Palnadu
-
వైఎస్సార్సీపీ మద్దతు
మొక్కజొన్న రైతులకుచంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంపై నేడు రొంపిచర్ల మార్కెట్ యార్డ్లో ‘రైతు ధర్నా’సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వంలో దగా పడ్డ రైతుల పక్షాన నిలిచి పోరాడేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. విత్తనాలు, ఎరువులు, పండించిన పంటలకు గిట్టుబాట ధర వంటి సమస్యలతో ప్రస్తుతం అన్నదాతలు ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. వీటిపై పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచింది. ఇప్పుడు పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేకపోతున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. వారి సమస్యలపై ‘రైతు ధర్నా’ పేరిట నేడు రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలతోపాటు ఇతర పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారు. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లలో తరలిరానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో సాధారణ సాగు 27,065 ఎకరాలు కాగా... 1,34,348 ఎకరాల్లో మొక్కొజొన్న సాగైంది. కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 వరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.800 – రూ.700 వరకు నష్టపోతున్నారు. -
చర్యలు తీసుకోండి
వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా నరసరావుపేట: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత, నిల్వలు, నూతన రీచ్ల ఏర్పాటుపై సమీక్ష చేశారు. ఇప్పటికే అనుమతులు పొందిన సెమీ–మెకనైజ్డ్ ఇసుక రీచులు, సాధారణ రీచ్ల ద్వారా పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. జిల్లాలో భవిష్యత్తు ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా అచ్చంపేట, అమరావతి మండలాల్లో కొత్త రీచ్ల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికలు పంపాలని ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా మైనింగ్ అధికారి నాగయ్య పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేసి పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పర్యాటక అభివృద్ధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్–శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణ స్థితి, వినియోగంపై సమీక్షించారు. పర్యాటక ప్రదేశాలను జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్డీవో బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, మెప్మా పీడీ గోపాలకృష్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ డీవీఎం చైతన్య, డీఇ కుమార్, పర్యాటక అభివృద్ధి మండలి మెంబర్ జాస్తి వీరాంజనేయులు, అమరావతి తహసీల్దార్ డానియల్, ఎంపీడీఓ శివపార్వతి, కోటప్పకొండ ఈఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ ల్యాండ్ మ్యాటర్ సూపరింటెండెంట్ సంజీవకుమారి, ఆర్కియాలజీ సిబ్బంది పాల్గొన్నారు. నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత జిలాల్లో నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’లో గ్రామాలలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై గురువారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో అమలు జరుగుతున్న ’జలధార’ కార్యక్రమం రీతిలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు గ్రామాలలో నీటి వనరులలో మిగులు, లోటు నీటి నిల్వలపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనల గురించి ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా ఉండేలా నీటి పరిరక్షణ కోసం ‘నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, అమలులో అధికారులు సమర్థంగా పని చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ -
కౌలు చెల్లించడం కూడా కష్టమే
మద్దతు ధర రూ.2,400గా ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశా. పంట చేతికి వచ్చేసరికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఆశించా. అయితే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రూ.1,600 నుంచి రూ.1,700 వరకు అడుగుతున్నారు. ఈ ధరలతో అమ్మితే పెట్టుబడి రాకపోగా... కౌలు డబ్బులు కూడా చెల్లించడం కష్టం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – గానుగపంట సుబ్బారెడ్డి, బుచ్చిబాపనపాలెం, రొంపిచర్ల మండలం -
మండలానికో కొనుగోలు కేంద్రం పెట్టాలి
మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.2,400గా ప్రకటించడంతో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 1.34 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. విత్తనాలు మొదలు ఎరువులు, పురుగుమందుల కొరతతో రైతులకు పెట్టుబడి భారీగా పెరిగింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులు రైతులను దగా చేస్తున్నారు. దీనికి నిరసనగా నేడు ఉదయం 9 గంటలకు రైతు ధర్నాకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఇందులో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, రైతు సంఘాల నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి. – డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే -
రైతులను గాలికి వదిలేసిన సర్కారు
చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను తెలియజేయాలన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా దళారులకు కొమ్ముకాస్తూ రైతులను నిలువునా మోసం చేస్తోంది. – అన్నం పున్నారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు -
మద్దతు ధర, తూకంలో మోసం
ఈ ఏడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరానికి సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఇంటికి చేరిన పంటను అమ్ముకోవాలంటే తక్కువ ధరకే వ్యాపారులు అడుగుతున్నారు. రూ.1,700 రేటుకు అమ్ముకున్నా బస్తాకు రూ.700 వరకు నష్టపోతున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తూకంలో సైతం మోసాలు తప్పడం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే మాలాంటి రైతులు అప్పులపాలు కావాల్సిందే. – శ్యాగంరెడ్డి పెద్ద వెంకటరెడ్డి, బెహారావారిపాలెం, రొంపిచర్ల మండలం -
గుడిసెలోకి దూసుకెళ్లిన కారు
తప్పిన పెను ప్రమాదం చిలకలూరిపేట టౌన్: పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వైపు వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి దూసుకెళ్లింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారు చిలకలూరిపేట–నరసరావుపేట రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తూ పొలిరెడ్డిపాలెం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకుపోయి అక్కడే ఉన్న గుడిసెను బలంగా ఢీకొట్టింది. కారు వేగానికి గుడిసె పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి చీకట్లో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ చెన్నకేశవులు తెలిపారు. -
ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి
మాజీ మంత్రి విడదల రజినిచిలకలూరిపేట: ఓటరు జాబితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభం కాబోతోందని, అత్యంత కీలకమైన ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమగ్ర పారదర్శక ఓటరు జాబితాల రూపకల్పన కోసం అంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తీసివేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్కు అందరూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో సమావేశాలు పెట్టుకొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించాలన్నారు. ప్రతి బూత్కు క్రీయాశీలంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున, ఓటర్లను గుర్తించటం, మ్యాపింగ్ చేసుకోవడం వెంటనే జరగాలన్నారు. బీఎల్వోల ద్వారా మనకు తెలియకుండానే ఫామ్ 6, 7 తెచ్చి పెడతారని ఈ విషయంలో సాంకేతిక అవగాహన పెంచుకోవాలన్నారు. -
ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
నరసరావుపేట టౌన్: ఖైదీలకు అందించే ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏ. సలోమి అన్నారు. 13వ అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఆర్. శరత్బాబు ఆదేశాల మేరకు గురువారం సబ్జైలును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని జైలు అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమావేశాన్ని ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. ఖైదీలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాల గురించి వివరించారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేని నిరుపేదలు మండల న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయిస్తే ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సబ్జైలర్ సురభి అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పిడుగురాళ్ల: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం పిడుగురాళ్ల పట్టణ పోలీస్స్టేషన్ను సందర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఫైల్స్కు సంబంధించిన వివరాలు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ రెగ్యులర్ తనిఖీలలో భాగంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు రావటం జరిగిందని తెలిపారు. కొన్ని రికార్డులు పరిశీలించామని, మిగిలినవి కూడా పరిశీలిస్తామని వాటిల్లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ, పిడుగురాళ్ల సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అంబడిపూడి, కోగంటివారిపాలెం, కొండూరు గ్రామాల వీఆర్వో షేక్ ఇబ్రహం రోజు మాదిరిగానే కార్యాలయానికి వచ్చి స్టాఫ్ రూములో కూర్చున్నారు. అతని నుంచి పురుగుమందు వాసన రావడాన్ని గమనించిన తోటి వీఆర్వోలు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మెరుగైన వైద్యం నిమిత్తం హుటాహుటిన సత్తెనపల్లికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మందు తాగి ఉండవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ఎవరి ఒత్తిడి వల్లనైనా మందు తాగాడే, ఇంటి వద్దే తాగి వచ్చాడా, ఆఫీసుకు వచ్చి తాగాడే అనే విషయాలు తెలియాల్సి ఉంది. అసలు విషయాన్ని మాత్రం తహసీల్దారు సిబ్బంది బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచారు. మందు తాగిన వీఆర్వో ఇబ్రహం స్వగ్రామం క్రోసూరు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 527.20 అడుగులకు చేరింది. ఇది 152.7328 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమకాలువకు 2,405, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 4,205 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 4,205 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
19న రాష్ట్ర మహిళా సదస్సును విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న విజయవాడలోని అమరావతి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర సదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారని, బాల, బాలికలకు నాణ్యమైన నైపుణ్యమైన విద్య బోధించడానికి శక్తివంచన లేకుండా వారు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనారోగ్యానికి గురైతే ప్రత్యేక రెస్ట్ రూములు లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల సేకరణకు ఇప్పటికే ప్రయత్నం చేశామని తెలిపారు. సమస్యలన్నింటిని రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో పాటు, విద్యాశాఖ మంత్రికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు రాజశేఖర్, ఎం.కళాధర్ మాట్లాడుతూ విజయవాడ కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సు విజయవంతంలో గుంటూరు మహిళా ఉపాధ్యాయులు ఎక్కువ మంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ. షకీలా బేగం తదితరులు పాల్గొన్నారుయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
మెక్కేస్తున్నారు!
‘మొక్కజొన్న’లోనూ చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో దోచుకుంటున్న దళారులు ఆరుగాలం శ్రమించే రైతులు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. రబీ సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రాల జాడ లేక దళారులు దోచుకుంటున్నారు. తక్కువ ధరలకు విక్రయించలేక కొందరు కల్లాల్లోనే ఆరబెట్టి ప్రభుత్వం ఏదో ఒక రోజు కొనుగోలు చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. రబీలో సాధారణ సాగు : 27,065 ఎకరాలు రైతుకు కలుగుతున్న నష్టం : రూ. 900 రబీలో సాగైన పంట : 1,32,510 ఎకరాలు ప్రస్తుతం మార్కెట్లో క్వింటా: రూ. 1,500 సాగు చేసిన రైతుల : 60,777 మంది మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కరువు నేటికీ జాడ లేని కొనుగోలు కేంద్రాలు ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం క్వింటాపై రూ. 800 –రూ. 900 వరకు నష్టపోతున్న రైతులు -
ఇంటర్లో జిల్లాకు 14వ స్థానం
● సీనియర్ ఇంటర్లో 77 శాతం, జూనియర్లో 73 శాతం ఉత్తీర్ణత ● ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో పరిస్థితి మెరుగు నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. గత ఏడాది సీనియర్ ఇంటర్లో 12, జూనియర్ ఇంటర్లో 13వ స్థానాలలో నిలిచిన పల్నాడు జిల్లా ఈ ఏడాది సీనియర్ ఇంటర్లో 14, జూనియర్ ఇంటర్లో 13వ స్థానంలో నిలిచింది. సీనియర్ ఇంటర్మీడియట్లో 14,381 మంది విద్యార్థులకుగాను 11,114 మంది, జూనియర్ ఇంటర్లో 15,945 మందికిగాను 11,162 మంది ఉత్తీర్ణులయ్యారు. వివిధ విద్యాసంస్థల్లో ఇలా... ● ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా సీనియర్ ఇంటర్లో కేజీబీవీ విద్యాలయాల్లో 87.29 శాతం, ఏపీఆర్జేసీ 93.33, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 60, ఎయిడెడ్ కళాశాలలు 34, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 90.28, హైస్కూల్స్ 63.75, ఏపీ మోడల్ స్కూల్స్ 82 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ● జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 54.48, ఏపీఆర్జేసీ 76.56, ఎయిడెడ్ 16, సోషల్ వెల్ఫేర్ 74.46, హై స్కూల్స్ 41, కేజీబీవీ 82, ఏపీ మోడల్ స్కూల్స్ 79.34 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ● కాగా సీనియర్ ఇంటర్ ఎంపీసీలో గురజాల ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఎన్. లీలా వినయ్ 983, బైపీసీలో పిడుగురాళ్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎం.సుస్మిత జాస్మిన్ 973 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నీలావతిదేవి తెలిపారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు. అలాగే జూనియర్ ఇంటర్ హ్యూమన్ వాల్యూస్ జూన్ 5వ తేదీన, పర్యావరణం పరీక్షను జూన్ 6వ తేదీన నిర్వహిస్తారని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు జూనియర్ ఇంటర్కు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సీనియర్ ఇంటర్కు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. -
ఘనవ్యర్థాల నిర్వహణలో లక్ష్యాలు సాధించాలి
సత్తెనపల్లి: గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధాల నిర్వహణ లక్ష్యాల నిర్దేశం, లక్ష్యసాధన కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి ఎస్వీ నాగేశ్వర్ నాయక్ అన్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ సుప్రీం ఎల్టీసీలో మూడు రోజులపాటు రెసిడెన్షియల్ విలేజ్ ఇమ్మర్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు సందర్భంగా బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ నాయక్ మాట్లాడుతూ క్లస్టర్లలో టీమ్స్ వారీగా ప్రతిరోజు ఉదయం హరిత రాయబార్ల తో కలిసి చెత్త సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి సేకరిస్తున్న విధానం పై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పొడి చెత్తను వేరువేరుగా నిల్వ చేయడం, తడి చెత్త నుండి వర్మి కంపోస్టును తయారు చేయడం, తదితర అంశాల్లోని మెలకువలను గ్రహించారు. ప్రతి గ్రామపంచాయతీ తమ పరిధిలో శుభ్రత, వ్యర్ధాల నిర్వహణ, ప్రజల భాగ స్వామ్యం వంటి అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయుటకు మార్గదర్శకాలు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ సుధారాణి, ప్రకాశం జిల్లా ఆర్పీలు కె.చంద్రమోహన్, అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎఫ్టీసీ పి.మధు, మహేష్, పంచాయతీ కార్యదర్శులు కుంభా వెంకటేశ్వర్లు, చిలుకూరి కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనర్ చెంబేటి బొల్లయ్య, జిల్లాలోని 23 గ్రామాల పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి నాగేశ్వర్నాయక్ -
తెనాలిలో ఎన్క్వాస్ బృందం పర్యటన
తెనాలిఅర్బన్: నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ బృందం తెనాలి నందులపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం తనిఖీ చేసింది. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సభ్యులు ఆరా తీశారు. వైద్యశాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్క్వాస్ సభ్యులు డాక్టర్ అనోజ్, డాక్టర్ రవీషా, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అన్నపూర్ణ, డీపీఎంవో శ్యామ్, జిల్లా కన్సల్టెంట్లు వాసు, మాధవి, డాక్టర్ తేజస్విని, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆసియా, ఎంపీహెచ్ఈవో ఉమాకాంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: నిజాంపట్నం కోస్టల్ గార్డ్ కమాండెంట్గా సాంకేత్ మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతర జ్ఞాపికను ప్రదానం చేశారు. కోస్తా తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. దుర్గమ్మకు రూ.2.69 కోట్ల హుండీ ఆదాయం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు. -
వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం జిల్లా కార్యవర్గం నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పల్నాడు జిల్లా ఎస్టీ విభాగ కార్యవర్గాన్ని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులుగా నల్లగొండ్ల వెంకయ్య (పెదకూరపాడు), రమావత్ బాలకోటినాయక్ (వినుకొండ), మొగిలి వెంకటేశ్వర్లు (గురజాల), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నున్సావత్ రంగనాయక్ (మాచర్ల), వడితే కోట్యానాయక్ (చిలకలూరిపేట), కుంభా వెంకటకోటయ్య (నరసరావుపేట), చేవూరి వెంకటమధు (సత్తెనపల్లి), కొజ్జా కోటేశ్వరరావు (పెదకూరపాడు), కార్యదర్శులుగా వడితే మంత్రూనాయక్ (మాచర్ల), వంకడావత్ శ్రీనివాసనాయక్ (చిలకలూరిపేట), అంగడి ధర్మారావు (వినుకొండ), హంసావత్ నరసింహనాయక్ (నరసరావుపేట), రమావత్ తులసీనాయక్ (సత్తెనపల్లి), దాసరి లక్ష్మయ్య (గురజాల), రమావత్ రామూనాయక్ (పెదకూరపాడు)లను నియమించారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ఉల్లిగడ్డల వరగయ్య, జరపాల సుధాకర్నాయక్ (మాచర్ల), బాణావత్ అంజిబాబు, మల్లా కొండలు (చిలకలూరిపేట), భూక్యా రమేష్నాయక్, కండ్రకుంట ప్రభాకరరావు (వినుకొండ), తుపాకుల పూర్ణచంద్రరావు, మేడా పోతురాజు (నరసరావుపేట), కొజ్జా శ్రీను, పాలపల వెంకట నరసింహారావు (పెదకూరపాడు), భూక్య శివానాయక్, బాణావత్ గోవిందనాయక్ (గురజాల), మేడా శ్రీనివాసరావు, పోట్లూరి శివయ్య (సత్తెనపల్లి) నియమితులయ్యారు. -
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్ట్లు
తాడేపల్లిరూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో ఏదైనా విషయంపై ప్రజలు చర్చించుకునే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకమరెడ్డి నారాయణమూర్తి అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలో నవోదయ కాలనీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటనపై సంఘటనా స్థలం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన చేయడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి చీప్ ట్రిక్లు ఉపయోగిస్తున్నారన్నారు. మారని పోలీసుల తీరు పోలీసులను గౌరవ న్యాయస్థానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, ఇలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పూడి శ్రీహరిన బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకెళ్లారని, స్థానిక పోలీసులు మాకు ఏమీ తెలియదని మీడియా సాక్షిగా చెబుతున్నారని, అలా చెబుతూనే పూడి శ్రీహరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నారు. లాయర్లు ప్రశ్నించడంతో చివరకు అక్కడ కూర్చుని నోటీసులు వ్రాసి అందజేశారని తెలిపారు. అరెస్ట్ విషయం తెలియనప్పుడు ఎందుకు సోదా చేస్తున్నారని ప్రశ్నించగా మొదట వచ్చిన ఎస్ఐకి బదులుగా మరో ఎస్ఐ వచ్చి సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శనరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, తాడేపల్లి పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు చిలుకోటి మధు, జిల్లా బీసీ సెల్ నాయకులు బత్తుల దాసు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు -
ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న తనను కలిసి పరామర్శించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన జడ శ్రావణ్కుమార్కు ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్ తమ పార్టీ కాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం తన అరెస్టు విష యంలో అక్రమంగా వ్యవహరించిందని ప్రపంచానికి చాటారన్నారు. జడ శ్రావణ్ కుమార్ సమా జంలో జరిగే అన్యాయాలపై కంఠం వినిపిస్తున్నా రని, ఆయన మాటలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. నోటీసులు ఇస్తే సరిపోయే కేసుల్లో సమాజంలో పేరుగడించిన వ్యక్తులను రౌడీల్లా, సంఘ విద్రోహ శక్తుల్లా ఎత్తుకు పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి వేధించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని స్పష్టంచేశారు. పోలీసులు, ప్రభుత్వాలు ఉంది కక్ష తీర్చుకోవడానికి కాదని, ప్రజల సంక్షేమాన్ని చూసేందుకు పని చేయాలని హితవుపలికారు. ప్రభుత్వాలు కక్ష తీర్చుకునేందుకు పోలీసులు వాడుకునే నీచస్థాయికి దిగజారిపోయాయన్నారు. గుంటూరులో నిరాహార దీక్షకు నిర్ణయం ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. రెండు ప్రధాన డిమాండ్లతో 12 గంటల నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులకు కనువిప్పు కలగా లని తాను చేస్తున్న దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని అంబటి రాంబాబు కోరారు. జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ పూడి శ్రీహరి అరెస్ట్ను ఖండించారు. ఇది మీడియాపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. -
22న శాప్ ఆటల పోటీలు
నరసరావుపేట ఈస్ట్: యువ క్రీడాకారులలోని ప్రతిభను వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలవారీ క్రీడా పోటీలలో భాగంగా ఈనెల 22వ తేదీన సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో ఫుట్బాల్, బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అండర్ 15, యూత్ అండర్ 21 బాలబాలికల విభాగాలలో ఫుట్బాల్, యూత్ అండర్ 15, అండర్ 19 బాలబాలికల విభాగంలో బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వివరాలను శాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు మాత్రమే పోటీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డ్ ఇతర వివరాలతో ఈనెల 21వ తేదీ రాత్రి 12 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు. టీపీబీఓ రసూల్ సస్పెన్షన్ నెహ్రూనగర్: నగరంలో అక్రమ, అనధికార నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర ్శులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా అక్రమ కట్టడం జరుగుతున్నట్లు గుర్తించి తగిన వివరాలతో 9849908391 నంబర్కు ఫిర్యా దు చేస్తే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏటుకూరురోడ్లోని కమ్మ శేషయ్య గ్రౌండ్ ప్రాంతంలో బేస్మెంట్, లింటెల్ స్థాయిల వర కు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీపీబీఓ (ఇన్చార్జి) ఎస్కె రసూల్ను సస్పెండ్, పర్యవేక్షణ అధికారులైన ఏసీపీ జకీరా, టీపీఓ శ్రీనివాసరావులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. -
నిర్లక్ష్యపు ముద్ర!
రెండేళ్ల నిద్ర.. సాక్షి, నరసరావుపేట: సమస్యలు తలెత్తకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ కుడి కాలువ చివరి భూములకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందిస్తామని 2024 సంవత్సరం ఏప్రిల్ 6న క్రోసూరు సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లు అవుతున్నా నేటికీ ఆ దిశగా అడుగులు లేవు. దీంతో వ్యవసాయాధారిత నియోజకవర్గమైన పెదకూరపాడులో రైతులు తీవ్ర సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమరావతిలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందుబాటులో తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. పెదకూరపాడులో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చి నిలుపుకోలేదు. పెదకూరపాడుకు ఐటీ పార్క్ ఏదీ? ఉమ్మడి రాష్ట్రంలో తాను హైటెక్ సిటీ తెచ్చానని, 2024లో అధికారంలోకి రాగానే పెదకూరపాడుకు సైతం ఐటీ పార్క్ తెస్తానని క్రోసూరు సభలో హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలు పెదకూరపాడులో ఏర్పాటు చేస్తాయని, ఈ నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేదన్నారు. రెండేళ్లలో ఐటీ పార్క్ కాదు కదా.. వాకింగ్ చేయడానికి పచ్చిగడ్డితో నియోజకవర్గంలో ఓ పార్క్ను కూడా ఏర్పాటు చేసిన పాపానపోలేదు. ముస్లింలకు దుల్హాన్ పథకం అమలు చేస్తామని, రంజాన్ తోఫా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఇస్తావ్ బాబూ.. అంటూ ముస్లిం సోదరులు నిలదీస్తున్నారు. పంచారామంలో ప్రథమమైన అమరలింగేశ్వర స్వామి దేవాలయానికి ఆధ్యాత్మికంగా మరింత గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ ఆనవాళ్లు లేవు. కనీసం ఆలయ భూముల సమస్యలు సైతం తీర్చలేదు. అమరావతిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. బౌద్ధులు, జైనులు తిరిగిన పుణ్యభూమి అమరావతి అని, ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ అన్నారు. అభివృద్ది చేయకపోగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 14వ తేదీన రూ.15 కోట్లతో ప్రారంభించిన ధ్యాన బుద్ధ వనాన్ని సైతం నిర్వహణ లేకుండా చేశారు. కాలచక్ర మ్యూజియం, బుద్ధ సర్క్యూట్ వంటివి అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.కృష్ణానది పరీవాహక ప్రాంతమైన పెదకూరపాడులో ఇసుకాసురుల ఆట కట్టించి అక్రమ దందాను ఆపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిత్యం వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ను మించిన ఇసుకాసురుడు లేడని, ఆయన్ని ఏం చేశావ్ బాబూ అంటూ పెదకూరపాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మట్టి దోపిడీ సొమ్ము వాటాల పంపిణీలో తేడాలొచ్చి సొంత పార్టీ నేతలపైనే పెదకూరపాడులో నియోజకవర్గంలో ముసుగు దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి రహితంగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా... గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామగ్రామాన బెల్టుషాపులు వెలిశాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆయా కంపెనీలలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్క కంపెనీ ఏర్పాటుకాకపోగా యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఓటేసి గెలిపించిన ప్రజలనే కాదు సొంత పార్టీ నేత, సీనియర్ నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ను సైతం సీఎం చంద్రబాబు మోసం చేశారన్న వాదనలు ఆయన వర్గం నుంచి వినిపిస్తున్నాయి. మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన శ్రీధర్ను కాదని డబ్బుల సంచితో వచ్చిన బాష్యం ప్రవీణ్కు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న శ్రీధర్ వర్గాన్ని శాంతించేందుకు క్రోసూరు సభ సాక్షిగా అధికారం రాగానే కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు ఎమ్యెల్సీ ఇవ్వకపోగా... అప్పటివరకు ఉన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నుంచి సైతం అవమానకరంగా తప్పించి భాష్యం ప్రవీణ్ అనుచరుడికి అప్పగించారని శ్రీధర్ వర్గం మండిపడుతోంది. ఓ ముఖ్య నేత అండతో శ్రీధర్, ఆయన వర్గాన్ని అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన వర్గీయులు తెలిపారు. చంద్రబాబు స్పందించి శ్రీధర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది. -
పల్నాడు
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.11,500, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 527.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,156 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. హామీలివ్వడం... వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రసంగాలలో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం బాబు నైజం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో సైతం క్రోసూరు, అమరావతి మండల కేంద్రాలలో రెండేళ్ల క్రితం జరిగిన సభల్లో పెదకూరపాడు నియోజకవర్గానికి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. బాబు సర్కార్ ఏర్పడి రెండేళ్లు అవుతున్నా వాటిని అమలు చేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు చీదరించుకుంటున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి మండల కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. 7 -
17న రైతు ధర్నాకు సన్నాహాలు
నరసరావుపేట: మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రతి మండలానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన నరసరావుపేటలో రైతు ధర్నా చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి ప్రకటించారు. గుంటూరు రోడ్డు పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 12.35 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట పండించారన్నారు. అలాగే పల్నాడు జిల్లాలో 53,739 హెక్టార్లలో సాగు చేశారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల భవిష్యత్తును దళారుల చేతిలో పెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ దళారీ వ్యవస్థ మొక్కజొన్న క్వింటాలుకు రూ.1600 నుంచి రూ.1700 కు మాత్రమే కొనుగోలు చేస్తూ క్వింటాకు రూ.800 దిగమింగుతున్నట్లు చెప్పారు. పంట సాగు సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేశారు. రైతులకు పార్టీ ముద్ర వేసి కేవలం తెలుగుదేశం పార్టీ చెందిన వారికే సొసైటీల ద్వారా ఎరువులు సరఫరా చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ వారు, మిగతా రైతులకు ఎరువులు ఇవ్వలేదని ఆరోపించారు. వీరందరూ కట్ట ఎరువుకు రూ.300 నుంచి రూ.500 వరకు అధిక ధరకు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేశారన్నారు. దీనివల్ల సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావలసిన ఎరువులు, విత్తనాలను అడిగిన వెంటనే సరఫరా చేసిందని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు పంటలు కొనుగోలు చేసిందని, రైతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. శనగలు, మినుములు తదితర పంటలకు ధర విషయంలో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, దీనివల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని, రూ.3 వేల కోట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు ఉండేదని చెప్పారు. నెలకు రూ. వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేస్తోందని, వాటిలో ఆరోగ్యశ్రీకి రూ.3 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి మరో రూ.3 వేలు కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తీసుకున్న అప్పుల మొత్తం అంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న వర్షానికే జలమయమయ్యే రాజధాని అమరావతిలో డబ్బంతా వృథాగా ధారబోస్తున్నారన్నారు. తక్షణమే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంట కొనుగోలుకు మండలానికో కేంద్రం ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరు అవుతారని, రైతులు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేయాలని కోరారు. చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయమే దండగ, రైతు వ్యవస్థ ఉండకూడదనే సిద్ధాంతాన్ని చంద్రబాబు చెబుతున్నారని ఆరోపించారు. రైతు వ్యవస్థ లేకుండా ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని అన్నారు. రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం రాణించిన దాఖలాలు లేవని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుకు ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. పంటను తెలుగుదేశం పార్టీ దళారీ వ్యవస్థ దోచుకుంటోందని, రైతు పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నందున ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్నెం పున్నారెడ్డి మాట్లాడుతూ రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని, ఆయన రైతుల్ని గాలికి వదిలేసి కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికి పరిమితం అవుతున్నారని చెప్పారు. రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న పండించినా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా రైతులను తీవ్రంగా నష్టపరిచిందని తెలిపారు. దళారులకు కూటమి ప్రభుత్వం తొత్తుగా మారిందని విమర్శించారు. రొంపిచర్ల మండల అధ్యక్షుడు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పొనుగోటి వెంకటరావు, రొంపిచర్ల మండల నాయకులు గెల్లి చినకోటిరెడ్డి, పోతులూరి సుబ్బారెడ్డి, బీరం భాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
మంట చింతల..!
పల్నాడు జిల్లా రెంటచింతలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 44.6 కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గ్రామంలో ఆది, సోమ, మంగళవారం మూడు రోజులుగా వరుసగా గరిష్ట ఉష్ణోగ్రతలు 43.1, 43.8, 44.6 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామస్తులు అల్లాడిపోయారు. భానుడు ఒక్కసారిగా భగభగ మంటూ మండుతుండటంతో గ్రామం నిప్పుల కొలిమిగా మారింది. దీనికితోడు వడ గాడ్పులు వీస్తుండటంతో గ్రామస్తులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో గ్రామంలోని మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారితో పాటు వ్రీధులన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – రెంటచింతల -
ఆమంచి విజయభాస్కర్ శాస్త్రికి డాక్టరేట్
గుంటూరు ఎడ్యుకేషన్: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ ఎస్ఆర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్ విజయభాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ వేదిక సైన్సెస్ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ విజయ భాస్కర్శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు. -
ఘనంగా అంబేడ్కర్, ఫూలే, జగ్జీవన్రామ్ల జయంతి
గుంటూరు లీగల్: మహనీయులు బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ హాజరయ్యారు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్స్ జి.శాంతకుమార్, వి.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు సందేశాలను అందించారు. సీనియర్ న్యాయవాదులు వైకే, పోకల వెంకటేశ్వర్లు, వి.హృదయరాజు, సాంబిరెడ్డి, బి.అంకమ్మరావు, పి.ప్రసాద్, సి.వెంకటరామయ్య తదితరులు ప్రసంగించారు. బార్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.రేవతి, ట్రెజరర్ ఆకుల లక్ష్మీసుజాత, సంయుక్త కార్యదర్శి పి.ఏసుప్రసాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, లైబ్రరీ సెక్రటరీ పూదోట రాజేష్ లింగం, లేడీ రిప్రజెంటివ్ అడపా ఇందిరా, లేడీ ఎగ్జిక్యూటివ్ లక్ష్మీ తిరుపతమ్మ, సీనియర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, లాయర్లు పాల్గొన్నారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామిని దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో పనుల నిర్వహణపై పాలకమండలి, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధి అధికారి శ్రీనివాస్ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జలధార–జల హారతి కార్యక్రమం కింద సాగునీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం మూడు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడికతీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి–తాగునీటి సరఫరా, భూగర్భ జలమట్టం మెరుగుపరుస్తామన్నారు. డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్ బాలాజీరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా అండర్–13 ఓపెన్, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలు స్థానిక నలందానగర్లోని మకూన్స్ కిడ్స్ ప్లే స్కూల్లో మంగళవారం జరిగాయి. బాలుర విభాగంలో మాక్షరత్ గోగినేని, మారెడ్డి తేజభరత్రెడ్డిలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో జె.అలేఖ్య, జయఅలేఖ్య తన్నీరు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారని పోటీల నిర్వహకుడు పి.విజయ్ కుమార్ తెలిపారు. గెలుపొందిన చిన్నారులు త్వరలో మార్కాపురంలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షలు సీహెచ్ రవీంద్రరాజు, న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో సుమారు 120 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. స్కూల్ డైరెక్టర్ సాహితి దుగ్గింపూడి పాల్గొన్నారని పేర్కొన్నారు. -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి కొరిటెపాడు(గుంటూరు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్యాంక్ లైజర్ ఆఫీసర్ ఉబా ప్రసాద్, జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి కావాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తెలిపారు. మంగళవారం నల్లచెరువు మెయిన్ రోడ్డులోని మహావీర్ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న టెన్న్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదాన్ని కట్టబడి ఉండటం మన రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. కార్యక్రమంలో డీవైఈవో జి.ఏసురత్నం, ప్రధానోపాధ్యాయులు మణికుమార్, జే శ్రీనివాసరావు, జి హజ్రయ్య, అంబటి ఇమ్మానుయేలు, సత్యం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, ఎ.వెంకట రెడ్డి, ఉర్దూ డీఐ ఖాసీం, శారద, బి.సురేఖ పాల్గొన్నారు. -
సమానత్వం కోసం పోరాడిన అంబేడ్కర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్లోని జాషువా సమావేశ మందిరంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అంబేద్కర్ ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక జాతి అభివృద్ధికి కొలమానం ఆ జాతి సీ్త్ర సాధించిన ప్రగతి అని దాదాపు వందేళ్ల క్రితమే దళిత మహిళలతో అంబేడ్కర్ సంఘం ఏర్పాటు చేశారన్నారు. సామాజిక న్యాయం, మహిళా సమానత్వం కోసం అధికరణలను రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో రెండు పీహెచ్డీలు, మూడు మాస్టర్స్తోపాటు అనేక హనరరీ సర్టిఫికెట్లు పొందారన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ ప్రతి విద్యార్థికి ‘పిల్లల కోసం రాజ్యాంగం’ అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశామన్నారు. చట్ట సభల పని తీరు గురించి తెలియజేసేందుకు విద్యార్థులతో అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. రూ.12 కోట్ల మేరకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు అందించామన్నారు. జిల్లాలో స్టడీ సర్కిల్ కోసం ప్రతిపాదన పంపుతామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో నియోజకవర్గంలో 2 వేల ఎస్సీ గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నామని చెప్పారు. ప్రతి మండలంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించేలా ఆదేశాలిస్తామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అంబేడ్కర్ కారణంగా అభివృద్ధి చెందిన దేశాలకు సైతం వందల ఏళ్ల తర్వాత కానీ దక్కని అందరికీ ఓటు హక్కు భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే దక్కిందన్నారు. అంటరానితనం రూపుమాపైందన్నారు. తనకు అన్యాయం చేసిన వ్యవస్థ మీద ద్వేషం పెంచుకోకుండా వ్యవస్థను మార్చేందుకు కృషి చేసిన వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. తన పోరాటంలో ప్రజలను ఏకీకృతం చేశారే కానీ విభజించలేదని పేర్కొన్నారు. జిల్లాలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అన్నారు. జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బండారుపల్లిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తాడికొండ: బండారుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. తెలుగుదేశం పార్టీలోని ఇరువర్గాలు గ్రామసభ సాక్షిగా బాహాబాహీకి దిగడంతో సభలో అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే అయింది. ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన గ్రామపార్టీ అధ్యక్షులు ఇతరులు స్టేజీపై కూర్చొని నడిపిస్తుండటం, తాత్కాలికంగా నియమించిన పంచాయతీ ఉద్యోగుల విషయంపై వ్యతిరేక వర్గం నిలదీయడంతో రసాభాసగా మారింది. గ్రామంలో తాగునీటి సరఫరాలో నాణ్యత ఉండటం లేదని, ఇటీవల రూ.10 లక్షలతో మరమ్మతులు తూతూ మంత్రంగా చేసి పాత ఇటుకలనే పేర్చడంతో ఫిల్టర్ అవడం లేదని ఆరోపించారు. వివాదం ముదరడంతో అధికారులు నామమాత్రంగా సభను నిర్వహించి చేతులెత్తేశారు. -
బైక్ను ఢీకొన్న కారు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరికి చెందిన వాసంతి పెదకాకానిలో నివాసముంటోంది. వాసంతి దంపతులకు మూడు సంవత్సరాల చిన్నారి విరోనిక (3) ఉంది. వాసంతి డెలివరీ నిమిత్తం కొన్ని రోజుల కిందట విరోనికతో మంగళగిరిలోని పుట్టింటికి వచ్చింది. వాసంతి అన్నయ్య ప్రశాంత్ విరోనికను తీసుకుని మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై గౌతమ బుద్ధ రోడ్డు వద్దకు వచ్చాడు. అదే సమయంలో అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ప్రశాంత్, విరోనికలు కిందపడిపోయారు. ఇద్దరిపై నుంచి కారు వెళ్లడంతో విరోనికకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్ రెండు కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అదే కారు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలను ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకుని కారు నడుపుతున్న సిబార్ డెంటల్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సాయివాగ్ధేవిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కారు నడుపుతున్న వైద్య విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థినిని బయటకు పంపించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దానశీలత కలిగిన రాడికల్ హ్యూమనిస్ట్ సుబ్బారావు
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫార్మసీ అధికారుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ జి.శోభరాణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వైబ్సైటలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా, లేదా రిజిష్ట్రరు పోస్టు ద్వారా, లేదా ఆర్డీఎంహెచ్ఎస్గుంటూరు – జీమెయిల్.కామ్ మెయిల్ ద్వారా సమర్పించాలన్నారు. -
కాలువల మరమ్మతులు పూర్తి చేయండి
నరసరావుపేట: మే నెల 15వ తేదీన సాగర్ నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన సాగునీటి కాలువల మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో అధికారులతో వేసవిపై సమీక్షించారు. నీరు విడుదల కాగానే రైతులు పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జలధార– జలహారతి పథకం ద్వారా జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం ఆరు మీటర్లకు తీసుకురావాలని కోరారు. పది రోజుల్లోగా భూగర్భ జలం మట్టం పెంపుదలే లక్ష్యంగా కాలువల పూడిక తీత, చెరువుల అనుసంధానం, నీటి పథకాల మరమ్మతులు వంటి కార్యక్రమాలకు ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు నిధులను జలధార–జలహారతి కార్యక్రమం కోసం వినియోగించాలన్నారు. సాగు, తాగునీటి చెరువులన్నీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. నాణ్యమైన పరిశుభ్రత జలాలను ప్రజలకు సరఫరా చేయాలని కోరారు. చెరువు కట్టలు, పంట కాల్వల కట్టలన్నీ బలోపేతం చేయాలని చెప్పారు. జలాల సంరక్షణలో భాగంగా 100 రోజుల కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో ఉన్న చెరువులు, వాటి కట్టల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక
యడ్లపాడు: చారిత్రక వైభవానికి నిలయమైన కొండవీడు ప్రాంతంలో అద్భుత కళాసౌరభాలు విరబూశాయి. లింగారావుపాలెం గ్రామంలోని పోసాని సుబ్బారావు కళావేదికపై మూడు రోజుల పాటు జరిగిన కొండవీటి కళాపరిషత్ 27వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. తొమ్మిది విభిన్న నాటికలు ప్రదర్శితమైన ఈ వేదికపై కథా బలం, నటీనటుల అభినయం, సాంకేతిక హంగులు పోటీపడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రమణారావు, ఏ నర్సిరెడ్డి, గోపరాజు విజయ్ అత్యంత పారదర్శకతతో విజేతలను ఎంపిక చేసి తమ అనుభవాన్ని చాటుకున్నారు. ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక. ప్రదర్శనల విభాగంలో హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ వారు ప్రదర్శించిన ‘శ్రీమాత్రే నమః’ నాటిక తన అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది. విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక ద్వితీయ బహుమతిని గెలుచుకోగా, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక తృతీయ స్థానంలో నిలిచింది. గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ నాటిక జ్యూరీ ప్రత్యేక ప్రదర్శనగా గుర్తింపు పొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అభినయ విభాగంలో.. కళాకారుల అభినయంలో... ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక అవార్డుల పంట పండించింది. ఈ నాటికలో ముత్యాలరావు పాత్రలో ఒదిగిపోయిన ఈఎస్ పవన్ కుమార్ ఉత్తమ నటుడిగా, రమణమ్మ పాత్రలో భావోద్వేగాలను పండించిన ఆర్.రాజేశ్వరి ఉత్తమ నటిగా నిలిచారు. ఇదే నాటికకు దర్శకత్వం వహించిన సుఖమంచి కోటేశ్వరరావు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘శ్రీమాత్రే నమః’ నాటికకు పదునైన మాటలు అందించిన ఉదయ భాగవతుల ఉత్తమ రచయితగా అవార్డు అందుకున్నారు. ‘తరమెల్లి పోతున్నదో’ నాటికలో రంగనాథం పాత్ర పోషించిన ఎన్.శ్రీధర్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికవగా, మాతృత్వం నాటిక సంతోష్ పాత్రధారి.. పొగర్తి నాగేశ్వరరావు, మంచిమనసులు నాటిక సూర్య పాత్రధారి.. నడింపల్లి వెంకటేశ్వర్లు తమ నటనకు గానూ ప్రత్యేక ప్రశంసా బహుమతులు అందుకున్నారు. ఉత్తమ ప్రదర్శనలు, నటులకు పరిషత్ నిర్వాహకులు నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, నంబూరి వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కోశాధికారులు కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మ వరప్రసాద్, పర్యవేక్షకులు జరుగుల రామారావు వీటిని అందజేశారు. -
చిత్రకారుడు వల్లెం కృష్ణకు అంతర్జాతీయ మెరిట్ జ్యూరీ అవార్డు
వినుకొండ: మండలంలోని గోకనకొండ గ్రామానికి చెందిన చిత్రకారుడు వల్లెం కృష్ణకు మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. డాక్టర్ కేపీ బాబు నేతృత్వంలోని క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో కృష్ణ గీసిన చిత్రానికి అంతర్జాతీయ మెరిట్ జ్యూరీ అవార్డు, నగదు బహుమతి అందుకున్నారు. అవార్డు పొందిన కృష్ణను పలువురు అభినందించారు. స్కూటీ డిక్కీ నుంచి రూ.3 లక్షల మాయం దుర్గి: దుర్గిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఓ స్కూటీలో ఉంచిన రూ.మూడు లక్షల నగదు చోరీకి గురైంది. దుర్గికి చెందిన వ్యాపారి మేకల బ్రహ్మం బ్యాంకు లావాదేవీల నిమిత్తం బ్యాంకులోకి వెళ్లారు. బ్యాంకులో పనిముగించుకొని బయటకు వచ్చేలోపే తన స్కూటీలో ఉంచిన రూ. 3లక్షలు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధీర్బాబు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజిలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుంటూరు ఖాకీల రేంజ్ వేరు
కట్టుతప్పుతున్న రేంజ్ పోలీసులు ప్రభుత్వ అవినీతి, అసమర్ధతను చూస్తూ తట్టుకోలేక సామాన్యుడు సామాజిక మాధ్యమంలో ఒక్క పోస్టు పెట్టడం ఆలస్యం.. పచ్చ పెద్దల హుకూంతో ఖాకీలు వచ్చి వాలిపోతారు. ఒక తీవ్రవాదిని పట్టుకుంటున్నాం అన్నంత ‘రేంజ్’లో అర్ధరాత్రిళ్లు, మఫ్టీల్లో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు రావడాలు.. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేయడాలు.. స్టేషన్ నుంచి స్టేషన్కు మారుస్తూ చిత్రహింసలు పెట్టడాలు.. తప్పుడు కేసులు బనాయించడాలు.. ఇవన్నీ ఇక్కడి పోలీసులకు షరా మామూలే. అధికారపార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు, రోడ్లపై ఉత్సవాల పేరుతో నానా హంగామా చేసినా పట్టించుకోరు.. అదే ప్రతిపక్ష నేతలు చిన్న నిరసన వ్యక్తం చేసినా.. లాఠీలతో కుళ్ల బొడుస్తు.. తప్పుడు కేసులు నమోదు చేయడంలో ముందుంటారు. తమ దందాలకు అడ్డొస్తే వారు ఎంతటివారైనా, న్యాయవాదులైనా అడ్డు తొలగించుకోవడంలో ముందుంటారు. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి ఆత్మహత్యలకు కారణమవుతారు.. ప్రేమికుల వ్యవహారాల్లో వీడియోలు తీసి లైంగిక వాంఛలు తీర్చుకుంటారు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. కాబట్టే ఇక్కడి పోలీసుల ‘రేంజ్’ వేరయా.. అని ఉమ్మడి జిల్లావాసులు చెప్పుకొంటున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రేంజ్లో పోలీసులు కట్టుతప్పుతున్నారా? వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వాలని చెప్పినా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు. గోడ దూకి మరీ వెళ్లి.. తాజాగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చినపులివర్రులో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్బాబు స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సమర్ధిస్తూ మాట్లాడటంపై నిలదీస్తూ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఎటువంటి అసభ్యకరమైన భాష వాడలేదు. అయినా తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారన్న పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత మఫ్టీలో ప్రైవేటు వాహనంలో గోడలు దూకి వెళ్లి మరీ తనీష్బాబును అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ అక్రమ అరెస్టును అడ్డుకోబోయిన కుటుంబసభ్యులతో పాటు తనీష్పై కూడా పోలీసులు చేయి చేసుకోవడం, బలవంతంగా లాక్కెళ్లాలని చూడటంతో స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీయడమే కాకుండా పోలీసులపై కేసు నమోదు అయ్యేలా చూశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోయిన వైనం రెండురోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని ఆ పత్రిక నగర కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాలాపేట, పాతగుంటూరు, పట్టాభిపురానికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల ముందే రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ నేతలను, కార్యకర్తలను లాఠీలతో కుళ్లబొడిచారు. ఇక పల్నాడు జిల్లాలో అయితే పోలీసులు పూర్తిగా అదుపుతప్పారు. రోజుకో ఆరోపణలతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన ఒక సీఐను మహిళతో సహజీవనం చేసిన వ్యవహారంలో వీఆర్కు పంపారు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చి ఆమె పరువు హత్యకు పరోక్షంగా సహకరించిన సీఐ సస్పెండ్ అయ్యారు. మాచర్లకే చెందిన ఓ ఏఎస్ఐ ప్రేమ జంటల్ని బెదిరించి వారి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగికంగా వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది హత్యకేసులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు అయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మరో కానిస్టేబుల్ను కలుపుకొని హత్యకు పాల్పడ్డారు. అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమానే పోలీసులను తప్పుడు మార్గంలోకి నెడుతోంది. -
అర్జీలు సకాలంలో పరిష్కరించండి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జేసీ సంజనా సింహతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 128 అర్జీలు అధికారులకు అందాయి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో 20 అర్జీలు రాగా ఇందులో గురజాల డివిజన్కు సంబంధించినవి 6, సత్తెనపల్లి డివిజన్–6, నరసరావుపేట డివిజన్–8 అర్జీలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని, అర్జీదారులతో మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలని తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నారా శ్రీనివాస్రెడ్డి, నాసరయ్య, నాగేశ్వరరావులు కలెక్టర్ను కోరారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేసారని తెలిపారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2400గా ఉండగా, వ్యాపారస్తులు రూ.1600 నుంచి 1800లకే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీని వలన రైతులు ఎకరానికి రూ.20వేలు నష్టపోతున్నారని వివరించారు. -
ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యేశ్వరరావు
సత్తెనపల్లి: ఫుట్బాల్ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎన్నికయ్యారు. సత్తెనపల్లిలోని శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో సోమవారం పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికకు రాష్ట్ర పరిశీలకులుగా హాజరైన కె.క్రాంతికుమార్ పర్యవేక్షణలో ఎమ్మార్ ఎల్ నరసింహారావు, ఎలక్షన్ ఆఫీసర్గా స్టేట్ ఈసీ మెంబర్ బి చక్రవర్తి, ఏలూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీఎస్ఎస్ పవన్కుమార్, శ్రీకాకుళం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ నీలాద్రి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు ఎన్.సుబ్బారావులు హాజరై పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సెక్రటరీగా షేక్ షమ్మీ, వైస్ ప్రెసిడెంట్ వి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా పి కోటేశ్వరరావు, ట్రెజరర్గా ఎం.దీక్షిత, మెంబర్లుగా బి స్పందన, ఏ వెంకటసుబ్బారావు, పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రిటైర్డ్ హెచ్ఎం సీహెచ్ వెంకటాద్రిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం జిల్లాలో ఫుట్బాల్ అభివృద్ధి కోసం క్రీడాకారులను జాతీయ, రాష్ట్ర క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. నూతన కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శాంతినికేతన్ జూనియర్ కళాశాల డైరెక్టర్ వై.రమణారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామరెడ్డి, అచ్చిరెడ్డి, సుభానీ, గోవర్ధన, రన్హుస్సేన్, లక్ష్మి, శ్రీనివాస్రెడ్డి, గౌస్య, శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ టీచర్లపై వేధింపులు అన్యాయం
నరసరావుపేట: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని డెమెక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడిని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం జూన్న్లో మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలు డిసెంబర్ నుంచే ముందస్తు అడ్మిషన్లు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రతి రోజు స్కూల్ ముగిసిన తర్వాత టీచర్లను ఇంటింటికీ పంపిస్తూ అడ్మిషన్ల కోసం ప్రచారం చేయిస్తున్నారని, వారికి టార్గెట్లు విధించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు నిలిపివేయడం, ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి ముందస్తు అడ్మిషన్లు నిలిపివేయాలని, టీచర్లపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సెలవు రోజుల్లో కూడా పూర్తి జీతభత్యాలు చెల్లించాలనే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయరాజు -
మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
నరసరావుపేట రూరల్: మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో విచారణ వేగంగా పూర్తిచేసి వారికి న్యాయం చేయాలని అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలతోపాటు ఆక్రమణలు, బెదిరింపులు వంటి అంశాలకు సంబంధించిన మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. భూమి విక్రయించగా వచ్చిన రూ.1.80 లక్షలు మేనల్లుడు నాగేశ్వరరావుకు అప్పుగా ఇచ్చాను. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నా. ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందటానికి అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వమని అడిగినా స్పందించడం లేదు. డబ్బులు ఇప్పించి నాకు న్యాయం చేయండి. –మేకపోతుల అంకమ్మ, జమ్మలమడక, మాచర్ల మండలం గురజాల మండలం జంగమహేశ్వరపురానికి చెందిన వర్రా చంద్రశేఖరరెడ్డి ప్రేమించానని చెప్పి గర్భిణిని చేశాడు. ఆ తరువాత ఫోన్కు స్పందించడం లేదు. నాకు న్యాయం చేయండి. –ఓ యువతి నా తండ్రికి ఇష్టం లేకపోయిన 2014లో షేక్ ఆషిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాను. అప్పటినుంచి అనునిత్యం నన్ను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు గురిచేస్తున్నాడు. ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని నీ మీద మోజు తీరిపోయింది వెళ్లిపోమంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. విడాకులు ఇవ్వాలని గత నెల 30వ తేదీన భర్త, అత్త ఇద్దరు నాపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉంటే వైష్ణవిని చంపినట్టే చంపుతామని బెదిరిస్తున్నారు. భర్త, అత్తలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. –షేక్ అప్సర, ఇస్లాంపేట, నరసరావుపేట యూకే పంపిస్తామని చెప్పి తన వద్ద రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారు. క్రోసూరు మండలానికి చెందిన గంపల హరీష్ మధ్యవర్తిగా ఉన్నాడు. యూకే పంపించక పోవడంతో డబ్బులు అడిగితే గతేడాది రూ.12లక్షలు ఇచ్చాడు. నెల తరువాత మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. దీనిపై దుర్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు. నగదు ఇప్పించి న్యాయం చేయండి. –మానుపాటి రవికుమార్, ముటుకూరు, దుర్గి మండలం మంగళగిరికి చెందిన పులి వెంకటలక్ష్మీప్రసాద్ తన వ్యాపార అవసరాల కోసం 2024 సెప్టెంబర్లో రూ.10లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. గత సంవత్సరం నుంచి డబ్బు చెల్లించమని అడిగితే అతని పెద్ద కుమారుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు కోసం ఇంటికి వస్తే కోర్టులు చుట్టూ తిప్పుతానని బెదిరిస్తున్నాడు. ఈ టెన్షన్తో ఆరోగ్యం కూడా దెబ్బతింది. –ఇంజేటి సదాశివరెడ్డి, నరసరావుపేట -
కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ప్రారంభించారు. పీజీఆర్ఎస్కు విచ్చేసిన దరఖాస్తుదారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం చలివేంద్రంలో నీరు, మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ నరసరావుపేట: బాణసంచా అమ్మకందారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఫైర్ క్రాకర్స్ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెన్యువల్ ముగిసిన వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపు నిర్వాహకులు, క్రాకర్స్ నిర్వాహకులు అగ్నిప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంపాలెం: దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు సోమవారం కొనసాగాయి. పెదనందిపాడు దత్తసాయి ఆర్యవైశ్య హోటల్, శ్రీలక్ష్మీ దుర్గా మెస్లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయా తనిఖీల్లో గుర్తించిన ఆరు సిలిండర్లను స్థానిక చిలకలూరిపేట ఎంఆర్ఐ, ప్రత్తిపాడు సీఎస్ డీటీలకు అప్పగించారు. ఆయా మెస్ల నిర్వాహకులపై 6–ఏ కేసులు రెండు నమోదు చేశారు. విజిలెనన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
వసూళ్లకు పాల్పడుతున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి
ఆరోగ్యశ్రీ పథకంలో అదనపు వసూళ్లుకు పాల్పడుతున్న జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో టెస్ట్ల పేరుతో అదనపు చార్జీలను ఆసుపత్రులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. అదనపు చార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏ దారి కానరాక..!
కొల్లూరు: పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న బాటను సాధించుకునేందుకు అన్నదాతలు పోరు బాట పట్టారు. రెక్కల కష్టంతో శ్వేదం చిందించి సంపాదించుకున్న సొమ్మును విరాళాల రూపంలో సేకరించుకొని రూ.7లక్షలు వెచ్చించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న బళ్ల దారి మార్గాన్ని పచ్చ పార్టీ నాయకుల అండదండలతో కబళిస్తున్న పెద్ద రైతుల కబంధ హస్తాల నుంచి దక్కించుకునేందుకు కర్షకులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. టీడీపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ యంత్రాంగం దారి సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రెవెన్యు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయ ఆవరణలో బైఠాయించి సన్న, చిన్న కారు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద ఉన్న బళ్ల బాట విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బళ్ల బాటగా ఉన్నప్పటికీ, సాగునీటి పారుదల కాలువ, బోదె కాలువల ఏర్పాటులో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం సమస్యకు ప్రధాన కారణంగా మారింది. గతంలో బళ్ల మార్గం ద్వారా పంట ఉత్పత్తులను తరలించుకోవడానికి అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్న 200 ఎకరాల పై చిలుకు పంట భూములున్న సన్న, చిన్న కారు రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వంతెన నిర్మించుకొని పంట ఉత్పత్తుల తరలింపునకు వీలుగా బళ్ల మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే కేటీ కాలనీ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న ఒకరిద్దరు రైతులు బళ్ల మార్గం ఏర్పాటు విషయంలో ఆక్షేపించడంతో దారి అంశంపై కోర్టును ఆశ్రయించారు. రైతుల పంటపొలాలకు వెళ్లాల్చిన దారి సమస్య పరిష్కారానికి కొద్ది గడువు కోరడం జరిగింది. దారి వివాదం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తాం. బుధవారం నుంచి రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను బళ్ల మార్గం ద్వారా తరలించుకునేలా చర్యలు తీసుకుంటాం. – బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు తహసీల్దార్ -
రవికుమార్కు జాతీయ గోల్డెన్ అవార్డు ప్రదానం
సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన వర్ధమాన పౌరాణిక రంగస్థల కళాకారుడు బెజగం రవికుమార్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ విభిన్న, వైవిధ్యమైన పౌరాణిక పాత్రలను, ఏకపాత్రాభినయ నాటిక రూపంలో ప్రదర్శనలు చేసినందుకుగాను కళాజ్యోతి, స్టార్ గోల్డెన్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఒంగోలు సమీపంలోని కారవాది గ్రామంలో వివేకానంద విద్యానిలయ ప్రాంగణంలో ఎల్సీఈఎస్ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సేవా సంస్థ వారిచే వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన కళాకారులు, సమాజసేవకులు, లఘు చిత్ర నిర్మాతలకు సోమవారం పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రవికుమార్కు ఎల్సీఈఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సేవా సంస్థ ఒంగోలు వారి కళాజ్యోతి, లిటిల్ చాంప్స్ వారి జాతీయగోల్డెన్ అవార్డు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ పౌరాణిక పాత్రధారణలో రెండు రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వక్తలు కొనియాడారు. రెండు పురస్కారాలు అందుకున్న బెజగం రవికుమార్ను పట్టణంలోని వివిధ కళా సంస్థలు, మిత్రులు సోమవారం అభినందించారు. -
గోవాడలో 16 నుంచి మహా కుంభాభిషేకం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృత లూరు మండలం గోవాడలో వేం చేసియున్న గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎంవీఎస్ వర్మ ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు చావలి శ్రీధర్శర్మ, ఐలూరి సుబ్రహ్మణ్య దీక్షులచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ప్రవచన విద్వాంసురాలు అనుగ్రహభాషణ, 17న వేదాంతం సునీత భాషణం, 18న మాతా శివానంద సరస్వతి (శివకేశవ పీఠాధిపతులు) అనుగ్రహ భాషణం, సాయంత్రం గ్రామోత్సవం, 19న పెనుగొండ క్షేత్ర పీఠాథిపతి పజ్ఞానంద సరస్వతి బాల స్వామి అనుగ్రహ భాషణం, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి నారాయణమూర్తి ప్రవచనం, 20న మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుందని వివరించారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. కేబీఆర్ కళాశాల ప్రాంగణంలోని పది మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మూల్యాంకనం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రానికి 1,75,700 పేపర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మూల్యాంకనం పూర్తయినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి గదిలోనూ ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, వైద్యసేవలకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
ముగిసిన కొండవీడు కళా సంబరాలు
యడ్లపాడు: కొండవీడు కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు కళల పండుగలా కొనసాగాయి. మూడో రోజు ఆదివారం మూడు అద్భుత కళారూపాలు ప్రదర్శితం అయ్యాయి. వేటికవే గొప్ప కథనాలతో కళాకారుల పోటాపోటీ అభినయంతో ప్రేక్షకుల్ని అలరించాయి. నిర్వాహకులు కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మవరప్రసాద్ కృషిని దాతలు, కళాభిమానులు అభినందించారు. ‘అమ్మచెక్కిన బొమ్మ’ సృష్టిలోని అనంతమైన వైవిధ్యాన్ని ఆస్వాదించలేక..మూసధోరణిలో బతుకుతున్న నేటి సమాజపు సంకుచిత మనస్తత్వాన్ని నిలదీసే అద్భుత కళారూపం అమ్మచెక్కిన బొమ్మ నాటిక. ఆడ, మగ అనే రెండు పార్శ్వల మధ్య నలిగిపోతూ, తన గుర్తింపు కోసం పరితపించే మూడో ప్రకృతి అస్తిత్వ పోరాటాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. గోవాడ క్రియేషన్స్ వేదికగా వచ్చిన ఈ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథను అందించగా, డాక్టర్ వెంకట్ గోవాడ తన నాటకీకరణతో, దర్శకత్వ ప్రతిభతో దీనికి ప్రాణం పోశారు. ‘అందరూ మంచివారే కానీ..!’ కన్నప్రేమను మించిన కరుణతో సాగాల్సిన అనుబంధాలు, కాసుల కక్కుర్తి ముందు ఎలా కరిగిపోతాయో సాక్షాత్కరించింది అందరూ మంచివారే కానీ..నాటిక. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న మరదలి ప్రాణం కంటే డబ్బే ముఖ్యమని భావించిన ఒక వదిన స్వార్థం, ఆ ఇంటి మమకారాన్ని బలితీసుకోవడం వీక్షకుల మనసును కలచివేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మంచితనం మంటగలిసి, రక్తసంబంధం ఆర్థిక సంకెళ్లకు బందీ కావడాన్ని ఈ ప్రదర్శన అత్యంత సహజంగా ఆవిష్కరించింది. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుతంగా రంగస్థలంపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ‘ఇది అతని సంతకం’ సమకాలీన సమాజంలో మనిషి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది ఇది అతని సంతకం నాటిక. జీవిత చరమాంకంలో ఎవరికీ భారంగా మారకూడదని, తనకంటూ ఒక నిర్దిష్టమైన జీవన శైలిని రూపొందించుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి, అబద్ధం లేని సిద్ధాంతాలతో సమస్యల నెదురిస్తూ సాగించిన ప్రయాణం ఇందులో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. ఈ నాటికను గుంటూరు అభినయ ఆర్ట్స్ ప్రదర్శించగా, శ్రీస్నిగ్థ రచించారు. ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. -
పేదలకు రోబోటిక్ వైద్య సేవలు అందాలి
గుంటూరు మెడికల్: రోబోటిక్ల ప్రవేశంతో ఆధునిక వైద్యరంగం ఓ పెద్ద మలుపు తీసుకుందని ఏపీ ఏరో స్పేస్ డిఫెనన్స్ సలహాదారు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి సతీష్రెడ్డి అన్నారు. కచ్చితత్వంతో కూడిన రోబోటిక్ వైద్య సేవలు పేదలకు సైతం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. తక్కువ ఖర్చుతో రోబోటిక్లను రూపొందించినప్పుడు అది సాధ్యపడుతుందని ఆ మేరకు పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సతీష్రెడ్డి తన ఆప్తమిత్రుడైన సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఇంటికి భోజనాది కార్యక్రమాలకు హాజరయ్యారు. సతీష్రెడ్డిని బీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, డాక్టర్ నరేంద్రరెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తనను కలిసిన మిత్రులతో సతీష్రెడ్డి మాట్లాడుతూ ప్రధానమైన వైద్యరంగంలో శాస్త్ర సాంకేతికను సద్వినియోగపరచుకోవడంలో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరిందన్నారు. గుంటూరు లాంటి చిన్న నగరంలో ఉన్న సాయి భాస్కర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ’మాకో’ రోబో సేవలు అందుబాటులోకి రావడమే ఇందుకు ఉదాహరణగా తెలిపారు. డాక్టర్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకుకు దీటుగా ఇక్కడి వారికి తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను అందించడంలో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ప్రస్తుతం గుంటూరు విజయవాడలోని రెండు హాస్పిటల్స్ లో రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. భోజనం అనంతరం డాక్టర్ సతీష్రెడ్డిని బూసిరెడ్డి దంపతులు సత్కరించారు. ఏపీ ఏరో స్పేస్ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి -
వాహనదారులపై మరో బాదుడు
పట్నంబజారు: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఊహించని విధంగా ఫిట్నెస్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెను భారాన్ని మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులను గణనీయంగా పెంచుతూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ప్రధానంగా పాత వాహనాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల పైబడిన వాహనాల పునరుద్ధరణ (రెన్యూవల్) కోసం వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ప్రైవేట్ కార్ల ఫిట్నెస్ ఫీజు కేవలం రూ.600 ఉంది. గత సంవత్సరం నవంబర్లో తీసుకున్న సవరణలతో ఇది రూ.5 వేలకు పెరిగింది. ద్విచక్ర వాహనాలకు రూ.200 కాగా రూ.1,000 కి పెరిగింది. మూడు చక్రాల వాహనాలకు రూ. 400 ఉండగా రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ వాహనాల విషయంలో పెంపు మరింత ఎక్కువగా ఉంది. గూడ్స్ వాహనాలు, బస్సుల వంటి భారీ వాహనాలకు ఫిట్నెస్ ఫీజు గతంలో రూ.1,000 ఉంది. ఇప్పుడు రూ.12,500 కు పెరిగింది. మిడిల్ కేటగిరీ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రూ.800 నుంచి రూ.10 వేల వరకు పెంపు అమల్లోకి వచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంగా రెన్యూవల్ చేస్తే అదనంగా జరిమానా కూడా విధించనున్నారు. ఉదాహరణకు, లైట్ మోటార్ వాహనాలకు రోజుకు రూ. 50 వరకు, భారీ వాహనాలకు రోజుకు రూ. 100 వరకు లేట్ ఫీజు విధిస్తున్నారు. పాత వాహనాల వినియోగం తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక్కసారిగా భారీగా పెరిగిన ఈ ఫీజులు సాధారణ వాహనదారులపై ఆర్థిక భారం పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు భారమే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు దాటిన ద్విచక్ర వాహనాలకు రూ. 2 వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.7 వేలు, కార్లు (లైట్ మోటార్ వెహికల్స్)కు రూ.15 వేలు, మధ్యస్థ వాహనాలకు రూ. 20 వేలు, భారీ వాహనాలకు రూ.25 వేలు ఫిట్నెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకుపైగా ఉన్నాయి. ఇప్పటికే బాడుగ లేకపోవడంతోపాటు డీజిల్, పెట్రోల్, వాహన విడి భాగాల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
కేజీబీవీలో అడ్మిషన్లకు గడువు పెంపు
సత్తెనపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్బాగాంధీ (కేజీబీవీ) విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఉచిత వసతి, పోషక విలువలతో కూడిన భోజనం, సురక్షితమైన వాతావరణం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. జిల్లాలోని 24 కేజీబీవీలో ఆరో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి కేటాయించిన 1,920 సీట్ల కోసం అధికంగా పోటీ పడుతున్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థినుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి ఆరో తరగతికి 11,00 దరఖాస్తులు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 920 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువును మరో వారం పెంచడంతో మరిన్ని వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవీ సీట్ల వివరాలు... జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచడంతోపాటు అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలోని నరసరావుపేట, నకరికల్లు, నాదెండ్ల, మాచవరం, క్రోసూరు, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, దుర్గి, గురజాల, నూజెండ్ల, రెంటచింతల, వెల్దుర్తి, సత్తెనపల్లి, ముప్పాళ్ళ, చిలకలూరిపేట, కారంపూడి, పిడుగురాళ్ల, రాజుపాలెం, రొంపిచర్ల, వినుకొండ, ఈపూరు, మాచర్లలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 24 కేజీబీవీలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఒక్కో కేజీబీవీలో 40 చొప్పున 960 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ఒక్కో కేజీబీవీలో 40 చొప్పున 960 సీట్లు భర్తీ కానున్నాయి. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశానికి అర్హులైన బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేజీబీవీలో నాణ్యమైన విద్యతోపాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఈ నెల 10వ తేదీతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసినప్పటికీ, 20వ తేదీ వరకు గడువు పెంచారు. – రేవతి, జీసీడీఓ, పల్నాడు జిల్లా -
నిత్యం ప్రసవ వేదనే
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సర్కార్ ఆసుపత్రిలో వసతులు కరువయ్యాయి. అంతులేని నిర్లక్ష్యంతో గర్భిణులు, బాలింతలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతుల లేమి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నెలలు నిండి పండంటి బిడ్డ కోసం ఆస్పత్రి గడప తొక్కితే.. ఊపిరి ఆడక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. నడినెత్తిన సూరీడు నిప్పులు కక్కుతుంటే.. ప్రభుత్వ ఆసుపత్రి చెమటలు పట్టిస్తోంది. రోగులే ఫ్యాను తెచ్చుకోక తప్పడం లేదు. నరసరావుపేట టౌన్: ప్రభుత్వ ఆసుపత్రి గడప తొక్కినప్పటి నుంచి గర్భిణులు సమస్యలతో విలవిలలాడుతున్నారు. కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లలేని పేదలు ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే కనీస సౌకర్యాలు లేక తల్లీబిడ్డలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తీవ్ర ఉక్కపోతతో గర్భిణులు, బాలింతలు నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యశాలలో ఉండాలంటే ఇంటి నుంచి ఫ్యాను తెచ్చుకోవాలి. లేకుంటే అద్దె ఫ్యానులు ఏర్పాటు చేసుకోవాలని సిబ్బంది సూచనలు ఇవ్వటం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ఇది పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల దుర్భర పరిస్థితి. మౌలిక వసతులు, మెరుగైన వైద్యసేవలు అందక గర్భిణులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుఖప్రసవం జరగాలంటే వారికి పరిశుఽభ్ర వాతావరణం, ఇతర మౌలిక సౌకర్యాలుండాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి చూస్తే కనీసం మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తున్న వైనం కళ్లకు కనిపిస్తోంది. ముఖ్యంగా గైనిక్ విభాగంలో ఫ్యాన్లు తిరగక పోవటంతో బాలింతలు ఉక్కపోతకు తల్లడిల్లిపోతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై చెట్ల కింద సేద తీరుతున్నారు. గర్భిణులకు శస్త్రచికిత్స అనంతరం ఏసీ సౌకర్యం ఉన్న హెచ్డీ యూనిట్కు తరలిస్తారు. అక్కడ కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయటం లేదు. రిపేరు చేయించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడంలేదు. గర్భిణులు ప్రసవాలకు చేరే సమయంలోనే సిబ్బంది రోగులకు ఇంటి నుంచి ఫ్యానను తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. వైద్యశాల సమీపంలో అద్దెకు ఇచ్చే దుకాణాల్లో టేబుల్ ఫ్యాన్లులు తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మరో దారి లేక ఆర్థిక భారమైనప్పటికీ బాలింతలు టేబుల్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకొని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఎన్నో నెలలుగా సమస్య ఉన్నప్పటికీ వాటి గురించి వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో బాలింతలకు కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు ఫ్యానన్లను అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన పసికందుకు ఫ్యాను లేకపోవటంతో ఊపిరాడక ఏడుస్తుంటే ఓదార్చలేక బాలింతలు తల్లడిల్లిపోతున్నారు. దీంతో రోజుకు రూ.150 వరకు చెల్లించి అద్దె ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. మంత్రి రాక ప్రారంభం వాయిదా సమస్యల దృష్ట్యా గైనిక్ విభాగాన్ని లింగంగుంట్లలో నిర్మించిన నూతన భవనానికి మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందుకోసం పురుషుల జనరల్ వార్డును పై అంతస్తుకు మార్చి ఆ స్థానంలో ప్రసూతి విభాగాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. గత నెలలో ప్రారంభించాలని భావించారు. అయితే మంత్రి సత్యకుమార్ యాదవ్ అపాయింట్మెంట్ లభించక పోవటంతో ఇది కాస్తా వాయిదా పడింది. దీంతో గర్భిణులు ఇంకా పాత భవనంలోనే కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఇకనైనా తగిన వసతులు కల్పించాలని గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులు కోరుతున్నారు. పాత ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి విభాగానికి సేవల కోసం అక్కడకు వెళ్లిన గర్భిణులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గైనిక్ విభాగానికి ప్రతిరోజు 150 నుంచి 200 మంది జిల్లా నలుమూల నుంచి గర్భిణులు సేవల కోసం వస్తుంటారు. వీరిలో ఇన్ పేషంట్లుగా 80 మంది వరకు ఉంటారు. ప్రతిరోజు 10 వరకు కాన్పులు అవుతుంటాయి. గైనిక్ విభాగంలో ఉక్కపోతకు తోడు శిథిలావస్థకు చేరిన భవనంతో భయాందోళనలు చెందుతూ రోగులు గడపాల్సి వస్తోంది. శ్లాబ్ పైఅంతస్తు పెచ్చులూడి తరుచూ అచ్చులు పడుతున్నాయి. చిరిగిన పరుపులతో నిద్రకు ఆటంకం కలుగుతుందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా రక్తపరీక్షల కోసం పైఅంతస్తుకు వెళ్లాల్సి రావటంతో గర్భిణులు మెట్లు ఎక్కలేక నానా అవస్థలు పడుతున్నారు. సమస్య అధికారుల దృష్టిలో ఉన్నా పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బాలింతలకు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. -
సత్తెనపల్లి క్లబ్పై పోలీసుల దాడి
● 47 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● రూ.1.70 లక్షలు నగదు, రూ.1.58 లక్షల కాయిన్స్ స్వాధీనం సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి క్లబ్పై జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రత్యేక బృందం ఆదివారం దాడులు నిర్వహించింది. డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు పర్యవేక్షణలో సత్తెనపల్లి రూరల్ సీఐ కె.హైమారావు ఆధ్వర్యంలో ఎస్ఐలు షేక్ అమీనుద్దీన్, పీ పవన్కుమార్, ప్రవీణ్, రాజశేఖర్లతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రత్యేక బృంద సభ్యులు కలిసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. మొత్తం 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.70 లక్షలు నగదు, రూ.1.58 లక్షల కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 27 బైకులు, 5 ఫోర్ వీల్ వాహనాలు, 47 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి క్లబ్పై దాడులు పట్టణంలో కలకలం సృష్టించాయి. సత్తెనపల్లి క్లబ్ను పునఃప్రారంభిస్తూ ఉదయం కొబ్బరికాయ కొట్టడం .. సాయంత్రానికి పోలీసులు ఇలా దాడులు నిర్వహించడంపై పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 528.20 అడుగులకు చేరింది. ఇది 164.6544 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,667, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 5,767 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,767 క్యూసెక్కులు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలువకు రెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం.. -
రంగా కాలనీలో వ్యక్తి హత్య
సత్తెనపల్లి: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీ భీమవరం రోడ్డులో శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన మల్లవరపు బ్రహ్మయ్య (46) చిత్తు కాగితాలు ఏరుకుంటూ రంగాకాలనీలో నివాసం ఉంటున్నాడు. బ్రహ్మయ్యకు స్థానికుడైన చెన్నంశెట్టి శ్రీనుతోపాటు చెల్లెలు వరుసైన క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పద్మతో పరిచయాలు ఉన్నాయి. వారిరువురు కూడా క్రోసూరు ఏరియాలో చిత్త్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పద్మతో చెన్నంశెట్టి శ్రీను సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం తాగిన బ్రహ్మయ్య, శ్రీను ఈ విషయంలో గొడవ పడ్డారు. శ్రీను తలపై బ్రహ్మయ్య కర్రతో దాడి చేయగా గాయమైంది. తన సహజీవనానికి అడ్డు తగలడాన్ని మనసులో పెట్టుకున్న చెన్నంశెట్టి శ్రీను, పద్మలు కలిసి బ్రహ్మయ్యపై దాడి చేశారు. గుండెలపై తీవ్రంగా కొట్టి భీమవరం రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీను, పద్మ సహజీవనం చేస్తుండడంతో బ్రహ్మయ్య గతంలో కూడా పలుమార్లు మందలించాడు. దానిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మయ్యపై దాడి చేసి హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలోనే నల్లబోతు బ్రహ్మయ్యను వారిద్దరు హతమార్చినట్లు వెల్లడించారు. నిందితులు చెన్నంశెట్టి శ్రీను, పద్మలను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
అధికారం ఉందని అహంకారంతో మాట్లాడకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపోగా..వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని తాను చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ..అధికారం ఉందనే అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు అన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో శంకరరావు మాట్లాడుతూ మా పార్టీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతుంటే ఓ వ్యక్తి మా గ్రామానికి నువ్వు ఏం చేశావని ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్తే నీ కెందుకు..నన్ను ఎందుకు కదిలిస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో..నా జోలికి వస్తే నువ్వు చేసే అరాచాకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు బయటకు తీస్తానని అన్నారు. వంద గ్రామాలు..వంద రోజులు అని కార్యక్రమం పెట్టి రోజుకు ఒక అరగంట తిరిగి తానేదో పనిచేసున్నట్లు హై కమాండ్కి చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఈ రెండేళ్లలో ఏ సంక్షేమ కార్యక్రమం కానీ..అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టావా..ప్రజల సమస్యలను పరిష్కరించావా అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించడంతోపాటు టీడీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి వారి సమస్యలను అక్కడే పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో నీ గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో..తెలియకపోతే నీ మనిషిని పెట్టుకుని తెలుసుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోకి నన్ను రానివ్వవా..రానివ్వపోవడానికి నువ్వు ఎవరివి..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..అధికారం ఉందని..కళ్లు నెత్తికెక్కితే ప్రజలే నీ అధికారాన్ని దించుతారు..నియోజకవర్గంలోకి ఎవరిని రానివ్వాలో..ఎవర్ని రానివ్వకూడదో ప్రజలే తేలుస్తారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.682.58కోట్లతో అభివృద్ధి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.1483.24 కోట్లతో సంక్షేమం, రూ.682.58 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.148కోట్లతో అమరావతి, బెల్లంకొండ డబుల్ రోడ్, రూ.60 కోట్లతో మాదిపాడు వద్ద కృష్ణా నదిపైన బ్రిడ్జి, రూ.7.25 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజ్, రూ.4 కోట్లతో పెదమద్దూరు బ్రిడ్జి, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాల నిర్మాణానికి రూ.5.80 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఒక్క రైతుకై నా ప్లాటు ఇచ్చారా? రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుని 9 వేల ఎకరాల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పిన మీరు...ఏ ఒక్క రైతుకై నా ప్లాట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. 9 వేల ఎకరాలు పోతే మిగిలిన 43 వేల ఎకరాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మీరేమో వ్యాపారాలు చేసుకోవాలి, రైతుల్ని మాత్రం ముంచేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని..రాజధాని పేరుతో జరుగుతున్న భూ దోపిడీకి వ్యతిరేకమన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతూ మావిగన్ రాజధాని చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదించారు. చంద్రబాబునాయుడు కూడా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంతో కలిపి సీఆర్డీఏ ఉంటుందని చెప్పారు. రూ.20 వేల కోట్లతో పూర్తయే రాజధాని కావాలా..రూ. 2లక్షల కోట్లతో పూర్తయ్యే రాజధాని కావాలో ప్రజలే గ్రహించాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు యెనుమల మురళీధర్రెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కొండవీటి కోటేశ్వరరావు, భవిరిశెట్టి హనుమంతరావు, నర్సిరెడ్డి, అప్పిరెడ్డి, సాయిరెడ్డి, నాయుడు రాంబాబు, షేక్ సుభాని పాల్గొన్నారు. -
నాటక రంగానికి యువత అవసరం
యడ్లపాడు: నాటక రంగానికి యువతరం ఊపిరి కావాలని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య చెప్పారు. కొండవీడు కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు రోజు ప్రదర్శనలను లింగారావుపాలెం మాజీ సర్పంచ్ షేక్ కరిమూన్ జ్యోతి ప్రజ్వలన చేయగా, వ్యాపారవేత్త దెందుకూరి రవిరాజా నటరాజ పూజ చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు నంబూరు వీరాంజనేయులు సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ నాటక రంగం పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా యువతలోనే ఉందని అభిప్రాయపడ్డారు. వారిని కళారంగంవైపు మళ్లించి తీసుకురావల్సిన బాధ్యత ముందు కుటుంబం నుంచి ప్రారంభం కావాలన్నారు. మరో అతిధి అనంతలక్ష్మి నూలుమిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు నాటకాల్లో పురుషులే సీ్త్రపాత్రల్ని పోషించేవారని, నేడు సీ్త్రలే సీ్త్రపాత్రలు చేయడంతో పాటు ఒక్కో నాటికలో ఎక్కువ మంది సీ్త్రలు ఉండటం శుభపరిణామమన్నారు. రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రామచంద్రప్రసాద్, పఠాన్ యూసఫ్, గరికపాటి సుబ్బారావు, మలినేని సుబ్బారావు, ఆలోకం సుబ్బారావు, ముద్దన రాఘవయ్య చౌదరి ప్రసంగించార. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు కట్టా శ్రీహరిరావు, ఆలోకం సాంబశివరావు, మండెపూడి శ్రీనివాసరావు, నంబూరి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య -
ఇంద్రకీలాద్రిలో భక్తుల కిటకిట
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండో శనివారం, ఆదివారం వరస సెలవుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులు ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300 టికెట్పై కూడా ఈ దర్శనం లభించింది. -
భానుడు.. భగ భగ
రెంటచింతలలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిర్మానుష్యంగా మారిన మాచర్ల–గుంటూరు రహదారిగుంటూరులో ఎండలు మండిపోవడంతో గొడుగులు ఉపయోగిస్తున్న మహిళలు, సోడా బండి వద్ద వే చి చూస్తున్న కొనుగోలుదారులుకొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్నినో ప్రభావం వలన ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఉదయం 10 గంటల నుంచే తీవ్రత పెరిగింది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి కొబ్బరిబొండాలు, చెరుకురసం, శీతల పానీయాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు/ రెంటచింతల -
సందేశాత్మకం.. అద్భుత కళారూపం
యడ్లపాడు: లింగారావుపాలెం వేదికగా సాగుతున్న కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి కళా సంబరాలు రెండోరోజు శనివారం మూడు నాటికలు ప్రదర్శితమయ్యాయి. ఆయా నాటికల్లోని సంఘటనలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్యం చూస్తున్న వాస్తవ ఘటనలకు దర్పణం పట్టాయి. ‘శ్రీమాత్రే నమః’ ఆకాశమంత ఆశ.. అమెరికా వెళ్లాలన్న ఆశయం.. కెరీర్ పరుగులో అందరికంటే ముందుండాలన్న తపన.. ఇదీ నేటితరం ప్రతినిధి అయిన ఒక ఆధునిక యువతి జీవన చిత్రానికి కళారూపమే సీ్త్ర మాత్రే నమః నాటిక. అయితే జీవితం ఎప్పుడూ మనం గీసుకున్న గీతల్లోనే సాగదు. అనూహ్యంగా ఎదురైన ఒక ప్రమాదం ఆమె ఆశల విమానాన్ని నేలకూల్చడమే కాదు, ఆమె జీవన ప్రయాణాన్నే ఓ మలుపు తిప్పిందని సునిశితమైన సంఘర్షణలతో అద్భుతంగా ఆవిష్కరించింది నాటిక. స్వర్ణసూర్య డ్రామా లవర్స్(హైదరాబాద్)వారు సమర్పించగా మూలకథను పూర్ణిమా పెమ్మరాజు అందించగా, ఉదయ భాగవతుల రచన, దర్శకత్వం వహించారు. ‘మమ్మల్ని బతకనివ్వండి’ కుండపోత వర్షంలో భార్య ప్రాణం గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంటే, సాయం కోసం గొంతు చించుకుని విలపిస్తున్న ఆర్తనాదాలు వినిపించింది కనిపించింది కేవలం వ్యాపారమే. మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ పెరిగిన ఈ కాలంలో, తన వద్ద ఉన్న సర్వస్వాన్ని ధారపోసినా ఆ వృద్ధుడికి మిగిలింది మరణమే. వరద భీభత్సంలో మూర్ఛవ్యాధికి చిక్కి తన కళ్ల ముందే ఇల్లాలు కన్నుమూస్తుంటే, నిస్సహాయుడై ఆ ముసలాయన రోదించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన ఈ రూపకం, పల్లెటూరి యాసతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగుతూ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసింది. రచన, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు. ‘తరమెళ్లిపోతున్నదో..’ మరణం తర్వాత కూడా మనిషి జ్ఞాపకం బతకాలంటే, అతడు బ్రతికున్నప్పుడు పంచిన ప్రేమలో నిజాయితీ ఉండాలి. తోడునీడగా ఉండాల్సిన రక్తసంబంధాల మధ్య ఆస్తులు, అంతస్తులు చిచ్చుపెడితే, కోట్లు ఉన్నా ఆ మనిషి ఒంటరివాడేనని కథనమే తరమెళ్లిపోతున్నదో నాటిక. శేషయ్య, దశరథ రామయ్య అనే ఇద్దరు మిత్రుల నేపథ్యంతో మొదలయ్యే ఈ కథ, విద్య యొక్క విలువను, త్యాగంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూనే, ఆధునిక సమాజంలోని కృత్రిమ బంధాలపై చావుదెబ్బ కొట్టింది. తండ్రి చదివించకపోయినా, తన కొడుకు రాఘవరావును గొప్ప ఆఫీసర్గా చూడాలనుకున్న ఒక పేద తండ్రి ఆశయం వెనుక, మరో కొడుకు రంగనాథం చేసిన నిశ్శబ్ద త్యాగం ఈ నాటికలో ప్రతి ఒక్కరినీ కదిలించివేసింది. కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్(గుంటూరు) వారు ప్రదర్శించిన ఈ నాటిక నవసమాజానికి మేలుకొలుపుగా నిలిచింది. -
ఇకపై కోర్టుకో కానిస్టేబుల్ నియమాకం
నగరంపాలెం: జిల్లాలోని న్యాయస్థానాలలో కేసులు పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి కోర్టుకు ఒక కానిస్టేబుల్ను నియమించనున్నట్లు సీఐలు ప్రభాకర్ (డీసీఆర్బీ), ధర్మేంద్రబాబు (కోర్టు మానిటరింగ్ సిస్టం– సిఎంఎస్) చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో ‘కోర్టుల వారీగా అంకితభావం కల్గిన కానిస్టేబుళ్లు మోడల్పై నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. సీఐలు మాట్లాడుతూ ఇప్పటి దాకా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను/పత్రాలను కోర్టులలో దాఖలు చేసేవారని అన్నారు. ఆ కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రతి పోలీస్స్టేషన్ (పీఎస్) నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు విధులు నిర్వర్తించేవారని గుర్తుచేశారు. ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి కోర్టుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని కేటాయిస్తారని తెలిపారు. కోర్టులలో ఫైల్ చేసిన కేసులకు సంబంధించి పీఆర్సీ నంబర్లు, కేసు చార్జిషీటు దాఖలు చేశాక సీసీ నంబర్లు వచ్చేలా పర్యవేక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు సాక్షులను, ఆధారాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కరించాలని అన్నారు. విచారణ కేసులకు హాజరవ్వని ముద్దాయిలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే శాతాన్ని పెంపొందించాలని అన్నారు. పీపీలు, ఏపీపీలతో సమన్వయంతో కేసుల పురోగతికి చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యరపతినేని
గురజాల: తన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బీసీ యువకులు హత్యకు గురైతే.. వారి కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చర్లగుడిపాడు గ్రామానికి చెందిన కాకుమాను భావనాబుషీ, భువనగిరి శ్రీనివాసరావులను ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు అతి కిరాతంగా చంపి కాలువలో పడవేసిన సంఘటన తెలిసిందే. వారి కుటుంబాలను శనివారం మాజీ ఎమ్మెల్యే కాసు పరామర్శించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు చంపి కాలువలో పడవేస్తే స్టేషన్లో కనీసం పట్టించుకోలేదన్నారు. వారి మృతదేహాలను వెతకడానికి కూడా పోలీసులు ఏ మాత్రం సహాయం చేయలేదని మృతుల బంధువులే కాలువ కట్టవెంట వెళ్లి మృతదేహాలను 10 రోజులు తరువాత కనుగొన్నారన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావుకు కనీసం మానవత్వం కూడా లేదని దుయ్యబట్టారు. ఘటన జరిగి ఇప్పటికి సుమారుగా రెండు నెలలు కావస్తున్నా నేటికీ యరపతినేని వారి కుటుంబాలను పరామర్శించలేదన్నారు. బాధితులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి జరిగిన విషయాన్ని చెప్పామని.. ఆయన స్పందించి మన ప్రభుత్వం రాగానే సీబీసీఐడీ వేసి విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారన్నారు. వైఎస్సార్ సీపీ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. పిల్లల అభివృద్ధి కొరకు పొలాన్ని వారికి కేటాయించి వారికి తోడుగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
చంద్రబాబుకు మైకం వదిలించిన ‘మావిగన్’
నరసరావుపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ దెబ్బకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైకం వదిలి అమరావతిలోనే మావిగన్ ప్రాంతాలు ఉన్నాయని చెబుతున్నాడని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్ బీలో భాగంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్ ప్రకటించారన్నారు. దీంతో టీడీపీ నాయకులు అందరూ రాజధాని పరిధిలోనే ఆ మూడు ప్రాంతాలు ఉన్నాయంటూ ఇప్పుడు కవర్ చేస్తున్నారన్నారు. వారి చెప్పిందే నిజమైతే గతంలో వెనుకబడిన ప్రాంతాలలో పర్యటించి వారిని రెచ్చగొడుతూ మీసాలు మెలివేసి తొడలు కొట్టిన అమరావతి యాత్రికులలో ఆ మూడు ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఎందుకు లేరో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన గన్షాట్తో తత్వం బోధపడి దారికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన వికేంద్రీకరణ మంత్రానికి వారి అహంకారం ఆవిరైపోయినందుకు సంతోషంగా ఉందని, అందరి వాడిగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొందరి వారిగా ఉన్న వారినందరినీ ఒకే ఒక్క దెబ్బతో దారికి తీసుకొచ్చాడన్నారు. మహిళలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియెల్ -
యువకుడు ఆత్మహత్య
నరసరావుపేట రూరల్: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్ఐ కిషోర్ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నరసరావుపేట రూరల్: దారిదోపిడీ కేసులో నిందితుడిని రొంపిచర్ల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు కేసు వివరాలు తెలియజేశారు. గత నెల 16వ తేదీన ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన మహిళ స్కూటీపై నరసరావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, బైక్పై వచ్చిన వ్యక్తి ఆమెను అటకాయించి రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లి బంగారు వస్తువులు దోచుకెళ్లాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మంగళగిరికి చెందిన రాచగిరి రాఘవయ్యను సుబ్బయ్యపాలెం వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.15వేల నగదు, రెండు వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు, ఏఎస్ఐ కిషోర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): న్యూ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఆధ్వర్యంలో అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్ కమిషనర్ సౌమ్య, కమిషనర్ డాక్టర్ కె.రవిశంకర్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, షటిల్, టెన్నికాయిట్, చెస్, 2 కే రన్, 1కే రన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్ సెక్రటరీ జగదీష్బాబు పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావుకు అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు. నగరంపాలెం: గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే డీఎస్పీ బి.సునీల్ బదిలీయ్యారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు జరగ్గా, ఆయన్ను విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ డీఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు సీఐడీలో సుమారు ఏడాదిపాటు సునీల్ విధులు నిర్వర్తించారు. -
పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి
సత్తెనపల్లి: రైతు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సత్తెనపల్లి సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన నియోజకవర్గ రైతు సంఘ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు కె.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ మొక్కజొన్న, కందులు, వరి, తదితర పంటల పండించే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. హరిచంద్రపురం నుంచి నకరికల్లు వరకు కృష్ణా జలాలను తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంకా ఆ పథకం కార్యరూపం దాల్చలేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా మరమ్మతులు చేసి వాడుక లోకి తెస్తే వ్యవసాయ రంగంలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులు విక్రయించడంలో రైతులకు దళారుల ప్రమేయం అధికంగా ఉంటుందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 19న వినుకొండలో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆల్ ఇండియా కిసాన్ సభ జరిగి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరింత ఉత్సాహంగా జిల్లా మహాసభలు నిర్వహించుకునేందుకు సత్తెనపల్లి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో రైతాంగం మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభలలో రైతు సంఘం సత్తెనపల్లి నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు, వందల ఏళ్లుగా అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు నిరుపమానమని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, వివిధ విభాగాల పరిపాలనాధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు చంద్రమౌళీనగర్కు చెందిన ఉప్పలపాటి శేఖర్, మాధవి రూ.1,00,001 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి నాగేశ్వరరావు, డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో ఇంటెలిజెన్స్ ఐజీపీ మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీపీ పీహెచ్డీ రామకృష్ణ కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలోపాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ పి.గౌతమ్కుమార్. ఆలయ అధకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు శనివారం రూ.5 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కె.శ్రీనివాసుమూర్తి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 33 గ్రాముల బంగారం, రూ.5 లక్షలతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఎఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. -
సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి పూలే
కలెక్టరేట్లో నివాళులర్పించిన జేసీ, ఎమ్మెల్యే, నాయకులునరసరావుపేట: సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి, సమాజం కోసం కష్టపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే అని జాయింట్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు చదలవాడ అరవిందబాబుతో కలసి ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పూలే జీవిత చరిత్ర, పోరాటాలు, లక్ష్యాలు అందరూ తెలుసుకోవాలన్నారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అసమానతలు రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. మహిళలు చదువు లేకపోవడం వలన గుర్తింపు పొందడం లేదని గుర్తించి తన జీవిత భాగస్వామిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేశారన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించారన్నారు. డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ మహాత్ముల జీవిత చరిత్రలు, బయోగ్రఫీలు అందరూ చదివి స్ఫూర్తి పొందాలన్నారు. తొలుత పల్నాడు బస్టాండు వద్ద ఉన్న ఫులే విగ్రహానికి జేసీ, శాసనసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్డీఓ కె.బాలకృష్ణ, బాదుగున్నల శ్రీను, డాక్టర్ రాంప్రసాదు, టీడీపీ నాయకుడు వల్లెపు నాగేశ్వరరావు, వాసిరెడ్డి రవి, అధికారులు పాల్గొన్నారు. -
వాస్తవికత కలిగిన రాజధాని మావిగన్
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన రాజధాని ‘మావిగన్’కు ప్రజలు మద్దతు తెలియచేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. మావిగన్ వాస్తవికతకు దగ్గరగా ఉన్న రాజధాని అని, అమరావతి గ్రాఫిక్స్ రాజధాని అనేది తెలుసుకోవాలన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఎప్పుడైతే మావిగన్ రాజధాని గురించి మాట్లాడారో అప్పటినుంచి ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోందన్నారు. ప్రతిపాదించిన మూడూ పెద్ద నగరాలని, మచిలీపట్నంలో ఉన్న పోర్టును కూడా అభివృద్ధి చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. ప్రపంచంలో పోర్టు ఉన్న ప్రతి రాజధాని నగరం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. మంచి తీర ప్రాంతం కూడా ఉన్నందున ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలో నయా రాయపూర్ అనే ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం రాజధాని కట్టారని, ఇప్పటికీ అక్కడ ప్రజలు ఎవరూ నివసించడం లేదని చెప్పారు. ఆఫీసులు మాత్రమే నడుస్తున్నాయని, ఉద్యోగస్తులు ఉదయం 15 కిలోమీటర్ల దూరంలోని రాయపూర్ నుంచి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోతున్నారని చెప్పారు. అమరావతి కూడా అదేవిధంగా తయారవుతుందన్నారు. అభివృద్ధికి అవకాశం సమీపంలో ఉన్న అభివృద్ధి ప్రాంతాల్లో నివసించేందుకు ఇష్టపడతారన్నారు. రాష్ట్రంలో పోర్టు ఉన్న విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమని తెలిపారు. అక్కడ ఆర్థిక కార్యకలాపాలు బాగా జరుగుతున్నందునే శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. మావిగన్ కూడా అదే తరహా అవకాశం కలిగిన ప్రాంతం అన్నారు. కాబట్టి అభివృద్ధి చెందటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రజలందరూ మావిగన్పై ఆలోచన చేయాలని సూచించారు. ప్రముఖ విశ్లేషణకర్త, న్యాయవాది మాడభూషి శ్రీధర్ చట్టాలు తెలిసిన వ్యక్తి అని, ఆయన మావిగన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ట్రోల్ చేస్తూ బూతులు తిడుతున్నారన్నారు. మావిగన్ బాగుంది కాబట్టే ఆయన సపోర్ట్ చేశారన్నారు. అమరావతి రాజధాని ఎన్నేళ్లలోపు పూర్తి చేస్తారు? ఎన్ని రూ.లక్షల కోట్లు అవసరం అవుతాయో చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్ని తరాలు పడుతుందో చెప్పటానికే కష్టంగా ఉందన్నారు. చిన్నపాటి వర్షం కురిస్తేనే మునిగిపోయే ప్రాంతంలో రూ.లక్షల కోట్లు తీసుకెళ్లి ధారబోసే పని చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందిన నగరాలలో రాజధాని పెడితే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రైతుల సంతోషం ముఖ్యం మొక్కజొన్న పంట పండించిన రైతు ఈ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నాడని, దాళ్వా కంటే ఎక్కువగా ఈ ఏడాది మొక్కజొన్న పండించారన్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉంటే, ప్రైవేట్ వ్యక్తులు కేవలం రూ.1650 నుంచి రూ.1700 మాత్రమే ఇస్తున్నారన్నారు. రైతు ఎకరాకు రూ.28 వేలు నష్టపోతున్నాడని చెప్పారు. డబ్బులన్నీ తీసుకువెళ్లి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పోస్తున్నారని విమర్శించారు. అందువల్లే రైతులు పండించిన పంటను కొనలేకపోతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా కలెక్టర్కు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనాలని గతంలో విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.300 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయటానికి, రూ.3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు చేతులు రాని ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లుతో రాజధాని నగరాన్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారని అన్నారు. కేవలం ప్రజల్ని గ్రాఫిక్ మాయాజాలంలో ఉంచుతున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని చెప్పారు. ఇక్కడ రాజధాని నిర్మాణానికి ఒక చదరపు గజానికి రూ.12,500 ఖర్చు పెడుతున్నారని, అదే ఢిల్లీలో రూ.4 వేలతో బ్రహ్మాండంగా కడుతున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో సామాన్యుడు నివాసం ఉండే పరిస్థితి లేదన్నారు. అటువంటి ప్రాంతం రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ను కూటమి నాయకులు విపరీతంగా దూషిస్తూ మాట్లాడుతున్నారని, కేవలం మావిగన్ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికే అచ్చెన్నాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణ తీవ్ర పదజాలంతో దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కూడా మావిగన్పై 45 నిమిషాలు చర్చించారని, మావిగన్ కచ్చితంగా మంచి రాజధాని ప్రాంతం అవుతుందని తెలిపారు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. -
ఛాన్స్ చూసి ఏసీయ్..!
గుంటూరు మెడికల్: కంచె చేను మేసిందన్న చందంగా గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి ఉంది. గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏసీలను అపహరిస్తూ పట్టుబడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొంతకాలంగా పలు వార్డుల్లో, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోతతో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక వైద్య సేవలు అందించేందుకు చమటోడుస్తున్నారు. ఆసుపత్రికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర సేవల విభాగంలో ఏసీలు పనిచేయక అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు. రోగులు, వైద్యులు అల్లాడిపోతున్నా, అధికారుల గదుల్లో ఏసీలు బాగా చల్లగా పనిచేస్తుండటంతో, రోగుల బాధలు, వైద్యుల బాధలు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల మాటే మరిచారు ఆసుపత్రిలో ఏసీల మరమ్మతుల మాట మరిచిపోయారు. మరమ్మతులకు గురైన వాటిని బయటకు తీసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. కొత్తవాటిని కొనుగోలు చేసి అమరుస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఆయా వార్డుల్లో తొలగించిన ఏసీలు ఎక్కడకు వెళుతున్నాయో ఎవరికి తెలియడం లేదు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన వారు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తుంది. మండుతున్న ఎండలు వేసవి ప్రారంభమైందంటే మార్చి నెల నుంచే గుంటూరులో ఎండలు మండిపోతుంటాయి. గుంటూరు నగరంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్లో పలు వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లలో సైతం ఏసీలు పనిచేయడం లేదు. ఇటీవల కాన్పుల వార్డులో కూడా ఏసీలు పనిచేయక బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెజబ్బుల వార్డు, ఇతర వార్డులు, క్యాజువాల్టిలో ఎప్పటి నుంచో ఏసీలు పనిచేయడం లేదు. అయినప్పటికీ మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది. ఏసీలు మరమ్మతులు చేయకపోయినా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు ఆసుపత్రి అధికారులు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్లో 32కుపైగా వైద్య విభాగాలు ఉన్నాయి. 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు ఎంతో కీలకమైన విభాగాలు. వీటిల్లో తప్పనిసరిగా ఏసీలు ఉంటేనే వైద్యులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోతే రోగుల శరీర ఉష్ణోగ్రత్తల్లో తేడా వచ్చి కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోవడం వల్ల అత్యవసర వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయక వాటి పనితీరులో తేడాల వల్ల ప్రాణాపాయ చికిత్స పొందుతున్న రోగులు ఆపరేషన్ చేయించుకున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల్లో ఎంతో కీలకమైన ఏసీలకు మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఏసీలు అపహరణకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది సైతం వీటి గురించి చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఇరువురు ఉద్యోగులు ఎమర్జెన్సీ వార్డుపైన ఏసీలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాల్లో రికార్డు అవడం ద్వారా పట్టుబడ్డారు. దీంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమై గతంలో పోయిన ఏసీలను కూడా ఎవరు చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతేడాది కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు దాతలు, బ్యాంకులు, పారిశ్రామిక వేత్తలతో జీజీహెచ్లోని పేద రోగుల కోసం ఏసీలను డొనేషన్ చేయించారు. ఆ ఏసీలు ఎక్కడ ఉన్నాయో, ఏ వార్డులో వాడుతున్నారో ఎవరి వద్దా లెక్కలు లేవు. గతంలో ఉన్న ఏసీలకు సైతం లెక్కలు లేవు. వర్క్షాప్ ద్వారా ఏసీల నిర్వహణ గతంలో ఉండేది. నేడు వర్క్షాప్ నుంచి అధికారుల వద్దకు ఏసీల నిర్వహణ బాధ్యతలు మారడంతో ఏసీల అపహరణలు జరుగుతున్నాయి. -
ఏటీఎంలలో రూ. 87 లక్షల నగదు చోరీ
పిడుగురాళ్ల: ఏటీఎంలలో నగదు ఉంచాల్సిన ఉద్యోగి ఆ నగదును దొంగిలించి పరారైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పిడుగురాళ్లపట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల పట్టణంలోనే ఎస్బీఐ బ్రాంచ్కు చెందిన నాలుగు ఏటీఎంలలో అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ఏటీఎంలో శుక్రవారం రూ. 48 లక్షలు ఉదయం సమయంలో తోటి సిబ్బందితో సీఎంఎస్ గుంటూరు బ్రాంచ్కు చెందిన కస్టోడియన్ మామిడి నరేష్ అనే ఉద్యోగి ఏటీఎంలో నగదును పేర్చారు. అతనితోపాటు ఉద్యోగులు కూడా ఉండటంతో తెలివిగా ఏటీఎంలలో నగదును ఏర్పాటు చేసినా లాక్ వేయలేదు. తోటి ఉద్యోగులతోపాటు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలోనే వేరే పని ఉందని చెప్పి గుంటూరుకు వెళ్లకుండా మార్గమధ్యలోనే దిగాడు. తోటి ఉద్యోగులు గుంటూరు వెళ్లిపోయారు. ఆ తరువాత మామిడి నరేష్ ఏటీఎంలకు వచ్చి మొత్తం రూ. 87 లక్షలకుపైగా నగదును ఏటీఎంలో నుంచి తీసుకొని పరారయ్యాడు. ముందుగా ఏటీఎంలలో ఏర్పాటుచేసిన రూ. 48 లక్షలు, అంతకుముందు ఏటీఎంలో ఉన్న మిగిలిన నగదుతో కలిపి మొత్తం రూ. 87 లక్షలకు పైగా ఉన్న నగదును అపహరించారు. నరేష్ పథకం ప్రకారం తిరిగి వచ్చి ఏటీఎంలలో ఉన్న నగదు మొత్తాన్ని చోరీ చేశాడు. ఏటీఎంలో నగదు రాకపోవడంతో పలువురు బ్యాంకు కస్టమర్లు ఆయా బ్యాంకు మేనేజర్లకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూడగా విషయం తెలిసింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీరామ్ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏకాంతంగా ఉన్న జంటలే ఆ ఏఎస్సై టార్గెట్
పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో సంచలన ఘటన బయటపడింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఓ ఏఎస్ఐ అకృత్యాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని, వారి వీడియోలను రహస్యంగా చిత్రీకరించి తర్వాత బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఆ వీడియోలను చూపిస్తూ యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తూ కోరికలు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితులు చెబుతున్నారు.ఈ వ్యవహారంలో జమ్మలమడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహకారం తీసుకుని వీడియోలు తీయిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన బెదిరింపు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు 18 సిలిండర్లను శుక్రవారం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వివరాలు... వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్న విస్తృత తనిఖీలలో భాగంగా శుక్రవారం విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసనగర్కు చెందిన గంటా ఫకీరయ్య 18 గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. మధ్యవర్తుల సమక్షంలో సిలిండర్లను స్వాధీనం చేసుకొని నరసరావుపేట మండల పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనలపై అత్యవసర సరుకుల చట్టం, 1955 లోని సెక్షన్ 6–ఏ కింద కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో 22న నిర్వహించేందుకు నిర్ణయించారు. 25న స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 25వ తేదీన జెడ్పీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు సీఈవో వి.జ్యోతిబసు షెడ్యూల్ విడుదల చేశారు. నగరంపాలెం: జిల్లాలోని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలిచ్చి, వారిని ప్రమాదాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన నిమిత్తం గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన చోదకులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం నగరంపాలెం పోలీస్ కవాతు మైదానంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 206 వాహనాలు సీజ్ చేయగా, 636 వాహనాలకు రూ.3.36 లక్షల జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహన డ్రైవ్ చేపట్టామని అన్నారు. మైనర్ల డ్రైవింగ్, ర్యాష్/ ట్రిపుల్ రైడింగ్లు, లైసెన్సు, బీమా, హెల్మెట్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తించామని చెప్పారు. మైనర్లకు ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు అప్పగిస్తే, తర్వాత వారి పిల్లల ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు ఎ.అశోక్కుమార్ (తూర్పు ట్రాఫిక్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), శివప్రసాద్ (లాలాపేట పీఎస్), ఆరోగ్యరాజు (అరండల్పేట పీఎస్), సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్), ఆర్ఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాల యాజమాన్యానికి చెందిన ఐదుగురిపై పట్టాభిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్ర మౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన విషయం విదితమే. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. రూ.లక్షల ఫీజులు వసూలు చేసి భవితవ్యంతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఆక్స్ఫర్డ్ కళాశాల సీఈఓ సన్ని, కళాశాల డీన్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ దీప, హాస్టల్ ప్రిన్సిపల్ ప్రసన్న, కంప్యూటర్ ఆపరేటర్ మూర్తిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంగస్థలిపై మానవీయ సంతకాలు
యడ్లపాడు: జగతిని జాగృతం చేసేవి కళారూపాలేనని ఏపీ రాష్ట్ర తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. రసవత్తరమైన నటనకు, భావోద్వేగాలకు వేదికగా నిలిచే లింగారావుపాలెంలో కొండవీటి కళా పరిషత్ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్న్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయగా, పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు అధ్యక్షత వహించారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను ఎండగట్టే గొప్ప శక్తి సింగిల్ టేక్లో ప్రదర్శించే ఒక్క నాటకానికి మాత్రమే ఉందన్నారు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ నాటక రంగాన్ని నడిపిస్తున్నవి పరిషత్తులు, దాతలు మాత్రమే అన్నారు. ముత్తవరపు అరుణకుమారి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వవైభవానికి తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం నేత చలసాని శ్రీనివాస్, విరించి రిసార్ట్స్ అధినేత నెల్లూరి వంశీకష్ణ, పఠాన్ సుభాని, ఆలోకం అమరలింగస్వామి, కిలారు వెంకటరావు, నంబూరు నరసింహారావు, కృష్ణారావు, శొంఠినేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. వ్యాపారమైన మాతృత్వంపై కన్నీటికి విలువెంత..? సమాజంలోని అతి కిరాతకమైన వైద్య మాఫియా ముఖాన్ని బట్టబయలు చేసింది. అమ్మ ప్రేమను కూడా అంగడి సరుకుగా మారుస్తున్న డాక్టర్ సరోజినీ దేవి అరాచకాలను, సామాన్య సీ్త్రల పోరాట పటిమను ఈ నాటిక అద్భుతంగా చిత్రించింది. నర్సు నందిని అందించిన సహకారంతో, బాధితులు సీతాలు, మాధవి తమ కన్నీటిని ఆయుధాలుగా మలిచి వ్యవస్థలోని అన్యాయంపై సమరశంఖం పూరించారు. డి.కామేశ్వరి కథను దృశ్యరూపంలోకి మలిచిన విధానం, బీవీకే క్రియేషన్స్ వారి నటన.. వైద్య రంగంలో మంటగలుస్తున్న నైతిక విలువలను ప్రశ్నించడమే కాకుండా, సీ్త్ర శక్తి తలచుకుంటే ఎంతటి కుట్రనైనా ఛేదించగలదని నిరూపించింది. మాయాలోకంలో మనీషిని వెతికిన మంచి మనసులు.. స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో నిస్వార్థ సేవ యొక్క ప్రాధాన్యాన్ని హృదయాలకు హత్తుకునేలా చాటిచెప్పింది. తోటి మనిషి కష్టాన్ని తనదిగా భావించేవాడే అసలైన దైవమని, రక్త సంబంధాల కంటే ఆపన్న హస్తం అందించే మానవ సంబంధాలే మిన్న అని చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వ ప్రతిభతో సాక్షాత్కరించారు. అందరి క్షేమాన్ని కాంక్షించే ఉన్నత ఆశయమే సమాజానికి ప్రాణవాయువు అని చాటుతూ, ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు)బృందం ప్రదర్శించిన ఈ రూపకం మనుషుల మధ్య అంతరించిపోతున్న మమకారాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అందం వర్సెస్ అమ్మతనం.. ఇక శ్రీరమణా కళానిలయం సమర్పించిన మాతృత్వం నాటిక ఆడతనం అంటే కేవలం బాహ్యా సౌందర్యం కాదని, అది అమ్మతనంలోనే పరిపూర్ణత చెందుతుందని లోతైన విశ్లేషణ చేసింది. వృత్తి, అందం అనే వ్యామోహంలో పడి సంతానాన్ని భారంగా భావించిన లావణ్య అనే యువతి పాత్ర ద్వారా నేటి తరం ధోరణిని సునిశితంగా విమర్శించారు. అహంకారం నుంచి పశ్చాత్తాపం వైపు సాగిన ఆమె ప్రయాణం, పక్షవాతంతో ఉన్న అత్తగారి మాతృత్వ హృదయాన్ని చూసి కళ్లు తెరుచుకోవడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సుఖమంచి కోటేశ్వరరావు రచనకు, పొగర్తి నాగేశ్వరరావు ప్రాణం పోయగా, మారుతున్న కాలంలో మసకబారుతున్న కుటుంబ విలువలను సరిదిద్దే కనువిప్పుగా ఈ నాటిక నిలిచింది. -
పల్నాడు
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.0200 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 528.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 8,314 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.11,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
వణికితే భయం.. చికిత్సతో నయం
గుంటూరు మెడికల్ పార్కిన్సన్స్ వ్యాధి గతంలో 50 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే వచ్చేది. నేడు 40 ఏళ్లలోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి జీవితం చాలా దుర్భరంగా తయారవుతోంది. ముఖ్యంగా కూర్చోలేరు, పడుకోలేరు, నడవలేరు. శరీరం వణికిపోవటం లేదా కాలు లేదా చేయి వణికిపోతూ ఉంటాయి. వణుకుడు రోగంగా ప్రాచుర్యంలో ఉన్న పార్కిన్సన్స్ డీసీజ్ను మొదటిసారిగా 1817లో డాక్టర్స్ జేమ్స్ పార్కిన్సన్ గుర్తించారు. ఈ వ్యాధిపై అవగాహన కోసం ప్రతి ఏడాది ఏప్రియల్ 11న వరల్డ్ పార్కిన్సన్స్ డీసీజ్ అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు. వ్యాధి గురించి తెలుసుకుని తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కారణాలు ఇవీ... పార్కిన్సన్స్ వ్యాధి మెదడులోని ఒక భాగంలోని నాడీ కణాలు క్షీణించటం వల్ల వస్తుంది. వృద్ధుల్లో డోపమిన్ లోపం వల్ల, యువకుల్లో జన్యుపరమైన కారణాలతో, కొన్ని రకాల పర్యావరణ పరిస్థితుల వల్ల, కొన్ని రకాల మందుల తీసుకోవటం వల్ల, పిల్లల్లో ఇతర జబ్బుల వల్ల వ్యాధి బారిన పడుతుంటారు. మెదడు అనారోగ్యంతో బాధపడే వారిలో, తలకు తీవ్ర గాయాలైన వారిలో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో వ్యాధి రావొచ్చు. లక్షణాలు ఇలా... శరీరంలోని ఏదో ఒక భాగం అంటే చేతులు లేదా కాళ్లు లేదా దవడపై భాగంలో వణుకుడు వస్తోంది. నడవలేరు, కదలలేరు, మంచంపై పడుకున్నా వణుకుడు ఉంటుంది. నడకకు ప్రయత్నించినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోతారు. కండరాలు పట్టివేయటం, బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. వస్తువులు కూడా పట్టుకోలేరు. వాసన చూడలేరు. మాట కూడా వణుకుతూ వస్తుంది. నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని ప్రత్యేక సందర్భల్లో డిప్రెషన్, ఆహారం నమలటం, మింగటం కష్టంగా మారుతుంది. అలసట, మలబద్ధకం, చర్మ సమస్యలు, లైంగిక సమస్యలు, భయం, భ్రమలు, భ్రాంతులు, చొంగ కార్చుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
డీబీఎస్ ఆపరేషన్లు కూడా...
వ్యాధి బాధితులకు నేడు డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డీబీఎస్) అనే అత్యాధునిక ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. డీబీఎస్ ఆపరేషన్లు పార్కిన్సన్స్ వ్యాధి బాధితులకు వరం వంటివి. గతంలో ఆపరేషన్లు లేకపోవటంతో జీవితాంతం ఎక్కువ మొత్తంలో మందులు మింగాల్సి వచ్చేది. ఈ ఆపరేషన్లు చేయటం ద్వారా బాధితుడు సాధ్యమైనంత మేరకు మందులు తగ్గించి వేయవచ్చు. తన పనులు తాను కొంత మేరకు చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. – డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, సీనియర్ న్యూరో సర్జన్, గుంటూరు -
ప్రకృతి సాగుతో ఆరోగ్యకర జీవనం
నరసరావుపేట: అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించి న్యూట్రి గార్డెన్ మోడల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం న్యూట్రి, కమ్యూనిటీ, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్, బయో–రిసోర్స్ సెంటర్లపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు బడులు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు, మహిళల ఇళ్ల వద్ద ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోజువారీగా పోషక విలువలతో కూడిన ఆహారం పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రి గార్డెన్స్ ప్రోత్సాహం కోసం గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని సూచించారు. బయో–రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ల ఏర్పాటు, పాయింట్ పర్సన్స్ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధ్యం అవుతాయని తెలిపారు. న్యూట్రి, కిచెన్, కమ్యూనిటీ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్ ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో భాగంగా విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, సేంద్రియ ద్రావణాల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంతోపాటు ప్రకృతి వ్యవసాయం విస్తరణకు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు దోహద పడుతుందని అధికారులు తెలిపారు. స్పెషల్ కలెక్టర్ మనోజ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, డీపీఓ, ఎంపీడీఓలు, ఎంసీలు, ఏపీఎంలు, ఎంఈఓలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, పన్నుల విభాగ గుంటూరు జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్ పాత్రో పల్నాడు జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లు పెంచడంలో వివిధ విభాగాలు అందించాల్సిన సహకారం, ఆవశ్యకత వివరించారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల అసిస్టెంట్ కమిషనర్లు హాజరయ్యారు. జిల్లాలో రైల్వే సంస్థ చేపట్టిన ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, రైల్వే శాఖ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
ఇంటర్వ్యూలకు 169మంది హాజరు
మేడికొండూరు : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మేడికొండూరు సీఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలేటి మనోహర్ (26) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం తన విధులు ముగించుకొని స్కూటీపై సత్తెనపల్లి వెళుతుండగా మార్గంమధ్యలో మేడికొండూరు సమీపాన ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద పిడుగురాళ్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అజాగ్రత్త నడుపుతూ మనోహర్ పయనిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. ప్రమాదంలో మనోహర్ బస్సు కింద పడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాదంపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. -
రక్తమోడుతున్న రహదారులు
పల్నాడు జిల్లాలో నిత్యం ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. క్షణకాలంలో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారు. బాధిత కుటుంబాల్లోని వారు రోడ్డున పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబాన్ని పోషిస్తున్నవారు మరణిస్తే మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు మొదలై జీవితాలు తలకిందులవుతున్నాయి. సాక్షి, నరసరావుపేట : ఇంటి నుంచి అర కిలోమీటరులోపు రోడ్డుపై ఉన్న టిఫిన్ సెంటర్కు వెళ్లి అల్పాహారం తీసుకురావడమేగా... అనుకొని హెల్మెట్ ధరించకుండా శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన 16 ఏళ్ల బాలుడు రవీంద్ర ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అనుకోని ప్రమాదంలో మినీ ట్రక్కు ఢీకొని గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో కనమర్లపూడి వద్ద సంఘటనా స్థలంలోనే మరణించాడు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ద్విచక్రవాహనం నడపకూడదు. కనీసం హెల్మెట్ కూడా ధరించకపోవడంతో చేతికందిన కొడుకును తల్లిదండ్రులు కోల్పోవాల్సి వచ్చింది. విధులకు వెళుతున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజులుగా జిల్లాలో ప్రతి రోజు ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ వంటి కారణాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. గత వారం రోజుల్లో రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 10 మంది మృత్యువాత పడ్డారు. పాతిక మంది గాయాలపాలయ్యారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే పల్నాడు జిల్లాలో ఏకంగా 147 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 85 మంది మృతి చెందారు. మరో 149 మంది గాయాలపాలయ్యారు. ముఖ్యంగా గత వారం రోజులుగా నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. వినుకొండ నియోజకవర్గంలో ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. 2024తో పోల్చితే గత సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహన చోదకుల్లో మార్పులు రావడం లేదు. కొన్నేళ్లుగా జరిగిన మొత్తం ప్రమాదాల్లో మూడోవంతు ద్విచక్ర వాహనదారులవే ఉన్నాయి. గత బుధవారం వెల్దుర్తి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వెంకట్ నాయక్ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో దాచేపల్లి వద్ద లారీని ఢీకొని తలకు తీవ్రగాయాలై మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేది. గాయాలతో బయటపడే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పది మంది హెల్మెట్ ధరించకపోవడంతో జరిగినవే. ఇది ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్ట పోలీసు, రవాణా శాఖ అధికారులు గుర్తించారు. రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. అయినా ప్రమాదాలను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. వినుకొండ పట్టణ శివారులో అతివేగంతో వచ్చి లారీని ఢీకొట్టిన వాహనం (ఫైల్) జిల్లాలో గత రెండు సంవత్సరాలలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు సుమారు 34 బ్లాక్ స్పాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రదేశాలలో పోలీస్, రవాణా, నేషనల్ హైవేస్ మరియు ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులు విశ్లేషించారు. ఆయా బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు గల కారణలను విశ్లేషిస్తున్నారు. జంక్షన్ల వద్ద వాహనదారులు వేగాన్ని నియంత్రించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం. నార్క్ట్పల్లి – అద్దంకి హైవేలో రొంపిచర్ల, పొందుగుల, గురజాల రోడ్ జంక్షన్, గుంటూరు – పిడుగురాళ్ల రహదారిలో కంటిపూడి, పిడుగురాళ్ల మండలం కామేపల్లి, ముప్పాళ్ళ, గుంటూరు – శ్రీశైలం రోడ్లో అందుగలపాడు, రావిపాడు గ్రామాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. వినుకొండ పరిసరాలలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ సమయంలో వాహనదారులు మద్యం మత్తులో ఉండటం కూడా ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. -
చిలకలూరిపేటలో న్యాయవాది హత్య
చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ న్యాయవాది హత్యకు గురయ్యాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్(37) ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగజ్యోతి, ఏడేళ్ల బాబు ఈశ్వర అకీర, ఆరేళ్ల పాప నవనీత ఉన్నారు. ప్రసాద్ తల్లి తిరుపతమ్మ ఒంగోలు న్యాయస్థానంలో అటెండెంట్గా పనిచేస్తున్న క్రమంలో ముందుగా మార్కాపురంలో ప్రాక్టీస్ చేసిన ఆయన నాలుగేళ్లుగా ఒంగోలులో ఉంటున్నారు. గురువారం సాయంత్రం హైకోర్టుకు వెళ్లాలంటూ ఇంటి నుంచి స్కూటీపై ఆయన బయలుదేరారు. రాత్రికి పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకొని శుక్రవారం తెల్లవారుజామున కోటప్పకొండ రోడ్డులో చిలకలూరిపేట వైపు స్కూటీపై వెళ్లారు. ఆ తర్వాత యడవల్లి గ్రామ సమీపంలో రోడ్డు మార్జిన్ పక్కన సుమారు ఐదు అడుగుల పల్లపు ప్రదేశంలో న్యాయవాది మృతదేహంపై స్కూటీ పడి ఉంది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్ఐ జి అనిల్కుమార్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎన్నో అనుమానాలు... ముందుగా అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను, మృతుడి తలపై గాయాలను గుర్తించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహంపై ఎవరో స్కూటీని పడవేసినట్లుగా ఉండడం, మృతదేహం పూర్తిగా వాహనం కింద పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు స్కూటీ పడిపోయిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు మార్జిన్లో బండరాయి రక్తంలో తడిసిపోయి ఉండటం న్యాయవాదిని ఎవరైనా బండరాయితో మోది చంపారా అనే అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. దీంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను పిలిపించి విచారణ చేపట్టారు. హైకోర్టుకు వెళతానన్న న్యాయవాది యడవల్లి రూట్లోకి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కోటప్పకొండ వద్ద నుంచి సీసీ పుటేజీల పరిశీలన చేపట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధితో వివాదం భూ వివాదాల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితో న్యాయవాదికి వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. తన బంధువుల పక్షం నిలబడిన విషయమై ఆయనతో విభేదాలు తలెత్తినట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉంటాడని, స్నేహభావంతో మెలిగే ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని మరి కొందరి వాదన. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పల్నాడులో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు.అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
మ్యూజియాన్ని సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్
అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన అమరావతిలోని కాలచక్ర మ్యూజియాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న జిల్లా పర్యాటక మండలి సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభ్యర్థన మేరకు కలెక్టర్ మ్యూజియాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాలచక్ర మ్యూజియంలో శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. విదేశాలకు తీసుకువెళ్లిన శిల్పాలను వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కనీస అవసరమైన పనులను పూర్తిచేసి, మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 15వ తేదీన అమరావతిలో పర్యాటకశాఖ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ యూనిట్ ఇన్చార్జి మణికుమార్, డీఈ కుమార్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. చందోలు(కర్లపాలెం): పిట్టలవాని పాలెం మండలం చందోలులో వేంచేసియున్న శక్తి స్వరూపిణి బగళాముఖి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహ మూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారి భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పండ్లు, తాంబూలం, అమ్మవారి ప్రసాదాలను వారికి అందజేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్, ఈవో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్లలో వెళ్లి అమ్మ వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యడ్లపాడు: చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే కొండవీడు కోట, ఇప్పుడు సాహస పర్యాటకానికి వేదిక కానుంది. జిల్లా పాలన యంత్రాంగం, అటవీశాఖ, అవుట్ రైవల్ అడ్వెంచర్స్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుంచి కొండవీడు కొండలపై నైట్ టెంట్ క్యాంప్ ఫైర్ను ఏర్పాటు చేయనున్నారు. కొండల నడుమ గడిపేలా ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. సాహసయాత్ర శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని, అతిథుల కోసం కొండపై అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెంట్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాత్రి వేళ మ్యూజికల్ నైట్ స్వరాలు, క్యాంప్ ఫైర్ వెలుగులు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నారు. వీటికి తోడు స్థానిక రుచులతో కూడిన అల్పాహారం, విందు ఉంటుందని, మరుసటి రోజు ఉదయం ప్రకృతి అందాల మధ్య సాగే ట్రెక్కింగ్, ఉత్సాహాన్ని నింపే బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. పెద్దలకు రూ.2 వేలు, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ.వెయ్యిగా రుసుమును నిర్ణయించారు. ఇందులో భోజన, వసతి సదుపాయాలన్నీ కలిపి ఉండటం పర్యాటకులకు కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
రాధాకృష్ణను అరెస్టు చేయాలి
నరసరావుపేట: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు సమాజానికి తలవంపులు అని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పేర్కొన్నారు. పార్టీ నాయకుల భార్యలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా, నియోజకవర్గ అనుబంధ, పట్టణ, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిసి స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాధాకృష్ణ ఇటువంటి మాటలు మాట్లాడటం ద్వారా బూతు కిట్టుగా మరోసారి నిరూపించుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పల్లకి మోయాలనుకుంటే మోసుకోవటం అతని ఇష్టమని, అంతేగానీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం క్షమార్హం కాదన్నారు. రాష్ట్రంలో కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా రాస్తున్నాయని, అది వారిష్టంగా రాసుకోవచ్చునని అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన భాష మాట్లాడటం సమంజసం కాదని, బూతు వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సైకిల్ మీద కిరోసిన్ విక్రయించి బతికిన రాధాకృష్ట, ఒక చిరుద్యోగిగా పత్రికలో చేరి ఈ రోజు ఆ పత్రిక యజమానిగా ఎలా అయ్యారో అందరికీ తెలుసునని అన్నారు. అతని వెనుక చంద్రబాబు నాయుడు, చంద్రబాబు వెనుక అతను ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అయితే మహిళలను గౌరవించాల్సిన నైతిక బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లేదన్నారు. అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే ఒక మహిళపై అత్యాచారం చేశాడని, షాపింగ్ కోసం బయటకు వస్తే బహిరంగంగా రోడ్డు మీద దాడి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుడు ఓ అమ్మాయిని బలాత్కారం చేశాడని, ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, గురజాల నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, ఎన్కే ఆంజనేయులు, లీగల్ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రోళ్ల మాధవి, సిద్ధారపు గాంధీ, కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయీ, జిల్లా సంయుక్త కార్యదర్శి యన్నం రాధాకృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు వై.సీతారామిరెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ కార్యదర్శి కుక్కల పౌలయ్య, నాయకులు పాల్గొన్నారు. -
టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు
చిలకలూరిపేట: టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం, గంజాయి మత్తులో వేగంగా వాహనం నడుపుతూ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.... విజయవాడకు చెందిన ఇందుపల్లి హరీష్, విశాఖపట్నానికి చెందిన దూషిక్, మరో ముగ్గురు యువతులు కలసి విజయాబ్యాంకు సెంటర్కు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరంతా డ్యాన్సర్లు. బుధవారం వేరే ప్రాంతంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి వచ్చాక రాత్రంతా మద్యం తాగుతూ గడిపారు. దీనికి తోడు గంజాయి తీసుకుంటారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కారు తీసుకొని ఇరువురు సిగరెట్లు తెచ్చుకొనేందుకు బయలుదేరారు. మత్తులో మునిగిపోయి ఉన్న ఇరువురు జాతీయ రహదారి పక్కన విజయా బ్యాంకు సెంటర్లోని ఈగల్ రెస్టారెంట్ సమీపంలోని టిఫిన్ సెంటర్లోకి దూసుకువెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో అదృష్టవశాత్తు కారుకు ఎవరూ అడ్డు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగానికి రెస్టారెంటుకు సంబంధించిన భారీ విద్యుత్ బోర్డు వాహనంపై పడిపోయింది. టిఫిన్ సెంటర్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. వేగంగా వచ్చి కారు పెద్ద శబ్దంతో ఢీకొనడటంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. టిఫిన్ ఇతర అవసరాల కోసం వచ్చిన ప్రజలు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు కారు ప్రమాదానికి కారణమైన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపిన ఇందుపల్లి హరీష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి సోషల్మీడియా ద్వారా ఆ మహిళతో ఉన్న పరిచయంతో ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు భయంతో పోలీసులను తప్పుదోవ పట్టించారని, సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు పరిచయస్తుడే అని తేలినట్లు పోలీసులు తెలిపారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కేసు వివరాలను వెల్లడించిన వివరాల ప్రకారం... మాచర్ల పట్టణంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని (32) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మంచినీటి కోసం వచ్చినట్లు చెప్పి ఇంటిలోకి ప్రవేశించాడని పేర్కొన్నట్లు తెలిపారు. కత్తితో బెదిరించి లైంగికదాడి చేయబోతే తనకు హెచ్ఐవీ ఉందని చెప్పడంతో నిందితుడు ఆగ్రహంతో దాడి చేసి పారిపోయాడని పేర్కొన్నట్లు చెప్పారు. ఎదురింటివారి సమాచారంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి చేర్చారన్నారు. బాఽధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అదనపు ఎస్పీ జేవీ సంతోష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామన్నారు. విచారణలో పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామానికి చెందిన నామాల శ్రీనివాస్ (27)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ వివరించారు. సోషల్ మీడియాలో పరిచయం... అత్యాచారం తరువాత బాధితురాలు చెబుతున్న వివరాల ద్వారా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు వారి పాత్ర లేదని తెలుసుకున్నామని ఎస్పీ తెలిపారు. బాధిత మహిళ సెల్ఫోన్, సోషల్మీడియా ఖాతాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేపట్టగా నిందితుడిని గుర్తించామన్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన నామాల శ్రీనివాస్(27) సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన మరింత సాన్నిహిత్యం పెరిగిందని, తరువాత బాధితురాలు మాచర్లలోని తన ఇంటికి రమ్మని ఆహ్వానించిందని ఎస్పీ పేర్కొన్నా. ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఆమైపె లైంగిక దాడి చేశాడన్నారు. నిందితుడు విచక్షణ మరిచి ప్రవర్తించడంతో బాధిత మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె కాళ్లు చేతులూ కట్టేసి పారిపోయాడన్నారు. పరిచయస్తుడే కావడంతో బాధితురాలు భయపడి పూర్తి వివరాలను వెల్లడించకుండా పోలీసులను తప్పుదోవ పట్టించిందన్నారు. నిందితుడిని మాచర్ల రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేసి స్థానిక అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టడంలో 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని పోలీసులు గురజాల సబ్ జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి బాధితురాలు, నిందితుడి ఫోన్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామన్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టుపై వైద్యుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రిపోర్టుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సృష్టమైన ఆధారాలు లేకపోయినా, బాధితురాలు తప్పుదోవ పట్టించినా కేసులో పురోగతి సాధించిన అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆయన బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
తెలంగాణ నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు
నరసరావుపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లాకు ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మిల్లర్లు జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు గురజాల, మాచర్ల మండలాల రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025–26కు సంబంధించి రబీలో 51 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిల్లర్లు అందరూ బ్యాంకు గ్యారెంటీలు అందజేయాలని, కావాల్సిన గోనెసంచులు, రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చి సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి జీవీ ప్రసాదు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఊర భాస్కరరావు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో బకాయిల రోగం
● రూ. లక్షల్లో పేరుకుపోయినా చెల్లించని వ్యాపారులు ● వసూలుకు కనీసం చర్యలు చేపట్టని ఆసుపత్రి అధికారులు ● హెచ్డీఎస్కు నిధుల కొరత ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం కనీసం నోటీసూ లేదు.. హెచ్డీఎస్ ఆదాయానికి గండి గుంటూరు జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్న వారిలో కొందరు నెలల తరబడి.. మరికొందరు సంవత్సరానికి పైబడి కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. అద్దెలు కట్టడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కొక్కరు రూ. లక్షల్లోనే కరెంటు బిల్లులు, అద్దె చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. -
చావులో ఒక్కటయ్యారు..
యడ్లపాడు: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు. అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడి... జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపులో భాగంగా గురువారం సాయంత్రం కేబీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ తమ నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించాలని, ఇప్పటికే మూడేళ్లు కాలం గడిచిందన్నారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించటంతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యూటీ, కమ్యూటీషన్, ఆర్జిత సెలవులు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పచెప్పరాదని కోరారు. అనంతరం ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్ బి.సంపత్బాబు మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్థిక కార్యదర్శి ఆర్.గోవిందరాజులు మాట్లాడుతూ, ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలని డిమాండ్ చేశారు. 72, 73, 74 జీఓలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎం.మోహనరావు, బి.శ్రీనివాసరావు, టి.చంద్రయ్య, కె.వీరాంజనేయులు, షేక్మొహిద్దీన్ బాషా, బి.స్వర్ణరాజు, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ట్యాబ్ ఆధారిత మూల్యాంకనం రద్దు చేయాలి
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకనంలో విద్యాశాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మూల్యాంకనాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. కేబీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించి జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావుకు వినతిపత్రం సమర్పించారు. ట్యాబ్ ఆధారిత కొత్త విధానం ఉపాధ్యాయులపై పెనుభారాన్ని మోపటంతోపాటు లోపభూయిష్టంగా మూల్యాంకన ప్రక్రియను దెబ్బతీస్తున్నదని తెలిపారు. ట్యాబ్లు సరిగా పనిచేయక పోవటం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవటంతో సమాధాన పత్రాల స్కానింగ్ ప్రక్రియ ఆలస్యమవుతున్నదని తెలిపారు. రోజుకు 80 పేపర్లకు పైగా మూల్యాంకనం చేయాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు మానసికంగా, శారీరకంగా అలసి పోతున్నారనీ, ఇది మూల్యాంకన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఉదయం 9గంటలకు హాజరై రాత్రి 10 గంటల వరకు మూల్యాంకన పనులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. నిరంతరం ట్యాబ్ చూస్తుండటంతో కంటి నొప్పి, మసక చూపు వంటి కంటి సమస్యలతో పాటు మెడ, నడుంనొప్పి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానంగా మహిళా ఉపాధ్యాయినిలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ప్రభుత్వం వెంటనే వాస్తవ పరిస్థితులను గుర్తించి పాత మూల్యాంకన విధానాన్నే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్.వి.రామిరెడ్డి (ఎస్టీయూ), బి.సంపత్బాబు (ఏపీటిఎఫ్), ఆర్.గోవిందరాజులు (హెచ్ఎంఏ), ఎం.మోహనరావు (యూటీఎఫ్), షేక్.షరీఫ్ (ఏపీటీఎఫ్ 257) కె.వీరాంజనేయులు (ఎస్సీ, ఎస్టీ, యూఎస్), టి.చంద్రయ్య (ఎస్ఏఏపీ), షేక్.మొహిద్దీన్బాష (ఆర్యూటీఏ) పాల్గొన్నారు. -
మూగజీవాలపై పిడుగుపాటు
పెదకూరపాడు: పెదకూరపాడు మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని గారపాడు గ్రామంలో గ్రామానికి చెందిన మొక్కల కృష్ణ ప్రసాద్, నల్గొండ మల్లికార్జునలకు చెందిన 14 మేకలు పిడుగుపాటు గురై మృత్యువాత పడ్డాయి. లగడపాడు గ్రామంలో పల్లం యేసుబాబుకు చెందిన పాడి గేదె ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తూ ఉండటంతో ఇంటి వద్ద ఉన్న చింత చెట్టుకు గేదెను కట్టేసి ఇంట్లో కి వెళ్ళగా ఒకసారిగా భారీ శబ్ధంతో పిడుగు పడటంతో పాడి గెదె అక్కడికక్కడే మృతి చెందింది. పెదకూరపాడు లోని రైల్వే స్టేషన్ సమీపంలో తాటి చెట్లపై పిడుగులు పడటంతో మంటలు చెలరేగి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ లైన్లు దిగబడటంతో ఐదు గంటలు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు. -
కొండవీటి గడ్డపై కళా సౌరభం
యడ్లపాడు: కొండవీటి గడ్డపై మళ్లీ కళాకారుల సందడి మొదలుకానుంది. చరిత్రకు నిలువుటద్దంగా నిలిచే కొండవీడు కోట నీడన, లింగారావుపాలెం వేదికగా నాటక వైభవం మళ్లీ పురుడుపోసుకోనుంది. మొన్ననే సుందరయ్య కళానిలయంలో జరిగిన ప్రదర్శనల మధుర స్మృతులు ఇంకా మనసుల్లో మెదులుతుండగానే, అప్పుడే కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు రోజుల సంబరం, అటు చారిత్రక వారసత్వాన్ని, ఇటు ఆధునిక కళా చైతన్యాన్ని మేళవించి తెలుగు నాటక రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. పాతికేళ్ల ప్రస్థానం... పాతికేళ్లకుపైగా నాటక కళే శ్వాసగా సాగుతున్న ఈ పరిషత్ ప్రయాణం అభినందనీయం. గ్రామీణ వాతావరణంలో జాతీయ స్థాయి నాటికలను ప్రదర్శిస్తూ, కళామతల్లి సేవలో తరిస్తున్న ఈ సంస్థ వెనుక నిర్వాహకుల అకుంఠిత దీక్ష కనిపిస్తోంది. సినీ నటులు పోసాని కృష్ణమురళి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ పరిషత్ను కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు బ్రహ్మవరప్రసాద్, జరుగుల రామారావులు నిబద్ధతతో సమన్వయంగా ముందుకు నడిపిస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా భవిష్యత్తు తరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ వేదికను తీర్చిదిద్దారు. కళలకు మారుపేరు.. చారిత్రక కొండవీటి కోట వైభవాన్ని స్మరించుకుంటూనే, నేటి సమాజానికి కళల ద్వారా చైతన్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగనున్నాయి. గ్రామ ప్రజలను, దూర ప్రాంతాల నుంచి వచ్చే కళాభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసిన ఈ నాటక సంబరాలు, రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతాన్ని ఒక కళా ప్రపంచంగా మార్చనున్నాయి. కళల కోలాహలంతో కొండవీటి గడ్డ మరోసారి తన ఘనకీర్తిని చాటుకునేందుకు ముస్తాబైంది. ● 12వ తేదీ ఆదివారం.. ముగింపు రోజున రాత్రి 8 గంటలకు నంబూరు నరసింహరావు జ్యోతిప్రజ్వలన చేయనున్నారు. లింగారావుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ షేక్ కరీమూన్ మాబుసుభాని నటరాజ పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. 8.30 గంటలకు హైదరాబాద్ గోవాడ క్రియేషనన్స్ వారి అమ్మ చెక్కిన బొమ్మ నాటిక, గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇది అతని సంతకం నాటిక ప్రదర్శితం కానున్నాయి. అనంతరం మానవత సాగరి బృందం వారి అందరూ మంచివారే కానీ నాటిక ప్రదర్శితం కానుంది. ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. తొలిరోజు 10వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు ఆకెళ్ల సత్యనారాయణ కళాప్రాంగణంలో కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటికతో పోటీలు మొదలవుతాయి. ఆ తర్వాత 10.30 గంటలకు ఉషోదయ కళానికేతన్ వారి మంచి మనుషులు, రాత్రి 11 గంటలకు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికలు ప్రదర్శితం కానున్నాయి. రెండో రోజున శనివారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారి సీ్త్రమాత్రే నమః నాటికతో ప్రదర్శనలు పునఃప్రారంభమవుతాయి. అనంతరం రాత్రి 11 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ వారి తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల సమక్షంలో సభా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
స్వర్ణగ్రామ ఆరోగ్యదర్శినితో మెరుగైన వైద్యసేవలు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమరావతి: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించటానికి ప్రభుత్వం స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రత్యేక వైద్యసేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. గురువారం స్థానిక త్రిశక్తిపీఠం ఆడిటోరియంలో ప్రతి నెలా మొదటి గురువారం నిర్వహించే ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లో ప్రజారోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వర్ణగ్రామ ఆరోగ్యదర్శిని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంమే కాకుండా సామాజిక భాగస్వా మ్యంతో ఆరోగ్య నిర్వహణను మెరుగుపరచడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, తక్కువ ఆదాయ వర్గాల వారికి, వైద్య సేవలు మరింత చేరువ చేయాలన్నారు. అలాగే పౌష్టికాహారం పంపిణీ, రక్తహీనత తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలను అంగన్ వాడీలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ రకాల టీకాలను అందించటంపై సమీక్ష నిర్వహించి సంబందిత అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీడీవో రాజగోపాల్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీవో పార్వతితదితర అధికారులతో పాటుగా అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గ్రామపంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు. క్రోసూరు: విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల బాలికలకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నీట్, జేఈఈ, ఈప్సెట్ రెసిడిన్షియల్ ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ తెహరా సుల్తానా తెలిపారు. గురువారం క్రోసూరులోని ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న నీట్, జేఈఈ, ఈప్ సెట్ రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బాలికలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలన్నారు. కోచింగ్ నిర్వహణ, బోధనా ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఏఎంఓ కె.సుజనా, ఏఏఏఓ ఎస్.నాగేంద్రకుమార్, ప్రిన్సిపాల్ మేరీసూజన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
శావల్యాపురం: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో మండలంలోని కనమర్లపూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకు చెందిన నంబూరి రవీంద్ర (16) ఉదయం టిఫిన్ తీసుకొని రావటానికి తన తాతాయ్య నంబూరు పేరయ్య చెందిన మోపెడ్పై దుకాణానికి వస్తుండగా,అదే సమయంలో వినుకొండ వైపు నుంచి నరసరావుపేటకు వెళుతున్న మినీ ట్రక్కు వాహనం డ్రైవరు చలంచర్ల వెంకటేశ్వర్లు అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న మోపెడ్ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావటంతో సంఘటన స్థలంలో బాలుడు రవీంద్ర మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నంబూరి రవీంద్ర పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. నంబూరి డేవిడ్కు ఇద్దరు సంతానం కాగా మొదట కుమారుడు అకాలంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని ఎస్సై మోర్ల వెంకటేష్ బాబు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గంలో నియామకాలు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురు నాయకులను జిల్లా కార్యవర్గంలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి (సత్తెనపల్లి)ని నియమించారు. అలాగే జిల్లా విద్యార్థి విభాగంలో ఉపాధ్యక్షుడిగా భోగిరెడ్డి అంకిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ షహీద్, ముడేల విష్ణువర్ధనరెడ్డి (గురజాల), బి.సాయి శ్రీనివాసరెడ్డి (సత్తెనపల్లి), జిల్లా కార్యదర్శులుగా చింతారెడ్డి రాఘవరెడ్డి, నీలం ఆంజనేయులు (గురజాల), కె.సుధాకరరెడ్డి (సత్తెనపల్లి) నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సత్తెనపల్లికి చెందిన ఎం.శ్రీనివాసులు, షేక్ మొహిద్దీన్, షేక్ నాగరాజునాయక్, జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా జి.సుసేంధ్ర. జిల్లా కార్యదర్సిగా కె.వెంకటపుల్లారెడ్డి, జిల్లా గ్రీవెన్సెల్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా టి.శ్రీనివాసరావు, టి.సైదారావు, గ్రీవెన్స్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మార్క్కాసిమాల, కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, లీగల్సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎ.నాగరాజు, పి.హరిమణికంఠ నియమితులయ్యారు. జిల్లా ఇంటలెక్చ్యువల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చింతారెడ్డి నాగిరెడ్డి (గురజాల), జిల్లా వాణిజ్య విభాగ సెక్రటరీగా వేలమూరి సైదారెడ్డి (గురజాల), జిల్లా పబ్లిసిటీ వింగ్ కార్యదర్సిగా తాయ వెంకటేశ్వర్లు (గురజాల), జిల్లా వైఎస్సార్టీయూసీ సెక్రటరీగా షేక్ నాగూల్మీరా (గురజాల) నియమితులయ్యారు. మాచర్ల నియోజకవర్గ బాధ్యులుగా.. అలాగే మాచర్ల నియోజకవర్గ గ్రీవెన్సెల్ అధ్యక్షుడిగా శీలం మల్లారెడ్డి, నియోజకవర్గ పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడిగా చల్లా మట్టారెడ్డి నియమితులయ్యారు. పిడుగురాళ్ల మండల కార్యవర్గం.. గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం రైతు విభాగం అధ్యక్షుడిగా తెలగనేని సాంబశివరావు, సోషల్ మీడియా అధ్యక్షుడిగా అంచూరి వంశీరెడ్డి, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా దేవిశెట్టి వీరాంజనేయులు, వైఎస్సార్టీయూసీ అధ్యక్షులుగా తాళ్లపోగు సాల్మన్ నియమితులయ్యారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
తాడికొండ: తాడికొండ దుర్గా వైన్స్లో జరిగిన యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తాడికొండ సీఐ కె వాసు వెల్లడించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 05వ తేదీన తాడికొండ దుర్గా వైన్స్లో నూతక్కి మరియదాసు, నూతక్కి నరేష్ల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంలో మృతుడు మరియదాసు, నరేష్ తల పగలగొట్టాడు. బయటకు వెళ్లిన నరేష్ తన సోదరుల వరసయ్యే కటారి జాషువా అలియాస్ కిరణ్, గాజులవర్తి సాంబశివరావు, నూతక్కి సాంబశివరావులను వెంట తెచ్చుకొని రోడ్డుపై నిలబడి వైన్స్లోకి పంపించాడు. అక్కడ వివాదం ముదరడంతో మరియదాసును బ్రిక్స్ రాయితో తల పగలగొట్టి విచక్షణా రహితంగా కొట్టడంతో మరియదాసు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విచారణలో భాగంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా బుధవారం ఉదయం నిందితులను తాడికొండ అడ్డరోడ్డు వద్ద సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వాసు తెలిపారు. నిందితుల్లో ఒకరైన నూతక్కి సాంబశివరావు తాడికొండలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళగిరి అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, జూనియర్ డివిజన్ న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
చేతివృత్తిదారుల సమస్యలపై రాష్ట్రస్థాయి వర్క్షాప్
మంగళగిరి టౌన్: రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు మంగళగిరిలో ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రస్ధాయి వర్క్షాప్ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మంగళగిరి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ చేతి వృత్తిదారుల నైపుణ్య అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాల విస్తరణ, ఉపాధి భద్రత వంటి కీలక అంశాలపై పలువురు నిపుణులతోపాటు వృత్తిదారులు చర్చించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ, సీపీఐ నాయకులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, ఏపీ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
భద్రత ప్రమాణాలు పాటించని బస్సులను నిలిపివేస్తాం
మంగళగిరి టౌన్: భద్రత ప్రమాణాలను పాటించని బస్సులను నిలిపి వేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి మండలం కాజ టోల్గేట్ వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాహనాల రికార్డులు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారం వాణిజ్య సరుకులను తరలిస్తూ.. అధిక లోడ్తో బస్సులను నడుపుతున్నారని చెప్పారు. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి -
ఆగ్రహ జ్వాల
వైఎస్సార్సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన ● మహిళలకు వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, మానవహారం ● పల్నాడురోడ్డులో ధర్నా చేసిన డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పల్నాడు రోడ్డులో పాత ఆంధ్రజ్యోతి కార్యాలయ కాంప్లెక్స్ ముందు రోడ్డుపై బైఠాయించిన డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్ గజ్జల తదితరులునరసరావుపేట మల్లమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడిన నాయకులు, కార్యకర్తలు -
ఎం ఫార్మసీ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు
● సెల్ఫ్ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన ● విద్యార్థికి రూ. ఆరు వేల నుంచి రూ.పది వేల వరకూ వసూలు ● పత్తా లేని పరిశీలకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎక్కడైనా పరీక్షలు అంటే పకడ్బందీగా, అవకతవకలకు తావు లేకుండా నిర్వహించాలని చూస్తుంటారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది. పరీక్ష ఏదైనా డబ్బులు వసూలు చేయడం, చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం ఆనవాయితీగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్చార్జుల పాలన సాగుతుండటం, ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తుండటంతో వర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకీ మసకబారుతోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎం ఫార్మసీ రెండో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలు, మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు కేంద్రాలుగా సెల్ఫ్ సెంటర్ కేటాయించడం.. పరిశీలకులు పత్తా లేకపోవడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. అడ్డగోలుగా... ఫార్మసీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న పలువురు ఎం ఫార్మసీ కోర్సును కళాశాలలకు రాకుండా కేవలం పరీక్షకు మాత్రమే హాజరు అయ్యారు. దాదాపు అన్ని ఫార్మసీ కళాశాలలో విద్యార్థులు తరగతులు హాజరుకాకపోవడం.. సబ్జెక్టుపై అవగాహన లేకపోవడంతో ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ డబ్బులు తీసుకుని విద్యార్థులకు చూచిరాతకు అవకాశం ఇచ్చారు. దొడ్డి దారిన ఉద్యోగం పొంది.. దోచు కోవటమే ధ్యేయంగా వ్యవహరించే అక్రమార్కుల అండతో వర్సిటీ ప్రతిష్ట దిగజారింది. లా, బీఈడీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఇతర సెంటర్లను వేస్తున్నప్పటికీ ఎంఫార్మసీకి మాత్రం సెల్ఫ్ సెంటర్లు కేటాయించారు. దీంతో పల్నాడులోని కొన్ని సెంటర్లలో ఇష్టారాజ్యంగా ఈ పరీక్షలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కొన్ని సెంటర్లలో పేపర్కి రూ.15 వందల రూ. 2 వేల వరకూ , కొన్ని సెంటర్లలో రూ.ఆరు వేల నుంచి రూ. పది వేల వరకూ వసూలు చేశారు. కొన్ని కళాశాలల్లో సప్లిమెంటరీ పరీక్షలకు రూ.రెండున్నర వేల నుంచి రూ.మూడు వేల వరకు తీసుకున్నారు. ఒక్కొక్క పరిశీలకుడికి విద్యార్థి నుంచి రూ.500 చొప్పున కాపీయింగ్ ఫీజు అంటూ దండుకున్నారు. పల్నాడులోని కేంద్రాల్లో సెల్ఫోన్లలో చాట్ జీపీటీ ద్వారా అన్ని పరీక్షలు చూసి రాయటానికి రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. గుంటూరు సమీపంలోని ఒక సెంటర్లో రూ.10 వేలు ప్యాకేజీగా తీసుకుంటున్నారు. నరసరావుపేటలో ఒక కళాశాల లెక్చరర్ దళారీగా వ్యవహరిస్తూ ఒక్కొక్క కళాశాల నుంచి రూ.25 వేలు నిర్వహణ ఫీజు పేరుతో కొందరు అధికారుల పేరిట వసూలు చేశారు. పల్నాడులోని ఒక సెంటర్లో పరీక్ష రాసుకోవడానికి అదనపు సమయం ఇవ్వడానికి రూ.500 వసూలు చేశారు. నరసరావుపేట, ఫిరంగిపురం సమీపంలో ఒక సెంటర్లో, తెనాలిలోని ఒక సెంటర్లో, పల్నాడులో ఉన్న ఒక కళాశాలలో భారీగా కాపీయింగ్ జరుగుతున్నట్టు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి. రెగ్యులర్గా ఉద్యోగం చేయకుండా, కేవలం పేపర్ల మీద మాత్రమే లెక్చరర్గా వ్యవహరించే వారిని పరిశీలకులుగా నియమించడంతో కాపీయింగ్ చేయడం సులువుగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా వారే పరిశీలకులుగా వ్యవహరించటంతో యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారికి ముడుపులు ముట్టచెబుతున్నారు. నగరంలోని ఒక కేంద్రంలో ఉదయం ఫార్మసీ పరిశీలకులుగా వ్యవహరించిన వ్యక్తే మధ్యాహ్నం నుంచి సైకాలజీ ఎగ్జామినర్గా బీఈడీ పేపర్లను మూల్యాంకనం చేయడం గమనార్హం. మరో వ్యక్తి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో ఒకవైపు బీఈడీ ప్రాక్టికల్ ఎగ్జామినర్గా హాజరవుతూ.. అదే సమయంలో ఏఎన్యూలో ఫార్మసీ పరీక్షల విధులు నిర్వహించారు. తనిఖీ బృందాలలో వర్సిటీ వారితోపాటు పల్నాడులోని వేరువేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరిని నియమించారు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తనిఖీల తీరు మారింది. -
రైతుల దృష్టికి తేకుండానే భూ సేకరణ తగదు
రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య తెనాలిటౌన్: ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూముల్లో మార్కింగ్ చేయటం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అన్నారు. రైతులను సంప్రదించి, వారి అంగీకారంతోనే భూసేకరణ చేయాలని 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్రింగ్ రోడ్లకు సంబంధించిన తెనాలి మండలంలోని బాధిత రైతాంగ సమావేశాన్ని బుధవారం సాయంత్రం రూరల్ మండల గ్రామం గుడివాడలో నిర్వహించారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. వి.కృష్ణయ్య మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని 10 మండలాల్లో 40 గ్రామాల పరిధిలో ఔటర్ రింగురోడ్డు బాధిత రైతులున్నట్టు చెప్పారు. ఏళ్లుగా సాగుచేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల నుంచి భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు. ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్రోడ్డుకు 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం 250 మీటర్ల వెడల్పును ప్రతిపాదించటంలోని ఆంతర్యమేమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. గతేడాది డిసెంబరులో భూసేకరణకు కేవలం 25 రోజులే గడువునిచ్చారని గుర్తుచేస్తూ, సామాజిక అధ్యయనానికి ఈ వ్యవధి సరిపోదన్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు అప్రమత్తంగా ఉంది, ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని యువత పరిశీలించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. రైతులు ముందుకొస్తే వారి పక్షాన రైతుసంఘం పోరాడుతుందని హామీనిచ్చారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్కుమార్ మాట్లాడుతూ ఔటర్ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నే రమేష్బాబు, నన్నపనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉన్న భూమంతా లాక్కుంటున్నారు గుడివాడకు చెందిన బాధిత రైతు మహిళ పోతురాజు వసుంధర మాట్లాడుతూ తనకు గ్రామంలో గల రెండున్నర ఎకరాల భూమినీ మార్కింగ్ చేశారని సభాముఖంగా చెప్పారు. ఉన్న భూమి మొత్తం తీసుకోవటం ఏమిటని ప్రశ్నించారు. 30 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ ఉద్యోగోన్నతి పరీక్ష నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీసు పెరేడ్గ్రౌండ్, జిల్లా పోలీసు సమావేశ మందిరంలో 30 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఫ్రీ ప్రమోషనల్ పరీక్ష నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఏఎస్సైలు పరీక్షకు హాజరయ్యారు. అనంతరం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వివిధ అంశాలపై వారితో మాట్లాడి ప్రతిభను అంచనా వేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్బాబు, ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, గుంటూరు ఏఎస్పీ రమణమూర్తి, గుంటూరు ఏఆర్ డీఎస్పీ సంకూరయ్య, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో ఎల్నిలో దూరం
నరసరావుపేట రూరల్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఎల్నినో ప్రభావాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సమర్ధంగా ఎదుర్కోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. రైతు సాధికార సంస్ధ ఆద్వర్యంలో ఐసీఆర్పీలు, ఎఫ్ఎంలు, డీఎంఎంటీలకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారావు మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఏర్పడే పరిస్థితులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై విస్త్రృత అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల్లోని రైతులందరినీ ఎస్టూఎస్ రైతులుగా మార్చే దిశగా కృషిచేయాలని సూచించారు. జిల్లాలోని 28 మండలాల్లో రైతు సేవవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విత్తన గుళికల పద్ధతిని అనుసరించడం ద్వారా విత్తనాలు చెడిపోకుండా, వర్షం పడగానే మొలకెత్తేలా చేయవచ్చని తెలిపారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండే విధంగా పంటల నిర్వహణ చేయడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు. రాష్ట్ర ఎన్ఎఫ్ఏ మల్లేశ్వరి, సైదయ్య, అప్పలరాజు, సౌజన్య, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. – జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు -
కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య
విజయపురిసౌత్: చిన్న కూతురు అనారోగ్యంతో మృతి చెందిదన్న బాధతో పెద్ద కూతురితో కలిసి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాచర్ల పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన ఆరె అమరేశ్వరి(23), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, రెండు నెలల క్రితం చిన్న కుమార్తె యశ్విక (ఒకటిన్నర సంవత్సరాలు) అనారోగ్యంతో మృతి చెందగా అప్పటినుంచి తల్లి అమరేశ్వరి మనస్తాపంతో కుంగిపోయింది. ఇది గమనించిన భర్త అమరేశ్వరి వెన్నంటే ఉంటూ వస్తున్నాడు. బుధవారం వెంకటశివ పని నిమిత్తం దుర్గి వెళ్లాడు. చిన్న కుమార్తె చనిపోయిందన్న బాధతో ఉన్న అమరేశ్వరి పెద్ద కుమార్తె లతికశ్రీ(3)తో కలిసి తాళ్లపల్లి సమీపంలోని సాగర్ కుడి కాలువలో వద్దకు వెళ్లింది. అనంతరం తన చున్నీతో లతికశ్రీ ముడి వేసుకొని నీటి ప్రవాహంలోకి దూకింది. సమాచారం అందుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో కాలువలో గాలించారు. అనంతరం తల్లీకూతుర్ల మృతదేహాలు వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ పేర్కొన్నారు. -
పత్తి బేళ్ల లారీ దగ్ధం
నాదెండ్ల: జాతీయ రహదారిపై పత్తి బేళ్ల లారీ దగ్ధమైన సంఘటన బుధవారం గణపవరం వద్ద చోటుచేసుకుంది. చిలకలూరిపేట ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ గౌస్ తెలిపిన వివరాల మేరకు యడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలోని సప్తగిరి గోడౌన్లలో మధ్యాహ్నం ఒంటి గంట సమీపంలో 16 టన్నుల రెండో రకం పత్తి బేళ్లను కూలీలు కంటెయినర్ లారీలో లోడ్ చేశారు. లారీ తిమ్మాపురం నుంచి హరియాణాలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. లోడింగ్ అనంతరం వే బ్రిడ్జి కాటా వేసుకుని ఇన్వాయిస్లు తీసుకుని లారీ బయలుదేరింది. గణపవరం వద్దకు చేరుకునే సరికి క్యాబిన్లో పొగలు వచ్చాయి. డ్రైవర్ గమనించి లారీని పక్కకు నిలిపివేసి కంటెయినర్ డోర్ తెరిచాడు. దట్టమైన పొగ అలముకోవటంతో అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లారీని జాతీయ రహదారికి దూరంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి జేబీలతో బేళ్లు బయటకు లాగారు. అప్పటికే 60 శాతం పైగా అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంపై మోహిత్ కాటన్ మిల్స్ యజమాని అవినాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో దగ్ధమైన బేళ్ల విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. రూ.10 లక్షల ఆస్తి నష్టం -
లారీ ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. దాచేపల్లి లోని దావత్ రెస్టారెంట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సబావత్ వెంకట్ నాయక్ (41) మృతి చెందారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మాచర్ల మండలం అచ్చమ్మకుంటకు చెందిన వెంకట నాయక్ 2004లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2012లో సివిల్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొంది ప్రస్తుతం వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. వెంకట్ నాయక్కు భార్య స్వరూప బాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం మీరు దాచేపల్లిలో నివాసం ఉంటున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తన వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనం(బుల్లెట్ ) పై వెంకట్ నాయక్ వెళ్లి తిరిగి దాచేపల్లి వస్తున్నాడు. ఈ క్రమంలో దాచేపల్లిలోని దావత్ రెస్టారెంట్ వద్ద ఓ లారీ ఆకస్మికంగా యూటర్న్ తీసుకుంటుంది. దీంతో హైవే పై వస్తున్న వెంకట్ నాయక్ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో వెంకట్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న శివ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంకట నాయక్ని హుటాహుటిన దాచేపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పాపారావు పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతదేహాన్ని నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందులు జాను, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, నాయకులు మునగా శ్రీనివాసరావు, కొమ్ము బుజ్జి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. -
పోలీసు స్టేషన్లో జిల్లా ఎస్పీ తనిఖీలు
పట్నంబజారు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సాయంత్రం గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట పోలీసుస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో స్టేషన్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని నేరాల పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. గత ఆరు నెలల కాలంలో 300 మందిని గంజాయి, ఇతర డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. రౌడీషీటర్లు, ఇతర నేరస్తులపై నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు వారి కదలికలను పర్యవేక్షించాలని సూచించారు. నేరాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం స్టేషన్ రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ బెల్లం శ్రీనివాస్, లాలాపేట సీఐ శివప్రసాద్, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: గ్యాస్ ఏజన్సీలు వినియోగదారుల ఇంటికి వెళ్లి సిలిండర్ డెలివరీ చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయీస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ ఆదేశించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బాలాజీ గ్యాస్ కంపెనీని ఆమె బుధవారం తనిఖీ చేశారు. కంపెనీ వద్దకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. శ్రీవాస్ నుపూర్ మాట్లాడుతూ ముందుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను గోడౌన్ల వద్ద డెలివరీ ఇవ్వవద్దని, డోర్ డెలివరీలో నిర్లక్ష్యం వహిస్తే గ్యాస్ ఏజన్సీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిణి కోమలి పద్మ, సీఎస్ డీటీ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం విరాళాలను అందజేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రణీత్కుమార్, పవిత్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి తమ కుమారుడు చిన్నారి జి.దేవాశిష్ పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అలాగే పవిత్ర తల్లి ఈశ్వరి, సోదరుడు నిఖిల్ చిన్నారి జి.ధీరన్ సాయి పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 529.60 అడుగులకు చేరింది. ఇది 167.3676 టీఎంసీలకు సమానంఅని అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 3,031, ఎడమ కాలువకు 5,297, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 23,990, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల అవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 34,618 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. -
యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఏఎన్యూ(పెదకాకాని): యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బుధవారం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వ్యాపార, పారిశ్రామిక అవకాశాలపై నిర్వహించిన ఒకరోజు అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకమని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారిని పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించగా, ప్రస్తుతం ఉపాధి, సృష్టిపై దృష్టి పెట్టామన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని, కేవలం 22 నెలల్లోనే రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ యువతకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా ఉంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న యువత డీపీఆర్లతో ముందుకొస్తే సబ్సిడీ రుణాలు, శిక్షణ, ఉత్పత్తి నిర్వహణపై మార్గదర్శకత్వం అందిస్తామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సునీత మాట్లాడుతూ యువత కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకే పరిమితం కాకుండా, తామే వ్యాపారాలు ప్రారంభించి ఉద్యోగ దాతలుగా మారాలని సూచించారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవో విశ్వమనోహరన్ మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ముందుకొచ్చే వారికి వివిధ రకాల సహాయం అందిస్తున్నామని, పారిశ్రామికీకరణతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సింహాచలం, కార్పొరేషన్ చైర్మన్లు బ్రహ్మంచౌదరి, బుచ్చిరామ ప్రసాద్, అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నిరసనపై పోలీస్ ఓవరాక్షన్
గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం: మహిళలను కించపర్చే విధంగా జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెత్త పలుకుపై నిరసన తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు కూటమి నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు రెచ్చిపోయారు. బ్రాడీపేట 4వ లైనులోని ప్రైవేటు కాంప్లెక్స్ రెండో అంతస్తులో బయటకు కనిపించని విధంగా ఉండే కార్యాలయానికి సీఎం క్యాంపు కార్యాలయం తరహాలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు అన్ని వైపులా బారికేడ్లు అడ్డుగా పెట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన... బారికేడ్లను తోసుకుని వెళ్లిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుతో పాటు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పార్టీ సమన్వయకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. శంకర్ విలాస్ సెంటర్ వద్దకు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి రావడంతో పోలీసులు బారికేడ్ల వద్ద నిలిపివేశారు. అయితే జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పోలీస్ అధికారులైన ఈస్ట్ డీఎస్పీ అజీజ్, వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్లతో మాట్లాడుతూ శాంతియుతంగా చేపట్టనున్న ఈ నిరసనకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యత వహిస్తామని, అనుమతి కల్పించాలని, ఎలాంటి దాడులు విధ్వంసం జరుగకుండా చూసుకుంటామని డీఎస్పీ అజీజ్తో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే తరుణంలో అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు మధ్యలో కలుగ జేసుకోని మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దురుసుగా మాట్లాడారు. తాను డీఎస్పీతో మాట్లాడుతుంటే మధ్యలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సమంజసం కాదని చెబుతుండగా సీఐ వాగ్వాదానికి దిగారు. లాఠీలకు పనిచెప్పిన పోలీస్ సిబ్బంది.. ఒక పక్క పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతుండగానే సీఐ తీరుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఒక్కసారిగా పోలీసులకు పార్టీ శ్రేణుల మధ్య తొపులాట చోటుచేసుకుంది. ఒక కానిస్టేబుల్ లాఠీతో కార్యకర్తలను పొడిచి గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు బారిగేట్లను నెట్టుకుని శంకర్ విలాస్ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జీ చేస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుడిచేతికి గాయమైంది. వైఎస్సార్ సీపీ శాంతియుత నిరసన తెలిపేందుకు వస్తున్న సమయంలో బ్రాడీపేట 4వ లైనులోని శంకర్ విలాస్ హోటల్తో పాటు దుకాణాలు, బ్యాంకును పోలీసులు మూసివేయించారు. 4వ లైను మొదటి అడ్డరోడ్డు మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసు యంత్రాగం ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లు, పోలీసు వ్యానును తీసుకువచ్చారు. కర్ఫ్యూ వాతావరనాన్ని తలపింపజేశారు. -
కిసాన్ క్రెడిట్ కార్డు మంజూరు చేయాలి
నరసరావుపేట: జిల్లాలో రైతులకు ఆర్థికంగా మరింత బలాన్నిచ్చే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ (కేసీసీ) పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో కేసీసీ జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందగలరని పేర్కొన్నారు. కేసీసీ ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం తక్షణ ఆర్థిక సహాయం పొందవచ్చునని, ఇది రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. లబ్ధిదారులకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, ఇప్పటికే కార్డు పొందిన రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించి ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను పొందాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆర్థిక స్థితిని మెరుగు పరచుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఐ.జగ్గారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ప్రసాద్ పాల్గొన్నారు. గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతులు కల్పించండి గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం పీఎం జన్మన్, పీఎం జుగా పథకాల కింద మంజూరైన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీఎం జన్మన్, పీఎం జుగాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎం జన్మన్ పథకం కింద చెంచుల నివాస ప్రాంతాల్లో పక్కా ఇళ్లు, కుళాయి ద్వారా ఇంటింటికి నీటి సరఫరా, వసతి గృహాలు, అంగన్వాడీ నిర్మాణం, గృహాల విద్యుద్దీకరణ, మొబైల్ టవర్ల నిర్మాణం కోసం రూ.41.38 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకూ రూ.17.56 కోట్ల పనులు పూర్తి చేశారన్నారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఉన్న చోట పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇంటింటికీ సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయాలన్నారు. పీఎం జుగా కింద జిల్లాలోని ఏడు గిరిజన గ్రామాల్లో దాదాపు రూ.18 కోట్ల మేరకు పనులు చేపట్టాల్సి ఉందన్నారు. శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుదారుడి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు సమాధానం చెప్పడం కంటే అర్జీదారుడి సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్ అన్నారు. అప్పుడే రీ ఓపెన్ కేసులు తగ్గించగలమని పేర్కొన్నారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదలాయించే అవకాశం సైతం ఆన్లైన్లో ఇచ్చామని, సంబంధిత అర్జీలతో తమ శాఖకు సంబంధం లేదు అన్నట్టు అధికారులు వ్యవహరించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం
గుంటూరు మెడికల్: ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ విభాగాలు కలిగిన సాయి భాస్కర్ హాస్పిల్కు ఆర్థో విభాగంలో రెండు డీఎన్బీ సీట్లు కేటాయి స్తూ ఎన్.బి.ఇ.ఎం.ఎస్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్్స్(ఎన్.బి.ఇ.ఎం.ఎస్ ) సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను జాతీయస్థాయిలో ఆర్థోపెడిక్ పీజీ ట్రైనింగ్ సెంటర్గా గుర్తిస్తూ డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) సీట్ల ను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో గుజరాత్కు చెందిన డాక్టర్ జీల్ కటిరా, రాజస్థాన్కు చెందిన డాక్టర్ యశా జైన్లు సాయి భాస్కర్ హాస్పిటల్ను ఎంపిక చేసుకున్నారు. మంగళవారం అరండల్పేట లోని హాస్పిటల్ లో డాక్టర్ నరేంద్రరెడ్డి ఎదుట తమ తొలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఎన్బీ సీట్లను తమ హాస్పిటల్కు కేటాయించడం గర్వంగాను, ఆనందంగానే ఉందని తెలిపా రు. మూడు సంవత్సరాల పాటు డీఎన్బీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఎముకలు కీళ్ల విభాగంలో అన్ని విధాలా మెరుగైన విద్యను, ప్రాక్టికల్స్ను అందించి ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది తద్వారా జాతీయస్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డాక్టర్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొనకల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి -
ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతి
సత్తెనపల్లి: స్నేహితులతో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతై మృతిచెందిన సంఘటన సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు సమీపంలోని అమరావతి మేజర్ కాలువ లాకుల వద్ద మంగళవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగన్నకుంట ఏరియాకు చెందిన మదిర, శ్రీదుర్గస్వామి దంపతులకు కుమారుడు గిరీష్, కుమార్తె హర్షిత ఉన్నారు. పదవ తరగతి చదువుకున్న గిరీష్ (17) స్థానికంగా ఇస్తారాకుల దుకాణంలో పనిచేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. గిరీష్ తన స్నేహితులు గొల్లపల్లి శ్యాలేమ్ రాజు, రాజవరపు మణికంఠ, పెద్దింటి నాగమురళిలతో కలిసి ఈత కొట్టేందుకు అమరావతి మేజర్ కెనాల్ కాలువ వద్దకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల మదిర గిరీష్ గల్లంతయ్యాడు. ఎంత వెతుకులాడినా కనిపించకపోవడంతో సత్తెనపల్లి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా, మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో మదిర గిరీష్ మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు శ్రీదుర్గ, స్వామి, సోదరి హర్షిత, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. గంతమ్మ తల్లి నీకు మేము ఏం తక్కువ చేశామమ్మా అంటూ రోదించారు. ఒక్కగానొక్కడు వంశోద్ధారకుడు ఇక లేడనే వార్తను ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారి రోదన చూపరులను కంటితడికి గురిచేసింది. మదిర గిరీష్ మృతదేహానికి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు -
అధిక ఉష్ణోగ్రతలపై జాగ్రత్తలు అవసరం
నరసరావుపేట: ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సూచించారు. జిల్లాలోని రానున్న ఐదురోజులు అధిక ఉష్ణోగ్రతలు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో ప్రజలు వేసవి ఎండలు, వడగాడ్పుల నుంచి రక్షణకు అవసమైన జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. భూగర్భ జలమట్టం పెంచాలి జలధార – జలహరతి పథకం ద్వారా జిల్లాలో 10 రోజుల్లోగా భూగర్భ జలంమట్టం పెంపుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాల్వల పూడిక తీత, చెరువుల అనుసంధానం, నీటి పథకాల మరమ్మతులు వంటి ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాలన్నారు. భూగర్భ జలమట్టం ఆందోళనకర స్థాయిలో ఉన్న బొల్లాపల్లి, మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, కారంపూడి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల, వినుకొండ మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉపాధిహామీ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకూ నిధులను జలధార–జలహారతి కోసం వినియోగించాలన్నారు. నీటిమట్టం కొలతల్లో ప్రామాణికంగా ఉండేందుకు నూతన పీజో మీటర్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. 9న మూడో గ్రామ ఆరోగ్యదర్శిని ఈనెల 9న జిల్లా వ్యాప్తంగా ప్రతి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంలో గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వడగాలుల నుంచి జాగ్రత్తలు, ప్రతి బాలికకూ హెచ్పీవీ వ్యాక్సిన్ నినాదంతో జిల్లాలో మూడవ గ్రామ ఆరోగ్య దర్శిని నిర్వహించాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, వెబెక్స్ ద్వారా జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫుడ్ యూనిట్ల స్థాపనకు రాయితీ నరసరావుపేట: జిల్లాలో వ్యక్తిగతంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే వారికి 35శాతం రాయితీపై గరిష్ఠగా రూ.10 లక్షలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.3 కోట్ల వరకు ఇస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ యూనిట్ల స్థాపనపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకటరావు, యంగ్ ప్రొఫెషనల్స్, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ అధికారి పుష్య, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఎల్డీఎం, డీడీఎం, డీఏఓ పాల్గొన్నారు. 22–ఏ నిషేధిత భూముల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 22ఏ నిషేధిత భూముల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి 22ఏ నిషేధిత భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసును నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టి నివేదికలను సమర్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
రోడ్డు ప్రమాదంలో బిహార్ కార్మికుడు దుర్మరణం
యడ్లపాడు: ఉపాధి వెతుక్కుంటూ పొట్టచేతబట్టుకుని వచ్చిన ఆ వలస కార్మికుడిని విధి వంచించింది. కొత్త ఆశలతో వచ్చిన మొదటి రోజే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతడిని కబళించింది. వంకాయలపాడు జైన్ మందిరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బిహార్కు చెందిన బాగీబింద్ (47) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం కై మూర్ జిల్లాకు చెందిన బాగీబింద్, తన బాబాయ్ కుమారుడు సురేష్ కుమార్ పనిచేస్తున్న వంకాయలపాడు గ్రామంలోని బి.శ్రీనివాసరావు పవర్ కన్స్ట్రక్షన్ (స్తంభాల) కంపెనీలో కూలీగా చేరేందుకు సోమవారం సాయంత్రం వచ్చాడు. మరుసటి రోజు నుంచే పనిలో చేరాలని యాజమాన్యంతో మాట్లాడి ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. తన సామాను గదిలో ఉంచి, బయటకు వెళ్లిన బాగీబింద్ రాత్రంతా తిరిగి రాలేదు. ప్రమాదం జరిగిందిలా.. సోమవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో వంకాయలపాడు జైన్ మందిరం సమీపంలోని సర్వీస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బాగీబింద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ మంగళవారం బాగీబింద్ తుదిశ్వాస విడిచాడు. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ద్వారా విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. రోడ్డుపై రక్తపు మరకలు, అక్కడే బాగీబింద్ ఫోన్, షూ పడి ఉండటాన్ని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మృతుని తమ్ముడి కుమారుడు సురేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పొట్ట చేతబట్టుకుని వచ్చిన తొలిరోజే అనంతలోకాలకు.. -
చెరువులో పడి అన్నదమ్ములు దుర్మరణం
దాచేపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన మంగళవారం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారంలో జరిగింది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సారంగపల్లి అగ్రహారంకి చెందిన మోటుపోతుల శ్రీను(32), శ్రీకాంత్(18)లు వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరూ గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. ఈక్రమంలో మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలోని అడవిలో గొర్రెలను మేపేందుకు వెళ్లారు. గొర్రెలకు నీళ్లు తాపించేందుకు కొత్తూరు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. చెరువులో గొర్రెలు నీళ్లు తాగుతుండగా వాటిని ఒడ్డు ఎక్కించేందుకు శ్రీను చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో శ్రీను కాలుజారి చెరువులోని పూడికలోకి దిగాడు. చెరువు నీటిలో మునుగుతున్న శ్రీనును కాపాడేందుకు తమ్ముడైన శ్రీకాంత్ నీటిలో దిగి కాపాడే ప్రయత్నం చేయగా అతను కూడా పూడికలోకి జారాడు. వీరిద్దని శ్రీకాంత్ తండ్రి సైదయ్య రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. శ్రీను, శ్రీకాంత్ లు చెరువు నీళ్లలోనే మునిగి ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని సైదయ్య గ్రామస్తులు సమాచారం ఇవ్వటంతో భారీగా గ్రామస్తులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. నీటిలో మునిగిపోయిన శ్రీను, శ్రీకాంత్ మృతదేహాలను అతి కష్టం మీద ఒడ్డుకు తీశారు. ఎస్ఐ పాపారావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాపారావు వెల్లడించారు. మృతుడు శ్రీనుకి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా శ్రీకాంత్ అవివాహితుడు. అన్నదమ్ములు ఇద్దరు చెరువులో పడి మృతి చెందటం సారంగంపల్లి అగ్రహారం గ్రామంలో విషాదాన్ని నింపింది. బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాల పై పడి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
స్కూటీలో దాచిన రూ.5లక్షలు చోరీ
నరసరావుపేట రూరల్: స్కూటీలో దాచిన రూ.5లక్షలు చోరీకి గురైన ఘటన మండలంలోని జొన్నలగడ్డ సమీపంలోని ఉల్లిపాయల దుకాణం వద్ద చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడుకు చెందిన అన్నా వెంకట సత్యనారాయణ మంగళవారం నరసరావుపేటలోని బందువుల నిర్వహించే బంగారు దుకాణం వద్దకు స్కూటీపై వచ్చాడు. అక్కడ వారి నుంచి నగదు తీసుకుని స్కూటీపై తిరుగు ప్రయాణ మయ్యాడు. ఇంటికి అవసరమైన ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు గుంటూరు రోడ్డులో జొన్నలగడ్డ సమీపంలోని హోల్సేల్ ఉల్లిపాయల దుకాణం వద్ద స్కూటీని నిలిపాడు. దుకాణంలోకి వెళ్లి ఉల్లిపాయలు తీసుకుని తిరిగి వచ్చే లోగా స్కూటీలో దాచిన రూ.5లక్షలు నగదు మాయమయింది. ఈ విషయాన్ని దుకాణం నిర్వాహకులకు తెలియజేయడంతో వారు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఇందులో ఒక యువకుడు స్కూటీలో దాచిన నగదును తీసుకుని వెళ్లడం స్పష్టంగా కనిపించింది. సత్యనారాయణ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ కిషోర్ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. జొన్నలగడ్డ సమీపంలో ఉల్లిపాయల దుకాణం వద్ద ఘటన -
బాలుడి ప్రాణాలను బలిగొన్న ఈత సరదా
చిలకలూరిపేటటౌన్: ఈత కొడదామని వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా తిరిగిరావడంతో స్థానిక సుభాని నగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగులో మునిగి ఐదో తరగతి విద్యార్థి చందు (11) మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తమ ఇంటి సమీపంలోని వాగు వద్దకు వెళ్లాడు. నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో, లోపలికి వెళ్లిన చందు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత నీటిలో మునిగి ఉన్న చందుని బయటకు తీయించారు. అయితే అప్పటికే శ్వాస ఆగిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఈత సరదా ఇలా ప్రాణాలు తీయడం స్థానికులను సైతం కలచివేసింది. ఈ సందర్భంగా ఎస్ఐ హజరత్తయ్య మాట్లాడుతూ సెలవుల సమయంలో పిల్లలు చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
జై చెన్నకేశవ.. జై జై చెన్నకేశవ..
మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల కొంగుబంగారంగా పిలుచుకునే శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా సాగింది. వేలాది మంది భక్త జన సందోహంతో కనుల పండువగా వేడుక జరిగింది. శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రథం పైకి ఎక్కించి కుమ్మరి వారు కుంభం పోసి హారతి రథం ఊరేగింపునకు సిద్ధం చేశారు. అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, చైర్మన్ కొమెర అనంతరాములు, ఈఓ సైదారావుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రథోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హారతినిచ్చి రథం ముందు దిష్టి గుమ్మడికాయ దిష్టి తీసి రథం ఊరేగింపును ప్రారంభించారు. రథంపై నగారా మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ భక్తులు గొలుసులు చేతబట్టి రథాన్ని పురవీధుల్లో నడిపించేందుకు ఉత్సాహంగా పోటీ పడ్డారు. రథశాల నుంచి లక్ష్మీదేవి మిద్దెల మీదుగా బురుజు సెంటర్ వరకు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ నినాదాల మధ్య, గోవింద నామస్మరణతో రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాలలోని ప్రముఖ ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పల్నాటి ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పారవశ్యంతో పులకించారు. ఆర్యవైశ్య సంఘం, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ముందుగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి శ్రీదేవి, భూదేవి లను ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. యువకులు పోటీ పడి రథాన్ని లాగారు. ఏఎస్పీ సంతోష్, గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తరలివచ్చి బందోబస్తు నిర్వహించారు. పలు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రసాదాలు, పానీయాలు, అన్నదానం చేశాయి. మాచర్ల పట్టణంలో ఎటుచూసినా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ల సందడి కనబడింది. సాయంత్రం రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. -
ఘనంగా పోలేరమ్మ తిరునాళ్ల
గుంటూరు రూరల్: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం కనుల పండువగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల యోగక్షేమాల కోసం ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సిడిమాను ఊరేగింపు మహోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గుడికి వచ్చే రాకపోకల మార్గాల్లో 12 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేశామని తెలిపారు. ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఆలయ ఈవో జక్కా శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై హరికృష్ణ, ప్రత్తిపాడు ఎస్సై నరహరి, ఇతర శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
అదనపు కోర్టుల కోసం భవనాల పరిశీలన
అమరావతి: అనుమతించబడిన అదనపు కోర్టుల ఏర్పాటు నిమిత్తం మంగళవారం స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పలువురు న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ పరిశీలనలో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ చక్రవర్తి, సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి విజయకుమార్ రెడ్డి, సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహ్మద్, ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రియ దర్శిని, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సృజన్కుమార్, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రాములు, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి, సీఐ అచ్చియ్య, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లిలోని బాలాజీ హెచ్పీ గ్యాస్ కంపెనీలో పౌర సరఫరాల డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ మంగళవారం తనిఖీలు చేశారు. ఆన్లైన్ గ్యాస్ బుకింగ్ నమోదులను, డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేసే విధానాన్ని గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ కంపెనీ వద్ద ఉన్న వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్యాస్ బుకింగ్ తేదీ ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. గ్యాస్ గోడౌన్ల వద్ద సిలిండర్లను డెలివరీ చేయవద్దని, తప్పని సరిగా డోర్ డెలివరీ చేయాలన్నారు. వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఆయా ఏజన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు డీఎస్ఓ కోమలి పద్మ, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, మంగళగిరి సివిల్ సప్లయీస్ డీటీ శ్రీనివాసరావు, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 530.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. రెక్కాడితేనే గానీ డొక్కాడని పేద దంపతులు వారు.. భార్యాభర్తలు తలో పనిచేసుకుంటేనే గానీ.. ఆ ఇంట్లో వాళ్లందరి కడుపులు నిండని పరిస్థితి. తమ చిన్నారి తమలా కష్టపడకూడదని బాగా చదివించి, ఉన్నతస్థాయిలో ఉంచాలని ఆశపడ్డారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. వారి గారాలపట్టి కామెర్ల వ్యాధి బారిన పడగా.. అది కాస్త ముదిరి లివర్ పాడైంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగితేనే గానీ బిడ్డ కోలుకోలేదని వైద్యులు చెప్పడంతో రూ.లక్షలు ఖర్చు పెట్టలేక.. చిన్నారి పరిస్థితి చూడలేక.. ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఘటన అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై ఆదివారం రాత్రి నకరికల్లు వద్ద జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. చల్లగుండ్ల గ్రామానికి చెందిన పాలపాటి వీరాంజనేయులు (38) నకరికల్లులో బార్బర్ షాపు నిర్వహిస్తుంటాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సమీపంలోని డివైడర్ వద్ద పిడుగురాళ్ల వైపు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు, అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.సతీష్ తెలిపారు. వెల్దుర్తి: మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి (42) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. శ్రీనివాసరెడ్డి ఎద్దుల కొనుగోలు నిమిత్తం మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట ప్రాంతానికి వెళ్లిన సమయంలో అక్కడ వర్షం పడుతుండగా చెట్టుకింద నిలబడి మొబైల్ ఫోన్లో మాట్లాడుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. మాచర్ల: సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో ఆమె తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, మేనమామ పచ్చిపాళ్ల శ్రీనులను సోమవారం రాత్రి గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన చంద్ర శ్రీను కుమార్తె ప్రేమించిన నాగరాజుతో వెళ్లి వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించి చౌడేశ్వరి అదృశ్యమైనట్లు, దానికి కారణం జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజు అని మృతురాలి తల్లిదండ్రులు చంద్రశ్రీను, గంగమ్మలు పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత ఈ నెల 18న చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పారు. అయితే ఇది హత్య కేసుగా పోలీసు పరిశోధనలో తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కేసులో నిందితులు చంద్రశ్రీను, పచ్చిపాళ్ల శ్రీనులను అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్థరాత్రి హాజరుపర్చనున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్పేట 12/3లోని వావిలాల సంస్థ గ్రంథాలయ శాస్త్ర పాఠశాల ఆధ్వర్యంలో గ్రంథాలయశాస్త్ర సర్టిఫికెట్ కోర్సు(సీఎల్ఐఎస్)లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపాల్ డి.రాంబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి 18 ఏళ్ల వయసు నిండిన అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కోర్సులను ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. వివరాలకు సంస్థ కార్యాలయంతో పాటు 0863–2237375, 93962 38946 నంబర్లో సంప్రదించాలని కోరారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం ఉదయం 9 గంటలకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాతులూరి వెంకట రమణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కారంచేడు: వేగంగా బైక్ నడిపి రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలకు కారణమైన నిందితుడికి సోమవారం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని దగ్గుబాడు సమీపంలోని కోల్డు స్టోరేజ్ వాచ్మెన్గా పనిచేస్తున్న ఎం చినవెంకటేశు భార్య 24 జనవరి 2020 రాత్రి ప్రధాన రహదారి మార్జిన్లో నిలబడి ఉంది. ఈక్రమంలో జే పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన మున్నంగి చంటి వేగంగా బైక్ నడుపుకుంటూ మహిళను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆమెను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సాక్షులను ప్రవేశపెట్డడంలో ప్రతిభను చూపిన ఎస్ఐ, కోర్టు కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు అభినందించారు. పర్చూరు కోర్టు నిందుతుడికి ఏడాది జైలు శిక్షను విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బతికిస్తే.. బడికి పోతా..!
నరసరావుపేట రూరల్: కామెర్ల వ్యాధితో లివర్ దెబ్బతిన్న తన ప్రాణాలు కాపాడితే బడికెళ్లి చదువుకుంటానంటూ చిన్నారి కీర్తన అధికారులను వేడుకొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ పాపను కాపాడాలని నూజెండ్ల మండలం కంభంపాడుకు చెందిన పల్లపాటి వీరయ్య, మరియకుమారి దంపతులు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహాను కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీని కలిసి ఈమేరకు వారు వేడుకున్నారు. కీర్తన ప్రస్తుతం నాల్గవ తరగతి చదువుతున్నట్టు తల్లిదండ్రులు జాయింట్ కలెక్టర్కు తెలిపారు. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డకు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.4లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిపారు. కామెర్ల వ్యాధితో లివర్ దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాలని వైద్యులు సూచించారని తెలిపారు. పరీక్షించిన అక్కడి వైద్యులు లివర్ మార్పిడి కోసం రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారని, అంత డబ్బులు పెట్టి వైద్యం అందించే స్థోమత తమ దగ్గర లేదన్నారు. ఎంతమంది దగ్గరకు తిరిగినా తమకు సహాయం అందడం లేదన్నారు. ప్రభుత్వం కీర్తన వైద్యానికి అయ్యే ఖర్చులు భరించాలని కోరారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు దాతలు స్పందించి సహకరించాలని వేడుకున్నారు. -
రాగి తీగ చోరీ కేసుల్లో ఏడుగురు అరెస్ట్
మాచవరం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి వాటిలో ఉన్న రాగి తీగను దొంగిలించిన సంఘటనలో ఐదుగురు నిందితులతోపాటు, వాటిని కొనుగోలు చేసిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మాచవరం పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు లక్ష్యంగా చేసుకొని తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఓ ముఠా ఈ చోరీలకు పాల్పడుతుందని వెల్లడించారు. మాచవరం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వేముల ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం మండలంలోని గోవిందపురం బల్లకట్టు వద్ద కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా రాగి తీగలను దొంగతనం చేసే వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో మొలిక ముత్యం, ఏ గసిరి కోటయ్య , పెండ్ర , వెంకటేష్ కట్టా వెంకటేశ్వర్లులు ఉన్నారు. వీరు దొంగిలించిన రాగి తీగను మంగళగిరి ప్రాంతానికి చెందిన బత్తుల తారకేశ్వరరావు, వారణాసి సతీష్లకు విక్రయిస్తున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 20 కేసుల్లో సుమారు 85 ట్రాన్స్ఫార్మర్ల నుంచి దొంగిలించిన 350 కిలోల రాగి వైర్కుగాను 170 కిలోల రాగి వైర్ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు దొంగతనానికి గురైనట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. నిందితులను అరెస్టు చేసిన మాచవరం ఎస్సై పవన్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. గుంటూరు రూరల్: ఇటీవల కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవ వేడుకల్లో విజ్ఞాన్ నిరులా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐటీ విభాగ విద్యార్థిని గుండా ప్రియాంకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం విశేష గౌరవంగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థిని అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ గుండా ప్రియాంక తన కృషి, పట్టుదల, అంకితభావంతో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని సంస్థకు మరింత ఖ్యాతిని తీసుకువచ్చిందన్నారు. ఆమె సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ప్రియాంకను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.ఎస్. రామకృష్ణ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. -
మెడికల్ కళాశాల నిర్మాణంపై సమీక్ష
పిడుగురాళ్లరూరల్: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్మాణంపై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేసి పల్నాడు ప్రాంత ప్రజలకు అందించాలన్నారు. మెడికల్కాలేజీ వలన ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందని, పల్నాడు ప్రాంతానికే కాకుండా మిగిలిన కొన్ని జిల్లాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్లర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.. జరుగుతున్న పనులపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా ఆక్సిజన్, ఓపీకి సంబంధించిన సమస్యలు లేకుండా చూడటం, సిబ్బంది రిక్రూట్మెంట్ వంటి పనులు నిర్వహిస్తున్నా మని అన్ని త్వరగా పూర్తి చేసి త్వరలోనే వైద్యశాలలో ఓపీ ప్రారంభించటంతోపాటు కళాశాల నిర్వాహణ కూడా చేస్తామని ఆమె తెలిపారు. -
మూల్యాంకనం.. ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పల్నాడురోడ్డులోని కేబీఆర్ విద్యాసంస్థల ప్రాంగణంలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేశారు. మూల్యాంకనంలో పాల్గొనేందుకు 725 మంది ఉపాధ్యాయులను నియమించారు. అనారోగ్యం తదితర కారణాలతో తొలిరోజు 80 శాతం మంది హాజరు కాగా, మరికొందరికి మంగళవారం హాజరు కావాలని నియామక పత్రాలు అందచేశారు. మూల్యాకనంలో 73 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 432 మంది ఎగ్జామినర్లు, 220 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. కేంద్రంలో 24 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం పరిశీలకులుగా పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ పి.శైలజ హాజరై మూల్యాంకనం జరుగుతున్న తీరు, సదుపాయాలను పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు.. ప్రశాంత వాతావరణంలో మూల్యాంకనం కొనసాగేలా కేంద్రంలో ఉపాధ్యాయులకు అన్ని సదుపాయాలు కల్పించినట్టు డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సిబ్బందితో పాటు 108 అంబులెన్స్ను అందుబాటులో ఉంచామని తెలిపారు. -
ఉత్తమ ప్రదర్శన ‘అమ్మ చెక్కిన బొమ్మ’
యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం వేదికగా మూడు రోజులపాటు సాగిన 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఆద్యంతం పారదర్శకంగా, హృద్యంగా సాగిన ఈ వేడుక నాటక ప్రేమికుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఉత్తమ ప్రదర్శనగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్(హైదరాబాద్)వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక. ఉత్తమ తృతీయ ప్రదర్శన స్వర్ణసూర్య డ్రామా లవర్స్ (హైదరాబాద్) వారి ‘సీ్త్రమాత్ర నమః’ నాటిక. చతుర్థ ప్రదర్శన ఉషోదయ కళానిలయం(కట్రపాడు) ‘మంచి మనసులు’ నాటిక. వీటితోపాటు ‘కన్నీటికి విలువెంత..‘మాతృత్వం’ నాటికలు ప్రత్యేక ప్రదర్శన బహుమతుల్ని సాధించుకున్నాయి. తెరవెనుక కృషీవలురు ఉత్తమ నాటక రచనకు.. మంచి మనసులు, అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ దర్శకులు, ఉత్తమ సంగీత దర్శకులు అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ రంగాలంకరణ మమ్మల్ని బ్రతకనివ్వండి, ఉత్తమ ఆహార్యం చిటికెన వేలు నాటికలకు లభించాయి. వేదికపై వెలిగిన కళాకారులు ఉత్తమ నటీమణులు..అనసూయ పాత్రధారి జ్యోతిరాజ్ భీశెట్టి (అమ్మచెక్కిన బొమ్మ), రమణమ్మ పాత్రధారి ఆర్ రాజేశ్వరి (మమ్మల్ని బతకనివ్వండి), ఉత్తమ నటులు చిట్టి పాత్రధారి కార్తీక్ (సీ్త్రమాత్రే నమః), శశి–2 పాత్రధారి భానుప్రకాష్ (అమ్మచెక్కిన బొమ్మ), సోమన్న పాత్రధారి కె సత్యనారాయణ (చిటికెలవేలు) బహుమతుల్ని గెలుచుకున్నారు. ద్వితీయ ఉత్తమ నటులు..వైబీ చౌదరి (దీపం కింద చీకటి), పొగర్తి నాగేశ్వరరావు (మాతృత్వం), ఉదయ భాగవతుల (సీ్త్ర మాత్రే నమః), పీఎస్ పవన్కుమార్ (మమ్మల్ని బ్రతకనివ్వండి), అమృత వర్షిణి (మంచి మనసులు) నటులకు దక్కాయి. కళా సేవకులకు సన్మానం... కళా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసి, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు అందుకున్న ఈదర హరిబాబు, రాయప్రోలు భగవాన్, నన్నపనేని రాఘవరావు, జాస్తి వెంకట మోహన్రావు, బుడ్డా వెంకట రామారావు, అన్నమనేని ప్రసాదరావు, కాట్రగడ్డ కృష్ణప్రసాద్లను కమిటీ సన్మానించారు. అనంతరం ముఖ్య అతిధి నాటక రంగ విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సన్మానితులు ప్రసంగించారు. నాటక కళను బతికించేందుకు సురేష్బాబు దంపతులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో పరిషత్ కార్యవర్గం జరుగుల రామారావు, శంకర్రావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, నూతలపాటి మాధవరావు, చెరుకూరి సృజన, షేక్ బాజి, నంబూరి శ్రీనివాసరావు, ఎం పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, సీహెచ్ హనుమంతరావు, కె సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు ఉన్నారు. రంగస్థల చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా స్టేజీపై నటించిన 19 మంది మహిళా కళాకారులకు ఆడపడుచు లాంఛనాలతో (చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు) సత్కరించారు. గ్రామవాసి డాక్టర్ ముత్తవరపు భార్గవిచౌదరి ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, ఉత్తమ రచన, దర్శకత్వ విభాగాలకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే నాటికలను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు లక్కీ డ్రా నిర్వహించి, మూడు రోజుల్లో మొత్తం 120 మందికి బహుమతులు అందజేశారు. ప్రతిరోజూ రాత్రి ప్రేక్షకులకు అల్పాహారం ఏర్పాటు చేయడం విశేషం. -
భూ వివాదాలు, ఆర్థిక వ్యవహారాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: భూ వివాదాలు, ఆర్థిక వ్యవహారాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి అంశాలపై 59 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు. పూర్వికుల నుంచి వచ్చిన భూమి మాకు 70 సెంట్లు ఉంది. పది సెంట్లు భూమిని కపిలవాయి సుబ్బారావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిపై న్యాయస్థానం నుంచి కూడా తీర్పు వచ్చినా ధిక్కరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. సుబ్బారావుపై చర్యలు తీసుకుని మా స్థలంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. –మారుగండ్ల వెంకయ్య, దుర్గి నా తండ్రికి ఐదుగురు ఆడపిల్లలు. నాకు కూడా ఆడపిల్లలే పుడతారని భర్త వదిలి వెళ్లిపోయాడు. ఐదు సంవత్సరాల క్రితం వివాహం కాగా ఏప్రిల్ నెలలో తమకు పాప పుట్టిందని తెలిపింది. పాప కడుపులో ఉండగానే భర్త తమను వదిలి వెళ్లిపోయాడు. తమకు న్యాయం చేయాలని కోరింది. –ఓ మహిళ, మునుగోడు, అమరావతి మండలం ఇంటి నిర్మాణం కోసం గుంటూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఈశ్వరాచారిని 2025లో సంప్రదించాను. అవసరమైన రుణం రూ.5.50 లక్షలు మంజూరు చేయించాడు. ఇందులో రూ.3 లక్షలు మాకు ఇచ్చాడు. మిగిలిన మొత్తం రిజిస్ట్రర్ ఖర్చు కమిషన్ పేరుతో తీసుకున్నట్టు వివరించాడు. దీనిపై ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – ఎలిజల ఏసుదానం, నరమాలపాడు, కారంపూడి మండలం -
పీజీఆర్ఎస్ అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 112 అర్జీలు అందాయి. జేసీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆయా శాఖల పరిధిలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. అర్జీదారులతో మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్ అర్జీలు లేకుండా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెవెన్యూ క్లినిక్లో 16 అర్జీలు వచ్చాయి. గురజాల డివిజన్ నుంచి రెండు, సత్తెనపల్లి డివిజన్ నుంచి ఐదు, నరసరావుపేట డివిజన్ నుంచి తొమ్మిది అర్జీలు అధికారులకు అందాయి. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ -
గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం తెల్లవారుజామున మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి పట్టణం సలామ్ హోటల్ సెంటర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని గతంలో గంజాయి, ఇతర కేసుల్లో పట్టుబడిన వారి నివాసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపుగా 200 నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎస్పీతోపాటు నార్త్జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, జిల్లా కేంద్రంతోపాటు తాడేపల్లి, మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నుంచి దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి విక్రయించడంతో పాటు తాగుతున్నారని సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 39 ప్రాంతాల్లో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలో పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేశామని, సలాం హోటల్ సెంటర్లో నిర్వహించగా 65 ద్విచక్రవాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్నాయని, వాటన్నింటి పత్రాలను పరిశీలించి డాక్యుమెంట్ ఉన్న వాహనాలను ఇచ్చివేస్తామని, లేని పక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
రాజధాని తీర్మానం పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలు
సత్తెనపల్లి: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి రాజధానికి చట్టబద్ధత తీర్మానం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ సీపీ మీడియా ప్యానలిస్ట్, పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారు. చంద్రబాబు 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరెవరో వచ్చి మార్చేస్తారని ప్రచారం ఎందుకు చేబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనపై తనకే నమ్మకం లేదు అనడానికి సంకేతమన్నారు. అమరావతిలో ఇంతవరకు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, కేవలం డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. 2014–19 టీడీపీ హయాంలో కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వం లక్ష ఎకరాల భూమిని సేకరించడం వెనుక అనుచరులు, బినామీలకు లబ్ధి చేకూర్చే రియల్ ఎస్టేట్ దందా ఉందని ఆరోపించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు అవసరమని, మొత్తం ప్రాజెక్టుకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని.. అంత భారం భరించే శక్తి రాష్ట్రానికి ఉందా అని నిలదీశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. రెండో విడత భూసేకరణ కోసం సీఎం చంద్రబాబు తీర్మానం డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానాల్లో, పార్లమెంటు ఉభయసభల్లో అమరావతి బిల్లును వ్యతిరేకించలేదని వివరించారు. బిల్లు స్వరూపాన్ని తప్పుపట్టారన్నారు. మావిగన్పై పచ్చ మీడియా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుత ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు హైవే కారిడార్ రాజధానిగా చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక వనరుల వెతుకులాట పని లేకుండా సమకూరుతాయని మావిగన్ అనే ప్రతిపాదన చేశాడే తప్ప ఆ ప్రతిపాదనలో సాధ్యసాధ్యాలు ఆలోచించకుండా టీడీపీ తద్వారా పచ్చ మీడియా, పత్రికలు నోటికొచ్చినట్లు మాట్లాడటం, దూషించడం సరైనది కాదన్నారు. చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఉద్దేశ పూర్వకంగా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని తీవ్రమైన పదజాలంతో దూషించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అమరావతి విషయం చూస్తుంటే చంద్రబాబు, పచ్చ మీడియా బందిపోట్ల ముఠాకన్న ఎక్కువ దుర్మార్గం చేస్తున్నారని, సంపదలు సృష్టి పేరుతో సంపద లూటీ చేస్తున్నారన్నారు. మాయ మాటలు మోసపు వాగ్దానాలు ప్రజలు నమ్మరు అనే విషయాన్ని గమనించాలని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకుడు గంగదాసు శ్రీధర్రెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ మీడియా ప్యానలిస్ట్ చిట్టా విజయభాస్కరరెడ్డి -
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
సత్తెనపల్లి: ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు సమీపంలోని అమరావతి మేజర్ కాలువ లాకుల వద్ద సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగన్నకుంట ఏరియాకి చెందిన మధిర గిరీష్ ఇస్తరాకుల షాపులో పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. మధిర గిరీష్ తో పాటు మరో ముగ్గురు స్నేహితులైన గొల్లపల్లి శాలెంరాజు, రాజువరపు మణికంఠ, పెద్దింటి నాగమురళి ఈత కొట్టేందుకు అమరావతి మేజర్ కెనాల్ కాలువకు సోమవారం సాయంత్రం వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువ గా ఉండటం వల్ల మధిర గిరీష్ గల్లంతయ్యాడు. ఎంతసేపటికి కనిపించకపోవడంతో మిగిలిన ముగ్గురు స్నేహితులు కాలువలో నుంచి బయటికి వచ్చి కేకలు వేశారు. అప్పటికే గిరీష్ కనిపించకపోవడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. దీంతో సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమినుద్దీన్, పోలీసులు, గిరీష్ కుటుంబ సభ్యులు,బంధువులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి పడినప్పటికీ గిరీష్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. బిడ్డ గల్లంతైన విషయం తెలియడంతో గిరీష్ తల్లిదండ్రులు శ్రీదుర్గా, స్వామి, సోదరి హర్షిత, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. వారి రోదన చూపరులను సైతం కంటతడికి గురి చేసింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
రాసలీలలు, లంచాలు.. పల్నాడు పోలీస్ వ్యవస్థలో కలకలం!
కుటుంబంలో కలహాలు పొడచూపినా.. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు తలెత్తినా.. బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు పేట్రేగినా బాధితులకు కనిపించే ఏకైక ధైర్యం.. పోలీసులు. అలాంటిది పల్నాడు జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. అధికారం అండగా చెలగేరిపోతున్నారు. బాధితులకు అందాల్సిన న్యాయాన్ని పోలీసు స్టేషను మెట్ల వద్దే సమాధి చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన వారు అరాచకాలకు పాల్పడేవారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ సీఐ రాసలీలల బాగోతం, మరో సీఐ లంచావతారం, ఇంకో సీఐ అధికార పార్టీ దాసోహం... ఇలా జిల్లా పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మారాయి. సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వాల్సిన పోలీసు అధికారులు వరుస ఆరోపణలతో బజారున పడుతున్నారు. దీంతో ఆ వ్యవస్థపై విశ్వసనీయత దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగుచూసిన అనేక సంఘటనలు పోలీసు వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పల్నాడులో పోలీసు వ్యవస్థ దారితప్పుతోంది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి పోలీసుస్టేషన్లో పనిచేసిన సీఐ భాస్కర్ ఓ మహిళతో సహజీవనం చేశాడన్న ఆరోపణలపై వారం క్రితం వీఆర్కు పంపినట్టు తెలుస్తోంది. గతంలో మహిళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ సీఐ వ్యవహారాన్ని ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధికి అందించాడు. త్వరలో మీడియా ముందు బహిర్గతం చేస్తానని చెప్పాడు. అదే జరిగితే పోలీసు శాఖకు మాయని మచ్చగా మిగులుతుందని భావించిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వాస్తవానికి సీఐపై వచ్చిన ఆరోపణ తీవ్రత దృష్ట్యా సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాల్సి ఉంది. అతనికున్న రాజకీయ పలుకుబడి కారణంగా నామమాత్రపు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై పోలీసులు ప్రతి చర్యకు దిగినట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో ఫిర్యాదు చేయించి అతన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని బెదిరించి ఎలాగైనా తనకున్న పలుకుబడితో మళ్లీ దాచేపల్లికి సీఐగా రావాలని భాస్కర్ ప్రయతి్నస్తున్నారని సమాచారం. పరువు హత్యకు సహకరించిన సీఐపై వేటు... మాచర్లకు చెందిన చౌడేశ్వరి నెల కిందట నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారంలో తలదూర్చిన మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణ.. యువతి తండ్రి చంద్రశ్రీనుతో బేరం కుదుర్చుకొని యువతిని బలవంతంగా తండ్రికి అప్పగించాడు. దీంతో కుమార్తెను గత నెల 18వ తేదీన తండ్రి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం బయటకు రావడంతో సదరు సీఐ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. వైద్యురాలు సహకరించకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మీడియాలో కథనాలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో సీఐ అవినీతి బాగోతం వెలుగుచూసింది. సుమారు రూ.6.5 లక్షలు చేతులు మారినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా ఆదివారం సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సివిల్ పంచాయితీలకు ఆ స్టేషన్ అడ్డా... పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి అండతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారిచే ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. గత ఏడాది డిసెంబర్లో ఓ ఆర్యవైశ్య మహిళ పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా ఆ సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. బుకీలను తప్పించిన పోలీసులు... క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టి సారించి బుకీల ఏరివేతకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. విషయం తెలుసుకున్న జిల్లాలోని కొంతమంది అవినీతి అధికారులు ఆ సమాచారాన్ని బుకీలకు ముందుగానే చేరవేశారు. దీంతో బుకీలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వారి ఆచూకీ కోసం ఎస్బీ పోలీసులు గాలిస్తున్నా ప్రయోజనం దక్కడం లేదు. అందరి సెల్ఫోన్ సిగ్నల్లు ఇతర రాష్ట్రాలలో ఉన్నట్టు కనిపిస్తుండటంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. ఐపీఎల్, వర్డల్ కప్, ఇతర ముఖ్యమైన మ్యాచ్లు జరిగే సమయంలో బుకీల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయా స్టేషన్లలో పనిచేసే కొంతమంది అధికారులు, సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నారు. బుకీలు చిక్కితే వీళ్ల అవినీతి బాగోతం బయటపడుతుందని ముందస్తు సమాచారం ఇచ్చి పరారీకి సహకరించినట్టు సమాచారం. నేరుగా బుకీలతో సంబంధం పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఓ సీఐపై వ్యవహారంపై జిల్లా ఎస్పీ దృష్టి సారించినట్టు తెలియవచ్చింది.పేకాటకు సహకరిస్తున్న సీఐలు... ఇప్పటికే చిలకలూరిపేట పట్టణం పేకాటకు అడ్డాగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి చిలకలూరిపేటకు పెద్ద సంఖ్యలో జూదగాళ్లు తరలి వస్తున్నారు. నిత్యం రూ.కోట్లు చేతులు మారుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పేకాట శిబిరాలపై సీఐ దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకొని పేకాట రాయుళ్లను స్టేషన్కు తరలించాడు. ఇక్కడి రెండు వర్గాల్లో ఓ వర్గానికి మద్దతుగా రెండో వర్గం వారిపై ఇలా దాడులు జరిగాయి. కానీ ఈ వ్యవహారంలో చినబాబు వద్ద పనిచేసే వ్యక్తి కలుగుజేసుకొని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్కు పిలవాలని ఉన్నతా«ధికారులపై ఒత్తిడి చేశాడు. దీంతో సీఐ వెనక్కితగ్గి ఆ పేకాట రాయుళ్లను కేసు లేకుండా విడిచిపెట్టాడు. అధికార పార్టీకి వత్తాసుగా వ్యవహరించొద్దన్నారు. మిగతా చోట్ల పోలీసు సీఐ తనవంతు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
వలస కూలీలపై నిర్లక్ష్య ధోరణి వీడాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని వలస కార్మికులకు రక్షణ చట్టం తక్షణమే అమలు చేసి చనిపోయిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. వలస ప్రాంతాల్లో ఉచిత రవాణా, నివాసం, తాగునీరు, వైద్యం, రేషన్ సదుపాయాలు కల్పించడంతో పాటు పిల్లల విద్య ఆగిపోకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు జిల్లా నుండి మిర్చి కోత పనుల కోసం నరసరావుపేట మండలం కేసానుపల్లి, ఇర్లపాడు గ్రామాలకు వలస వచ్చిన కార్మికులను ఆదివారం సంఘం రాష్ట్ర నాయకుడు వి.వెంకటేశ్వర్లు, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల కార్యదర్శులు జి.రవిబాబు, ఈ.అప్పారావు, కంకణాల ఆంజనేయులు పరామర్శించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల దుస్థితి దారుణంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుండగా, వలసల బారిన పడిన కూలీల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మండిపడ్డారు. నాలుగు నెలలుగా గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు పనులు లేకపోవడంతో పాటు, ఉపాధి హామీ పనులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ పరిస్థితుల వల్ల లక్షలాది మంది కూలీలు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తోందని, ఈ వలసలలో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల కోసిగి మండలానికి చెందిన ఓ వ్యవసాయ కార్మికుడు వడదెబ్బతో మతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, అతని కుటుంబం అనాధగా మారిందని, అయినా ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని విమర్శించారు. -
ఆగని అక్రమ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
నరసరావుపేట: పట్టణంలోని శ్రీరాంపురం జామియా మసీదు పక్కన వక్ఫ్బోర్డు స్థలంలో ఆ సంస్థల ముందస్తు అనుమతి లేకుండా, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూనే ఉంది. శనివారం కూడా కొందరు కూలీలు పనులు చేస్తూ కన్పించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి వక్ఫ్బోర్డు అధికారులను పట్టించుకోకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణం చేస్తున్నారు. కొందరు టీడీపీ మైనార్టీ నాయకులు పాత షాపుల యజమానులను పక్కనపెట్టి పట్టణంలోని కొందరు వ్యక్తుల వద్ద లక్షలకు లక్షలు డబ్బులు వసూలుచేసి వారికి షాపులు కేటాయిస్తున్నారని మాజీ కౌన్సిలర్ షేక్ జాని మౌలాలీ ఆరోపిస్తున్నారు. వివరాలు.. వక్ఫ్బోర్డు స్థలంలో ముస్లిం మైనార్టీలు 72 షాపులతో వ్యాపారాలు చేస్తుండగా 2018లో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు కాంప్లెక్స్ను కూల్చివేశారు. వెంటనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం మారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాత వ్యాపారులకే షాపులు కేటాయించటం జరుగుతుందని, ఎవరికీ అన్యాయం చేయబోమని ప్రకటించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టగా కొందరు టీడీపీ వ్యక్తులు కోర్టును ఆశ్రయించి నిర్మాణంపై స్టే తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొందరు వ్యక్తులు జామియా మసీదుకు తామే వారసులం అంటూ అదిలే సున్నత్ జామియా మసీదు సంఘం పేరుతో ఒక ప్రైవేటు సంఘం సృష్టించారు. పాత షాపుల యజమానులు, మరికొందరు నూతన వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి అనధికారికంగా నిర్మాణం చేపట్టారు. దీనిపై మాజీ కౌన్సిలర్, మసీదు మేనేజ్మెంట్ కమిటీ సెక్రటరీ షేక్ జాని మౌలాలి, మరో వ్యక్తి కలిసి హైకోర్టును ఆశ్రయించగా నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, వారం రోజులలో తమకు నివేదిక అందజేయాలని షేక్ రహమత్ఆలీ, మున్సిపల్, వక్ఫ్బోర్డు అధికారులు, పిటిషనర్లు సూచించిన నిర్మాణ దారులకు నోటీసులు జారీ చేసింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో నిర్మాణ మేస్త్రిగా ఉన్న వ్యక్తిని తప్పించి మరో వ్యక్తి ద్వారా కూలీల సహాయంతో నిర్మాణం చేస్తున్నారు. దీనిపై జాని మౌలాలి వక్ఫ్బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై వక్ఫ్బోర్డు అనుమతిలేకుండా షాపులు ఎందుకు నిర్మిస్తున్నారు, ఎంత డబ్బులు వసూలు చేశారో చెప్పాలని కోరుతూ రహమత్ఆలీ అనే వ్యక్తికి బోర్డు సీఓ నోటీసులు ఇచ్చారు. దీనిపై జిల్లా వక్ప్బోర్డు ఇన్స్పెక్టర్ నూహ్ ఆలీషాను వివరణ కోరగా జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని నోటీసులు అందజేశామని, అయినప్పటికీ నిర్మాణం జరుగుతూనే ఉందని, దీనిపై పోలీసుల సహాయంతో నిర్మాణం ఆపేందుకు వక్ఫ్బోర్డు అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. -
మనస్పర్థలు వీడి సైనికుల్లా పనిచేద్దాం
సత్తెనపల్లి: చిన్న చిన్న మనస్పర్థలు వీడి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి గా చేసుకోవడమే లక్ష్యంగా సైనికుల్లా పని చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి అధ్యక్షత వహించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కార్యకర్తలకు ఎంతో అవమానం జరుగుతుందని, కార్యకర్తలకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఈసారి కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ప్రజలకు మేలు చేసేందుకు నాడు వలంటీర్ వ్యవస్థను రూపొందించి వారి ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేరవేశామని, ఆ సమయంలో కొందరు మనలో ఉన్న మనస్పర్థలను దృష్టిలో పెట్టుకొని వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని, కొందరు పోలీసులు అక్రమ కేసులు పెట్టడం, కొందరు అధికారులు ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని, మనం అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎవరికి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అమలు సాధ్యం కానీ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటికి టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీడీపీ అక్రమాలు, అరాచక పాలనను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలు ఏవైనా ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని, పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలను వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఒకవేళ నియోజక వర్గాల పునర్విభజన జరిగి ఒకటి రెండు స్థానాలు పెరిగినా అవి కూడా వైఎస్సార్ సీపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పోరాడాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, పార్టీ పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, బాసు లింగారెడ్డి, పక్కాల సూరిబాబు, డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, డాక్టర్ గీత హాసంతి, చల్లంచర్ల సాంబశివరావులు మాట్లాడారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కన్వీనర్లు రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీనివాసరావు, వేపూరి శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, పార్టీ నాయకులు మర్రి వెంకటసుబ్బారెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు, సంకటి శ్యాంసన్, రాజారపు శివ నాగేశ్వరరావు, చిలుకా జైపాల్, షేక్ జలీల్, తుమ్మల వెంకటేశ్వరరావు, షేక్ ముక్త్యార్, ఎమ్.ఏడుకొండలు,ఇందూరి నరసింహారెడ్డి కాల్వపల్లి బ్రహ్మారెడ్డి, గొల్లమారి వెంకట్రామిరెడ్డి, మేడం ప్రవీణ్కుమార్రెడ్డి, షేక్ జాని, సయ్యద్ గోరా, జేఎస్కే జానీ, షేక్ మహమ్మద్ గని పాల్గొన్నారు. -
అంబులెన్స్లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన మద్దుల ఏసుకుమారి(27) ఆదివారం అంబులెన్ ్సలోనే పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పూరిటి నొప్పులతో ఆమెను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం, నొప్పులు అధికంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో 108లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవ వేదనలు పెరిగి అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. అనంతరం వారిని తెనాలి ఆసుపత్రికి చేర్చగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ కేసన మహేష్ బాబు తెలిపారు. దుగ్గిరాల: మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. యువకులు మద్యం సేవించి చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు...ఆదివారం కంఠంరాజుకొండూరు గ్రామంలోని అమ్మవారి దేవస్థానం దగ్గర ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. తాడేపల్లికి చెందిన పేరుపోగు వంశీని తలపై ఇనుపు రాడ్డుతో తెనాలికి చెందిన వ్యక్తులు కొట్టగా తల పగిలింది. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మద్యం షాపు పక్కనే ఉండటం వల్ల ఆలయానికి దర్శనం కోసం వచ్చిన వారు బాగా మద్యం సేవించి గొడలు పడుతున్నారని పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. దుగ్గిరాల: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రబీ సాగు చేసిన మొక్కజొన్న, జొన్న, మినుము, నువ్వులు, పెసర పంటలు కోతలు పూర్తయ్యాయని తెలిపారు. మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి(30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతున్న నాటికలు
మూడో రోజుకు చేరిన నాటిక ప్రదర్శనలుయడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు చివరి రోజైన ఆదివారం అట్టహాసంగా కొనసాగాయి. తెలుగు నాటక పరిషత్ల సమ్మేళన సంఘం వేదిక, సుందరయ్య కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో నిర్వహిస్తోన్న ఈ కళారూపాలు సమకాలీన పరిస్థితుల్ని ఆవిష్కరించాయి. వీటితోపాటు యడ్లపాడు మానవతా సాగరి వారి ప్రత్యేక ప్రదర్శన మంచివారే కానీ..నాటిక హాస్యం, సామాజిక బాధ్యత అవశ్యం అంశాల్ని సున్నితంగా స్పృశించాయి. ఇక మూడోరోజున ముచ్చటగా ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను ఎంతో రంజింపజేశాయి. ముగింపు లేని కన్నీటి కావ్యం ‘మమ్మల్ని బతకనివ్వండి’ రెక్కలు వచ్చి ఎగిరిపోయిన పిల్లల జ్ఞాపకాల మధ్య, పెన్షన్ డబ్బులే ప్రాణాధారంగా బతుకుతున్న ఆ వృద్ధ జంటను జలప్రళయం చుట్టుముట్టగా, రక్షించాల్సిన వారే రాబందులై దోచుకున్న వైనం సమాజపు నైతిక పతనాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. కుండపోత వర్షంలో చావుకు చేరువైన భార్యను కాపాడుకునేందుకు ఆ వృద్ధుడు తన వద్దనున్న సర్వస్వాన్ని ధారపోసినా, చివరకు ఆమె మూర్ఛవ్యాధితో కన్నుమూయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించే విషాదాంతం. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవాల్సిన మానవత్వం మంటగలిసి, వాణిజ్య విలువల ముసుగులో సామాన్యుడి ప్రాణం ఎలా గాలిలో కలిసిపోతుందో ఈ నాటిక లోతైన సందేశాన్ని ఇచ్చింది. విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారు ప్రదర్శించిన ఈ నాటికకు సుఖమంచి కోటేశ్వరరావు అందించిన రచన, దర్శకత్వం వహించారు. మానవత్వం నిండుకున్న ‘మంచి మనసులు’ ఆపదలో ఉన్న తోటి మనిషిని చూసి ముఖం చాటేయకుండా, కష్ట సుఖాలను పంచుకుంటూ చేయూతనివ్వడమే నిజమైన దైవత్వమని ఈ నాటిక ఇతివృత్తం. స్వార్థం రాజ్యమేలుతున్న కాలంలో మనుషుల మధ్య కేవలం అవసరాల బంధాలే కాకుండా, అంతకు మించిన సున్నితమైన అనుబంధాలు, నిస్వార్థమైన సేవ ఉండాలని చూపిన ప్రతి సన్నివేశం మనసులను కదిలిస్తుంది. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలనే ఉన్నత ఆశయంతో, సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ సమాజం సుభిక్షంగా ఉండటానికి మానవీయ విలువలూ ప్రాణవాయువు లాంటివని ఈ నాటిక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు) వారు ప్రదర్శించిన ఈ నాటిక రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు వహించారు. తెగిన తరాల అనుబంధం ‘చిటికెన వేలు’ అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా సాగే సోమన్న జీవన పోరాటాన్ని, నాగరికత పేరిట ప్రవేశించిన దోపిడీ శక్తులు ఎలా కబళించాయో చిటికెన వేలు నాటిక అద్దం పడుతుంది. తాతా మనవళ్ల మధ్య వారసత్వంగా అందిన చిటికెన వేలు బంధం మారుతున్న కాలం తెచ్చిన కొత్త పోకడల వల్ల తెగిపోవడం..తన భూమిని, ఉనికిని కోల్పోయి సోమన్న ఒంటరివాడవ్వడం నేటి సామాజిక మార్పులోని క్రూరత్వాన్ని ఎండగట్టింది. గూడెం సంస్కృతిని మింగేస్తున్న ఆధునికతను నిరసిస్తూ, మూలాలను కోల్పోతున్న మనిషి నిస్సహాయతను ఈ కథాంశం సమాజానికి ఒక హెచ్చరికలా చాటిచెప్పింది. తెలుగు కళాసమితి(విశాఖపట్నం) వారు ప్రదర్శించిన ఈ నాటికను అట్టాడ అప్పలనాయుడు రచించగా చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వం వహించారు. -
పల్నాడు
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు.మాచర్ల: జాతినేత బాబు జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం అని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం జగ్జీవన్రామ్ సేవలు అపారమని తెలిపారు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యమైన ఆయన ఉప ప్రధానిగా ఎన్నో సేవలందించారని చెప్పారు. గిరిజనులు, దళితులు, బీసీల కోసం నిరంతరం కష్టపడ్డారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, బత్తుల ఏడుకొండలు, అబ్దుల్ జలీల్, పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, నియోజకవర్గ నాయకులు గాదె శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు యర్ర శ్రీను, బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర, జిల్లా యువజన నాయకులు నవులూరి చెన్నారెడ్డి, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నట్టువ బుజ్జి, షేక్ మస్తాన్, తిరుమల కొండ దుర్గ, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు కొండ శివలింగరాజు యాదవ్, కొత్తపల్లి కొండలు, హనిమిరెడ్డి, గాలి శ్రీని వాసరెడ్డి, దుర్గి మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నం వెంకటేశ్వర్లు, ఓరుగంటి చిన్నా, రామిరెడ్డి, మహిళా రాష్ట్ర కార్యదర్శి బూదాల మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వాల్సిన పోలీసు అధికారులు వరుస ఆరోపణలతో బజారున పడుతున్నారు. దీంతో ఆ వ్యవస్థపై విశ్వసనీయత దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగుచూసిన అనేక సంఘటనలు పోలీసు వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పల్నాడులో పోలీసు వ్యవస్థ దారితప్పుతోంది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి పోలీసుస్టేషన్లో పనిచేసిన సీఐ భాస్కర్ ఓ మహిళతో సహజీవనం చేశాడన్న ఆరోపణలపై వారం క్రితం వీఆర్కు పంపినట్టు తెలుస్తోంది. గతంలో మహిళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ సీఐ వ్యవహారాన్ని ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధికి అందించాడు. త్వరలో మీడియా ముందు బహిర్గతం చేస్తానని చెప్పాడు. అదే జరిగితే పోలీసు శాఖకు మాయని మచ్చగా మిగులుతుందని భావించిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వాస్తవానికి సీఐపై వచ్చిన ఆరోపణ తీవ్రత దృష్ట్యా సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాల్సి ఉంది. అతనికున్న రాజకీయ పలుకుబడి కారణంగా నామమాత్రపు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై పోలీసులు ప్రతి చర్యకు దిగినట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో ఫిర్యాదు చేయించి అతన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని బెదిరించి ఎలాగైనా తనకున్న పలుకుబడితో మళ్లీ దాచేపల్లికి సీఐగా రావాలని భాస్కర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. పరువు హత్యకు సహకరించిన సీఐపై వేటు... మాచర్లకు చెందిన చౌడేశ్వరి నెల కిందట నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారంలో తలదూర్చిన మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణ.. యువతి తండ్రి చంద్రశ్రీనుతో బేరం కుదుర్చుకొని యువతిని బలవంతంగా తండ్రికి అప్పగించాడు. దీంతో కుమార్తెను గత నెల 18వ తేదీన తండ్రి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం బయటకు రావడంతో సదరు సీఐ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. వైద్యురాలు సహకరించకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మీడియాలో కథనాలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో సీఐ అవినీతి బాగోతం వెలుగుచూసింది. సుమారు రూ.6.5 లక్షలు చేతులు మారినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా ఆదివారం సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సివిల్ పంచాయితీలకు ఆ స్టేషన్ అడ్డా... పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి అండతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారిచే ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. గత ఏడాది డిసెంబర్లో ఓ ఆర్యవైశ్య మహిళ పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా ఆ సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. బుకీలను తప్పించిన పోలీసులు... క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టి సారించి బుకీల ఏరివేతకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. విషయం తెలుసుకున్న జిల్లాలోని కొంతమంది అవినీతి అధికారులు ఆ సమాచారాన్ని బుకీలకు ముందుగానే చేరవేశారు. దీంతో బుకీలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వారి ఆచూకీ కోసం ఎస్బీ పోలీసులు గాలిస్తున్నా ప్రయోజనం దక్కడం లేదు. అందరి సెల్ఫోన్ సిగ్నల్లు ఇతర రాష్ట్రాలలో ఉన్నట్టు కనిపిస్తుండటంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. ఐపీఎల్, వర్డల్ కప్, ఇతర ముఖ్యమైన మ్యాచ్లు జరిగే సమయంలో బుకీల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయా స్టేషన్లలో పనిచేసే కొంతమంది అధికారులు, సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నారు. బుకీలు చిక్కితే వీళ్ల అవినీతి బాగోతం బయటపడుతుందని ముందస్తు సమాచారం ఇచ్చి పరారీకి సహకరించినట్టు సమాచారం. నేరుగా బుకీలతో సంబంధం పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఓ సీఐపై వ్యవహారంపై జిల్లా ఎస్పీ దృష్టి సారించినట్టు తెలియవచ్చింది. సస్పెన్షన్కు గురైన మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణవీఆర్కు వెళ్లిన దాచేపల్లి సీఐ భాస్కర్ 7కుటుంబంలో కలహాలు పొడచూపినా.. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు తలెత్తినా.. బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు పేట్రేగినా బాధితులకు కనిపించే ఏకై క ధైర్యం.. పోలీసులు. అలాంటిది పల్నాడు జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. అధికారం అండగా చెలగేరిపోతున్నారు. బాధితులకు అందాల్సిన న్యాయాన్ని పోలీసు స్టేషను మెట్ల వద్దే సమాధి చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన వారు అరాచకాలకు పాల్పడేవారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ సీఐ రాసలీలల బాగోతం, మరో సీఐ లంచావతారం, ఇంకో సీఐ అధికార పార్టీ దాసోహం... ఇలా జిల్లా పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మారాయి. ఇప్పటికే చిలకలూరిపేట పట్టణం పేకాటకు అడ్డాగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి జూదగాళ్లు తరలి వస్తున్నారు. నిత్యం రూ.కోట్లు చేతులు మారుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పేకాట శిబిరాలపై సీఐ దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకొని పేకాట రాయుళ్లను స్టేషన్కు తరలించాడు. ఇక్కడి రెండు వర్గాల్లో ఓ వర్గానికి మద్దతుగా రెండో వర్గం వారిపై ఇలా దాడులు జరిగాయి. కానీ ఈ వ్యవహారంలో చినబాబు వద్ద పనిచేసే వ్యక్తి కలుగుజేసుకొని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సీఐ వెనక్కితగ్గి ఆ పేకాట రాయుళ్లను కేసు లేకుండా విడిచిపెట్టాడు. మిగతా చోట్ల తనవంతు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. నరసరావుపేటలోని బరంపేటకు చెందిన తెల్లగోర్ల చందు(28) ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం చిలకలూరిపేట వైపు నుంచి పల్సర్ బైక్ వచ్చే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన చందు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రూరల్ పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిషోర్ తెలిపారు. మద్యంమత్తులో యువకుల హాల్చల్ కేసానుపల్లిలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. రోడ్డు ప్రమాదంలో చందు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న కారంపూడి, ఓబులేసులపల్లి, నరసరావుపేటకు చెందిన పలువురు యువకులు ఘటనా స్థలానికి బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కేసానుపల్లిలోని వాటర్ప్లాంట్ సమీపంలోని బెల్ట్షాపులో మద్యం సేవించారు. ఈ సమయంలో బెల్ట్షాప్ నిర్వాహకుడిపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న గ్రామస్తులపై కూడా యువకులు దుర్భాషలాడారు. గ్రామస్తులు యువకులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో చిలకలూరిపేట–నరసరావుపేట రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
కోటి విలువైన మున్సిపల్ స్థలం హాంఫట్
చదునుచేసి ఆక్రమించుకున్న అధికార పార్టీ నేతనరసరావుపేట: నరసరావుపేటలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు..దానిపై కర్చీఫ్ వేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక బరంపేటలోని కాపుల ఆరామక్షేత్రం–స్టేడియం గోడకు మధ్యనున్న రూ.కోటి విలువైన సుమారు ఏడు సెంట్ల మున్సిపల్ స్థలంపై నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడి కళ్లు పడ్డాయి. ఇతను బీసీ కాలనీలో ఉంటూ అధికార పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటాడు. రెండు రోజుల నుంచి ఈ స్థలాన్ని ప్రొక్లయినర్తో చదును చేశాడు. సమీపంలోని మహిళలు ఇదేమిటని ప్రశ్నించే ప్రయత్నం చేయగా వారిని తన రౌడీల సహాయంతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి ధర రూ.15లక్షలు ఉంటుందని చెబుతున్నారు. పట్టణంలో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. సత్తెనపల్లిరోడ్డులోని కత్తవ కాలువ స్థలాన్ని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఇటీవలనే మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనిని కూడా స్వాధీనం చేసుకొని అక్రమార్కుల నుంచి విలువైన స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ టీపీఓ సాంబయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు
మాచర్ల: వివాదాస్పద పోలీసు అధికారి తురకా వెంకటరమణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆది నుంచీ ఆయన ఎక్కడ విధులు నిర్వహించినా ఆరోపణలే. ఎక్కువకాలం ఏ స్టేషన్లోనూ పనిచేసిన దాఖలాలు లేవు. తాజాగా యువతి పరువు హత్యలో సహకరించినట్టు తేలడంతో మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. మార్చి మొదటి వారంలో మాచర్ల పట్టణానికి చెందిన కామనబోయిన చౌడేశ్వరి(21) అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చౌడేశ్వరి అదృశ్యానికి జమ్మలమడకకు చెందిన నాగరాజు కారణమని యువతి తండ్రి చంద్ర శ్రీను ఫిర్యాదు చేశాడు. తొలుత కేసు నమోదు చేయకపోగా సీఐ ప్రవర్తన సరిగా లేదంటూ చౌడేశ్వరి తల్లిదండ్రులు మాచర్ల టౌన్ పోలీస్స్టేషన్ ముందు మార్చి 10న ఆత్మహత్యాయత్నం చేశారు. తరువాత కేసు నమోదు చేసి విచారణలో చౌడేశ్వరి, నాగరాజు వివాహం చేసుకున్నారని తెలుసుకొని, వారిని స్టేషన్కు పిలిపించారు. తండ్రి చంద్ర శ్రీనుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చౌడేశ్వరి మేజర్ అయినప్పటికీ ఐదు రోజులపాటు తన పుట్టింటికి వెళ్లేలా సీఐ వెంకటరమణ బెదిరించి పంపాడు. ఇందుకోసం సుమారు రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నాడు. గత నెల 18న చౌడేశ్వరిని పరువు హత్య చేసిన తండ్రి చంద్ర శ్రీను దాన్ని ఆత్మహత్యగా ప్రచారం చేశాడు. పోస్టుమార్టంలో ఆత్మహత్యగా రిపోర్టు ఇప్పించేలా సీఐ వెంకటరమణ ప్రయత్నం చేసినప్పటికీ వీలుపడలేదు. దీంతో ఇది హత్యగా తేలింది. సీఐ పాత్రపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో చంద్ర శ్రీను, గంగ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా పరువు హత్య చేశామని, సీఐ వెంకటరమణకు లంచం ఇచ్చామని ఒప్పుకున్నారు. దీంతో యువతి మరణానికి పరోక్షంగా కారణమైన సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురు సిబ్బందిపై పల్నాడు జిల్లా ఎస్పీ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అధికారపార్టీ అండదండలతో.. 16 నెలల కిందట మాచర్లకు ఎస్ఐగా వచ్చిన వెంటరమణ పది నెలల క్రితం ప్రమోషన్ పొంది మాచర్ల టౌన్ సీఐగా పోస్టింగ్ పొందారు. ఈ ఆరు నెలల్లో అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోయారు. కర్ర పెత్తనంతో ప్రతి ఒక్కరినీ భయపెట్టడం, ఇబ్బందులకు గురిచేశారు. లోపల వేస్తా.. తాట తీస్తా.. అంటూ అందరినీ బెదిరించేవారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసుల పరిష్కారంలో భారీ మొత్తంలో అక్రమార్జన చేయసాగారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వెంకటరమణ మరింత రెచ్చిపోయాడు. రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను నాశనం చేయడం వల్లే చౌడేశ్వరి పరువు హత్యకు గురైందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ చైర్మన్ను తొలగించాల్సిందే
● తిరుమల పవిత్రతను కాపాడాలని వైఎస్సార్సీపీ డిమాండ్ ● పల్నాడు జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన పార్టీ శ్రేణులు ● వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు ● పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్తలు ● బీఆర్ నాయుడును తొలగించకపోవడంపై ఆగ్రహం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుసత్తెనపల్లిలో పూజలు చేస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి నరసరావుపేటలో పూజలు చేస్తున్న వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డిసాక్షి, నరసరావుపేట: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవిలో కొనసాగడానికి బీఆర్ నాయుడుకు అర్హత లేదని, టీటీడీ పవిత్రతను మంట గలిపిన ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. శనివారం పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో తొలుత దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ నాయుడిపై భక్తులలో ఇంత వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనేక నీచమైన పనులకు పాల్పడ్డారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా బోర్డు చైర్మన్గా కొనసాగించడం సిగ్గుచేటన్నారు. పిన్నెల్లి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసి కూడా బీఆర్ నాయుడు సమర్థించుకోవటం దారుణమన్నారు. నరసరావుపేట: టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడానికి అపవిత్రుడైన బీఆర్ నాయుడుకు అర్హత లేదని, టీటీడీ పవిత్రతను మంట గలిపిన అతడిని చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించి ఆలయ ప్రవేశాన్ని నిషేధించాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బరంపేటలోని శ్రీ లీలా వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు 101 కొబ్బరికాయలను కొట్టారు. అనంతరం గోపిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ హయాంలో వరుసగా అపవిత్ర సంఘటనలు జరుగుతున్నాయని, వాటి వల్ల బాధ కలుగుతోందన్నారు. అమరావతి: తిరుమల పవిత్రతను చైర్మన్ మంటగలుపుతుంటే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చైర్మన్ రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశాన్ని భగ్నం చేద్దామన్న కూటమి కుట్ర ఫలించలేదు. సమావేశ సమయంలో కూటమి నేత ఆలోకం సుధాకర్ అనుచరులతో వచ్చి బీఆర్ నాయుడుకు మద్దతు పలుకుతూ వాగ్వివాదానికి దిగారు. నంబూరు శంకరరావు తగిన సమాధానం ఇవ్వడంతోపాటు వెనుదిరిగారు. కూటమికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. సత్తెనపల్లి: బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని 20వ వార్డు వడ్డవల్లి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీరామాలయం, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజ కార్య క్రమాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న బీఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. టీవీ5 చానల్లో కూటమి ప్రభుత్వపు పబ్లిసిటీ కోసమే బీఆర్ నాయుడును చంద్రబాబు ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీయే ముఖ్యమైందన్నారు. -
చైతన్య ప్రబోధాలు పరిషత్ నాటికలు
యడ్లపాడు: యడ్లపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళా నిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల రెండోరోజు పోటీలు ఘనంగా జరిగాయి. శనివారం జరిగిన పోటీల్లో ప్రదర్శించిన పలు నాటికలు ఆహుతులను అలరించడమే కాకుండా ఆలోచింపజేశాయి. అస్థిత్వ పోరులో కన్నీటి సంతకం! ప్రకృతి వైవిధ్యంలోని అరుదైన వర్ణాలను అంటరానితనంతో వెలివేస్తున్న ఆధునిక సమాజపు సంకుచిత తత్వాన్ని ఎండగట్టిన కళారూపమే అమ్మచెక్కిన బొమ్మ నాటిక. సీ్త్ర, పురుష ధ్రువాల మధ్య నలిగిపోతున్న తృతీయ ప్రకృతి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవం కోసం వారు చేస్తున్న అలుపెరగని పోరాటాన్ని ఈ నాటిక చూసిన ప్రతి గుండెను తట్టి ప్రశ్నిస్తుంది. గోవాడ క్రియేషన్స్ సమర్పించిన ఈ నాటిక జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథ కాగా, డాక్టర్ వెంకట్ గోవాడ నాటకీకరణ, దర్శకత్వం వహించారు. బాధ్యతలో ఒదిగిన బంధం.. శ్రీమాత్రే నమః అమెరికా కలలు, కెరీర్ ఎదుగుదల కోరుకున్న ఓ ఆధునిక యువతి జీవితంలో జరిగిన ఓ ప్రమాదంతో ఊహించని విధంగా మళ్లీన ఆమె జీవన ప్రయాణమే సీ్త్ర మాత్రే నమః నాటిక. ఆశయాలకు, అనుబంధాలకు మధ్య నలిగిపోతున్న ఆమెకు ఒక పెద్దాయన తోడ్పాటుతో ధైర్యం చిక్కి, కన్నతల్లి కాకపోయినా తన సుఖాలను వదులుకుని త్యాగమూర్తిగా నిలిచే గొప్ప సందేశం ఇందులో కనిపిస్తుంది. స్వర్ణసూర్య డ్రామా రివర్స్ (హైదరాబాద్) వారి ప్రదర్శించిన ఈ నాటిక మూలకథ పూర్ణిమా పెమ్మరాజు రాయగా, ఉదయ భాగవతుల అందించిన అద్భుత నాటకీకరణ, దర్శకత్వం ఈ ప్రదర్శనకు ప్రాణం పోసి ఆలోచింపజేశాయి. శారీరక సౌందర్యపు పొరలు విడిచి.. మాతృత్వం! బాహ్య సౌందర్యం కోల్పోతాననే భయంతో మాతృత్వాన్ని నిరాకరించిన ఒక యువతి, విధి ఆడిన వింత నాటకంలో తన అహం వీడి అమ్మగా మారిన అద్భుత పరిణామమే ఈ నాటిక కథాంశం. శ్రీరమణా కళానిలయం (గుంటూరు) సమర్పణలో సుఖమంచి కోటేశ్వరరావు రాసిన ఈ నాటకానికి, పొగర్తి నాగేశ్వరరావు తన సునిశిత దర్శకత్వంతో దృశ్యరూపం ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. నీడలా వెంటాడే కొంత స్వార్థం! అన్యోన్యంగా ఉండే ఒక రైతు కుటుంబంలో ప్రాణప్రియమైన మరదలి వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయవద్దని వదిన అడ్డుపడటంతో తలెత్తిన మమకారాల సంఘర్షణే ఈ నాటిక ఇతివృత్తం. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుత నటనతో సామాన్యుల గుండెలను పిండేలా ఈ నాటికను అందరి మనసుల్ని తాకింది. నేటి కార్యక్రమాలు.. సుందరయ్య కళానిలయం ఆధ్వర్యాన 5వ తేదీ ఆదివారం నిర్వహించే కార్యక్రమాలు... రాత్రి 7.15 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి (విజయవాడ) వారి ‘మమ్మల్ని బ్రతక నివ్వండి’ నాటిక, 8.15 గంటలకు ఉషోదయ కళానికేతన్(కట్రపాడు) వారి ‘మంచి మనసులు’ నాటిక, 9.30 గంటలకు తెలుగు కళాసమితి(విశాఖపట్నం) వారి ‘చిటికిన వేలు’ నాటికల అనంతరం బహుమతి ప్రదానం ఉంటుంది. -
గుంటూరులో రన్ ఫర్ జీసస్
నెహ్రూనగర్: ఈస్టర్ను పురస్కరించుకొని గుంటూరు నగరంలో శనివారం ఆల్ డినామినేషన్ చర్చి యూనియన్ ఆధ్వర్యంలో వెస్ట్ పారిస్ చర్చి నుంచి రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిలు పాల్గొన్నారు. గుంటూరు మేత్రాసనం, ఆర్సీఎం ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్, ఎమినేట్ పాస్టర్ ఫెలోషిప్ పాస్టర్ పరిశుద్ధరావు, జీపీఎస్ ప్రెసిడెంట్ మోజెస్ సుగుణాకర్, పాస్టర్ బాబు ఆశీర్వాదం , పాస్టర్ జాన్సన్ రాజ్, పాస్టర్ గాబ్రియేలు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ రవివర్మ, పాస్టర్ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారి పనులు పరిశీలన
వినుకొండ: నూజెండ్లలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ శనివారం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ స్ట్రక్చర్లకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పెగ్ మార్కింగ్ ప్రక్రియపై ప్రత్యేకంగా రివ్యూ చేసినట్లు పేర్కొన్నారు. పెగ్ మార్కింగ్ పూర్తయిన తరువాత రెవెన్యూ, సర్వే విభాగాలు ల్యాండ్ సబ్ డివిజన్ రికార్డులను స్క్రూటినీ కోసం పంపిస్తాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను 15 నుంచి 20 రోజులలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే అంశంపై కూడా స్వయంగా ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించినట్లు ఆమె వెల్లడించారు. ఆమెతోపాటు వినుకొండ తహసీల్దార్ సురేష్నాయక్, అధికారులున్నారు. గుంటూరు రూరల్: వట్టిచెరుకూరు మండలంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం పర్యటించారు. సర్వే నం.241లో చెరువుతోపాటు అక్కడ ఉన్న నివాస స్థలాలు కూడా చెరువు పోరంబోకుగా నమోదై ఉండటంతో దానిని గ్రామ కంఠంగా మార్పులు చేయాలని కోరుతూ ప్రజలు గతంలో కోరారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులను త్వరితగతిన వారి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. వట్టిచెరుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి.)ను జేసీ తనిఖీ చేశారు. వైద్యం నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరును గమనించారు. శుభ్రత, మంచినీరు, మరుగుదొడ్లు వసతుల గురించి తెలుసుకున్నారు.. అత్యవసర మందులు అందుబాటు ఏ మేరకు ఉన్నాయో తనిఖీ చేశారు. మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాసరావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో పిలుపు గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా మలిదశ పోరాటానికి సిద్ధమైనట్లు గుంటూరు జిల్లా ఫ్యాప్టో నాయకులు తెలిపారు. శనివారం నగరంపాలెంలోని ఏపీటీఎఫ్–1938 జిల్లా కార్యాలయంలో సమావేశమైన ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు ఈ మేరకు కార్యాచరణ ప్రకటించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు, సెక్రటరీ జనరల్ కె.వీరాంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మొదటి విడతలో ఈ నెల 6వ తేదీన టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. రెండో దశలో ఈనెల 9న స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద ధర్నా, మూడో దశలో ఈనెల 25,26,27వ తేదీల్లో విజయవాడలో నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. నిరసన కార్యక్రమాలలో ఉపాధ్యాయులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఈవో కార్యాలయానికి వెళ్లిన ఫ్యాప్టో ప్రతినిధులు డీఈవో షేక్ సలీమ్ బాషాకు ఆయా కార్యక్రమాలపై నోటీసు అందజేశారు. సమావేశంలో ఫ్యాప్టో కో చైర్మన్ షేక్ ఫైజుల్లా, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్రావు, వై.శ్యాంబాబు, మొహమ్మద్ ఖాలీద్, జిల్లా నాయకులు మేకల సుబ్బారావు, షేక్ జిలానీ బాషా, జి.దాస్, బి. ప్రసాద్, జె.విజయానంద్ పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణలపై అప్రమత్తం
నరసరావుపేట: ఓటరు జాబితా సవరణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం మండల కమిటీ మెంబర్లు, బూత్లెవల్ ఏజెంట్లు (బీఎల్ఎ)లతో జిల్లా బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పిన్నెల్లి మాట్లాడుతూ ప్రతిపక్షాల ఓటర్లను తొలగించేందుకు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంతకై నా తెగిస్తుందన్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలని, ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలని బీఎల్ఎలకు సూచించారు. జిల్లా స్థాయి సమావేశం లాగానే నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటుచేసుకొని అందరినీ అప్రమత్తం చేయాలన్నారు. నూతన ఓటర్లను చేర్పించటంపై దృష్టి సారించాలని, త్వరగా అన్నీ కమిటీలను పూర్తిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఓటరు సవరణ ప్రక్రియ (సర్) వచ్చే మే లేదా జూన్లో ప్రారంభమౌతుందన్నారు. 2002లో ఉన్న ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని మిగతా ఓటర్లను మాపింగ్ చేస్తారన్నారు. బీఎల్ఓలతో అందరూ టచ్లో ఉండాలన్నారు. వారు సక్రమంగా పనిచేయకపోతే పార్టీ అధికారంలోకి రావటం కష్టం అన్నారు. చనిపోయిన వ్యక్తుల ఓట్లను తొలగించే ప్రక్రియలో అధికార పార్టీ వారివి కూడా తొలగిస్తున్నారో లేదో గమనించాలన్నారు. డబుల్ ఎంట్రీలు, ఎన్ఆర్ఐ ఓట్లపై అవగాహన కలిగి ఉండాలని, మైగ్రేట్ అయిన ఓటర్లను కాపాడుకోవాలన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ బూత్ కమిటీ పార్టీకి గుండెకాయ లాంటిదని అన్నారు. వారి కష్టంతోనే పార్టీ పరిస్థితి ముడిపడి ఉందన్నారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మండల కన్వీనర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ బీఎల్ఎలను నడిపించాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల్లో నిత్యం ఉండాలని సూచించారు. పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తుల ఓట్లను గమనిస్తూ ఉండాలన్నారు. బీఎల్ఓలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ మన ఓటర్లను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని అన్నారు. బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకరరెడ్డి ప్రజంటేషన్ ద్వారా పరిస్థితి వివరించారు. నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డి, పడాల శివారెడ్డి, రేపాల శ్రీనివాసరావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, బాసు లింగారెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, లీగల్సెల్ జిల్లా అధ్యక్షురాలు రోళ్ల మాధవి, బూత్ కమిటీ పల్నాడు, గుంటూరు జిల్లాల అధ్యక్షులు సుబ్బారెడ్డి, పిచ్చిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భక్తుల మనోభావాలపై పట్టింపేదీ?
చిలకలూరిపేట: బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండప ప్రాంగణంలో ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఆమె పూజలు నిర్వహించారు. ముందుగా ఎన్ఆర్టీ రోడ్డులోని నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. పూజల అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ..తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన బీఆర్ నాయుడును చంద్రబాబు నాయుడు పదవి నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. భక్తుల మనోభావాలను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. -
‘మన గ్యాస్–మన హక్కు’ కోసం పోరాడాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని సహజ వనరులను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం వల్లే గ్యాస్ సంక్షోభం ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘మన గ్యాస్–మన హక్కు’ కోసం కేంద్రంపై పోరాటం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం కోటప్పకొండ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా–గోదావరి (కేజీ బేసిన్) ప్రాంతంలో విస్తారంగా గ్యాస్, ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ వాటిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఉన్న ఈ వనరులను వినియోగించకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి అధిక ధరలకు గ్యాస్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. రాష్ట్రానికి చెందిన గ్యాస్ పైప్లైన్ల ద్వారా గుజరాత్, మహారాష్ట్రలకు తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పంపుతూ కార్పొరేట్ సంస్థలు రూ.వేల కోట్ల లాభాలు పొందుతున్నాయన్నారు. 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి గ్యాస్, ఆయిల్పై సగం హక్కు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సాధించేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి రాష్ట్ర హక్కులను సాధించాలన్నారు. ఇక ఐటీ రంగంపై మాట్లాడిన ఆయన ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులు ఉద్యోగాలపై వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. పెద్ద కంపెనీలు ఉద్యోగాల తొలగింపులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు భద్రత కల్పించే విధానాలు తీసుకురావాలని కోరారు. ‘మన గ్యాస్–మన హక్కు’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు వి.శ్రీనివాసరావు ప్రకటించారు. -
దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ తాడేపల్లిరూరల్: ఇటీవల దళితులపై దాడిచేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మార్చి 18వ తేదీ కొత్త అమావాస్య రోజు నర్సీపట్నం నూకాంబిక జాతరలో డప్పు కొట్టే నాగులాపల్లి రాందాస్ అనే దళితుడిపై అయ్యన్న పాత్రుడు దాడి చేయడం తగదని అన్నారు. నర్సీపట్నం ఎస్సీ కాలనీ మూడో వార్డుకు చెందిన టీడీపీ సానుభూతి పరుడు రాందాస్ను తిట్టినా, కొట్టినా చెల్లుతుందని అయ్యన్నపాత్రుడు దళితులపై రెచ్చిపోతున్నారని విమర్శించారు. మార్చి 31, ఏప్రిల్ 1న నర్సీపట్నంలో మరిడిమాంబ జాతర తానే స్వయంగా జరిపి పదిమంది డప్పు కళాకారులు కావాలని రిక్షా కార్మికుడు, డప్పు కళాకారుడు అయిన భాస్కరరావును మాదిగ సామాజికవర్గ వ్యక్తితో ఒప్పందం చేసుకుని వాళ్లలో ఎనిమిది మందే వచ్చారని వారిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహించిన బూతులు తిట్టి అవమానించారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో బాధ్యత గల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండి ఈ దాడులు చేయడం సిగ్గుచేటని, వెంటనే దళితులపై దాడిచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెనాలిరూరల్: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చుండూరు సమీపంలో శనివారం జరిగింది. బాపట్ల జిల్లా అమృతలూరుకు చెందిన కొల్లూరి వీరరాఘవులు(70) చుండూరు స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గలకారణాలను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. గుంటూరు మెడికల్: రోగి మెలుకువగా ఉండగానే గుండె బైపాస్ సర్జరీ చేసి అతడి ప్రాణాలు కాపాడినట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్బాబు చెప్పారు. ఆపరేషన్ వివరాలను ఆయన శనివారం గుంటూరులో మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన జయరావు(64)కు 2018లో కేన్సర్ సోకి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఏర్పడటంతో ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఇటీవల చాతిలో తీవ్రమైన నొప్పి వచ్చి, తమ వద్దకు రాగా..యాంజియోగ్రామ్ చేసి, 3 రక్తనాళాలు పూడినట్లు నిర్థారించామన్నారు. రోగికి గుండె బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించి, ఊపిరితిత్తుల సమస్య ఉండి, ఒక లంగ్ తీసివేయడంతో, రోగి మెలుకువగా ఉండగానే బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించామన్నారు. రెండు రోజుల క్రితం కరోనరి ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ను విజయవంతంగా చేసినట్లు తెలిపారు. జయరావుకు మధుమేహం, బీపీ కూడా ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగికి తాము విజయవంతంగా బైపాస్ సర్జరీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్ డిప్యూటీ ఎండీ డాక్టర్ రాయపాటి మమత, ఆపరేషన్లో పాల్గొన్న గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జయరామ్పాయ్, సీనియర్ మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ లోకనాథన్, వైద్యులు శివప్రసాద్, మృత్యుంజయ్, అశోక్కుమార్, భరత్ సిద్ధార్థ, శ్రీకాంత్ మహాపాత్ర, క్లస్టర్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. బాపట్లటౌన్: ఏన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు తూట్లు పొడవటం సరికాదని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. దళిత హక్కుల సాధన కోసం శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేశారు. నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు కూడా యాంటీ స్పెటర్ బెయిల్ ఇవ్వకూడదని చట్టం చెబితే అగ్రకుల అరాచక శక్తులను రక్షించడానికి మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఏడు సంవత్సరాల శిక్ష పడే వీలున్న ఎస్సీ ఎస్టీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతుందన్నారు. ఆందోళన చేసిన వారిలో మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, వివిధ సంఘాల నాయకులు పట్రా బంగారం, మేడికొండ మురళి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుద్దే రాజారావు పాల్గొన్నారు. -
ప్రజల్లోకి సుందరయ్య ఆశయాలు
యడ్లపాడు: సుందరయ్య ఆశయాలను కళారూపాల ద్వారా సమాజంలోకి తీసుకెళ్తామని కళానిలయం స్థాపక అందుకే చేసినట్లు తెలుగు నాటక కళాపరిషత్ల సమ్మేళన సంఘం వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు చెప్పారు. యడ్లపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళా నిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల రెండోరోజు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ఉత్తమోత్తమ ప్రదర్శలను ఎంపిక చేసి ఇక్కడకు తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామస్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కళాభిమానులు, నాటక పరిషత్తుల నిర్వాహకులు రోజుకు 2500 మంది రావడం సంతోషదాయకమన్నారు. ముందుగా పరిషత్ నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు దాతలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించగా, అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు తమ అభ్యుదయ గీతాలతో సుందరయ్యకు కళాంజలి సమర్పించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు జరుగుల రామారావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, ఉపాధ్యక్షులు జరుగుల శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ముత్తవరపు రామారావు, కార్యదర్శి నూతలపాటి మాధవరావు, సహాయ కార్యదర్శి చెరుకూరి సృజన, కోశాధికారి షేక్ బాజి, సభ్యులు నంబూరి శ్రీనివాసరావు, ముత్తవరపు పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, చెన్నుపాటి హనుమంతరావు, కల్లూరి సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు, నూలు మిల్లు ఈడీ సామినేని ఫణికుమార్ ఉన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
నరసరావుపేట రూరల్: మండలంలోని ములకలూరులో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామ శివారులోని వాగు పోరంబోకు భూముల్లో కొన్ని రోజులుగా ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. మూడు జేసీబీ మిషన్లను ఉపయోగించి మట్టిని తవ్వి పదుల సంఖ్యలో లారీలతో మట్టిని బయటకు తరలిస్తున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా సాగుతున్న అక్రమ తవ్యకాలపై గ్రామస్తులకు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేదు. కూటమి నాయకులు అక్రమ తవ్యకాలు నడిస్తుండటంతో అధికారులు అటువైపు చూసేందుకు జంకుతున్నారు. మట్టిని టిప్పర్ల ద్వారా నరసరావుపేటకు తరలించి విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్కు రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. పార్లమెంట్ ప్రజాప్రతినిధికి చెందిన కార్యాలయం నిర్మాణానికి మట్టి అవసరమని చెప్పి కూటమి నాయకులు ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. అక్రమ మట్టి తవ్యకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఎంఐఎం నాయకులు, మీడియా ప్రతినిధులపై నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. -
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
ప్రత్తిపాడు: వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో బోల్తా కొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెదనందిపాడు మండలం రావిపాడు శివారులోని పొలాల్లో మిర్చి కోతలు కోసేందుకు శనివారం ఉదయం ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామానికి చెందిన సుమారు 25 మంది వ్యవసాయ కూలీలు ట్రాక్టర్పై పొలానికి బయల్దేరారు. రావిపాడు–వంగిపురం డొంక రోడ్డులోని పెద్ద గొయ్యిలో ట్రాక్టర్ వెనుక చక్రం పడటంతో ట్రక్కు పక్కకు ఒరిగింది. డ్రైవర్ ట్రాక్టర్ను అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న బోధి కాలువలోనికి ట్రాక్టర్ ట్రక్కు పడిపోయింది. ప్రమాదంలో ట్రక్కులో ఉన్న పాతిక మంది కూలీలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఏడుగురికి గాయాలు ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న గాండ్ల సీతారావమ్మ, ఉల్లంగుల అంజలి, అల్లూరి దుర్గ, ఉల్లంగుల వరలక్ష్మి, కొండేపాటి శివమ్మ, షేక్ జాన్బి, జి. స్వాతిలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్తో పాటు వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వారిలో నలుగురికి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. -
‘అందుకే మన పోలీసులు దేశంలో చివరి ర్యాంకులో..’
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అందుకే మన పోలీసులు దేశంలో చివరి ర్యాంకులో ఉన్నారని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఎక్కడ చూసినా మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు ప్రతి రక్షణ కల్పించామనే విషయాన్ని గుర్తుచేశారు విడదల రజిని. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేశారని, అందుకే పోలీసింగ్ లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి ర్యాంకులో నిలిచిందనే విషయాన్ని స్సష్టం చేశారు. ఆ సమయంలో ఎన్నో బెస్ట్ అవార్డులు మన పోలీసులు అందుకున్నారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనను నడిపిస్తుందని, అందుకే దేశంలో చివరి స్థానంలో మన పోలీస్ వ్యవస్థ నిలిచిందన్నారు. -
ఆంఽధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం మావిగన్
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం ‘మావిగన్’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో ఆమెతో కలసి అంబటి రాంబాబు శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేడు రాష్ట్రమంతటా వైఎస్సార్ సీపీ అధినేత ప్రతిపాదించిన మావిగన్ గురించే ముమ్మరంగా చర్చించుకుంటున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారం అమరావతి రాజధాని పూర్తి చేసేందుకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇది ఏ మాత్రం పూర్తి చేయలేని పథకం అని వివరించారు. ప్రొఫెసర్ రామచంద్రయ్య అమరావతి గురించి మాట్లాడుతూ తాను ప్రపంచంలో ఎన్నో పట్టణాలు చూశానని, అయితే అమరావతి వంటి పట్టణాన్ని చూడలేదని తెలిపినట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన మాటల ప్రకారం ఎక్కడైనా నదుల నుంచి నీటిని తోడి చెరువులకు పెడతారని, అమరావతిలో మాత్రం నీళ్లు తోడి నదిలో పోయాల్సి వస్తున్నదని తెలిపినట్లు చెప్పారు. అమరావతి లోతట్టు ప్రాంతమని, అది పూర్తయ్యే అవకాశం ఏ మాత్రం లేదని చెప్పారు. అమరావతిని మార్చడానికి వీలులేకుండా ఎందుకు చట్టం తెచ్చారని ప్రశ్నించారు. మీరు తిరిగి అధికారంలోకి రాలేమనే నమ్మకమా? లేక మీరు చట్టం చేస్తే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారు చట్టం మార్చలేరనా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజకీయ పరిజ్ఞానం ఉందని భావించే వారు అమాయకులని వెల్లడించారు. రాజకీయ పరిజ్ఞానం, అభివృద్ధిపై పట్టు ఉంటే గుంతలో రాజధాని ఎందుకు పెడతారని ప్రశ్నించారు. వర్షం వస్తే నిండిపోయే చెరువులాంటి అమరావతిలో రాజధాని ఎందుకు కడతారని నిలదీశారు. కేవలం స్వార్థం, డబ్బు సంపాదన, కొడుకును అధికారంలోకి తీసుకురావాలనే కోరికతోనే ఇలాంటి పనులకు పాల్పతున్నారని ఆరోపించారు. అమరావతి పూర్తి అయ్యే ప్రాజెక్టు కాదని, అది మనల్ని అగాథంలోకి దించే ప్రాజెక్టు అని అభివర్ణించారు. పోలీసుల తీరు అమానుషం రాష్ట్రంలో పోలీసుల తీరు అమానుషంగా ఉందని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు సంఘాన్ని హింసిస్తున్నారని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతిలో తంబిరెడ్డిని మఫ్టీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను చితక్కొట్టి, హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాక మాత్రమే కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. తన ఇంటిపై 7 గంటల 20 నిమిషాల పాటు టీడీపీ దుండగులు దాడి చేస్తే.. జిల్లా ఎస్పీ ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని గుర్తుచేశారు. తనను మాత్రం 18 రోజుల పాటు జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల తీరు ఏ మాత్రం సరిగా లేదని, అలాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిందో ఇటీవల నరసరావుపేట ఎస్పీ కార్యాలయం లోపలివైపు నుంచి టీడీపీ ఎమ్మెల్యే తాళం వేసిన సంఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ సంఘటనలో స్వయంగా పోలీసు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వచ్చి తలుపులు పగలగొట్టించాల్సి రావడం హాస్యాస్పందంగా ఉందన్నారు. తనపైన, మాజీ మంత్రి విడదల రజినిపైన, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన అనేక తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. అయితే ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. న్యాయపోరాటంతోపాటు ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అరాచక పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చి వేస్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేశారు. -
కాబోయే జంటను బలిగొన్న ప్రమాదం
దుర్గి: ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న తరుణంలో కాబోయే జంటను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని ఓబులేశునిపల్లె ప్రధాన రహదారి పక్కన రైస్ మిల్లు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన నేలపాటి సందీప్ (21), నరసరావుపేట ప్రాంతానికి చెందిన సౌమ్య (20)లకు 20 రోజుల క్రితం నిశ్చయతాంబూలం తీసుకున్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని మొక్కు తీర్చుకునేందుకు నాగార్జున సాగర్ సాగర్మాత ఆలయానికి వెళ్లారు. మొక్కు తీర్చుకొని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణం అయ్యారు. ఓబులేశునిపల్లె రైస్ మిల్లు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వారి బైకు ఢీ కొంది. ఇరువురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం మృతదేహాలను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


