ఆర్టీసీ తిరునాళ్ల ఆదాయం రూ.1.50 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ తిరునాళ్ల ఆదాయం రూ.1.50 కోట్లు

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

ఆర్టీసీ తిరునాళ్ల ఆదాయం రూ.1.50 కోట్లు

ఆర్టీసీ తిరునాళ్ల ఆదాయం రూ.1.50 కోట్లు

ఆర్టీసీ తిరునాళ్ల ఆదాయం రూ.1.50 కోట్లు

నరసరావుపేట: కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆర్టీసీకి రూ.1.50కోట్ల ఆదాయం లభించినట్లు ఆ సంస్థ జిల్లా ప్రజారవాణా అధికారి టి.అజితకుమారి చెప్పారు. మంగళవారం ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. మహా శివరాత్రికి జిల్లా వ్యాప్తంగా 460 బస్సులను నడపటం ద్వారా 4.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయటం జరిగిందన్నారు. గతేడాదిలో 4 లక్షల మంది ప్రయాణికులను చేరవేయటం ద్వారా రూ.1.22 కోట్ల ఆదాయం లభించిందన్నారు. నరసరావుపేట డిపో ద్వారా మూడు లక్షల మంది ప్రయాణికులను కొండకు చేరవేయటం ద్వారా రూ.90 లక్షల ఆదాయం రాగా గతేడాది 2.89 లక్షల మంది ప్రయాణికులను చేరవేసి రూ.71లక్షల ఆదాయం వచ్చిందన్నారు. చిలకలూరిపేట బస్‌డిపో ద్వారా 65 వేల మంది ప్రయాణికులను చేరవేసి రూ.12.50 లక్షల ఆదాయం వచ్చిందని, గతేడాది రూ.17లక్షలు ఆదాయం సమకూరిందన్నారు. వినుకొండ డిపో ద్వారా 16వేల మంది భక్తులను కొండకు చేరవేయటం ద్వారా రూ.12.50 లక్షల రాగా, గతేడాది 7,200 మంది ప్రయాణికుల ద్వారా రూ.9.20 లక్షల ఆదాయం సమకూరిందని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement