breaking news
Palnadu
-
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరు తొలగింపుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వీసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంబటి మురళీ కృష్ణను టీఎన్ఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. అంబటి మురళీకృష్ణ కారుపై దాడికి టీఎన్ఎస్ఎఫ్ నేతలు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో టీఎన్ఎస్ ఎఫ్ నేతలు వాగ్వాదానికి దిగారు. యూనివర్సిటీ వీసీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా అధికారులు తలుపులు మూసేశారు.ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పాలకులు అనుసరిస్తున్న విధానాలు విద్యావేత్తలు, మేధావులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం నాడు వర్సిటీలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు.. నేడు ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న మహానేత పేరును తొలగించి వివాదాలకు తెరలేపారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలగ కొనసాగుతున్న పేరును మార్చాలని టీడీపీ విద్యార్థి విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బుధవారం వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావును కోరారు. వారు కోరిన 24 గంటల్లోనే గురువారం క్రేన్ను రప్పించి ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కళాశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తొలగించడం దుర్మార్గ చర్య అని వైఎస్సార్సీపీ మండిపడింది. ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్ సెనేట్ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని, నేటి పాలకులు డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగించటం బాధాకరమని వర్సిటీ మాజీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. -
వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలి
ఏఎన్యూ (పెదకాకాని): ఏఎన్యూలోని ఇంజినీరింగ్ కళాశాలకు మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తొలగించడం అన్యాయమని, తక్షణమే వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాయకులు వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎ. రవిచంద్ర మాట్లాడుతూ... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలకు 2009 లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారన్నారు. అప్పటి వీసీ హరగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో 11 మందితో కమిటీ వేశారన్నారు. యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో, అకడమిక్ సెనెట్లోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఇంజినీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరు పెట్టారని గుర్తు చేశారు. పాలకమండలి తీర్మానం లేకుండా ఆ పేరు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వైఎస్సార్ పేరు తొలిగించాలని చెప్పిందని వీసీ, రిజిస్ట్రార్ లు ఇరువురూ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ పేరుంటే వెబ్ ఆప్షన్స్లో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఉన్నతాధికారులు చెప్పడం వింతగా ఉందన్నారు. కళాశాల కోడ్, లాండ్ మార్క్ రెండూ ఉంటాయని వీసీని ప్రశ్నించారు. పదేహేనేళ్లుగా లేని ఇబ్బంది ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలు వినతి పత్రం ఇవ్వగానే వైఎస్సార్ పేరు ఎందుకు తొలిగించారన్నా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతోపాటు ఆయన స్వహస్తాలతో ప్రారంభించడంతో పాటు వాటి అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందజేశారని గుర్తు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ అరాచక పాలన చివరికి యూనివర్సిటీల్లో కూడా యథేచ్ఛగా కొనసాగుతోందని విమర్శించారు. వైఎస్సార్ పేరు ఇంజినీరింగ్ కాలేజీతోపాటు విద్యార్థులకు ఇచ్చే రీసెర్చ్ ఫెలోషిప్కి కూడా వైఎస్సార్ పేరు పెట్టారని గుర్తు చేశారు. తొలగించిన పేరుని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఏఎన్యూ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పంతగాని రమేష్, యూనివర్సిటీ అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, నాయకులు భాను కిరణ్, చందు, శ్రీనివాస్, అరుణ్, మదన్ తదితరులు పాల్గొన్నారు. ఏఎన్యూ వీసీకి వైఎస్సార్ విద్యార్థి విభాగం వినతిపత్రం -
అంబటికి ఎమ్మెల్సీ తోట పరామర్శ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటి వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్పష్టించిన దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. టీడీపీ మూకల విధ్వంస కాండలో ధ్వంసమైన గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కాపు నాయకులు దాసరి రాము శుక్రవారం సందర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మార్చి 3, 4 తేదీలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీజీవోస్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగూల్ షరీఫ్, జిల్లా ఉమెన్ వింగ్ చైర్ పర్సన్ ఎస్ కె తాజున్నీసా, కన్వీనర్ ఎం విజయలక్ష్మీ, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నామినేషన్ల ఉపసంహరణ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ శుక్రవారం జరిగిందని ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సెక్రటరీకి ఇద్దరు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు 11 మంది (పురుషులు), ముగ్గురు (మహిళలు) పోటీలో ఉన్నారని, వైస్ ప్రెసిడెంట్ (దామా మహేశ్వరరావు), జాయింట్ సెక్రెటరీకి (పాకనాటి ఉమామహేశ్వరరావు), ట్రెజరర్కి (కండె కాంతారావు)ల నామినేషన్లు ఒక్కొక్కటి ఉన్నాయని, వారి పోస్ట్లు ఎన్నిక లేకుండా ఏకగ్రీవమైనట్లు చెప్పారు. స్టేడియం పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి సెకటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు సంబంధించి మార్చి 1న ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి అనంతరం లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందన్నారు. -
వైఎస్సార్ సీపీ విభాగాలకు సారథుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులు వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బీరవల్లి శివారెడ్డి (గురజాల) నియమించారు. జిల్లా వలంటీర్ల విభాగ కమిటీ.. అలాగే జిల్లా వలంటీర్ల విభాగంలో జిల్లా ఉపాధ్యక్షులుగా దొండేటి ఆదిరెడ్డి (గురజాల), జిల్లా ప్రధాన కార్యదర్సిగా గజ్జల గోవిందరెడ్డి ( వినుకొండ), కార్యదర్శులుగా మందా సునీల్బాబు (గురజాల), అన్నారెడ్డి సుబ్బారెడ్డి (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గుంటి కోటేశ్వరరావు, షేక్ జిలాని (గురజాల), పట్టా బ్రహ్మారెడ్డి, కోటపాటి ఉన్నురా రెడ్డి (వినుకొండ) నియమితులయ్యారు. జిల్లా పంచాయతీరాజ్ వింగ్ కమిటీ జిల్లా పంచాయతీరాజ్ వింగ్ ఉపాధ్యక్షులుగా కంచర్ల వెంకటేశ్వర్లు (వినుకొండ), కార్యదర్సిగా జక్కిరెడ్డి సుబ్బారెడ్డి (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ఇనుమునూరి ఏడుకొండలు రెడ్డి, పురేటి నాగేశ్వరరావు (వినుకొండ) నియమితులయ్యారు. జిల్లా వాణిజ్య విభాగ కమిటీ జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా కలవాల జానకీరామారావు (వినుకొండ), కార్య దర్శిగా గ్రంథిశీల హనుమంతరావు (వినుకొండ), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గుండా వెంకట రామ సురేష్బాబు, నేరెళ్ల శ్రీనివాసరావు (వినుకొండ) నియమితులయ్యారు. జిల్లా రైతు విభాగ కమిటీ జిల్లా రైతు విభాగ ఉపాధ్యక్షులుగా కొమ్మిశెట్టి రామారావు (వినుకొండ), సెక్రటరీగా మోపూ రు నర్సారెడ్డి (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా బత్తుల చిన గోవిందయ్య, పోగుల కోటయ్య (వినుకొండ) నియమితులయ్యారు. జిల్లా పబ్లిసిటీ వింగ్ కమిటీ జిల్లా పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షులుగా బాదం కృష్ణారెడ్డి (వినుకొండ), కార్యదర్శులుగా దూదేకుల హస్సన్, దూదేకుల జానయ్య (వినుకొండ), ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చిట్టి గురవారెడ్డి (వినుకొండ) నియమితులయ్యారు. జిల్లా బూత్ వింగ్ కమిటీ జిల్లా బూత్వింగ్ కమిటీ ఉపాధ్యక్షులుగా అర్తీటి శివ (వినుకొండ), సెక్రటరీగా గుర్రం గోవిందరాజులు (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ఆళ్ల పుల్లారావు, దొప్పలపూడి పిచ్చారావు (వినుకొండ) నియమితులయ్యారు. -
ఇండోనేషియా బాల్బ్యాడ్మింటిన్ పోటీల్లో లిఖిత విజయం
శావల్యాపురం: అంతర్జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో ముక్కపాటి లిఖిత విజయం సాధించినట్లు కోచ్ రాగుల రాధా కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ నెల 14 నుంచి 19 వరకు ఇండోనేషియా దేశంలో జరిగిన అంతర్జాతీయ ఇండియా బాల్బ్యాడ్మింటన్ టెస్టు సిరిస్లో సీనియర్ విభాగంలో బాలికల పోటీల్లో విజయం సాధించి ప్రశంసా పత్రం, గోల్డ్ పతకం అందుకొని దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిందన్నారు. కనమర్లపూడి గ్రామానికి చెందిన ముక్కపాటి లిఖిత శావల్యాపురం జడ్పీ ఉన్నత పాఠశాల్లో 10 తరగతి వరకు విద్యాభ్యాసం చేసింది. ప్రాథమిక దశ నుంచి విద్యతో పాటు అంచెంచెలుగా క్రీడల్లో రాణిస్తూ మండలస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎదిగింది. పల్నాడు జిల్లా నుంచి ఏకై క యువతిగా గుర్తింపు పొందింది. ఇండోనేషియా దేశం వెళ్లడానికి ఖర్చుల నిమిత్తం 1991–92 పదో పూర్వ విద్యార్థుల వ్యాయామ ఉపాధ్యాయులు పురిమెట్ల అజీం, కొర్నేమల్లి సాంబశివరావు గ్రామస్తులు, దాతలు, తన స్నేహితులు ప్రోత్సాహంతో ప్రవాసా భారతీయులు పోట్లూరు వాసి పూర్వ విద్యార్థి నన్నూరి రాఘవ తనవంతు సాయం అందజేశారు. తండ్రి కోటయ్య అనారోగ్యంతో మృతి చెందిగా, తల్లి మంచానికి పరిమితమైంది. తాతాయ్య–నాయనమ్మ తన అక్కయ్య కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో తాను అనుకున్న లక్ష్యాలను సాధిస్తోంది లిఖిత. -
సెపక్ తక్రా విజేత యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల
సత్తెనపల్లి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల సెపక్ తక్రా పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని విద్యాకేంద్రం డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు.ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు పాల్గొనగా నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో పోటీలు జరిగాయి. విజేతగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సాధించగా ద్వితీయ స్థానాన్ని వాసవీ డిగ్రీ కళాశాల నరసరావుపేట సాదించింది అదే విధంగా తృతీయ స్థానాన్ని ప్రగతి డిగ్రీ కళాశాల సత్తెనపల్లి సాధించింది. విజేతలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పి.పి.యస్పాల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. వారితో పాటుగా ఏజీకేఎం కళాశాల రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వర రావు, సెలక్షన్ కమిటీ మెంబర్స్ ధనలక్ష్మీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సి.హెచ్.వెంకట్రావు, వై వేలంగిని రెడ్డి, కళాశాల డైరెక్టర్ షేక్ జానీ భాష, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి,ఆర్గనైజ్ సెక్రెటరీ పుచ్చకాయల శివరామకృష్ణ, క్రీడాకారులు, పాల్గొన్నారు. -
తొలిసారిగా నృసింహస్వామి రథోత్సవం రద్దు
మంగళగిరి టౌన్: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన మంగళగిరిలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1వ తేదీన పొన్నవాహనం, 2వ తేదీ కల్యాణ మహోత్సవం జరగనుంది. 3వ తేదీన జరిగే రథోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో సునీల్కుమార్ మాట్లాడుతూ మూడవ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి రథోత్సవాన్ని ప్రారంభించాల్సి ఉండగా చంద్ర గ్రహణం కారణంగా ఆగమ శాస్త్ర పెద్దలు నిర్ణయించిన మేరకు, వారి సూచనల మేరకు రద్దు చేస్తున్నామని, భక్తుల కోసం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు స్వామివారిని రథంపై నుంచే దర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఎప్పటిలాగే రథాన్ని అలంకరించి శాస్త్రోక్తంగా స్వామివారిని అధిష్టింపచేస్తామని పేర్కొన్నారు. -
మిర్చి యార్డు చైర్మన్గా అప్పారావు బాధ్యతల స్వీకరణ
గోళ్ళపాడు (ముప్పాళ్ల): గోళ్లపాడు గ్రామంలో వేంచేసియున్న ప్రసన్నాంజనేయస్వామి 34వ జయంతి తిరునాళ్ల ఈ నెల 23వ తేదీన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. తిరునాళ్ళలో భాగంగా 21వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆలయంలో హరే రామ నామ సంకీర్తన ఏకాహం, ప్రసన్నాంజనేయ స్వామి వారి గ్రామోత్సవం, 22న స్వామి వారికి సకల నదీజల పంచామృత స్నపన, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. 23న హనుమద్దీక్ష విరమణ, సామూహిక ఆకు పూజలు, పొంగళ్ళు సమర్పణ, సాయంత్రం హనుమత్జ్యోతి దర్శనం, తిరునాళ్ల జరుగుతుందన్నారు. -
అక్షరాల అద్భుతం...ప్రకృతి సందేశం
● సామరస్య రమజాన్..భక్తిమయ లెంట్ ● భిన్నమతాల ఉపవాస దీక్షల సంగమం యడ్లపాడు: విశ్వాసాల బాటలు వేరైనా పరమాత్మను చేరుకోవాలనే తపన ఒక్కటేనని చాటిచెబుతూ.. కాలచక్రం ఈ ఏడాది ఒక అరుదైన ఆధ్యాత్మిక అద్భుతాన్ని ఆవిష్కరించింది. గగనతలంలో సూర్యచంద్రుల గమనాలు వేరైనా రెండు వేర్వేరు ధర్మాల ఉపవాస దీక్షలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. చాంద్రమాన గణనతో ఏటా 11 రోజులు ముందుకు జరిగే రమజాన్ మాసం, సూర్యమాన ఆధారిత లెంట్ దీక్షలతో అరుదైన ఖగోళ వింత కారణంగా, హిజ్రీ 1447 నెలవంక దర్శనం, క్రైస్తవుల యాష్ వెడ్నెస్ డే ఒకే రోజైన ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యాయి. గ్రెగోరియన్, హిజ్రీ కాలచక్రాల అద్భుత కలయికతో రెండు భిన్న ధర్మాలు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఏకకాలంలో మొదలుపెట్టడం విశేషం. 1993 నాటి ఆ అరుదైన స్మృతి, మళ్ళీ 2026లో మళ్లీ పునరావృతమైంది. సరిగ్గా 33 ఏళ్ల తర్వాత ప్రకృతి ప్రసాదించిన ఈ మౌన సందేశం సర్వమత సామరస్యానికి, ఐక్యతకు పతాక చిహ్నంగా నిలుస్తోంది. రెండు ధర్మాలు..ఒకే లక్ష్యం మార్గాలు వేరైనా, ఈ రెండు మతాల ఉపవాస దీక్షల అంతిమ లక్ష్యం ఒక్కటే. వాటి మధ్య ఉన్న పోలికలు అద్భుతమైన మానవీయ విలువలను చాటిచెబుతున్నాయి. రమజాన్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు కూడా ముట్టకుండా ముస్లింలు కఠినమైన రోజా పాటిస్తే, లెంటెల్ కాలంలో 40 రోజుల పాటు భోజనాన్ని త్యాగం చేస్తూ, ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు. ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు సంపదను పంచుతుంటే, క్రైస్తవులు తమ పొదుపును ధర్మకార్యాల ద్వారా ఆర్తులకు అందజేస్తారు. ఈ రెండింటిలోనూ భక్తులు ప్రాపంచిక సుఖాలను వీడి, దానధర్మాలను చేస్తూ దేవుని దగ్గరయ్యేందుకు ఆయన ఆజ్ఞలను పాటించడమే. సామరస్యానికి వారధి ఒకే సమయంలో మసీదుల నుంచి అజాన్ వినబడటం, చర్చిల నుంచి ప్రార్థనా గీతాలు ఆలపించడం సమాజంలో ఐక్యతకు పతాక చిహ్నంగా మారుతోంది. రెండు మతాల్లో వేర్వేరు నమ్మకాలు ఉన్నప్పటికీ, అందరూ ఒకేసారి ఉపవాస దీక్షల్లో ఉండటం వల్ల పరస్పర గౌరవం, శాంతి పెంపొందుతాయని మత పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. ఈ 33 ఏళ్ల అరుదైన సమయం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ దీక్షల్లోని తొలి శుక్రవారం ముస్లింలతో మసీదులు, క్రైస్తవులతో చర్చీలు నిండి కళకళలాడాయి. నిజంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందర్భమని ఇరుమతాలకు చెందిన పెద్దలు చెబుతున్నారు. -
బాబూ..వరాల మాటేమిటి?
చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు ● వినుకొండకు వెటర్నరీ కాలేజ్ మంజూరు చేస్తామని వరం ● శావల్యాపురంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుచేస్తామని హామీ ● ట్రామా కేర్, 100 పడకల ఆసుపత్రులను మంజూరు చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● రెండేళ్లుగా వాటి పనులు చేపట్టకుండా కుట్రలు ● నేడు చంద్రబాబు వినుకొండ పర్యటన సాక్షి, నరసరావుపేట: హామీలివ్వడం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఓటర్లను మభ్యపెట్టడం బాబు నైజం. వెనుకబడిన పల్నాడు జిల్లాలో మరింత వెనుకబాటుకు గురైన వినుకొండ నియోజకవర్గానికి చంద్రబాబు ఎన్నో హామీలను ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా వాటిని అమలు చేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినుకొండ పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల 70 ఏళ్ల చిరకాల కోరిక వరికపూడిశెల ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టు చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తుంది. అధికారంలోకి వస్తే వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మిస్తామంటారు... వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు అయితే పల్నాడు వాసుల ఓట్ల కోసం వరికపూడిశెలకు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారు. యువగళం పేరిట పాదయాత్ర చేసిన నారా లోకేష్ వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద వరికపూడిశెల ప్రాజెక్టు హామీనిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని రెండేళ్లు అవుతున్నా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగు, లక్షమందికి తాగునీరు అందించే విధంగా డీపీఆర్ను రూపొందించి అవసరమైన కేంద్ర అనుమతులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. 2023 నవంబర్లో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులను పక్కనపెట్టారంటూ వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు నేతలు ఆరోపిస్తున్నారు. తాజా బడ్జెట్లో సైతం ఈ ప్రాజెక్టు పనులకు ఒక్క రూపాయి విడుదల చేయలేదంటే ఈ ప్రాజెక్టు పట్ల వారి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు వినుకొండలో వరికపూడిశెలపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని, త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వినుకొండ పట్టణంలో వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కాలేజీ ప్రారంభం కాలేదు. మరో వైపు శావల్యాపురంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం హోదాలో ప్రకటించిన చంద్రబాబు ఆ ఊసే మరచిపోయారని ఆ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వినుకొండలో లెదర్ పార్క్ తెచ్చామంటూ తెగ హడావుడి చేశారు. స్థానిక టీడీపీ నేతలు ప్రకటనలు, ప్రసంగాలు చేశారు. తీరా చూస్తే ఆ లెదర్ పార్క్ ఏమైందో, దాని ఆచూకీ ఎవరూ చెప్పడంలేదు. వెనుకబడిన వినుకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు సదుపాయాలతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సహకార సమ్మెను ఉధృతం చేస్తాం
రొంపిచర్ల: సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంస్థ ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాలుగవ రోజుకు చేరింది. రెండు నెలలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 60 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. శుక్రవారం నరసరావుపేట జీడీసీసీ బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు పలు ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. జీవో నెం.36ను అమలు చేయాలని డిమాండ్చేస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్ర చేస్తామని హెచ్చరించారు. ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. నరసరావుపేట జీడీసీసీ బ్యాంక్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సీఈవోలు కంటు శ్రీనివాసరావు, దొప్పలపూడి శ్రీనివాసరావు, రామాంజనేయులు, రహీం, రమేష్, తోట రాంబాబు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జీడీసీసీ బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు ఆందోళన -
వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే ముఖ్యం
● విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, జిల్లా పరిశీలకులు గౌతమ్రెడ్డి ● ప్రతి నియోజకవర్గంలో జగనన్న సైన్యం ఏర్పాటు నరసరావుపేట: వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే ముఖ్యమని, కింది నుంచి పైస్థాయి వరకు వీరందరిని గుర్తించాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా పరిశీలకులు పూనూరి గౌతమ్రెడ్డి, ఇతర నాయకులతో కలసి గోపిరెడ్డి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఏడు నుంచి ఎనిమిది వేల మందితో జగనన్న సైన్యాన్ని ఈనెలాఖరులోపు తయారుచేయటం పూర్తవుతుందన్నారు. ప్రతి కార్యకర్తకూ గుర్తింపు కార్డులు పార్టీ కేంద్ర కార్యాలయంలో డిజిటలైజేషన్ చేయటం జరుగుతుందన్నారు. వీరందరూ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని కేంద్ర కార్యాలయం పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే సుమారు 70 శాతం నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ప్రతి ఒక్కరికీ వచ్చే ఏప్రిల్, మే నెలల్లో గుర్తింపు కార్డులు అందజేస్తారని తెలిపారు. కమిటీలో ఉన్న ప్రతి సభ్యుడికి సాధారణ, ప్రమాద బీమా అందిస్తారన్నారు. దీని తర్వాత రెండో ఫేజ్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమౌతుందన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి సైతం బీమా చేస్తారన్నారు. జూలై 12న వైఎస్సార్ జయంతి నాటికి అన్నీ పనులు పూర్తిచేస్తారన్నారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో మంచి స్పందన లభిస్తుందన్నారు. ఏడు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరేస్తాం జిల్లా పరిశీలకులు పూనూరి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యాలయం ప్రారంభించి ఇక ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలనే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాము ఇక్కడ సమావేశమయ్యాని చెప్పారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరాలనే లక్ష్యానికి తామంతా కంకణబద్ధులై ఉన్నామన్నారు. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారానికి నామరూపాలు లేకుండా పోతారు తిరుపతి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా జంతు కొవ్వు కలిసిందని చెప్పటం మొదటి తప్పన్నారు. సీబీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినప్పటికీ కర్నూలు సభలో మళ్లీ జంతువు కొవ్వు, బాత్రూమ్లు క్లీన్చేసే లప్సా కలిసిందని అబద్ధాలు చెప్పటం చాలా దారుణం అన్నారు. ఇవన్నీ ప్రజలను మరోసారి మోసం చేయటానికే చేస్తున్నాడన్నారు. ఆ దేవ దేవుడు వెంకటేశ్వరుడితో పెట్టుకున్న వారెవరూ ఇంతవరకు బాగుపడలేదని, ఆ భగవంతుడికి ఆ శక్తి ఉందని, వారు నామరూపాలు లేకుండా పోవటం ఖాయమని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్) 20 ఏళ్ల కిందట ప్రకటించిన విధంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు రూ.లక్ష, ఇద్దరు ఉంటే రూ.30వేలు చొప్పున రూ.60వేలు ఇవ్వాల్సి వుందన్నారు. శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,39,943 మంది బాలికలు ఆనాడు నమోదు చేసుకున్నారన్నారు. వీరికి గాను ప్రస్తుత ప్రభుత్వం రూ.4,400 కోట్లు చెల్లించాల్సి వుందన్నారు. వీరందరూ ఇప్పుడు కలెక్టర్లకు అర్జీలు పెట్టినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు యెనుముల మురళీధర్రెడ్డి, పడాల శివారెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, నూతలపాటి హనుమయ్య పాల్గొన్నారు. -
వివక్ష లేకపోవడమే సామాజిక న్యాయం
గుంటూరు లీగల్: కుల, మత, లింగ, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు, అణగారిన వర్గా లు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవం దక్కడం, ఏ రంగంలోనైనా వివక్ష లేకుండా సమాన హక్కులను కలిగి ఉండడమే సామాజిక న్యాయం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పేర్కొన్నా రు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంపై న్యాయ విజ్ఞాన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందే న్యాయపరమైన హక్కుల గురించి వివరించారు. లోక్ అదాలత్ ద్వారా దీర్ఘకాలంగా ఉన్న న్యాయపరమైన సమస్యలను రాజీ దిశగా పరిష్కారం కోసం కృషి చేయడం, అవగాహనా సదస్సుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపరంగా జరిగే న్యాయాల గురించి తెలియజేస్తామన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అమలులో ఉన్న పలు పథకాల గురించి వి వరించారు. అట్టడుగు వర్గాల సాధికారతపై అవగాహన కల్పించారు. అర్హులకు అవసరమైన కుల, ని వాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డు అందించడంలో సహకరించాలని తెలిపారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ -
శతాధిక వృద్ధురాలు మృతి
రొంపిచర్ల: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన శతాధిక వృద్ధురాలు మారెళ్ళ నాగమ్మ (104) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు తోడబుట్టిన సోదరులు మృతి చెంది ఏళ్ళు గడుస్తున్నా వంద సంవత్సరాలకు పైగా ఆమె జీవించడం గొప్ప విషయమని గ్రామస్తులు అంటున్నారు. ఆరోగ్యం పట్ల ఆమె తీసుకున్న జాగ్రత్తలు, ఈ వయస్సులో కూడా ఆమె వ్యక్తిగత పనులు చేసుకోవడం వల్ల ఇన్నాళ్లు జీవించారని అనుకుంటున్నారు. మృతురాలికి కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లు ఆమె సోదరుల కుమారులు, కుమార్తెలు కలిసి 100 మందికి పైగా ఉంటారు. -
జాతీయ రహదారిపై ఆటో బీభత్సం
యడ్లపాడు: మండలంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం సినిమా ఫక్కీలో ఆటో ఒకటి.. కారును ఢీకొంది. అదుపుతప్పిన కారు ముందున్న బైక్ను కూడా ఢీకొంది. వరుస ప్రమాదాలకు కారణమైంది. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న దంతులూరు (తెనాలి) వాసి జి. నాగేశ్వరరావు తన పదేళ్ల కుమారుడితో కలిసి ఓ శుభకార్యానికి ఏలూరు వెళ్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో యడ్లపాడు మండలం తిమ్మాపురం కొత్త బైపాస్ వద్ద వేగంగా వచ్చిన ప్యాసింజర్ ఆటో వీరి కారును వెనుకవైపున ఢీకొంది. అదపుతప్పిన కారు ఎదురుగా ఆగి ఉన్న బైక్ను ఢీకొంది. అంతటితో ఆగక హైవే డివైడర్ మీదుగా నక్కవాగు సమీపంలో కాల్వలోకి వెళ్లి బోల్తా పడింది. తిమ్మాపురం నక్కవాగు లిప్ట్ చప్టా వద్ద ప్రమాదం జరిగింది. కారు, ఆటో ముందుభాగాలు, బైక్ వెనుక భాగం ధ్వంసం అయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే అక్కడ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో ఉన్న తండ్రీకొడుకులు సీటు బెల్టు ధరించడం, ఎయిర్ బ్యాగ్లు సకాలంలో తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. యడ్లపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రాంబాబు, బైక్ నడుపుతున్న చినకోండ్రుపాడు వాసి బాలరాజులు తీవ్రంగా గాయపడ్డారు. హైవే పోలీసులు వచ్చి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్యం చేరని పన్ను వసూళ్లు
జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లలో సత్తెనపల్లి మున్సిపాలిటీ అధికారులు చతికిలపడ్డారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి సుదూరంగా నిలిచారు. మరో 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో లక్ష్య సాధన ప్రశ్నార్థకంగా మారింది.సత్తెనపల్లి: మున్సిపాలిటీల పరిధిలో పన్నుల వసూళ్లు కీలకంగా మారాయి. ఆస్తి, నీటి పన్నులతో పాటు ట్రేడ్ లైసెనన్సు ఫీజుల వసూళ్లు సక్రమంగా సాగాలి. అయితే సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం.పేరుకుపోయిన బకాయిలు2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో కేవలం 17.54 శాతం మాత్రమే ఆస్తి పన్ను వసూలైంది. అత్యధికంగా దాచేపల్లి మున్సిపాలిటీ 41.40 శాతం వసూళ్లు చేపట్టగా .. అత్యల్పంగా చిలకలూరిపేట 10.80 శాతంతో చతికిలబడింది. జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో 1,35,846 అసెస్మెంట్లు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5,161.52 లక్షలు డిమాండ్ ఉంది. దీనికి తోడు ఎరియర్స్ రూ. 1,380.26 లక్షలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు కరెంటు డిమాండ్లో రూ.3,151.23 లక్షలు, ఎరియర్స్లో రూ. 295.89 లక్షలు వెరసి రూ. 3,447.12 లక్షలు వసూలు అయ్యాయి.ప్రభుత్వ శాఖలపై ఉదాసీనత...జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పన్నుల బకాయలు పేరుకుపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే సామాన్యుల ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. కేవలం నోటీసులు ఇచ్చి పన్ను వసూళ్లను గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.టాప్ టెన్లో బడాబాబులు ...జిల్లాలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్న వారు మున్సిపాలిటీలకు సకాలంలో పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్నట్లుగా తెలుస్తోంది. బకాయిల టాప్ టెన్ జాబితాలో బడా బాబులే ఉండడం ఇందుకు నిదర్శనం. వారిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఒకవేళ చర్యలకు శ్రీకారం చుట్టినా టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీవ్రమవుతాయనే భయం అధికారులను వెన్నాడుతోంది. వీటికి తోడు డోర్ లాక్ట్ ఇళ్లు అధికంగా ఉండడం కూడా సమస్యగా మారింది.జిల్లాలో వసూలు కావాల్సిన ఆస్తి పన్ను (పాత బకాయిలతో కలిపి..)జిల్లా: అసెస్మెంట్లు, డిమాండ్ (రూ.లక్షల్లో) , వసూలు శాతంనరసరావుపేట: 28,539 1,853.89 26.80మాచర్ల: 15,395 734.93 26.20చిలకలూరిపేట: 25,431 1,247.56 10.80సత్తెనపల్లి: 16,546 834.70 22.30పిడుగురాళ్ల: 15,899 759.53 18.80దాచేపల్లి:10,691 292.83 41.40గురజాల: 8,132 168.16 26.60వినుకొండ: 15,213 650.18 22.40 -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్ష కేంద్రాలలో 34,376 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం 16,594, ద్వితీయ సంవత్సరం 15,628 మంది ఉన్నారు. ఒకేషనల్లో తొలి ఏడాది వారు 1,146, ద్వితీయ సంవత్సరం వారు 1,008 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 814 మంది ఇన్విజిలేటర్లు, మూడు ఫ్లయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్లను, ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టమెంట్ ఆఫీసర్ను నియమించారు. ఆయా పరీక్ష కేంద్రాలకు ఇప్పటికే సామగ్రి అందించారు. ప్రశ్నపత్రాలు కేంద్రాలకు సమీపంలోని పోలీస్స్టేషన్లకు చేరుకున్నాయి. నిర్వహణలో పొరపాట్లు, మాస్ కాపీయింగ్కు తావులేకుండా ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. హాల్ టిక్కెట్లు పొందేందుకు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాస్తున్న విద్యార్థులు http://bie.ap.gov.in సైట్లో లాగిన్ కావాలి. టెన్త్ హాల్ టిక్కెట్ నంబరు ఎంటర్ చేసి ఇంటర్ హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు ప్రథమ సంవత్సర హాల్ టిక్కెట్ నంబరు, ఆధార్, పుట్టిన తేదీ వివరాలతో హాల్ టిక్కెట్ పొందవచ్చు. మనమిత్ర వాట్పాప్ నంబరు 95523 00009 కు ‘ఏజీ’ అని మెసేజ్ పంపడం ద్వారా హాల్ టిక్కెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా ఓకే వెబ్సైట్, వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు పరీక్షల షెడ్యూల్, సబ్జెక్టుల వివరాలను సరి చూసుకోవాలి. హాల్ టిక్కెట్పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల స్టాంప్ అవసరం లేకుండా నేరుగా పరీక్షలు రాసేందుకు హాజరు కావచ్చు. ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా ఇంటర్మీడియేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు డీఐఈఓ ఎం.నీలావతిదేవి తెలిపారు. పరీక్ష సమయంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ 08647–223355 నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. విద్యార్థుల హాల్ టిక్కెట్లు జారీ చేశామన్నారు. వారికి కేటాయించిన కేంద్రం చిరునామాను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 8 గంటలకు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. 8.30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారని వివరించారు. ఉదయం 9 గంటల తరువాత వచ్చిన వారికి కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. – ఎం.నీలావతిదేవి, డీఐఈఓ, పల్నాడు జిల్లా -
22న రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు రాక
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ఈనెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా గుంటూరు రానున్నారు. బొమ్మిడాల నగర్లోని సత్యసాయి స్పిరిట్యువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తపాలా శాఖ ఉద్యోగుల సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా , గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్లు తపాలా శాఖ అధికారులతో కలసి గురువారం పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 8 వేల మంది తపాలా శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని, ఆ మేరకు అన్ని సౌకర్యాలు పక్కాగా ఉండాలని అన్నారు.గోవాడ కోటయ్య స్వామికి మహాశివరాత్రి ఆదాయం వేమూరు: గోవాడ గంగా పార్వతి సమేత బాల కోటేశ్వర స్వామి మహాశివరాత్రి తిరునాళ్లకు రూ.53,04,785 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాస్ వర్మ గురువారం వెల్లడించారు. అమర్తలూరు మండలం గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. హుండీ ద్వారా రూ.16,33,235, అభిషేకం ద్వారా రూ.8,85,100, దర్శనం ద్వారా రూ.10,46,450, ఖాళీ స్థలం, కొబ్బరి కాయలు, కొబ్బరి చిప్పల విక్రయం ద్వారా రూ. 18,40,000 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ అధికారి వి.అనుపమ, ఎంపీడీవో మారుతీ శేషాంబ, గ్రామ సర్పంచ్ మండవ విజయలక్ష్మి, దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుపెదకాకాని: గంగ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవంలో చివరిరోజు గురువారం భ్రమరాంబ అమ్మవారు పుష్పశయ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పెదకాకాని శివాలయంలో సుప్రభాతసేవ, హారతులు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదన జరిగాయి. సాయంత్రం పంచహారతులు, ద్వాదశ ప్రదక్షిణలు, పుష్ప శయనోత్సవం, ఫలప్రదానాలు, దంపతులకు తాంబూలాలు, పవళింపు సేవలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ కార్యదర్శిగా గోపిదేశితాడికొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సంయుక్త కార్య దర్శిగా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలానికి చెందిన గోపిదేశి శివ నాగేంద్ర శ్రీనివాస్ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి పదవిని అప్పగించినందుకు నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు(డైమండ్)కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. -
ఏఎన్యూ దూరవిద్యలో నూతన డిప్లమో కోర్సులు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నూతనంగా ఐదు డిప్లమో కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు సీడీఈ డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఏఎన్యూలో గురువారం ఆయన మాట్లాడుతూ అమెరికా కేంద్రంగా ఉన్న కనెక్ట్ కన్సల్టెంట్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. సంబంధిత పత్రాలపై వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, కంపెనీ సీఈవో ఎం. సుకుమార్ సంతకాలు చేశారు. డిప్లమో ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ డేటా ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ ఏఐ ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిప్లమో ఇన్ క్లౌడ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్ ఇంజినీరింగ్ కోర్సులను కొత్తగా ప్రకటించారు. సంవత్సరం కాల వ్యవధిలో వీటిని పూర్తి చేయవచ్చన్నారు. ప్రవేశానికి ఏదైనా డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియెట్లో గణితశాస్త్రం చదివి ఉండాలని స్పష్టం చేశారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల కొంగుబంగారం నేతి వెంకన్న
ఉత్సవాలకు సిద్ధమైన దేవస్థానం తిరుమల నుంచి తెచ్చిన స్వామి విగ్రహంరాజుపాలెం: జిల్లాలో పల్నాటి తిరుపతిగా వెలుగొందుతున్న దేవరంపాడు కొండ తిరునాళ్ల ఈ నెల 21 నుంచి మార్చి 19వ తేదీ వరకు కొనసాగనుంది. నాలుగు శనివారాలపాటు అత్యంత వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఉగాది పర్వదినంతో ఉత్సవాలు ముగుస్తాయి. మత్స్యరూపంలో దర్శనమిచ్చే శ్రీవెంకటేశ్వరుడికి భక్తులు మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఇక్కడికి తరలిరానున్నారు. ఏటా పాల్గుణ మాసం మొదటి శనివారం రోజున ఈ తిరునాళ్ల ప్రారంభం అవుతుంది. ఉగాది పండుగ రోజు ఉత్సవం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. దేవరంపాడు కొండపై ప్రధాన ఉత్సవాలు మూడవ, నాలుగో శనివారాలు అంటే మార్చి 7, 14వ తేదీల్లో జరగనున్నాయి. నేతి వెంకన్న స్వామిగా ప్రసిద్ధి గాంచిన వెంకటేశ్వరుడు మత్స్య రూపంలో స్వయంభూగా వెలసినందున విశిష్ట దైవమని భక్తుల నమ్మకం. పాపాలను నశింపజేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తారని విశ్వసిస్తారు. పశు సంపదకు, పాడి పంటలకు ఆరాధ్య దైవమైనందున సుమారు వందేళ్లుగా భక్తులు ఈ కొండపై స్వామిని పూజిస్తున్నారు. పశువులు ఈనిన తరువాత కవ్వం పెట్టగానే మూడు పూటలు గానీ, ఐదు పూటలు గానీ మీదు కట్టిన వెన్నను తెచ్చి స్వామివారికి పొంగళ్లు పొంగిస్తారు. ఆలయం చుట్టు పశువులను ప్రదక్షిణ చేయించి నెయ్యి, బియ్యం, పప్పు, బెల్లం వగైరాలు భక్తులు సమర్పిస్తారు. ఈ నెల 22వ తేదీన, 28న, మార్చి 7, 14, 19న వేడుకలు వైభవంగా జరగనున్నట్లు ఈవో గణపతి సురేష్ తెలిపారు. -
నల్లమలలో కార్చిచ్చు
అచ్చంపేట: నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో కార్చిచ్చు రాజుకుంది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట రేంజ్ వటువర్లపల్లి, ఈగలపెంట బీట్ పరిధిలోని తాటిగుండాల సెక్షన్లో తవిసిపెంట, వజ్రాలమడుగు ప్రాంతంలో సుమారు 60 హెక్టార్ల విస్తీర్ణంలో అడవికి నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిప్పుంటుకోగా గురువారం అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.శాటిలైట్ ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఫైర్ వాచర్లు, బేస్ క్యాంపు వాచర్లు, టైగర్ ట్రాకర్లు, బీట్ అధికారులు, శిక్షణాధికారులు బ్లోయర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. చీకటి పడటంతో బుధవారం రాత్రి మంటలు అదుపులోకి తేలేకపోయారు. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి పక్క నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. మంటలు చెలరేగిన ప్రాంతంలో ఎత్తయిన కొండలు, లోయలు ఉన్నాయి. దీంతో నడవలేని పరిస్థితి వల్ల మంటలు ఆర్పడం కొంత కష్టంగా మారింది.గురువారం ఎఫ్ఆర్వో గురుప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ఫోర్స్కు చెందిన 20 మంది సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాంతాల్లో గడ్డి, రాళ్లు ఎక్కువగా ఉండడంతో మంటలు చెలరేగాయి. పశువులు, గొర్రెల కాపరులు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 30 హెక్టార్ల విస్తీర్ణంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఇందులో గడ్డి మాత్రమే కాలిందని, చెట్లకు ఎలాంటి నష్టం జరగలేదని అటవీ శాఖ స్పష్టం చేసింది. -
కాలుదువ్వితే బహుమతి కొట్టేస్తాయి!
నాదెండ్ల: ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో పల్నాడు జిల్లా ఎడ్ల జత తెలంగాణలోనూ సత్తాచాటాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువులో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. బుధవారం న్యూకేటగిరి విభాగంలో జరిగిన పోటీల్లో 13 ఎడ్ల జతలు పాల్గొనగా, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ సర్పంచ్ మంగు రమాదేవి ఎడ్ల జత 5,367 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. ఎడ్ల యజమానులు రమాదేవి, ఏడుకొండలు రూ.90 వేలు నగదు, షీల్డును నిర్వాహకుల నుండి అందుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి ప్రథమస్థానం సాధిస్తూ విజయపరంపర కొనసాగించింది. ఇప్పటి వరకూ రెంటచింతల, దుర్గి, నాదెండ్లలో జరిగిన పోటీల్లో న్యూకేటగిరి విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాయి. గురువారం తెలంగాణ మంచిర్యాలలో జరుగుతున్న న్యూకేటగిరి విభాగంలో పాల్గొననున్నాయి. తెలంగాణలో బలం చూపిన జిల్లా ఎడ్లజత -
కొత్త పెన్షన్ రూల్స్ లబ్ధి చేకూర్చేవిగా ఉండాలి
సత్తెనపల్లి: కొత్త పెన్షన్ రూల్స్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేవిగా ఉండాలని ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు కొత్త పెన్షన్ రూల్స్–2026 లో ముసా యిదా విడుదలలో భాగంగా 1980 నుంచి ఉన్న వాటిని కాకుండా, 33 ఏళ్ల సర్వీసు నిండితే పబ్లిక్ ఇంటరెస్ట్ దృష్ట్యా రిటైరవ్వమని తెలియజేసే అధికారం, జీత నష్టం, సెలవు కాలాన్ని పెన్షన్ లెక్కింపునకు పరిగణనలోకి తీసు కొనబడదనే అంశం ఇబ్బంది కలిగించేలా రూపొందించటం తగదన్నారు. ముసాయిదా నిర్మాణంలో వ్యతిరేక అంశాలను చేర్చితే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పెద్ద ఎత్తున ఉద్యమకార్యాచరణ రూపొందిస్తామన్నారు. కొత్తచట్టాలు, ముసాయిదాలు ఎప్పుడూ పాతవాటికంటే మెరుగ్గా ఉండాలి కాని, ఉన్నవాటిని హరించే విధంగా ఉండకూడదన్నారు. హైడ్రోపోనిక్స్ సాగు పద్ధతులతో రైతులకు మేలుబాపట్ల: హైడ్రోపోనిక్స్ (మట్టి లేని) సాగు.. నేటి స్మార్ట్, సుస్థిర వ్యవసాయ పద్ధతులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి పేర్కొన్నారు. బాపట్లలోని డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో హైడ్రోపోనిక్స్ మట్టి లేని సాగు నేటి స్మార్ట్, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈశిక్షణ కార్యక్రమంలో డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి మాట్లాడుతూ ఈశిక్షణ శిబిరంలో 13మంది కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొనటం సంతోషకరమన్నారు. రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించటం ఉపయోగకరమన్నారు. ఈ హైడ్రోపోనిక్స్ మట్టి లేని సాగు వల్ల తక్కువ నీటి వినియోగంతో పంటను పండించుకోవచ్చని, అందువల్ల రైతులు మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. యూనివర్సిటీ పరిధిలోని 18 కాలేజీలు 33 పరిశోధన కేంద్రాల్లో ఈ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అసోసియేట్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డాక్టర్ ఎ.మణి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివనారాయణ, వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ పి.ప్రసన్న రాణి, అసోసియేట్ డీన్ డాక్టర్ ఈఈ స్మిత్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కృపావతి, డాక్టర్ జి.రవిబాబు, డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ ఎస్.విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ సంఘాల్లో మహిళల ప్రాతినిధ్యం కీలకం
●ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి ●మార్చి 7న విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో మహిళా ప్రాతినిధ్యం ఎంతో కీలకమని, వారి సలహాలు, సూచనలు ఎంతో ముఖ్యమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మార్చి 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి రామిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర మహిళా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న హేమలతతోపాటు గుంటూరు జిల్లా మహిళా కార్యవర్గం నూతన అధ్యక్షురాలిగా ఎన్నికై న షేక్ షబానా సుల్తానాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి పెద్ద రత్తయ్య, నగర శాఖ అధ్యక్షులు కరీముల్లా షా ఖాదరి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, లక్ష్మీనారాయణ, శోభన్ బాబు, అలీసు, వెంకటరమణ, గాయత్రి, హైందవి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
నేడు గుంటూరుకు అంబటి
● కార్యకర్తలూ తరలిరండి .. ఘన స్వాగతం పలుకుదాం.. ● వైఎస్సార్సీపీ పొన్నూరు అంబటి మురళీకృష్ణ పిలుపు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై గురువారం గుంటూరు రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రతి కార్యకర్త తరలిరావాలని వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్ధార్ధనగర్లోని అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ● అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ రాంబాబు నివాసంపై దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిందన్నారు. అంబటిపై దాడి చేసి టీడీపీ నేతలు తృప్తి చెందారని, ప్రజలు ఏమాత్రం హర్షించలేదన్నారు. ఈ ఘటన అనంతరం వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో మనోధైర్యం నింపిందని చెప్పారు. అందుకు ఆయనకు సర్వదా కృతజ్ఞతలని తెలిపారు. ● వైఎస్సార్సీపీ లీగల్ విభాగం ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేసిందని, వారి పనితీరుతోనే 36 కేసులు ఒక్క దెబ్బతో నిలుపుదల అయ్యాయని పేర్కొన్నారు. ● గురువారం కృష్ణా బ్యారేజీ వద్ద అంబటికి మంగళగిరి నేతలు స్వాగతం పలుకుతారని, అక్కడి నుంచి వచ్చిన తరువాత కాజ టోల్గేటు వద్ద గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరై ఆయనకు స్వాగతం పలుకుతారని తెలిపారు. పెదకాకాని నుంచి పొన్నూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో అంబటిని తోడుకొని వస్తారన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని, రాబోయే రోజుల్లో దుష్ట శిక్షణ తథ్యమని హెచ్చరించారు. ● వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ అంబటి రాంబాబును 18 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి, అనేరకాల ఇబ్బందులు పెట్టారన్నారు. ● తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను బిహార్ కంటే ఘోరంగా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఏడు గంటలపాటు పోలీసుల సాక్షిగా అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడేనన్నారు. ● అంబటి ధైర్యానికి, ఆయన సిద్ధాతాలకు అభినందనలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి వెనుక నుంచి వెళ్లిపోవాలని చెప్పిన నేపథ్యంలో తాను వెనుకడుగు వేయబోనన్న ఆయన మనోధైర్యం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ● పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలతోనే దాడి జరిగిందని, టీడీపీ నేతలు 18 రోజులపాటు పైశాచిక ఆనందాన్ని పొందారన్నారు. ● అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ కష్టకాలంలో అండగా నిలబడి ధైర్యం నింపిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా లీగల్ విభాగం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ● సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ లీల తెనాలి టౌన్: మాదకద్రవ్యరహిత సమాజ నిర్మా ణంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల సూచించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శ్రీ భారత్ ఫౌండేషన్, ఎకై ్సజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. అనంతరం గ్రామ పురవేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారి దేశ యువతను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వాటి నిర్మూలనకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఎకై ్సజ్ సూపరిండెంట్ వి.అరుణ కుమారి మాట్లాడుతూ, ప్రజా చైతన్యంతోనే మత్తు పదార్ధ రహిత సమాజాన్ని నిర్మించుకోగల మని అన్నారు. ఏఈఎస్ మారయబాబు మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి విక్రయాలు, సేవనం వివరాలు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. పొన్నెకంటి చక్రవర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభలో తెనాలి ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.వి.చలం, ఎకై ్సజ్ ఈగల్ ఎస్ఐ సునీల్, ఏపీ అసోసియేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీనివాస్, తన్నీరు కళ్యాణ్ కుమార్, నవజీవన్ బాల భవన్ నిర్వాహకురాలు కవిత, స్క్వేర్డ్ ఇన్స్పెక్టర్ నారాయణ తార, యడ్ల శ్రీధర్, గూడూరు చంద్రం, వల్లూరు అజయ్, గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరు వరప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు, ‘చిన్నారి స్నేహం‘ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. -
మణిపాల్ హాస్పిటల్కు ప్రతిష్టాత్మక అవార్డు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్ ది బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇన్ హెల్త్కేర్ అవార్డు గెలుచుకున్న ఆసుపత్రి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫన్ అండ్ జాయ్ సంస్థ, వరల్డ్ హెల్త్ అండ్ వెల్నెస్ కాంగ్రెస్ సహకారంతో ఈ అవార్డును ముంబయి నగరం తాజ్ల్యాండ్స్ ఎండ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి స్వీకరించారని పేర్కొన్నారు. రోగి క్షేమమే ప్రధానంగా వైద్యసేవల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు, హెల్త్కేర్ రంగంలో అగ్ర వైద్య సేవలు అందిస్తున్నందుకు ది బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇన్ హెల్త్కేర్ అవార్డు లభించిందని తెలిపారు. మణిపాల్ ఏఏహెచ్ఆర్పీపీ అక్రిడిడేషన్ పొందిందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ అశోక్కుమార్కు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న బి. అశోక్ కుమార్కు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. ఈ క్రమంలో అశోక్ కుమార్కు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పించి నంద్యాల జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2024 సెప్టెంబర్లో ఆయన గురజాల నుంచి సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టారు. గురువారం విధుల నుంచి రిలీవై నంద్యాల జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టనున్నారు. పదోన్నతి పొందిన అశోక్ కుమార్ ను కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. -
పెట్రోల్ బంకుల్లో కనీస వసతులు తప్పనిసరి
గుంటూరు వెస్ట్: పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు అవసరమైన కనీస సదుపాయాలనై తాగునీరు, మరుగుదొడ్లు, గాలి మెషిన్ తదితరవి ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో డిఎస్ఓ కోమలి పద్మతో కలిసి ఐఓసి, హెచ్పీసీ, బీపీసీ పెట్రోల్ బంకుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆయిల్ ట్యాంకర్లకు, మొబైల్ బౌజర్లకు తప్పనిసరిగా ఫామ్– ఎఫ్ లైసెన్స్లు పొందాలన్నారు. ఖాతాదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. బంకుల్లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోల్ బంకు యజమానులు తెలిపిన కొన్ని ఇబ్బందులపై జేసీ సానుకూలంగా స్పందించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ -
సీఎం పర్యటనలో లోపాలు రానివ్వద్దు
నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలతో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండలో పర్యటిస్తున్న నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర పర్యటనలో భాగంగా వినుకొండలోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న ప్రజా వేదికను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో సభావేదిక వద్ద ఆకర్షణీయమైన స్టాళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా డీఆర్డీఎ ద్వారా రూ.100 కోట్లు, మెప్మా ద్వారా రూ.50 కోట్లు రుణాలు ఇప్పించాలని ఎల్డీఎంకు సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ వినుకొండ: ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ కృష్ణారావు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక జూనియర్ కళాశాల ఆవరణ, హెలీప్యాడ్ వద్ద, సభా ప్రాంగణాన్ని, ప్రభుత్వ వైద్యశాలను, పలు ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం తది తర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎస్పీతో పాటు ఆర్డీవో మధులత, పట్టణ సీఐ ప్రభాకర్, రూరల్ సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా దిశానిర్దేశం -
ముగిసిన అమరేశ్వరుని బ్రహ్మోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన స్వామి వారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో పంచాహ్నిక దీక్షా బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు. అలాగే రాత్రి 10 గంటలకు నిర్వహించే ధ్వజావరోహణ కార్యక్రమంతో గురువారం నుంచి స్వామివారి ఏకాంతసేవ మహోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు వసంతోత్సవం అనంతరం స్వామివారిని పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.వైభవంగా అనంత భోగేశ్వర స్వామి తిరునాళ్ల కొల్లూరు : మహా శివరాత్రి వేడుకలలో భాగంగా కొల్లూరు అనంత భోగేశ్వర స్వామికి భక్తులు నీరాజనాలు పలికారు. అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం నిర్వహించారు. భక్తులు దైవ దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, దేవదాయ శాఖాధికారులు పర్యవేక్షణలో వేద పంతులు అనంత భోగేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన దేవతామూర్తులు ఉత్సవ విగ్రహాలతో మేళతాళాల నడుమ నిర్వహించిన రథోత్సవానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ పి.ఏడు కొండలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డపనేని రమేష్ రథోత్సవంలో పాల్గొన్నారు.దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను అందచేశారు. గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన కొండూరు కృష్ణమూర్తి, ఉమామహేశ్వరి అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,001 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.బగళాముఖి ఆలయంలో అమావాస్య హోమాలుచందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం రాత్రి 85వ అమావాస్య హోమాలు, విశేష పూజలు రుత్వికుల ఆధ్వర్యంలో జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ దంపతులు పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఆలయ కమిటీ చైర్మన్ చక్రధర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
పచ్చ నేతల పైసాచికం !
గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఒక వైపు డమరుక నాదాలు మార్మోగుతుంటే.. మరో వైపు టీడీపీ నేతలు కత్తి కట్టిన కోళ్లతో పందెం బరిలో రక్తం చిందించేలా చేశారు. ఒక వైపు ‘‘హర హర మహాదేవ’’ అంటూ భక్తులు నినదిస్తుంటే... మరో వైపు టీడీపీ నాయకులు అక్రమంగా మద్యం తెచ్చి సీసాలు గలగలమనిపించారు. ఒక వైపు భక్తులు కొండకు దారులు కడితే.. ఇంకోవైపు టీడీపీ నేతలు జూద శిబిరాలకు పేకాటరాయుళ్లను బారులుదీరేలా ఏర్పాట్లు చేశారు. భక్త కోటి తరలివచ్చి త్రికోటేశ్వరుని దర్శించుకునే వేళ చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకుల కారణంగా కోటప్పకొండ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఎన్నడూ లేని విధంగా కొండను అపవిత్రం చేస్తూ నాయకులు జేబులు నింపుకొన్నారు. నరసరావుపేట టౌన్: శివరాత్రి అంటే ఉపవాసం, జాగారం, శివనామస్మరణ. భక్తి, నియమం, నియంత్రణల సమ్మేళనం. ముఖ్యంగా కోటప్పకొండ వంటి పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేళ భక్తి పారవశ్యం తారస్థాయికి చేరుకుంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు కట్టుకుని ఎంతో భక్తితో శివయ్య పాదాల చెంతకు భక్తులు చేరుకుంటారు. కానీ అడుగడుగునా టీడీపీ నాయకులు ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అపవిత్రం చేశారు. భక్తజన సమూహాల మధ్య అసాంఘిక కార్యకలాపాలు బహిరంగంగా కొనసాగించారు. మహా శివరాత్రి పర్వదినాన కోటప్పకొండకు సుమారు పది లక్షల మందికిపైగా భక్తులు వస్తుంటారు. ఏటా ఒకటికి మించి మరొకటి భారీ విద్యుత్ ప్రభలు తరలివస్తాయి. భక్తులు కూడా తిరునాళ్ల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణానికి భిన్నంగా ఈ ఏడాది టీడీపీ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశారు. తిరునాళ్ల నిర్వహించే కొండ కింద ప్రాంతంలో పదుల సంఖ్యలో బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. నరసరావుపేట రూరల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కోటేశ్వరరావు స్వయంగా బెల్టుషాపు నిర్వహిస్తూ మద్యం విక్రయించడం గమనార్హం. దీంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కూడా బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకొని అక్రమంగా మద్యం విక్రయాలకు తెరతీశారు. అక్కడ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కారు. అతిగా మద్యం సేవించిన వారితో కొందరు భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఇన్నేళ్ల కొండ తిరునాళ్ల చరిత్రలో ఈ స్థాయిలో బహిరంగంగా మద్యం అమ్మకాలు చేసిన ఘటనలు లేవు. తిరునాళ్ల రోజు కొండ ప్రభలు ఏర్పాటు చేసే పరిసరాలలో బెల్టుషాపులు నిర్వహించేందుకు వేలం నిర్వహించినట్టు తెలుస్తోంది. టీడీపీ నాయకులకు డబ్బులు ముట్టచెప్పి బహిరంగంగా బెల్టుషాపులు నిర్వహించడం చంద్రబాబు మార్కు పాలనకు ఉదహరణగా నిలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నలలో బెల్టుషాపులు వెలవడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఈ పరిణామాల పట్ల హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఈ సంస్కృతి పునరావృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శివరాత్రి పర్వదినాన టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం తిరునాళ్లలో బెల్టు షాపులతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు రొంపిచర్లలో కోడి పందేలు, పేకాట శిబిరాలు ఏర్పాటు ఎక్కడా కనీసం అడ్డు కూడా చెప్పని అధికార యంత్రాంగం టీడీపీ నేతల ధనదాహంపై మండిపడుతున్న భక్తులు -
క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : జిల్లాలోని పోలీస్స్టేషన్లలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గడువు లోపు చార్జిషీట్లు న్యాయస్థానంలో దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సంబంధిత డీఎస్పీలు, సీఐలు, విచారణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గుర్తుతెలియని నేరస్తుల కేసులను తగ్గించేందుకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు. నమోదైన అన్ని కేసులలో ఈ– సాక్ష్య గుర్తింపు సంఖ్యలు సృష్టించాలని చెప్పారు. దాతలు, దుకాణ యజమానులు, ప్రముఖుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని అన్నారు. నేర ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి బీట్లు బలోపేతం చేయాలన్నారు. రౌడీషీటర్లపై బైండోవర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. -
అంబటిపై పథకం ప్రకారమే దాడి
●మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి ● గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు పరామర్శ నగరంపాలెం(గుంటూరు వెస్ట్) / పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మౌనిక, మనోజ్ఞలను మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు బుధవారం పరామర్శించారు. విధ్వంసమైన ఇల్లు, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ●మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ అంబటి రాంబాబుపై ఒక పథకం ప్రకారమే దాడికి ఒడిగట్టారని అన్నారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, 200 మందితో అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం వద్దకు వచ్చి విధ్వంసకాండ స్పష్టించడం ఏంటని ప్రశ్నించారు. ● ప్రజల ద్వారా ఎన్నికై న ప్రభుత్వమైతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలవుతుందని, కానీ ఈవీఎంల ద్వారా విచిత్రంగా కూటమి ప్రభుత్వంఎన్నికై ందని చెప్పారు. ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో చూడలేదన్నారు. ●ఈవీఎంలపై ఇటీవల ఒకరూ కూలంకుషంగా చెప్పారని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎన్నేసి ఓట్లు పడ్డాయనేది వివరించారని అన్నారు. ఒక నిమిషానికి ఎవరైనా తొమ్మిది ఓట్లు వేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలపై ఇప్పటి వరకు ఎల్లో మీడియా నోరు తెరవలేదని, వారికి పేపర్లు ఉన్నాయని, వారి చేతుల్లో మాఫియా ఉందని, డబ్బు ఉందని, మద్యం ఉందని ఆరోపించారు. ●రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ చంద్రబాబుకు రక్షణగా నిలిచారని ఆరోపించారు. ● 164 సీట్లతో గెలిచి ఏం సాధించారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పదేపదే తప్పులు చేస్తుందని, అయితే ఎల్లో మీడియా ఎందుకు ఇంతగా మౌనంగా ఉంటుదంటే ఒకరికి చైర్మన్ పదవి, ఒకాయనకు గుత్తేదారు పనులు, మరొకరికి వేల కోట్ల ఖరీదు చేసే భూములు అప్పగించారని ఆరోపించారు. దాడి హేయమైన చర్య... ● దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే కూటమి నేతలు వాటిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ● రాష్ట్ర హోం శాఖ మంత్రి మహిళ అయి ఉండి, మహిళలపై దాడిచేసి, ఒక హింసాత్మక వాతావరణం సృష్టిస్తే కనీసం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ● నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న అంబటి నివాసంపై దాడి హేయమైన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు గుండాలు అంబటి నివాసంపై దాడి చేశారన్నారు. కార్యక్రమంలో పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గంగాధరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కృపాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
జేసీబీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లే ప్రభల ముందు ప్రమాదకర విన్యాసాలు చేసిన జేసీబీని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కాకాని నుంచి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభను ఈ నెల 14వ తేదీన కోటప్పకొండకు తరలించారు. ఈ సందర్భంగా కోటప్పకొండ శివకుటుంబం జంక్షన్లో ప్రభ ఎదుట జేసీబీ చక్రాలను గాలిలోకి లేపి ప్రమాదకరంగా విన్యాసాలు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. పెట్లూరివారిపాలెంకు చెందిన జేసీబీని బుధవారం స్టేషన్కు తరలించారు. డ్రైవర్కు కౌన్సెలింగ్ చేశారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు. -
యంత్రాంగం విఫలం
కోటప్పకొండ తిరునాళ్లలోనరసరావుపేట: కోటప్పకొండ తిరునాళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర వైఫల్యం ఈ ఏడాది కనిపించిందని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ జామ్ కాకుండా లింక్ రోడ్లు బాగు చేయాలని సూచించినా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని విమర్శించారు. ఘాట్రోడ్డుకు కిలోమీటర్ అవతల ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడంతో 80 వేల మంది ఇబ్బంది పడ్డారన్నారు. వారికి తాగునీళ్లు కూడా లేవన్నారు. మెట్ల మార్గంలో రద్దీ వల్ల ఓ పాప ఊపిరాడని స్థితికి వెళ్లడం బాధాకరమన్నారు. కొండ వద్ద ప్రైవేట్ స్థలంలో ఎమ్మెల్యే, అనుచరులకు ఏం పనని ప్రశ్నించారు. చిరు వ్యాపారాల వద్ద రూ. వేయి నుంచి రూ.2 వేలను మూడు గ్రూపులుగా వసూలు చేయడం తగదన్నారు. మద్యం ఏరులై పారిందని, చివరకు హోంగార్డు కూడా అమ్మటం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో క్యాసినో నిర్వహించారన్నారు. కోటప్పకొండ ఆలయానికి కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రూ.1.90 కోట్ల కానుకల ఆదాయాన్ని కొండ అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. ఈఓ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి రూ.లక్షలు చేతులు మారుస్తున్నారని, దీంట్లో ఎమ్మెల్యేకి కూడా వాటాలు ఇస్తూ కాంట్రాక్టు పనులను చేస్తున్నారని ఆరోపించారు. భక్తులకు ఉచితంగా ఇవ్వడానికి 1.25 లక్షల లడ్డూలు తయారు చేశారని, 30 వేల మందికి మాత్రమే పంపిణీ చేశారన్నారు. ప్రకాశం జిల్లా యువకుడు కాలువలో కొట్టుకుపోతుంటే భద్రతా దళాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. గోనెపూడి నుంచి కొండకు వచ్చిన వైఎస్సార్సీపీ అభిమానుల ప్రభ దగ్గర ప్రజలు, పార్టీ అభిమానులు ఉండకూడదని ఉద్దేశంతో రూరల్ ఎస్ఐ లాఠీచార్జి చేశారని, అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు, చిరు వ్యాపారుల వద్ద మామూళ్ల దందా క్యాసినో ఏర్పాటుతో రూ.కోట్లు ఆర్జించిన కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి -
ఎనర్జీ అసిస్టెంట్
ఏసీబీ వలలో నకరికల్లు: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహీంద్ర మత్తె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన గుండాల రౌతమ్మ అనే మహిళా రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ నక్కబోయిన నాగేంద్రబాబు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రూ. 80 వేలు లంచం డిమాండ్ చేసి రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రౌతమ్మ కుమారుడు యోహాను ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అడిషనల్ ఎస్పీతో పాటు సీఐలు వి.సురేష్బాబు, ఎ.మన్మథరావు, బి.నాగ రాజు, ఎస్ఐలు ఊరుకొంద చిచా, జయ భారత్రెడ్డి, సుబ్బయ్యలతో కలిసి మొత్తం 20 మంది ఆకస్మికదాడి నిర్వహించారు. యోహాను నుంచి ఎనర్జీ అసిస్టెంట్ తన తండ్రి సహకారంతో రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తండ్రి, కొడుకులు ఇరువురిపై కేసు నమోదు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. రైతు నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో పట్టివేత -
రొంపిచర్లలో ‘బరి’తెగింపు...
శివరాత్రి పర్వదినాన కోటప్పకొండకు సమీపంగా ఉండే రొంపిచర్ల గ్రామంలో టీడీపీ నాయకులు భారీ ఎత్తున కోడి పందేలు, జూదశిబిరాలు ఏర్పాటు చేశారు. కొండకు వచ్చే వారిని ఆకర్షించేలా జూదాలు కొనసాగించారు. పందెంరాయుళ్లు కొండ కంటే ముందుగా రొంపిచర్ల వైపు కదలడం గమనార్హం. ఎన్నడూలేని విధంగా కోటప్పకొండ పవిత్రతను దెబ్బతీస్తూ ఇలా నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు.సాధారణంగా ఒకరిద్దరు పేకాట ఆడుతుంటేనే పోలీసులు పట్టుకుంటారు. అలాంటిది వందల మంది బహిరంగంగా ఇలా పేకాకుతున్నా, దీనిపై సమాచారం ఉన్నా పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పండుగ ముగిసి నాలుగు రోజులైనా బరుల నిర్వహకులను అరెస్ట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిపై చర్యలు వంటివేమీ ఉన్నతాధికారులు కూడా చేపట్టలేదు. -
అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
పల్నాడు జిల్లా: అత్తపై అల్లుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మిపై ఆమె అల్లుడు శ్రీనివాసపురానికి చెందిన జక్కా రవి పెట్రోలు పోసి నిప్పంటించడంతో శరీరం కొంత మేర కాలింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన కుమార్తె లావణ్యకు జక్కా రవితో వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది. భర్త వేధింపులు భరించలేని లావణ్య పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి దాచేపల్లిలోని అత్త ఇంటికి వచ్చిన రవి అత్త, భార్యతో గొడవ పడ్డాడు. రవి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు అత్తపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. దాడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు.దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. రవి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు తీవ్ర ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. దీంతో బాధితురాలు ఆందోళన చేయాల్సి వచ్చింది. -
వైద్యులు నిరంతర విద్యార్థులు
మంగళగిరి టౌన్: వైద్య విద్యార్థులకు అధికారికంగా విద్యాకాలం ముగిసినప్పటికీ వారు నిరంతరం విద్యార్థులేనని, జీవితాంతం వైద్యంలో నేర్చుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) రెండవ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ యువ వైద్యులది కీలకపాత్ర అని, చిత్తశుద్ధితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అమూల్య అవకాశం వైద్యులకే ఉందని తెలిపారు. రాష్ట్ర ౖవిద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జీవితానికి, మరణానికి మధ్య నిలబడి ప్రాణదాతలుగా సేవలు అందించడం వల్లే సమాజంలో వైద్యులకు గౌరవం లభిస్తోందని పేర్కొన్నారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ మాట్లాడుతూ వైద్యవిధానంలో ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వైద్యవిద్యను పూర్తిచేసుకున్న 49మంది వైద్య విద్యార్థులకు, పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న ఐదుగురు విద్యార్థులకు, పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసుకున్న నలుగురు విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ అధ్యక్షుడు మేజర్ జనరల్ డాక్టర్ తపన్కుమార్ సాహా, విశిష్ట అధ్యాపక సభ్యులు, పట్టభద్రులైన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ -
నిరవధిక దీక్షలు జయప్రదం చేయాలి
నరసరావుపేట: రైతుల హక్కుల సాధనకు సంఘం రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ఈ నెల 23, 24 తేదీలలో పల్నాడు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న 30 గంటల నిరవధిక దీక్షలు జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్య దర్శి వై.రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం నిరవధిక దీక్షల గోడ ప్రతులు ఆవిష్కరించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ సాగు దారులలో 70 శాతం మందికి పైగా ఉన్న కౌలు రైతుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని పేర్కొన్నారు. కౌలు రైతుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ 30 గంటల దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ అర్హులైన కౌలు రైతులకు ఎటువంటి నిబంధనలు లేకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు, పంటల బీమా, పెట్టుబడి రాయితీలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.పిచ్చరావు, నాయకులు పెండ్యాల మహేష్, కామినేని రామారావు, అమరలింగేశ్వరరావు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రాధాకృష్ణ -
ఆర్టీసీ తిరునాళ్ల ఆదాయం రూ.1.50 కోట్లు
నరసరావుపేట: కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆర్టీసీకి రూ.1.50కోట్ల ఆదాయం లభించినట్లు ఆ సంస్థ జిల్లా ప్రజారవాణా అధికారి టి.అజితకుమారి చెప్పారు. మంగళవారం ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. మహా శివరాత్రికి జిల్లా వ్యాప్తంగా 460 బస్సులను నడపటం ద్వారా 4.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయటం జరిగిందన్నారు. గతేడాదిలో 4 లక్షల మంది ప్రయాణికులను చేరవేయటం ద్వారా రూ.1.22 కోట్ల ఆదాయం లభించిందన్నారు. నరసరావుపేట డిపో ద్వారా మూడు లక్షల మంది ప్రయాణికులను కొండకు చేరవేయటం ద్వారా రూ.90 లక్షల ఆదాయం రాగా గతేడాది 2.89 లక్షల మంది ప్రయాణికులను చేరవేసి రూ.71లక్షల ఆదాయం వచ్చిందన్నారు. చిలకలూరిపేట బస్డిపో ద్వారా 65 వేల మంది ప్రయాణికులను చేరవేసి రూ.12.50 లక్షల ఆదాయం వచ్చిందని, గతేడాది రూ.17లక్షలు ఆదాయం సమకూరిందన్నారు. వినుకొండ డిపో ద్వారా 16వేల మంది భక్తులను కొండకు చేరవేయటం ద్వారా రూ.12.50 లక్షల రాగా, గతేడాది 7,200 మంది ప్రయాణికుల ద్వారా రూ.9.20 లక్షల ఆదాయం సమకూరిందని ఆమె తెలిపారు. -
వ్యవసాయ మార్కెట్ కమిటీలు
పన్ను వసూలులో పల్టీలు సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల సెస్ (పన్ను) వసూలు మందకొడిగా సాగుతుంది. జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 2025– 26 సంబంధించి రూ. 32.42 కోట్లు వసూలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే జనవరి 31వ తేదీ నాటికి రూ. 18.17 కోట్లు వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించిన సెస్ వసూలుకు కేవలం రెండు నెలల గడువు ఉంది. ఒక్కో వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ. కోటి పైనే వసూలు చేయడం సాధ్యమయ్యే పనేనా లేదా అనేది వేచి చూడాలి. రొంపిచర్ల ముందంజ... 29 చెక్ పోస్టులు.. కి -
మొరాయించిన రైల్వేగేటు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కొత్తూరు నుంచి పాతూరు వెళ్లే మార్గంలో కృష్ణాకెనాల్ జంక్షన్ పరిధిలో ఉన్న రైల్వేగేటు మంగళవారం మొరాయించింది. గేటు వద్ద పనిచేసే సిబ్బంది ఆ రైల్వేగేటును తరచూ పైకి లేపి వాహనాల రాకపోకలకు అనుమతించారు. మంగళవారం ఉదయం నుంచి గేటు పైకి ఎత్తే సమయంలో ఒకవైపు గేటుకు ఉన్న లాక్ ఓపెన్ కాక మొరాయించింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైల్వేగేటు మొరాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గేటు వేసిన ప్రతిసారి సిబ్బంది ఆ లాక్ను తప్పించి గేటును ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 6 గంటలకు రైల్వే గేటుకు మరమ్మతులు నిర్వహించారు. 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఒకటవ స్థాయీ సంఘ సమావేశాన్ని ఈనెల 21న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అదే రోజు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు మూడు జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులకు సమాచారాన్ని పంపారు. కాగా ఈనెల 7వ తేదీన జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో భాగంగా ప్రణాళిక–ఆర్థిక అంశాలకు సంబంధించిన ఒకటో స్థాయీ సంఘ సమావేశాన్ని సభ్యులు బహిష్కరించిన విషయం విదితమే. ఈనెల 7వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించడంతో ప్రణాళిక–ఆర్థిక అంశాలకు సంబంధించిన అజెండాను సమావేశంలో ప్రవేశపెట్టాలంటే, ముందుగా ఆయా అంశాలు స్థాయీ సంఘం ఆమోదించాల్సి ఉంది. ఇందు కోసం శనివారం ఉదయం 9.30 నుంచి స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించి, అదే రోజు ఉదయం 11 గంటల నుంచి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. మెడికల్ ఎగ్జిబిషన్ 22 వరకు పొడిగింపు గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కళాశాలలో జరుగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్ను ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. కాలేజీ విభాగాధిపతుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 38,120 మంది మెడికల్ ఎగ్జిబిషన్ను సందర్శించినట్లు వెల్లడించారు. ప్రజలు, పాఠశాలల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, విభాగాధిపతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎగ్జిబిషన్ను పొడిగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే జర్నలిస్టులకు, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారుల పరిధిలో పనిచేసే ఫీల్డ్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, ట్రాఫిక్ పోలీసులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉచిత ప్రవేశం పొందదలచిన వారు తమ అధికారిక గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుంటూరు మెడికల్ కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గుంటూరు డీఎంహెచ్ఓగా డాక్టర్ వెంకటేశ్వర్లు గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్గా డాక్టర్ టి.వెంకటేశ్వర్లును నియమిస్తూ హెల్త్ సెక్రటరీ సౌరబ్ గౌరవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు డీఎంహెచ్గా పనిచేస్తున్న డాక్టర్ కొర్రా విజయలక్ష్మిని డైరెక్టర్ ఆఫ్హెల్త్ రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గుంటూరులో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా పనిచేసిన డాక్టర్ వెంకటేశ్వర్లు 2024 డిసెంబరు 25 నుంచి ప్రకాశం జిల్లా డీఎంహెచ్ఓగా పనిచేస్తున్నారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 1,087 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మహా చండీహోమం పిడుగురాళ్ల:త్రయోదశి వార్షికోత్సవంలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం మహాచండీహోమం నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.8600, మోడల్ ధర రూ.8000 వరకు పలికింది. 7 -
మైనారిటీలకు మరోసారి ద్రోహమే
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా.. మైనారిటీ సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఏదో నామ్కే వాస్తే.. నిధులు కేటాయించారు తప్ప.. స్పష్టంగా ఏ పథకానికి ఇచ్చారో తెలియదు. దుల్హన్ పథకం, విదేశీ విద్య, మైనారిటీల స్కాలర్షిప్లకు ఒక్క రూపాయి కేటాయించలేదు. మైనారిటీలు వ్యాపారం చేసుకునేందుకు రూ. 5లక్షల రుణాలు ఇస్తామన్న చంద్రబాబు దాని కోసం ఎన్ని కోట్లు కేటాయించారో.. చెప్పాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో ఎక్కడ కూడా రంజాన్తోఫా, మసీదుల మరమ్మతు కోసం నిధులు కేటాయింపు లేదు. మరోసారి మైనారిటీలను నిలువునా వంచించారు. ముస్లింలను అన్ని విషయాల్లో చంద్రబాబు చిన్నచూపుతోనే చూశారు. – పఠాన్ అబ్దుల్లాఖాన్,మౌజాన్ అసోసియేషన్, జిల్లా అధ్యక్షుడు -
అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
దాచేపల్లి: అత్తపై అల్లుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మిపై ఆమె అల్లుడు శ్రీనివాసపురానికి చెందిన జక్కా రవి పెట్రోలు పోసి నిప్పంటించడంతో శరీరం కొంత మేర కాలింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన కుమార్తె లావణ్యకు జక్కా రవితో వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది. భర్త వేధింపులు భరించలేని లావణ్య పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి దాచేపల్లిలోని అత్త ఇంటికి వచ్చిన రవి అత్త, భార్యతో గొడవ పడ్డాడు. రవి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు అత్తపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. దాడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు.దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. రవి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు తీవ్ర ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. దీంతో బాధితురాలు ఆందోళన చేయాల్సి వచ్చింది. -
మద్యం విక్రయాలు జరిపిన హోంగార్డు సస్పెన్షన్ ?
సాక్షి నెట్వర్క్: కోటప్పకొండ తిరునాళ్లలో మద్యం విక్రయాలు నిర్వహించిన హోంగార్డు ఎన్.కోటేశ్వరరావును జిల్లా అధికారులు మంగళవారం సస్పెండ్ చేసినట్టు తెలిసింది. నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆయన తిరునాళ్లలో మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీడియా లో కూడా కథనాలు రావడంతో అధికారులు చర్య లు తీసుకున్నట్టు సమాచారం. తిరునాళ్ల సందర్భంగా మూడు రోజలపాటు కోటప్పకొండలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. తిరునాళ్లలో యథేచ్ఛగా విక్రయాలు జరిపా రు. హోంగార్డుతోపాటు మరో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్టు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. -
దివ్య రథోత్సవం
అమరావతి: మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్య రథోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. అమరావతి, ధరణికోట గ్రామాలకు చెందిన చింకా, ఆలపాటి, కోనూరు వారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామి వారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. భక్తులు ఓం నమశ్శివాయః అంటు అమరారామం మార్మోగేలా శివనామస్మరణ చేస్తుండగా మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోఛ్ఛారణల మధ్య ఉభయ దేవేరులతో కూడిన అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. -
సమత మమత సమ్మిళితమే రంజాన్
ఆత్మశుద్ధికి.. మానవత్వానికి ‘రోజా’ పరిమళం యడ్లపాడు: రంజాన్ అంటే కేవలం 30 రోజుల ఉపవాస దీక్షల పట్టిక కాదు. అది మనిషిలోని స్వార్థాన్ని కరిగించి, మానవత్వాన్ని పరిమళింపజేసే ఒక పవిత్ర యజ్ఞం. ఆకలి విలువను తెలుసుకుంటూ పేదవాడి కన్నీరు తుడిచే ఈ క్రమశిక్షణాయుత ప్రయాణం భక్తులను మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యత, ఆరోగ్య సూత్రాల కలబోతగా సాగే విశిష్టతే రంజాన్. ఇంద్రియ నిగ్రహమే ‘రోజా’ వేకువజామున ‘సహరీ’తో మొదలై, సూర్యాస్తమయం వేళ ‘ఇఫ్తార్’తో ముగిసే రోజా దీక్ష కేవలం ఆహారానికి దూరం ఉండటం మాత్రమే కాదు. అది పంచేంద్రియాలపై సాధించే నియంత్రణ. మతం కన్నా మానవత్వమే మిన్న అల్లాహ్ ఆరాధనలో కఠినత్వం కంటే సౌలభ్యానికే ఇస్లాం ప్రాధాన్యతనిస్తుంది. అందుకే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అనారోగ్యంతో ఉన్నవారికి ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. చేయలేని వారు తర్వాత రోజుల్లో ‘ఖజా’, లేదా పేదలకు అన్నం పెట్టే ‘ఫిద్యా’ ద్వారా ఆ పుణ్యాన్ని పొందవచ్చు. భక్తి అనేది భారం కాకూడదన్నదే ఇస్లాం ఇచ్చే మానవీయ సందేశం. మూడు దశల ముక్తిమార్గం ఈ 30 రోజుల ప్రయాణం మూడు విశిష్ట దశలుగా సాగుతుంది. మొదటి 10 రోజులు సృష్టికర్త అపారమైన కరుణ కోసం ప్రార్థించే రహమత్(కారుణ్యం) దినాలు. మధ్య 10 రోజులు చేసిన తప్పులకు క్షమాభిక్ష వేడుకునే మగ్ఫిరత్(పాప విముక్తి) సమయం. చివరి 10 రోజులు నరకాగ్ని నుంచి విముక్తిని వేడుకుంటూ ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించే కాలం. ఐదు స్తంభాల ఆత్మీయ బంధం ఇస్లాం ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై నిర్మించబడింది. దైవం ఒక్కడేనని నమ్మడం(కలిమా), నమాజ్, పేదలకు సహాయపడటం(జకాత్), ఉపవాసం(రోజా), స్తోమత ఉంటే చేసే హజ్ యాత్ర. ఈ సూత్రాలు మనిషిని ఆధ్యాత్మికంగా పరిపుష్టం చేస్తూ సమాజంలో సమానత్వాన్ని, ప్రేమను పెంపొందిస్తాయి. జకాత్ సంపాదనకు పవిత్రత రంజాన్ మాసంలో ఇచ్చే జకాత్ కేవలం దానం కాదు. అది సంపాదనను పవిత్రం చేసుకునే బాధ్యత. ఆస్తిలో 2.5 శాతాన్ని పేదలకు పంచడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని పెంచుతారు. ఇక పండుగ పూట ఎవరూ ఆకలితో ఉండకూడదని ఇచ్చే ‘ఫిత్రా’, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ‘ఇఫ్తార్’ విందులు ఐక్యతకు నిలువెత్తు సాక్ష్యాలు. లోకానికి మార్గదర్శనం చేసే పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది. ఆ దివ్య గ్రంథం బోధించిన సత్యాలను మననం చేసుకుంటూ, జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి రంజాన్ ఒక చక్కని అవకాశం. ఈ 30 రోజుల క్రమశిక్షణ మనిషిని ఆధ్యాత్మికంగా కొత్త పుంతలు తొక్కించి, ఉన్నతమైన జీవనశైలిని అలవరుస్తుంది. ప్రతిముస్లిం రోజాను విధిగా పాటించి అల్లాహ్కు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. – షేక్ అబ్దుల్ కలీమ్, మత గురువు -
ఎన్జీ రంగా వర్సిటీలో..
గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో మంగళవార భారత్ విస్తార్ డిజిటల్ వ్యవసాయంపై వర్చువల్ ప్రోగ్రాం నిర్వహించారు. రాజస్తాన్లోని జైపూర్ నుంచి కేంద్ర మంత్రి శివరాజ్సింగ్చౌహాన్ ప్రారంభించిన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు వీక్షించారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివనారాయణ మాట్లాడుతూ భారత్ విస్తార్ కార్యక్రమం రైతులకు తమ సొంత భాషలో ఫోన్ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ సమాచారాన్ని అందించేందుకు రూపొందించారన్నారు. పంటల ప్రణాళికలు, పద్ధతులు, తెగుళ్ళ యాజమాన్యం, వాతావరణ మార్పులు, మార్కెట్లు, రైతులకు వారి భాషలో ఏఐ టెక్నాలజీ ద్వారా అందజేస్తారన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ, ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఎ. మణి, డాక్టర్ జి. రామచంద్రరావు, డాక్టర్ సంపత్కుమార్, డాక్టర్ పి. రవి, డాక్టర్ దుర్గాప్రసాద్, వైవీ సుబ్బారావు, రామకృష్ణ, తిరుపతిరావు, విద్యార్థులు శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను నిరాశ పర్చిన బడ్జెట్
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేశారు. పీఆర్సీతోపాటు డీఏ లు, సరెండర్ లీవ్స్ సహా ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బడ్జెట్లో బకాయిల చెల్లింపునకు పైసా నిధులు విదల్చకపోవడంతో ఆయా వర్గాలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్తో ఈనెల 25న ఎస్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ప్రభుత్వానికి నిరసన తెలియజేయనున్నాం. డి.పెదబాబు, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు ఘన నివాళి
నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వజ్రగిరి రవీంద్ర (30) అంత్యక్రియలు మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బలగాల ఆధ్వర్యంలో అధికారికంగా జరిపించారు. నకరికల్లుకు చెందిన వజ్రగిరి రవీంద్ర సీఆర్పీఎఫ్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్గా విధులు నిర్వరిస్తున్నాడు. ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చి తిరిగి డ్యూటీలో చేరేందుకు విజయవాడకు బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గంమధ్యలో ఫిరంగిపురం సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుఝామున మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం సోమవారం రాత్రి మృతదేహాన్ని నకరికల్లుకు తరలించారు. అనంతరం మంగళవారం గౌరవవందనం సమర్పించిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అధికారిక లాంఛనాలతో అంతఃక్రియలు జరిపించారు. అంతఃక్రియల్లో కుటంబసభ్యులతో పాటు స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రత్యేక దృష్టితో పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కరించాలి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి వివిధ మండలాల నుంచి సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 22 అర్జీలు స్వీకరించారు. వీటిలో ఎనిమిది పీజీఆర్ఎస్లో స్వీకరించగా మరో 14 రెవెన్యూ క్లినిక్ వేదిక ద్వారా స్వీకరించారు. గురజాల డివిజన్ నుంచి ఐదు, సత్తెనపల్లి నుంచి ఎనిమిది, నరసరావుపేట నుంచి ఒకటి స్వీకరించారు. అర్జీలు నాణ్యతగా, సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెనన్స్పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నారు. డీఆర్ఓ నారదముని, కీర్తిప్రియ పాల్గొన్నారు. -
వైభవంగా లింగోద్భవ అభిషేకాలు
నర సరావుపేటరూరల్: మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారికి లింగోద్భవ పూజలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభమైన పూజలు సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగా యి. పంచామృత ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావు, దేవదాయ శాఖ డిప్యూటి కమిషనర్ చంద్రకుమార్లు అభిషేకాల్లో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో లింగోద్భవ పూజలను తిలకించారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
తిరుగు ప్రభల సందడి
మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో జాగరణ చేసి మొక్కులు తీర్చుకున్న ప్రభలు సోమవారం ఉదయం నరసరావుపేటకి చేరుకున్నాయి. పట్టణం నుంచి ఆదివారం సాయంత్రం బయలుదేరి వెళ్లిన ప్రభలు రాత్రి కొండ దిగువన స్వామివారి సన్నిధి జాగరణ చేసి సోమవారం ఉదయాన్నే బయలుదేరి వచ్చాయి. ప్రభల వెంట వస్తున్న భక్తులకు మార్గ మధ్యంలో పలువురు దాతలు ఉచితంగా అల్పాహారం అందచేశారు. పోలీసులు పల్నాడు బస్టాండ్ ప్రాంతం నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ట్రాఫిక్ను మళ్లించారు. – నరసరావుపేట ఈస్ట్ -
శభాష్... సుభాష్రెడ్డి
చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన పాశం సుభాష్రెడ్డి సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్లో అత్యధికంగా 99.823 పర్సంటైజ్ సాధించాడు. విజయవాడలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఇటీవల జరిగిన జేఈఈ పరీక్షకు హాజరయ్యాడు. అన్ని సబ్జెక్ట్లలోను 99% పర్సంటైల్ నమోదు చేశాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. సుభాష్రెడ్డి అత్యధిక మార్కులు సాఽధించటంతో తల్లిదండ్రులు రామిరెడ్డి, అశ్విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు సుభాష్రెడ్డిని అభినందించారు. పదవతరగతిలోను 586 మార్కులు సాధించాడు. వెలుగు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సింగయ్య చినగంజాం: రైతుల ప్రయోజనాల కోసమే మహిళా రైతు సంఘం పని చేస్తుందని వెలుగు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరక్టర్ బి. సింగయ్య అన్నారు. మండల వెలుగు డీఆర్డీఏ ఆధ్వర్యంలో సోమవారం వెలుగు కార్యాలయంలో నిర్వహించిన గోతాల పంపిణీ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సింగయ్య రైతులకు గోతాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగకరమైన విధంగా మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పని చేస్తుందని, దీని ద్వారా రైతుకు గిట్టుబాటు ధర, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలను అద్దె రూపంలో ఇస్తారన్నారు. గోతాలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇస్తారని, మండలంలోని రైతులందరూ ఉపయోగించుకోవాలన్నారు. పండించిన పంట కూడా గిట్టుబాటు ధర తీసుకురావాలని ఉద్దేశంతో సమాఖ్య పనిచేస్తుందని, మండలంలో అత్యధికంగా శనగ, జొన్న, వరి, రాగులు మొదలైన పంటలు పండించారని తెలిపారు. వీటికన్నింటికి గిట్టుబాటు ధర తీసుకురావడానికి సమాఖ్య పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎం రవీంద్ర, సర్పంచ్ రాయని ఆత్మారావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు శారద, ఎఫ్ఈఓ అధ్యక్షులు అంజనీదేవి, నాయకులు పొద వీరయ్య, నరహరి శ్రీను, సందు శ్రీను, సత్యం, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు. నాదెండ్ల: చిరుమామిళ్ళలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో తమను రాకుండా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని దేవస్థానం సింగిల్ ట్రస్టీ కొల్లిపర సాంబశివరావు, ప్రధాన అర్చకుడు కొల్లిపర పాపారావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఎప్పటి నుంచో ఆలయం ట్రస్టీగా, పూజారిగా వ్యవహరిస్తున్నామని, ఆదివారం ఆలయానికి వెళ్లిన తమను గ్రామానికి చెందిన కొల్లిపర శ్రీనివాస్, కొమ్మసాని గంగిరెడ్డి అడ్డుకున్నారని వాపోయారు. తమ కుటుంబ సభ్యులను దుర్భాషలాడటమే కాక చంపుతామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించండి
మాచర్ల రూరల్: రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న పని భారాన్ని తగ్గించి సమయ పాలన ఏర్పాటు చేసి మానసిక ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యానికి గురౌతున్న ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం స్పందించాలని గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరుముళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఇచ్చి న పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. వేళాపాళా లేని పనితో ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని, ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు బాధ్యతలు నిర్వహించటమే కాకుండా వివిధ శాఖ ల పనులు సైతం రెవెన్యూ వారిపై మోపుతూ మ రింత ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు పనిఒత్తిడితో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. మరణించిన వీఆర్ఓలకు సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు సంఘీభావంగా ఉంటామన్నారు. వీఆర్ఓలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారందరికీ రెవెన్యూ అధికారుల సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ జీఎస్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వలన గ్రామస్థాయిలో వీఆర్ఓలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జాబ్ చార్ట్ ప్రకారం విధులు లేకుండా అన్నీ పనులు చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ విష యం పై ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఖాజావలి, ఆర్ఐ ఇంటూరి అనిల్కుమార్, జూనియర్ అసిస్టెంట్ యశోదారాణి, వీఆర్ఓలు నాగలక్ష్మి, శ్రీలక్ష్మి, ఉమాదేవి, రత్నప్రకాష్, అన్నారావు, ఇషావలి, కోటయ్య తదితరులున్నారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరుముళ్ళ నాగేశ్వరరావు -
కల్యాణం... కమనీయం...
సత్రశాల(రెంటచింతల): సత్రశాల గంగా భ్రమరాంబా సమేత మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి 1 గంట నుంచి 3.30 గంటల వరకు నిర్వహించిన స్వామి వార్ల కల్యాణం కన్నులపండువగా సాగింది. వరకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణ వేడుకలు అర్చకులు భువణగిరి కృష్ణ నేతృత్వంలో కన్నులపండువగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కల్యాణ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనులార వీక్షించారు. మహాశివ రాత్రి ప్రత్యేక అధికారి వి.లీలావతి, ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డి, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అతివేగంతో ఢీకొన్న లారీలు
దాచేపల్లి: అతివేగంతో వెళ్తున్న రెండు లారీ పరస్పరం ఢీకొన్నాయి. మండలంలోని శ్రీనగర్ గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సోమవారం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. స్థానికుల కథనం ప్రకారం... దాచేపల్లి వైపు నుంచి రెండు లారీలు అద్దంకి–నార్కెట్పల్లి హైవేపై తెలంగాణకు వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న లారీని ఓవర్టెక్ చేసే వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక లారీ ఫల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోగా మరో లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిత్య రద్దీగా ఉండే ఈ హైవేపై రెండు లారీలు ఢీకొనటంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. సంఘటన స్థలాన్ని పోలీసులు, హైవే అధికారులు పరిశీలన చేసి బోల్తాపడిన లారీలను క్రేన్ సహాయంతో పైకి లేపారు. -
త్రికోటేశ్వరుని ఆదాయం రూ.1.95 కోట్లు
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ దేవస్ధానానికి రూ.1,95,81,848లు ఆదాయం లభించింది. ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా రూ.75, 52,700లు, పూజా టికెట్లు విక్రయం ద్వారా రూ.77,78,318లు, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.41,30,725లు ఆదాయం వచ్చింది. వీటితో పాటు 3.55 గ్రాముల బంగారం, 278.300 గ్రాముల వెండీ, 13 అమెరికన్ డాలర్లు హుండీలో లభించాయి. తిరునాళ్ల ఉత్సవ అధికారి కె.బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త రామకృష్ణ కొండలరావు, గుంటూరు సహయ కమిషనర్ శ్రీనివాసరావు, ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావులు పర్యవేక్షించారు. ఆర్టీసీ ఆదాయం రూ.82 లక్షలు నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండపై వరకు తిరిగిన బస్సుల ద్వారా రూ.82లక్షల ఆదాయం లభించినట్లు డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు సోమవారం రాత్రి పేర్కొన్నారు. గతేడాది రూ.70లక్షలు వచ్చాయన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కొండకు తిరిగిన బస్సుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు మంగళవారం తెలియచేస్తామని ఆర్ఎం టి.అజితకుమారి పేర్కొన్నారు. సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా ఈ ఏడాది రూ. 5,10,081 ఆదాయం వచ్చినట్లు సత్తెనపల్లి దేవదాయశాఖ ఇన్స్పెక్టర్, మహాశివరాత్రి ప్రత్యేక అధికారి వి.లీలావతి సోమవారం తెలిపారు. టికెట్లు ద్వారా రూ.1,01,010, హుండీ కానుకల ద్వారా రూ. 2,31,712, చదివింపులు రూ.56,485, విరాళాలు రూ. 18,500, కల్యాణం దంపతుల ద్వారా రూ. 2,064, తలనీలాలు ద్వారా రూ. 310 మొత్తం రూ. 5,10,081 ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఈవో గాదె రామిరెడ్డి, చైర్మన్ గుండా వెంకట శివయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండపై పర్యావరణ పరిరక్షణకై ఆలయ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. 17వ తేదీ మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం ఘాట్రోడ్ ద్వారా గండదీపానికి వెళ్లే మార్గంలో వాహనాలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్ కుమార్ తెలిపారు. కొండపై ప్లాస్టిక్ వినియోగం నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు తదితర వస్తువులను గండాలయ స్వామి ఆలయ ప్రాంతంలో నిషేధించామని పేర్కొన్నారు. స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులు శ్రీ గండాలయస్వామి వారి సన్నిధికి ప్లాస్టిక్ సామగ్రిని తీసుకురావద్దని ఆయన కోరారు. ఆలయ పరిశుభ్రతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి తిరునాళ్ల సందర్భంగా హుండీ ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు దేవదాయశాఖాధికారులు తెలిపారు. వడ్లమూడి క్వారీ దేవస్థానం వద్ద సోమవారం దేవదాయశాఖాధికారులు హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు హుండీలో వేసిన కానుకలను, ఇతర ఆదాయాలను దేవదాయశాఖాధికారులు, స్థానిక పెద్దల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. మొత్తం రూ.17.30లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖాధికారి నరసింహారావు తెలిపారు. వీటిలో హుండీల ఆదాయం రూ.6,03, 208 లు, అభిషేకం, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.7,40,500లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరికాయలకు రూ.2.95లక్షలు, గ్యాస్ పొయ్యిలకు రూ.34,500లు, డొనేషన్స్ రూ. 57,390ల ఆదాయం సమకూరినట్లు తెలి పారు. దేవస్థానానికి మొత్తంగా రూ. 17.30లక్షలు సమకూరింది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం రూ.1.03 లక్షలు అదనంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దేవదాయ శాఖాధికారులు, పోలీసు, రెవెన్యూ శాఖాధికారులు, గ్రామస్తులు, స్థానిక పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్సులు లేక కొండ భక్తుల అగచాట్లు
●గంటల తరబడి ఎదురుచూసిన వందలాది మంది భక్తులు ●వినుకొండరోడ్డులో నిల్చిన ట్రాఫిక్ నరసరావుపేట: తిరునాళ్ల భక్తులు సకాలంలో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయటంలో ఆర్టీసీ, పోలీసు అధికారులు ప్రదర్శించిన ఉదాశీనత భక్తుల పాలిట శాపంగా పరిమణించింది. ఆదివారం కోటప్పకొండ వద్ద జరిగిన తిరునాళ్లకు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చి తిరిగి స్వగ్రామాలకు వెళ్లేందుకు సోమ వారం ఉదయం కొండ నుంచి తిరుగు బస్సుల ద్వారా వేలాది మంది బస్టాండ్కు చేరుకున్నారు. అయితే బస్టాండ్ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, సత్తెనపల్లి వైపునకు వెళ్లే బస్సులు లేకపోవటంతో గంటలతరబడి ఎదురు చూశా రు. అప్పుడప్పుడు అరకొరగా వచ్చిన బస్సును ఎక్కేందుకు భక్తులు నానా ప్రయాసలకు గురికావాల్సివచ్చింది. మరికొందరు బస్సులకోసం వేచి చూసీ చూసీ రోడ్డుపై నిలబడి ఆటోలు, ఇతర వాహనాలను పట్టుకొని అధిక ప్రయాణఖర్చులు భరించి తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లారు. దీంతో పాటు కోటప్పకొండ నుంచి బస్టాండ్కు వచ్చే బస్సులతో వినుకొండరోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణంలోని ప్రవేశించిన తర్వాత బస్టాండ్ చేరుకునేందుకు గంటల తరపబడి బస్సులోనే కూర్చోవాల్సి వచ్చింది. తెల్లవారుఝామున రెండున్నర, మూడుగంటలకు కోటప్పకొండ నుంచి బయలుదేరిన ప్రయాణీకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు చేరుకునే సరికి ఉద యం ఏడుగంటలైంది. బస్సుల్లో అధిక భాగం కొండకు ఏర్పాటుచేసిన అధికారులు మరుసటిరోజు తిరుగు ప్రయాణీకులకోసం కావాల్సిన బస్సులను ఏర్పాటు చేయలేకపోవటంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. -
తిరునాళ్లలో ఏరులై పారిన మద్యం
సాక్షి, నరసరావుపేట: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో ఓ వైపు శివనామస్మరణ వినిపిస్తుండగా మరోవైపు మద్యం, మాంసాహార విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి. శివరాత్రి సందర్భంగా ఏటా మూడు రోజులపాటు కోటప్పకొండ పరిసరాలలో మద్యం అమ్మకాలను జిల్లా కలెక్టర్ నిషేధిస్తారు. ఈ ఏడాది నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడం మరిచారు. కొండ పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో బెల్టుషాపులు ఏర్పాటు చేసి జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. వీటిని అడ్డుకోవాల్సిన ఎకై ్సజ్, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్టు వదిలేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తున్నది అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు కావడంతో మిన్నుకుండిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియాకి చెందిన పలువురు కోటప్పకొండ వద్ద జరుగుతున్న అపచారాన్ని వీడియోల రూపంలో తీసి ఎండగట్టడంతో విషయం బహిర్గతమైంది. అత్యంత ప్రసిద్ధిగాంచిన త్రికోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మద్యం అమ్మకాలు, మాంసాహార విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం తాగి సోయలేకుండా పడిపోయిన దృశ్యాలు కలవరపరిచాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొట్టి... మద్యం అమ్ముతూ లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో కోటప్పకొండ పరిసరాలలో పోలీసు సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైంది. కొండ పరిసరాలలో అసాంఘిక కార్యక్రమాలు అడ్డుకోవాల్సిన ఓ పోలీసు హోంగార్డు ఆదివారం మద్యం బెల్టుషాపు ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం విక్రయించారు. నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ వద్ద సన్నిహితంగా ఉండే హోంగార్డు కోటేశ్వరరావుకు ఆదివారం కొండ పరిసరాలలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ట్రాఫిక్ సూచికల ఏర్పాటు డ్యూటీ వేశారు. వాటికి డుమ్మా కొట్టిన అతను తన బెల్టుషాపులో అక్రమంగా మద్యం విక్రయిస్తూ కనిపించా డు. ఈ ఘటనతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి అపచారం చేయడమేంటని మండిపడుతున్నారు. మరోవైపు మూడు వేలమంది సిబ్బంది, 30 డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పుకున్న పోలీసు ఉన్నతాధికారులకు సొంత సిబ్బంది బెల్టుషాపు నిర్వహిస్తున్న విషయం తెలియలేదా.. తెలిసినా మిన్నుకుండిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు అలసత్వం వహించడం వల్ల ఎక్కడికక్క డ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం కూడా వీటన్నింటికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మొక్కజొన్నకు నీరివ్వాలంటూ ఆందోళన
నరసరావుపేట: పొట్టదశలో ఉన్న మొక్కజొన్న పొలాలకు సరిపడా సాగునీరు ఇవ్వాలని కోరుతూ మొక్కజొన్న రైతులు సోమవారం ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం, కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. నరసరావుపేట మండలంలోని కేఎం అగ్రహారం, ఇసప్పాలెం, తురకపాలెం, వల్లప్పచెరువు కిందనున్న పొలాల రైతులు సుమారు 1500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ఆ పంటకు నీరు అందక ఆందోళన చెందుతూ ఎన్ఎస్పీ అధికారులకు తమ సమస్య తెలియచేశారు. తామంతా ఎకరానికి రూ.40వేలు వరకు పెట్టుబడి పెట్టామని, ఈ దశలో నీరు పెట్టకపోతే రూ.5వేలు కూడా రావని ఆందోళన వ్యక్తం చేశారు. వారందరూ ఎన్ఎస్పీ డీఈని కలిసి తమ సమస్యను విన్నవించారు. తమకు మార్చి నెలాఖరు వరకు నీరిస్తే సమస్య తీరుతుందని, నీరిచ్చి ఆదుకోవాలని అధికారులను కోరారు. అనంతరం కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం అందజేసి తమ సమస్య చెప్పుకున్నారు. ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం, కలెక్టరేట్ ముందు రైతుల నిరసన -
నిరాశాజనకంగా రాష్ట్ర బడ్జెట్
పట్నంబజారు (గుంటూరుఈస్ట్): పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోవటం దారుణం. పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాన్ని మోపటమే తప్ప బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఎన్నికల వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టి మరీ మోసం చేశారు. వాగ్దానాలు ఇవ్వటమే కాకుండా బాండ్ల రూపంలో సంతకాలు పెట్టి మరీ ప్రజలను వంచించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి పథకాలకు అంతంత మాత్ర కేటాయింపులు చేయటం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్, సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు వంటి కార్యక్రమాలకు పూర్తిగా పంగనామాలు పెట్టారు. – అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త గుంటూరు రూరల్: రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేస్తూ, ప్రజలకు పనికిరాని బడ్జెట్ను ప్రవేశపెట్టి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. నిరుద్యోగ యువతను, మహిళాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీలు, బీసీల అభివృద్ధికి ఎటువంటి హామీ లేకుండా బడ్జెట్ రూపొందించారు. సంక్షేమాన్ని గాలికి వదిలి కేవలం చంద్రబాబు తన వర్గానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగకరంగా బడ్జెట్ను రూపొందించారు. నిరుద్యోగ భృతికి నామం పెట్టారు. రైతులను నట్టేట ముంచారు. మహిళలకు నెలకు రూ.1500 అని చెప్పి మహిళల నెత్తిన టోపి పెట్టారు. జీతాల పెంపు లేకుండా ఉద్యోగులను మోసం చేశారు. చంద్రబాబు అంటేనే మోసం అని మరోసారి రుజువు చేశారు. – బలసాని కిరణ్కుమార్, ప్రత్తిపాడు సమన్వయకర్త పట్నంబజారు (గుంటూరుఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలను నిలువునా వంచించారు. రైతు, మహిళలు, యువతకు తగిన ప్రాధాన్యం లేకపోవడం బాధాకరం. నిరుద్యోగ భృతి, మహిళల రుణాలు, రైతుల రుణాలు మొదలగు అంశాలను అసలు పట్టించుకోకపోవటం దారుణం. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలుగా మారాయి. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. అంకెల గారడీతో.. అప్పుల గుదిబండతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. – ఈమని రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ ఫోరం -
ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యార్థిని మృతి
రెంటచింతల: మండలంలోని మిట్టగుడిపాడు–రెంటచింతల గ్రామాల మధ్య జాతీయ రహదారికి సమీపంలో సోమవారం ఉదయం ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారికి పక్కనే ఉన్న పంటకాల్వలో పడిపోవడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అక్కడ నున్న వ్యవసాయ కూలీలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురజాల మండలం సమాధానంపేట గ్రామానికి చెందిన భోజావత్ శ్రీనునాయక్, సైదమ్మలకు ముగ్గురు సంతానం. చివరి సంతానం అయిన ఝూన్సీ (13) గురజాల మండలం గంగవరం కస్తూర్భా పాఠశాలలో 8వ తరగతి చదువుతూ మహాశివరాత్రికి ఇంటికి వచ్చింది. ఉదయం తండ్రి శ్రీనునాయక్ తన ద్విచక్ర వాహనంపై కుమార్తె ఝూన్సీని పాఠశాలకు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పంటకాల్వలో పడిన బాలికపై వాహనం పడటంతో పైకిలేవలేకపోవడం వలన ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనునాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. నీటిలో పడిన ఇద్దరూ బయటకు రాలేకపోవడంతో కూలీలు బయటకు తీయగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు గమనించారు. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్లకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. -
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు...
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఆదివారం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోటప్పకొండ పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. ● తెల్లవారుజామున ఒంటి గంటకు బిందెతీర్థంతో స్వామి వారికి ఆలయ ప్రధానార్చకులు అప్పయ్యగురుకుల్ ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ● స్వామి వారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100లు, రూ.200లు, రూ.500ల అభిషేక క్యూల ద్వారా దర్శించుకున్నారు. ● ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన రూ.300 వీఐపీ దర్శన టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పించారు. ఉదయం నుంచి భక్తులతో క్యూ కాంప్లెక్స్ కిక్కిరిసింది. ఉచిత దర్శనంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ● మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోఫాన మార్గం నుంచి భక్తులు మెట్ల పూజ నిర్వహించుకుంటూ కొండపైకి చేరుకున్నారు. ధ్యానశివుడు, నాగేంద్రుని పుట్ట, నంది విగ్రహం వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. ● త్రిముఖ శివలింగం వద్ద యాత్రికులు సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. పలువురు భక్తులు కాలినడకన పాతకోటయ్య స్వామి ఆలయం వద్దకు చేరుకుని దర్శించుకున్నారు. ● జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, ఆలయ పరిసరప్రాంతాలను సందర్శించి భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆలయ ఈవో డి. చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రభల వద్ద కోలాహలం... ప్రభల పండగగా పేరొందిన కోటప్పకొండ తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు యాత్రికులను కనువిందు చేశాయి. ఈ ఏడాది అధికంగా 23 భారీ విద్యుత్ ప్రభలు కొండకు తరలివచ్చాయి. భారీ విద్యుత్ ప్రభల కాంతులతో కోటప్పకొండ ప్రాంతం ప్రత్యేక రూపు సంతరించుకుంది. ప్రభలపై ఏర్పాటుచేసిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్పెషల్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించారు. కొండ కింద పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుకాణాల వద్ద రోజంతా సందడి నెలకొంది. కోటప్ప కొండకు తరలివచ్చిన భక్త జన సందోహంలో ఓ భాగం -
కాళ్లు దువ్విన కోళ్లు
నరసరావుపేటటౌన్: కోడి పందేలకు.. కోత ముక్కలకు.. గుండు ఆటకు రొంపిచర్ల మండలం కేరాఫ్ అడ్రస్గా మారిందా అంటే.. అవుననే అంటున్నారు అనుభవజ్ఞులు. ఇటీవల కాలంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో పేకాట, కోతముక్కా, గుండు ఆట, కోడిపందేలు పెచ్చుమీరాయి. విప్పర్ల, కొనకంచివారిపాలెం, గ్రామాల్లో శివరాత్రి పండుగ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కోడి పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పందెగాళ్లకే కాకుండా చూడటానికి వెళ్లిన ప్రేక్షకుల వద్ద కూడా ద్విచక్ర వాహనానికి, కార్లకు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. కోతముక్క, గుండాట ఆడే పందెగాళ్ల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజు వసూలు చేసి సకలం ఏర్పాట్లు చేశారు. కోడికి కూడా ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు, పోరులో గెలిచిన పందెం కోడి యజమాని వద్ద నుంచి రూ.ఐదు వేల రూపాయలు వసూలు చేశారు. రాత్రి వేళ కూడా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ముందే తెల్సినా నియంత్రించలేదు.. శివరాత్రి పండగకూ ముందే కోడిపందేలు, పేకాట నిర్వహణకు బరులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు చేయటంతో అధికారులు మిన్నకున్నారు. బరుల నిర్వాహకుల వద్ద లంచం తీసుకొని వారికి సహకరించారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రొంపిచర్లలో బహిరంగంగా జూదం నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. -
ఏలేశ్వరం గట్టుకు పోటెత్తిన భక్తులు
విజయపురిసౌత్: శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య ద్వారంగా మహోన్నత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్ జలాశయం మధ్యన సింహాపురి కొండపై వెలసిన ఏలేశ్వరస్వామి జాతరకు ఆదివారం మహా శివరాత్రిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. ఏలేశ్వరం గట్టు హరిహర నామస్మరణతో మార్మోగింది. ఆంధ్రా – తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లాంచీలను ఏలేశ్వరం గట్టుకు నడిపారు. లాంచీలలో కాకుండా భక్తులు మహబూబ్నగర్, ప్రకాశం, నల్లగొండ, గుంటూరు జిల్లాలలో సాగర్ జలాశయం తీరాలను ఆనుకొని ఉన్న పలుగ్రామాలు తండాల వాసులు మరబోట్లలో, పుట్టీలలో ఏలేశ్వరం జాతరకు తరలి వచ్చారు. కొండ ఎక్కిన భక్తులకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పలు స్వచ్ఛంధ సంస్థలు మజ్జిగ, నీళ్ళ ప్యాకెట్లను అందజేశారు. అలాగే విజయపురిసౌత్లో శివాలయంలో అర్చకుడు జూనూతుల నరసింహమూర్తి, ప్రశాంత్ శర్మలు అమరలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం గట్లు దిగువన, అనుపు వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల రూరల్ సీఐ నఫీజ్బాష నేతృత్వంలో విజయపురిసౌత్ ఎస్ఐ అనుపు వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
స్తంభించిన ట్రాఫిక్
మెట్లమార్గం పట్టిన భక్తులు నరసరావుపేటరూరల్:కోటప్పకొండ ఘాట్రోడ్లో ట్రాఫిక్ స్తంభించడంతో మెట్ల మార్గంలో కిందకి వెళ్లే వారిని పోలీసులు నిలిపివేశారు. దీంతో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోటప్పకొండ మీద భక్తులు స్తంభించిపోయారు. ఘాట్రోడ్లో ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురికావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కొండమీద భక్తులు కిందకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో వారు మెట్లమార్గం బాట పట్టారు. ఈ సమయంలోనే పదేళ్ల నందిని ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుంది. రాత్రికి ప్రసాదాల కొరత ఏర్పడింది. ముందుగా సిద్ధం చేసిన లడ్డూ ప్రసాదం విక్రయాలు రాత్రి ఏడుగంటలతో పూర్తయ్యాయి. అప్పటి నుంచి ప్రసాద విక్రయాలు నిలిపివేశారు. ప్రసాదాల కోసం కౌంటర్ల ముందు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. కోటప్పకొండలో రెండువైపులా స్తంభించిన ట్రాఫిక్ కోటప్పకొండలో ఆదివారం రాత్రి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఘాట్రోడ్డులో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో మెట్లమార్గం వైపుకు భక్తులు వెళ్లినా వారు కిందకు, కింది నుంచి పైకి రాలేని పరిస్థితి నెలకొంది. -
పల్నాడు
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం ఆదివారం 537.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 21,176 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు ఆదివారం 2,304 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 11.1 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. కొండ దిగువన కొలువుదీరిన విద్యుత్ ప్రభలుగుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను తుంగ లో తొక్కింది. విద్యా రంగానికి కేటాయింపులు పెంచకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకానికి నిధులను తగ్గించడం ద్వారా వేలాది మంది విద్యార్థులను అనర్హులుగా చేయాలని ఆలోచన తగదు. – వై.థామస్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుకోటప్పకొండకు7 -
అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్
చీరాల:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉంది. సున్నాలు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పారో అది అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ హామీలకు ఏ మేర కేటాయింపుల చేశారో స్పష్టత లేదు. నిరుద్యోగ భృతి, సున్నా వడ్డీ, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50ఏళ్లకే పింఛన్ వంటి హామీలకు కేటాయింపులు లేవు. – కరణం వెంకటేష్బాబు, వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి -
భక్తులకు లేదు తోవ
వీఐపీలకు సేవ సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకే పెద్దపేట వేస్తామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు వీఐపీల తాకిడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ. 200, రూ.500 అభిషేక దర్శనం క్యూలైన్లను భక్తులు స్వామివారిని దర్శించుకున్నందుకు దాదాపు నాలుగు గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీలతోపాటు అధికారుల కుటుంబ సభ్యులను పెద్ద సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. కింద నుంచి నేరుగా లిఫ్ట్ సదుపాయంతో వస్తున్న అధికారపార్టీ నేతలు, కార్యకర్తల వల్ల ఆ ప్రదేశంలో భారీ క్యూ కనిపించింది. ఈ సమయంలో శీఘ్ర ,అభిషేక దర్శనం క్యూలైన్ను నిలిపివేయడంతో భక్తులకు స్వామివారి దర్శనం ఆలస్యం అయింది. పోలీసులతో భక్తుల వాగ్వాదం .. స్వామి వారికి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందటంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. వీవీఐపీల సేవలలోనే తరిస్తారా సామాన్య భక్తులను పట్టించుకోరా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భక్తుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో పోలీసులు బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. మాకు ప్రోటోకాల్ ఉంటది ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే బయటకు వెళ్లిపోండి అంటూ పోలీసులు భక్తులపై ఫైర్ అయ్యారు. ఆగ్రహంతో మాట్లాడుతున్న భక్తులు పట్ల పోలీస్ అధికారులు అసభ్యకరంగా బూతుల దండకాన్ని అందుకున్నారు. కొంతసేపటి తర్వాత జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ అక్కడికి చేరుకొని వీ వీఐపీ దర్శనాలలో ఇతరులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ టికెట్ల దర్శనం భేష్... ఆలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంలో కొనుగోలు చేసే వీఐపీ టికెట్ల విధానం సత్ఫలితాలను ఇచ్చింది. గతంలో వీఐపీ పాసుల పేరుతో ఉచితంగా దర్శనానికి అనుమతి ఇచ్చేవారు. దీని వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టంతో పాటు సామాన్య భక్తులు ఇబ్బందిపడేవారు. ఈ ఏడాది వీఐపీ దర్శనానికి రూ.300 టికెట్ ను నిర్ణయించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దాదాపు 6 వేల మంది కి పైగా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్లను కొనుగోలు చేశారు. వీరికి కేటాయించిన టైం స్లాట్ లో కొండకు వచ్చి స్వామివారిని శీఘ్రంగా దర్శించుకున్నారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే వీఐపీ క్యూ లైన్ భక్తులకు సకాలంలో దర్శనం కావడంతో ఈ ఏడాది ఖాళీగా కనిపించింది. నరసరావుపేట నుంచి కోటప్పకొండ తిరుణాలకు వెళ్లిన భక్తులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నరసరావుపేట వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పెట్లూరువారి పాలెం రోడ్ లో నిలిపివేశారు. అక్కడ నుంచి కొండ దిగున ఘాట్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్ కు భక్తులు కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది. కిలోమీటర్కు పైగా ఉన్న బస్టాండ్కు చేరుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో లేని విధంగా నరసరావుపేట వైపు నుంచి వచ్చే బస్సులను దూరంగా నిలిపివేయటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. భక్తుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏడాది నుంచి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల కోటప్పకొండకు వచ్చిన సమయంలో ప్రకటించారు. తిరునాళ్ల రోజు అందరికి స్వామి వారి ఉచిత ప్రసాదం అందజేస్తామన్నారు. అయితే ఆదివారం కొంతమందికే ఉచిత లడ్డూ ప్రసాదం అందింది. ఉదయం 11 గంటల వరకు దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేసి తరువాత లడ్డూలు లేవంటూ నిలిపివేశారు. పలువురు భక్తులు దీనిపై ప్రశ్నించడంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పంపిణీని తిరిగి ప్రారంభించారు. -
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి...
రాష్ట్ర పండుగ హోదాలో కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి వారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం ఉదయం 10.30 గంటలకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు, పూజారులు మంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెలే డాక్టర్ చదలవాడ అరవింద్బాబుతో కలసి ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి, కలెక్టర్ కృతికాశుక్లా, ఎస్పీ కృష్ణారావు, ఆలయ ఈవో చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్త జనసంద్రంగా సత్రశాల
సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ప్రముఖశైవక్షేత్రం సత్రశాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తజనం పోటెత్తి తరలివచ్చారు. వేకువజామునుంచే వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చి దేవస్థానానికి సమీపంలోని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి మల్లన్నస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ప్రధాన అర్చకుల నేతృత్వంలో పలువురు వేదపండితులు ప్రత్యేక పూజలు, స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి శ్రీ చక్రనవవర్ణ అర్చన, కుంకుమార్చ నలు, జలబిందెలతో స్వామివారికి అభిషేకం, గంగపూజ, మంగళస్నానములు, ఖడ్గ ప్రదర్శన, అఖండ దీపారాధన నిర్వహించారు. దేవస్థానం ఆవరణలోని మండపంలో ప్రతిష్టించిన స్పర్శ స్పటికలింగం వద్ద భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి సత్రశాలకు వేలమంది భక్తులు తరలివచ్చి దైవదర్శనం చేసుకున్నారని ఈఓ గాదె రామిరెడ్డి తెలిపారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున నేతృత్వంలో పోలీసులు, మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ బి.వీరస్వామి పలు కూడలలో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా భద్రత చర్యలు చేపట్టారు. స్వామివారిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారికి దేవస్థానం ఈఓ గాదె రామిరెడ్డి, దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, ప్రధాన అర్చకులు నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివనామ స్మరణతో పులకించిన సత్రశాల -
సత్తెనపల్లిలో రూ.3.50 కోట్లతో నిర్మాణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్జీవోస్ సెంటర్లో రూ. 3.50 కోట్లతో అన్ని హంగులతో కూడిన బిలాల్ మసీద్ను(చిన్న మసీద్) ఆదివారం ఢిల్లీకి చెందిన ప్రముఖ మత గురువు ప్రారంభించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజు నిర్వహించారు. సత్తెనపల్లిలో 110 సంవత్సరాల క్రితం ఢిల్లీ నిజాముద్దీన్కి అనుసంధానంగా పవిత్రమైన బిలాల్ మసీద్ (చిన్నమసీద్) నిర్మాణం జరిగింది. ఆ మసీద్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల దానిని కూల్చివేసి నూతన మసీదు నిర్మాణం కోసం ముస్లీం సోదరులు శ్రీకారం చుట్టి విరాళాలు సేకరించారు. లగడపాడు గ్రామంలో... పెదకూరపాడు: మండలంలోని లగడపాడు గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన మస్జీదే మహమ్మదీయను ఉమ్మడి గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజు నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. మార్టూరు: పిల్లల మధ్య ప్రారంభమైన వివాదం పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసిన ఘటన మండలంలోని నాగరాజు పల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అందిన వివరాల మేరకు.. నాగరాజుపల్లి గ్రామం వెలుపల గల భూముల్లో స్థానిక పిల్లలు కర్రాబిళ్ల ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం ప్రారంభమై క్రమేపి వారి పెద్దల వరకు వెళ్లింది. క్షణికా వేశానికి లోనైన ఇరుపక్షాలకు చెందిన పెద్దలు గ్రామంలోని రోడ్లపై పరస్పరం దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాలకు చెందిన ముఖ్యులను స్టేషన్కు తరలించారు. ఈ విషయమై రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరు వర్గాలకు చెందిన సుమారు 50 మందికి పైగా నాగరాజు పల్లి గ్రామస్తులు స్టేషన్ పరిసరాల్లో గుమిగూడటం చర్చనీయంశమైంది. -
కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం
మంత్రి గొట్టిపాటి, కలెక్టర్కు చెక్కు అందజేసిన క్వారీ అసోసియేషన్ యజమానులు నరసరావుపేట: కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తుల వసతుల కల్పనకోసం సంతమాగులూరు మండలం గురిజేపల్లికి చెందిన శ్రీ త్రికోటేశ్వర గ్రానైట్ క్వారీ అసోసియేషన్ రూ.10లక్షల విరాళాన్ని అందజేసింది. ఆదివారం అసోసియేషన్ ప్రతినిధులు ఈ మేరకు చెక్కును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు అందజేశారు. దాతలను ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ అభినందించారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం క్వారీ అసోసియేషన్ వారు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల షూటింగ్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల జట్లు సత్తా చాటి చాంపియన్గా నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న 9వ సబ్ జూనియర్ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల షూటింగ్ బాల్ చాంపియన్షిప్ హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 18 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు హజరయ్యాయి. బాల,బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాల, బాలికలు నువ్వా.. నేనా అన్నట్లు క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానం నెల్లూరు జిల్లా సాధించగా ద్వితీయ స్థానం పల్నాడు జిల్లా, తృతీయస్థానం ఎన్టీఆర్ జిల్లా జట్లు కై వసం చేసుకున్నాయి. నరసరావుపేట టౌన్: ఎన్ఎస్పీ మేజర్ కెనాల్లో స్నానానికి దిగి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం పెట్లూరివారిపాలెం వద్ద చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఓలేటివారిపాలెం మండలం సింగ్నేనిపల్లి గ్రామానికి చెందిన కట్టా రోహిత్(20) హైదరాబాద్లో బేల్దార్ పని చేస్తుంటాడు. కోటప్పకొండ తిరునాళ్ల చూసేందుకు శనివారం రాత్రి ఐదుగురు స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు. పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద ఏఎంరెడ్డి కళాశాల సమీపంలో ఎన్ఎస్పీ కాల్వలో స్నానం చేసేందుకు తెల్లవారుజామున దిగాడు. ఈత రాకపోవటంతో కాల్వలో నీటమునిగాడు. గమనించిన స్నేహితులు అభి, ఎలీషా, శ్రీనాథ్, ఇసాక్, మల్లిఖార్జునలు బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ కిషోర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముగ్గురికి గాయాలు నూజండ్ల: మండల పరిధిలోని పాత, కొత్త ఉప్పలపాడు గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో ములకలూరు గ్రామానికి చెందిన మందా శాంసన్ (28) సంఘటనా స్థలంలో మృతిచెందగా క్షతగ్రాత్రులను 108 ద్వారా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన ధనుంజయ్ ఈదర మీదుగా బైక్పై వినుకొండకు వస్తూ.. మార్గమధ్యంలో వేరే మహిళను ఎక్కించుకుని వస్తున్నాడు. అదే సమయంలో ములకలూరు గ్రామానికి చెందిన శాంసన్ తన మిత్రుడితో కలిసి బైక్పై వినుకొండ నుంచి వస్తుండగా ఉప్పలపాడు గ్రామ సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఽఢీ కొన్నాయి. ప్రమాదంలో శాంసన్ మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుడు మందా శాంసన్కు భార్య నాగమల్లేశ్వరి, ముగ్గురు సంతానం ఉన్నారు. పండుగ రోజు కుటుంబ పెద్ద మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
పూర్తి తిరోగమన బడ్జెట్
చినగంజాం: ఇది తిరోగమన బడ్జెట్ తప్ప పేద వర్గాలకు మేలు చేసే విధంగా లేదు. సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 బడ్జెట్లో కనిపించలేదు. విద్యారంగంలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. సంక్షేమానికి 17.03 శాతం నుంచి 16 శాతానికి తగ్గించారు. అంగన్వాడీ, ఆశాలు వంటి స్కీం వర్కర్లకు సంబంధించి జీతాల పెంపుపై బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనే లేదు. చేనేత వర్గాలకు రిక్తహస్తం చూపారు. పేద వర్గాల వారిపై కక్షతో ఇళ్లస్థలాలు గాని, ఇళ్ళు కట్టించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తుంటే పేద వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. –బత్తుల బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్సీపీ బాపట్ల, ప్రకాశం జిల్లాల టాస్క్ఫోర్స్ పరిశీలకులు -
పెట్లూరు వారిపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్...
నరసరావుపేట మండలం పెట్లూరు వారిపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు వాహనాలు భారీస్థాయిలో నిలిచిపోయాయి. బస్సులోని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. పెట్లూరు వారిపాలెం గ్రామానికి చెందిన రెండు ప్రభలు ఉదయం 11 గంటల సమయంలో కొండకు బయలుదేరాయి. ఆ సమయంలో గుంటూరు–కర్నూలు హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు విమర్శించారు. -
ప్రభవించిన భక్తిభావం..!
కోటప్పకొండ తిరునాళ్లకు తరలిన ప్రభలు, భక్తులు నరసరావుపేట ఈస్ట్: అన్ని దారులు శివయ్య సన్నిధికే.. కోటప్పకొండలో కొలువైన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళుతున్న భక్తులతో నరసరావుపేట పట్టణం భక్తజన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కోటప్పకొండకు అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ మార్గాలలో భక్తుల సందడి అధికంగా కనిపించింది. పల్నాడురోడ్డు, స్టేషన్రోడ్డు, చిత్రాలయ సెంటర్లో యాత్రికుల తాకిడి కనిపించింది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, పల్నాడు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రధాన మార్గాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆధ్వర్యంలో అన్నప్రసాదాలను యాత్రికులకు అందించారు. కొండ దిగువన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన స్టాళ్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు.. పట్టణంలోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతూరులోని భీమలింగేశ్వరస్వామి, పల్నాడురోడ్డులోని కళ్యాణ సుందరేశ్వరస్వామి, వల్లప్పచెరువులోని కేదారేశ్వరస్వామి, బరంపేటలోని వాయు మల్లేశ్వరస్వామి తదితర ఆలయాలలో పూజలు నిర్వహించారు. హైకోర్లు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి దంపతులు కేదారేశ్వరస్వామి వారికి అభిషేకాలు, పూజలు జరిపారు. కొండకు తరలిన ప్రభలు ప్రభల పండగ్గా పేరుపొందిన మహాశివరాత్రి పర్వదినాన జరిగే కోటప్పకొండ తిరునాళ్లకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు తరలివెళ్లాయి. ఉదయం తల్లిదండ్రులు తమ చిన్నారులతో మొక్కుబడి ప్రభలను తీసుకొని కొండకు వెళ్లారు. -
కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్లో కౌలు రైతుల పంట రుణాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో 70 శాతం సాగుభూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, వారికి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ప్రభుత్వం విస్మరించింది. అలాగే గుంటూరు జిల్లాకు నిధులు కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. 50 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగింపునకు, నల్లమడ వాగు ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేక పోవడం శోచనీయం. సంక్షేమ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి తగిన కేటాయింపులు లేవు. – పాశం రామారావు, కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు -
కోటప్పకొండ ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్
పల్నాడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు భక్తులు పోటెత్తడంతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండ కిందకి గాని పైకి గాని కదలకుండా వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా గంటల తరబడి అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా కోటప్పకొండ నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో నరసరావుపేట వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు భక్తులు. కొండ దిగుభాగంలో పూర్తిగా వాహనాలు ప్యాక్ అయిపోవడంతో ట్రాఫిక్ను కంట్రోల్లో తీసుకురావడం కష్టతరంగా మారింది. ఇది క్లియర్ కావడానికి మరికొన్నిగంటలు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. -
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
విద్యుత్ దీపకాంతులలో కోటప్పకొండ ఆలయం కొండ జాతరకువివిధ జిల్లాల నుంచి కోటప్పకొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తుంది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరేవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో 10 మెడికల్ క్యాంప్లు ఏర్పాటుచేస్తున్నారు. సర్వం సిద్ధం -
తిరునాళ్ల విధులను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించాలి
ఎస్పీ బి.కృష్ణారావు నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. తిరునాళ్ల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి బ్రీఫింగ్ కార్యక్రమం శనివారం జెడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ బందోబస్తుకు హాజరైయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది తిరునాళ్ల విధులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డ్యూటీ ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. -
కొండకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా శనివారం కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. సాధారణంగా ఏకాదశి రోజుల కొండలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఏకాదశి రోజున భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా శనివారం ఊహించని విధంగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. నందీశ్వరుడు, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. మండప అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. బాల ప్రభలతో భక్తులు కొండకు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సోఫాన మార్గంలో మెట్లపూజ చేసుకుంటూ కొండమీదకు చేరుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించేందుకు వస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దాదాపు 40 నిమిషాలు పాటు కలెక్టర్ కాన్వాయ్ ట్రాఫిక్లో నిలిచిపోయింది. కొబ్బరికాయ రూ.50 కోటప్పకొండలో దుకాణాదారులు అధిక ధరలకు భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కొబ్బరికాయను రూ.50లకు విక్రయిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇక్కడి రేటు ఇంతే అంటూ భక్తులపై విరుచుకుపడుతున్నారు. దీంతోపాటు వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్కు రూ.10 అదనపు ధరకు అమ్ముతున్నారు. దీనిపై పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
వెన్ను పోటు బడ్జెట్
● టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కేటాయింపులేవి? ● మహిళలకు నెల నెలా రూ.1,500 ఆర్థిక సాయం ప్రస్తావనేది! ● నిరుద్యోగులకు మరోసారి మొండిచేయి ● ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలపై లేని స్పష్టత ● ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ల ఊసేది! ● కొత్త పింఛన్లు మంజూరు ఈ ఏడాదీ లేనట్టే ● బడ్జెట్లో రైతులకు ఒరిగిందేమీ లేదంటున్న రైతు సంఘాల నేతలు సాక్షి, నరసరావుపేట: ఎన్నికలయ్యే వరకు ఓటరు మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది తెలుగుదేశం పార్టీ తీరు. ఎన్నికల్లో గెలవడానికి సూపర్ సిక్స్తో పాటు అలవిగాని హామీలను ఎన్నింటినో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తీరా వాటి అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మరోసారి నిరాశ మిగిలింది. సూపర్–6 పథకాలను ఈ ఆర్థిక సంవత్సరమైనా పూర్తిగా అమలు చేస్తారనుకుంటే వాటి ప్రస్తావనే చేయలేదు. నెల నెలా ఆడబిడ్డ నిధి ద్వారా అందజేస్తామ న్న రూ.1,500 కోసం జిల్లాలో 7,80,538 మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. వారికి గత రెండేళ్లలాగే ఈసారీ మొండిచేయి చూపారు. నూతన పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్కు అర్హత కల్పించి ఉంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.48 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వచ్చి ఉండేది. దీని గురించి ప్రస్తావన చేయలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులకు నిరాశే.. ఇంటింటికి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీ అమలు కోసం జిల్లాలో 6.51 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ బడ్జెట్లో వాటి ఊసేలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. తల్లికి వందన, సుఖీభవ వంటి పథకాల ప్రస్తావన ఉన్నా వాటికి ఇచ్చిన ఆరకొర నిధులతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందేమోనన్న భయం ప్రజల్లో మొదలైంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా ఉండగా కేటాయింపులు అరకొర చేసి మరోసారి పెండింగ్లో ఉంచేలా చేశారు. దీంతో విద్యార్థుల చదువులు ప్రమాదంలో పడనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూసిన పీఆర్సీ, ఐఆర్ల ఊసే లేకపోవడంతో ఆయా వర్గాలు మండిపోతున్నాయి. పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాకు ఏం చేస్తున్నారో పేర్కొనలేదు. -
పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు
అమరావతి: అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివా రం సాయంత్రం పెండ్లికుమారుడైన అమరేశ్వరుడిని పల్లకీ వాహనంలో, పెండ్లి కుమార్తె అయిన బాలచాముండేశ్వరీదేవిని పులివాహనంపై ఉంచి వైభవంగా పురవీధులలో ఊరేగించారు. ఆలయ ఈఓ రేఖ మాట్లాడుతూ భక్తులకు తెల్లవారుజామున మూడు గంటల నుంచే దర్శనం కల్పిస్తామని చెప్పారు. సాయంత్రం 4గంటల వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపా రు. భక్తులకు అందించేందుకు 50 వేల లడ్డూలను తయారు చేయించామని తెలిపారు. సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం
● తరలిరానున్న లక్షలాది మంది భక్తులు ● కొలువుతీరనున్న 26 భారీ విద్యుత్ ప్రభలు ● విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం ● మూడు వేల మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ● 618 బస్సులను కొండకు నడపనున్న ఆర్టీసీ ● పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే తిరునాళ్ల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడువేల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడపనుంది. రాష్ట్ర పండుగ హోదాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి త్రికోటేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఒంటి గంట నుంచి దర్శనం త్రికోటేశ్వర స్వామికి శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పుష్పాలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత, ప్రత్యేక, శ్రీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనాన్ని భక్తులకు కల్పించే విధంగా క్యూలైన్లు సిద్ధం చేశారు. క్యూలైన్లో భక్తులకు ఆరు లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది భక్తులకు ఉచితంగా చిన్న లడ్డూలను అందజేయనున్నారు. సుమారు 1.50లక్షల మంది స్వామి దర్శించుకుంటారని అధికారుల అంచనాగా ఉంది. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 10 నుంచి 15 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర జరిగే కొండ దిగువు ప్రాంతం లక్షలాది మంది యాత్రికులతో కిక్కిరిసిపోతుంది. కొలువుతీరనున్న భారీ విద్యుత్ ప్రభలు ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యుత్ ప్రభలు భక్తులను కనువిందు చేయనున్నాయి. 26 భారీ విద్యుత్ ప్రభలు కొండకు తరలిరానున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కబడి ప్రభులు కొండకు రానున్నాయి. -
చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన
దాచేపల్లి: ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పెదగార్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. దాచేపల్లి నగర పంచాయతీలోని నారాయణపురంకి చెందిన వైఎస్సార్ సీపీ నేత దేరంగుల శ్రీను కుమారుడు రమేష్ (28) చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు శుక్రవారం మృతిచెందాడు. మృతుడు రమేష్కి భార్య సత్యవతి, పెద్దకుమారుడు మహాదేవ్ (3). 25 రోజుల పసిబాబు సంతానం. చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన రమేష్ మృతదేహానికి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్మార్టం పూర్తి చేశా రు. అయితే రమేష్ కుటుబానికి నష్టపరిహారం చెల్లించి భార్యకి ఉద్యోగం అవకాశం కల్పించాలని ప్రధానగేట్ వద్ద బైఠాయించారు. యజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటల తరబడి ఆందోళన చేసినా స్పందించకపోవటంతో రమేష్ మృతదేహంతో ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ ఆందోళన చేయటంతో యజమాన్యం ప్రతినిధులు చర్చలకు పిలిచారు. రమేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి అతని భార్యకి ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై యజమాన్య ప్రతినిధులు చర్చలు కొనసాగిస్తున్నారు. -
యువతకు నిరాశ
రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశపర్చింది. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసింది. వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు నిధులు కేటాయించలేదు. కొత్త ఉద్యోగాల కల్పన కోసం జాబ్ క్యాలెండర్ ఊసేలేకపోగా.. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తోంది. అన్ని రంగాల వర్గాలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. – పడాల శివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి -
నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం
నరసరావుపేట రూరల్: తిరునాళ్ల మహోత్సవానికి పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండ సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం నిర్వహించే ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు జాగరణకు తరలిరానున్నారు. త్రికోటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. భక్తులకు ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం కల్పించే విధంగా క్యూలైన్లు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. క్యూలైన్లలో భక్తులకు అందజేసేందుకు ఆరు లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ కోటప్పకొండకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడు వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొలువుదీరనున్న భారీ విద్యుత్ ప్రభలు ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది 26 భారీ విద్యుత్ ప్రభలు కొలువుదీరనున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కుబడి ప్రభలు కొండకు తరలిరానున్నాయి. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది భక్తులకు చిన్న లడ్డూలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకున్న 281మంది న్యాయవాదులు నరసరావుపేట: రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం స్థానిక న్యాయవాద సంఘ కార్యాలయంలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 303 ఓట్లు ఉండగా 281 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10.30నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు ఉత్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. న్యాయవాద సంఘం అధ్యక్షుడు జీవీసుబ్బారావు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు కట్టా నారపరెడ్డి, సీజే ప్రతాప్, ఎస్.అయ్యప్పరాజు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. మొత్తం ప్రక్రియ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన మూడు సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయబడింది. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ బాక్స్లను ఏపీ బార్ కౌన్సిల్కు కొరియర్ ద్వారా పంపే ఏర్పాట్లు చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్లో నూతనంగా ఏర్పాటు చేసే ఎయిర్ పోర్ట్కు కావాల్సిన భూములను ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు అయిషీరాజ్, పరజిట్ ముఖర్జీలు మాచర్ల తహసీల్దార్ కిరణ్కుమార్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. మాచర్ల మండలం పశువేముల గ్రామంలో భూములను వీరు పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు తమ పరిధిలోని భూములను పరిశీలన జరిపి ఎయిర్ పోర్టు డవలప్మెంట్ అథారిటీ సభ్యులతో మాట్లాడారు. నూతన ఎయిర్ పోర్టు కోసం విజయపురిసౌత్, నాగులవరం, పశువేముల పంచాయతీల పరిధిలో భూమిని సేకరించాల్సి ఉంది. -
అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు
అమరావతి: అమరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాలపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి సమీక్షించారు. అమరేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్, ఈవో రేఖలతో కలిసి వైద్య శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై చర్చించారు. అనంతరం సిబ్బందికి, శిబిరాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రతలు వివరించా రు. భక్తులకు అరోగ్యశాఖ సేవలు 24గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఐఓ డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ శివరత్నకుమార్, డాక్టర్ మౌనిక ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరున్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి వాసంశెట్టి సుభాష్కు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సుభాష్కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు):భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరి సమేత రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఆమంచి సృజన్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం నిత్యహోమం బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం, నెమలి వాహన సేవ జరిగింది. కార్యక్రమాలను ఈవో ఇ.సాంబశివరావు పర్యవేక్షించారు. మహాశివరాత్రికి మల్లయ్య గట్టుకు లాంచీలు ఏర్పాటు విజయపురిసౌత్: ఏపీ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన అనుపు నుంచి ఏలేశ్వరం స్వామి మల్లయ్య గట్టుకు ప్రత్యేక లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక లాంచీ స్టేషన్ యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఏలేశ్వరం గట్టుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం స్పెషల్ లాంచీలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 గా నిర్ణయించడమైందన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్పెషల్ లాంచీల కోసం భక్తులు 97051 88311, 94414 53115 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6300, మోడల్ ధర రూ.5800 వరకు పలికింది. -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
గుంటూరు వెస్ట్: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... కమిటీ సభ్యులు సూచించిన అంశాలసౌ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో నీళ్ల ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్కు నిర్దేశిత ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార తనిఖీ విభాగం హోటళ్లపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాల్సి ఉందని వివరించారు. గ్యాస్ డెలివరీ బాయ్ వినియోగదారుల నుంచి అధికంగా నగదు వసూలు చేస్తున్నారని, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద రంగుల ఐస్ క్రీములు, హానికరమైన ఆహార పదార్థాల విక్రయాన్ని కట్టడి చేయాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని తనిఖీ చేయాలని అన్నారు. సమావేశంలో డీఎస్ఓ పి.కోమలి పద్మ, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, సీపీడీసీఎల్ కార్యనిర్వహక ఇంజినీర్ రమేష్, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. గుండవరం(చేబ్రోలు): మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు ప్రధాన ఆకర్షణ. దీనిలో భాగంగా ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి గొడవర్రు గ్రామ ప్రభ, గుండవరం గ్రామ ప్రభలు క్రమం తప్పకుండా ఆనవాయితీగా ముందు వరసలో ఉంటాయి. వంద సంవత్సరాల నుంచి గ్రామ ప్రభలు భారీ విద్యుత్ ప్రభలను నిర్మించుకొని భక్తిశ్రద్ధలతో గ్రామంలో మహాశివరాత్రి ముందురోజు ఊరేగింపు నిర్వహించి అనంతరం పండుగ రోజున భక్తుల శివనామస్మరణలతో ఆలయానికి చేరుకుంటాయి. గుండవరం గ్రామానికి చెందిన చుక్కా వంశస్తులు ఒక సంవత్సరం, టంకశాల వంశస్తులు మరో సంవత్సరం గ్రామ ప్రభను నిర్మించి క్వారీ ఆలయానికి గ్రామ ప్రభను తీసుకువెళ్లటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడాది చుక్కా వంశస్తులు గ్రామ ప్రభను నిర్మిస్తున్నారు. గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరు లాల్పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు సమక్షంలో జిల్లా మహిళ మోర్ఛా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాజామాధవి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ అన్నారు. మహిళ మోర్చా ఉపాధ్యక్షునిగా వాణి వెంకట్, సాధువాణి, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, స్వాతి, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కాసు శ్రీదేవి, కఠారి పద్మజ, కార్యదర్శులుగా రాధిక, రమ్య, రమాదేవి, లక్ష్మీప్రసన్న, పర్హానా, కోశాధికారిగా డాక్టర్ స్రవంతి, సోషల్మీడియా కన్వీనర్గా వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులుగా లీలారాణి, ఉష, లీల, దుర్గా, పద్మా, బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళ మోర్చా కమిటీకి మహిళ మోర్ఛా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడ్డి నాగమల్లేశ్వరి, గుంటూరు మిర్చి యార్డు డైరెక్టర్ శ్రావణ్కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈదర శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భజరంగ్ రామకృష్ణ, తదితరులు అభినందనలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన శుక్రవారం భ్రమరాంబ అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు. దేవస్థానంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, పంచహారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు గ్రామ బలిహరణ, 8.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, నిత్యౌపాసన, గ్రామబలిహరణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పంచహారతులు ఇచ్చారు. ఆదివారం రాహు కేతు పూజలు, 100 అభిషేకాలు మినహా అన్ని అర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. తెనాలి రమేష్బాబు బృందంచే భక్తిరంజని, నటరాజ నృత్యనిలయం విజయవాడ వారిచే కూచిపూడినృత్యం, వెనిగండ్ల ఉల్లంగుల బ్రహ్మం ఆధ్వర్యంలో గయోపాఖ్యానం నాటకం నుంచి యుద్ధసీను, నిడుబ్రోలు వేపసూరి వెంకట్రావు ఆధ్వర్యంలో బాలనాగమ్మ నాటకం నుండి ఫకీరు, సంగు సీన్లు అద్భుతంగా ప్రదర్శించారు. -
తపోభూమి సత్రశాల
సత్రశాల(రెంటచింతల): పవిత్ర కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న అత్యంత పురాతనమైన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీగంగా భ్రమరాంబా సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినానికి సిద్ధమైంది. అనాదిగా ఈ దేవస్థానం భక్తులపాలిట సంతాన మల్లయ్య స్వామిగా... కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. సంతానం కలగని మహిళ ఇక్కడ కొలువైన స్వామి వారిని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం (నమ్మకం). విశ్వామిత్ర మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. తాను చేస్తున్న కఠోర తపస్సును భగ్నం చేసిన కాకులను విశ్వామిత్ర మహర్షి ఆగ్రహంతో శపించడం వలనే ఈ ప్రాంతంలో కాకులు మచ్చుకై న కనిపించవు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శైవక్షేత్రంలో ప్రతిరోజు మల్లన్న స్వామికి దేవస్థానం ప్రధాన అర్చకుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మహాశివ రాత్రి పర్వదినం రోజు తెల్లవారు జామునుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం తరహాలో ఇక్కడ కూడా వివిధ సామాజక వర్గాలకు చెందిన సుమారు 20 అన్నదాన సత్రాలు ఉన్నాయి. మహాశివ రాత్రి పర్వదినం రోజున ఆయా సామాజక వర్గాలకు చెందిన వారికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తారు. అతిపురాతనమైన శైవక్షేత్రం రాష్ట్రంలోని అతిపూరతనమైన శైవ క్షేత్రాలలో సత్రశాల మల్లిఖార్జున స్వామి దేవస్ధానం ఒకటి. ఈ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల సైతం ప్రతిఏటా తరలివస్తుంటారు. మాచర్ల నుంచి పాలువాయి జంక్షన్, పశర్లపాడు, జెట్టిపాలెం గ్రామాల మీదగా సత్రశాలకు చేరుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలోనే రామాలయం, కుమార స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్తరేశ్వరుని ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, కాలభైరువుని ఆలయం, అన్నపూర్ణదేవి ఆలయం, కాశీవిశ్వేరుని ఆలయం, వెంకటేశ్వరుని ఆలయం, చీకటి మల్లయ్య స్వామి ఆలయం, అమర లింగేశ్వర స్వామి ఆలయం, కృష్ణవేణి ఆలయం కొలువై ఉన్నాయి. దేవస్ధానానికి విచ్చేసిన భక్తులలో భక్తిపారవశ్యంతో ఆధ్యాత్మికభావం తోణికిసలాడుతుంది. ఆలయ ప్రాంగణంలో నున్న ఏకశిలనంది విగ్రహం, దేవస్థానం మాజీ చైర్మన్ వేముల పిచ్చయ్య నిర్మించిన అతి పెద్దదైన శివయ్య విగ్రహం, మాజీ దేవస్థానం చైర్మన్ బద్దూరి బ్రహ్మారెడ్డి చేతులమీదుగా ఏర్పాటు చేసిన స్పటిక శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు తెల్లవార్లు జాగారం చేస్తుంటారని దేవస్థానం కార్యనిర్వణాధికారి గాదె రామిరెడ్డి, దేవస్థానం చైర్మన్ గుండా వెంకట శివయ్య తెలిపారు. -
ఈ పంట నమోదుపై సూపర్చెక్
నకరికల్లు: సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయ సంక్షేమపథకాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు అన్నారు. మండలంలోని నకరికల్లు, చల్లగుండ్ల గ్రామాల్లో ఈ పంట నమోదు చేసుకున్న పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. సూపర్చెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26లో గ్రామాల్లోని రైతుసేవకేంద్రాల సిబ్బంది నమోదు చేసిన పంటలను జియోఫెన్సింగ్తో తనిఖీ చేశామన్నారు. మండలంలో రబీ సీజన్లో 7,752 హెక్టార్లలో వరి, 1,598 హెక్టార్లలో మొక్కజొన్న, 71 హెక్టార్లలో ఇతపంటలు సాగుచేస్తున్నట్లు నమోదైందన్నారు. జియోఫెన్సింగ్తో 18,839 ఎకరాల్లోని పంటలను నమోదు చేయడమైందన్నారు. సాగుచేస్తున్న పంటలకు ఈ పంటనమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతుసేవ కేంద్రాల సిబ్బందిని సంప్రదించి ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకొని రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.దేవదాసు, గ్రామ వ్యవసాయ సహాయకులు వై.ప్రభాకర్, ఎస్.విజయనరసింహ, ఏఈఓ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జియోఫెన్సింగ్ సూపర్చెక్లో పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు -
భక్తుల భద్రతే ధ్యేయంగా ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది భక్తుల సంఖ్య గతేడాది కంటే 30 శాతం అధికంగా ఉంటుందని, సుమారు 1.50 లక్షలకు పైగా భక్తులు దర్శనానికి వస్తారని అంచనాతో ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రధానంగా శనివారం అర్ధరాత్రి (తెల్లవారితే శివరాత్రి) ఒంటి గంట నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక ఉచిత క్యూలైన్లు ఏర్పాటుచేశామన్నారు. ఆన్లైన్లో అన్ని రకాల టికెట్లతోపాటు రూ.300 వీఐపీ టికెట్లు 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, కొండపై కౌంటర్లలో రూ.100, రూ.200, రూ.500 టికెట్లు ఆఫ్లైన్లో సైతం లభిస్తాయన్నారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి 20 గ్రాముల లడ్డూ ఉచితంగా అందజేస్తారని, లడ్డూ కొనుగోలు చేసేందుకు 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్వదినాన పలు ప్రాంతాల నుంచి మొత్తం 618 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ఇందులో కొండపైకి భక్తులు వెళ్లేందుకు 120 బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్కార్డు ఉన్న ప్రతి మహిళకు సీ్త్రశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల కోసం 6 లక్షల వాటర్ బాటిళ్లు, లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లు, లక్ష బిస్కెట్లు ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా షేడ్ నెట్లు ఏర్పాటు చేశామని, 10 మెడికల్ క్యాంపులు, 170 మంది వైద్య సిబ్బంది, ఎనిమిది అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని అన్నా రు. 440 మంది సిబ్బందితో నిరంతర పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తామని, 16వ తేదీ వరకూ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతుంటాయన్నారు. 2500 మంది సిబ్బందితో బందోబస్తు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణారావు మాట్లాడుతూ భక్తుల రక్షణ కోసం 2500 మంది పోలీస్ సిబ్బంది, తొమ్మిది ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కొండపైన, దిగువన 100 సీసీ కెమెరాలు, 30 డ్రోన్ల తో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. దొంగతనాల నివారణకు మఫ్టీలో క్రైమ్ టీమ్స్ నిత్యం పహారా కాస్తాయన్నారు. నరసరావుపేట, వినుకొండ నుంచి వచ్చే వారు పెట్లూరివారిపాలెం దారిలో రావాలని, చిలకలూరిపేట భక్తులకు శారదా ఫార్మసీ కాలేజీ వద్ద పార్కింగ్ ఏర్పాటుచేశామని, యల్లమంద, గురవయ్యపాలెం దారిలో వచ్చే భక్తులకు యాదవ, రెడ్ల సత్రాల పక్కగా పార్కింగ్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 విద్యుత్ ప్రభలు, 3 ఇతర ప్రభలు కొండకు వచ్చేందుకు నమోదు చేసుకున్నాయన్నారు. అత్యవసర సహాయం కోసం 94409 00885నంబరులో సంప్రదించాలని సూచించారు. -
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు డిమాండ్ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన హామీల్లో భాగంగా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలనీ, అప్పటి వరకు 30 శాతం మధ్యంతర భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అధ్యక్షత వహించిన ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ, రూ.34 వేల కోట్లను దశల వారీగా విడుదల చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఏమండీ మాట్లాడుతూ జిల్లాను యూనిట్గా తీసుకొని కారుణ్య నియాకాలను పూర్తి చేయాలన్నారు. పెన్షనర్ల నగదును ఉద్యోగ విరమణ రోజు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాకు మద్దతు ఇచ్చిన సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. నాలుగు విడతల డీఏ మంజూరు చేయాల్సి ఉండగా ఒక డీఏతో చేతులు దులుపుకున్నదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలసి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జె.గంగాధర్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.చంద్రజిత్ యాదవ్, వెంకట కోటయ్య, రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు షేక్.కరిముల్లా, జిల్లా పరిధిలోని మండలాల అధ్యక్ష్య, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
హరహర.. త్రికోటేశ్వరా..
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 536.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 36.0467 టీఎంసీలు. అమ్మవారికి బోనాలు గురజాల:పల్లెగుంత రోడ్డులో వేంచేసి ఉన్న లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వామి వారికి శుక్రవారం బోనాలు సమర్పించారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు.ఈ–పంట.. మేలంట గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి నుంచి మహాశివరాత్రి వరకు మూడు రోజుల పాటు కోటప్పకొండలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం కోటప్పకొండలో భక్తుల రద్దీ నెలకొంది వేలాది మంది స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలవిరాట్ అభిషేకాలు నిలిపివేయడంతో అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. -
కప్పం కడితేనే దుకాణాలకు అనుమతి
నరసరావుపేట రూరల్: ‘మేం అడిగినంత ఇస్తేనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. మాకు తెలియకుండా ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తాం’ అంటూ పల్నాడు జిల్లా కోటప్పకొండలోని రైతులను, దుకాణాదారులను నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చదలవాడను బాధిత రైతులు కలిసి గోడును వెళ్లబోసుకోగా.. తన అనుచరులు చెప్పినట్టు చేయాలని ఆయన చెప్పడంతో రైతులు కోటప్పకొండలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్లకు లక్షలాది మంది తరలివస్తారు. యాత్రికుల కోసం కొండ దిగువన జాతర జరిగే ప్రదేశంలో దుకాణాలు, వినోదం కోసం జెయింట్ వీల్ వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. తమ భూముల్లో దుకాణాలు పెట్టుకున్నందుకు వ్యాపారుల నుంచి రైతులు కొంత మొత్తాన్ని అద్దె దూరంలో తీసుకుంటారు. ఈ మొత్తంలోనే కొంత గ్రామ పంచాయతీకి పన్నుగా చెల్లించేవారు. అయితే.. రెండేళ్లుగా తిరునాళ్లలో నిర్వహించే దుకాణాలపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరుడు, తెలుగు యువత నాయకుడు నాగూర్మీరా గత ఏడాది దుకాణాదారులు, జెయింట్ వీల్ నిర్వాహకుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. ఈ ఏడాది కూడా రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి జెయింట్ వీల్ నిర్వాహకులు సామగ్రితో కొండకు చేరుకోగా.. నాగూర్మీరా అనుచరులు అడ్డుకోవడంతో రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మా భూముల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే మీకెందుకు డబ్బులివ్వాలి’ అని రైతులు నిలదీశారు. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మాకు డబ్బులు ఇవ్వాల్సిందే’ అని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు. దీంతో రైతులంతా ఎమ్మెల్యే చదలవాడను కలిసి గోడు వెళ్లబోసుకోగా.. నాగూర్మీరా చెప్పినట్టే చేయాలని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో చేసేదిలేక రైతులంతా కోటప్పకొండకు చేరుకుని జాతర జరిగే స్థలంలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ‘మేమంతా టీడీపీ, జనసేన అభిమానులమే. టీడీపీ కూటమి విజయం కోసం కృషి చేసిన మాకే ఇలా అన్యాయం చేస్తే ఎలా’ అని ప్రశి్నంచారు. -
నేడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు
నరసరావుపేట: స్థానిక బార్ అసోసియేషన్ హాలులో శుక్రవారం ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్లో పాల్గొనేందుకు స్థానిక న్యాయవాదులు సమాయుత్తమయ్యారు. బార్ కౌన్సిల్కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది న్యాయవాదులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక బార్ అసోసియేషన్కు చెందిన 303 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి ఒక్కరూ బ్యాలెట్ పేపర్పై ఐదుగురికి తప్పనిసరిగా ఓటు వేయాల్సి ఉంటుంది. తాము ఎంపిక చేసుకున్న అభ్యర్ధులకు ఆంగ్లంలో ఓఎన్ఇ ఒన్, టీడబ్ల్యుఓ టు అంటూ ఐదుగురి పేర్లు ఎదుట ఆంగ్లంలో రాస్తేనే ఆ ఓటుకు విలువ ఉంటుందని, లేనిపక్షంలో ఇన్వాలిడ్ ఓటుగా పరిగణిస్తారని సీనియర్లు తెలియచేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లను సాయంత్రం నుంచి బార్ అసోసియేషన్ హాలు వద్ద చేపట్టి పూర్తిచేశారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బార్ కౌన్సిల్కు పోటీ చేస్తున్న పలువురు సీనియర్ న్యాయవాదులు స్థానిక బార్కు స్వయంగా వచ్చి న్యాయవాదులను కలిసి తమకు మద్దతు తెలియచేయాలని అభ్యర్ధించారు. పోటీలో ఉన్న గుంటూరుకు చెందిన పలువురు న్యాయవాదులకు మద్దతుగా స్థానిక న్యాయవాదులు ప్రచారం చేస్తూ తమ మద్దతుదార్లను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. సమాయత్తమైన స్థానిక న్యాయవాదులు -
పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు
అమరావతి: బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం వేద పండితులు, అర్చకులు అమరేశ్వరుడికి పెండ్లి కుమారునిగా అలంకరణ చేశారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో బాలచాముండికా సమేత అమరేశ్వరుడికి విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్, స్వామి వారికి కల్యాణోత్సవ పట్టువస్త్రాలను సమర్పించారు. అమరేశ్వరునికి వేకువ జామున అభిషేకం చేసి నూతన వస్త్రఽ దారణతో పెండ్లి కుమారుని చేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ కల్యాణోత్సవాలకు అర్చకులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేఖ చేతుల మీదుగా దీక్షా వస్త్రాలు సమర్పించారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన కేతవరం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న తండాల వాసులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ముంపు గ్రామాలకు చెందిన గిరిజనులు మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్టీ కమిషన్ ను వినతి పత్రం అందజేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన కేతవరం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న వారి వద్దకు వెళ్లి జేసీ వారి సమస్యలు తెలుసుకున్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అటవీ ప్రాంతంలో ఎందుకు నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా తాండ వాసులు పునరావాస కేంద్రాల్లో పనులు లేక పూట గడవడం కష్టంగా ఉందని జేసీకి తెలిపారు. దాదాపుగా 150 కుటుంబాల వరకు స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని తమకు వచ్చిన వ్యవసాయం చేసుకుంటూ, చేపల వేట సాగిస్తూ జీవిస్తున్నామన్నారు. తమ నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులైన రహదారి, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. వివరాల నమోదు చేసుకుని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జేసీ వివరించారు. కార్యక్రమంలో సత్తనపల్లి ఆర్డీవో రమణ కాంత్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, అటవీశాఖ అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ -
రీ సర్వే సక్రమంగా నిర్వహించాలి
కర్లపాలెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా ఆదేశించారు. గురువారం ఆర్డీవో యాజలి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ యాజలి గ్రామ సచివాలయ పరిధిలో రీ సర్వే పనులు మందకొడిగా జరుగుతున్నాయని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో అలసత్వం వహించే సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల రీసర్వేతో పాటు ప్రభుత్వ సర్వేలన్నీ సకాలంలో పూర్తి చేయాలని సచివాలయం సిబ్బందికి చెప్పారు. ఆర్డీవో వెంట కర్లపాలెం తహసీల్దార్ శ్రీదేవి ఉన్నారు. ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ‘ఏఏ గ్రేడ్’ చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మక ‘ఏఏ గ్రేడ్’ లభించిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ స్వయం ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 29వ ర్యాంక్ సాధించి ‘ఏఏ గ్రేడ్’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సులలో విజ్ఞాన్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొత్తం 4,881 కోర్సు సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. వీటిలో 145 గోల్డ్ సర్టిఫికెట్లు, 424 సిల్వర్ సర్టిఫికెట్లు, 2,136 ఎలైట్ సర్టిఫికెట్లు, 2,176 సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఉన్నాయని వివరించారు. 61 ఎన్పీటీఈఎల్ స్టార్స్ సర్టిఫికెట్లు లభించడంతో పాటు, 106 మంది విద్యార్థులు టాపర్స్గా నిలిచారని వెల్లడించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వరుసగా తొమ్మిదవ సారి జాతీయ స్థాయిలో టాప్–100లో స్థానం సంపాదించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ‘ఏఏ గ్రేడ్’ సాధించడానికి కృషి చేసిన టీం సభ్యులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
ప్రభుత్వాల అరాచకాలను తిప్పికొడదాం
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ఏపీ డబ్ల్యూజేఎఫ్, యూటీఎఫ్, ఏపీటీఫ్ నాయకులు, స్కీం వర్కర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకింగ్, కార్మిక రైతాంగ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన అనంతరం సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్, ఏఐటీయుసీ రాష్ట్ర నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ రైతులు, కార్మికులు, స్కీం వర్కర్లు పేద ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్ల కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను అమలు చేసేది లేదని కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ కార్మిక రక్షణ చట్టం లేబర్ కోడ్ల పరిధిలో లేదని కార్మికులకు పనిచేసే ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యంకు సంబంధం లేని విధంగా కోడ్లు రూపొందించారని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఐ నాయకులు ఎ.మారుతీ వరప్రసాద్, రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము, ఎన్జీఓ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు ఎం.రాజ్యలక్ష్మి, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.నాగేంద్రప్రసాద్, యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు, ఏపీటీఫ్ నాయకులు బి.సంపత్బాబు, సీఐటీయూ నాయకులు డి.శివకుమారి, సిలార్ మసూద్ ఎం.ఆంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య, రైతు సంఘం నాయకులు సీహెచ్.సత్యనారాయణరాజు, రోడ్డ అంజిరెడ్డి, నాగేశ్వరావు పాల్గొన్నారు. -
పల్నాడులో వ్యవసాయ సంక్షోభం
దాచేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని ఆయన ధ్వజమెత్తారు. గతేడాది పంటలు బాగా పండితే గిట్టుబాటు ధరలేకండా చేశారని, ఈ ఏడాది ప్రత్తి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతే మిర్చి పంటకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయాలని, గతేడాది ఇస్తామన్న రూ.20 వేలు ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ సంవత్సరం ఇస్తామన్న దాంట్లో సగమే ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఏడాదికి ఉచితంగా ఇస్తామన్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం లేదని, మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 కూడా ఇవ్వటంలేదని, అసులు ఇస్తారా ఇవ్వరా అనే ప్రజలకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదని, అన్ని పథకాలు అరకొరగా ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము తెచ్చిన మెడికల్ కళాశాల, పిడుగురాళ్ల బైపాస్, మున్సిపల్ కార్యాలయాలకు శిలఫలకాలు పెట్టి ప్రారంభించటం సిగ్గుచేటన్నారు. ఎండకాలం రాకముందే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, మేము తెచ్చిన రూ250 కోట్ల జలజీవన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన చెప్పారు. మంచినీళ్ల కోసం మేము తెచ్చిన పైపులను కొంతమంది టీడీపీ నాయకులు దొంగిలిస్తున్నారని, చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, రేపు విప్లవం కూడా వస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునగా పున్నారావు, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, ఎంపీపీ కందుల జాను, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్భాషా, కొమరబత్తిన విజయ్కుమార్, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్సత్తార్, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి వారు రుద్రాక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి ఉదయ్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఉదయ్కుమార్, బాలగంగాధర గుప్తా, రంగా సత్యనారాయణ, శివ మోహన్మూర్తి సురేంద్రబాబు, పెద్దబాబు, శివప్రసాదరావు, రంగారావు గుప్తా, రవీంద్రనాఽథ్ గుప్తా, గోపాలకృష్ణ కుమార్, మధు సూదన వెంకట సుబ్బారావు, చెన్నకేశవ శేషగిరిరావులు వ్యవహరించారు. ఈవో గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్ : మంగళగిరిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న వాహనాన్ని పలువురు గోసంరక్షణ వాదులు వెంబడించి కాజ టోల్గేటు వద్ద అడ్డుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా గో సంరక్షణ, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఓ చిన్న వాహనంలో సుమారు 25 దూడలను పెట్టి, వాటికి ఊపిరి ఆడకుండా చేయడంతో వాటిలో ఏడు దూడలు మృత్యువాత పడ్డాయని, సుమారు 12 గంటల పాటు వాటికి నీళ్లు, ఆహారం లేక సొమ్మసిల్లి పోయాయని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన 21న ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీలు హాజరై అజెండాలోని అంశాలపై చర్చిస్తారు. తాడికొండ: తుళ్ళూరు మండలం పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ మాజీ సర్పంచ్ కొండా సాంబిరెడ్డి లక్ష రూపాయలు, మేక భారతి లక్ష రూపాయలు, కొల్లి కోటిరెడ్డి 50 వేల రూపాయలు చెక్కులను గురువారం మేనేజింగ్ ట్రస్ట్ ఎంవీ రామిరెడ్డికి అందజేశారు. దాతలు కొండా సాంబిరెడ్డి, మేక భారతి మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ట్రస్ట్కు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దాతలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026నేటి నుంచి కోటప్పకొండ మహాశివరాత్రి మహోత్సవంఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు.తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4,800, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.5,400 వరకు పలికింది. బాపట్ల టౌన్: బాపట్లలోని బాలిక సదనంలో 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వసతిగృహం నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, రక్షణ కరువైన బాలికలకు నీడ కల్పించడమే బాల సదనం ముఖ్య ఉద్దేశం. 6–18 ఏళ్ళలోపు బాలికలకు ఉచిత ఆశ్రయంతోపాటు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం అర్ధరాత్రి బాపట్ల బాలిక సదనంలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వసతిగృహం వార్డెన్లు, సూపరింటెండెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. సహచర విద్యార్థులు ఈ విషయాన్ని చెప్పడంతో గంట తర్వాత వారు అప్రమత్తమయ్యారు. ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో గాలించారు. పట్టణ శివారులోని కంకటపాలెం గేటు సమీపంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కొన్నేళ్లుగా వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. అధికారులు వారిని చిత్రహింసలకు గురిచేయటం, వెట్టిచాకిరి చేయించడంతోనే పారిపోవాల్సి వచ్చిందని సమాచారం. ఇటీవల బంధువులకు ఫోన్ చేసినప్పుడు కూడా తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని, ఇంటికి వచ్చేస్తామని వాపోయినట్లు తెలిసింది. బాల సదనం సూపరింటెండెంట్ ఎస్.సుబ్బలక్ష్మి మాట్లాడుతూ... హాస్టల్ గేటుకు వేసిన తాళాలు తీసుకొని వారిద్దరు పారిపోయారని, పోలీసుల సహాయంతో రాత్రి 10.45 గంటల సమయంలో తిరిగి తీసుకొచ్చామని తెలిపారు.నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి కోటప్పకొండలో గురువారం ఆమె పర్యటించారు. క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదని ఆదేశించారు. ఆర్డీవో మధులత, ఈవో డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కోటప్పకొండలో గురువారం ఆయన పర్యటించి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. లక్షలాది మంది వచ్చే తిరునాళ్లకు అరకొరగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సత్రాలకు నీటిని సరఫరా చేసే శంభులింగం చెరువును ఇప్పటి వరకు నీటితో నింపలేదని తెలిపారు. మరమ్మతులు పూర్తికాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వచ్చే లింకు రోడ్లు మరమ్మతులు కూడా చేపట్టలేదని తెలిపారు. ఘాట్ రోడ్డు టోల్ గేట్ ద్వారా సంవత్సరానికి రూ.60 లక్షల ఆదాయం అటవీ శాఖకు వస్తున్నా మొక్కలకు నీళ్లు కూడా అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. కొండకు కిలోమీటరు దూరంలో బస్టాండ్ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రోజుకొక గ్రూపుతో కొండకు వచ్చి రోడ్లు ఉడ్చి వెళ్లడం మినహా ఏర్పాట్లు జరుగుతున్న తీరును పట్టించుకోవడం లేదని విమర్శించారు. Iనరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల జాతర మహోత్సవానికి అంతా సిద్ధమయింది. మహాశివరాత్రి రోజున నిర్వహించే తిరునాళ్లకు రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండలో భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కొండ దిగువున విద్యుత్ ప్రభల వెలుగులతో నిర్వహించే శివరాత్రి జాగరణతో ఉత్సవం ముగియనుంది. కోటప్పకొండ తిరునాళ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి కోటయ్య స్వామికి మొక్కులు చెల్లించుకుని స్వామి వారి సన్నిధానంలో శివరాత్రి జాగరణ చేస్తారు. విస్తృత ఏర్పాట్లు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాట్లపై ఆరా తీస్తున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
బాపట్ల బాపట్ల పట్టణంలోని జాతీయ రహదారి వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య డిమాండ్ చేశారు. విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని గురువారం చల్లా రామయ్య సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజల గుండెచప్పుడుగా ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం, స్మృతివనం నిర్మించేందుకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందుకొచ్చి శంకుస్థాప చేపడితే అడ్డంకులు కల్పించటం సరైన పద్ధతి కాదన్నారు. స్మృతివనం ప్రదేశంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి కుట్రలను చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. విగ్రహాన్ని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేసేవరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు బోడా జాన్ (నాని), డి.పాల్, ఆవుల గోపిరెడ్డి, బి.సోమయ్య, డి.సంజీవులు, బి.గోపి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా -
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెదకాకాని: గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భ్రమరాంబ అమ్మవారిని పెళ్లి కుమార్తె అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 10.30 గంటలకు ధ్వజారోహణ, ఆలయ బలిహరణ, తదితర కార్యక్రమాలు శైవాగమ పద్ధతిన దేవస్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకస్వామి పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ పర్యవేక్షణలో వేదపండితులు, అర్చకస్వాములచే నిర్వహించినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరు పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాలకమండలి చైర్మన్, సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దాతలచే రూ.5 లక్షలతో నిర్మించిన పీపీజీఎల్ షెడ్, గ్రామోత్సవాల సేవలకు దాతలు సమర్పించిన లక్ష రూపాయల విలువైన ట్రక్కును ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్, డీసీ గోగినేని లీలాకుమార్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షెడ్డు దాతలు నందిపాటి రామకృష్ణ శివకుమారి, నందిపాటి భరత్కుమార్ శోభ దంపతులు, ట్రక్కు దాతలు గోగినేని వీరాబాయి, శివరామ్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు. పండగ శోభను సంతరించుకున్న పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం -
భోగభాగ్యాల దేవుడు ... దైద అమరలింగేశ్వరుడు
గురజాల : పల్నాడు ప్రాంతంలోని భక్తులకు భోగభాగ్యాలిచ్చే ... అమరలింగేశ్వరుడు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యారు. కోరిన కోర్కెలు తీర్చుతూ కొలిచిన వారి కొంగు బంగారంగా విలసిల్లుతూ ప్రాచీన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో అనుభూతి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండల పరిధిలోని దైద గ్రామ సమీపంలో కృష్ణానది తీరంలో బిలంలో కొలువై ఉన్న అమరలింగేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రత్యేక పూజలు ప్రతి సోమవారం బిలంలో ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాట్లు చేపడతారు. శివరాత్రి వంటి ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. కృష్ణానదిలో స్నానమాచరించి బిలంలో కొలువై వున్న అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మనస్సులో ఉన్న కోర్కెలు వెంటనే తీరుతాయని భక్తుల విశ్వాసం. దైదకు వెళ్లే మార్గం ఇలా... గుంటూరు నుంచి వచ్చు వారు మాచర్ల బస్సు ఎక్కి గురజాలలో దిగాలి. గురజాల బస్టాండ్ సమీపంలో దైద బస్సులు, ఆటోలు అందుబాటులో వుంటాయి. గురజాల నుంచి సుమారుగా 18 కిలోమీటర్లు దూరంలో కృష్ణానది తీర పరీవాహక ప్రాంతంలో స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది. మాచర్ల నుంచి వచ్చు వారు గుంటూరుకు వెళ్లు బస్సులు ఎక్కి గురజాలలో దిగాలి. శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. కృష్ణానదిలో స్నానమాచరించిన మహిళలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశాం. అదే విధంగా బిలంలోకి వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. మంచినీటి వసతి, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. అదే విధంగా కృష్ణానదిలో భద్రతా చర్యలు చేపట్టాం. –పూర్ణచంద్రరావు, కార్యనిర్వహణాధికారి -
వెట్టి చాకిరి తీవ్రమైన నేరం
చీరాలటౌన్: వెట్టి చాకిరి తీవ్రమైన నేరం.. ఎవరైనా వెట్టిచాకిరీకి వ్యక్తులను నియమించుకోవడం నేరమని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. వెట్టి చాకిరి చట్టం అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయినందున జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన పంపొందించేందుకు వెట్టి చాకిరి నేరం వాల్పోస్టర్ గురువారం చీరాల ఆర్డీవో ఆవిష్కరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం వెట్టిచాకిరి నిర్మూలించిందని, ఎవరైనా ముందస్తుగా డబ్బు, అప్పులు, ఇతర కారాణాలతో వ్యక్తులను బలవంతంగా పని చేయడం విరుద్ధమన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడైనా వెట్టి చాకిరికి నియమించుకున్న సమాచారం తహసీల్దార్ కార్యాలయాల్లో అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో షాడోస్ ప్రతినిధి రాజా సాల్మన్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ భగవాన్ దాస్, షాడోస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుండవరం(చేబ్రోలు): పాత కక్షలు, ఆస్తి గొడవల కారణంగా జరిగిన హత్యాయత్నం కేసులోని ముగ్గురు నిందితులను చేబ్రోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఎస్ఐ పి వీరనారాయణ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల వెంకటేష్కు సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్ల మధ్య ఆస్తి, భూ వివాదాలు, పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్, తొడెమల వెంకట గోపిలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం వెంకటేష్పై కత్తితో దాడి చేశారు. బాధితుడికి మెడతోపాటు పలు చోట్ల కత్తి గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీ జనార్థనరావు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. నిందితులను గురువారం నారాకోడూరు మినీ బైపాస్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పి వీరనారాయణ తెలిపారు. కోటప్పకొండకు 50 బస్సులు చీరాల: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు చీరాల ఆర్టీసీ డిపో నుంచి 50 బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ జె.శ్యామల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోటప్పకొండకు ఆదివారం ఉదయం నుంచి చీరాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశామన్నారు. అలానే చినగంజాం దగ్గర గల సోపిరాలకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. -
అమరేశ్వర దర్శనం సర్వ పాప హరణం
నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అలంకరణలో అమరేశ్వరుడువిశేషాలంకారంలో ఉత్సవమూర్తులు అమరావతి: సకల చరాచరా జగత్తుకు లయకారకుడైన ఈశ్వరుడు మాఘశుద్ధ చతుర్దశి నాడు లింగరూపంలో ఆవిర్భవించిన రోజున జరిపే మహాశివరాత్రి ఉత్సవాలను కలియుగ కై లాసమైన పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రం అమరావతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తజన సులభుడిగా, భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలను చూసి తరించటానికి రాష్ట్ర వ్యాప్తంగా అశేషభక్త జనం అమరావతి రానున్నారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశిక ధర్మకర్తలుగా స్వామివారి కై ంకర్యాలను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు -
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది.సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు. నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు.ఇలా వరుస కేసులతో బాబు సర్కార్.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రొంపిచర్ల: మండలంలోని నల్లగార్లపాడు గ్రామంలో బుధవారం తృటిలో ఓ ప్రమాదం తప్పింది. అధిక వేగంతో వెళ్తున్న ఇసుక లారీ స్కూల్ బస్సును ఢీకొట్టబోయి, అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. స్కూల్ బస్ మాచవరం నుంచి విద్యార్థులతో బయలుదేరి నరసరావుపేట వైపు వస్తుంది. అదే మార్గంలో ఇసుక లారీ మాచవరం గ్రామానికి వెళుతుంది. నల్లగార్లపాడు ఊరి బయట రోడ్డు మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును తప్పించబోయిన ఇసుక లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్లపొదలలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సంఘటన ను చూసిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని లారీ డ్రైవర్ను నిలదీశారు. డ్రైవర్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లారీని అక్కడే నిలుపుదల చేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
అమరావతిని సందర్శించిన జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిని జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ బుధవారం సందర్శించారు. తొలుత పురావస్తు మ్యూజియం, అమరావతి బౌద్ధ స్తూపాన్ని, ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని దర్శించుకున్నారు. తొలుత జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ను ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిం చారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో రేఖ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్శనలో ఆయన వెంట జర్మన్ కౌన్సిల్ ఇండియా ప్రతినిధి సందీప్, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మల్లిఖార్జునరావు, శ్రీహర్ష, రామకృష్ణ, ఏపీ టూరిజం రీజనల్ డైరక్టర్ లక్ష్మీప్రసన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసరావు సత్తెనపల్లి అర్డీవో రమణకాంతరెడ్డి, తహసీల్దార్ డానియేలు తదితరులు ఉన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి అవయవదానం
తాడేపల్లిరూరల్: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ్కుమార్ (20) తాడేపల్లిలోని ఓ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం విజయ్కుమార్కు బ్రెయిన్ డెడ్గా బుధవారం వైద్యులు నిర్ధారించారు. విజయ్కుమార్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయ్కుమార్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డా. కె. రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. గుండె, కాలేయం మణిపాల్ హాస్పిటల్లో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్కు, కిడ్నీలకు విధాత హాస్పిటల్కు, కంటి కార్నియాను విజయవాడ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. విజయ్కుమార్ అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు మణిపాల్ హాస్పిటల్ వర్గాలు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయలు విక్రయిస్తూ పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూరగాయలు విక్రయిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. – ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వెలుగూరి రాధాకృష్ణ మాట్లాడుతూ గత రెండు నెలలుగా పీఏసీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. -
కారులో చెలరేగిన మంటలు
మంగళగిరి టౌన్: కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన మంగళగిరి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు అనంతపూర్కు చెందిన ఆదిత్య జగ్గయ్యపేటలోని కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. గుంటూరులో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్లో బ్యాంకుకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు బుధవారం తన కారులో వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో తాడేపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా మంగళగిరి రత్నాల చెరువు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి రాత్రి 7.30 గంటలు అయ్యింది. ఈ క్రమంలో కారు బ్యానెట్లో నుంచి పొగలు రావడం ఆదిత్య గమనించాడు. వెంటనే కారు పక్కన ఆపి కారులో నుంచి దిగాడు. క్షణాల్లో కారులో మంటలు భారీగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు దాదాపుగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని, సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. -
డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు దిట్ట
చిలకలూరిపేట: రాష్ట్రంలో రాజకీయమంతా తిరుమల లడ్డూ చుట్టూ తిరుగుతోందని, డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు ప్రభుత్వం అరితేరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం ీసీపీఐ అమరవీరులు బొంతా డానియేలు, బొంతా మస్తాన్ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ లడ్డూ వ్యవహారం సైంటిస్టు తెలుస్తారని, చంద్రబాబు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. దేవుడ్ని కూడా రాజకీయాల్లో లాగి రోడ్డు పాలు చేశారని ఎద్దేవా చేశారు. తిరుమలకు వెళ్లేవారు, ప్రసాదం చేసేవారు, దాన్ని స్వీకరించేవారు కూడా హిందువులేనని, ఇందులో అన్యమతస్తులకు స్థానం లేదన్న విషయం తెలిసి కూడా మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ లౌకిక పార్టీ కాదని, బీజేపీతో కలసిన అనంతరం పూర్తిగా మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పార్టీ పట్ల టీడీపీలో ఉన్న లౌకిక వాదులు అప్రత్తంగా వ్యవహరించాలని సూచించారు. సనాతన వాదం అంటూ మాట్లాడుతున్న పవన్న్ కళ్యాణ్కు సనాతన వాదాన్ని అమలు చేస్తారా అని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామని చెప్పుతున్న చంద్రబాబు వేలాది ఎకరాల భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, అప్పులు చేస్తూ కొత్త రికార్డు సృష్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి పుట్టిన బిడ్డపై సైతం రూ. 3లక్షల అప్పు ఉందన్న విషయం తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారని రెండు సంవత్సరాల గడిచినా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేసిందో చంద్రబాబు నాయుడు చెప్పగలరా అని ఆయన నిలదీశారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి సంకోచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల భూములను కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండి పడ్డారు. అసెంబ్లీ బూతుల మయంగా మారిందని, ప్రజా సమస్యల ప్రస్తావనే రావడం లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నంచటం లేదని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాల, మతాల మధ్య రగ్గి రాజేస్తున్నదని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ. మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుభాని, గ్రామ సర్పంచ్ బొంతా తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి
చిలకలూరిపేట: ముస్లిం మైనార్టీల సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చెప్పారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ముస్లిం మైనార్టీ నాయకులు, సంబంధిత వార్డు ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మద్దినగర్, సుభానినగర్లలో ఉన్న కమ్యూనిటీ భవనాల అభివృద్ధి పనుల కోసం ఒక్కొక్క భవనానికి రూ. 30 లక్షల చొప్పున రూ. 60 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో కమ్యూనిటీ భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. సమావేశానికి హాజరైన ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ మదర్థెరిస్సా కాలనీ, టిడ్కో, ఆరిఫుల్లా నగర్, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాకు సంబంధించి ముస్లిం స్మశానవాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. అలాగే పురుషోత్తమపట్నంలో ముస్లిం కమ్యూనిటీ అవసరాల నిమిత్తం మరో కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ను ముస్లింలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా కమిటీ సభ్యులు, వివిధ వార్డుల ముస్లిం కౌన్సిలర్లు పాల్గొన్నారు. పేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని -
టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు సిద్ధార్థ నగర్లోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు. అంబటి సతీమణి విజయలక్ష్మి, ఆయన కుమార్తెలు మౌనిక, మనోజ్ఞతో వారి ఇంటిపై జరిగిన దాడి ఘటన గురించి ఆరా తీశారు. ఇంకా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఉభయగోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చిన్నిమిల్లి వెంకటరాయుడు, మాజీ డెప్యూటీ సీఎం అంజాద్బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ జ్యూడీషియల్ జడ్జి జడ శ్రావణ్కుమార్లు కూడా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందని, ఏడుకొండల వెంకన్నతో పెట్టుకుంటే కర్మ రిటర్న్ అవ్వటం తఽథ్యమని హెచ్చరించారు. శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందని అంటూ కొత్త ఆరోపణలకు తెరదీస్తున్నారన్నారు. వీరి వెంట పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఉన్నారు. -
డాక్టర్ మేరీ గ్లౌరీ సేవలు మరువలేనివి
గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సేవకు ప్రతిరూపంగా నిలిచే గుంటూరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో 36 ఏళ్లు సుదీర్ఘంగా వేలాది మంది రోగులకు చికిత్సలు చేసి, తన చేతి స్పర్శతో వారిని ఆరోగ్యవంతులుగా చేసిన దివంగత డాక్టర్ మేరీ గ్లౌరీకి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆమెను సెయింట్గా గుర్తించే క్రమంలో రెండవ దశ అయిన పూజ్యనీయ (వెనరబుల్గా) స్థానాన్ని పొందడం గుంటూరుకే గర్వకారణమని గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక సెయింట్ జోసెఫ్స్ పాఠశాల ఆవరణలో డాక్టర్ మేరీ గ్లౌరీకి దక్కిన గౌరవ పురస్కారం సందర్భంగా జె.యం.జె. సభ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవం నిర్వహించారు. 17, 22 తేదీల్లో శాప్ లీగ్స్ క్రీడా పోటీలు గుంటూరు వెస్ట్(క్రీడలు): శాప్ ఆదేశాల మేరకు 31 క్రీడాంశాల్లో శాప్ లీగ్స్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 బాల బాలికలు, యువతీ యువకుల చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసి ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–18 యువతీ యువకుల జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు శాప్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు స్కేటింగ్ కోచ్ షేక్ అబ్దుల్ సలామ్ 94934 47566, సైక్లింగ్ కోచ్ కనకరావు సెల్ నెంబర్ 63011 77119ను సంప్రదించాలని కోరారు. -
ఆయిల్పామ్ సాగుతో మెరుగైన లాభాలు
నాదెండ్ల: దీర్ఘకాలిక ఆయిల్పామ్ సాగు వల్ల రైతులు లాభాలు ఆర్జించవచ్చని చిలకలూరిపేట ఉద్యానవన శాఖాధికారి ఆర్. శ్రీలక్ష్మీ చెప్పారు. ఉద్యానవన శాఖ, గోద్రేజ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో గణపవరం, బుక్కాపురం గ్రామాల్లో రైతులకు ఆయిల్పామ్ సాగుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. సారవంతమైన నేల, సాగునీటి వసతి ఉంటే ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. చీడపీడల యాజమాన్యం, ఎరువుల నిర్వహణ, యంత్రాల వినియోగం, ఆధునిక సాగు పధ్ధతులపై రైతులకు ఉద్యానవన శాఖ నుంచి నిరంతరం సహాయ సహకారాలు లభిస్తాయన్నారు. ఉద్యానవనశాఖ అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులు డాక్టర్ సుభాష్, ఉద్యానవన, వ్యవసాయ, సచివాలయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
దూర విద్యలో పరీక్షలే మిథ్య!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ అధ్వానంగా మారింది. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి గత 20 రోజులుగా పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు గత నెలలోప్రారంభమయ్యాయి. వివాదాలు కూడా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దుతున్నామంటూ అధికారులు చేస్తున్న హడావుడి చూసి అందరూ విస్తుపోతున్నారు. ఏఎన్యూ(పెదకాకాని): రాష్ట్ర వ్యాప్తంగా 114 కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు జరుగుతున్నాయి. పర్యవేక్షకులను కో ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ నియమించారు. స్క్వాడ్లను కూడా నియమించాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం. సంస్కరణల పేరుతో జరుగుతున్న పరిణామాలు ఆధిపత్య పోరును చాటుతున్నాయి. రెండవ సెమిస్టర్లో ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో ఒక స్క్వాడ్ను ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన టీం.. పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని, విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతున్నారని గుర్తించింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ ఒక్క సెంటర్ నిర్వాహకుడిని కూడా బాధ్యుడిని చేసిన సంఘటనలు లేవు. ఈ వివాదాలను సాకుగా చూపిస్తూ వర్సిటీని చక్కదిద్దేందుకు ఎఫ్ఏసీ ఇవ్వాలని ఓ అధికారి ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రాలన వారికి పరోక్షంగా సహకారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే వ్యవస్థను చక్కదిద్దవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పరీక్షల కో ఆర్డినేటర్ బుధవారం నుంచి 14 మంది మందితో 7 స్క్వాడ్లను ఎంపిక చేయడం అధికారుల మధ్య భేదాభిప్రాయాలను స్పష్టం చేస్తోంది. పరీక్షల పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందడం కోసమే ఈ ఆరాటమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకత పేరుతో రహస్యంగా తనిఖీ బృందాలను రాష్ట్రమంతా తిప్పుతుండగా... కొందరు అధికారులు కూడా కొన్ని సెంటర్ల నిర్వాహకులతో తెరవెనుక సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు మాత్రం వర్సిటీ అధికారుల పోరులో తమను బలి పశువులను చేస్తున్నారని వాపోతున్నారు. ఈ పరిణామాలపై విసిగిపోయిన కొందరు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు... పరీక్షలకు ముందుగానే ఏ అధికారిని ఏ విధంగా కలిశామో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సెంటర్ను రద్దు చేశాం.. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై దూర విద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లును వివరణ కోరగా... ‘గత నెలలో పొదిలి సెంటర్ను రద్దు చేశాం. ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలపై ఏ సెంటర్పైనా చర్యలు తీసుకోలేదు. వివరాలు సేకరిస్తున్నారు. స్క్వాడ్ ఎంపిక సహజంగా కోఆర్డినేటర్ ద్వారానే జరుగుతుంది. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని అనుసరించాల్సిందే’ అని తెలిపారు. చర్యలు తీసుకుంటాం.. దూర విద్య పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ను వివరణ కోరగా... ‘రెండో దశలో ముగ్గురు సభ్యులతో ఉన్నతాధికారులు ఒక స్క్వాడ్ను ఎంపిక చేశారు. సమాచారం కూడా కొంతమేర గోప్యంగా ఉంచారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. ప్రస్తుతం 14 మందితో 7 స్క్వాడ్లను ఎంపిక చేశా. రాష్ట్రంలోని 114 సెంటర్లను షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేయాలని కోరాం. అక్రమాలకు పాల్పడితే పరీక్ష కేంద్రాల నిర్వాహకులను బాధ్యులను చేయడంతోపాటు చూసి రాతలకు పాల్పడే విద్యార్థులపైనా చర్యలు తీసుకుంటామని’ తెలిపారు. -
టీడీపీలో చిటపటలు
భగ్గుమన్న వర్గ విభేదాలు టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంతపార్టీకి చెందిన రేషన్ డీలర్లను తొలగించాలన్న ప్రయత్నం కాస్తా బెడిసి ఎమ్మెల్యే ఇంటిముందే టీడీపీ వర్గీయులే ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సైతం ఒక్కసారిగా భగ్గుమంది. అధికార పార్టీకి చెందిన వారే చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం ముందు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం చూసేవారికి సాధారణంగా కానవస్తున్నా అంతర్గతంగా ఆధిపత్యపోరే కారణమని తెలియవస్తోంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన సొంత పార్టీ వర్గీయులు -
మెప్మా కుంభకోణంలో ఉద్యోగులపై వేటు
నరసరావుపేట: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో నకిలీ గ్రూపులు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వ్యవహారంలో ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పీడీ మురళీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెప్మాలో జరుగుతున్న అవతకవకలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా స్వయంగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణంలో సుమారు 150 వరకు నకిలీ గ్రూపులు సృష్టించి రూ.20 కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందారనే ఆరోపణలు వైఎస్సార్సీపీ నుంచి వెల్లువెత్తాయి. వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ మెప్మా పీడీ, డీఎస్పీ, నరసరావుపేట ఆర్డీఓలతో ఒక విచారణ కమిటీ వేశారు. వీరు పలువురిని విచారించిన తర్వాత జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేశారు. దీనిపై కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల సిటీ మిషన్ మేనేజర్లు తుమ్మా దీప, ఉమర్ వలి, జి.శ్రీనివాసరావు, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం.మల్లికార్జునరావు, జి.భూదేవి, బి.విజయప్రణతి, కె.శ్రీనివాసరావు, డి.బాలాంజనేయులును సస్పెండ్ చేసినట్లు మెప్మా పీడీ మురళీకృష్ణ పేర్కొన్నారు. -
ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ముఖ్యం
భక్తులకు ఎస్పీ, పోలీసు అధికారులకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశంనరసరావుపేట: భక్తులు ప్రశాంత వాతావరణంలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా పోలీసులు విధులు నిర్వర్తించేలా చూడాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన తిరునాళ్లకు సంబంధించిన వివరాలను గుంటూరు ఐజీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఐజీకి పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు వివరించారు. తిరునాళ్లకు సంబంధించి రూట్ మ్యాప్ ద్వారా తీసుకుంటున్న వివరాలను తెలియచేశారు. దీనిపై ఐజీ పలు సూచనలు చేశారు. భక్తులతో మంచిగా వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో స్వామిని దర్శించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నిర్ణీత ప్రదేశాలలో వాహనాలు నిలిపేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాలు, ప్రభల ప్రదర్శన ప్రాంతాలు, దేవుని దర్శించుకునే సమయంలో రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ (ఏఆర్) సత్తిరాజు, నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఈ సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం తెలిపారు. కార్యక్రమాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబులు పర్యవేక్షించారు. 145 మంది హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. గురువారం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, హాజీ హసన్ బాషా పాల్గొన్నారు. తెనాలి: నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీవారాహి అమ్మవారి దేవస్థానంలో ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ మాచిరాజు వేణు గోపాల్, పెనుగొండ పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పాల్గొన్నారు. ముందుగా వారాహి అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉచిత కోటి కుంకుమార్చనను మహిళలతో చేయించారు. ఈ సందర్భంగా శ్రీవారాహి అమ్మవారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నిర్వాహకులు చివరిగా అతిథులను సత్కరించారు. దాచేపల్లి : మండలంలోని సారంగపల్లి అగ్రహారంలో లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం కనుల పండువలా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పురోహితుడు జానపాటి సీతారామశర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం జరిపించారు. పుణ్యదంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి సూర్యవేణుగోపాల కృష్ణ శ్రేష్టి, కృష్ణకుమారి దంపతులు, ఎల్ కే శర్మ ఇందిరాదేవి దంపతులు వ్యవహరించారు. ఈవో గోపీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వీఐపీ దర్శన టికెట్లకు విశేష స్పందన
ఆన్లైన్లో త్రికోటేశ్వర స్వామి దర్శన టికెట్లు విక్రయంనరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన వీఐపీ దర్శనం ఆన్లైన్ టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంచారు. దేవదాయ శాఖ టెంపుల్స్ వెబ్సైట్లో ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక దర్శనం (రూ.100), శీఘ్ర దర్శనం (రూ.200) టికెట్లతో పాటు వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం టికెట్లు ఇందులో ఉన్నాయి. ఈనెల 9వ తేదీ సాయంత్రం 4గంటల నుంచే ఆన్లైన్లో టికెట్లు విక్రయాన్ని ప్రారంభించారు. అభిషేక దర్శన టికెట్లు 3వేలు, వీఐపీ దర్శన టికెట్లు 2వేలు, శీఘ్ర దర్శనం 11వేలు, ప్రత్యేక దర్శనం 9వేలు టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా పోలీసులు జారీ చేసే కారు పాసులు, వీఐపీ బస్ పాస్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పాస్లు కలిగి ఉన్న కార్లును కొండ దిగువున టోల్గేట్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో వీఐపీ పాస్లతో కొండపైకి చేరుకుంటారు. కారు పాసులు విచ్చలవిడిగా జారీ చేస్తుండటంతో కొండ దిగువున పార్కింగ్ సమస్య తలెత్తుతుంది. జాగరణ జరిగే సమయంలో పెట్లూరివారిపాలెం రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడానికి కార్లు రద్దీ ప్రధాన కారణంగా ఉంది. పెట్లూరివారిపాలెం రోడ్డు నుంచే ఆర్టీసీ బస్సులు కొండకు చేరుకుంటాయి. టోల్గేట్ సమీపంలో కారు పార్కింగ్ వద్ద మెయిన్రోడ్డుపై తరచూ కార్లు నిలిచిపోతుంటాయి. ఇక్కడే ట్రాఫిక్ జామ్ ప్రారంభమవుతుంది. వాహనాల రద్దీతో కిలోమీటర్ల మేర నిలిచిపోయి భక్తులు ట్రాఫిక్లో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. వీఐపీ పాస్లను రద్దు చేసినట్టుగా కారు పాసుల్లో కూడా కోత పెడితే ట్రాఫిక్ జామ్ సమస్యను కొంత వరకు తగ్గించవచ్చని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కారు పాస్ల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఏపీఆర్జే కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య సోమవారం రాత్రి గ్యాంగ్వార్ జరిగిన ఘటన కలకలం రేగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఈ నెల7వ తేదీన కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో బైపీసీ, ఎంఈసీ విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి పెద్దదైంది. దీంతో సోమవారం రాత్రి మెస్లో భోజనాలు చేసేటప్పుడు మళ్లీ గొడవ మొదలైంది. లెక్చరర్లు, వార్డెన్ల సమక్షంలోనే విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో విజయపురిసౌత్కు చెందిన ఎంఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి జరపాల వెంకటేశ్వర్లునాయక్కు కంటికి తీవ్ర గాయమవ్వగా ఎంఈసీ విద్యార్థులు శ్రీనివాస్, చంద్రశేఖర్లకు తలకు బలమైన గాయాలయ్యాయి. కంటికి గాయమైన వెంకటేశ్వర్లు నాయక్ను విజయపురిసౌత్ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకై గుంటూరు శంకర కంటి ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలైన ఇద్దరు విద్యార్థులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ కళాశాలను సందర్శించి గొడవకు కారణం తెలుసుకొని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కళాశాలలో విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి ఘర్షణలు పడడం, విద్యార్థులకు తీవ్రగాయాలై ఆస్పత్రుల పాలవడం తదితర ఘటనల్లో కళాశాల లెక్చరర్లు, హాస్టల్ వార్డెన్ల నిర్లక్ష్యం ప్రస్పుటంగా కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ప్రభల భక్తికి ప్రతీక
పల్నాడుబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● పురుషోత్తమపట్నంలో భారీ విద్యుత్ ప్రభల నిర్మాణం ● ఒకే ప్రాంతం నుంచి 11 ప్రభలు ● కోటప్పకొండ తిరునాళ్లకు సిద్ధమవుతున్న పల్నాడు భక్తి శ్రద్ధలతో ప్రభలు కట్టి దక్షిణామూర్తిని దర్శిస్తే పుణ్యం దక్కుతుందని ప్రతీతి. తిరునాళ్లకు ప్రభలను నిర్మించటం మనదైన, అరుదైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భారీ ప్రభలకు కోటప్పకొండ తిరునాళ్ల పెట్టింది పేరు. మహాశివరాత్రికి రూ.లక్షలు వెచ్చించి ప్రభలు కట్టి చేదుకో...కోటయ్యా...మమ్మాదుకో కోటయ్యా అంటూ దైవ నామస్మరణ చేస్తూ కొండకు వెళ్లటం ఆనవాయితీగా వస్తుంది. – చిలకలూరిపేట కోటప్పకొండకు తరలివెళుతున్న పురుషోత్తమపట్నం ప్రభలు (ఫైల్) సిద్ధమవుతున్న విడదల వారి ప్రభ విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సాధారణంగా ఒక గ్రామం నుంచి ఒకటి లేదా రెండు ప్రభలు నిర్మించటం పరిపాటి. అయితే చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం ప్రభల నిర్మాణానికి పెట్టింది పేరు. ఈ ఒక్కచోట నుంచే 11 ప్రభలు నిర్మాణం చేసుకుంటూ ఉండటం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఒకదానికి మించి మరో ప్రభను రూ.లక్షలు వెచ్చించి విద్యుత్ దీపాలు అలంకరించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ప్రభల నిర్మాణంలో పురుషోత్తమపట్నం వాసులు పూర్తిగా తలమునకలయ్యారు. సుమారు 136 ఏళ్ల కిందట పురుషోత్తమపట్నం నుంచి ఒకే ఒక్క గ్రామ ప్రభను నిర్మించి తిరునాళ్లకు తీసుకువెళ్లేవారని పెద్దలు చెబుతారు. తరువాత కాలంలో క్రమేణ ఇళ్ల పేర్లతో ప్రభలు నిర్మించి తిరునాళ్లకు వెళ్లటం ఆనవాయితీగా మారింది. ఇక్కడ గ్రామప్రభతో పాటు విడదల వారి ప్రభ, బైరావారి ప్రభ, తోటపుల్లప్పగారి ప్రభ, చిన్నతోటవారి ప్రభ, యాదవరాజుల ప్రభలు రెండు భారీ విద్యుత్ ప్రభలు. వీటికి తోడు తోట కష్ణమ్మగారి ప్రభ, బ్రహ్మంగారి గుడి వీధి ప్రభ, మండలనేనివారి ప్రభలు రెండుమధ్యస్థమైనవి. ఇందులో ఏడు భారీ విద్యుత్ ప్రభలు ఒక్కొక్కటి రూ. 18 లక్షలు నుంచి రూ.20లక్షలు పైబడి వెచ్చించి తీర్చిదిద్దుతున్నారు. లైటింగ్ ఏర్పాటుకే ఒక్కో ప్రభకు రూ.14 లక్షలు పై బడి ఖర్చు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. తిరునాళ్లకు ముందురోజు ప్రభలను రాతి చక్రాల బండ్లపై క్రేన్ల సహాయంతో యువకులు మోకులు చేతబట్టి భక్తి శ్రద్ధలతో నిలబెట్టే కార్యక్రమం చేపడతారు. ప్రభలను నిర్మించటం వాటిని కోటప్పకొండకు తరలించటం ఒక యజ్ఞంలా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సహకరించినా, సహకరించకున్నా ప్రతి ఏటా క్రమం తప్పకుండా తమ సంప్రదాయ ప్రభల నిర్మాణానికి ఎలాంటి లోటు తలెత్తకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. తిరునాళ్లకు ముందు రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తిరునాళ్ల నాటికి కొండవద్దకు చేరుకోవటానికి సిద్ధమవుతారు. -
సంభ్రమాశ్చర్యాలు
● మెడికల్ ఎగ్జిబిషన్కు విశేష స్పందన ● భారీగా తరలివస్తున్న విద్యార్థులు ● ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న మెడ్ఫ్యూజన్సిద్ధమవుతున్న బైరా వారి ప్రభ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్.... కేవలం విద్యార్థులనే కాకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మెడ్ఫ్యూజన్ మెడికల్ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటుంది. సందర్శకుల రాక రోజు రోజుకు పెరుగుతుండడంతో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి ఆధ్వర్యంలో వైద్య బృందం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నారు. అనస్తీషియా విభాగం నిర్వహించిన ఎగ్జిబిషన్ విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనస్తీషియా విభాగంలో ఏర్పాటు చేసిన ఫొటో బూత్ వద్ద విద్యార్థులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఫొటో బూత్ ద్వారా అనస్తీషియాలజిస్టు చేసే వివిధ విధులు, ఆయన పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వైద్య విభాగం ప్రత్యేకమే.... గుంటూరు వైద్య కళాశాలలో ఉన్న ప్రతి వైద్య విభాగం కూడా మెడికల్ ఎగ్జిబిషన్లో పాల్గొంది. ఆయా వైద్య విభాగాల ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న విజ్ఞాన విషయాలు, ఆరోగ్యకరమైన అంశాలు, అందరిని ఆకట్టుకుంటున్నాయి. అనస్తీషియా వైద్య విభాగం ఆధ్వర్యంలో కాలక్రమంలో జరిగిన మార్పులు, అభివృద్ధిని బయోస్కోప్ ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. వివిధ నరాలను ఉత్తేజితం చేసినప్పుడు శరీర అవయవాలు ఎలా స్పందిస్తాయో చూపించే ఎగ్జిబిట్కు విశేష ఆదరణ లభించింది. విద్యార్థుల చేతుల ద్వారానే ఇంట్యూబేషన్ ప్రక్రియను ప్రాక్టికల్గా చేయించి చూపించారు. దీంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనాటమీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానవ అస్థి పంజరాలు, శరీర అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, మెదడు వంటి అవయవాలు కళ్లతో చూసి ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతున్నారు. తల్లి కడుపులో ఉండే పసి పిండాలను రసాయనాల్లో నిల్వచేసి చూపిస్తున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఫార్మాకాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మందుల తయారీ, ఏఏ జబ్బులకు ఏఏ మందులు పని చేస్తున్నాయో తెలిపే చార్ట్లు, పెథాలజీ వైద్య విభాగం, రేడియాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వ్యాధులను ఏ విధంగా గుర్తిస్తారనే విషయాలు ఆకట్టుకుంటున్నాయి. న్యూరాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది. మెదడుకు వచ్చే సమస్యలు, చికిత్సలు తెలిపేలా ఏర్పాటు చేసిన చార్ట్లు, చిత్రాలు పిల్లల చిట్టిమెదడులో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. పిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చిన్నారులను , విద్యార్థులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వైద్య విభాగం దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంది. -
టీడీపీ నేతల ఆందోళన
ఎమ్మెల్యే ప్రత్తిపాటి నివాసం వద్ద చిలకలూరిపేట/యడ్లపాడు: సొంత పార్టీ వర్గీయులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద మంగళవారం రాత్రి టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంఘటన సంచలనంగా మారింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రామ మాజీ సర్పంచ్ వర్గీయులైన రేషన్ డీలర్లను తొలగించి కొత్తవారికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పావులూరి పిచ్చయ్య ఆధ్వర్యంలో యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ వర్గీయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ డీలర్లను ఈ నెల డీడీలు కట్టవద్దని ఎందుకు ఆదేశించారు... ఉన్న వాళ్లను తొలగించేందుకే కదా అంటూ ఆందోళన నిర్వహించారు. దీనికి అధికారుల నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో ఆగ్రహించిన తిమ్మాపురం గ్రామస్తులు చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం
మాదల(ముప్పాళ్ళ): కుటుంబ కలహాల నేపధ్యంలో వ్యక్తి ఇంట్లోని దర్వాజాకు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాదల గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంఘటనకు సంబందించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వల్లెపు దుర్గారావు(42) ఆరు నెలల క్రితం భార్యతో కలిసి విజయవాడ పనులకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. భార్యకు ఆమె అక్క భర్తతో వివాహేతర సంబంధం ఉందనే విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పదిరోజుల క్రితం మాదల వచ్చి ఉంటున్నాడు. సోమవారం విజయవాడ నుంచి భార్యను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడగా అక్కడ కూడా గొడవ పడి వెళ్లిపోయాడు. దీంతో భార్య తిరిగి విజయవాడ వెళ్లగా దుర్గారావు మాదలలోనే తన తల్లి వద్దే ఉంటున్నాడు. తల్లి తెల్లవారుజామున లేచిచూడగా దుర్గారావు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట చేయగా దుర్గారావు కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లోనే దర్వాజాకు ఉరిపోసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే దుర్గారావును చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై దుర్గారావు సోదరుడు చెన్నకేశవరావు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. -
అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ ● ఎస్పీతో కలసి ఏర్పాట్లపై సమీక్ష నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచే భక్తులకు త్రికోటేశ్వరస్వామి దర్శనం ప్రారంభిచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లలో ట్రాఫిక్ నిర్వహణపై కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభలు ఉదయం 11గంటలలోపే కొండ వద్దనున్న ప్రభల ప్రాంగణానికి చేరుకునేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. కొండపైకి 120 బస్సులు నడపాలని, షిఫ్టుల వారీగా సిబ్బందిని, అదనపు బస్సులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా పౌర రవాణా అధికారికి సూచించారు. నరసరావుపేట, చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే బస్సులకు ఆయా దారుల్లోనే వేర్వేరు బస్టాండ్లు ఏర్పాటు చేయాలని, డ్రోన్లు, సీసీ టీవీలతో కొండ ప్రాంగణం నిత్య పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొండపై నిర్మించిన నూతన మొబైల్ టవర్ ట్రయల్ రన్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఆర్టీఓ జి.సంజీవరావు, ఆర్టీసీ డీపీటీఓ జి.అజితకుమారి, ఆర్డీఓ కె.మధులత, డీఎస్పీ ఎం.హనుమంతరావు, తహసీల్దార్ వేణుగోపాలరావు, పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడండి -
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల:గుంటూరుకు చెందిన ఎన్.సుధా రాణి టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. విజయపురిసౌత్: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వాణి రాణి మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు http://apgpcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7569333798 ఫోన్ నంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు. రేపల్లె: పట్టణంలో ని శాఖా గ్రంథాలయాన్ని ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యురాలు మగతాల పద్మజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పత్రికా విభాగం, పుస్తక విభాగం, రిజిస్టర్లు, రికార్డులు, శిక్షణ ఫౌండేషన్ కంప్యూటర్ రిజిస్టర్లను పరిశీలించారు. పట్టణంలోని చంద్రమౌళి పార్కులో గ్రంథాలయానికి సంబంధించిన 15 సెంట్ల భూమిలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట:జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించిన మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి షేక్ జమీర్బాషాను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్కు పిలిపించి అభినందనలు తెలియచేశారు. విద్యార్థి తల్లితండ్రులు, డీఈవో రామారావు, ప్రధానోపాధ్యాయులు టి.రవికాంత్ను సైతం అభినందించారు. జమీర్బాషా జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా, ఏపీ నుంచి నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్కు చెందిన జమీర్బాషా ఎంపికయ్యారు. ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి తన ప్రతిభను చాటుకున్నారు. జమీర్బాషాకు ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు శుభాకాంక్షలు తెలియచేశారు. తెనాలి:పట్టణానికి చెందిన సంగీత సంస్థ శ్రీ సీతారామ గానసభ శాసీ్త్రయ సంగీత ఉత్సవా లు మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఆరంభించారు. తొలుత త్యాగరాజస్వామి, గానసభ వ్యవస్థాపకులు నారుమంచి సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు పిరాట్ల నారాయణమూర్తి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగీత ఉత్సవాన్ని ప్రారంభించారు. మొదట రోజు విజయవాడకు చెందిన కుమారి మల్లాది సింధు రాజేశ్వరి సంగీత కచేరి హృద్యంగా సాగింది. వాగ్దేవి కీర్తనలను ఆలపించారు. వయొలిన్పై మీద విజయవాడకు చెందిన అంబటిపూడి కామాక్షి, మృదంగంపై విజయవాడకు చెందిన మాస్టర్ మల్లాది శివానంద ఎస్.ఎస్.వి వాయి ద్య సహకారం అందించారు. గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి పర్యవేక్షించారు. -
పరిశ్రమలకు భూముల బదిలీ ప్రక్రియ పూర్తిచేయండి
ఆర్డీఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమలకు కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆర్డీఓలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసీ భూముల కేటాయింపు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పరిశ్రమలకు భూముల బదలాయింపు ప్రక్రియ కీలకమన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు జిల్లాలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మండల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నారు. నూతన పరిశ్రమలను ప్రోత్సహిస్తూ జిల్లా, నియోజకవర్గస్థాయి ర్యాంప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా పరిశ్రమల అధికారి ఎస్వీ సురేష్, ఏపీఐఐసీ జెడ్ ఎం.నరసింహారావు, ఎల్డీఎం రామ్ప్రసాద్, డీసీసీబీ సీఈఓ ఫణి కుమార్ పాల్గొన్నారు. -
పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్ సీపీ నేతల ములాఖత్
వెల్దుర్తి: జంట హత్యల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను సోమవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ వెల్దుర్తి మండల నాయకులు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వెల్దుర్తి నాయకులు ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించి వారిని ఇబ్బందులకు గురిచేయటం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి సోదరులపై కుట్రతో జంట హత్యల కేసును బనాయించిందన్నారు. ఇలాంటి అక్రమ కేసులు తమ నాయకులను ఏమీ చేయలేవన్నారు. ములాఖత్ అయినవారిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాయంకుల గోపాల్, మండాది సర్పంచ్ శీలం సైదారెడ్డి, కండ్లకుంట సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడికొండ పుల్లారెడ్డి, కండ్లకుంట మాజీ సర్పంచ్ అమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావు నరసరావుపేట టౌన్: మహాశివరాత్రి సందర్బంగా కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హెచ్చరించారు. సోమ వారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన జరిగే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా సాధారణ ప్రభలు 100, విద్యుత్ ప్రభలు 30 నుంచి 40 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలయాల పరిసరాలలో డెకరేషనన్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలు, విద్యుత్ ప్రభల వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభల నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీసభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారుల సమన్యయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్కి అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల ఉత్సవాలు జరిగేలా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్లు ఊడ్చి పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన సమస్యలు పరిష్కరించి..ఆకలి తీర్చాలని విజ్ఞప్తి కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ● ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకట రామయ్య, కె.సత్యనారాయణ, బి.రఘురామ్, పి.సత్యనారాయణ, వై.రామచంద్రరావు, పి.సుబ్బారావు, కె.వీరయ్య, ఏలూరు, కోనసీమ జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట: వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలన దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. జేసీ మాట్లాడుతూ సమష్టి కృషితోనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. వెట్టిచాకిరి ఒక సామాజిక దురాచారమని, భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, కార్మిక శాఖ అధికారులు, నీడ్స్, డీఆర్బీసీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై పోస్టర్ ఆవిష్కరణ.. నరసరావుపేట: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. ఈ వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేఎస్ రాంప్రసాద్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహా -
భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు అందాయి. నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో పాటు పలు మోసాలకు సంబంధించిన 99 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భూ వివాదలపై 27, ఆర్థిక సమస్యలపై 24, భార్యభర్తల వివాదాలు 14, ఆస్తి వివాదాలు 11, ఉద్యోగాల పేరుతో మోసాలపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను డీఎస్పీ ఆదేశించారు. లండన్లో ఉద్యోగం అంటూ మోసం హోటల్ మేనేజ్మెంట్ రంగంలో లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేసినట్టు సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెపాలెంకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. 2024 డిసెంబర్లో నగదు తీసుకుని ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, మోసానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తప్పుడు లెక్కలతో ‘ఫైనాన్స్’ వేధింపులు కారంపూడి మండలం కాకానివారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి 2023లో పాతఆటోను ఫైనాన్స్లో రూ.2.20లక్షలకు తీసుకున్నాడు. ఇందుకు గాను రూ.25వేలు డౌన్ పేమెంట్ కట్టి ప్రతి నెల రూ.9వేలు చెల్లించేవిధంగా ఒప్పందం చేసుకున్నాడు. 24 నెలల పాటు డబ్బులు చెల్లించినా బండి క్లియరెన్స్ ఇవ్వకుండా ఆటో ఫైనాన్స్ వారు వేధిస్తున్నారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. రైల్వే ఉద్యోగం పేరిట టోకరా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన యువకుడు కేతనకొండ ఆర్కే కాలేజీలో పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతూ మానేశాడు. ఆ సమయంలో కడపకు చెందిన వ్యక్తి పరిచయమై రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35.18లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపాడు. పలు మార్లు ఫోన్లో సంప్రదించగా రూ.3లక్షలు తిరిగి ఇచ్చాడని, ఇప్పుడు ఫోన్లో కూడా స్పందించడం లేదని న్యాయం చేయాలని వేడుకున్నాడు. పీజీఆర్ఎస్కు 99 అర్జీలు స్వీకరించిన మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ -
ముగిసిన కొండవీడు ఉత్సవాలు
చరిత్ర, వినోదం మేళవించిన వేడుక యడ్లపాడు: చారిత్రక వైభవానికి నిలయమైన కొండవీడు కోట ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. రెండు రోజుల పాటు పర్యాటకులను, సందర్శకులను అలరించిన ఈ వేడుకలు గతాన్ని స్మరించుకున్నాయి. పగటివేళ కొండపై ఏర్పాటు చేసిన హెలిరైడ్, ఫ్లవర్ స్టాల్, బోటింగ్, శాండ్ ఆర్ట్, ట్రెక్కింగ్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పోటాపోటీగా సాగాయి. సాయంత్రం కొండ దిగువన ఏర్పాటు చేసిన లేజర్ షో, బాణసంచా కాల్పులు, సినీ గాయని గీతామాధురి సంగీత విభావరి, జబర్దస్త్ కళాకారుల కామెడీ స్కిట్లు, వెస్ట్రన్ డానన్స్లు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి బీజీ జనార్థనరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పల్నాడు బీజేపీ అధ్యక్షుడు ఏలూరి, గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్లా, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ సంజనా సింహ, ఆర్డీవో మధులత, డీఎఫ్వో జి. కృష్ణప్రియ, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు హాజరై ప్రసంగించారు. -
వక్ఫ్బోర్డు స్థలంలో షాపుల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే
నరసరావుపేట: స్థానిక మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వక్ఫ్బోర్డు స్థలం టీఎస్ నంబరు 1422లో చేపట్టిన షాపుల నిర్మాణాన్ని యథాతఽథంగా ఆపేయాలని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వరవకట్టకు చెందిన షేక్ అబ్దుల్ఖాజా, అరండల్పేటలో మహబూబ్ సుభాని వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్న షేక్ జానీమౌలాలి వక్ఫ్బోర్డు, మున్సిపాల్టీ ముందస్తు అనుమతులు లేకుండా వక్ఫ్బోర్డు సంస్థ స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్డుమెంట్, స్టేట్ వక్ఫ్బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కలెక్టరేట్లోని ఇన్స్పెక్టర్ ఆడిటర్, అహలే సున్నత్ జామియా మసీదు సంఘం అధ్యక్షులు షేక్ కరిముల్లా, సెక్రటరీ షేక్ రహమత్ఆలీ, కోశాధికారి షేక్ ఖాసీంపీరా, మెంబర్ షేక్ సుభాని, నాయబ్బజారుకు చెందిన షేక్ రహమత్ఆలీ, షేక్ మదీనా రసూల్, బాబాపేటకు చెందిన షేక్ మహబూబ్, వేముల చిరంజీవి, వేముల శంకరనారాయణ, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్లను ప్రతివాదులుగా చూపిస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో ఈనెల రెండో తేదీన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జానీమౌలాలి ఈనెల నాల్గున స్థానిక మున్సిపల్ అధికారులు, విజయవాడ వక్ఫ్బోర్డు సీఇవో, ఈనెల ఏడున వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్కు రాతపూర్వకంగా తెలియచేశారు. అయినప్పటికీ నిర్మాణాలు ఆపకుండా జరుగుతుండటంతో సోమవారం తాను జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి అయిన ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, విద్యుత్శాఖ డీఇలను కలిసి నిర్మాణాలను ఆపాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. పనులను ఆపని పక్షంలో కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ వినతిపత్రంలో పేర్కొన్నామని షేక్ జానీమౌలాలీ వెల్లడించారు. కాంప్లెక్స్కు విద్యుత్ కనెక్షన్ల పెట్టిన దరఖాస్తులను నిలిపివేసి కోర్టు ఉత్తర్వులు అమలుచేయాలని విద్యుత్ శాఖాధికారులను సైతం కోరారు. -
● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ● 15న కోటప్పకొండ తిరునాళ్ల ● అధ్వాన్నంగా రోడ్లు
కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మూడుసార్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం సమీక్షలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరునాళ్లకు మరో మూడు రోజులే సమయం ఉన్నా పనుల్లో వేగం కనిపించడం లేదు. రహదారుల పరిస్థితి ఆధ్వానం ... కోటప్పకొండకు చేరుకునే ప్రధాన రహదారుల మినహా మిగిలిన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిలకలూరిపేట మేజర్ కెనాల్ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. ప్రభలు కొండకు చేరుకునే సమయంలో అర్ధరాత్రి ఈ మేజర్ కెనాల్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఈ రోడ్డును వినియోగిస్తారు. అలాగే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే కొండకావూరు రోడ్డులో కూడా మరమ్మతు పనులు చేపట్టలేదు. యూటీ నుంచి క్రషర్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తారు. ఈ రోడ్దు దుమ్ముతో నిండిపోయి ఉంది. చినతురకపాలెం నుంచి గొనెపూడి, గురవాయపాలెం నుంచి గొనెపూడి రోడ్లు మరమ్మతు పనులు ప్రారంభించలేదు. వడివడిగా పనులు జాతర జరిగే కొండ దిగువున ప్రధాన రోడ్లులో విద్యుత్ దీపాలు ఏర్పాట్లు పనులను ఆర్అండ్బీ ఎలక్ట్రీకల్ విభాగం ప్రారంభించింది. ప్రధాన రోడ్డులో ఐరెన్ పోల్స్కు విద్యుత్ దీపాలు బిగించే పనులు నిర్వహిస్తున్నారు. బారికేడింగ్ పనులు ప్రారంభించలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నూతన ట్రాన్స్ ఫార్మర్స్ను ఏర్పాటు చేసే పని విద్యుత్ శాఖ చేపట్టింది. మేజర్ కెనాల్ వద్ద భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు పనులు ప్రారంభం కాలేదు. క్యూలైన్ వద్ద చలువ పందిళ్లు ప్రధాన ఆలయ గాలిగోపురానికి నూతనంగా రంగులు వేసే పని పూర్తిచేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించే పనులు చేపట్టారు. భక్తులకు ఎండ వేడిమి లేకుండా క్యూలైన్ ప్రారంభంలో చలువ పందిళ్ళు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. లడ్డూ, అరిసే ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్లో మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. -
ఇంకెప్పుడు స్వామీ..!
పల్నాడుమంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కోటప్పకొండ తిరునాళ్లకు 618 బస్సులు మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాలకు గడువు దగ్గర పడుతుంది. ఈ నెల15వ తేదీ మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే తిరునాళ్ల ప్రారంభమైనట్టు భక్తులు భావిస్తారు. ఇందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఏర్పాట్లు కొలిక్కి రాలేదు. కొండకు వచ్చే రహదారులు గోతులమయంగా ఉన్నా ఆ శాఖ ఇప్పటి వరకు మరమ్మతు పనులు చేపట్టలేదు. – నరసరావుపేట రూరల్ కొలిక్కిరాని కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.1380 టీఎంసీలు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 538.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 12,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.6400 వరకు పలికింది. 7 -
మంగళగిరిలో మేఘాలయ ఎన్హెచ్ఎం బృందం పర్యటన
మంగళగిరిటౌన్:గుంటూరు జిల్లా మంగళగిరి లో మేఘాలయ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం పర్యటించింది. ఈ మేరకు అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ అవలంబిస్తున్న విధానాలను మంగళగిరిలోని పలు యూపీహెచ్ సెంటర్లలో సోమవారం బృందం సమీక్షించింది. ఇందిరానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పథకాల అమలు పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న మాత్రలు, ఇతర చర్యల గురించి వైద్య అధికారులు వివరించారు. కార్యక్రమంలో మేఘాలయ ఎన్హెచ్ఎం సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇందిరానగర్ యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్కు జాతీయ గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు వినుకొండ:క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ గీసిన మహేంద్ర మాత మేదరి చిత్రటానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు లభించింది. జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్థమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన జెస్టిస్ను పలువురు అభినందించారు. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ చిలకలూరిపేట: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పీవీ లక్ష్మీ సత్యనారాయణాచార్యులు ఏఈగా విధు లు నిర్వహిస్తున్నారు. ఓ అప్రోచ్రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పెద్ద మస్తానయ్యకు రూ.8 లక్షలు బిల్లు చెల్లించేందుకు మూడు శాతం అంటే రూ. 24 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించటంతో, ముందస్తు వ్యూహం ప్రకారం రూ. 24వేలు లంచం తీసుకుంటుండగా ఏఈను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు పాల్గొన్నారు. గాయత్రీ మాత ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు గుంటూరురూరల్: చౌడవరం గ్రామం దాసరిపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పంచముఖి గాయత్రీ మాత దేవాలయంలో 74వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గాయత్రీ మాత సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి పట్టుచీరె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మహోత్సవాల నిర్వహణను దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ వడ్డే రామిరెడ్డి, సెక్రటరీ వడ్డే విజయభాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలి
నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అధికారులతో కలిసి 105 అర్జీలు స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరం ద్వారా మూడు డివిజన్లకు చెందిన ఆర్డీఓలు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా గురజాల డివిజన్ నుంచి తొమ్మిది, సత్తెనపల్లి ఎనిమిది, నరసరావుపేట నుంచి 20 అర్జీలు స్వీకరించారు. అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు అందజేశారు.


