ఉద్యోగ అవకాశాలపై సదస్సు
గుంటూరు మెడికల్: ఆరోగ్య రంగంలో నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై గుంటూరు మంగళదాస్నగర్లోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఈనెల 20న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సి.హెచ్.నాగేశ్వరరావు తెలిపారు. సదస్సుకు కిమ్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతారన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఆరోగ్యరంగంలో శిక్షణ, ఉపాధి అవకాశాలపై సదస్సులో వివరిస్తారన్నారు. ఏడాది శిక్షణలో ఒకనెల ప్రాథమిక శిక్షణ, 11 నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు శిక్షణలో స్టయిఫండ్ అందిస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందజేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 8121027256, 7416600691 నంబర్లకు సంప్రదించాలని నాగేశ్వరరావు కోరారు. బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్కు సన్మానం గుంటూరు మెడికల్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో గుండె పనితీరు పరీక్షలు చేస్తున్న 14 ఏళ్ల బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ సుమారు 14వేల మంది అమెరికా పౌరులపై రీసెర్చ్ చేశారని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. సిద్దార్థ్ తాను కనుగొన్న యాప్ ద్వారా జీజీహెచ్లో రెండు రోజులుగా పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ను డాక్టర్ యశశ్వి రమణ గురువారం సత్కరించారు. సిద్ధార్థ్కు మంచి భవిత ఉందని చెప్పారు. సిద్ధార్థ్ను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తాను చేసిన పరీక్షల సందర్భంగా గుర్తించిన అంశాలను వివరించారు. -
‘సహకారం’ అందించని వారిపై చర్యలు
నరసరావుపేట: జిల్లాలోని సహకార సంఘాల కంప్యూటరీకరణ ఈనెల 20వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో చేయాలని, 21 నుంచి జిల్లాలో 59 పీఏసీలు ఈ–పీఏసీలుగా మార్చాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 5వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఏడాదిగా సంఘాల కంప్యూటీకరణ జరుగుతోందని, పురోగతి సరిగాలేదన్నారు. సరిగా పనిచేయని సంఘం సీఈఓపై ఏం చర్యలు తీసుకున్నారని జిల్లా సహకార అధికారిని, గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు సీఈఓను ప్రశ్నించారు. కంప్యూటీకరణ పూర్తిచేసే విషయంలో పనిచేయని వారిపై మార్చి 21వ తేదీన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీపై నిఘా కోసం డ్రోన్లు వినియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాటు సారా తయారీ, రవాణా, వినియోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషిచేయాలన్నారు. కలెక్టరేట్లో నవోదయం 2.0 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా తయారీ, వినియోగాలను నిరసిస్తూ నవోదయం పోస్టర్ను విడుదల చేశారు. అదేవిధంగా జిల్లాలో గుర్తించిన 442 చిత్తడి నేలలు ఉన్నాయని, వాటిలో ఏడు ఇన్సైడ్ రిజర్వ్ ఫారెస్ట్, 435 రెవెన్యూ ఇతర ప్రదేశాలలో ఉన్నాయని వాటిని సంబందిత శాఖలు పరిశీలించి ఈనెల 28నాటికి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సంబందిత అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ మురళి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీవోలు కె.మధులత, రమాకాంత్ రెడ్డి, మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మొల్లమాంబ జీవితం ఆదర్శం.. నరసరావుపేట: కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత, విద్యార్థులు స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో కవియిత్రి మొల్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా కేవలం ఐదు రోజులలో రచించిన గొప్ప కవి మొల్లమాంబ అని కొనియాడారు. ఆమె పేరుతో ప్రభుత్వం స్టాంప్ కూడా రిలీజ్ చేసిందన్నారు. ఈ సందర్భంగా పలువురు శాలివాహన సంఘం నాయకులు కోరిన విధంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మట్టిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్ఓను ఆదేశించారు. బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు. సంఘ నాయకులు శ్రీనివాసులు, బసవేశ్వరరావు, వెంకయ్య, వెంకటేశ్వర్లు, మంగమ్మ పాల్గొన్నారు. సహకార అభివృద్ధి కమిటీ సమీక్షలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు -
వైభవంగా ప్రసన్నాంజనేయుని తిరునాళ్ల
యడ్లపాడు: మండలంలోని చెంఘీజ్ఖాన్పేట పంచాయతీలో కొలువుదీరిన ప్రసన్నాంజనేయ స్వామి 41వ తిరునాళ్ల మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. గోపాలపురం, చెంఘీజ్ఖాన్పేట గ్రామాల నడుమ, కొండవీడు కొండల్లో వెలసిన ఈ స్వామివారి ఆలయానికి వేకువజాము నుండే భక్తుల రద్దీ నెలకొంది. వివిధ మొక్కులు చేసుకున్న భక్తులు చిన్న చిన్న ప్రభలతో కుటుంబ సమేతంగా జై హనుమాన్ నామస్మరణ చేస్తూ కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కొండ కింద పొంగళ్లను పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులే కాకుండా సుదూర ప్రాంతాలకు చెందినవారు పెద్దఎత్తున తరలివచ్చారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వాహకులు ఆలయానికి కొత్తరంగులు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ గావించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు పలు రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. చెంఘీజ్ఖాన్పేట, సొలస, కొత్తసొలస, గోపాలపురం గ్రామస్తులు సమష్టిగా నిర్వహిస్తున్న ఈ తిరునాళ్ల మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులకు మహా అన్న సంతర్పణ గావించారు. రాత్రికి చెంఘీజ్ఖాన్పేట, సొలస, సంక్రాంతిపాడు గ్రామాల నుంచి భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. వీటితో పాటు సొలస గ్రామప్రభను గ్రామపెద్దలు తీసుకువచ్చారు. తిరునాళ్ల సందర్భంగా ప్రభల వద్ద ఆధ్మాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేశారు. పోలీసులు తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కామిరెడ్డి
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. 1,41,244 మిర్చి బస్తాలు విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,28,725 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,41,244 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాలకు సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 56,214 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్లో వాకథాన్ మంగళగిరి: కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంతా సింగ్ తెలిపారు. అంతర్జాతీయ కిడ్నీ డే సందర్భంగా గురువారం ఉదయం ఎయిమ్స్లో వైద్యులు, మెడికల్ విద్యార్థులతో వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శాంతా సింగ్ మాట్లాడుతూ కిడ్నీ అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం శరీరంలోని ప్రతి అవయంపైనా పడుతుందన్నారు. కిడ్నీలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. నేటి ఆధునిక సమాజంలో కిడ్నీల విక్రయాలు జరగడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీమంత కుమార్ దాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెచ్ఓడీ డాక్టర్ ఉత్తర దాస్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలిలో ముగిసిన ప్రత్యేక సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారంతో ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సదరం క్యాంప్ను అధికారులు నిర్వహించారు. ఈఎన్టీ, అఫ్తమాలజీ, ఆర్ధోపెడిక్, సైక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులకు వైద్య పరీక్షలు చేశారు. క్యాంప్లో పలు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. క్యాంప్ను వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు. -
బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు. -
అల్లుడి చేతిలో మామ హతం
క్రోసూరు: మండలంలోని పీసపాడు పరిధిలో పొలాల్లో మామ అల్లుడికి జరిగిన ఘర్షణలో అల్లుడు కర్రతో దాడి చేయటంతో మామ మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేంద్రరావు తెలిపిన సమాచారం మేరకు సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెపాలెంకు చెందిన పిల్లకతువుల గంగయ్య(గంగారాం)కు అచ్చంపేట మండలం కొండూరుకు చెందిన గంగమ్మతో ఏడు నెలల క్రితం వివాహమైంది. భార్యభర్తలు ఇరువురు తరచు ఘర్షణలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని పీసపాడు శివారు పొలాల్లో జీవాలు మేపుకొంటున్న గంగారం, భార్య గంగమ్మకు ఘర్షణ జరగ్గా.. జరిగిన విషయాన్ని గంగమ్మ తన తండ్రి బత్తుల గంగయ్యకు, సోదరుడికి తెలియచేసింది. వారు అక్కడికి చేరుకుని గంగారంను మందలించబోయారు. దీంతో కోపోద్రిక్తుడైన గంగారం మామను కర్రతో కొట్టటంతో తలకు దెబ్బతగలటంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడకు చేరుకున్న కొద్దిసేపటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమతులు కావాలా?
వైఎస్సార్ విగ్రహానికి పూలదండ వేయడానికీ పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే అభ్యంతరం రెంటచింతల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించడానికి కూడా పోలీసుల అనుమతి కావాలా అంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన రెంటచింతలలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడానకి వస్తున్న మాజీ ఎమెల్యే పీఆర్కేను పోలీసులు అనుమతి తీసుకోలేదని గ్రామంలోకి రాకుండా స్థానిక జాతీయ రహదారి 167 ఏడీ వద్ద అడ్డుకున్నారు. దీనిపై పీఆర్కే స్పందిస్తూ మైక్ పెట్టేందుకు, ర్యాలీలకు అనుమతులు కావాలని, కానీ దారిలో వెళ్తూ డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల కూడా అనుమతులు కావాలని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. దీంతో గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగ దీష్తో పీఆర్కే ఫోన్లో మాట్లాడారు. లా అండ్ అర్డర్ సమస్య కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సుమారు 20 నిమిషాల వరకు వేచి చూసినా పోలీసులు గ్రామంలోనికి అనుమతించక పోవడంతో పీఆర్కే వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన యువతపోరుకు తరలివెళ్లారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ శొంఠిరెడ్డి నర్శిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గొట్టం బ్రహ్మారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నవులూరి భాస్కర్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ మద్దిరాల కృష్ణారెడ్డి, పాలువాయి గేటు సర్పంచ్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు ఏరువ ప్రతాప్రెడ్డి, గాలి ప్రతాప్రెడ్డి, గొట్టం భాస్కర్రెడ్డి, చల్లా మల్లారెడ్డి, యర్రెద్దు శ్రీనివాసరెడ్డి, శొంఠిరెడ్డి గురవారెడ్డి, గుండా కిశోర్, శీలం అంజయ్య తదితరులున్నారు. -
పల్నాడు
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యువత పోరు ఇఫ్తార్ సహర్ (గురు) (శుక్ర) నరసరావుపేట 6.25 5.03 గుంటూరు 6.23 5.01 బాపట్ల 6.23 5.01 కొలువు కలలు కల్లలవగా.. భృతి భ్రాంతిగా మారగా.. భవిష్యత్తు అంధకారంగా గోచరించగా.. దగా పడ్డ నిరుద్యోగి కూటమి ప్రభుత్వంపై గళమెత్తాడు. ఉద్యో‘గాలం’ వేసి పీఠమెక్కిన నేతలు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి ఉసూరుమనిపించగా.. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలతో వేలకు వేలు కట్టి కోచింగ్ తీసుకుంటున్న యువత ఆక్రోశం కట్టలు తెంచుకుని వీధుల్లో నినాదమై పలికింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు నిశ్చింతగా, నిబ్బరంగా ఫీజుల విషయమై గాబరా లేక చదువుపై దృష్టిపెట్టగా.. నేడు ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. ఎప్పుడు చెల్లిస్తారో తెలీక.. కళాశాల యాజమాన్యాల అనుమానపు చూపులు.. అవమానపు మాటలు తట్టుకోలేక అత్యంత ఒత్తిడితో చదువు బండి లాగిస్తున్న విద్యార్థులు సెమిస్టరు దాటిపోయినా ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించని సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చేవరకు పోరుబాట సాగిస్తామని హెచ్చరించారు. వైద్యవిద్యను వ్యాపారం చేసే కుట్ర... 7పేద విద్యార్థులపై కక్ష సాధింపు ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థులపై కక్ష సాధింపులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద వర్గాల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ విద్యాదీవన, వసతి దీవెన పథకాలను సైతం అమలు చేశారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టే పరిస్థితికి తీసుకువచ్చింది. తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలి. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పల్నాడు జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ భారీగా హాజరైన విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టిన నేతలు యువత పక్షాన నిరంతర పోరాటాలు చేసి అండగా నిలుస్తామని భరోసా ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ ర్యాలీ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు జేసీ సూరజ్కి వినతిపత్రం అందజేతన్యూస్రీల్ -
ముగిసిన ఎడ్ల బండలాగుడు పోటీలు
సీనియర్స్ విభాగంలో నంద్యాల, సూర్యాపేటలకు చెందిన సంయుక్త ఎడ్ల జతకు ప్రథమస్థానం రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 96వ జయంతి ఉత్సవాల సందర్భంగా జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు బుధవారంతో ముగిశాయి. సీనియర్స్ విభాగంలో పోటీలు రసవత్తరంగా జరిగాయి. రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విభాగంలో నంద్యాల జిల్లా పెదకొట్లాలకు చెందిన బోరిరెడ్డి కేశవరెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన సుంకి సురేంద్రరెడ్డిల సంయుక్త ఎడ్ల జత 2843 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. నంద్యాల జిల్లా సిరిసిల్ల మండలం గుంపరమానుదెన్నె గ్రామానికి చెందిన కుందూరు రామ్గోపాల్రెడ్డి ఎడ్ల జత 2334 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన కటికం లక్ష్మణ్కుమార్, మట్టంపల్లి గ్రామానికి చెందిన సృజినారెడ్డి, శ్రీధర్రెడ్డిల ఎడ్ల జత 2212 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన మేక కృష్ణమోహన్ ఎడ్ల జత 2118 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణాచౌదరిలకు చెందిన ఎడ్లజతల 2000 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. ఎడ్ల యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు, షీల్డ్లను అందజేశారు. -
రాజకీయ కక్షసాధింపులతోనే ఆత్మహత్యాయత్నం
● రాష్ట్ర ఆశ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ధనలక్ష్మి ● గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆశ వర్కర్ సామ్రాజ్యంకు పరామర్శపెదకూరపాడు: ఆశ కార్యకర్త రాయపాటి సామ్రాజ్యం ఆత్మహత్యాయత్నానికి కారకులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఆశ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన రాయపాటి సామ్రాజ్యాన్ని బుధవారం గుంటూరు జీజీహెచ్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా చాలీచాలని వేతనంతో ఆశ కార్యకర్తగా సక్రమంగా విధులు నిర్వహించిన సామ్రాజ్యంను గ్రామ సర్పంచ్, ఆమె భర్త సోమశేఖర్, ఆయన అనుచరులు రాజకీయ కక్ష సాధింపులకు గురిచేశారన్నారు. ఆశ కార్యకర్త ఉద్యోగాన్ని తొలగించేందుకు అనేకసార్లు ఫిర్యాదులు చేసి మనోవేదనకు గురిచేశారన్నారు. సామ్రాజ్యం విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిందన్నారు. అందుకే వైద్యసిబ్బంది ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. సామ్రాజ్యం ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రజా సమస్యలే పార్టీ అజెండా
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ వేడుకలు మంగళవారం పల్నాడు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నరసరావుపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలతో మంగళవారం ఉదయం 11 గంటలకు పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ 15 సంవత్సరాల ప్రస్థానాన్ని నేతలు, కార్యకర్తలు గుర్తుచేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి మాట్లాడుతూ ఆవిర్భావ కార్యక్రమానికి వచ్చిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. అందుకే కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకొందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల తరపున వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేసి వారి హక్కులు కాపాడుతుందన్నారు. వారందరి సమస్యలే పార్టీ అజెండాగా పార్టీ అధినేత వైఎస్ జగన్తో కలిసి తాము ముందుకు సాగుతామన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కార్యకర్తలు శ్రమించడం అభినందనీయమన్నారు. రానున్న వైఎస్ జగన్ ప్రభుత్వం 2.0లో కార్యకర్తల కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో పార్టీ పతాకావిష్కరణ హాజరైన జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జిలు జిల్లావ్యాప్తంగా 15వ ఆవిర్భావ సంబరాలు వేడుకగా నిర్వహించిన పార్టీ శ్రేణులు -
సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలి
అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీపార్థసారథి తాడికొండ: అమరావతి రాజధానికి వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలని అమరావతి అభివృద్ది సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్–9 రోడ్డుపై బఫర్ జోన్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆమె వెంట ఏడీసీ జనరల్ మేనేజర్ కె శ్రీ హరిరావు, చీఫ్ ఇంజినీర్ ఎం ప్రభాకరరావు, ఉద్యాన విభాగాధిపతి విఎస్ ధర్మజ పాల్గొన్నారు. ఎన్జీరంగా వర్సిటీని సందర్శించిన అమెరికా ప్రొఫెసర్ గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆమెరికా వ్యవసాయ విద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య ఎంఎస్ రెడ్డి బుధవారం సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో ముఖాముఖీ చర్చల్లో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ మన భవిష్యత్తును కాపాడుకునేందుకు మొక్కలు, నేలల ఆరోగ్యం కాపాడుకోవటంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సమస్యలను, ఎలా అధిగమించాలి అనే అంశాలపై ఆయనతో చర్చించారు. విదేశాల్లో చేసిన వ్యవసాయ పరిశోధనలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రొఫెసర్ ఎంఎస్ రెడ్డి వివరించారు. వ్యవసాయ విద్యార్థులకు వ్యవసాయం, వాటి మెలకువలను వివరించారు. అనంతనం విశ్వవిద్యాలయం అధికారులు ఎంఎస్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీవారి తిరు కల్యాణం.. రమణీయం రేపల్లె రూరల్: పట్టణంలోని ఉప్పూడి రోడ్డులో గల శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా లక్ష్మి, గోదా సమేత వేంకటేశ్వరులకు మంగళస్నానాలు చేయించి, వధూవరులుగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడమ కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తిరు కల్యాణ వేడుకలను తిలకించి, స్వామికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. -
గుత్తికొండ బిలంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
పిడుగురాళ్ల: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుత్తికొండ బిలాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి టి.సుజాత బుధవారం సందర్శించారు. గుత్తికొండ బిలంలోని పుణ్యక్షేత్రంలో ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హైకోర్టులో గుమస్తాగా పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన సంధ్యానాయక్ కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో పరామర్శించారు. ఆమె వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన ఆర్డీఓ అచ్చంపేట: మండలంలోని మాదిపాడులో ప్రభుత్వ భూములను ఆర్డీఓ జి.రమాకాంత్రెడ్డి బుధవారం పరిశీలించారు. మాదిపాడు నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అంతరాయం కలుగచేస్తున్న వారి భూములను పరిశీలించి, రోడ్డు నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని సూచించారు. అనంతరం కృష్ణానదిపై మంజూరైన వంతెన నిర్మాణానికి కావలసిన అనుమతులు, భూసేకరణ తదితర వివరాలను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సుమారు 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములుండగా వాటిని ఏవిధంగా వినియోగంచుకోవాలనే విషయంపై తహసీల్దార్తో చర్చించారు. వారి వెంట వీఆర్వోలు, గ్రామ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఉన్నారు.యార్డులో 1,40,254 మిర్చి బస్తాలు విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,39,436 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,40,254 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాలకు సగటున ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 68,733 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. కబ్జాపై కదిలిన యంత్రాంగం అక్రమాలకు పాల్పడిన అధికారులకు నోటీసులు గురజాల రూరల్: గురజాల జగనన్న కాలనీలో మొత్తం 70 సెంట్ల స్థలాన్ని కూటమి నేతలు కబ్జా చేసిన వైనంపై రా‘జాగా’ కబ్జా అనే శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అక్రమాలకు పాల్పడిన పలువురు అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వి.మురళీకృష్ణ మాట్లాడుతూ గతంలో రీ సర్వే సరిగ్గా చేయని ఇరువురు సర్వేయర్లకు, జగనన్న కాలనీని అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించినే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వోకు షోకాజ్ నోటీసులు అందించామన్నారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. సర్వే చేయించి పూర్తిగా విచారణ జరిపిస్తామన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు విచారణలో తేలితే రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామన్నారు. -
శ్రీవారి కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు
● టీటీడీ , జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● టీటీడీ ఈఓ శ్యామలరావు ఆదేశం తాడికొండ: వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వెంకటపాలెంలోని ఆలయ ప్రాంగణంలో బుధవారం టీటీడీ అధికారులు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో కలిసి ఆయన గుంటూరు జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణంపై సమీప గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కల్యాణ వేదిక పరిసరాల్లో అవసరమైన గ్యాలరీలు, క్యూలైన్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం, కల్యాణ వేదిక పరిసరాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు. భక్తులు సులభతరంగా స్వామిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కల్యాణానికి భజన బృందాలు, శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలని ఆదేశించారు. జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సులువుగా వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వామి కల్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కోసం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. వేదిక పరిసరాలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు .అత్యవసర సమయంలో తక్షణం స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో కలసి కల్యాణ వేదిక, తదితర పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల బృందం సాక్షి, అమరావతి: శ్రీనివాస కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రుల బృందం ఏర్పాటైంది. సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డితోపాటు అనగాని సత్యప్రసాద్, వి.అనిత, పి.నారాయణ, కందుల దుర్గేష్తో కూడిన బృందం ఏర్పాట్ల పర్యవేక్షణకు గురువారం ఆలయాన్ని సందర్శిస్తారని, టీటీడీ ఈఓ కూడా అందుబాటులో ఉండాలని సూచిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ బుధవారం మెమో జారీ చేశారు. -
రూ.7 లక్షల రోడ్డుకు రూ. 4లక్షల కమీషన్!
● కనమర్లపూడిలో టీడీపీ నాయకుల దందా ● ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు ● గ్రామ మాజీ సర్పంచి తన్నీరు అంకారావు శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడిలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక టీడీపీ నాయకులు కమీషన్ల పేరుతో మోకాలడ్డుతున్నారని, తమకు కమీషన్లు ఇవ్వని వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత తన్నీరు అంకారావు ఆరోపించారు. బుధవారం గ్రామంలో రూ. 7 లక్షల వ్యయంతో బీసీ కాలనీ నుంచి వీరరాఘవులు దేవాలయం వరకు సర్పంచ్ తన్నీరు భారతి ఆధ్వర్యంలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే టీడీపీ నాయకుడు గోరంట్ల హనుమంతరావు తమకు రూ. 4లక్షల కమీషన్ ఇస్తేనే పనులు కొనసాగించాలని డిమండ్ చేశారని తన్నీరు ఆరోపించారు. కమీషన్ ఇవ్వకపోవడంతో పనులు జరుగుతున్న ఏరియాలోని బీసీ కాలనీవాసులతో స్థానిక వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయింపజేశారని, టీడీపీ నేతల సూచనలతోనే స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులను పోలీసు స్టేషన్కు తీసుకొని రావటాన్ని తన్నీరు ఖండించారు. వైఎస్సార్ సీపీ మండల కో–ఆర్డినేటరు బోడెపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు ఇందులో వాటా ఉందని.. కమీషన్ ఇవ్వాలంటూ బీసీ సర్పంచ్ను టీడీపీ నేతలు బెదిరించటం దుర్మార్గమన్నారు. సీసీ రోడ్డు పనులు అడ్డుకోవడం తగదన్నారు. బోడెపూడి వెంకటేశ్వర్లు, నలబోలు శ్రీహరి, పుట్టా సురేష్, పుట్టా యోగయ్య, మర్రి ఏడుకొండలు, తదితరులు ఉన్నారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
నరసరావుపేట రూరల్: ఈతకు వెళ్లి ఇద్దకు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని పెట్లూరివారిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా కురిచేడుకు చెందిన గోపి(19) నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అదేవిధంగా అద్దంకి మండలం వేంపరాలకు చెందిన తేజ్కుమార్(19) ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా తృతీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ పట్టణంలోని ప్రైవేటు హస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. బుధవారం సాయంత్రం గోపి, తేజ్కుమార్లు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పెట్లూరివారిపాలెం సమీపంలోని 10 ఆర్ మేజర్ కాలువలో ఈతకు వెళ్లారు. గోపి, తేజ్కుమార్లకు ఈత రాకపోయినా నీటి ప్రవాహం తక్కువుగా ఉండటంతో కాలువలో దిగారు. కాలువ డ్రాప్ పైనుంచి ఇద్దరు నీటిలోకి దూకారు. డ్రాప్ క్రింద ప్రాంతంలో నీటి ఉధృతి కారణంగా మట్టి కోతకు గురై లోతు ఎక్కువుగా ఉంటుంది. దీనిని వారు గమనించకపోడంతో ఈత రాక నీటమునిగారు. కాలువ కట్టపై ఉన్న వీరి స్నేహితులు గమనించి కేకలు వేశారు. మిర్చిపొలాల్లో కోతకు వచ్చని కూలీలు అక్కడకు చేరుకొని కాలువలోకి దిగి ఇరువురిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఇద్దరూ మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిశోర్ తెలిపారు. పెట్లువారి పాలెం సమీపంలోని 10 ఆర్ మేజర్ కాల్వ వద్ద ఘటన ఇద్దరూ బాపట్ల జిల్లాకు చెందినవారే.. -
మేజిస్ట్రేట్ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని
సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిని మేజిస్ట్రేట్ ముందు సీఐడీ హాజరుపరిచింది. మేజిస్ట్రేట్ ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ ముందే న్యాయవాదులతో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు.. రానన్నా. నాకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా?. నా మీద ఎని కేసులు పెట్టారో నాకే తెలియదు’’ అంటూ పోసాని వాపోయారు.‘‘నన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్స్టేషన్లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్ను తెనాలి కోర్టు అనుమతించింది.కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసుకుగానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్లో నమోదైన కేసుకుగానూ ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. -
మాతా, శిశు మరణాలు నివారించాలి
వైద్యాధికారులకు సూచించిన డీఎంహెచ్వో నరసరావుపేట: జిల్లాలో మాతా, శిశు మరణాలు చోటు చేసుకోకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో మాతృ, శిశు మరణాలపై సమీక్ష చేశారు. శిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరేపల్లి ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చోటుచేసుకున్న రెండు మాతృ మరణాలు, రామిరెడ్డిపేట యూపీహెచ్సీ, సత్తెనపల్లి, వినుకొండ కో–లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో జరిగిన మూడు శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను వైద్యాధికారులు, కాన్పులు నిర్వహించిన ప్రైవేటు వైద్యశాల నుంచి హాజరైన గైనకాలజిస్ట్, అనస్తిష్టు, చిన్నపిల్లల వైద్యులను విచారించి మరణాలకు దారితీసిన కారణాలు తెలుసుకున్నారు. గర్భిణులు పోషకాహారం, హిమోగ్లోబిన్ శాతం, గర్భస్థ శిశువు కదలికలన్నింటినీ తెలుసుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసే అల్ట్రా సోనోగ్రఫీ, టిఫ్ పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. డెప్యూటీ డీఎంహెచ్వో పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ లక్ష్మణరావు, డీపీహెచ్ఎన్వో బి.సురేఖ, ఏఎన్ఎం, ఆశాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రతి రైతు ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలి
వెల్దుర్తి: ప్రతీ ఒక్క రైతు తమ పొలంలో ఫాంపాండ్ను ఏర్పాటు చేసుకోవాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023–24 సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, పంచాయితీ రాజ్శాఖ పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీల బృందం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 401 పనులకు గాను వేతనంగా రూ.7,03,58,938 /–లు, మెటల్ పనులకు రూ. 60,06,910/–లు మొత్తం రూ.7,63,65,848/–లు పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ కింద 135 పనులకు రూ. 2499/–లు, మెటల్ పనులకు రూ 2,25, 37,721/–లు మొత్తం రూ.2,25,40,220/–ల పను లు జరిగాయన్నారు. ఈ పనులపై గ్రామసభల ను ఏర్పాటు చేసి ప్రజావేదికను నిర్వహించటం జరి గిందన్నారు. కొత్త పుల్లారెడ్డి గూడెంకు చెందిన రామచంద్రనాయక్ తనకు ఆరు సంవత్సరాల నుంచి జాబ్ కార్డు లేదని తెలిపినప్పటికీ ఎవరూ స్పందించలేదని పీడీ దృష్టికి తీసుకురావటంతో అర్థగంటలోనే జాబ్ కార్డును తయారు చేసి ఆయనకు ఇవ్వటం జరిగింది. రామచంద్రనాయక్ను పీడీ లింగమూర్తి మీ పొలంలో ఫాంపాండ్ను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన వెంటనే మా పొలంలో ఫాంపాండ్ను ఏర్పాటు చేస్తానన్నారు. ఉపాధి హామీ సిబ్బంది రైతులను చైతన్యపరిచి పంట పొలాలలో ఫాంపాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన వెల్దుర్తి మండలంలో హార్టీకల్చర్ ద్వారా పండ్ల మొక్కలను నాటినప్పటికీ అవి బ్రతకటం లేదన్నారు. రైతులు పాంపాండ్ను ఏర్పాటు చేసుకుంటే కొంత వరకై నా పండ్ల మొక్కలను బ్రతికించుకోవచ్చన్నారు. 20 గ్రామ పంచాయతీలలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందాలు గ్రామ సభలు నిర్వహించి పనులు జరిగిన విధానాలను ప్రజావేదికలో వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఇజిఎస్ ఏపీడీ కొరటా మల్లిఖార్జునరావు, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కోటమ్మ, స్టేట్ రిసోర్స్పర్సన్ లోకేష్, ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఇ శ్రీనివాసరెడ్డి, ఏపీవో రేఖాజ్యోతి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్పీలు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి -
ప్రతి రైతు ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలి
వెల్దుర్తి: ప్రతీ ఒక్క రైతు తమ పొలంలో ఫాంపాండ్ను ఏర్పాటు చేసుకోవాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023–24 సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, పంచాయితీ రాజ్శాఖ పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీల బృందం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 401 పనులకు గాను వేతనంగా రూ.7,03,58,938 /–లు, మెటల్ పనులకు రూ. 60,06,910/–లు మొత్తం రూ.7,63,65,848/–లు పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ కింద 135 పనులకు రూ. 2499/–లు, మెటల్ పనులకు రూ 2,25, 37,721/–లు మొత్తం రూ.2,25,40,220/–ల పను లు జరిగాయన్నారు. ఈ పనులపై గ్రామసభల ను ఏర్పాటు చేసి ప్రజావేదికను నిర్వహించటం జరి గిందన్నారు. కొత్త పుల్లారెడ్డి గూడెంకు చెందిన రామచంద్రనాయక్ తనకు ఆరు సంవత్సరాల నుంచి జాబ్ కార్డు లేదని తెలిపినప్పటికీ ఎవరూ స్పందించలేదని పీడీ దృష్టికి తీసుకురావటంతో అర్థగంటలోనే జాబ్ కార్డును తయారు చేసి ఆయనకు ఇవ్వటం జరిగింది. రామచంద్రనాయక్ను పీడీ లింగమూర్తి మీ పొలంలో ఫాంపాండ్ను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన వెంటనే మా పొలంలో ఫాంపాండ్ను ఏర్పాటు చేస్తానన్నారు. ఉపాధి హామీ సిబ్బంది రైతులను చైతన్యపరిచి పంట పొలాలలో ఫాంపాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన వెల్దుర్తి మండలంలో హార్టీకల్చర్ ద్వారా పండ్ల మొక్కలను నాటినప్పటికీ అవి బ్రతకటం లేదన్నారు. రైతులు పాంపాండ్ను ఏర్పాటు చేసుకుంటే కొంత వరకై నా పండ్ల మొక్కలను బ్రతికించుకోవచ్చన్నారు. 20 గ్రామ పంచాయతీలలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందాలు గ్రామ సభలు నిర్వహించి పనులు జరిగిన విధానాలను ప్రజావేదికలో వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఇజిఎస్ ఏపీడీ కొరటా మల్లిఖార్జునరావు, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కోటమ్మ, స్టేట్ రిసోర్స్పర్సన్ లోకేష్, ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఇ శ్రీనివాసరెడ్డి, ఏపీవో రేఖాజ్యోతి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్పీలు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి -
లీకు లాగితే కదిలిన డొంక
వినుకొండ: వినుకొండలోని వివేకానంద బీఈడీ కళాశాల వేదికగానే బీఈడీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అక్రమాల డొంక కదులుతోంది. తొలి నుంచి కళాశాలలో అడ్మిషన్ దగ్గర నుంచి సర్టిఫికెట్లు మంజూరు చేసే వరకు అవినీతి దందా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏటా డీఎస్సీ లేకపోవడం, టీచర్ పోస్టులు ఖాళీ లేకపోవడం వల్ల ఇక్కడ బీఈడీకి ప్రాధాన్యం తగ్గిపోయింది. అయితే ఈ కోర్సుకు ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని వివేకానంద కళాశాల యాజమాన్యం ఒడిశా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. ఏజెంట్ల ద్వారా అడ్మిషన్లు పొందిన ఒడిశా, ఇతర రాష్ట్రాల విద్యార్థులు లంచాలు సమర్పించి కళాశాలకు రాకుండా హాజరు వేయించుకుంటున్నారని తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి ఈ దందా సాగుతోందని సమాచారం. గతంలో ఇక్కడ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి మరీ పరీక్షలు రాయించేవారు. మారిన నిబంధనల ప్రకారం 2024 నుంచి ప్రశ్నాపత్రం ఆన్లైన్లో పంపిస్తుండడంతో కళాశాల యాజమాన్యం పరీక్ష సమయానికంటే ముందే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ఒడిశా విద్యార్థులకు రూ.లక్షలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. తాజాగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ పేపర్ లీక్ విషయం బయటకు పొక్కడంతో వివేకానంద కళాశాల యజమాని సయ్యద్ రఫీక్ అహ్మద్తోపాటు కళాశాల కంప్యూటర్ ఆపరేటర్ మరి కొంతమంది సిబ్బందిని గుంటూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నడుస్తున్న ఈ కళాశాలలో ఈ తంతు ఏటా గుట్టుగా జరుగుతూనే ఉందని సమాచారం. ఇదిలా ఉంటే లీకైన ప్రశ్నాపత్రాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ బుధవారం పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. వివేకానంద బీఈడీ కళాశాల అక్రమాలెన్నో.. ప్రశ్నపత్రం లీక్తో గుట్టురట్టు విద్యార్థుల జీవితాలతో యాజమాన్యం చెలగాటం ఏళ్ల తరబడి ఇదే తంతు తొలి నుంచీ అదే తీరు వినుకొండ వివేకానంద బీఈడీ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫీక్ అహ్మద్ పై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులూ ఉన్నాయి. రాష్ట్ర విభజనకు పూర్వం హైదరాబాద్లో ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తూ ఏసీబీకి పట్టుబడిన కేసులు నడుస్తున్నాయి. తాజాగా వినుకొండలో పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు పొక్క డంతో ఈ కళాశాలపై ప్రభుత్వం కఠిన చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఎమ్మెల్యే చదలవాడ చర్యలు నీతి బాహ్యం
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చర్యలు నీతిబాహ్యంగా ఉన్నా యని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అసలు ఆయన అధికారపక్షంలో ఉన్నరా, ప్రతిపక్షంలో ఉన్నారో నియోజకవర్గ ప్రజలకు అంతుబట్టడంలేదని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వ కార్యాలయమైన ఎకై ్సజ్ కమిషనరేట్లో ధర్నా చేయడం, ఆ పార్టీ నాయకులు వారించినా లెక్క చేయకపోవడం, అధికారులను ఇబ్బంది పెట్ట డం సముచితంగా లేదన్నారు. గత 20 ఏళ్లు గా అనేకమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అనేక ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారని, వారందరూ ఒకే పార్టీకి చెందిన వారు కాదని, వీరి కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆప్కాస్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ భద్రతను కల్పించిందన్నారు. కేవలం ప్రతిపక్షానికి చెందిన వారనే నెపంతో 11 కుటుంబాల వారిని అన్యాయంగా తీసివేయాలనుకోవటం దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. ఈ ఎమ్మెల్యే మాట నరసరావుపేట, రొంపిచర్ల తహసీల్దార్లు వినడం లేదని తాను చెప్పిన పనులు చేయడం లేదంటూ కలెక్టర్కు ఫిర్యా దు ఇవ్వటం బట్టి చూస్తే ఇతని మాట అధికారులు వినటం లేదేమో అనే వాదన ప్రజల్లో బలపడుతుందన్నారు. పట్టణంలో అనుమతి లేకుండా లేఅవుట్లు గత ప్రభుత్వంలో వేశా రని చెబుతున్నారని, ఇప్పుడు తొమ్మిది నెలల కాలంలో అనేక అన్ఆధరైజ్డ్డు లే అవుట్లు వెలిశాయని చెప్పారు. దీనికి తన వద్ద రుజువు కూడా ఉన్నాయని, తాను రుజువు చేయగలనని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. కోటప్పకొండ దేవుని మాన్యంలో మట్టి తోలుకుంటున్నారు కోటప్పకొండ దేవస్థానంకు సంబంధించిన ఆరున్నర ఎకరాల దేవదాయ భూమిని నాయీ బ్రాహ్మణులకు కేటాయిస్తే ఆ భూమి ని ఆక్రమించుకొని ఎమ్మెల్యే, ఆయన మనుషులు మట్టి తోలుకుంటున్నారని చెప్పారు. స్వయానా ఈ మట్టితవ్వే భూములను పరిశీలించిన కోటప్పకొండ ఈవో ఇది దేవస్థానానికి సంబంధించిన భూమి అని నిర్ధారించారన్నారు. అక్కడ ఉన్న వాహనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారన్నారు. ఇంత జరిగి నా మళ్లీ అసెంబ్లీలో అతనే ప్రస్తావించటాన్ని చూస్తే అతనికి నైజం ఏమిటో అర్థమౌతుందన్నారు. ఎనిమిది అడుగుల లోతు మట్టి తీసి అమ్ముకున్నారని, ఇప్పుడు ఈ గుంటలు పడ్డ భూమి సాగుకి, దేవదాయ శాఖకు పనికిరాదని ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారని దీనికి ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలని కోరారు. కోడెల శివరామ్పై కేసులతో నాకు సంబంధం లేదు కోడేల శివరాం అభిమానుల పేరుతో తనపైన, విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవారిపేట గ్రామానికి చెందిన ఆంధ్ర మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అనే వ్యక్తి టీడీపీ నాయకులు కేసు పెట్టించారని అన్నారు. అయితే అతనెవరూ, అతని ఊరు, మండలం కూడా తమకు తెలియదన్నారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత ఈ నాగరాజు అనే వ్యక్తి తన వద్దకు వచ్చి నేను శివరాంకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చానని, నా డబ్బు నాకు ఇప్పించడని వేడుకున్నాడన్నారు. అతడిని పోలీసుల వద్దకు పంపటం జరిగిందన్నారు. కేసులు పెట్టింది కోడెల శివరాంపైనే కాని కోడెలపై కాదని అన్నారు. నాగరాజు ఈరోజు తన కేసు లోక్ అదాలత్లో చేసుకున్నాడని అతని ద్వారా మీడియా ముందు మాట్లాడించి కేసు క్లోజ్ చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ వేధింపుల్లో భాగమే నాపై కేసు కోడెల శివరాం అక్రమాలపై ఫిర్యాదు చేసిన వారే మాట మార్చారు! వినుకొండరోడ్డు వెంచర్లో ప్రభుత్వ భూమిలేదని అధికారులు తేల్చారు కోటప్పకొండలోని నాయీ బ్రాహ్మణుల భూమిలో ఎమ్మెల్యే మట్టి తవ్వకాలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
అన్ని రంగాల్లో మహిళలు పురోగతి సాధించాలి
నాదెండ్ల: ఆర్థ్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలు పురోగతి సాధించాలని, కుటుంబ నిర్ణయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని పల్నాడు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ హీరాలాల్నాయక్ చెప్పారు. నాదెండ్ల శుభోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో హెల్త్ సబ్ కమిటీ, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు, వీవోఏలు, ఆఫీస్ బేరర్స్కు మూడు రోజుల పాటూ జరగనున్న శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూ లన లక్ష్యాలు నెరవేరాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, కుటుంబ నిర్ణయాల్లో కీలక భూమిక పోషించాలన్నారు. సామాజిక వనరులను సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నపుడే మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధ్యమౌతుందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఇన్చార్జి డీబీ ప్రియదర్శిని, వన్స్టాప్ సకీ సెంట్రల్ లీగల్ అడ్వైజర్ కంభంపాటి వాణిశ్రీ, ఏపీఎం మేకతోటి రమేష్, సీసీలు సాంబశివరావు, హేమలత, సుధ, సాగర్, యానిమేటర్లు పాల్గొన్నారు. పేపర్ లీక్ చేస్తే.. గుర్తింపు రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సాయికుమార్ డిమాండ్ నరసరావుపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడిన ఘటనలో అరెస్ట్ అయిన స్వామి వివేకానంద కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కె.సాయికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో సాయి కుమార్ మాట్లాడుతూ పలుమార్లు పేపర్లు లికేజీలకు పాల్పడిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును విచ్ఛిన్నం చేసేందుకు కళాశాల యాజమాన్యం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. చదువుకొని పరీక్షలు రాయాల్సిన విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదన్నారు. ఇటువంటి ఘటనలు ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చదువుకున్న విద్యార్థులు చాలా అవకాశాలను కోల్పోతారన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. బీఈడీ కళాశాలలు మొదలుకొని పరీక్షలు వరకు రాష్ట్రంలో ఉన్న పలు కళాశాలలో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి ఘటనలపై యూనివర్సిటీలపై ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించకపోవటంతో లోపాయి కారి ఒప్పందాలతో యూనివర్సిటీ అధికారులు పాల్పడుతున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జరిమానాలు కాకుండా ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ఆర్థిక స్వావలంబనతోనే కుటుంబ వృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా పీడీ హీరాలాల్ నాయక్ -
సంక్షేమం ఫ్రీజ్
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొలువుల జాతర అబద్ధాల విష వలయం చుట్టుముడితే.. ఆకాశానికి నిచ్చెన వేసి ఆశల పల్లకీలో ఊరేగిస్తే.. అరచేతిలో వైకుంఠం చూపి మంత్రదండంలా ఆడిస్తే నిజమని నమ్మిన సామాన్యుడు.. కాల‘కూటమి’ చక్రబంధనంలో చిక్కుకున్నాడు.. అది మాయాచట్రమని తెలుసుకునేలోపు నివురుగప్పిన మోసం నిలువునా ముంచేసింది. బంగారు భవితను అంధకారం చేసింది. ఇంటికో ఉద్యో గం.. నిరుద్యోగ భృతి అంటూ యువగళంలో పోసిన గరళం అంపశయ్యపైకి చేర్చింది. తల్లికి వందనం పేరిట ‘అమ్మఒడి’లో రేపిన మంట కార్చిచ్చులా చుట్టుముట్టింది. విద్యా దీవెనలు.. శాపాల శరాఘాతాలై నిలువెల్లా తాకాయి. ఫలితంగా దగా పడ్డ తెలుగుబిడ్డ ఆగ్రహజ్వాలతో గళమెత్తి గర్జిస్తున్నాడు. కూటమి సర్కారుపై కన్నెర్రజేసి ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దళమై కదంతొక్కేందుకు సిద్ధపడ్డాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లాలో సుమారు ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మరో ఐదు వందల మందికి ఉపాధి దొరికింది. చాలా మంది తమ సొంత గ్రామాలు, సొంత మండలాల్లో ఉపాధి పొందారు. అప్పట్లో హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు సొంత ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్ పేరిట వేలాది మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు వలంటీర్ వ్యవస్థ ద్వారా భారీగా ఉపాధి కల్పించడం విశేషం. జిల్లాలో సుమారు పది వేల మందికిపైగా మంది వలంటీర్లుగా సొంత గ్రామంలో ఉపాధి పొందారు. ప్రజల ముంగిళ్లలోకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పచ్చి మోసం టీడీపీ కూటమి ప్రభు త్వం విద్యార్థులు, యువతను పచ్చి మోసం చేస్తోంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ వసతి దీవెనకు రూ.1,800 కోట్లు మంజూరుచేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ మంజూరు చేయలేదు. నిరుద్యోగ భృతి రూ.3వ ేలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టి, ఐదింటిలో తరగతులు ప్రారంభిస్తే ఈ సర్కారు వాటిని ప్రైవేటు పరం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇప్పటివరకు కొత్తగా ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారు. – గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ ఉద్యోగం కోసం నిరీక్షణ నేను బీటెక్ పూర్తి చేశా. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో హైదరాబాద్లో కంప్యూటర్ కోర్సులో శిక్షణకు వెళుతున్నా. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటనా చేయటం లేదు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట. ఇప్పుడొక మాట. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది. – వల్లెం ఈశ్వర్ సాయికుమార్, నిరుద్యోగి, సత్తెనపల్లిసాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం.. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం.. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజినీరింగ్, పీజీ ఇలా ఏదో ఒకటి పూర్తిచేసిన నిరుద్యోగులు ఐదు లక్షల 58 వేల మంది ఉన్నారని అంచనా. వీరికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. బడ్జెట్లోనూ కేటాయింపులు చేయలేదు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, తొలి సంతకం అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లూ ఇవ్వడం లేదు. ఫలితంగా యువత నిరసన గళం విప్పుతోంది. బాబు వల్ల విద్యారంగం నిర్వీర్యం బాబు పాలనలో విద్యారంగం నిర్వీర్యమైపో తోంది. గత ప్రభుత్వంలో అమలైన ఫీజు రీయింబర్స్మెంట్(విద్యాదీవెన), వసతి దీవెన పథకాలు అటకెక్కాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తారో తెలీక విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చదువు పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం యత్నిస్తున్న వారు అవస్థలు పడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా.. సర్కారులో మాత్రం చలనం ఉండట్లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా, ఫీజులు చెల్లిస్తేనే ఈ ఏడాది పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఉద్యమబాట వైఎస్సార్ సీపీ నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన ఉద్యమ బాట పట్టింది. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ‘యువత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా, కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నారు. భారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెనకు మంగళం నిరుద్యోగ భృతి అడ్రస్ గల్లంతు ఉపాధి లేదు.. ఉద్యోగం రాదు.. యువత తరఫున నేడు వైఎస్సార్ సీపీ పోరుబావుటా ప్రతిపక్షానికి అన్నివర్గాల నుంచి విశేష మద్దతు తల్లికి వందనం ఎక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. గతంలో నాలుగేళ్లపాటు నిరాటంకంగా అమలైన జగనన్న అమ్మ ఒడి ఆర్థిక ప్రోత్సాహం ఆగిపోయింది. ఏటా తల్లుల ఖాతాల్లో జమైన రూ.15వేలు పిల్లల చదువులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కరోనా సంక్షోభంలోనూ అమ్మఒడి ఆగలేదు. కూటమి సర్కారు వచ్చాక తల్లికి వందనం అని చెప్పి మొత్తంగా ఎగ్గొట్టారు. -
మాతా, శిశు మరణాలు నివారించాలి
వైద్యాధికారులకు సూచించిన డీఎంహెచ్వో నరసరావుపేట: జిల్లాలో మాతా, శిశు మరణాలు చోటు చేసుకోకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో మాతృ, శిశు మరణాలపై సమీక్ష చేశారు. శిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరేపల్లి ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చోటుచేసుకున్న రెండు మాతృ మరణాలు, రామిరెడ్డిపేట యూపీహెచ్సీ, సత్తెనపల్లి, వినుకొండ కో–లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో జరిగిన మూడు శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను వైద్యాధికారులు, కాన్పులు నిర్వహించిన ప్రైవేటు వైద్యశాల నుంచి హాజరైన గైనకాలజిస్ట్, అనస్తిష్టు, చిన్నపిల్లల వైద్యులను విచారించి మరణాలకు దారితీసిన కారణాలు తెలుసుకున్నారు. గర్భిణులు పోషకాహారం, హిమోగ్లోబిన్ శాతం, గర్భస్థ శిశువు కదలికలన్నింటినీ తెలుసుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసే అల్ట్రా సోనోగ్రఫీ, టిఫ్ పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. డెప్యూటీ డీఎంహెచ్వో పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ లక్ష్మణరావు, డీపీహెచ్ఎన్వో బి.సురేఖ, ఏఎన్ఎం, ఆశాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రేపు ఎయిమ్స్లో వాక్థాన్
మంగళగిరి: నగర పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) ఆవరణలో వాక్థాన్ నిర్వాహకులు వి.నేహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న గురువారం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాక్థాన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో కిడ్నీ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. సాగర్ నీరు సాగు, తాగుకే వాడుకోవాలి నరసరావుపేట: నాగార్జునసాగర్ కుడికాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన నీటిలో మిగిలిన నీరు మార్చి చివరి వరకు మాత్రమే సరిపోయే అవకాశం ఉన్నందున వృథా చేయకుండా పంట పొలాలు, తాగునీటి చెరువులకు మాత్రమే ఉపయోగించాలని ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మే నెలలో తాగునీటి చెరువుల కోసం నీరు విడుదల చేసేంత వరకు కాలువలు మూసివేయనున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రజారోగ్యశాఖల అధికారులు తాగునీటి చెరువుల్లోని నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. రేపు సత్రశాలలో 16 రోజుల పండుగ సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో గురువారం 16 రోజుల పండగ నిర్వహించనున్నట్లు ఈఓ గాదె రామిరెడ్డి మంగళవారం తెలిపారు. మహాశివరాత్రి పండగ వెళ్లిన 16 రోజుల తరువాత దేవస్థానంలో స్వామివార్ల కల్యాణం నిర్వహించి అనంతరం కనులపండువగా వసంతోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. వలస పక్షుల రాక పెదకూరపాడు : కొల్లేరు ప్రాంతానికి విదేశీ పక్షులు రావడం అందరికీ తెలిసిన విషయమే. గుంటూరు జిల్లాలోనూ తక్కెళ్లపాడు చెరువుకు వలస పక్షులు రావడం సహజం. ఈ కోవలోనే పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు గ్రామంలోని చెరువు కూడా వలస పక్షులకు ఆవాసంగా మారడంతో ప్రజలు పక్షులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్లపైన పండ్ల మొక్కలు నాటి సంరక్షిస్తే పక్షులకు ఆవాసాలుగా మారతాయని, తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. యార్డులో 1,44,323 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,38,953 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,323 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. -
నిలువునా ముంచింది
విద్యార్థులు, యువతను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచింది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోంది. ఉద్యోగాల భర్తీ లేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోంది. సర్కారుపై పోరు గళం విప్పుతాం. ఏపీ కామన్ పీజీ సెట్ను రద్దు చేయాలి. జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ స్టూడెంట్లకూ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. వెటర్నరీ విద్యార్థులకు రూ.25వేల స్టైఫండ్ చెల్లించాలి, – కోట సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ -
పది దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి దూరవిద్య పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. పరీక్షల నిర్వహణపై శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలు ఈనెల 17 నుంచి 28 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 27 పరీక్ష కేంద్రాలలో 1,200 మంది పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 57 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. 28 మంది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ కరదీపికను సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.ఎం.ఎ.హుస్సేన్, డెప్యూటీ డీఈఓలు ఎస్.ఎం.సుభాని, వి.ఏసుబాబు, రిసోర్స్ పర్సన్ బీవీఎల్ వరప్రసాదు తదితరులు పాల్గొన్నారు. డీఈఓ చంద్రకళ -
AP: జీబీఎస్ వైరస్తో మరో మహిళ మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్తో మరో మహిళ మృతి చెందింది. వారం క్రితం వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరిన మహిళ.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా, గుంటూరు జీజీహెచ్లో గత నెల.. షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతి చెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత మరణించింది.కాగా, ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. -
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉత్సాహంగా జాతీయస్థాయి ఎడ్ల పందేలు
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు సోమవారం రసవత్తరంగా జరిగాయి. ఆరు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీష, శివకృష్ణచౌదరికి చెందిన ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన వల్లభనేని మోహన్రావు, ఉత్తం పద్మావతిరెడ్డి ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 3,783 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన పాశం గోవర్ధనరెడ్డి, రాయుడు సుబ్బారావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కలరెడ్డిపల్లికి చెందిన కూతర్ల దీక్షిత్రెడ్డి, నిశాంత్రెడ్డికి చెందిన ఎడ్లజత 3,380 అడుగుల దూరం లాగి ఐదో స్థానం సాధించాయి. మంగళవారం జూనియర్స్ విభాగంలో పందేలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. రోజూ పందేలు తిలకించేందుకు వచ్చే రైతులకు అన్నదానం చేస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. -
తిరునాళ్లకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
రెంటచింతల: పాలువాయి గేటు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గోలి గ్రామానికి చెందిన మాచవరపు నాగేశ్వరరావు(45), బాలగాని ఆంజనేయులు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై దుర్గి మండలంలోని ముటుకూరు తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 167 ఏడీ నిర్మాణంలో భాగంగా పాలువాయి గేటు గ్రామంలోని రైల్వే ట్రాక్ వద్ద చేపట్టిన హైలేవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవంతో రాత్రి సమయం కావడం వల్ల ముందు ఏమీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ద్విచక్రవాహనంతో బ్రిడ్జిపై నుంచి ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ తొలుత నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో మాచవరపు నాగేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. బాలగాని ఆంజనేయులును మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నట్లు ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వరరావుకు భార్య ఏసమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు -
నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి
టైలరింగ్ చేస్తూ జీవిస్తుంటాను. నా ఇంటి పక్కనే ఉండే పూజల కోటేశ్వరరావు గతంలో నా భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. కోర్టులో అతనికి రెండేళ్ల శిక్ష పడింది. అతనిపై పోలీసు స్టేషన్లో రౌడీషీటు కూడా ఉంది. శిక్షాకాలం పూర్తిచేసుకుని వచ్చిన అతను నాపై కత్తితో దాడిచేయటంతో నేను తీవ్రంగా గాయపడి చికిత్స పొంది కోలుకున్నా. కత్తితో దాడి చేసిన కేసు ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపుతానని కోటేశ్వరరావు, బ్రహ్మమ్మలు మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని మా కుటుంబానికి తక్షణం రక్షణ కల్పించండి. – బుర్రి వెంకటరావు, బయ్యవరం, క్రోసూరు మండలం -
కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి
సత్తెనపల్లి: ప్రతి మనిషిలో ఓ కళ ఉంటుందని, ఆ కళని సాధించడానికి నిరంతర కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు అన్నారు. చైతన్య కళా స్రవంతి సత్తెనపల్లి 46వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి తెలుగు సినిమా పాటల పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నరసింహారావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ వర్ధమాన గాయకులు విజయపథం వైపు పయనించాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి తెలుగు సినిమా పాటల పోటీలలో ప్రథమ బహుమతి మాధవి (విజయవాడ), ద్వితీయ బహుమతి కె.రామారావు (కారంపూడి), తృతీయ బహుమతి కె.దుర్గాప్రసాద్ (హైదరాబాద్) కై వసం చేసుకున్నారు. వీరితోపాటు 10 మంది కన్సొలేషన్ బహుమతులు, 15 మంది ప్రత్యేక బహుమతులను అందుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి చైతన్య కళా స్రవంతి గౌరవ సలహాదారు లయన్ ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎ.విశ్వేశ్వరరావు(పిడుగురాళ్ల), ఎస్.కళాంజలి(రాజంపేట), ఎం.రవివర్మ (నరసరావుపేట) వ్యవహరించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామ కోటేశ్వరరావు, శ్రీమారుతీ ట్రేడర్స్ అధినేత ఆత్మకూరి వెంకట హరేరామచెంచయ్య, వెంకటసుబ్బయ్య, కళాస్రవంతి అధ్యక్షుడు లయన్ కమతం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గుండ వరపు అమర్ నాధ్, ట్రెజరర్ ఎస్సీయం. సుభాని, మహేష్, బాలరాజు, ఆచారి, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు జాతీయ స్థాయి సినిమా పాటల పోటీల విజేత విజయవాడ మాధవి -
న్యాయం జరిగేవరకు పోరాడుతాం
● సమస్య సీఎం దృష్టికి వెళ్లినా పరిష్కారం కాకపోవటంపై అసంతృప్తి ● భవిష్యత్ కార్యాచరణపై పుల్లారావు బాధితుల సమావేశం నరసరావుపేట టౌన్: కలిసి కట్టుగా ఉద్యమం చేసి న్యాయం జరిగే వరకు పోరాడదామని సాయి సాధన చిట్ఫండ్ స్కాం బాధితులు తీర్మానించుకున్నారు. సాయి సాధన చిట్ఫండ్ బాధితులు సోమవారం పట్టణంలోని ఓ హోటల్లో సమావేశం అయ్యారు. పాలడుగు పుల్లారావు చిట్ఫండ్, విజయలక్ష్మి టౌన్షిప్ పేర్లతో కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారీ అయిన విషయం విధితమే. రియల్ ఎస్టేట్ మోసంపై పుల్లారావుతో పాటు అతని భాగస్వాములపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అవ్వగా, కోర్టులో లొంగిపోయి సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ కేసులో సోమవారం పుల్లారావు అతని భాగస్వాములు గుండా సాంబశివరావు, గుండా అనిల్లకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరసరావుపేట వన్టౌన్ పోలీసులు నమోదు చేసిన చీటింగ్ కేసులో పుల్లారావుకు బెయిల్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బాధితులంతా సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్య తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని కొందరు అభిప్రాయబడ్డారు. కేసు సీఐడీకి బదిలీ అయినప్పటి నుంచి పుల్లారావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేద్దామని చర్చించుకున్నారు. చీటీపాట స్కాంలో ఉన్న బాధితులు సుమారు 600 మందితో త్వరలోనే సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు చేకూరి సాంబశివరావు, ఇ.ఎం.స్వామి, యామిని రామారావు తెలిపారు. -
ఎయిమ్స్కు, పానకాల స్వామి కొండకు ఎలక్ట్రిక్ బస్సులు
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ వితరణ మంగళగిరి: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండతోపాటు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు రెండు ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ సోమవారం అందజేసింది. బస్సులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్కు వెళ్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా శ్రీ పానకాలస్వామి కొండకు వెళ్తుంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్, ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరెక్టర్ శశికాంత్, ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పాల్గొన్నారు. ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిగా మధు నరసరావుపేట: ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి(ఆర్ఎం)గా ఎం. మధు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక డిపో కార్యాలయంలోని జిల్లా కార్యాలయానికి వచ్చిన ఆయనకు పలువురు ఉద్యోగులు, యూనియన్ నాయకులు స్వాగతం పలికారు. విజయవాడలోని హెడ్ ఆఫీసులో పనిచేస్తూ పదోన్నతిపై పల్నాడు జిల్లాకు వచ్చారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎన్వీ శ్రీనివాసరావు గత నెల 28న ఉద్యోగ విరమణ చేశారు. ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసు కేసు నమోదు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సోమవారం తొలి మాల్ ప్రాక్టీసు కేసు నమోదైంది. పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షకు గుంటూరు జిల్లాలోని 87 పరీక్షా కేంద్రాల పరిధిలో 28,274 మంది విద్యార్థులు హాజరయ్యారు. 446 మంది గైర్హాజరయ్యారు. గుంటూరులోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్కు ప్రయత్నించిన ఓ విద్యార్థిపై అధికారులు మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు. ఆర్ఐవో జీకే జుబేర్ ఐదు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన మంగళగిరి: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, అధికారులతో కలిసి ఆమె వర్సిటీని సందర్శించారు. సీఎం ప్రారంభించనున్న సీవీ రామన్ బ్లాక్, ప్రసంగించనున్న అబ్దుల్ కలామ్ ఆడిటోరియం తదితర ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ప్లానింగ్ ఈడీ వీఆర్ అలపర్తి, సెక్రటరీ అనంత్ సింగ్, రిజిస్ట్రార్ ఆర్. ప్రేమ్కుమార్, సీఎల్ఎం డైరెక్టర్ అనూప్సింగ్, జీఎం రమేష్బాబు పాల్గొన్నారు. -
యువతకు అండగా వైఎస్సార్ సీపీ
● రేపు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమం ● పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ నిర్వహిస్తున్నట్లు పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలసి సోమవారం పోస్టర్లు ఆవిష్కరించారు. పిన్నెల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మోసపోతున్న విద్యార్థులు, యువతకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఈనెల 12న ఉదయం 10 గంటలకు నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ‘యువత పోరు’ ర్యాలీ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున తరలివచ్చి ప్రభుత్వ మోసపూరిత విధానాలపై గళం వినిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారని, ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదివారన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరో అడుగు ముందుకు వేసి వసతిదీవెన పథకం కింద హాస్టల్ ఖర్చులు అందజేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. వెంటనే రూ.4,600 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎన్నికల్లో రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదన్నారు. వై.ఎస్.జగన్ పాలనలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుడితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ చేస్తున్న ‘యువత పోరు’లో అందరూ భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈనెల 12న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. -
‘ఫైనాన్స్’ ఆగడాల నుంచి రక్షించండి
● పీజీఆర్ఎస్లో బాధితురాలి వినతి ● ప్రజల నుంచి 62 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అరుణ్బాబు నరసరావుపేట: తన భర్త బాజీవలి స్టార్ ఫైనాన్స్ వద్ద రూ.5లక్షలు రుణం తీసుకొని కరోనా సమయంలో చనిపోయాయని, తాను ఇప్పటివరకు రూ.4.50లక్షలు చెల్లించానని, ఇంకా చెల్లించాలంటూ కోర్టు ఆదేశాల లేకుండానే తమ ఇంటికి తాళాలు వేసిన సదరు ఫైనాన్స్ ప్రతినిధులు నెలరోజులు వేధించారని, వారే ఇప్పుడు తాళాలు తీసి.. ఇంకా రూ.10లక్షలు చెల్లించాలని వేధిస్తున్నారని, తనకు అంత స్థోమత లేదని, వారి ఆగడాల నుంచి రక్షించాలని చిలకలూరిపేట పండరీపురంకు చెందిన సయ్యద్ ఆయేషా ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఎ.మురళి, అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి 62 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండలాల్లో జీఎస్డబ్లుఎస్ సర్వే, పీ–4 సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే పురోగతిని కూడా పర్యవేక్షించాలని కోరారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.. నకరికల్లు మండలం దేచవరంలో చర్మకారులైన తమకు ప్రభుత్వం ఒక ఎకరం పొలం కేటాయించగా దానిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాం. గ్రామ టీడీపీ నాయకుడు వెంకయ్య ఈ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేయించి చర్మకారుల సంఘానికి ఆ భూమిని అప్పచెప్పండి. – కనుమూరి ఆదెయ్య, వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జి.రామకృష్ణ, చర్మకారుల సంఘ నాయకులు -
పరస్పర సహకారంతో అభివృద్ధి
నరసరావుపేట: ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ సహకార ఏడాదిగా గుర్తించినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. దీనికి సంబందించిన ఐవైసీ పోస్టర్ను సోమవారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించి, కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు. వేస్ట్ పికర్స్కు బల్ల బండ్లు అందజేత.. చెత్తను సేకరించే వృత్తి నుంచి వ్యాపార రంగంలోకి ఎస్టీ యానాదులు మార్పు చెందాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆకాంక్షించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వేస్ట్ పికర్స్కి జీవనోపాధులు మెరుగుపర్చుకునేందుకు నాలుగు చక్రాలు, మూడు చక్రాల బల్లబండ్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో–ఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, నరసరావుపేట ఏరియా కో–ఆర్డినేటర్ తోకల సాంబయ్య పాల్గొన్నారు. పీ–4 కార్యాచరణలో భాగస్వాములు కండి స్వర్ణాంధ్ర–2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పీ4 విధానం అమలుకు కసరత్తు జరుగుతోందని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సీపీఓ ఆధ్వర్యంలో పీ–4కు సంబంధించిన వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి జల్ శక్తి మంత్రిత్వ శాఖ జల్శక్తి అభియాన్ ‘జల్ సంచయ్ జన్ భగీదారి’పై దేశవ్యాప్తంగా 80 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్ విధానంలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్.పాటిల్ నిర్వహించిన సమీక్షకు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి పాల్గొన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ సహకార ఏడాదిగా గుర్తింపు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ -
వెల్దుర్తిలో తీవ్ర విషాదం
● రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృతి ● ఆగివున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టగా ఘటన ● ఘటనాస్థలంలోనే మృతి చెందిన వైనం వెల్దుర్తి: ఆగివున్న ట్రాక్టర్ను ఢీకొని తండ్రి కూతురు మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు (30), తన కుమార్తె రూప (3)తో కలిసి ద్విచక్రవాహనంపై మాచర్ల నుంచి స్వగ్రామం మిట్టమీదపల్లెకు వెళ్తున్నారు. ఈక్రమంలో వేగంగా వెళ్తూ 565 జాతీయ రహదారిలో వెల్దుర్తి సమీపంలోని పెట్రోలు బంకువద్ద రోడ్డు మార్జిన్లో నిలుపుదల చేసిన ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పల్లా శ్రీనివాసరావు, రూపలు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్ల తయారీ
గుంటూరు ఎడ్యుకేషన్: ఒకే వేదికపై 220 మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్కుమార్, కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖ కుమార్, సెర్చ్ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు మన్నవ హనుమప్రసాద్, అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెన్న పోతురాజు, పాఠశాలల కరస్పాండెంట్లు పాటిబండ్ల విష్ణువర్ధన్, కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం ప్రయోగం వాహన రివర్స్ అలారంతయారు చేసిన విద్యార్థులు -
అంగన్వాడీలపై సర్కారు ద్వంద్వ వైఖరి
లక్ష్మీపురం: అంగన్వాడీల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ధ్వజమెత్తారు. స్థానిక బ్రాడీపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాలలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాటానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా జీతాల పెంపు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు ముందుగానే అధికారులు, మంత్రులకు యూనియన్ వినతి పత్రాలు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ ధర్నాను భగ్నం చేసేందుకు అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సెక్టార్లవారీగా ట్రైనింగులు ఉంటాయని, దానికి హాజరు కాకపోతే తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేయడం, యూనియన్ నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఇలాంటి నిర్బంధాలు కొత్త కాదని, వాటన్నింటినీ అధిగమించి పోరాటం చేయగల సత్తా అంగన్వాడీలకు ఉందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కట్టిపెట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిపై నిర్బంధం ప్రయోగిస్తే పోరాడే అంగన్వాడీలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమ్మె ముగింపు సందర్భంగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలోనూ తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ఒప్పందంలో మట్టి ఖర్చులు రూ.20వేలు ఇవ్వాలని ఉంటే దాన్ని రూ.15 వేలకు కుదించి జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే రిటైర్మెంట్ సర్వీసు పరిహారం కింది అంగన్వాడీలకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.60 వేలు ఇవ్వాలని ఒప్పందంలో ఉంటే దాన్ని రూ. 20 వేల వంతున తగ్గించారన్నారు. మళ్లీ పేరు మార్చి గ్రాట్యూటీ అని చెబుతూ దానితోనే సంబరపడమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ చార్జీల పెంపుదల, ప్రమోషన్లు తదితర విషయాలపై ఏర్పాటు చేసిన కమిటీని పక్కన పెట్టేశారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ -
శంకర కంటి ఆస్పత్రికి నేత్ర దానం
శావల్యాపురం: మండలంలోని వేల్పూరుకు చెందిన కంచర్ల సుబ్బారావు (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల అనుమతితో శంకర కంటి వైద్యశాలకు మృతుడి నేత్రాలను దానం చేసినట్లు జిల్లా అమ్మ నేత్ర, అవయవ దాన సంఘం కోఆర్డినేటరు సండ్రపాటి చలపతిరావు తెలిపారు. అవయవ దానం చేయడం పలువురికి ఆదర్శనీయమని కొనియాడారు. నేత్ర దానానికి సహకరించిన సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆలపాటి శివ, సుబ్రహ్మణ్యం, సురేష్, పరమేశ్వరరావు, అంజయ్యను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక్క మాత్రతో నులిపురుగుల నివారణ గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సోమవారం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ఒకే మాత్రతో నులి పురుగులను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడాది నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నిర్మూలన కోసం 400 ఎంజీ ఆల్బెండజోల్ బిళ్లలను చప్పరించి మింగించాలని తెలిపారు. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లలకు అరమాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్ర ఇవ్వాలని సూచించారు. సోమవారం వీలు కాని వారితో ఈ నెల 17వ తేదీన మాపప్ రౌండ్లో మింగించాలన్నారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గంట తేడాతో మాత్రలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. జిల్లాలో అర్హులైన పిల్లలు 4,24,742 మంది ఉన్నారని చెప్పారు. కార్యక్రమాన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తారని తెలిపారు. నులిపురుగుల నిర్మూలన వల్ల పిల్లలలో రక్తహీనతను నివారించి వారి ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చని పేర్కొన్నారు. ఏఎన్ఎంలపై పనిఒత్తిడి తగ్గించాలి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రోశయ్య బాపట్ల: ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య పేర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె.రోశయ్య మాట్లాడుతూ తాలుకా, జిల్లా బాడీలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 143 జీఓని రద్దు చేయాలని కోరారు. ఏఎన్ఎంలపై ఒత్తిడి తగ్గించాలని, గ్రేడ్ 3 ఏఎన్ఎంలను వైద్యశాఖలోకి తీసుకోవాలని కోరారు. పీ4 సర్వేలో ఏఎన్ఎంలను మినహాయించాలన్నారు. సమావేశంలో నాయకులు సీహెచ్ బెనర్జీ, జె.సుధాకర్, ఎన్.సుబ్బారావు, కె.మారుతి ప్రసాద్, రత్నకుమారి, రమణమ్మ, సైదయ్య, వేణు, మహబూబ్, రాజేష్, బాపట్ల టౌన్ అధ్యక్షుడు జి.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మాచర్ల: స్థానిక రింగు రోడ్డు సెంటర్లో లారీ బైక్కు తగలడంతో ఆదివారం అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. అన్నెబోయన అమరలింగం(39) ఇంటి నుంచి బైక్పై సెంటర్కు వస్తున్నాడు. ఆంజనేయస్వామి దేవాలయం వద్ద లారీని రివర్స్ చేస్తుండగా బైక్కు తగిలింది. దీంతో అమరలింగం లారీ వెనుక టైర్ కింద పడి మృతి చెందాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గూడ్స్ రైలు కిందపడి టైల్స్ మేస్త్రి ఆత్మహత్య నరసరావుపేట టౌన్: గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొండపాడుకు చెందిన పుట్లూరి శివారెడ్డి(42) పట్టణంలోని బరంపేటలో నివాసం ఉంటున్నాడు. టైల్స్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. శావల్యాపురం రైల్వే స్టేషన్ సమీపంలో వెల్లలచెరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. 15 నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి తెనాలి: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ఈ నెల 15వ తేదీ నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ చేపట్టనున్నారు. రైత్చు క్షేమార్థం, ధర్మసంస్థాపనార్థం చేపట్టనున్న తిరుమల మహాపాదయాత్రను భక్తజన సమూహంగా ఆరంభించనున్నారు. దీనికి ముందుగా తెనాలిలో ‘గురు పాదధూళి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం శ్రీసాలిగ్రామ పీఠం నుంచి బయలుదేరి బుర్రిపాలెం రోడ్డులోని గోశాల వరకు పాదయాత్ర చేశారు. తిరుమల మహా పాదయాత్ర రోజు వరకు రోజూ గురు పాదధూళి పాదయాత్ర ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీసాలిగ్రామ పీఠం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
సందడిగా సినిమా పాటల పోటీలు ప్రారంభం
సత్తెనపల్లి: చైతన్య కళా స్రవంతి 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో ఆదివారం జాతీయస్థాయి సినిమా పాటల పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరయ్యారు. పోటీల్లో సోలో పాటలకు మాత్రమే అవకాశం కల్పించారు. డ్యూయెట్స్ను అనుమతించలేదు. ముందుగా చైతన్య కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లుట్ల రామారావు చిత్రపటానికి చైతన్య కళా స్రవంతి అధ్యక్షులు కమతం శ్రీనివాసరావు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పాటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామకోటేశ్వరరావు, చైతన్య కళా స్రవంతి ఉపాధ్యక్షులు పిల్లుట్ల రాజా వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి గుండవరపు అమర్నాథ్, ట్రెజరర్ ఎస్సీఎం సుభాని, గౌరవ సలహాదారుడు ముట్లూరి వెంకయ్య, కంబాల వెంకటేశ్వరరావు, అచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
ఎంఎల్హెచ్పీ ఆత్మహత్యాయత్నం
యద్దనపూడి: యద్దనపూడి పీహెచ్సీ పరిధిలోని జాగర్లమూడి గ్రామంలో గతంలో మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)గా విధులు నిర్వహించిన ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి... యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామంలో సరోజిని ఎంఎల్హెచ్పీగా విధులు నిర్వహిస్తుండేది. ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తోటి సిబ్బందితో పాటు గ్రామస్తులు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ విజయమ్మ నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని సందర్శించి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆమెను వివరణ కోరారు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో వైద్యాధికారి శ్రీహర్ష నాలుగు నెలల క్రితం డీఎంహెచ్ఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి ఆమెను సరెండర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో యద్దనపూడి పరిధిలోనే హాజరు వేసుకుంటూ తనకు వేతనం మంజూరు చేయడం లేదని కొన్ని రోజులుగా ఆస్పత్రి వైద్యాధికారి శ్రీహర్షపై ఒత్తిడి చేస్తూ అతనితో వివాద పడింది. కొన్ని రోజులుగా వివాదం నడుస్తుందని ఆస్పత్రి సిబ్బంది స్వయంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో జీతాలు, విధులు నిర్వహించాల్సిన ప్రాంతం విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో పర్చూరు పోలీస్ స్టేషన్లోను, యద్దనపూడి పోలీస్ స్టేషన్లోను వైద్యాధికారి శ్రీహర్షపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తనను మానసికంగా వైద్యాధికారి, ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్థానికంగా కలకలం రేకెత్తింది. ● ఈ విషయమై డీఎంహెచ్ఓ విజయమ్మను వివరణ కోరగా గతంలో సరోజిని విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణలు రావడంతో సాధారణ తనిఖీల్లో భాగంగా విచారించామన్నారు. రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేక పోవడంతోపాటు అక్కడి స్థానిక వైద్యసిబ్బందితో పాటు ప్రస్తుతం వైద్యాధికారి శ్రీహర్షతోపాటు గతంలో ఉన్న వైద్యాధికారిపై కూడా పలు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైద్యసిబ్బంది ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారి శ్రీహర్ష జిల్లా కేంద్రానికి సరెండర్ చేయగా, తాము ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు చెప్పారు. ● ఈ విషయమై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా యద్దనపూడి పీహెచ్సీ కేంద్రం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసిన మాట వాస్తవమే అని వివరణ ఇచ్చారు. ఆమెకు మరోచోట బదిలీ చేసేందుకు ఎంఎల్సీ కోడ్ అడ్డుగా వచ్చిందన్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఆర్డీ కార్యాలయానికి వచ్చి జాగర్లమూడి గ్రామంలో పని చేసుకుంటానని ప్రాధేయపడిందని, కానీ ఆమెకు యద్దనపూడీ పీహెచ్సీలో పనిచేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. ఆమెకు వేతనాలు మంజూరు చేసే అధికారం యద్దనపూడి పీహెచ్సీ వైద్యాధికారికి లేదన్నారు. ఈ ఆత్మహత్యయత్నం ఘటన ఇప్పుడే తెలిసిందని, వాస్తవాలు విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైద్య సిబ్బంది వేధింపులే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని ఆరోపణలు -
ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్ల తయారీ
గుంటూరు ఎడ్యుకేషన్: ఒకే వేదికపై 220 మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్కుమార్, కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖ కుమార్, సెర్చ్ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు మన్నవ హనుమప్రసాద్, అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెన్న పోతురాజు, పాఠశాలల కరస్పాండెంట్లు పాటిబండ్ల విష్ణువర్ధన్, కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం ప్రయోగం వాహన రివర్స్ అలారంతయారు చేసిన విద్యార్థులు -
జిల్లాను ప్రగతి పథంలో నిలపాలి
నరసరావుపేట: ఉపాధి హామీ పథక సిబ్బంది బాధ్యతగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ మైలవరపు వీఆర్ కృష్ణతేజ అన్నారు. జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో పనిచేసే క్షేత్ర సహాయకులకు ఆదివారం టౌన్ హాలులో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కనీసంగా రూ.300 కూలీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రతి కుటుంబానికీ వంద రోజుల పని కల్పించాలని తెలిపారు. కూలీల హక్కులు, క్షేత్ర సహాయకులు, మేట్ల విధులు, బాధ్యతలు, జాబ్ కార్డు, పనుల కల్పన, ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా మస్టర్ నిర్వాహణ తదితర అంశాల గురించి వివరించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కమిషనర్ తెలిపిన పేరామీటర్స్ను అనుసరించి జిల్లా ప్రగతికి దోహదం చేయాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఫరం పాండ్ నిర్మాణానికి గ్రామాల్లోని నాయకులతో కలిసి విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈజీఎస్ డైరక్టర్ వి.కె.షణ్ముక్కుమార్, అదనపు కమిషనర్ మల్లెల శివప్రసాద్, పథక సంచాలకులు యం.సిద్ధలింగమూర్తి, నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి, వినుకొండ క్లస్టర్ల సహాయ పథక సంచాలకులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రకాష్నగర్లో ఉంటున్న మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా గృహాన్ని సందర్శించారు. వారికి గుప్తా మెమెంటోను అందజేశారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ నిధులతో కొత్తపాలెం నుంచి కోటప్పకొండ వరకు చేపట్టిన రోడ్డును పరిశీలించారు. కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ -
రసవత్తరంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో గల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 96వ జయంత్యుత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రసవత్తరంగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 5,278 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరికి చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన దివ్యశ్రీ ఎడ్ల జత 3,027 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన ప్రసన్నాంజనేయ ఎడ్ల జత 2250 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. సోమవారం వ్యవసాయ విభాగంలో పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ పందేలు చూడటానికి వచ్చే రైతులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.