breaking news
Palnadu District News
-
మెగా..పెద్ద దగా
● నేడు మెగా పేరెంట్స్–టీచర్స్ 3.0 మీటింగ్ ● చంద్రబాబు ప్రభుత్వం మరో ప్రహసనం ● సమస్యల పరిష్కారానికి చర్యలు శూన్యం ● తాగునీటి కోసం విద్యార్థుల అవస్థలు ● మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో బాలికల కష్టాలు ● ఇవేమీ పట్టని ప్రభుత్వంఈ చినిగిన బ్యాగ్ చూడండి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే బ్యాగ్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని హ్యాండిల్స్ ఊడిపోకుండా బాగా స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. దానికి భిన్నంగా బ్యాగ్లు నాసి రకంగా ఉన్నాయి. కొద్ది రోజులకే చినిగిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆంక్షలు లేవు. నిబంధనలు ఉండవు. ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల ఆదాయం, 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, భూములు, కార్లు, చిరుద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, తదితర వారికి తల్లికి వందనం లేదని తేల్చి చెప్పేశారు. సత్తెనపల్లి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితులు తెలుసుకునేందుకు పై ఉదాహరణలు చాలు. చంద్రబాబు ప్రభుత్వం అటు పాఠశాలలు, ఇటు విద్యార్థులను మోసం చేసింది. ఇప్పుడు గొప్పల కోసం మెగా పేరెంట్స్, టీచర్స్ 3.0 మీటింగ్ అంటూ హడావుడి చేస్తోంది. దీనికే సమయం అంతా కేటాయించడంతో 10 రోజులుగా పాఠాలు చెప్పేవారు కరువై మెగా కాస్త దగాగా మారిందని పలువురు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారలేదు. ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులతో పోటీపడేలా చూడాల్సిన ప్రభుత్వం ఆ పనులను పక్కనపెట్టి ప్రచార ఆర్భాటానికి తెర తీయడంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. డిసెంబర్ నెల ప్రారంభమైనప్పటికీ సిలబస్ పూర్తి కాలేదు. 100 రోజులుగా మెగా పీటీఎం 3.0 పనులే సరిపోయాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పరిష్కారం కాని సమస్యలు... ● పాఠశాలల్లో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● మరుగుదొడ్లు సమస్య పలు పాఠశాలలను వేధిస్తోంది. ఉన్న మరుగుదొడ్లు సరిపోక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ● ముఖ్యంగా వర్షాలకు నీరు నిలిచి పాఠశాలలోకి వెళ్లాలంటే అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సత్తెనపల్లి 31వ వార్డులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల మోంథా తుఫాన్కు వర్షం నీరు నిలిచి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడ్డారు. ● పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పనిచేయక తాగునీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు ఉన్నా ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారాయి. ● పాఠశాలల్లో అనేక రకాల సమస్యలు ఉన్నా, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చిన వైఎస్ జగన్ నాడు–నేడు కింద గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చింది. ఈ ప్రభుత్వం పైసా కూడా ఖర్చు పెట్టలేదు. పాలకుల నిర్లక్ష్యంతో నాడు–నేడు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జిల్లా పరిధిలో రూ. 165 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నాడు–నేడు మొదటి దశలో 746 పాఠశాలల్లో పనులు చేపట్టాల్సి ఉంది. 88 పాఠశాలలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. రెండో దశలో 629 పాఠశాలలకు గాను కేవలం 33 పాఠశాలల్లోనే పనులు పూర్తి చేశారు. 233 పాఠశాలల్లో అసలు పనులే ప్రారంభించని దుస్థితి. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పొన్నూరు: పట్టణంలోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి వార్లను గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, సతీసమేతంగా సందర్శించారు. 9గుంటూరు ఎడ్యుకేషన్: జనవరిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ను డాక్టర్ గజల్ శ్రీనివాస్ కోరారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. -
ప్రచారార్భాటం మీ కోసమే!
తూతూ మంత్రంగా ‘రైతన్నా..మీ కోసం’ కార్యక్రమం● చంద్రబాబు సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు సిద్ధమైన అన్నదాతలు ● నూజెండ్ల మండలం తలార్లపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును నిలదీసిన రైతులు ● ఏ పంటకు గిట్టుబాటు ధర లేదంటూ ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలు ● మిగిలిన గ్రామాలలోనూ నిలదీస్తారన్న భయంతో తూతూ మంత్రంగా ముగించేసిన వైనం ● ఒక్క రైతు సమస్య తీర్చని ప్రభుత్వం సాక్షి, నరసరావుపేట: అరకొర దిగుబడులు... పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..దీంతో రైతు పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే అదీ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పథకాలను ప్రచారం చేయడం, రైతుల ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ‘రైతన్నా..మీ కోసం’ అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల 29న నూజెండ్ల మండలం తలార్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును రైతులు నిలదీసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సొంతపార్టీకి చెందిన రైతులే ఇలా మాట్లాడటం గమనించిన ప్రజాప్రతినిధులు రైతుల వద్దకు వెళ్లాలంటే ఆలోచనలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా తూతూమంత్రంగా సచివాలయ ఉద్యోగులతో కార్యక్రమాన్ని ముగించారు. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు రైతుల వద్దకు వెళ్లి ప్లెక్సీ లు పెట్టి ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలు ఇచ్చి ఫొటోలు దిగారు. రైతన్నా మీ కోసం విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుకోవడం విస్మయం కలిగిస్తోందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. సమస్యలు తీర్చకపోగా కనీ సం బాధలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కర్షకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,80,181 మందికి నగదు జమ చేశారు. ప్రస్తు తం అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య 2.41 లక్షలుగా ఉంది. ఏకంగా 40వేల మంది లబ్ధిదారు ల సంఖ్య తగ్గిపోయింది. అన్నదాత సుఖీభవ పథ కం ద్వారా రైతులకు రూ.20 వేలు అందజేస్తామన్న చంద్రబాబు గెలిచాక గతేడాది పథకం అమలు చేయలేదు. కౌలు రైతులకు సుఖీభవ అందజేస్తా మని హామీ ఇచ్చి అమలు చేయకుండా సుమారు 1.60 లక్షల మంది కౌలు రైతులను మోసం చేశారు. ఏడాదిన్నారగా వ్యవసాయం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మిర్చి, పత్తి, పొగాకు, కంది పంటల రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెటింగ్ సౌక ర్యం లేక తీవ్రంగా నష్టపోయారు. రైతులు రోడ్డెక్కి విత్తనాలు, ఎరువులు కావాలని అడిగే దుస్థితి ఏర్పడింది. బస్తా యూరియా కోసం కుస్తీ లు పడాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే ఎరువులు సరఫరా చేసి మిగిలిన వాటిని బ్లాక్ మార్కెట్కు తరలించారు. అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటలను ప్రకృతి ప్రకోపాలకు గురై తీవ్రంగా నష్టపోయారు. వారిని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలులో ఉండేది. నష్టపోయిన రైతుకు అదే సీజన్లో నష్టపరిహారం అందేంది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో ప్రస్తుతం అందరికి పరిహారం అందడం లేదు. మరోవైపు పండించిన పంటలను అమ్ముకోవడంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మిర్చి, పత్తి, పొగాకు రైతుల బాధలు వర్ణనాతీతం. సీసీఐ నిబంధనలతో పత్తి పంటను అమ్ముకోలేక రైతులు తమ పొలాలను దున్నేస్తున్న ఘటనలు చూస్తున్నాం. వరి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. -
గురువుల జేబుకు చిల్లు!
సత్తెనపల్లి: ఈ నెల 5న ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్– టీచర్స్ డే (పీటీఎం) 3.0 కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండగా, అరకొర నిధుల కేటాయింపుపై గురువులు పెదవి విరుస్తున్నారు. దీని నిర్వహణకు పరిమితంగా నిధులు కేటాయించి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ నుంచి ఖర్చు పెట్టుకోమని ప్రభుత్వం చెబుతోంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న దీని వెనుక టీడీపీ ప్రభుత్వ ప్రచారం దాగి ఉంది. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ. 900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా మార్కెట్లో ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయి చాచమని పరోక్షంగా చంద్రబాబు సర్కార్ సూచిస్తోందని, గురువుల జేబులకు చిల్లు పడటం ఖాయమంటూ పలువురు మండిపడుతున్నారు. డబ్బులు లేకుండా పండుగ ఎలా? ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎం 3.0 ను పండుగలా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి స్కూలు ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రోగ్రెస్ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్న ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని గురువులు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం 3.0 నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి... జిల్లాలో 1,568 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,40,761 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తొమ్మిది ఉన్నాయి. వీటిల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 992 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 829 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం 3.0 నిర్వహణకు జిల్లాకు రూ.38,99,250 నగదును విడుదల చేస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఎంత కేటాయిస్తారో చెప్పలేదు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం పండుగలా చేయాలంటే ఈ నిధులు చాలవని ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. మెగా పీటీఎం 3.0 సమావేశ నిర్వహణకు నిధులు పెంచాలి. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలి. ఈ సమావేశ ఫొటోలు, వీడియోలు యాప్లలో అప్లోడ్ లేకుండా చేసినట్లు అయితే సమావేశం ఉద్దేశం నెరవేరుతుంది. – మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాఠశాల బోధన సమయం చాలా వృథా అవుతోంది. మెగా పీటీఎం సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తే బాగుంటుంది. ప్రతి ఈవెంట్ని లీప్ యాప్లో అప్లోడ్ చేయటం ప్రధానోపాధ్యాయులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. –బంకా వాసుబాబు, పీఆర్టీయూ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి -
పల్నాడు
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025చైర్పర్సన్ వైఖరితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కుంటుపడుతున్న అభివృద్ధి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 579.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,445 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.దాచేపల్లి: కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి గొప్ప చరిత్ర ఉందని, ఈ విషయాన్ని పల్నాడులోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరిని అడిగినా చెబుతారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. కాసు కుటుంబ చరిత్ర తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి సూచించారు. కాసు కుటుంబంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆయన తీవ్రంగా ఖండించారు. కాసు కుటుంబ చరిత్ర, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి పలు దిన పత్రికలలో రాసిన కథనాలను ఆయన చదివి వినిపించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు తాను, ఎమ్మెల్యే కూడా పుట్టి ఉండమని చెప్పారు. పుస్తకాలు, వ్యాసాలు చదివితే చరిత్ర తెలుస్తుందన్నారు. రాష్ట్ర సమగ్రత కోసం పదవీ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి అని, జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయ్యేందుకు భగీరథ ప్రయత్నం చేశారని తెలిపారు. సీఎంగా ఉండగానే సాగర్ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందించారని గుర్తుచేశారు. ఆ రోజుల్లోనే రూ.10 కోట్ల హడ్కో రుణాలు ఎల్ఐసీ ద్వారా పొంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బలహీనవర్గాల వారికి ఇళ్లు కట్టించిన ఘనత కాసు బ్రహ్మానందరెడ్డికే దక్కుతుందని వివరించారు. 1970లో 70 బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాసు బ్రహ్మానందరెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఎవరో రాసిచ్చింది చదివితే అది చరిత్ర కాదన్నారు. వరికపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అన్ని రకాల అనుమతులు తమ ప్రభుత్వంలో తెచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించామని గుర్తుచేశారు. గతంలో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పదవిలో ఉన్నా ఎందుకు అనుమతులు తీసుకురాలేదని ప్రశ్నించారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్, టీడీపీ ప్రజాప్రతినిధుల తీరుతో జెడ్పీటీసీలు ఏళ్ల తరబడి పనులు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తోంది. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి జెడ్పీతోపాటు కేంద్ర నిధుల్లోనూ వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్, జనరల్ బాడీ సమావేశాలకు హాజరై అజెండాల ఆమోదానికి పరిమితమవుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధ్యాన్యత ఇస్తూ చైర్పర్సన్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సమావేశాలను అడ్డుకుంటున్నారు. గతంలో సర్వసభ్య సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన జెడ్పీటీసీలు గత నెల 26న ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. కీలకమైన ప్రణాళిక, ఆర్థిక అంశాలతో కూడిన సమావేశాల అజెండాలను తిరస్కరించడం ద్వారా జెడ్పీలో ఏకపక్ష వైఖరిపై యుద్ధం ప్రకటించారు. ప్రచ్ఛన్న యుద్ధం జెడ్పీలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాకు, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జెడ్పీటీసీగా గెలిచాక చైర్పర్సన్ పీఠాన్ని అధిష్టించి, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారిన హెనీ క్రిస్టినా వైఖరితో జెడ్పీటీసీలు తీవ్రంగా విభేదిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ మండలాల్లో పనులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును సహించలేక పోరుకు సిద్ధమయ్యారు. ఎవరితోనూ పనిలేకుండానే... జెడ్పీ వార్షిక బడ్జెట్లో ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులకు 2025–26 బడ్జెట్లోనే కేటాయింపులు పూర్తయ్యాయి. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సైతం పనులు కేటాయించేశారు. పరిస్థితి ఈ విధంగా ఉండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్పర్సన్కు సిఫార్సులు పంపడం, వాటిని చైర్పర్సన్ వెంటనే ఆమోదించేయడం పరిపాటిగా మారింది. జెడ్పీటీసీలతో చర్చించకుండా నేరుగా స్టాండింగ్ కమిటీ, అక్కడి నుంచి జనరల్ బాడీ సమావేశాల అజెండాల్లో పొందుపర్చి ఆమోదింపచేసుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అజెండాపై సభ్యులతో చర్చించి, వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి భిన్నంగా కోరం అయిందా, లేదా అని చూసి ఆమోదించేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో.. జెడ్పీటీసీలకు తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో చైర్పర్సన్ పెద్ద సంఖ్యలో కేటాయింపులు జరిపేశారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... వేమూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలతో రూ.29.30 లక్షలు, నరసరావుపేట ఎమ్మెల్యే సిఫార్సులతో రూ.20 లక్షలు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదనలతో రూ.30 లక్షలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాదనలతో అత్యధికంగా రూ.కోటి పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా రూ.30 కోట్ల మేరకు ముందస్తు అనుమతులతో పనులు కేటాయించడంతో భగ్గుమన్న జెడ్పీటీసీలు వాటిని అడ్డుకున్నారు. 7ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం కావడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులను పక్కనపెట్టి జెడ్పీని వాడుకుంటున్న పాలకుల తీరుతో జిల్లా ప్రజా పరిషత్ పేరు, ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి. -
వైభవంగా ప్రసన్నాంజనేయుని వ్రత మహోత్సవం
బెల్లంకొండ: బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హనుమత్ వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్రత మహోత్సవాల సందర్భంగా దేవదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. కార్తిక మాసంలో స్వామివారి దీక్షలను చేపట్టిన మాలధారులు మండల కాలం దీక్ష చేసి బుధవారం స్వామివారికి ఇరుముడులను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ చార్యులు, అనంతాచార్యులు వ్రత పూజల అనంతరం విశేష అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వామివారి సంకీర్తన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవో సనిమెళ్ల కోటిరెడ్డి, ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆసుల జగన్, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
వైభవంగా పునీత శౌరి తిరునాళ్ల
ప్రత్తిపాడు: వట్టిచెరుకూరు మండలం ముట్లూరులోని పునీత శౌరి తిరునాళ్ల మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. నవంబరు 24వ తేదీన జెండా ప్రతిష్టతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరిగిన ఉత్సవాలు బుధవారం రాత్రి జరిగిన సమిష్టి దివ్య పూజాబలితో ముగిశాయి. ఫాదర్ మార్నేని దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజాబలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్యతో పాటు ఆయా చర్చిల ఫాదర్లు, గురువులు హాజరై సమిష్టి పూజాబలిని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన విశ్వాసులు పుణ్యక్షేత్రం ఆవరణలో ఒత్తుల ప్రదక్షిణను దేవుని స్తుతిస్తూ చేపట్టారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లయబద్దంగా వాయిస్తున్న కళాకారుల విన్యాసాలు, కోలాట ప్రదర్శనలు, కర్ర సాములను తిలకించేందుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. తిరునాళ్లకు గ్రామానికి విచ్చేసిన బంధువులతో ఊరంతా సందడితో కళకళలాడింది. రాత్రి పది గంటల సమయంలో పునీతశౌరి వారిని స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు. గీతాలాపనలు చేశారు. తేరు ప్రదక్షిణలో వందల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ సంతకాలతో భూముల విక్రయం
రౌడీ షీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతుల డిమాండ్ మంగళగిరి టౌన్ : రైతుల భూములను చేజిక్కించుకునే లక్ష్యంతో సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ దస్తావేజులు సృష్టించి భూములు విక్రయించిన రౌడీ షీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని చినకాకానిలో బుధవారం ఈ ఘటనపై రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సర్వే నెం. 182/1లోని 10 ఎకరాల 25 సెంట్ల వ్యవసాయ భూమిపై నకిలీ దస్తావేజులు సృష్టించి, రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరులకు కోట్లాది రూపాయలకు విక్రయించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన సహచరులతో కలసి భూమిలోకి చొరబడి రైతులను బెదిరించిన ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైందని పేర్కొన్నారు. రైతులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. రైతుల భూములపై నకిలీ పత్రాలు సిద్ధం చేసి తప్పుడు నమూనా సర్వేలు చూపిస్తూ భూమిని వదిలివేయాలని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. పలువురు రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయితీ, రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేయడం వంటి చర్యలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రౌడీషీటర్ జలీల్, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటేశ్వరరావు, నరసింహారావు, శివన్నారాయణ, కొండలరావు, శ్రీనివాసరావు, ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
బొల్లాపల్లి: పునీత ఫ్రాన్సిస్ శౌరి మహోత్సవాలను పురస్కరించుకుని బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 15 టీంలు పాల్గొన్నాయని, వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగవ స్థానాల్లో బాపట్ల, బేతపూడి, మాచవరం, యడ్లపాడు జట్లు గెలుపొందాయని నిర్వాహకులు కె. ప్రకాష్రావు, సీహెచ్ రాజేశ్వరరావులు తెలిపారు. ప్రథమ బహుమతి బాపట్ల జట్టుకు శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ 30,116, ద్వితీయ శివ శక్తి లీలా అంజన్ ఫాండేషన్ రూ. 25,116లు చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెవ ఫాదర్ వై. జాకోబ్ రెడ్డి, జాన్ శేఖర్, గ్రామ సర్పంచ్ కె. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని గుంటూరు బ్రాడీపేట 2వ లైన్లోని భవిత స్కూల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి వివరించారు. వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. చిన్నారులు ఆత్మనూన్యతాభావానికి గురికాకుండా చదువుపై శ్రద్ధ వహించి, పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారులతో స్నేహభావంగా మెలిగి, ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం స్థానిక చిన్నారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ప్యానెల్ అడ్వకేట్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ ఎన్.శ్రీనివాసరావు, రిసోర్స్పర్సన్ సువర్ణ లత, హెచ్ఎం ఎండీ అస్సన్ బేగ్, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ -
బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్
స్క్రబ్ టైఫస్ కీటకం కుట్టిన వెంటనే నొప్పి ఉండదు. మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. 6 నుంచి 21 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడిదగ్గు, జీర్ణ సమస్యలు ఉంటాయి. ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యనభ్యసించే విద్యార్థినికి అక్టోబర్ 16న జ్వరం రావడంతో మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ నవంబర్ 1న మృతి చెందింది. అలాగే రాజుపాలెం ఆర్ఆర్ సెంటర్కు చెందిన యాగసిరి.నాగమ్మ(65) నవంబర్లో జ్వరంతో గుంటూరు జీజీహెచ్లో చేరింది. 10 రోజుల క్రితం ఆమె మృతి చెందింది. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన బట్టు సాలమ్మ జ్వరంతో గుంటూరు జీజీహెచ్లో చేరి చికిత్స పొందింది. ఆమె కోలుకుని పది రోజుల క్రితమె ఇంటికి వచ్చింది. సత్తెనపల్లి: జిల్లా ప్రజలను స్క్రబ్ టైఫస్ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు జిల్లాలో 11 మంది ఉన్నారు. తొలుత సాధారణ జ్వరంగా భావించి అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ వైద్యులను సంప్రదించినా, తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో గుంటూరుకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇరువురు ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ అంటే.. పచ్చని పొదల్లో దాగి ఉన్న సూక్ష్మ కీటకం స్క్రబ్ టైఫస్. నల్ల జాతికి చెందిన ‘ట్రాంబికులిడ్ మైట్స్’ అనే కంటికి కనిపించని సూక్ష్మ కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇది కుట్టినప్పుడు ‘ఓరియాంటియా సుత్సుగముషి’ అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు – ఫిబ్రవరి మధ్యకాలంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పంట పొలాలు, పార్కులు లేదా చెట్ల పొదల్లో పని చేసేవారు కాళ్లకు, చేతులకు పూర్తిగా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ లేదా యాంటీ–ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేయాలి. పిల్లలు పార్కులు లేదా మైదానాల్లో ఆడుకునేటప్పుడు కీటకాలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో 11 పాజిటివ్ కేసులు జిల్లాలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు 11 ఉన్నట్లు గుంటూరు జీజీహెచ్ ద్వారా వచ్చిన సమాచారం. జిల్లాకు చెందిన ఇరువురు మృత్యువాత పడ్డారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలతోనే వారిరువురు మృతి చెందారా లేదా అనేది తెలుసుకునేందుకు కేస్ షీట్లు తెప్పిస్తున్నాం. – డాక్టర్ బి రవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, -
దివ్యాంగ బాలల ఉన్నతికి ప్రభుత్వం వెన్నుదన్ను
నరసరావుపేట రూరల్: దివ్యాంగ బాలబాలికల ఉన్నతికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచేందుకు పథకాలు అమలు చేస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని నరసరావుపేటలోని భవిత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, సమీకృత విద్య కో–ఆర్టినేటర్ ఆర్.సెల్వరాజ్, నవభారత దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భవిత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్ట్, ఆయాల సేవలు మరువలేనివని తెలిపారు. దివ్యాంగుల ఉన్నతకి భవిత కేంద్రాలు మూల స్తంభాలని కొనియాడారు. అనంతరం దివ్యాంగుల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంవో పూర్ణచంద్రరావు, ఓసీటీబీ పాఠశాల సెక్రటరీ నాయక్, ఫిజియోథెరపిస్ట్ పెదన్నారావు నాయక్, ఉపాధ్యాయులు కె.పద్మజ, జి.మేరీ కుమారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలి సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు దాచేపల్లి : మానసిక దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు తెలిపారు. నారాయణపురంలోని ఫాతిమా మాత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో వేడుకలు జరిపి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులను అంతా గౌరవించాలని, సమాజంలో వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు షేక్ జానీ బాషా, మందపాటి శ్రీనివాసరెడ్డి, గురుప్రసాద్, వలంటీర్ అహ్మద్ పాల్గొన్నారు. డీఈవో చంద్రకళ -
ముమ్మరంగా సంతకాల సేకరణ
మాచర్ల: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ మాచర్ల నియోజక వర్గంలో ముమ్మరంగా కొనసాగుతోంది. పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఐదు మండలాలు, పట్టణం నుంచి 63,556 సంతకాలు సేకరించారు. విద్యార్థులు, మహిళలు, యువజనులు, వ్యాపారస్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఆయా మండల, జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, మండల ఇన్చార్జిల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. త్వరలోనే నియోజక వర్గం నుంచి 70వేలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 31వ వార్డులో బుధవారం పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, నియోజకవర్గ ఎస్సీ నేత కందుకూరి మధు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికీ వెళ్లారు. సంతకాలు సేకరించి పత్రాలను పార్టీ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు, కౌన్సిలర్ గురవయ్య, జిల్లా ఎస్సీ విభాగ నాయకులు కొమ్ము బొంగురు, పిన్నెల్లి హనిమిరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, పుల్లారావు, అజయ్ పాల్గొన్నారు. -
‘కృష్ణా’లో కలుషిత నీటి కలకలం
దాచేపల్లి: కృష్ణానదిలో రసాయనాలు కలవడం వలన నీరు కలుషితమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట, కాట్రపాడు గ్రామాల పరిధిలో కృష్ణానదిలో నీరు తీవ్ర దుర్వాసన వస్తోంది. ఆ కలుషిత నీటినే తాగిన తంగెడ, ఏలియంపేట గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. మూగజీవాలు కూడా తాగటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా ఆరు రోజులు గడిచినా కృష్ణానదిలో నీరు సాధారణ స్థితికి రాలేదు. రసాయనాలు కలపటం వలన నీరు రంగు మారింది. నాలుగు రోజులపాటు తంగెడ గ్రామస్తులకు ఈ నీటినే సరఫరా చేశారు. నదిలో పేరుకుపోయిన కెమికల్ తెట్టును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాట్రపాడు గ్రామం సమీపంలో గతంలో తీసిన గుంతల్లో నిల్వ ఉన్న నీరు కూడా రంగు మారినట్లు స్థానికులు చెబుతున్నారు. నదిలో రసాయనాలు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఊరంతా సర్వే చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేస్తే పెనుప్రమాదం నుంచి ప్రజలను కాపాడవచ్చు. పరిస్థితి చక్కబడేంత వరకు ప్రభుత్వం నుంచి సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపై చర్యలు తీసుకోవాలి. – షేక్ సైదా, తంగెడ -
బాలికల హ్యాండ్ బాల్ విజేత పశ్చిమ గోదావరి
పిడుగురాళ్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ అండర్ –15 బాలికల విబాగం విజేతగా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు నిలిచింది. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో పోటీలు హోరోహోరిగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్లో పశ్చిమ గోదావరి, విజయనగర్ జట్లు పోటీ పడ్డాయి. పశ్చిమ గోదావరి విజయం సాధించి మొదటి స్థానంలోను, రెండవ స్థానంలో విజయనగరం, మూడవ స్థానంలో కడప, కర్నూలు జట్లు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు షీల్డ్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పి. శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వేస్ట్ రాళ్లకు కూడా మైనింగ్ సెస్సు చెల్లించాలా!
చిలకలూరిపేట టౌన్: ఏఎంఆర్ మైనింగ్ సంస్థకు సంబంధించి మండల పరిధిలో మరోమారు వివాదం జరిగింది. ఆలయానికి వేస్ట్ రాతిని తరలిస్తున్న వాహనాల్ని ఏఎంఆర్ సిబ్బంది అడ్డుకోవడంతో సమస్య నిరసన తెలిపే వరకు వెళ్లింది. వివరాలల్లోకి వెళితే..పురుషోత్తమప ట్నం గ్రామంలో షిరిడీ సాయిబాబా ఆలయం ట్రస్ట్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, కమిటీ సభ్యుల నేతృత్వంలో దత్రాత్రేయ స్వామి ఆలయంలో 158 అడుగుల ఏకశిలా స్తూపం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల శంకుస్థాపన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో లోతైన గుంతల్లో వేసేందుకు రాళ్లు అవసరం కావడంతో బుధవారం మద్దిరాల లోని గ్రానైట్ మిల్లుల వద్ద వేస్ట్గా పడేసిన రాళ్లను రెండు వాహనాల్లో తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలో మద్దిరాలలోని ఏఎంఆర్ చెక్పోస్టు వద్ద సదరు సంస్థ సిబ్బంది చలానా చెల్లించాలంటూ వాహనాన్ని నిలుపుదల చేశారు. ఇది రోడ్ల వెంట వేస్ట్గా పడేసిన రాళ్లని, ఆలయ పనులకు స్థానికులను అడిగి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. సిబ్బంది వినతి మేరకు సంస్థ అధికారులతో వారు ఫోన్లో మాట్లాడగా మాలధారుల్ని దురుసుగా, హేళనగా సమాధానం ఇచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహించారు. భక్తులు, ఏఎంఆర్ అధికారులతో వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పురుషోత్తమపట్నానికి చెందిన ఆలయ కమిటీ సభ్యులు, దత్తాత్రేయ మాలధారులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఏఎంఆర్ సంస్థ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటకు పైగా కూర్చొని అక్కడే భజన చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. దీంతో రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ జి.అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, దత్తాత్రేయ మాలధారులు, మహిళలు ఉన్నారు. -
గుంతల రోడ్లే గతి..!
సత్తెనపల్లి: అధికారంలోకి వస్తే, సంక్రాంతి పండుగలోపే రోడ్లన్నీ బాగు చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీ అటకెక్కింది. సంక్రాంతి పండుగ పోయి మళ్లీ సంక్రాంతి పండుగ వస్తున్నా మరమ్మతులు చేయకపోగా రోడ్లు మరింత అధ్వానంగా మారాయని ప్రజలు మండిపడుతున్నారు. ఏ రోడ్డు చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారుల దుస్థితి ఇలా ఉంది. వివిధ పనుల మీద చుట్టుపక్కల గ్రామాల నుంచి సత్తెనపల్లికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూపు కోల్పోయిన రహదారులు.. సత్తెనపల్లి–మాదిపాడు, సత్తెనపల్లి–నరసరావుపేట, కొండమోడు–పేరేచర్ల ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారాయి. కొండమోడు–పేరేచర్ల జాతీయ రహదారిని విస్తరించేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే మంజూరై చివరి దశకు వచ్చాక ప్రభుత్వం మారడంతో ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయితే కనీసం గుంతలకు మరమ్మతులు చేస్తే రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. అవేమీ పట్టించు కోకపోవడంతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎటు చూసినా గుంతలే కనిపిస్తుండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. -
రాజధాని నడిబొడ్డున చెరువు కబ్జా
మందడం(తాడికొండ): రాజధాని నడిబొడ్డున సచివాలయానికి కూతవేటు దూరంలో తుళ్ళూరు మండలం మందడం చెరువులో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సుమారు 35 ఎకరాల్లో ఉన్న చెరువులో గతంలో పలువురు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం అప్పట్లోనే వారికి పట్టాలు అందజేసింది. ఇటీవల తెలుగు తమ్ముళ్లు తెగించడంతో నెల రోజుల వ్యవధిలో 4 షెడ్లు వెలిశాయి. వీరిని చూసి మరి కొంతమంది ఆక్రమణలకు తెరలేపడంతో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏపీ సచివాలయానికి కూతవేటు దూరం, సీఆర్డీఏ స్థానిక కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఈ ఆక్రమణలు జరుగుతుండటంతో ముక్కున వేలేసుకోవడం అందరి వంతవుతోంది. త్వరలో ఇటుగా రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో ఈ గృహాలను తొలగిస్తే పరిహారం భారీగా వస్తుందంటూ ప్రచారం సాగుతోంది. -
ప్రగతిపై చర్చకు సిద్ధం
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి కాసు మహేష్ రెడ్డి సవాలు సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, కాసు కుటుంబ ప్రతిష్టపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఒక్కడినే లెక్కలతో వెళతానని సవాలు విసిరారు. నారా లోకేష్, చంద్రబాబు, యరపతినేనిలకు 2019 ముందు నుంచి సవాలు విసిరానని, బ్రహ్మారెడ్డి వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. నరసరావుపేటలోని కాసు స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్రెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ.. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే జూల‘కంత్రి’ బ్రహ్మారెడ్డి ప్రెస్మీట్లో నోటికొచ్చినట్టు మాట్లాడారన్నారు. తాను పుట్టక ముందే సొసైటీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమ వారిదన్నారు. 50 ఏళ్ల క్రితమే సుమారు రూ.1.50 లక్షలు చెల్లించి దీనికోసం స్థలం కొన్నామన్నారు. అదే మొత్తంతో ఆ సమయంలో తమ పెద్దలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 20 ఎకరాలు కొంటే, అది ఇప్పుడు సుమారు రూ.3 వేల కోట్లు పలికేదన్నారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే కాసు సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. మారుతున్న కాలంతో ఎయిడెడ్ కళాశాలలకు ఆదరణ తగ్గడంతో వాటి నిర్వహణకు మాల్ కట్టి కొంత ఆదాయం సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. నిర్మాణం కోసం ప్రభుత్వం జీవోలు, హైకోర్టు ఉత్తర్వులతోపాటు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అక్రమార్జన చేసి ఉంటే సొంతంగా ఆస్తులు కొనేవాడినని, సొసైటీలో ఎందుకు మాల్ నిర్మిస్తానని ప్రశ్నించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వెంగళరెడ్డి, కృష్ణారెడ్డిలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. నాగార్జున సాగర్, బుగ్గవాగు, జాతీయ రహదారులు మొదలు తన హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మెడికల్ కళాశాల, తాగునీరు, హైవేలు నిర్మించామన్నారు. హత్యారాజకీయాలు బ్రహ్మారెడ్డికి అలవాటేనని, ఏడు మర్డర్ల కేసులో ఆయన పేరు ఎందుకు ఉందో, టీడీపీ ఎందుకు సస్పెండ్ చేసిందో చెప్పాలన్నారు. 2019 ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డి వైఎస్సార్సీపీలోకి రావాలని ప్రయత్నించినా ఆయన గురించి తెలిసి పార్టీలో చేర్చుకోవడానికి పీఆర్కే ఒప్పుకోలేదన్నారు. 18 నెలల్లో అవినీతి ఏ స్థాయిలో చేస్తే కుమారుడి పెళ్లి రూ.10 కోట్లు పెట్టి చేశావని ప్రశ్నించారు. పిన్నెల్లి సోదరులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కట్టుకథలతో కేసులు పెట్టడం పరాకాష్టకు చేరింది. పిన్నెల్లి బ్రదర్స్కు ఏ మాత్రం సంబంధం లేని కేసులో వారి పేర్లు పెట్టడం దారుణం. అసలు జంట హత్యలకు, పిన్నెల్లి బ్రదర్స్కు ఏమిటి సంబంధం? టీడీపీ గ్రూపుల మధ్య గొడవే కారణమని అందరికీ తెలుసు. చివరకు నాపైనా ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిలో ఎవ్వరినీ రేపు మా ప్రభుత్వం వచ్చాక వదలి పెట్టబోం. వారికి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. కాసు కుటుంబం రాష్ట్రానికి చేసిన సేవలు అందరికీ తెలిసినవే. వారి గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు, అవన్నీ విఫల ప్రయత్నాలు. – విడదల రజిని, మాజీ మంత్రి గుండ్లపాడు జంట హత్యలకు టీడీపీలో ఆధిపత్య పోరే కారణం. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు టీడీపీ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు అరెస్టు అయిన అయిదుగురిలో పిన్నెల్లి సోదరులు లేరు. ఆ తర్వాత కావాలనే రాజకీయ కక్షతో వారిని కేసులో ఇరికించారు. పిన్నెల్లి సోదరులకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. శిక్షలు పడిన వారికి సైతం చంద్రబాబు టికెట్లు ఇచ్చారు, పిన్నెల్లిపై నిందలు తప్ప ఆధారాలు లేవు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ -
బాబు పాలనలో భవిత శూన్యం
భవిత కేంద్రాల్లో మానసికంగా, శారీరకంగా అవస్థలు పడుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ప్రభుత్వం భరోసానివ్వడం లేదు. ఏటా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందజేయాలి. కానీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలను ఏటా అందించేది. పరికరాలను కొనే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ చేయూత కోసం తల్లిదండ్రులు నిరీక్షిస్తున్నారు. తప్పని ఎదురుచూపులు..సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భరోసా కల్పించేందుకు భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయా కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. శారీరకంగా, మానసికంగా అవస్థలు పడుతున్న ఎంతోమంది చిన్నారులు ఉపకరణాలు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫిజియోథెరపీ వైద్యుల కొరత వేధిస్తోంది. నాలుగు మండలాలకు ఒకరు చొప్పున సేవలందిస్తున్నారు. జిల్లాలో 28 భవిత కేంద్రాలు ఉండగా, వాటిలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 540 మంది ఉన్నారు. పాత పరికరాలతోనే చదువుకు దూరంగా ఉన్న ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి భవిత కేంద్రంలో విద్యనందిస్తున్నారు. అలాగే మానసిక వైకల్యం, వినికిడి లోపం, ఆటిజం, దృష్టిలోపంతో బాధపడే వారికి కేంద్రంలోనే ఫిజియోథెరపీ నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు మండలాలకు ఒక్కరే ఫిజియోథెరపీ వైద్యులు ఉండడంతో వారానికి ఒకరోజు మాత్రమే వచ్చి సేవలు అందించాల్సిన పరిస్థితి. దీంతో సక్రమంగా ఫిజియోథెరపీ సేవలు అందడం లేదు. ఏళ్ల క్రితం అందజేసిన పరికరాలు ఇప్పుడు బాగా పాడవడంతో వాటితోనే సేవలందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీలుగా పని చేస్తున్న వారే పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బ్రెయిలీ నైపుణ్యాలతోపాటు నడవడికను నేర్పిస్తున్నారు. అంతేకాకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు అనుసరించాల్సిన ప్రత్యేక శ్రద్ధపై కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు ఆగస్టులో శిబిరాలు నిర్వహించారు. ఇంకా యంత్ర పరికరాలు రాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పంపిణీ చేస్తాం. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల విషయంలో అన్ని ప్రభుత్వాలు వారికి చేయూతను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధిస్తున్నాం. – సెల్వరాజ్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కోఆర్డినేటర్, పల్నాడు ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రంలో ఉచితంగా ఉపకరణాలు అందించాలి. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి దివ్యాంగుల అవసరాన్ని గుర్తించాలి. ఎవరికి ఏ పరికరం అవసరమో గ్రహించి, అందించాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఉపకరణాలు అందించేవారు. దృష్టి, వినికిడి లోపం ఉన్నవారు కూడా సాధారణ విద్యార్థుల్లా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన ట్యాబ్లు పంపిణీ చేసింది. ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్)కు ఇలా మొత్తంగా 148 ట్యాబ్లను అందజేసింది. ట్యాబ్స్ను ఎలా వినియోగించాలన్న అంశంపై ఉపాధ్యాయులకు, చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఆగస్టులో ప్రత్యేక శిబిరం నిర్వహించి 18 ఏళ్ల వయసు లోపు ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించారు. వారికి ఉపకరణాలు అందించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు. -
మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు సహకరించండి
గుంటూరు వెస్ట్: మాజీ భారత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, నాయకులు మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ నిస్వార్థమైన సేవతో దేశానికి దిశానిర్ధేశం చేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని రింగు రోడ్డులోని ఐటీసీ హోటల్, మెడికల్ క్లబ్ ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుమతి కోసం వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, బీజేపీ నాయకులు భజరంగ్ రామకృష్ణ, తాడువాయి రామకృష్ణ, దర్శనం శ్రీనివాస్, ఆలపాటి రవికుమార్, తోట శ్రీనివాస్, దేసు సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కు బీజేపీ నాయకుల వినతి -
నలుగురు యువకులు అరెస్ట్
కిలో గంజాయి స్వాధీనం ముప్పాళ్ల: మహిళపై దాడికి పాల్పడిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పీ.అనిల్కుమార్ మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల కిందట మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. నలుగురు యువకులు ఆమైపె దాడికి దిగారు. ముప్పాళ్ల పోలీస్స్టేషన్లో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన బొరిగర్ల నాగరాజు, మధిర లక్ష్మీరెడ్డి, కుమ్మెత మహేశ్వరరెడ్డి, లంకెలకూరపాడు గ్రామానికి చెందిన కిష్టిపాటి శివనాగిరెడ్డిలను లంకెలకూరపాడు గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరిపై గతంలో కూడా కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. కారెంపూడి: స్థానిక ఎస్సీ కాలనీలోని మురికి కాలువలో మంగళవారం నవజాత శిశువు మృతదేహం కన్పించింది. కన్న వెంటనే పాపను కాల్వలో పడేసినట్లుగా ఉంది. బొడ్డుపేగు కూడా అలాగే ఉంది. ఇది చూసి స్థానికులు చలించిపోయారు. కాల్వలో ఉన్న శిశువును వెలికితీసి పూడ్చి పెట్టారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం రేపింది. -
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్
గుంటూరు మెడికల్: సాధారణ జ్వరం మాదిరిగా సోకి ప్రాణాంతకమైన పరిస్థితులకు దారి తీస్తున్న స్క్రబ్ టైఫస్తో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. మేడికొండూరు, చేబ్రోలు, వేజండ్ల, తుళ్లూరు, గుంటూరు అర్బన్ పరిధిలోని గోరంట్ల, ఇతర ప్రాంతాల్లో వ్యాధి బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి జ్వరంతో ప్రారంభమవుతోంది. జ్వరం వచ్చి మూడురోజుల వరకు తగ్గకుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. చిన్న నల్ల మచ్చ (దద్దురు మాదిరిగా) శరీరంపై కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైపస్గా అనుమానించాలి. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చు. వర్షాకాలంలో ఈ జ్వరాలు ఎక్కువ సాధారణంగా స్క్రబ్ టైఫస్ కేసులు వర్షా కాలంలో ఎక్కువగా నమోదవుతాయి. జిల్లాలో ఒక్క వేసవి కాలంలో మినహా వర్షా కాలం, చలి కాలంలో కేసులు నమోదయ్యాయి. జ్వరంతోపాటు, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉంటాయి. అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి. వాంతులు, తీవ్రమైన చలి, అలసట, దగ్గు, కళ్లు ఎర్రబడడం ఉంటాయి. శ్వాస సమస్యలు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధి సోకిన వారిలో సగం మందికి పైగా వీపు, ఛాతి, కడుపుపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. వాటిని నొక్కినప్పుడు మసక బారుతాయి. అనంతరం ఎరుపుగా మారతాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో చర్మంలో కొద్దిగా రక్తస్రావం కావచ్చు. కీటకం ద్వారా సోకుతోంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగించే చిగ్గర్ మైటు అనే కీటకం మనుషులను కుడుతుంది. ఈ క్రమంలో దానిలో ఉండే లాలాజలం (ఓరిజెంటియా తుత్సుగముషి అనే బ్యాక్టీరియా) రక్తంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు మనుషులను కుట్టడంవల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు కుడుతుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 31 మందికి ఈ వ్యాధి జ్వరాలతో ఆందోళన చెందుతున్న ప్రజలు శరీరంపై నల్ల మచ్చ గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి చిగ్గర్ మైట్ (కీటకం) ప్రభావంతో స్క్రబ్ టైఫస్ -
నేడు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం గ్రామసభలు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద బుధవారం రైతన్న మీకోసం గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెబెక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభలలో 2025–26 రబీ, 2026 ఖరీఫ్, 2026–27 రబీ సీజన్ల పంట ప్రణాళికలపై రైతులతో చర్చించాలన్నారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాల (నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు) ఆధారంగా పంట ప్రణాళిక తయారీలో అధికారులు, రైతులు భాగస్వాములు కావాలన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను మంగళవారం మంత్రి నారా లోకేష్ తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ పేర్కొన్నారు. భక్తులకు ప్రచార నిమిత్తం గోడపత్రికలను, ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లూజు పత్తిని మాత్రమే తీసుకురావాలి
నాదెండ్ల: రైతులు నాణ్యత గల పత్తిని సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చి గరిష్ట మద్దతు ధర పొందాలని ఉమ్మడి గుంటూరు జిల్లా సీసీఐ ఏజీఎం సంజయ్ ద్వివేది చెప్పారు. గణపవరం శ్రీ వెంకటకృష్ణ ఎంటర్ప్రైజెస్లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. బయ్యర్ రమేష్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సూచనలు చేశారు. రైతులు ప్లాస్టిక్ సంచుల్లో పత్తిని తీసుకురావద్దని, సాధ్యమైనంత వరకూ లూజ్గా తీసుకురావాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పత్తిలో కలిసి నాణ్యత తగ్గడంతోపాటూ రైతులు ధరలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రతి సోమవారం నుండి శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకూ పత్తి కొనుగోలు జరుగుతుందన్నారు. తేమ 8–12 శాతంలోపు ఉండాలన్నారు. తడిచిన పత్తి ఆరబెట్టుకోవాలని, గుడ్డికాయ ఉన్నట్లయితే విదిలించి మేలు రకం పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు. సంబంధిత రైతులు కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దిష్ట సమయానికి పత్తిని సీసీఐ కేంద్రానికి తరలించాలని సూచించారు. -
హ్యాండ్బాల్ చాంపియన్షిప్ విజేత ‘పశ్చిమగోదావరి’
పిడుగురాళ్లరూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలలో విజేతగా పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. పిడుగురాళ్ల మండలం జానపాడు శివారులోని తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్కు అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల జట్లు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఆక్స్ఫర్డ్స్ స్కూల్ డైరెక్టర్ బొల్లా గిరిబాబు మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతమైన తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూలులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించటం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి జిల్లా జట్టు అద్భుతమైన ఆటను కనబరిచాయని ఆయన తెలియజేశారు. విజేత పశ్చిమ గోదావరి జిల్లా జట్టుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరేష్, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, పల్నాడు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కన్వీనర్ కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా హ్యాండ్బాల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ షేక్ రాను హుస్సేన్, పీఈటీలు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో బయో డీజిల్ బంక్లో నవంబర్ 23న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగం భాగ్యారావు (52) మంగళ వారం మృతి చెందాడు. పాలువాయి జంక్షన్ సమీపంలో బయోడీజిల్ దుకాణంలోని స్టీల్ క్యాన్లకు బయో డీజిల్ ట్యాంకర్ వచ్చి బయోడీజిల్ నింపుతుండగా ఇన్వర్టర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో రషీద్(30) అక్కడికక్కడే అగ్నికి ఆహుతైన విషయం పాఠకులకు తెలిసిందే. బయోడీజిల్ దుకాణానికి 10 అడుగుల బయట ఉన్న భాగ్యారావుకు మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్నవారు అతనిని రోడ్డు వద్దకు లాగి దుస్తులు తీసివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే భాగ్యారావును అంబులెన్స్ ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల ప్రవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు మృతి చెందినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. -
అర్జీలు నాణ్యతగా పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి
112 అర్జీలు స్వీకరించిన డీఆర్ఓ, అధికారులు నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు నాణ్యంగా పరిష్కరించటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్ఓ ఏకా మురళి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అధ్యక్షత వహించి జిల్లా అధికారులతో కలసి 112 అర్జీలు స్వీకరించారు. డీఆర్ఓ మాట్లాడుతూ అర్జీలకు సంబంధించిన ఆడిట్ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తిచేయాలని, ఇందులో నాణ్యత బాగుండాలన్నారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతివారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్లినప్పుడు గ్రీవెన్న్స్ జాబితా సిద్ధంగా ఉంచాలని అధికారులకు చెప్పాలని సూచించారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ఒకటి, రెండు అర్జీలను స్వయంగా తనిఖీ చేయాలన్నారు. దీని ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకుని ఫీడ్బ్యాక్ అందించాలని, యాదృచ్ఛికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. తహసీల్దార్లు వారి దగ్గరికి వచ్చిన అర్జీలు సరైన విధంగా పరిష్కరించారా అనేది చూడాలని, దీనిపై దృష్టి పెట్టాలని, అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉందన్నారు. జిల్లా అధికారులకు ఈ ఆఫీస్ ద్వారా తపాల్లను పంపించడం జరుగుతోందని, రోజువారీగా వాటిని చూసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్య సూత్రమే యోగా
గుంటూరువెస్ట్(క్రీడలు): సంపూర్ణ ఆరోగ్య మహా సూత్రమే యోగా అని యోగా శిక్షకుడు వంగా వెంకటేష్ అన్నారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సంక్లిష్టమైన కరోనా సమయంలో యోగా సాధ కులు అధిక సంఖ్యలో అకాలమరణం పాలు కాకుండా జీవించడానికి కారణం యోగా సాధ నే అని తెలిపారు. రోజుకు కనీసం 45 నిమిషాలైనా యోగా, మెడిటేషన్ సాధన చేస్తే జీవన కాలాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. జాయ్ అండ్ షైన్ వెల్నెస్ సెంటర్ ఫిటెనెస్ కోచ్ కె.జ్యోతిశ్యామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగా శిక్షణతోపాటు ఫిట్నెస్, చక్కని ఆరోగ్యం తదితర అంశాలపై ప్రముఖులతో పాఠాలు చెప్పిస్తామన్నారు. అనంతరం యోగా తరగతులను వెంకటేష్ నిర్వహించా రు. అయితి సతీష్, భావన్నారాయణ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ యానీ అమల ఉన్నారు. -
కృష్ణా నదిని పరిశీలించిన అధికారులు
దాచేపల్లి: దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణానదిని పలు శాఖల అధికారులు సోమవారం పరిశీలన చేశారు. కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు కలపడంతో నీరు కలుషితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సాక్షి దినపత్రిక సోమవారం ‘కృష్ణాలోకి కెమికిల్’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ, పర్యావరణ శాఖ అధికారులు అప్రమతమయ్యారు. కృష్ణా నదిలో కెమికల్స్ కలిపిన ప్రాంతాన్ని సంబంధిత అధికారులు పరిశీలన చేసి వివరాలు సేకరించారు. కృష్ణానదిలో నీటిపై రసాయనాల తెట్టు ఇంకా పేరుకు పోయి ఉండడాన్ని గమనించారు. గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు, పర్యావరణ శాఖ అధికారులు కెమికల్స్ కల్పిన ప్రాంతంలో మూడు చోట్ల శాంపిల్స్ సేకరించారు. సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపి పరీక్ష చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మండల తహసీల్దార్ జి.శ్రీనివాస్యాదవ్, పంచాయతీ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, వీఆర్ఓ బి. యలమంద, గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ అంగడి సోమయ్య, కృష్ణా నదిలో కెమికల్స్ కలిపిన ప్రాంతాన్ని పరిశీలన చేసి ప్రాథమిక ఆధారాలపై కూపిలాగారు. కృష్ణానది నుంచి తంగెడకు తరలించే నీటిని నిలిపివేశారు. తంగెడలోనే అందుబాటులో ఉన్న బోర్ల ద్వారా తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. గ్రామం మొత్తం బ్లీచింగ్ చల్లించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కృష్ణానది వద్ద రసాయనాలు కల్పిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించారు. కృష్ణా నదిలో రసాయనాలు కలపటంపై విచారణ చేస్తున్నామని, రసాయనాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడెక్కడ కలిపారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కి నివేదిక అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభం
పిడుగురాళ్లరూరల్: ప్రతి క్రీడాకారుడు దేశానికి మంచి పేరు తేవాలని గురజాల డీఎస్పీ జగదీష్ అన్నారు. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ రాష్ట్రస్థాయి ఆటల పోటీలను సోమవారం ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహించారు. అండర్–14 బాలికలు, అండర్–19 బాలురలకు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు 17 జిల్లాల నుంచి సుమారుగా 350 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యాసంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు క్రీడా జ్యోతిని వెలిగించగా, గురజాల డీఎస్పీ జగదీష్ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ...గెలుపునకు ఓటమి నాందిగా క్రీడాకారులు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ నరేష్, పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, పల్నాడు జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కన్వీనర్ కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా హ్యాండ్ బాల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ షేక్ రాను హుస్సేన్, పీఈటీలు, ఎస్ఐలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు
గురజాల: పట్టణంలో వేంచేసియున్న శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి 427వ తిరునాళ్లను పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ నుంచి గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, రైతు సంఘం, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్థాయిలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. ఏపీ ఒంగోలు జాతి పశుపోషక రైతు సంక్షేమ సంఘం వారి ప్రతిపాదనలు అనుసరించి నిర్వహించనున్నట్లు తెలిపారు. సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.80 వేలు, మూడో బహుమతి రూ.70 వేలు, నాల్గవ బహుమతి రూ.60 వేలు, ఐదో బహుమతి రూ.50 వేలు, ఆరో బహుమతి రూ.30 వేలు, ఏడో బహుమతి రూ.20 వేలు, ఎనిమిదో బహుమతి రూ.15 వేలు, తొమ్మిదో బహుమతి రూ.10 వేలు, జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి రూ.55 వేలు, రెండో బహుమతి రూ.45 వేలు, మూడో బహుమతి రూ.30 వేలు, నాల్గవ బహుమతి రూ.20 వేలు, ఐదో బహుమతి రూ.10వేలు, ఆరో బహుమతి రూ.8వేలు, ఏడో బహుమతి రూ.7వేలు, ఎనిమిదో బహుమతి రూ.5వేలు, న్యూ కేటగిరి విభాగంలో ప్రథమ బహుమతి రూ.45వేలు, రెండో బహుమతి రూ.35వేలు, మూడో బహుమతి రూ.25 వేలు, నాల్గవ బహుమతి రూ.15 వేలు, ఐదో బహుమతి రూ.10 వేలు, ఆరో బహుమతి రూ.7 వేలు, ఏడో బహుమతి రూ.5వేలు, 6 పళ్ల జతల విభాగంలో ప్రథమ బహుమతి రూ.30వేలు, రెండో బహుమతి రూ.25వేలు, మూడో బహుమతి రూ.20వేలు, నాల్గవ బహుమతి రూ.15వేలు, ఐదో బహుమతి రూ.10వేలు, ఆరవ బహుమతి రూ.7వేలు, ఏడవ బహుమతి రూ.5వేలు, నాలుగు పళ్ల జతల విభాగంలో ప్రథమ బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.20వేలు, మూడో బహుమతి రూ.15వేలు, నాల్గవ బహుమతి రూ.10 వేలు, ఐదో బహుమతి రూ.8వేలు, ఆరో బహుమతి రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పోటీల స్థలం పరిశీలించిన పులుకూరి ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహించే గ్రౌండ్ను నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు సోమవారం పరిశీలించారు. గతంలో మాడుగుల రోడ్డులో పోటీలు నిర్వహించేవారని, అనివార్య కారణాల వలన ఈ ఏడాది పులిపాడు రోడ్డులోని సిరి వెంచర్ సమీపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు అందరూ పాల్గొని పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పోటు నాగేశ్వరరావు, నవులూరి శ్రీరామమూర్తి, నెల్లూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఐదు నుంచి ప్రారంభం -
సర్టిఫికెట్ కోసం ఎన్నాళ్లు తిరగాలి?
రామిరెడ్డిపేటలో నాకు సొంత ఇల్లు ఉంది. అందులో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్నా. నా ఇల్లు శారదా ఇంటితో కలిసి జాయింట్ శ్లాబు ఉంది. ఇద్దరికి కలిపి వాటర్ ట్యాంకు నిర్మాణం చేశారు. ఆ ట్యాంకు నుంచి నీరు లీకై శ్లాబ్ తడుస్తూ ఇల్లు అంతా డ్యామేజ్ అయింది. విద్యుత్ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయి. 2023లో స్పందనలో ఫిర్యాదుచేస్తే మున్సిపాల్టీకి అప్పచెప్పారు. కమిషనర్ ఆదేశాలతో టీపీఓ, టీపీఎస్, టౌన్ సర్వేయర్ వచ్చి చూసి వాటర్ లీకేజ్ పరిశీలించి ఇంటి పక్కనున్న వారిని మరమ్మతు చేయించాలని చెప్పారు. వారు తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. అయినా సమస్య తీరలేదు. ఇంటిపక్కనున్న వారిని ట్యాంకు తొలగించాలని కోరినా వారు వినట్లేదు. ఆ ట్యాంకు తొలగించి డ్యామేజ్ రిపోర్టు ఇప్పించండి. శ్లాబ్ మరమ్మతు చేయించుకుంటాం. –నంద్యాల అనసూర్య, రామిరెడ్డిపేట, నరసరావుపేట -
భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలి
పమిడిమర్రులోని దళితుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకు లు డిమాండ్ చేశారు. సోమవారం వారు పమిడిమ ర్రులో ఆక్రమణకు గురవుతున్న అసైన్డ్ భూములను పరిశీలించారు. 16 ఏళ్ల కిందట 100 మంది దళితు లకు భూములను కేటాయించి బీ ఫారాలు ఇచ్చార ని తెలిపారు. వారి ప్లాట్లు చూపకపోవడంతో భూ ములను చేపల చెరువుగా మార్చి వచ్చిన ఆదాయం ఉమ్మడిగా అనుభవిస్తున్నారని తెలిపారు. కోటప్పకొండకు, జేఎన్టీయూఎన్కు కూతవేటు దూరంలో ఉన్న భూములకు ధరలు రావడంతో వీటిని ఆక్ర మించేందుకు పలుమార్లు ప్రయత్నించారని తెలిపా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫి యా ఈ భూములపై కన్నెసినట్టు పేర్కొన్నారు. భూ మాఫి యాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, వై.వెంకటేశ్వరరావు,జి.రామకృష్ణ, ప్రసాద్ ఉన్నారు.ప్రజాసంఘాల నాయకులు -
ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా అసోసియేషన్ హాలులో సోమవారం ఏకాగ్రీవంగా నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా వి.హనుమంతరావు, జిల్లా అధ్యక్షులుగా ఎం.చంద్రశేఖర్, జిల్లా సెక్రటరీగా ఎం.శ్రీను, అసోసియేట్ ప్రెసిడెంట్గా సీహెచ్.నాగేంద్రబాబు, కోశాధికారిగా భాస్కరరెడ్డి, జాయింట్ సెక్రటరీగా విజయలక్ష్మి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్గా వెస్ట్ గోదావరి జిల్లా సెక్రెటరీ కిషోర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఏలూరు జిల్లా అసోసియేషన్ సభ్యులు ఆనంద్, ఎలక్షన్ అబ్జర్వర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూర్తి వ్యవహరించారు. ఎన్నికలు చక్కగా నిర్వహించినందుకు ఎలక్షన్ ఆఫీసర్స్కు రాష్ట్ర సంఘం తరఫున పసుపులేటి రఘుబాబు ధన్యవాదాలు తెలియజేశారు. -
పేదల భూముల నుంచి
నరసరావుపేట రూరల్: పమిడిమర్రులోని పేదల భూముల నుంచి యంత్రాలను సోమవారం తరలించారు. పేదలకు చెందిన అసైన్డ్ భూముల ఆక్రమణపై ‘ అసైన్డ్ భూముల్లో పచ్చ గద్దలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం అయిన విషయం విదితమే. ఈ కథనం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రజా సంఘాల నాయకులు భూములను పరిశీలించారు. దీంతో స్పందించిన ఆక్రమణదారులు హడావిడిగా యంత్రాలను అక్కడి నుంచి తరలించారు. పచ్చనేతల వద్ద పాస్బుక్లు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో మండలంలోని పమిడిమర్రులో 82 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని పేదలకు కేటాయించారు. ఈ భూమిపై కన్నెసిన పచ్చనేతలు నరసరావుపేటకు చెందిన దళిత నాయకుడి సహకారంతో వ్యూహం రచించారు. పేదలకు డబ్బులు ఆశ చూపిన దళిత నాయకుడు వారి నుంచి ప్రభుత్వ పాస్బుక్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాంతలో ఎకరా భూమి రూ.10లక్షలకు పైగా ఉంటే కేవలం రూ.2లక్షలకే కొనుగోలు చేసేలా రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారు. మొదట విడతగా కేవలం రూ.10వేలు చెల్లించి రైతులు నుంచి భూములు స్వాధీనం చేసుకుని చదును చేసే పనిని ప్రారంభించారు. ఆక్రమణలకు ప్రజాప్రతినిధి వత్తాసు అసైన్డ్ భూములు చేతులు మారుతున్నాయనే సమాచారంతో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పది రోజుల కిందట పమిడిమర్రు గ్రామంలో పర్యటించారు. అసైన్డ్ భూములను పరిశీలించి అక్కడ జరుగుతున్న భూమిని చదును చేసే పనులను నిలిపివేయించారు. దీనిపై పట్టణానికి చెందిన టీడీపీ ముఖ్యనేత ప్రజాప్రతినిధిని ఆశ్రయించినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారిని పిలిచి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధి మద్దతుతోనే పచ్చనేతలు నేరుగా రంగంలోకి దిగి చెరువులను ధ్వంసం చేయడంతోపాటు భూములు ఇవ్వని రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం ఉంది. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రికెట్ పోటీలు
గుంటూరు రూరల్: రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–14 బాలుర క్రికెట్ పోటీలలో పశ్చిమగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. గత మూడురోజులుగా రూరల్ మండలంలోని దాసుపాలెం గ్రామం లోగల గ్రౌండ్లో జరుగుతున్న పోటీల్లో భాగంగా చివరిరోజు సోమవారం తొలుత జరిగిన సెమీ ఫైనల్స్లో గుంటూరుపై కర్నూలు విజయం సాధించింది. అదేవిధంగా అనంతపురంపై పశ్చిమగోదావరి విజయం సాధించింది. 3వ స్థానంలో గుంటూరు, 4వ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అనంతరం జరిగిన ఫైనల్స్లో కర్నూల్ను పశ్చిమ గోదావరి ఓడించి విజేతగా నిలిచింది. స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అబ్జర్వర్ బంగారు రాజు, దిలీప్చక్రవర్తిలు పర్యవేక్షించారు. విజేతగా నిలిచిన పశ్చిమగోదావరి జట్టును పెదకాకాని జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం కె.భాస్కరరావు అభినందించారు. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మైనేనీ నాగేశ్వరావు, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సిహెచ్ గోపి, సుమేధ స్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్రెడ్డి, ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ త్రిమెన్ కమిటీ సెలక్టర్ సుధాకర్, ఏపీ పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరిముల్లాచౌదరి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ దేశీయ ఆయుర్వేద సంఘం జనరల్ సెక్రెటరీ డాక్టర్ నామాల శ్రీనివాసరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు. అండర్ –14 బాలుర విభాగంలో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా జట్టు -
6,7 తేదీల్లో తెలుగు సాహితీ మహోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో తెనాలిలో తెలుగు సాహితీ, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో జరిగే ఈ వేడుకల ఆహ్వానపత్రికను సోమవారం ఇక్కడి ఎన్జీఓ కళ్యాణ మండపంలో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ‘తెలుగుభాష–సాహిత్యం–వ్యక్తిత్వ వికాసం’ అంశంపై సదస్సు, అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు 200 మందితో జాతీయస్థాయి కవి సమ్మేళనం ఉంటాయి. 11 నంది అవార్డులు పొందిన ఎం.సైదారావుచే జుగల్బందీ, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ బృందంచే ‘భువన విజయం’నాటకం ఉంటాయని తెలిపారు. 7వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెనాలి కూచిపూడి కళాకారిణులు దాదాపు 500 మందితో మహానాట్య సమ్మేళనం, విభిన్న రంగాల్లో చేతివృత్తుల్లో కొనసాగుతున్న శ్రామిక యోధులు, కళారంగ ప్రముఖులకు చిరుసత్కారం ఉంటా యని వివరించారు. 7వ తేదీ ముగింపు సభలో ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందకు బొల్లిముంత శివరామకృష్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని రూ.లక్ష నగదుతో బహూకరిస్తారు. ముందురోజున గుమ్మడి గోపాలకృష్ణకు విశిష్ట రంగస్థల కళాపురస్కారం, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబుకు సాహితీ సత్కారాన్ని రూ.25 వేల చొప్పున నగదుతో అందజేస్తారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి చందు సుబ్బారావు, మైత్రీ హాస్పటల్స్ అధినేత డాక్టర్ ఆలపాటి కృష్ణసందీప్, వీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిశోర్బాబు, మొవ్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సినీనటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారం -
గంజాయి విక్రయించే ఇద్దరు యువకులు అరెస్ట్
నగరంపాలెం: గంజాయి విక్రయించే ఇద్దరు యువకులను పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు సబ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రెండు రోజుల కిందట కాకాని రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పాతగుంటూరు పీఎస్ సీఐ వెంకటప్రసాద్ సిబ్బందితో ఆకస్మిక సోదాలు చేశారు. ఈ క్రమంలో అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహసముదాయంలో ఉంటున్న మహంకాళి శివమణికంఠ, నెహ్రూనగర్ ఒకటో వీధికి చెందిన భేటి బద్రినారాయణలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు వారిద్దర్ని అరెస్ట్ చేసి, 1,160 గ్రాముల గంజాయి, మోటారుసైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. స్నేహితులైన ఇద్దరు గంజాయికి బానిసయ్యారు. మార్టూరు క్వారీ వద్ద ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు మంగల్ పాండే అలియాస్ మాము వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. చిన్న ప్యాకెట్లగా తయారుచేసి ఎక్కువ ధరకు విక్రయించేవారని తెలిపారు. -
చలిలో వెచ్చని నేస్తం
సత్తెనపల్లి: నవంబర్ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. దీనికితోడు వాయుగుండం కారణంగా వాతావరణంలో మార్పుతో చల్లని గాలులు వీస్తూ చలి చంపేస్తోంది. వేకువ జాము నుంచే మంచు కప్పేస్తోంది. ఉదయం 9 గంటల వరకు చలి వణికిస్తుండడంతో కొందరు మంటలు వేసుకుని చలి కాచుకుంటుంటే .. మరికొందరు చలికి బయటకు రాలేకపోతున్నా రు. దీంతో జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, చిలకలూరిపేట, పెదకూర పాడు, గురజాల నియోజకవర్గాల్లో ఉన్ని దుస్తుల కు గిరాకీ పెరిగింది. రకరకాల డిజైన్లతో స్వెటర్లు, రెయిన్కోట్లు, శాలువాలు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు, గ్లౌజులు, బెడ్ షీట్లు అందుబాటులో ఉంచి విక్రయిస్తుండడంతో కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిస్తున్నాయి. జోరుగా ఉన్ని దుస్తుల విక్రయం... జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, పట్టణాల పరిధిలో రోడ్ల వెంబడి రంగురంగుల ఉన్ని దుస్తులు విక్రయిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వర కు ధరించే వివిధ డిజైన్లలో ఈ విక్రయాలు జోరందుకున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నా యి. తమకు తెలిసిన స్వెటర్లు, తదితర వాటిని తెచ్చి ప్రజలందరికీ పరిచయం చేసి తమపై నమ్మకాన్ని పెంచుకుంటున్నామని వ్యాపారులు అంటున్నారు. స్థానికులతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకొని అన్ని రకాల ఉన్ని దుస్తులు, టూ ఇన్ వన్ రెయిన్ కోట్లు, బెడ్ షీట్లు(రగ్గులు) విక్రయిస్తున్నారు. ప్రధాన రహదారులు పక్కనే వీటిని అందుబాటులో ఉంచి విక్రయిస్తూ ఆ ప్రాంతాల్లోనే ఇల్లు అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఏటా ఆక్రమణల పన్ను చెల్లిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఈ వ్యాపారాలు చేస్తున్నారు. నాణ్యమైన ఉన్ని దుస్తులను సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నాం. ధరలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. ఏటా నవంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు ఈ వ్యాపారం చేస్తాం. వినియోగదారులు మంచి ఆదరణ చూపిస్తున్నారు. 2013 నుంచి ఈ వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. – చేవూరి జయరావు, వ్యాపారి, సత్తెనపల్లి -
గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
యడ్లపాడు: దిత్వా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పా ట్లు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి సిబ్బందిని ఆదేశించారు. యడ్లపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వినికిడి లోపం ఉన్నవారి వివరాలు సేకరించి ఈనెల 7న ప్రత్తిపాటి గార్డెన్లో జరిగే ప్రత్యేక వైద్య శిబిరానికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్ 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. పారిశుద్ధ పరిస్థితులను పరిశీలించి, జ్వరాలు, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన పనుల పురోగతిని పరిశీలించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పి భరద్వాజ, సూపర్వైజర్ వి రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.రవి -
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీసీఓ
నూజెండ్ల: నూజెండ్ల మండలం ఉప్పలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఏపీఎస్డబ్ల్యూఆర్ఈస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి సోమవారం తనిఖీ చేశారు. ‘కుక్కలు తిన్నాకే తినాలా’ అనే శీర్షికన సోమవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎంపీపీ మేడం జయరామిరెడ్డి, ఎంఈఓలు సత్యనారాయణ, రవిచంద్ర, ఎంపీడీఓ ఉమాదేవిలు గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను పరిశీలించిన జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి ప్రహరీ పడిపోయి ఉండటం గమనించి రెండు సంవత్సరాలైనా నిధులు కేటాయించలేకపోయారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఆమె ఉన్నప్పుడే 30 పైగా శునకాలు ఆవరణలో తిరుగుతుండటం విశేషం. ప్రిన్సిపల్ రమణమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని విచారించారు. కుక్కలు ఆహారాన్ని తింటుంటే చూస్తూ ఉంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వారం చికెన్ పెడుతున్నారా అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ప్రిన్సిపల్ స్థానికంగా ఉండాల్సిందేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. శ్రీదేవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్నామని పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. -
కుడికాలువలో ఇరువురు గల్లంతు
ఒకరు మృతి.. మరొకరి కోసం గాలింపు మాచర్ల రూరల్: నాగార్జునసాగర్ కుడి కాలువలో నీటి ప్రవాహానికి ఓ మహిళ కొట్టుకుని పోగా, ఆమెను రక్షించేందుకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని 25వ వార్డులో ధరణికోట శ్రీలక్ష్మి (25) నివసిస్తోంది. అదే వార్డులో వీర్ల గోవర్ధన్ నివసిస్తున్నాడు. శ్రీలక్ష్మి నాలుగు సంవత్సరాల కిందట భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద నివసిస్తుంది. ఆమెకు 7 సంవత్సరాల కుమారుడు, 5 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు మద్యం తాగి కుడికాలువ వద్ద పడి ఉన్నాడని సమాచారంతో శ్రీలక్ష్మి, గోవర్ధన్లు కలిసి కాలువ వద్దకు వెళ్లారు. శ్రీనివాసరావును లేపి ఇంటికి పంపించే నేపథ్యంలో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు కాలువలోకి దిగారు. శ్రీలక్ష్మి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు ఒడ్డుపై ఉన్న వీర్ల గోవర్ధన్ కాలువలోకి దూకాడు. అతను కూడా ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కొద్ది దూరంలో చేపలు పడుతున్న కొంతమంది శ్రీలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. గోవర్ధన్ కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు. దీనిపై పట్టణ పోలీసులను వివరణ కోరగా కుటుంబ సభ్యులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కుడికాలువలో గల్లంతైన వీర్ల గోవర్ధన్ (ఫైల్) , మృతి చెందిన డి శ్రీలక్ష్మి -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
నగరంపాలెం(గుంటూరువెస్ట్): ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తులతోపాటు దొంగిలించిన సొత్తు విక్రయించి దొంగలకు సహకరించే వ్యక్తిని కూడా గుంటూరు సీసీఎస్, లాలాపేట పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు సంపత్నగర్ మెయిన్రోడ్డులో ఉంటున్న అవ్వారి వెంకటప్పయ్యశాస్త్రి గత నెల 8న తిరుపతి వెళ్లి 12న ఇంటికొచ్చారు. ప్రధాన ద్వారం తాళాలు పగుల కొట్టి ఉంది. బీరువాలో దాచిన 152 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. బాధితుడు లాలాపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ శివప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు సీసీఎస్, లాలాపేట పోలీసులు పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు. గుంటూరు మార్కెట్ సెంటర్లో సంచరిస్తున్న గోరంట్ల తూర్పుబజార్కు చెందిన చిల్లర సురేష్, విజయవాడ రామలింగేశ్వరనగర్ గంగానమ్మ గుడి పక్కన ఉంటున్న కాజా నాగవీరభాస్కరరావులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం ఒప్పుకోవడంతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నాలుగు కేసుల్లో రూ.26.50 లక్షల ఖరీదు చేసే 227 గ్రాముల బంగారు, 182 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ చెప్పారు. దొంగలించిన సొత్తుని విక్రయించి వారికి సహకరిస్తున్న సుగాలినగర్ 4వ వీధికి చెందిన లంకా రాజేష్ను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. -
ఆంగ్లభాషపై పట్టు సాధించాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని హైద్రాబాద్ విల్ టూ కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఉచిత ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఆదివారం ప్రేరణ తరగతులను ఎంఏఎం కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి 200మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ట్రైనర్గా హాజరైన రామేశ్వర్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి తెలుగుతో పాటు ఇంగ్లిష్ మాట్లాడే విధంగా చేయడమే కార్యక్రమ ఉదేశమని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాల్లో 53 వేల మంది ఉపాధ్యాయులకు ఈ తరగతులు పూర్తిచేసినట్టు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, అన్నమయ్య జిలాల్లో పూర్తిచేసామని వివరించారు. ఏపీలో 16జిల్లాల్లో 25వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి రోజూ దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమానికి అవకాశం కల్పించిన డీఈవో చంద్రకళకు ఽకృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వేమూరి శ్రీనివాస్, సుందర్రావు, షేక్ కరీముల్లా, కొండం రాజులు పర్యవేక్షించారు. -
విజేతలకు పతకాలు ప్రదానోత్సవం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఏడాది జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ 2025 ఏపీ విజేతలకు ఆదివారం స్థానిక వెల్కమ్ హోటల్లో పతకాల బహుకరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సలాలిత్ తొట్టెంపూడి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపి నుంచి మొత్తం 520 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో 204 పతకాలు సాధించారన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మల్లిఖార్జున నాయక్, కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, రోడిక్ కన్సల్టెంట్ ఎండీ రాజ్కుమార్లు క్రీడాకారులకు అందజేశారన్నారు. -
స్వర్ణం సాధించిన కేఎల్యూ విద్యార్థి ముఖేష్
తాడేపల్లి రూరల్:ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో కేఎల్యూ విద్యార్థి స్వర్ణపతకం సాధించినట్లు వర్సిటీ స్పోర్ట్స్ విభాగ డీన్ హరికిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయని, రాజస్థాన్ స్టేట్ షూటింగ్ రేంజ్లో ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కేఎల్యూకి ప్రాతినిధ్యం వహించిన నేలవల్లి ముఖేష్ స్వర్ణ పతకం సాధించాడని తెలిపారు. తమ యూనివర్సిటీ నుంచి తనిష్క్ మురళీధర్ నాయుడు, నాగసాయి తరుణ్ కూడిన బృందం రజత పతకాలు సాధించారని తెలిపారు. స్వర్ణ పతకం సాధించిన ముఖేష్ను రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి. రాజకుమార్, వర్సిటీ పీడీలు గౌతమ్,శ్రీహరి పాల్గొన్నారు. -
తప్పుడు కేసులపై సీబీఐ విచారణ జరపాలి
●పిన్నెల్లి సోదరులపై బనాయించినవి అక్రమ కేసులు ●ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు ●న్యాయం ఎప్పటికై నా గెలుస్తుంది ●గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిపిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై బనాయించిన తప్పుడు కేసుపై దమ్ముంటే అధికార పార్టీ సీబీఐ విచారణ జరిపించాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి డిమాండ్చేశారు. పిన్నెల్లి సోదరులపై బనాయించినవి తప్పుడు కేసులనే విషయం జిల్లాలో ఎవరిని అడిగిన వెంటనే చెబుతారని అన్నారు. నరసరావుపేటలోని తన నివాసంలో మహేష్రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులకు పాపం పండింది.. జైలుకు పోతున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, ప్రత్యర్థితో రాజకీయంగా పోటీపడాలే గాని తప్పుడు కేసులు బనాయించి జైలు పంపాలని చూడడం చేతకానితనం అని పేర్కొన్నారు. పోలీసుల వల్ల కాక చివరికి కోర్టులను ప్రభావితం చేసే స్థాయికి దిగజారారని విమర్శించారు. పిన్నెల్లి సోదరులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డితో పాటు జిల్లాలోని ప్రతి కార్యకర్తా వెన్నంటి ఉంటారని తెలిపారు. వెల్దుర్తి మండలం గొల్లపాడులో నాలుగైదు నెలల క్రితం జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు, చంపించిన వాళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలో ప్రధాన నాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేయటం దుష్ట సంప్రదాయానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విలువ ఇస్తామని, తప్పకుండా రామకృష్ణారెడ్డి హాజరవుతారని, న్యాయం కోసం తమ వంతు గట్టిగా పోరాడుతామని మహేష్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ సీపీదే ! మాచర్ల నుంచి శ్రీశైలం వరకు, మళ్లీ అక్కడ నుంచి బాచిపల్లి వరకు జాతీయ రహదారి సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మహేష్రెడ్డి అన్నారు. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒరికెపూడిశెల ప్రాజెక్టును కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొచ్చింది.. రూ.3000 కోట్లు బడ్జెట్ మంజూరు చేయించింది రామకృష్ణారెడ్డి కాదా ? అని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ ద్వారా రూ.150 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. పల్నాడు అభివృద్ధిలో దూసుకుపోయిందని, ఇలా అభివృద్ధి చేయడమేనా? రామకృష్ణారెడ్డి చేసిన పాపం అని బ్రహ్మారెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికలు నాలుగు నెలలు ఉందనంగా జంగమహేశ్వరంలో వైఎస్సార్ సీపీ నాయకుడిని, టీడీపీ నాయకులు చంపారని అంతమాత్రాన తాము శ్రీనివాసరావు మీద తప్పుడు కేసులు పెట్టలేదు కదా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి విషయాలను ఎప్పుడూ రాజకీయంగా ఉపయోగించుకోలేదని తెలిపారు. తాము ఎప్పటికీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. రామకృష్ణారెడ్డి నిర్దోషిగా బయటికి వస్తారని, జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడేందుకు తామంతా కష్టపడతామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. -
బాలోత్సవంలో సందడే.. సందడి
●ఆకట్టుకున్న దేశభక్తి, జానపద గీతాలు ●కోలాటంతో కదం తొక్కిన బాలలు నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం ఆకట్టుకుంది. చిన్నారులు సృజనాత్మకత, నైపుణ్యాలు వారిలో ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చాయి. పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి మూడవ పిల్లల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు రెండో రోజు ఆదివారం రెట్టించిన ఉత్సాహంతో కొనసాగాయి. చిన్నారులు జానపద వేషధారణలతో మైమరిపించారు. కళాశాల ప్రాంగణం బాలల కేరింతలు, చిన్నారుల నవ్వులతో నిండిపోయింది. ముఖ్య అతిథులుగా ఎంఏఎం కళాశాలల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, ఎస్ఎస్ఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామినేని వినోద్కుమార్రెడ్డి హాజరయ్యారు. చిన్నారుల ప్రదర్శనలు తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కోలాటం, లఘు నాటికలు, జానపద నృత్యం–గ్రూపు, పాటలు, స్పెల్ బీ, ప్రాజెక్ట్ పని, రంగ వల్లులు, బుర్రకథ, కథ చెప్పడం, తెలుగు పద్యాలు, అభినయ గేయాలు, దేశభక్తి గేయాలు, రైమ్స్, విచిత్ర వేషధారణ, మెమరీ టెస్ట్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, వక్తృత్వం, మ్యాథ్స్ క్విజ్, మట్టితో బొమ్మలు తయారీ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటికలు, పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయాల్లోనూ ప్రతిభ కనబరిచారు. నృత్య ప్రదర్శనల్లో బాలలు -
కుక్కలు తిన్నాకే తినాలా?
నూజండ్ల: మండల పరిధిలోని ఉప్పలపాడు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అందించాల్సిన మజ్జిగను కుక్క తాగుతూ పలువురికి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు తిన్న ఆహారం తింటే రేబిస్ వ్యాధి సోకే అవకాశాలు ఉందని భయపడ్డారు. అయితే, ఎటువంటి ఇబ్బంది కలగక పోవటంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేర్టేకర్ను వివరణ కోరగా అప్పటికే విద్యార్థులు భోజనాలు ముగించారని, కుక్క తిన్న ఆహారాన్ని పారవేశామన్నారు. పాఠశాలలో కుక్కల,కోతుల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో ప్రిన్సిపాల్ స్థానికంగా ఉండరని విమర్శలున్నాయి. 600 పైగా విద్యార్థినులు ఉన్న వసతి గృహంలో 24 గంటల పర్యవేక్షణ ఉండాలి. కానీ అలా జరగటం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. -
డాక్టర్ జున్ను సాహెబ్కు డబుల్ ధమాకా
●కొండవీడు హైస్కూల్ టీచర్కు రెండు అవార్డులు ●రెండురోజులు రెండు సంస్థల నుంచి అందుకున్న జాతీయ పురస్కారాలు యడ్లపాడు: కొండవీడులోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ షేక్ జున్ను సాహెబ్కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేర్వేరు స్వచ్ఛంద సంస్థలు రెండు జాతీయస్థాయి పురస్కారాలను అందించాయి. విద్య, మానవ సేవ, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు ఆమె అందుకున్నారు. ఇందులో విద్యార్థులకు వినూత్న బోధన, చేతిరాత నైపుణ్యాలు, గ్రీన్ వారియర్స్ పేరిటా అందించిన సేవలకు హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ‘జాతీయ ఉపాధ్యాయ ప్రేరణ అవార్డ్స్–2025’ శనివారం అందుకున్నారు. పేదలకు నిస్వార్థ సహాయం, విద్యార్థులకు కాలిగ్రఫీ ఉచిత శిక్షణ ఉద్యమం, జీవ వైవిధ్య అవగాహన రంగాలలో చేసిన విశేష కృషికి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో ‘ఉత్తమ్ భారత్ పురస్కార్ 2025’ను ఆదివారం అందించింది. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్కుమార్, ఎంపీ మల్లు రవి, బయో డైవర్సిటీ అంబాసిడర్ సుష్మ పుప్పొడి, శారద సంస్థ వ్యవస్థాపకులు కమల మనోహర్, జీహెచ్ఆర్టీ వ్యవస్థాపకులు షేక్ రెహమాన్ చేతుల మీదుగా వీటిని అందుకున్నారు. అతిథులు జున్నుసాహెబ్ నిబద్ధత, సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. అవార్డు గ్రహీత జున్నుసాహెబ్ మాట్లాడుతూ ఈ పురస్కారాలతో బాధ్యత మరింత పెరిగిందని, తన సంకల్పాన్ని మరింత విస్తరింపజేస్తానని చెప్పారు. పలువురు విద్యవేత్తలు, ప్రముఖులు, సహోపాధ్యాయులు జున్ను మాస్టారుకు అభినందనలు తెలిపారు. -
దయచేసి ధాన్యం కొనండి !
రైతుల వేడుకోలు కారెంపూడి: మండలంలో వరి నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, పంట చేతికొచ్చినా రైతుల మొహంలో నవ్వులేదు. ధాన్యం కొనే దిక్కు లేదు. బీపీటీ, కేఎన్ఎం రకాలను వ్యాపారులు అసలు అడగడం లేదు. ఒక వేళ అడిగినా రూ.1,200లోపు 75 కేజీల బస్తా అడుగుతున్నారు. నిల్వ చేసుకునే అవకాశం, ఆర్థిక వెసులుబాటు లేని రైతులు ఆ ధరకే తెగనమ్ముతున్నారు. ఇంత తక్కువ రేటుకు అమ్మితే మిగులు ఉండదని దిగులు చెందుతున్నారు. ఎకరానికి సగటు దిగుబడి 35 బస్తాలు వస్తున్నాయి. ఎరువుల కొట్లలో బాకీలుంటే మాత్రం వారు ఏదో ఒక రేటుకు కొంటున్నారు. కాని మిగిలిన రైతులు వ్యాపారులను బతిమిలాడుకుని అమ్ముకుంటున్న పరిస్ధితులు కూడా తలెత్తుతున్నాయి. దిగుబడి ఉన్నా ధర లేదు మండలంలో 18 వేల ఎకరాలలో ఖరీఫ్లో వరి సాగైంది. ప్రస్తుతం మండలంలో సగం దాకా వరి నూర్పిళ్లు పూర్తయ్యాయి. అయినా కూడా ధర మాత్రం పెరగడం లేదు. చిట్టిపొట్టి రకం ధాన్యం మాత్రం బస్తా రూ.1,650 దాకా పలుకుతోంది. ఆరబెట్టకుండా ఉన్న బస్తా కనీసం రూ.1,500 లేకపోతే గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధర అయినా కల్పించాలని వేడుకుంటున్నారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని తాము గతంలో చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం బాధను బయటకు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్ధితి కన్పిస్తోంది. శనివారం సాయంత్రం ఎన్ఎస్పీ కాలనీ గురుకుల పాఠశాల వద్ద ఒక చిన్నకారు రైతు బస్తా రూ. 1,300కు అమ్మానని వాపోయాడు. ఎకరాకు 35 బస్తాలయ్యాయని ఈ రేటుకు రెక్కల కష్టం కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగైతే వ్యవసాయం చేయడం కంటే కూలికి పోవడం మేలని సాటి రైతుకు చెప్పి వాపోయాడు. ఇలా ఎంతో మంది బాధపడుతున్నారు. గ్రామాల్లో ధాన్యం రాసుల కళకళలతో ఆనందంగా ఉండాల్సిన రైతులు ధాన్యం కొనే దిక్కు లేరని బాధపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. మద్దతు ధర కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
13న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన
నగరంపాలెం: సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బృందావన్గార్డెన్న్స్లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంగీతంలో మనుషులతోపాటు పశుపక్షాదులు ఓలలాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వాహకులు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో హిందూ ధర్మం అంటే సన్మార్గమని అన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించే ఒక జీవన విధానమని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో భాగంగా రాష్ట్రస్థాయిలో వందల మంది గాయకులతో ద్వితీయ అన్న మయ్య సహస్ర గళార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7799800900 నంబర్లో సంప్రదించాలని కోరారు. చిలకలూరిపేట: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యా క్ట్రెస్ అని సంబోధించాలని కోరారు. విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్లు చోరీ చేసే ముఠాకు చెక్
కంకిపాడు: ఖాళీగా ఉన్న వెంచర్లలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్లను చోరీ చేసే ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గరికే చందు ఇళ్ల వెంబడి ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. తన గ్రామానికే చెందిన గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, మంగళగిరి మండలం యర్రబాలెంనకు చెందిన పాత ఇనుప కొట్టు నిర్వాహకుడు కుంటిగుర్ల నరసింహరాజుతో కలిసి జల్సాలు తీర్చుకోవటానికి, డబ్బుకోసం విద్యుత్ వైర్లు చోరీని మార్గంగా ఎంచుకున్నారు. కంకిపాడు, జగన్నాధపురం, కొణతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్తంభాలకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారన్నారు. గరికే చందుపై గతంలో నాలుగు వైరు చోరీ కేసులు ఉన్నాయి. విద్యుత్ వైర్లు చోరీపై నమోదైన కేసులో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్ వద్ద గరికే చందు, గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, కుంటిగుర్ల నరసింహరాజు అల్యూమినియం రేకులు ఏరుతూ సంచుల్లో మూట గట్టడాన్ని పోలీసులు గుర్తించారు. గరికే చందు, కుంటిగుర్ల నరసింహరాజు పోలీసులకు చిక్కగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. కంకిపాడు పరిసర గ్రామాల్లో అల్యూమినయం వైర్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులు చందు, నరసింహరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు విచారణలో ముఖ్యభూమిక వహించిన ఎస్ఐ డి.సందీప్, పీఎస్ఐ ఎస్.సురేష్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పి.ఎస్.ఎన్.మూర్తి, సయ్యద్ బాజీబాబును ప్రత్యేకంగా అభినందించారు. -
గంజాయి అమ్ముతున్న ఐదుగురు యువకుల అరెస్టు
మాచర్ల రూరల్: గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి బాటిల్స్లో నింపి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 494 గ్రాముల 260 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువకులలో ఒకడైన మచిలీపట్నానికి చెందిన రమణీ అరవింద్, షేక్ నాగూర్ షరీఫ్, షేక్ నజీర్, షేక్ పఠాన్ సిరాన్ ఖాన్, షేక్ సలీం అనే యువకులు ఒడిస్సాలోని చిత్రకొండ పరిసరాలలో గంజాయితో తయారు చేసే హ్యాష్ ఆయిల్ బాటిల్స్ తెచ్చి మాచర్ల పట్టణ, పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నారు. రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా నేతృత్వంలో వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్ తనకు వచ్చిన సమాచారంతో మండాదిలోని కానాగు వాగు దగ్గరకు సిబ్బందితో వెళ్లారు.అక్కడ గంజాయి ఆయిల్ను 5ఎం.ఎల్. బాటిళ్లలో నింపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు యువకులు సులభమార్గంలో డబ్బులు సంపాదించేందుకు విద్యార్థులు, యువకులను టార్గెట్గా చేసుకొని గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. వీటిని అరికట్టేందుకు పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టణ, గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాలేజీలలో అవగాహన కార్యక్రమాలతో పాటు యాజమాన్యంతోనూ ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకుని, యువకులను అదుపులోకి తీసుకున్న రూరల్ సీఐ షేక్ నసీబ్ బాషా, వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్, సిబ్బందిలను పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. వీరికి రివార్డులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. 494 గ్రాముల లిక్విడ్ స్వాధీనం -
స్వాహా..!
పల్నాడుసోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అసైన్డ్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూముల్లో ఎవరి భూములు ఎక్కడ అనే దానిపై రైతులకు స్పష్టత లేదు. భూ ఆక్రమణదారులు మాత్రం ప్రధాన రహదారికి ఒక పక్కన ఉన్న చెరువులను మొత్తం ఆక్రమించి చెరువు కట్టలను ధ్వంసం చేయడంపై పలువురు రైతులు ప్రశ్నించారు. దీంతో ఈ ముఠా సభ్యులు వారిపై బెదిరింపులకు దిగారు. అధికారం మాది.. మేం చెప్పినట్టు వింటే డబ్బులు వస్తాయి లేకుంటే మీ భూమి కూడా మీకు ఉండదు అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. భూముల ఆక్రమణ వెనుక పెద్దల హస్తం ఉందని భావించిన రైతులు దీనిపై మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. నరసరావుపేట రూరల్: భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములపై అధికారపార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. మాయమాటలతో పేదలను లోబర్చుకుని నామమాత్రంగా డబ్బులు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. 20 ఎకరాలకు పైగా ఇప్పటికే భూ బకాసురుల చేతుల్లోకి వెళ్లగా భూములు ఇవ్వని రైతులపై బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఉన్నా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. మండలంలోని పమిడిమర్రు గ్రామంలోని వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో గ్రామంలోని పేదలకు ఈ భూములను కేటాయించారు. సర్వే నెంబరు 44, 45లో దాదాపు 92 మంది రైతులకు 82 ఎకరాలను కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆధీనంలోనే భూములు ఉన్నాయి. రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ఎవరి భూమి ఎక్కడ అనేది అధికారులు చూపలేదు. దీంతో రైతులు ఉమ్మడిగా చేపల చెరువుల నిర్వాహకులకు కౌలుకు ఇచ్చి ప్రతి ఏడాది కౌలు పొందుతున్నారు. పేదలకు కేటాయించిన భూముల్లో ఉన్న చేపల చెరువులను ఆక్రమణదారులు పొక్లెయిన్లతో పూడ్చివేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా గ్రామంలో భూ ఆక్రమణదారుల హడావుడి నెలకుంది. ట్రాక్టర్లు, పొక్లెయిన్లతో చెరువు కట్టలను పగులకొట్టి భూములను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా ఇదే విధంగా చదును చేశారు. పమిడిమర్రులో ఆక్రమణకు గురవుతున్న భూములు విలువ ఎకరం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఆక్రమణదారులు రైతులకు ప్రస్తుతం ఎకరానికి రూ.50వేలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. విడతల వారీగా ఎకరానికి రూ.2లక్షలు చెల్లిస్తామని నమ్మించి భూములను ఆక్రమిస్తున్నారు. పొక్లెయిన్తో చేపల చెరువు కట్టలను ధ్వంసం చేస్తున్న దృశ్యం 7పమిడిమర్రు నుంచి కాకాని జేఎన్టీయూఎన్కు వెళ్లే దారిలో ఉన్న ఈ భూములపై అధికార పార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఒక్క చోటే ఉండటంతో దీనిని సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. గ్రామంలోని టీడీపీ నాయకుడిని రంగంలోకి దింపి పేదలకు డబ్బు ఆశ చూపి భూములను సొంతం చేసుకుంటున్నారు. గ్రామంలోని టీడీపీ నాయకుడితో పాటు పట్టణానికి చెందిన దళిత సంఘం నాయకుడు ఇందులో కీలకపాత్ర పొషిస్తున్నారు. దళితులకు చెందిన భూములు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తెరమీదకు తెచ్చి ముఖ్యనేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికి 20 మందికి పైగా రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు. పేదలకు కేటాయించిన భూములు కొనుగోలు చేసిన వారికి ఆ భూములపై ఎటువంటి హక్కు ఉండదు. అసైన్డ్ భూముల విక్రయాలు జరుగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాలరావు, తహసీల్దార్ దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల చేశారు. సముద్రంలోనికి 3,625 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.60 అడుగులకు చేరింది. ఇది 284.7452 టీఎంసీలకు సమానం. -
కష్టాల ‘ప్లాజా’ !
● బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల ఇక్కట్లు ● ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేయించిన అధికారులు ● అంబులెన్సులు సైతం క్యూలో రావల్సిందేనంటూ హుకుంమార్టూరు: జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అధికారులు, సిబ్బంది తీరుతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల నుంచి సంవత్సరానికి రూ.కోట్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నా.. వారి అవసరాలకు సరిపడా సౌకర్యాలను సమకూర్చడం లేదని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మరో కొత్త సమస్యకు తెర లేపడం గమనార్హం. టోల్ ప్లాజాకు ఇరువైపులా ఫ్రీ లెఫ్ట్ పేరుతో రెండు మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల్లో వీవీఐపీల వాహనాలు, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, కలెక్టర్, కేంద్ర, రాష్ట్రస్థాయి అధికారుల వంటి అత్యవసర వాహనాలు టోల్ ఫీజుతో సంబంధం లేకుండా వెళ్లిపోతుంటాయి. వీటితోపాటు టోల్ ప్లాజా పరిసర గ్రామాలకు చెందిన రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం లోకల్ పాస్తో ఈ మార్గాల్లోనే వెళ్లి పోతుంటాయి. ఈ కారణంగా ఈ అత్యవసర వాహనాలు ఆలస్యం లేకుండా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదు. ● అదే రోజు అర్ధరాత్రి మార్టూరు వైపు నుంచి ఒంగోలుకు రోగులతో వెళ్తున్న ఓ అంబులెన్స్ ఫ్రీ లెఫ్ట్ మార్గం మూసి వేసి ఉండటంతో మిగిలిన వాహనాలతో పాటు క్యూలోనే ఉండటంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న రోగుల పరిస్థితి చూసి ముఖ్యమంత్రి స్థాయి ప్రజాప్రతినిధులే అంబులెన్సకు దారి వదులుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బొల్లాపల్లి టోల్ ప్లాజా అధికారులు మాత్రం ఇందుకు మినహాయింపులాగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఈ విషయమై సిబ్బందిని వివరణ కోరగా.. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఆదేశాలతో తాము ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా టోల్ ప్లాజా ఉన్నతాధికారులు స్థానిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు, పరిసర గ్రామాల ప్రజలతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది సైతం కోరటం విశేషం. -
నవోదయ మోడల్ టెస్టుకు 150 మంది హాజరు
నరసరావుపేట: జిల్లాలోని విద్యార్థులు ప్రతిభ, విద్యానైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆదివారం కేర్ పబ్లిక్ స్కూలులో జవహర్ నవోదయ విద్యాసంస్థల ఆరో తరగతి ప్రవేశానికి మోడల్ టెస్ట్ నిర్వహించారు. దీనికి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి 150 మందికిపైగా విద్యార్థులు హాజరై మోడల్ పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ షేక్ నాగూర్వలి పేర్కొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్య ప్రాముఖ్యత వివరిస్తూ ఒక వ్యక్తి జీవితం సమూలంగా మార్చే ఆయుధం విద్యకు ఉందన్నారు. మోడల్ టెస్టులో ప్రథమ విజేతగా నిల్చిన రొంపిచర్లకు చెందిన ఎన్ హర్షిణికి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు సాధించిన ఒంగోలుకు చెందిన డి.అశ్రీత్, మూడవ బహుమతి రూ.3వేలును బొగ్గవరానికి చెందిన జి.సహస్రకు శాసనసభ్యులు అందజేశారు. ఛైర్మన్ కె.కోటిరెడ్డి, కరస్పాండెంట్ కె.జ్ఞానసుందరి, డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, రిటైర్డు అధ్యాపకులు కె.రాజారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గన్నవరం: జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏపీ అంతర్ జిల్లాల రగ్బీ అండర్–14 చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల బాల బాలికల జట్టు పాల్గొన్నాయి. తొలిరోజు బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కృష్ణాజిల్లా జట్టుతో పాటు నెల్లూరు, కడప, కర్నూలు జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో ఉమ్మడి తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జట్లు సెమీఫైనల్కు చేరాయి. -
అత్యవసర వాహనాలు సైతం క్యూలోనే..
గత నెల రోజులుగా ఫ్రీ లెఫ్ట్ మార్గాలను రెండు వైపులా అధికారులు సిబ్బందితో మూసి వేయించారు. దీనివలన అత్యవసరంగా వెళ్లవలసిన వాహనాలతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతుల వాహనాలు సైతం మిగిలిన వాహనాలతో పాటు ప్లాజా రూటులోనే ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణంలో జాప్యం పెరిగి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పటిలాగే ఫ్రీ లెఫ్ట్ మార్గంలోనే వెళ్తామంటూ సమీప గ్రామానికి చెందిన కొందరు రైతులు గత గురువారం ట్రాక్టర్తో ఆ మార్గానికి అడ్డుగా ఉంచిన సిమెంట్ దిమ్మెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై రైతులు టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ సిబ్బంది ఆ మార్గంలో ఉంచిన అడ్డంకులను తొలగించకపోవడం గమనార్హం. -
ఐశ్వర్య ప్రదాయినిగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు ఐశ్వర్య ప్రదాయినిగా దర్శనమిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అమ్మవారి భక్తులు చందోలు గ్రామానికి వచ్చి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పెదకాకాని: భక్తుల సౌకర్యార్థం పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శివాలయానికి విచ్చేసే భక్తులు ఆలయంలో వసతి గదులు, దర్శనాలు, రాహు కేతు పూజలు, స్వామి వారి అభిషేకాలు, చండీ రుద్ర హోమ పూజలు ఇతర సేవలు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రసాదాల టోకెన్ల విక్రయాలు సైతం ఆన్లైన్లో ఉండటం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనాల టికెట్స్ బుక్ చేసుకోవడంతోపాటు ప్రసాదం టోకెన్లు పొందిన భక్తులను ఆలయం వద్ద సాధారణ క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా త్వరితగతిన దర్శనం, ప్రసాదాలు పొందుటకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు వివిధ సేవల కోసం ఆలయ వెబ్సైట్ ద్వారా కానీ మనమిత్ర వాట్స్యాప్ నెంబరు 95552300009 ద్వారా క్రెడిట్కార్డు, డెబిట్కార్డు, గూగుల్ పే, ఫోన్పే, పేటీయం, బీమ్ యూపీఎల్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఆయా సేవల టికెట్లు పొందవచ్చని డీసీ తెలిపారు. విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శని, ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించారు. దీంతో లాంచీ స్టేషన్కు లక్షా 20 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ కె మస్తాన్బాబు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు లో ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,334 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. డీఈఓ చంద్రకళ నరసరావుపేటఈస్ట్: క్రీడలలో పల్నాడు జిల్లాను ముందుంచేందుకు అన్ని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా ఉపాధ్యాయుల క్రీడా పోటీలను డీఈఓ శనివా రం ప్రారంభించారు. లూథరన్ హైస్కూల్లో ఉపాధ్యాయుల క్రికెట్, శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయినిల త్రోబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలలో పాల్గొనే ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులను సమన్వయ పరుచుకొని ఎంచుకున్న క్రీడలో నైపుణ్యం సాధించాలన్నారు. అనంతరం లింగంగుంట్ల పీడబ్ల్యూడీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. గురజాలరూరల్: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 10వ అదనపు జిల్లా జడ్జి జి ప్రియదర్శిని తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, 10వ అదనపు జిల్లా జడ్జి జి ప్రియదర్శిని అధ్యక్షతన కోర్టులో పోలీసులతో అవగాహన కార్యక్రమం శనివా రం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధిక కేసులు పరిష్కరించే విధంగా చూడాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేవీ సత్యనారాయణ, డీఎస్పీ జగదీష్, సీఐలు ఆవుల భాస్కర్, భాస్కర్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : ఉండవల్లి మండల ప్రాథమిక పరిషత్ స్కూల్లో శనివారం గుడ్షెపర్డ్ సిస్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక దాడులు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్ విద్య మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు చిన్నారులు తమ బాధకు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని అన్నారు. బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ సిబ్బంది పోతురాజు, అనూష, నాగమణి, అనిల్ కుమార్, బాబు జగజ్జీవన్రావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి సెంటర్ సీడ్ యాక్సెస్ రోడ్లో వీవీఐపీలు పర్యటిస్తుండడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని కల్వర్టులు, ముళ్ల పొదలు, ఇతర పైపులైన్లు, చెక్ పోస్టులతో పాటు ఇతర బ్రిడ్జిల వద్ద బాంబ్ స్క్వాడ్, ఇతర బృందాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ఏఆర్ ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీవీఐపీలు, వీఐపీలు నివాసం ఉంటున్నారని, వారి భద్రత దృష్ట్యా మొత్తం 40 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించార ని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్జీ డీఎస్పీ రామకృష్ణ, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ శ్రీనివాసరావు, ఎస్ఎస్జీ ఆర్ఐలు నరేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మంచికల్లు(రెంటచింతల): పలనాటి కోనసీమగా పేరొందిన మంచికల్లు గ్రామంలో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ వేడుకలు ప్రారంభమైనట్లు కారంపూడి వెంకటాచార్యులు శనివారం తెలిపారు. తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం కుంకుమ బండ్లు, శనివారం దీనబండారంతో ఈ వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు. మార్గశిర ఏకాదశి మొదలు బహుళపాడ్యమి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మంగళగిరిటౌన్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫలితాల్లో మంగళగిరి విద్యార్థి ప్రతిభ చాటి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు. మంగళగిరిలోని సాయినగర్కు చెందిన పాపన జితేంద్ర ఆర్థోపెడిక్ విభాగంలో 800 మార్కులకు 568 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఏలూరు జిల్లా ఆశ్రమ వైద్య కళాశాలలో జితేంద్ర వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ చేబ్రోలు శ్రీనివాసరావు, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డి జితేంద్రను అభినందించారు. తమ కుమారుడు కష్టపడి చదివి పీజీ ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని జితేంద్ర తల్లిదండ్రులు శివరామ్ ప్రసాద్, ధనలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.చిలకలూరిపేట: అంగట్లో అన్నీ ఉన్నా... అల్లుడి నోట్లో శని ఉంది అన్న చందంగా ఉంది చిలకలూరిపేట 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి. విశాలమైన అధునాతన భవనాల నిర్మాణం, ఆపరేషన్ థియేటర్లు, ఎన్బీఎస్యూ (న్యూ బోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్), స్పెషలిస్టు వైద్యుల నియామకం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే సంతరించుకున్నాయి. అయితే నేటి పాలకుల నిర్లక్ష్యం ఈ ఆసుపత్రి పాలిట శాపంగా మారింది. ఆసుపత్రికి అవసరమైన అదనపు సౌకర్యాలు...అత్యాధునిక పరికరాలకు గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరై, పనులు సైతం ప్రారంభమైనా అవి నేటికీ పూర్తి కాకపోవడం ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు శాపంగా మారింది. అదనపు సౌకర్యాల కోసం... ఆసుపత్రికి అవసరమైన అదనపు సౌకర్యాలైన ప్రహరీ నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్లు, కొత్త జనరేటర్, అదనపు శస్త్ర చికిత్స పరికరాలు వంటి వాటి కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.9.45 కోట్లు మంజూరయ్యాయి. నాటి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని 2023 ఆగస్టు మూడో తేదీన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఆ తదుపరి ప్రభుత్వం మారినా నేటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. జాతీయ రహదారిపై విస్తరించి ఉన్న చిలకలూరిపేట ఆసుపత్రికి నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురైన కేసులు వస్తుంటాయి. ఇక్కడ ఆర్థోఫెడిక్ సర్జన్ ఉన్నా సదరం క్యాంపుల కోసం ఇతర ప్రాంతాలకు డ్యూటీ వేస్తున్నారు. దీంతో ప్రమాద బాధితులు ఎవరు వచ్చినా గుంటూరు పంపుతున్నారు. ఇక్కడ ఉన్న ముగ్గురు గైనకాలజిస్టుల్లో సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ కేవీ లక్ష్మీకుమారిని డిప్యుటేషన్పై డైరెక్టరేట్ ఆఫ్ సెక్రటరియేట్కు పంపటంతో ఆ విభాగంలో కొరత ఏర్పడింది. ఇక రేడియాలజీ విభాగానికి చెందిన వైశాలి చైల్డ్ కేర్ లీవులో ఉండటంతో ప్రస్తుతానికి ఆ విభాగం సేవలు కుంటుపడ్డాయి. జనరేటర్ లేక... ఎప్పటిదో 30 పడకల ఆసుపత్రి నాటి పాత జనరేటర్ పూర్తిగా పనికిరాకుండా పోయింది. 50కేవీ జనరేటర్ అవసరం ఉన్నా నేటికి సమకూరలేదు. మరోవైపు పారిశుధ్యం పూర్తిగా పడకవేసింది. వాహనాలు మితిమీరిన వేగంతో పాఠశాల ముందుగా వెళుతున్నాయి. ప్రధానంగా అధిక లోడుతో వెళ్లే లారీలను ఒక్కసారిగా నియంత్రించటం కష్టసాధ్యం. వేగాన్ని నియంత్రించేలా రహదారిపై పాఠశాలకు కొద్ది దూరం వరకు స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. – బత్తుల శ్రీనివాసరావు, ఎస్ఎంసీ మాజీ చైర్మన్, చాగంటివారిపాలెం ప్రధాన రహదారి కావటంతో వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. పాఠశాల ఉంది అని తెలియజేసేలా రహదారి వెంబడి సూచికలు ఏర్పాటు చేస్తే ఎంతో మేలు. కొంత మేర వేగాన్ని నియంత్రించవచ్చు. వాహనాలను తప్పించుకొని వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. – బొరిగర్ల వెంకట్రావు, చాగంటివారిపాలెం 7 నిర్మాణం పూర్తి చేసుకున్న ఏరియా ఆసుపత్రి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం. అదనపు శస్త్ర చికిత్స పరికరాలు, జనరేటర్లను త్వరలోనే సమకూర్చుకుంటాం. ఈ విషయాలను ఇప్పటికే పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ప్రహరీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ టి శ్రీనివాసరావు, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
ఆటో బోల్తాపడి ఒకరు మృతి
ఇద్దరికి తీవ్రగాయాలు రెంటచింతల: రెంటచింతల గ్రామ శివారులో ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రెంటాల గ్రామానికి చెందిన ఆడేపు మరియదాసు(34) గురజాలలో ఓ హోటల్లో పనిచేస్తూ సాయంత్రం తిరిగి ఇంటికి ఆటోలో వస్తున్న నేపథ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనం రావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరియదాసుకు తీవ్ర గాయాలు కాగా వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెంటాలకు చెందిన కొర్రా హనిమి, రెంటచింతలకు చెందిన మణికుమార్లకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య దుర్గమ్మ, కార్తీక్, నాగరాజు కుమారులు ఉన్నారు. గుంటూరు లీగల్: గుంటూరు ఈస్ట్, వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి మహమ్మద్ గౌస్ 14 మందికి జరిమానా విధించారు. కొద్ది సమయం కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని సూచించారు. ఆల్కహాల్ సేవించిన పర్సంటేజ్ని బట్టి ఆయా వ్యక్తులకు రూ. 5వేలు, రూ. 7వేలు న్యాయమూర్తి జరిమానా విధించారు. చీరాల రూరల్: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ గూడ్స్రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్.కొండయ్య తెలిపిన వివరాల మేరకు సుమారు.. 50 సంవత్సరాలు వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైల్వేస్టేషన్లోని నాలుగో నంబర్ ప్లాట్ఫాంపైకి వెళ్లేందుకు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళుతున్న గూడ్స్రైలు అతడిని ఢీకొట్టడంతో మృత్యువాత పడినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రతిభ దివ్యం.. పోరు ఉత్కంఠం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): దివ్యాంగుల ప్రతిభాపాటవాలు సమాజానికే ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను డీఆర్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారన్నారు. ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా, మోటివేటర్లుగా ఉన్నారని చెప్పారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చెప్పారు. దివ్యాంగుల్లో ప్రతిభకు కొదవలేదని వారిలో ఉన్న సృజనాత్మకతను మరింతగా వెలికి తీసి పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగ క్రీడాకారులు క్రీడల్లో అభివృద్ధి చెంది జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఇన్చార్జి దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకుల డి.దుర్గా భాయి మాట్లాడుతూ డిసెంబర్ మూడో తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను వివిధ అంశాల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. క్రీడా పోటీల్లోనూ, దివ్యాంగుల దినోత్సవంలోనూ పాల్గొనే దివ్యాంగ ఉద్యోగులకు ఆన్డ్యూటీగా పరిగణించడం జరుగుతుందన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజినీర్ నజీమా, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులు సొంత వాహనాల్లో ధాన్యం రవాణా చేసుకోవచ్చు
కొల్లిపర: ఇకనుంచి ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాల నుంచి జీపీఎస్ అనుసంధానం లేకుండానే వారి సొంత వాహనాల ద్వారా కూడా మిల్లర్ల వద్దకు ధాన్యం తరలించుకొనే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించిందని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ రైతులతో అన్నారు. మండల పరిధిలోని హనుమాన్పాలెం, తూములూరు, చివలూరు గ్రామాల్లో రోడ్డు వెంట ఆరబోసిన ధాన్యం రాశులను శనివారం తహసీల్దార్ జి.సిద్ధార్ధతో కలసి ఆయన పరిశీలించి, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెండు రోజుల్లో దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉంటూ వరి నూర్పిళ్లను వేగవంతం చేయాలన్నారు. ఇటువంటి సమయంలో రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో జీపీఎస్తో సంబంధం లేకుండా రైతులు తమ సొంత ట్రాక్టర్లు లేకపోతే ఇతర వాహనాల ద్వారా వారి ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకొని, కేటాయించిన మిల్లర్లు వద్దకు వారే నేరుగా రవాణా చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జేసీ వెంట ఇన్చార్జి ఎంపీడీఓ భార్గవ్, ఏఓ శ్రీనివాసరెడ్డి, రైతులు అవుతు సుధాకరరెడ్డి, ఎ.శివారెడ్డి, అడపా నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
నేలబావిలో యువకుడి మృతదేహం
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెం పెనుమాక రోడ్డు శివారులో పెనుమాక టిడ్కో గృహాలకు వెళ్లే మార్గంలో ఓ నేలబావిలో మృతదేహం ఉన్నట్లు బంధువులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి కొత్తపేటకు చెందిన శంకర్, వీరకుమారి దంపతుల రెండవ కుమారుడు పిన్నిక ఆనంద్ (24) చదువు అనంతరం ఫొటోగ్రఫీ చేస్తు హైదరాబాద్లో నివాసముంటూ ఖాళీ సమయాల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 26వ తేదీ నాయనమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. అంత్యక్రియల అనంతరం 27వ తేదీ ఉదయం అన్నయ్య, మరో స్నేహితుడితో కలసి వెళ్లి మద్యం సేవించి సాయంత్రం 4 గంటల సమయంలో అన్నదమ్ములిద్దరూ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆనంద్ ద్విచక్రవాహనంపై ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. ఆ రాత్రి ఇంటికిరాలేదు. 28వ తేదీ మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో తన కుమారుడు కనిపించడం లేదంటూ శంకర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేయకుండానే బంధువులు చుట్టుపక్కలప్రాంతాల్లో వెతుకుతుండగా యర్రబాలెంకు చెందిన ఓ వ్యక్తి డొంకరోడ్డులో మీ అబ్బాయి ద్విచక్రవాహనం ఉందని తెలియజేయడంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా పంటపొలంలో పాడైపోయిన బావిలో ఆనంద్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చి బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి శరీరంలో కంటి కింద, తల వెనుక భాగంలో దెబ్బలు ఉన్నాయని, హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసు అని, పోస్ట్మార్టం రిపోర్టు వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. పెనుమాకలో ఓ యువతిని ఆనంద్ ప్రేమించినట్లు వదంతులు వినిపిస్తున్నా యి. ఆనంద్ను హత్యచేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. -
పల్నాటి మాత... పాతపాటేశ్వరమ్మ
గురజాల: పట్టణంలో వందలాది సంవత్సరాల కిందట పాతపాటేశ్వరి అమ్మవారిదేవిగా అవతరించి పలనాటి మాతగా భక్తుల పూజలను అందుకుంటుంది. దుగ్గరాజు వంశం వారిచే ప్రతిష్టించబడినట్లు దేవాలయంలో ఏర్పాటుచేసిన శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. పల్నాడు నడిబొడ్డున అమ్మవారి ఆలయం ఉండటం పల్నాడు ప్రాంత వాసులకు గర్వకారణం. అమ్మవారి మహిమలు కోకొల్లలు. పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయాలు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ పల్నాటి మాతగా పేరుగాంచిన గురజాల పాతపాటేశ్వరి అమ్మవారి చరిత్ర మాత్రమే ప్రసిద్ధి పొందింది. నేటి నుంచి తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభం ఆదివారం నుంచి అమ్మవారి బియ్యం కొలత, డిసెంబర్ 1వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, 2వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, 3వ తేదీ అమ్మవారి బియ్యం విడుపు కొలత, 4వ తేది అమ్మవారి పొంగళ్ల సమర్పణ, 5వ తేదీన అమ్మవారి వసంతోత్సవం కార్యక్రమంతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటాం. అమ్మవారి దేవాలయం కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులుకాగలరు. – చీతిరాల సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యుడు -
జేఎన్వీ ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు విడుదల
చిలకలూరిపేటటౌన్: నవోదయ విద్యాలయ సమితి డిసెంబర్ 13న నిర్వహించే ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేసినట్లు మద్దిరాల జేఎన్వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు తెలిపారు. శనివారం ఆయన వివరాలను వెల్లడించారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 01.30 వరకు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ను వెంటనే అధికారిక వెబ్సైట్: హెచ్టీటీపీఎస్:// సీబీఎస్ఈఐటీ ఎంఎస్. ఆర్సీఐ ఎల్.జీవోవీ.ఇన్/ఎన్వీఎస్/ నుండి ఉచితంగా డౌన్న్లోడ్ చేసుకోవాలని సూచించారు. ముఖ్య సూచికలు... విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిట్ కార్డును డౌనన్లోడ్ చేయడంలో లేదా ఇతర పరీక్ష సంబంధిత విషయాలలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, తక్షణ సహాయం కోసం 9494676751 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలన్నారు. అడ్మిట్కార్డులో పొందు పరిచిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సరి చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజున అభ్యర్థులు అడ్మిట్కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈ రెండూ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో ఉదయం 10.30 గంటలకంటే ముందే చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
చౌక దుకాణాల్లో ఈజీ మార్ట్లు ఏర్పాటుకు సన్నాహాలు
సత్తెనపల్లి: దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుపేదలకు రేషన్ బియ్యంతోపాటు తక్కువ ధరలకు అన్ని రకాల నిత్యావసరాలు ఒకేచోట చౌక ధరల దుకాణాల్లోనే అందించాలనే ఉద్దేశంతో చౌక దుకాణాల్లో ఈజీ మార్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ ప్రసాద్ చెప్పారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శనివారం సత్తెనపల్లి చౌక ధరల దుకాణాల డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎస్ఓ మాట్లాడుతూ ఔత్సాహికులైన డీలర్లు ముందుకు వస్తే ఆ నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఏఏ సరుకులు ఈజీ మార్ట్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచాలి? వాటి వల్లన అటు పేదలకు కలిగే మేలు? ఇటు డీలర్లకు ఒనగూరే ఉపాధి గురించి ఈజీ మార్ట్ ప్రతినిధి బోస్ వివరించారు. సమావేశంలో డీఏఓ చంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నెల్లూరు రవికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బోస్బాబు, చౌక ధరల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు. రేషన్ షాపులకు సకాలంలో అందించాలి రాజుపాలెం: మండలంలోని అన్ని రేషన్ షాపులకు సకాలంలో బియ్యం, పంచదార పంపించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఎంవీ ప్రసాద్ తెలిపారు. రాజుపాలెంలోని ప్రభుత్వ పౌరసరఫరాల గోదామును ఆయన శనివారం పరిశీలించారు. ఉన్న స్టాక్ మొత్తాన్ని తనిఖీ చేసి స్టాకు రిజిస్టర్లను పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లు గమనించారు. ఆయన వెంట తహసీల్దారు ఎన్ సరోజ, డిప్యూటీ తహసీల్దారు జానీబాషా, గోదాం సిబ్బంది ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఎంవీ ప్రసాద్ -
రొంపిచర్లలో కేంద్రియ విద్యాలయం నిర్మించాలంటూ ఆందోళన
రొంపిచర్ల: రొంపిచర్లలో కేంద్రియ విద్యాలయం నిర్మించాలంటూ శనివారం బీసీ సంక్షేమ సంఘం, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వం వల్ల కేంద్రియ విద్యాలయం నిర్మాణ పనులు జరగలేదని అన్నారు. రొంపిచర్లలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. తక్షణమే కేంద్రియ విద్యాలయం నిర్మించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. తొలుత స్థానిక చెరువు కట్ట సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ బి.నిర్మల కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్ పాల్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బూదాల బాబూరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, సీఐటీయూ మండల కార్యదర్శి సరికొండ వెంకటేశ్వరరాజు, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గాలి సాంబశివరావు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సరికొండ తిమ్మరాజు, బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు సుతారం విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు కోనేటి నరసింహారావు, భగత్ సింగ్ భవన్ నిర్వహణ కమిటీ సభ్యులు ఎస్.రామకష్ణంరాజు, శేషంరాజు, మస్తాన్ వలి, సీపీఐ మండల కార్యదర్శి రొడ్డా అంజిరెడ్డి, మండల నాయకులు మధుసూదనరావు, పిడెం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్పై ఈ–కేవైసీ కత్తి
సత్తెనపల్లి: రేషన్ కార్డుదారులపై ఈ–కేవైసీ పిడుగు పడింది. పేదల గుర్తింపునకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ తరుణంలో ఇందులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ నెలాఖరులోపు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు ఇటీవల ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా చేయించు కోలేకపోతే వారికి ఇతర సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు. చేయించుకోలేదా .. సరుకులు బంద్ ఈ–కేవైసీ చేయించుకోకపోతే డిసెంబర్ ఒకటి నుంచి సరుకులను పంపిణీ చేయరనే చర్చ నడుస్తోంది. సర్కార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు పొందే ప్రతి ఒక్కరూ తమ వేలి ముద్రవేసే ఈ–కేవైసీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఇది లేకపోయినా, సరుకులు సజావుగా అందేవి. ఇక నుంచి అలా కుదరదని, ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కార్డుతో అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేసి, డీలర్లకు ఆ సమాచారాన్ని అందజేశారు. ఈ మేరకు జిల్లాలో దీన్ని చేయించుకోని ఐదేళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు రేషన్ షాపులకు వెళ్లి ఈ–పాస్ యంత్రంపై వేలిముద్ర వేసి డీలర్ లాగిన్లో ఈ– కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంది. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు.. ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ .. ఈ–కేవైసీ కోసం వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న చిరుద్యోగులు, కూలి పనులు చేసుకునేవారు దీనికి దూరమవుతున్నారు. ఈ కసరత్తుతో రేషన్ కార్డులకు భారీగా కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఈ– కేవైసీ ప్రక్రియను దాదాపు పూర్తి చేశాం. ఇంకా 3.62 శాతం మాత్రమే మిగిలి ఉంది. వారు స్థానికంగా లేకపోవడం కారణంగా ఈ–కేవైసీ కాలేదు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా ఈరోజుతో ఆఖరు. ఎవరైనా ఉంటే ఈరోజు తప్పనిసరిగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందాలి. మిగిలి పోయిన వారి సమాచారాన్ని నివేదిక తయారు చేసి నివేదికతోపాటు స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ప్రభుత్వానికి అందచేయనున్నాం. – ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పల్నాడు జిల్లాలో 1,289 చౌకధరల దుకాణాల పరిధిలో 6,30,347 మంది రేషన్ కార్డుదారుల్లో 18,57,768 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 17,44,739 మంది సభ్యులు ఈ– కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఇంకా 62,066 మంది ఈ– కేవైసీ పెండింగ్లో ఉంది. వీరికి ఈ ఒక్కరోజే అవకాశం ఉండడంతో ఎలా సాధ్యమవుతుందని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా నరసరావుపేటలో 4,765 మంది ఈ–కేవైసీ పెండింగ్లో ఉండగా, అత్యల్పంగా శావల్యాపురం కనమర్లపూడిలో 948 మంది ఈ–కేవైసీ పెండింగ్లో ఉంది. ఇక స్మార్ట్ రేషన్ కార్డులను పరిశీలిస్తే, జిల్లాలో 6,30,347 మంది స్మార్ట్ రేషన్ కార్డు దారులకుగాను ఇప్పటివరకు 5,71,387 మందికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా 58,960 మందికి సంబంధించిన స్మార్రేషన్ కార్డులు పొందక పోవడంతో అవి పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఈ రోజు అందుకోకపోతే స్మార్ట్ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. -
రోడ్డు దాటాలంటే వణుకు..
ముప్పాళ్ల: ముప్పాళ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు నిత్యం భయం భయంగా పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలను ఆనుకునే సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారి ఉండటంతో రోడ్డు దాటాలంటే వణికిపోతున్నారు. రహదారిపై ప్రమాద సూచికలు కూడా లేకపోవటం ముప్పుగా మారింది. ఇక్కడ సుమారు 430 మందికి పైగా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు సమీప గ్రామాలైన ముప్పాళ్ల, గోళ్లపాడు, కుందురువారిపాలెం, లంకెలకూరపాడు, నరసరావుపేట మండలంలోని ములకలూరు, ఇస్సపాలెం, రెడ్డిపాలెం గ్రామాల నుంచి వచ్చి వెళుతుంటారు. పాఠశాలకు వచ్చే సమయంలో, ఇంటికి వెళ్లే సమయంతో పాటుగా ముప్పాళ్లకు చెందిన పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వెవెళ్లే సమయంలో రహదారి దాటడం సవాల్గా మారింది. నిత్యం వందలాది వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతున్నాయి. పాఠశాల ఉందనే కనీస అవగాహన లేక, అదే వేగంతో వెళుతున్నాయి. నిబంధనల ప్రకారం పాఠశాల సమీపంలో రహదారిపై హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయలేదు. రహదారిపై వేసిన స్పీడు బ్రేకర్ కూడా కనిపించకపోవటంతో వాహనాల వేగానికి నియంత్రణే కరువైంది. -
అంగన్వాడీ..పర్యవేక్షణేదీ!
పల్నాడుశనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025గట్టెక్కించిన ‘గ్రేస్’.. శిక్షణలో ‘గ్రేట్’! పరీక్షలు విద్యార్థులకా... వర్సిటీకా..!7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శుక్రవారం 581.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,929 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది. ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్స్ను ఆర్డీవో శ్రీనివాసరావు శుక్రవారం తనిఖీ చేశారు. ఐసీడీఎస్లో సూపర్వైజర్ల కొరత జిల్లాలో సూపర్వైజర్ పోస్టుల ఖాళీలు–16 ఉన్నవారిపై పనిభారంతో సతమతం వివిధ కార్యక్రమాల అమలుకు ఆటంకం పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
పిడుగురాళ్ల: అర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సులో ప్రయాణిస్తున్న కాండ్రు శివప్రసాద్(69) పిడుగురాళ్ల పట్టణ సమీపానికి రాగానే ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్షిప్ సమీపంలో బస్సు ఆపి చూసే సరికి అప్పటికే పరిస్థితి విషమించటంతో అంబులెన్స్కు సమాచారం అందించి బంధువులు హుటాహుటిన పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పిడుగురాళ్ల బస్సు కాదని, మాచర్ల డిపోకు చెందిన అద్దె బస్సు గుంటూరు నుంచి మాచర్ల వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం తెలిసిందన్నారు. జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎస్ఎస్ అండ్ ఎన్ విద్యార్థులు నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థులు కె.శివసాకేత్, కె.రుద్రపతాప్ సైదులురెడ్డి ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలో శివసాకేత్ 200 మీటర్లు బటర్ఫ్లై, రుద్రప్రతాప్ 4‘‘100 మీటర్లు విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఢిల్లీలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న 69వ అండర్–19 జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు పాలకవర్గ అధ్యక్ష్య, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, జాయింట్ సెక్రటరీ ఊటుకూరి వెంకటఅప్పారావు, వైస్ప్రిన్సిపల్డాక్టర్ పి.శ్రీనివాససాయి అభినందించారు. ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి రేపల్లె: ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రవరం వద్ద చోటు చేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. తోమాటి సామ్రాజ్యం (80) రుద్రవరం వద్ద పండ్లు అమ్ముకుంటూ రహదారిపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో శుక్రవారం ఢీకొంది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కార్తికేయ ఎంపిక వేటపాలెం: అంతర్ జిల్లాల ఫెన్సిలింగ్ పోటీలకు పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మేకపోతుల యతిన్ శ్రీకార్తికేయ ఎంపికై నట్లు హెచ్ఎం దీప్తి శుక్రవారం తెలిపారు. కొనసీమ జిల్లాలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో కార్తికేయ రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించాడని పేర్కొన్నారు. మహారాష్ట్రలో డిసెంబర్లో జరగనున్న ఎస్జీఎఫ్ నేషనల్ ఫెన్సింగ్ టీం ఈవెంట్కు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. -
అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు
అమరావతి: లింగాపురం గ్రామానికి చెందిన కొచ్చిరి వసంతరావు ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవటంపై లింగాపురం గ్రామస్తులు, స్నేహితులు, అప్పటి సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశా రు. నిరుపేద కుటుంబంలో జన్మించిన వసంతరావు శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్లో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ధరణికోట రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళాశాలలో చదివారు. 1991లో కేంద్ర హోం శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2025 రిపబ్లిక్ డేనాడు ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపిక య్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వసంతరావు శుక్రవారం చత్తీస్గడ్లోని రాయపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు.శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో 1981–82 బ్యాచ్ పదో తరగతి విద్యార్థు లంతా తమ తోటి విద్యార్థి జాతీయ స్థాయిలో ఘనత సాధించినందుకు హర్షంవ్యక్తం చేశారు. నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : గుంటూరులోని లక్ష్మీపురం ఆనం మెడికల్ హబ్ వద్ద శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తోన్న పడిపూజ శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది. శబరిమల ఆచారం ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి ఏ.శ్రీనివాసన్ నాయర్ నేతృత్వంలో పూజలు చేపట్టగా, సంతోష్ స్వామి బృందం అయ్యప్ప, భవానీ పూజలను భక్తితో నిర్వహించారు. వందలాది మంది భక్తులకు పూజ కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. పడిపూజ మహోత్సవం లో సీనియర్ వైద్యులు ఆర్.మురళీబాబురావు, బీవీ.సుధీర్బాబు, వంశీకృష్ణ, శ్రీబాలసుధ డయాగ్నస్టిక్స్ నిర్వాహాకులు ఆనం సంజీవరెడ్డి, బాలబాణి, వైద్యులు ఆనం గోపాల్రెడ్డి, నర్మదాసాయి, లక్ష్మీరెడ్డి, రెడ్డి అంకమ్మరెడ్డి, వంగా సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తెనాలి: పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులో సువర్ణభారతి క్షేత్ర సరస్వతీ దేవాలయం నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ చేశారు. నీటిపంపు వేయటం ద్వారా గంగ పూజిత పనులను అక్కడ ఆరంభించారు. మహిళలతో లలితా సహస్ర పారాయణం, విష్ణుసహస్ర పారాయణం, హ నుమాన్ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీసాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకష్ణ, రావూరి సుబ్బారావు, గొడవర్తి సాయి హరేరామ్, మాజేటి గోపి పాల్గొన్నారు. -
అనుభవం ఎంతో నేర్పింది
● మారుమూల ప్రాంతం నుంచి వచ్చి పట్టుదలతో గుర్తింపు ● బహుముఖ ప్రజ్ఞాశాలి జేఎన్వీ పీఈటీ గోవిందమ్మ ● సాదాసీదా నేపథ్యం నుంచి ఉత్తమ శిక్షకురాలిగా రాణింపు చిలకలూరిపేట టౌన్/యడ్లపాడు: విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పరీక్షల్లో ఓ అమ్మాయి మ్యాథ్స్లో ఫెయిలైంది. ఇక విద్యకు ఫుల్స్టాప్ పడిందనే తరుణంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ప్రకటించిన రెండు గ్రేస్ మార్కులు ఆమె విద్యాభ్యాసాన్ని మలుపు తిప్పాయి. నేడు ఆమె కృషి వందల మంది విద్యార్థినులను జాతీయ క్రీడా వేదికలకు పరిచయం చేస్తోంది. ఆవిడే చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయం వ్యాయామ ఉపాధ్యాయురాలు గుదిబెండి గోవిందమ్మ. పట్టుదలే ఆయుధం బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఎర్రవారిపాలెంకు చెందిన గోవిందమ్మది వ్యవసాయ కుటుంబం. సాగు, పాడి పనులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య అనేక అవరోధాలను ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలను దాటుతూ... డిగ్రీతోపాటు బీపీఎడ్, ఎంపీఈడీ, సీవైఈడీ, యోగా పట్టభద్రురాలుగా ప్రావీణ్యం పొందారు. ఉన్నత విద్యలో ప్రతిదీ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణతను సాధించడం ఆమె పట్టుదలకు తార్కాణం. విద్యతోపాటు బుర్రకథ చెప్పడంలో దిట్ట. రేడియో గాయకురాలు, కల్చరల్ విభాగంలోనూ పాఠశాల దశలోనే ప్రవేశం ఉంది. అప్పట్లోనే ఉత్తమ విద్యార్థి అవార్డులు అందుకోవడం ఆమెలో దాగి ఉన్న బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. 32 ఏళ్ల నిబద్ధత.. 209 మందికి స్ఫూర్తి గోవిందమ్మ 32 ఏళ్లుగా పలు జేఎన్వీలలో పనిచేస్తూ, 59 ఏళ్లు వచ్చినా నేటికీ క్రీడాకారులతో సమానంగా ఉత్సాహంగా శిక్షణ ఇస్తుండటం ఆమె నిబద్ధతకు నిదర్శనం. అథ్లెటిక్స్, ఖో–ఖో, కబడ్డీ, క్రికెట్, మార్షల్ ఆర్ట్స్ వంటి బహుళ క్రీడల్లో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు ఆసక్తి కలిగేలా భిన్నంగా నేర్పించడమే ఆమె ప్రత్యేకత. ఆమె మార్గదర్శకత్వంలో ఇప్పటివరకు 209 మంది విద్యార్థినులు జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. గ్రామీణ బాలికలకు వెన్నుదన్ను... 1994లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తండ్రి దొరైరాజు కూడా గోవిందమ్మ కృషిని మెచ్చి ఎంతో ప్రోత్సహించారు. నెల్లూరు జేఎన్వీ విద్యార్థినులను జమ్మూకశ్మీర్లో జరిగిన క్రికెట్ పోటీల్లో తొలిసారిగా ఆడించారు. కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా ఆర్చరీపై మెళకువలు నేర్చుకొని శిక్షణ ఇస్తున్నారు. నెల్లూరు జేఎన్వీలో క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 లక్షలు తీసుకువచ్చి, మౌలిక వసతులు కల్పించారు. ఓటమిని లెక్కచేయకుండా, తన దారిని తానే నిర్మించుకుని, ఎందరికో ఆదర్శంగా నిలిచిన గోవిందమ్మ ప్రస్థానం నేటి యువతకు గొప్ప స్ఫూర్తి. తనను తాను క్రీడలకే అంకితం చేసుకున్నారామె. సాదాసీదా గ్రామీణ ప్రాంత బాలికల కష్టాలే నావి. ఓటమి అడ్డంకి కాదు.. ఆరంభమని అనుభవం నేర్పింది. పదితోనే విద్య ఆగుతుందని నిరాశ చెందిన తరుణంలో ఒక్క అవకాశం ఎన్నో అవరోధాల్ని దాటించేసింది. అది అదృష్టమో లేక అవకాశమో స్పష్టంగా తెలీదు. కానీ, బాల్యంలో సమాజం, కష్టాలు నన్ను ఎంతో బాధించి ప్రతి అడుగును వెనక్కు లాగేందుకు ప్రయత్నించాయి. నాలో తెలియని ధైర్యం, మొండితనం, పట్టుదలే లక్ష్యాన్ని సాధించేలా చేశాయి. నాలాంటి ఎందరో బాలికలకు భరోసాగా నిలిచే గొప్ప అవకాశాన్ని ఇచ్చాయి. – జి. గోవిందమ్మ, పీఈటీ, జేఎన్వీ– మద్దిరాల -
బీపీఎస్ సద్వినియోగం చేసుకోండి
నరసరావుపేట: అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీము) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు ఉపసంచాలకులు పి.మధుకుమార్ కోరారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ స్టాఫ్, డబ్ల్యుపీఆర్ఎస్, లైసెన్స్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ)లకు ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాలులో బీపీఎస్, ఎల్ఆర్ఎస్లపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టు 31లోపు నిర్మించిన భవనాలకు మాత్రమే అపరాధ రుసుం చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చన్నారు. జీఓ జారీచేసిన 120 రోజుల లోపు అర్జీ దాఖలు చేయాలన్నారు. వార్డుల వారీగా బీపీఎస్ పరిధిలోకి వచ్చే అక్రమ కట్టడాలను గుర్తించి వాటి యజమానులను అప్రమత్తం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు పాల్గొని మాట్లాడుతూ నిర్ణీత సమయంలోపు యజమానులు అర్జీలు దాఖలు చేసి అపరాధ రుసుం చెల్లించేలా ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కోరారు. అలాగే ఎల్టీపీలు తమ సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు ఉపసంచాలకులు పి.మధుకుమార్ -
గణపవరం మున్సిపాలిటీనా... పంచాయతీనా!
నాదెండ్ల: పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన గణపవరం మున్సిపాలిటీలో ఉన్నదా..గ్రామ పంచాయతీగా ఉన్నది తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధికి దూరమైంది. చిలకలూరిపేట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 2019లో గజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో అటు మున్సిపాలిటీలో విలీనం కాక, ఇటు పంచాయతీలో కొనసాగకపోవటంతో అభివృద్ధి నిలిచిపోయింది. పన్నుల రూపంలో వచ్చే నామమాత్రపు ఆదాయంతోనే గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. విలీన ప్రక్రియను త్వరగా ఓ కొలిక్కి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఆరేళ్లుగా నిలిచిపోయిన నిధులు 1958లో గణపవరం గ్రామ పంచాయతీ ఏర్పడింది. 2019లో చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన అనంతరం కొన్ని నెలలు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మున్సిపల్ నిధులతో జరిగాయి. న్యాయస్థానం విలీన ప్రక్రియపై స్టే విధించటంతో మున్సిపాలిటీ నుండి రికార్డులు తిరిగి పంచాయతీకి చేరాయి. అప్పటి నుండి పంచాయతీకి రావలసిన ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్లు విడుదల కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో రావలసిన నిధులు సైతం నిలిచిపోయాయి. ఆరేళ్లుగా 15వ ఆర్థికసంఘం నిధులు ఏడాదికి రూ.80 లక్షల చొప్పున, పాపులేషన్ గ్రాంట్ రూ.1.68 లక్షలు, వృత్తి పన్నులు రూ.2 లక్షలు, స్టాంపు డ్యూటీ రూ.25–30 లక్షలు నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం అమలు కాకపోవటంతో ఆ నిధులు సైతం ఆగిపోయాయి. తగ్గిన ఆదాయం గ్రామంలో సుమారు నలభై వరకూ చిన్న, పెద్ద తరహా పరిశ్రమలున్నాయి. పత్తి, పొగాకు, ఆయిల్ తదితర పరిశ్రమలు ఉండటంతో ఏటా పంచాయతీకి ఆస్తి పన్ను రూపంలో భారీగా ఆదాయం సమకూరేది. ఏడాదికి రూ.82 లక్షలు ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా, ఇందులో ఇంటిపన్ను రూ.27 లక్షలు, పరిశ్రమల పన్ను రూ.55 లక్షలుగా ఉంది. కరోనా అనంతరం పలు పరిశ్రమలు మూతపడటంతో పన్నుల చెల్లింపులో ఒడిదుడుకులు నెలకొన్నాయి. రూ.55 లక్షల డిమాండ్కుగాను రూ.30లక్షలు మాత్రమే వసూలు అవుతున్నాయి. ఏడాదికి రూ.57 లక్షలు ఆస్తి పన్నులు, నీటి కుళాయిల ఫీజు రూ.10 లక్షలు మాత్రమే పంచాయతీకి జమ అవుతున్నాయి. సిబ్బంది జీతభత్యాలకే ఏడాదికి రూ.78 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వీధిలైట్లు, బోరు రిపేర్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామసభల నిర్వహణ తదితర పనులకు పంచాయతీ నిధులు సరిపోవటం లేదు. నెలలు గడుస్తున్నా తేలని విలీన ప్రక్రియ ప్రభుత్వం నుంచి నిధులు బంద్ గ్రామంలో ఆగిన అభివృద్ధి -
విద్యార్థుల భద్రత ముఖ్యం
పిడుగురాళ్ల: విద్యార్థుల భద్రత ముఖ్యమని, వారిని జాగ్రత్తగా తీసుకు వెళ్లాల్సిన బాధ్యత డ్రైవర్లు, క్లీనర్లపై ఉందని జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతపై పిడుగురాళ్ల పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన బస్సు డ్రైవర్లకు రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంజీవ్కుమా ర్ మాట్లాడుతూ... బస్సులు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. స్కూల్ విద్యార్థులను బస్సుల్లో ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు నిలబడకుండా సీటులో కూర్చునే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా బస్సు డ్రైవర్, క్లీనర్పై ఉంటుందన్నారు. అధికంగా విద్యార్థులను ఎక్కించుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందన్నారు. విద్యార్థి జీవితం మనపైనే ఆధారపడి ఉంటుందని అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు ఏమైనా ఉంటే యాజమాన్యానికి తెలియజేసి, ఆ బస్సులను మార్చే విధంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల రవాణా శాఖ అధికారి రాంబాబు, జూనియర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్కుమార్ -
రేపు జిల్లాస్థాయి వెటర్న్ క్రీడా పోటీలు
గుంటూరువెస్ట్(క్రీడలు): జిల్లాస్థాయిలో క్రీడా పోటీలను ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాదల చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య మహిళలకు, పురుషులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాకింగ్, త్రో, రన్నింగ్, జంపింగ్ తదితర పోటీలను మహిళలకు, పురుషులకు విభాగాల వారీగా వేర్వేరుగా జరుగుతాయని చెప్పారు. జిల్లా స్థాయిలో ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి వెటరన్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పోటీల వివరాలను 9000979056, 9949526697లో సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన క్రీడా పోస్టర్ను అసోసియేషన్ సెక్రెటరీ జి.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కిరణ్, ఈసీ మెంబర్ జి.గోపీనాథ్, ట్రెజరర్ సత్యనారాయణ ఎన్టీఆర్ స్టేడియంలో విడుదల చేస్తామన్నారు. పశ్చిమ డెల్టాకు 3,225 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమడెల్టాకు 3,225 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్కు 196 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్కు 338 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 84, నిజాంపట్నం కాలువకు 86, కొమ్మూరు కాలువకు 1,891క్యూసెక్కులు విడుదల చేశారు. జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఐదుగురు ఎంపిక తూములూరు(కొల్లిపర): ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నున్నలో అండర్– 19, 14 విభాగాలల్లో తూములూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్ధులకు పాఠశాలలో పీడీ ఎస్.సాంబశివరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు అభినందించారు. పోలీస్ సిబ్బంది సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది సమస్యలకు నిర్ణీత వేళల్లో పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్న్స్ డే నిర్వహించారు. వ్యక్తిగత, సర్వీస్, బదిలీలు, పరిపాలనా సమస్యలపై వినతులు అందించారు. పదిహేను మంది వినతులు అందించగా, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు నిర్ణీత వేళలో పరిష్కారమయ్యేలా దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. -
ఏపీ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
నెహ్రూనగర్: అమరావతిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్కు రాష్ట్ర వ్యాప్తంగా 1,351 శాఖల ద్వారా ఒక కోటి ముఫ్పై లక్షల ఖాతాదారులకు నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ, రాష్ట్రంలో అగ్రగామి బ్యాంకుగా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో పనిచేస్తోందని, అమరావతిలో కేటాయించిన స్థలానికి నిర్మాణ అనుమతులు రాగానే నూతన భవన నిర్మాన పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
అన్నదాత..దుఃఖీభవ
చంద్రబాబు కోతలు నాకు సొంత భూమి 1.23 ఎకరాలు ఉంది. దీనికి తోడు 1.25 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నా. మొదటి విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ జమయ్యాయి. రెండో విడత ఈ నెల 19న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రూ.2 వేలు జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.5వేలు జమ కాలేదు. ఇదేమిటని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే, వారు చెప్పిన మాటలు విని ఖంగుతిన్నంత పని అయ్యింది. బతికి ఉండగానే చనిపోయానిని పోర్టల్లో చూపుతోంది. ఈ ఘోరం ఏమిటో అర్థం కావటం లేదు. – పెండ్యాల నాగమురళి, రైతు, కంకణాలపల్లిసత్తెనపల్లి: అన్నదాత సుఖీభవ పథకం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024–25లో సాయాన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025–26లో మొదటి విడత పెట్టుబడి సాయాన్ని 2025 ఆగస్ట్ 2న విడుదల చేశారు. మొదటి విడతలో 2,39,959 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత అర్హతలు ఉన్నా సాయం అందలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నెల 19న రెండో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించి మొదటి విడత జాబితానే పరిగణలోకి తీసుకోవడం చూస్తే వేలాది మంది రైతులకు ఈ విడత కూడా నిరాశ తప్పని పరిస్థితి. పీఎం కిసాన్తో కలిపి పెట్టుబడి సాయం... చంద్రబాబు ప్రభుత్వం 2025 ఆగస్ట్ 2న తొలి విడతగా 2,39,959 రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ సాయాన్ని పరిమితం చేసింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ.167.97 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఈ నెల 19న రెండో విడత 2,40,530 మంది రైతులకు రూ.158.91 కోట్లు విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ పాలనలో వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులతో పోలిస్తే జిల్లాలో 40,222 మంది రైతులకు మొండి చేయి చూపింది. 2024 ఎన్నికల సమయంలో పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి ఇస్తుండడం గమనార్హం. నాకు సొంత భూమి ఎకరం ఉంది. పత్తి సాగు చేస్తున్నా. ప్రకృతి వైపరీత్యాలతో మోంథా తుఫాన్కు తడిసి పత్తి కాయలు నల్లగా మారాయి. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కు అర్హుడునని నా సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. కానీ రెండు విడతల్లోనూ పెట్టుబడి సాయం లబ్ధి చేకూరలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే ప్రాసెస్లో ఉందని చెబుతున్నారు. రెండో విడత కూడా నిధులు విడుదలైతే ఇంకా మొదటి విడత కూడా నాకు అంద లేదు. సమస్య ఎక్కడ ఉందో అధికారులు పరిశీలించి లబ్ధి చేకూర్చాలి. – బన్నారావూరి వెంకటేశ్వరరావు, రైతు, లేమల్లె 2019–20 2,41,515 326.04 2020–21 2,50,469 338.13 2021–22 2,48,812 335.90 2022–23 2,66,871 360.27 2023–24 2,80,181 378.24 -
తూకం... మోసం.. !
జీరో సరిగా చూడండి.. రెండు కిలోలు సరిపోయింది చూడండి.. అని ఎంతో శ్రద్ధగా చెబుతుంటే సంతోషంగా జేబులో డబ్బులు తీసి ఇస్తాం. రెండు కిలోల సంచి బరువు తక్కువగా అనిపించినా, కళ్లతో చూశాం కదా.. నిజమేనని మనకు మనమే సర్దుకుని వెళతాం. అయితే ఆ నిజాయతీ మాటల వెనుక ఉన్న మోసం.. కళ్లను మాయ చేసే తూకం తెలిస్తే మైకం కమ్ముతుంది. తక్కెడలో మోసాలను అరికట్టడంతో అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత కళ్ల ముందు కదలాడతాయి. నరసరావుపేట టౌన్: వంట గదిలో ఉప్పు, పప్పు, కూరగాయలు ఇలా ఏ సరుకులు కావాలన్నా పక్కనే ఉన్న చిల్లర దుకాణం నుంచి లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొనుగోలు చేస్తుంటాం. కొందరు పావు కిలో, కిలో ఇలా స్థోమత మేరకు సరుకులు తెచ్చుకుంటారు. ఇంకాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఒకేసారి నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేస్తారు. ఇలా ప్రతి నెలా మధ్య తరగతి కుటుంబానికి సుమారు రూ.3 వేలు నుంచి రూ.5 వేలు ఖర్చవుతుంది. అయితే ఇలా మనం తెచ్చుకునే సరుకుల కొలత కళ్లతో చూసిందే నిజం అని నమ్ముతుంటాం. కానీ మన కళ్లను ఏమార్చి తూకాన్ని మార్చి జేబులు గుల్ల చేస్తున్నారు. 5 కిలోల సరుకు 7.50 కిలోలట.. నరసరావుపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారి జె. సాయి శ్రీకర్ గత ఆదివారం స్థానిక చేపల మార్కెట్ను తనిఖీ చేశారు. అక్కడ ఐదు కేజీల చేపలు తూకం వేస్తే 7.50 కేజీలు చూపించాయి. దీంతో వచ్చిన అధికారులతోపాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. మార్కెట్ మొత్తం తనిఖీ చేసిన అధికారులు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. దీంతో వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించి అధికారులు చేతులు దులుపుకున్నారు. నిలువు దోపిడీ.. ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు మార్కెట్కు క్యూ కడతారు. అక్కడ రద్దీ కారణంగా త్వరగా ఇంటికి వెళ్లేందుకు తొందర పడుతుంటారు. ఇదే అదనుగా మార్కెట్లో వ్యాపారులు.. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క ఆదివారమే మార్కెట్లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎలక్ట్రికల్ కాటాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతికతలో లోపాలను గుర్తించిన వ్యాపారులు తూకంలో దగా చేస్తున్నారు. కేజీకి సుమారు 200 నుంచి 250 గ్రాముల వరకు వ్యత్యాసం ఉండేలా ఎలక్ట్రికల్ కాటాలో అమర్చుతున్నారు. కాటా పెట్టే సమయంలో జీరో చూపించటంతో వినియోగదారులు తూకం విషయంలో అనుమానించటం లేదు. తీరా కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిన తర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. జరిమానాతో ఆగేనా ? నరసరావుపేటలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీ చేసినప్పుడు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని తెలిసినా అధికారులు మాత్రం తూతూమంత్రం జరిమానాలతో సరిపెట్టారు. అసలు ఈ జరినామాతో అక్రమ వ్యాపారుల్లో మార్పు వస్తుందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. అక్రమాలకు పాల్పడినవారిని నిందితులుగా గుర్తించి న్యాయస్థానాల్లో నిలబెట్టవచ్చు. వారిపై నేరం రుజువైతే శిక్షలు పడే అవకాశం కూడా లేకపోలేదు. ఈ పరిణామాలతో అక్రమార్కుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కళ్లముందు తూకంలో మోసం గుర్తించినా అధికారులు మాత్రం కేవలం జరిమానాలతో సరిపెట్టడం వినియోగదారులను ఆగ్రహానికి గురిచేస్తుంది. -
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
తాడికొండ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజధానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు తెలిపారు. తుళ్లూరు పరిధిలోని నేలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను వారు పరిశీలించారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏపీ సీఆర్డీఏ కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికారులతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. తెలుగు మహాసభలకు ఆహ్వానం గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు నగరంలో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహను ఆహ్వానించినట్లు పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీ నరసింహను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభల ప్రారంభోత్సవానికి సతీసమేతంగా వచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించారని తెలిపారు. పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరగనున్న పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేపట్టినట్లు గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఏఎన్యూలో స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ప్రకటించిన సీఈఓ పేరుతో ఈ నెల 26వ తేదీన సాక్షిలో కథనం వెలువడింది. దీంతో సీఈఓ ఆలపాటి మాట్లాడుతూ అన్ని పరీక్ష పేపర్లకు ఫీజు రూ.980 చొప్పున డిసెంబర్ 1వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఫైరింగ్ సమయంలో వేటకు వెళ్లొద్దు బాపట్ల టౌన్: ఎయిర్ఫోర్స్ అధికారులు ఫైరింగ్ చేసే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. గురువారం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బాపట్ల మండలం సూర్యలంక, పాండురంగాపురం గ్రామాల్లో మత్స్యకారులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వేటకు వెళ్లరాదన్నారు. సూర్యలంక ఎయిర్ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతుందని వివరించారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2025గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం భట్టిప్రోలు: బ్రహ్మ విద్యాశ్రమంలో 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు బూర్లె అరుణ కుమారి తెలిపారు. పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు రెండు వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 582.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,272 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
ఎండుతున్న పంటలు
నరసరావుపేట రూరల్: కాలువ మరమ్మతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కుప్పగంజి వాగు మళ్లింపు పథకంలోని వందల ఎకరాల చివరి భూములకు నీరు అందక పంటల ఎండిపోయే దశలో ఉన్నాయి. ఎండుతున్న పంటలను రక్షించుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంట కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. కుప్పగంజి వాగు నీటి మళ్లింపు కాలువ పరిధిలో మండలంలోని కేఎం అగ్రహారం, గుంటగార్లపాడు, రంగారెడ్డిపాలెం, ములకలూరు, జొన్నలగడ్డ తదితర గ్రామాల్లో సుమారు 700 ఎకరాలు సాగులో ఉంది. ఏళ్ల తరబడి మరమ్మతులు లేవు... కేఎం అగ్రహారం నుంచి ప్రారంభమయ్యే కాలువ గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోలేదు. కాలువ పూడికతో నిండిపోవడంతో చివరి భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మిరప, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మిరప రైతులు ఎకరాకు రూ.50 వేలు, మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.40వేలు పెట్టుబడి పెట్టారు. పంటలు ఎండిపోతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో రైతులు ఎకరా చొప్పున డబ్బులు వసూలు చేసి కాలువ మరమ్మతు చేపట్టారు. జేసీబీతో పూడికతీత ప్రారంభించారు. కౌలు రైతు సంఘం జిల్లానాయకులు కామినేని రామారావు, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు కొరిటాల గోపాలరావు, కృష్ణారెడ్డి తదితరులు ఎండుతున్న పంటలను, కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు స్పందించి కాలువ మరమ్మతుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు
నరసరావుపేట: బాల్య వివాహాలను ప్రోత్సహించినా, హాజరైనా నిందితులకు రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి హెచ్చరించారు. గురువారం ప్రకాష్నగర్ షాదీఖానాలో సీడీపీఓ ఎం.కాంతకుమారి అధ్యక్షతన బాల్ వివాహ్ ముక్త భారత్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉమాదేవి మాట్లాడుతూ బాల్య వివాహం వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు. బాల్య వివాహం గురించి సమాచారం తెలిస్తే గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, మండల స్థాయిలో సీడీపీవో, తహసీల్దార్, ఐసీడీఎస్ సూపర్వైజర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. పల్నాడును బాల్యవివాహా రహిత జిల్లాగా చేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. అదనపు సీడీపీఓ మాణిక్యాలరావు, నరసరావుపేట, రొంపిచర్ల మండల అధికారులు, విద్యాశాకాధికారులు, మిషన్శక్తి కో ఆర్డినేటర్, ఐసీడీఎస్ అధికారులు, బాలల పరిరక్షణ వన్స్టాప్ సెంటర్ ప్రతినిధులు, సూపర్వైజర్లు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
19, 20వ తేదీల్లో కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సంకల్ప్’
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరంలో గల కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి విద్యార్థుల సాంకేతిక మేనేజ్మెంటు సదస్సు (సంకల్ప్ 2025) గోడ ప్రతులను గురువారం కళాశాల చైర్మన్ కళ్లం మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప్ పేరుతో ఏటా విద్యార్థుల్లో నైపుణ్యతలను మెరుగు దిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపారు. కళాశాల డైరెక్టర్ ఎం. ఉమాశంకరరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 19, 20వ తేదీల్లో సంకల్ప్ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పెద్దఎత్తున రాష్ట్ర, జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారన్నారు. సాంకేతిక, మేనేజ్మెంటు విభాగాలలో ప్రతిభ పాటవాలను ప్రదర్శించడం ద్వారా పెద్దఎత్తున పారితోషికాలు కూడా అందుకుంటారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.ఎస్.బి. రెడ్డి, కళ్లం భరద్వాజ, సంకల్ప్ నిర్వహణ సంచాలకులు హనుమంత్ప్రసాద్, కళాశాల డీన్ ఉపాధి కల్పన విభాగం పీఎల్ మాధవరావు పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): డిసెంబరు 1 నుంచి 20వ తేదీ వరకు ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో పదిశాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సామ్రాజ్యం గురువారం తెలిపారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ ఇంద్ర బస్సు చార్జి గతంలో రూ. 870 ఉండగా, ఇప్పుడు రూ. 790కి తగ్గిందన్నారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ అమరావతి బస్సుల చార్జీ గతంలో రూ. 970 ఉండగా, రూ. 880కు తగ్గించినట్లు వెల్లడించారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ వయా మంగళగిరి మీదుగా వెళ్లే బస్సు చార్జీ రూ. 700 ఉండగా, డిసెంబరు 1 నుంచి రూ. 640 తగ్గిందన్నారు. తెనాలి – బీహెచ్ఈఎల్ ఇంద్ర బస్సు రూ. 710, తెనాలి – విశాఖపట్నం బస్సు చార్జీ రూ. 850కు తగ్గించినట్లు తెలిపారు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్కు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రాకేష్ అనే యువకుడు బాలికను రెండు నెలల క్రితం మాయమాటలు చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాలీబాల్ పోటీల విజేత కృష్ణవేణి జట్టు
నరసరావుపేట ఈస్ట్: స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వర్సీటీ యోగా కోఆర్డినేటర్ ఆచార్య బి.సూర్యనారాయణరావు, కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య మాట్లాడుతూ పోటీల్లో క్రీడాకారులు చూపిన క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి అభినందనీయన్నారు. కళాశాలతోనే క్రీడలను వదలకుండా రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకట్రావు, డాక్టర్ గౌరీశంకర్, అబ్బాయి చౌదరి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్కే సతీష్బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు పాల్గొన్నారు. క్రీడాకారులను అభినందించి బహుమతులు అందించారు. వరుసగా మూడోసారి విజేతగా కృష్ణవేణి టోర్నమెంట్ విజేతగా వరుసగా మూడోసారి కృష్ణవేణి డిగ్రీ కళాశాల నిలిచింది. టోర్నమెంట్లో కళాశాలల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. లీగ్ దశలో ఫైనల్స్లో కృష్ణవేణి, వర్సిటీ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. తొలి రెండు సెట్లును కృష్ణవేణి జట్టు 27–25, 26–24 తేడాతో గెలుపొందగా, మూడవ సెట్లో పుంజుకున్న వర్సిటీ జట్టు 22–25 తేడాతో గెలుపొందింది. నాలుగవ సెట్లో కృష్ణవేణి జట్టు పక్కా ప్రణాళికతో వర్సిటీ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 25–13 తేడాతో గెలుపొంది కప్పును కై వశం చేసుకుంది. వర్సిటీ జట్టు రన్నరప్గా, తృతీయ స్థానంలో ధనలక్ష్మి వ్యాయామ కళాశాల (ముప్పాళ్ల), నాల్గవ స్థానంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు నిలిచాయి. రన్నర్స్గా వర్సిటీ జట్టు -
వైభవంగా సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ
బెల్లంకొండ: మండలంలోని వన్నాయపాలెం గ్రామంలో గురువారం సాయిబాబా నూతన ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తురాలు మద్దిబోయిన సావిత్రమ్మ రూ.1.70 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. గురువారం ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. స్థానికుల సహకారంతో భారీగా అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్తులందరూ సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అనుముల రోశిరెడ్డి, మర్రి ప్రసాదరెడ్డి, చింతారెడ్డి సాయిరెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు మేకల లక్ష్మయ్య, సాంబశివరావు, ఆరుద్ర నరసింహారావు, గమిడి కోటి నాగయ్య, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై అడ్డదారులతో ప్రమాదాలకు ఆస్కారం
నాదెండ్ల: జాతీయ రహదారి గణపవరం–చిలకలూరిపేట మార్గంలో మూడు అనధికార అడ్డదారులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే హైవేపై ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటేందుకు అడ్డదారులు ఏర్పాటు చేసుకున్నారు. మూడు కిలోమీటర్ల నిడివిలో మూడు చోట్ల ఉన్న అడ్డదారుల కారణంగా రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై పలువురు మృత్యువాతపడగా, ఎంతోమంది గాయాలపాలైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు, రాళ్లు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి రాకపోకలు సాగిస్తున్నారు. గణపవరం సమీపంలో విష్ణు స్పన్పైప్స్ ఎదురుగా, కుప్పగంజివాగు బ్రిడ్జి సమీపంలో, నూతనంగా ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్బంకు ఎదురుగా డివైడర్పై మూడు అడ్డదారులు ఉన్నాయి. నేషనల్ హైవే అధికారులు, పోలీసులు స్పందించి డివైడర్పై ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి అడ్డదారులు మూసివేయాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
నరసరావుపేట రూరల్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) సత్తిరాజు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలు రూపుమాపుతామంటూ పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపేందుకు అందరూ కట్టుబడి పనిచేయాలని తెలిపారు. బాల్య వివాహాలు ఆడపిల్లల భవిష్యత్తును దెబ్బతీయడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. వాటిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. బాలికలకు విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్.గోపీనాథ్, అడ్మిన్ ఆర్ఐ ఎస్.కృష్ణ, ఎంటీ ఆర్ఐ యువరాజు పాల్గొన్నారు. -
రబీ పంటలపై రైతులకు శిక్షణ
యడ్లపాడు: గ్రామీణ అవగాహన కృషి అనుభవ పథకంలో భాగంగా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు జగ్గాపురంలో గురువారం రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఎం. నగేష్, విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త పీవీ సత్యగోపాల్ హాజరయ్యారు. రైతులకు రబీలో సాగుచేసే శనగ, మొక్కజొన్న పంటలపై మార్గ నిర్దేశం చేశారు. విత్తన శుద్ధి, తెగుళ్ల నివారణే కీలకం రైతులకు విత్తన శుద్ధి, తెగుళ్లు, పురుగుల నివారణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. శనగలో ఎండు తెగులు నివారణకు విత్తన శుద్ధిలో కార్బెండజం కిలో విత్తనానికి 2.5 గ్రాములు, ఆ తర్వాత ట్రైకోడెర్మా పొడి కిలో విత్తనానికి 10 గ్రాములు వాడాలని సూచించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి, ప్రారంభ దశలో వేప నూనెను వాడటం ద్వారా పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. మెరుగైన దిగుబడికి యాజమాన్య పద్ధతులు శనగ పంట యాజమాన్యంలో భాగంగా 30–35 రోజులకు, 60–65 రోజులకు నీటి తడి ఇవ్వడం ద్వారా దిగుబడి 2–3 క్వింటాళ్లు పెరుగుతుందని, సకాలంలో కలుపు నివారణ ముఖ్యమని సూచించారు. శనగకు ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్ను చివరి దుక్కుల్లో వేసుకోవాలని తెలిపారు. శనగపచ్చ పురుగు, ఆకు మాడు, తుప్పు తెగుళ్ల నివారణకు మందుల వాడకాన్ని వివరించారు. విద్యార్థినులు కీర్తి, శ్రీనిధి, జోషిత, శ్రేయ, అనగాని బేబీ, విజయలక్ష్మి, గాయత్రి, జ్యోత్స్నలు శనగపై తాము తయారుచేసిన పోస్టర్లను ప్రదర్శించి, రైతులకు వివరించారు. అభ్యుదయ రైతు పోపూరి శివరామకృష్ణ సహా దాదాపు 50 మంది రైతులు కార్యక్రమంలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
29 నుంచి పల్నాడు బాలోత్సవం
నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30వ తేదీలలో మూడవ పిల్లల పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బాలోత్సవం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మస్తాన్ షరీఫ్, కట్టా కోటేశ్వరరావు వెల్లడించారు. బుధవారం కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ చిన్నారులలో సృజనాత్మకత, దేశభక్తి, అభ్యుదయ భావాలు పెంచేలా దీన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే పోటీలలో జిల్లా వ్యాప్తంగా 200కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో పోటీలు ఉంటాయని తెలిపారు. కోలాటం, శాసీ్త్రయ నృత్యం, లఘు నాటికలు, బుర్రకథ, విచిత్ర వేషధారణ వంటి మొత్తం 69 అంశాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరారు. పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు. ఈ సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరించారు. బాలోత్సవం కోశాధికారి కోయా రామారావు, కమిటీ సభ్యులు నెల్లూరు బ్రహ్మయ్య, కోటా సాయి కుమార్ పాల్గొన్నారు. -
పక్షపాతంపై నిరసన గళం
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్లో కొనసాగుతున్న వ్యవహారాలను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ, జెడ్పీ యంత్రాంగం ఏకపక్ష వైఖరిపై మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు బహిష్కరించారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పక్షపాత ధోరణి, ఏకపక్ష విధానాలను నిరసిస్తూ మొత్తం ఆరు సమావేశాలకుగానూ మూడు స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా తయారు చేసిన అజెండాలను తిరస్కరించారు. -
పత్తి రైతుకు కొనుగోలు కష్టాలు
● పత్తి కొనుగోళ్లలో చంద్రబాబు సర్కార్ ఉదాసీనత ● నామమాత్రంగా 11 కేంద్రాలు ఏర్పాటు ● జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు 2.60 లక్షల ఎకరాలు ● దిగుబడుల అంచనా 12.28 లక్షల క్వింటాళ్లు ● జిల్లాలో ఇప్పటి వరకు 20,224 క్వింటాలే కొనుగోలు సత్తెనపల్లి: జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో 11 జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. చిలకలూరిపేటలో మరో కేంద్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. కేవలం 20,224 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. సగం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశారని, మిగిలిన సగం దళారులే కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాల్లో విక్రయాలు జరిపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. జిల్లాలో జిన్నింగ్ మిల్లులు అనేకం ఉన్నా చంద్రబాబు సర్కార్ నామమాత్రంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు చేపట్టవచ్చు. దక్కని మద్దతు ధర... సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆశపడ్డారు. అయితే సీసీఐ నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తేమ శాతం 12 వరకు మాత్రమే ఉండాలని, 8 నుంచి పెరిగిన ప్రతి ఒక్క శాతం చొప్పున మద్దతు ధర తగ్గిస్తున్నారు. బన్నీ లేదా బ్రహ్మరకం పత్తికి పింజ పొడవు 29.50 నుంచి 30.50 ఎంఎం వరకు, మైక్రోనైర్ 3.50 నుంచి 4.30 మధ్య ఉండి 8 శాతం తేమ ఉంటే క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. తేమ 9 శాతం ఉంటే రూ. 8,028.90, తేమ 10 శాతం ఉంటే రూ. 7,947.80, తేమ 11 శాతం ఉంటే రూ. 7,866.70, తేమ 12 శాతం ఉంటే రూ. 7,785.60 చొప్పున క్వింటా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే విధంగా బ్రహ్మ స్పెషల్, ఎంఈసీహెచ్ రకాలకు కూడా ధరలు నిర్ణయించారు. దుమ్ము, ధూళి, చెత్తాచెదారం, గుడ్డిపత్తికాయలు, రంగుమారినా, పురుగుపట్టిన, కౌడిపతి, ముడుచుకు పోయిన పత్తి కాయలను వేరు చేసి తెస్తేనే కొనుగోలు చేస్తామనే నిబంధనలు విధించారు. ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రానికి రావాలని నిబంధన పెట్టారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,02,400 మంది రైతులు 2.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 10–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. సగటున 12 క్వింటాళ్ల చొప్పున 12,28,800 క్వింటాళ్లు పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు 11 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలో 537 మంది రైతులకు చెందిన 20,224 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. -
పల్నాడు
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025● పత్తి, మిర్చి పంటల నష్టాలతో మొక్కజొన్న వైపు మళ్లిన రైతులు ● ఏలూరు ప్రాంతానికి దీటుగా పల్నాడు వైపు కంపెనీల చూపు ● రబీ సీజన్లో భారీగా పెరిగిన మొక్కజొన్న సాగు దుర్గి: అక్టోబర్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు విత్తనాలు నాటేందుకు సీజన్ అనుకూలంగా ఉంది. గత నెల రోజులకుపైగా సాధారణ మొక్కజొన్న 27,067 ఎకరాలు, విత్తనోత్పత్తి మొక్కజొన్న కలిపితే సుమారు 50 వేల ఎకరాలకుపైగా జిల్లాలో సాగు చేశారు. ముఖ్యంగా మాచర్ల, దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, బొల్లాపల్లి, సత్తెనపల్లి, గురజాల తదితర ప్రాంతాలలో సుమారుగా 27 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పత్తి, మిర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటంతో విత్తనోత్పత్తి మొక్కజొన్నకు కంపెనీలు ముందుగానే ఒక ధరను నిర్ణయించి పంటను కొనుగోలు చేయటంతో రైతులు పంటను సాగు చేస్తున్నారు. పెట్టుబడి, చీడపీడల నష్టం తక్కువగా ఉండటంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. వివిధ కంపెనీలు వైరెటీని బట్టి క్వింటాకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ధరలు నిర్ణయించారు. ఉచితంగా విత్తనాలు ఇవ్వటంతో పాటు పలు తెగులు, పురుగు, గడ్డి మందులనూ వారే అందిస్తున్నారు. ఇక్కడ పండించిన పంటను పలు కంపెనీలు హైదరాబాద్, ఏలూరుకు తీసుకెళ్లి విత్తనశుద్ధి చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం దుర్గి పరిసర ప్రాంతాలలో పలు కంపెనీలు స్థానికంగా మొక్కజొన్న డ్రయర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ● జెడ్పీలో పనులన్నీ మీరే కేటాయించుకుంటే ఇక ప్రజాప్రతినిధులుగా మేమెందుకు? ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ ● రాజ్యాంగ దినోత్సవం రోజు జెడ్పీటీసీలకు అవమానం ● ప్రణాళిక–ఆర్థిక, పనుల ఆమోదానికి సంబంధించిన కమిటీలు బహిష్కరణ ● తమ మండలాలకు పనులు కేటాయించలేదని మండిపాటు ● ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చైర్పర్సన్ వైఖరిపై ఆగ్రహం ● ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో చైర్పర్సన్ 7విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 582.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 11,856 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,422 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు. పల్నాడు ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్న రైతాంగం కష్టనష్టాలను చవిచూసి ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. రెండేళ్లుగా మొక్కజొన్న విత్తనోత్పత్తితో రైతులు లాభాలు పొందుతున్నారు. -
అమరేశ్వరాలయంలో విశేష పూజలు
గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్ కొమ్మసాని శ్రీనివాసరెడ్డి గుంటూరు విచ్చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఉన్నారు. తెనాలి: జనబాహుళ్యం వైదిక మార్గాన్ని అనుసరించినప్పుడే లోకానికి హితం చేకూరుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి స్పష్టం చేశారు. పట్టణ నాజరుపేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనాన్ని బుధవారం భారతీస్వామి సందర్శించారు. వేదిక్ బ్రాహ్మణ సేవాసమాఖ్య పర్యవేక్షణలో నిర్మించిన నృసింహ సదనాన్ని సందర్శించాక, సంతోషం వ్యక్తం చేశారు. భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధార్మిక ప్రచారకర్త అబ్బూరి వెంకాయమ్మ పీఠానికి రాసిచ్చిన స్థలాన్ని నృసింహ సదనానికి ఇచ్చినట్టు తెలిపారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం, కుందేటి సుబ్రహ్మణ్యం కామేశ్వరరావు, తాడేపల్లి శివకుమార్, నందివెలుగు విజయసారథి, మేడూరి శ్రీనివాసమూర్తి, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, దీవి జీవన్కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థులను తీర్చిదిద్దడానికి టింకరింగ్ ల్యాబ్స్ దోహదం
నరసరావుపేట రూరల్: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ దోహదపడతాయని డీఈవో చంద్రకళ తెలిపారు. నీతి అయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, సమగ్ర శిక్ష, యూనిసెఫ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్లకు లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. జిల్లాలోని 23 ఏటీఎల్ స్కూల్ నుంచి ఇన్చార్జ్లు శిక్షణకు హాజరయ్యారు. శిక్షణలో భాగంగా ఇన్చార్జ్లతో ఎగ్జిబిట్స్ను తయారు చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీవైఈవో సుభాని మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న విషయాలను విద్యార్థులతో పంచుకుని ఎగ్జిబిట్స్ తయారు చేయించాలని తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సమర్థ వినియోగం ద్వారా కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన పది లక్షల మంది విద్యార్థులను పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలుగా తయారు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీవైఈవోలు ఎస్కె సుభాని, వి.ఏసుబాబు, జిల్లా సైన్స్ అధికారి ఎస్.రాజశేఖర్ పాల్గొన్నారు. టెక్నికల్ పర్సన్లుగా వెంకట్, వాణి వ్యవహరించారు. -
లీగ్ దశకు వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 20 జట్లు పాల్గొనగా, రెండవ రోజు బుధవారం పోటీలు లీగ్ దశకు చేరుకున్నాయి. నాకౌట్ దశలో వర్సిటీ వ్యాయామ కళాశాల జట్టు 52–10, 25–14 తేడాతో చలపతి ఇంజినీరింగ్ కళాశాలపై గెలుపొంది లీగ్ దశకు చేరుకుంది. ధనలక్ష్మి వ్యాయామ కళాశాల (ముప్పాళ్ల), ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల జట్లు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 25–24, 25–12, 17–15 తేడాతో ధనలక్ష్మి కళాశాల జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు 25–20, 25–16 తేడాతో వరుస సెట్లతో ఏపీఆర్డీసీ నాగార్జునసాగర్ జట్టుపై విజయం సాధించింది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 15–25, 25–21, 06–15 తేడాతో గెలుపొంది లీగ్ దశకు చేరుకొంది. లీగ్ దశకు చేరుకున్న కళాశాలల జట్లు గురువారం పోటీ పడతాయని టోర్నమెంట్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు తెలిపారు. వర్సిటీ జట్టును ఎంపిక చేస్తారని వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్కే సతీష్బాబు, లక్ష్య కళాశాల డైరెక్టర్ హరిబాబు, ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు, శ్రీ చైతన్య కళాశాల డీన్ కృష్ణ, వివిధ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. తలపడనున్న కృష్ణవేణి, ధనలక్ష్మి, బాపట్ల కళాశాలల జట్లు -
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
నరసరావుపేట ఈస్ట్: కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు పంచిపెడుతున్నారని విమర్శించారు. కార్మికులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాధాకృష్ణ మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు ఉన్నాయని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాము, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.సుభానీ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత
పిడుగురాళ్ల రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్ పక్కన నిర్మిస్తున్న మెడికల్ వైద్య కళాశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటు పీపీపీ పద్ధతిలో కాకుండా ఇటు ప్రభుత్వం ప్రారంభించకుండా డోలాయమానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి ఇది ఒక చాలెంజ్ అని కళాశాలను పూర్తిచేసి నిబద్ధత, నిజాయతీ నిరూపించుకోవడానికి ఒక పరీక్ష అని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన మెడికల్ సీట్లు తీసుకువస్తే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యార్థులకు వైద్య, విద్య దక్కుతుందని వివరించారు. పల్నాడు ప్రాంత ప్రజలకు మెడికల్ కళాశాల వర ప్రసాదమని తెలిపారు. విద్యార్థులతో కళకళలాడాల్సిన కళాశాల సంవత్సర కాలంగా ఆగిపోయి ఎడారిలాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య , పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శ వర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ , నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు, భక్తులు వెంకటేశ్వర్లు, సంపత్ వెంకటకృష్ణ, మద్దిరాల నాగేశ్వరరావు, షేక్ బాషా పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
బాపట్ల టౌన్: రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లాలోని హైవే, రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బీ అధికారులతోపాటు జిల్లాలోని డీఎస్పీలు, హైవేల పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత మూడు సంవత్సరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికను, ఎక్కువగా రోడ్డు సంభవిస్తున్న బ్లాక్ స్పాట్స్ను పీపీటీ ద్వారా తెరపై ప్రదర్శించారు.రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సంభవించే మరణాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్టీవో, ఆర్ అండ్ బీ, హైవే అధికారులు సంయుక్త కార్యచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో డిస్టిక్ ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ టి.కె.పరంధామరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ డి.ప్రసాదరావు, రేపల్లె, బాపట్ల, చీరాల, సీసీఎస్ డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, జి.రామాంజనేయులు, ఎండీమోయిన్, పి.జగదీష్నాయక్, నాన్ హైవే, జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216, జాతీయ రహదారి 167(ఎ)ల అధికారులు, జాతీయ రహదారులు ఉన్న సంబంధిత సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మేదరమెట్ల: రోడ్డు క్రాస్ చేస్తున్న మోటా రు బైక్ను కారు ఢీకొనడంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కొరిశపాడు జాతీయరహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్పై బుధవారం చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం గణపవరానికి చెందిన రోశయ్య మరో వ్యక్తితో కలిసి మోటారు బైక్పై వెళుతూ కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు సమీపంలో గల గాజు ఫ్యాక్టరీ వద్ద బైకును రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి బద్వేల్కు వెళుతున్న కారు మోటారు బైకును ఢీకొంది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా హైవే అంబులెన్స్లో ఒంగోలు కిమ్స్కు తరలించారు. మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ ప్రమాద వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
దళితులపై వేధింపులు
●జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, నాయకులు ●దళిత వర్గాలపై కేసులు పెడుతూ బాధిస్తున్న చంద్రబాబు సర్కార్ ● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నరసరావుపేట: చంద్రబాబు సర్కార్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగంతో దళితులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్బాబు ఆదేశాలతో బుధవారం పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో స్థానిక గడియార స్తంభం సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ● చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్లో దళితుల సమస్యలపై పార్టీ తరఫున రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ● రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. ● జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత పాల్ మాట్లాడుతూ అట్టడుగున ఉన్న బడుగు, బలహీనవర్గాలలో ఉన్న అన్ని కులాలకు చేయూతనిచ్చేలా అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ●పార్టీ పట్టణ అధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ● పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఎవరైనా అమలుపరచారంటే అది ఒక్క వైఎస్సార్ మాత్రమేనని తెలియజేశారు. ● సామాజిక సేవకులు ఈదర గోపీచంద్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్కు సరైన గౌరవం ఇవ్వడం లేదని, విజయవాడలోని సామాజిక మహా శిల్పాన్ని సందర్శించకుండా ఆయన్ను అవమానించే చర్యలకు పాల్పడటం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియల్, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఉప్పుతోళ్ల వేణుమాధవ్, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నెలటూరి సురేష్, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు మణీంద్రరెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి, రొంపిచర్ల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండాల వెంకటేష్ పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణలో పోలీసులు ముందుండాలి
నరసరావుపేట రూరల్: రాజ్యాంగ పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది ముందుండాలని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవి సంతోష్ తెలిపారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటం వద్ద అదనపు ఎస్పీ సంతోష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామిక రాజ్యాంగాలలో ఒకటని తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాజ్యాంగం చట్టపరమైన పుస్తకం మాత్రమే కాదని, దేశ పరిపాలన మార్గదర్శక గ్రంథమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పాటించాల్సిన విలువలు, హాక్కులు, బాధ్యతలు గ్రంథంలో పొందుపరిచారని వివరించారు. అనంతరం అదనపు ఎస్పీ(ఏఆర్) సత్తిరాజు అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రమాణం చేయించారు. -
లిమ్కా రికార్డులో అఖిల్కు చోటు
సంతమాగులూరు (అద్దంకి రూరల్): కరాటే కిక్స్లో సత్తా చాటి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామానికి చెందిన గంటెనపాటి అఖిల్ చోటు దక్కించుకున్నారు. ఈ నెల 23న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన లిమ్కా బుక్ రికార్డులో అత్యధికంగా మాష్గిరి కిక్స్ 30 నిమిషాలు ఆపకుండా కిక్స్ కొట్టి రికార్డు సాధించినట్లు ఆర్గనైజర్ మిట్టల్ జయంత్ బుధవారం తెలిపారు. విశేష ప్రతిభ కనబర్చి లిమ్కా బుక్లో స్థానం పొందిన అఖిల్ను గ్రామస్తులు అభినందించారు. -
పీజీ ఫలితాల్లో కీర్తికి రాష్ట్ర ప్రథమ ర్యాంక్
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలోని కాటూరి మెడికల్ కాలేజ్ సామాజిక వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ వేమూరి కీర్తికి పరీక్ష ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ లభించింది. ఈ మేరకు బుధవారం కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. పీజీ పరీక్షా ఫలితాల్లో 800 మార్కులకుగాను డాక్టర్ వి.కీర్తికి 594 మార్కులు వచ్చాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. కమ్యూనిటీ మెడిసిన్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్ కీర్తికి కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు, డీన్ డాక్టర్ సి.హెచ్.మోహన్రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.చైతన్యలు అభినందనలు తెలిపారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
సత్తెనపల్లి: రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కె.ప్రసూన వైద్యులకు సూచించారు. సత్తెనపల్లిలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయకపోవడంపై ఆర్ఎంఓను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడుతూ ఓపీ బ్లాక్, సదరం క్యాంపు కలిసి ఉండటం వలన ఎక్కువ రద్దీగా ఉంటోందన్నారు. వెయిటింగ్ హాలులో సదరం క్యాంపు వారికి కుర్చీలు వేయాలని ఆదేశించారు. విధుల్లో సెక్యూరిటీ గార్డులు లేకపోవడాన్ని గుర్తించి మండిపడ్డారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. పెదకూరపాడు సీహెచ్సీలో.. పెదకూరపాడు: మండలంలోని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా డాక్టర్ ప్రసూన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలు, అందుతన్న సేవలపై ఆరా తీశారు. వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రికార్డులు, మందుల నిల్వలు పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. రాబోయే నెలలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని వసతులతో ప్రారంభిస్తామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ విద్య, వైద్య సిబ్బంది ఉన్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన -
మహిళల హక్కులపై అవగాహన ముఖ్యం
నరసరావుపేట/నరసరావుపేట ఈస్ట్: మహిళలు తమ హక్కులతోపాటు చట్టాల గురించి తెలుసుకుంటే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశం ఉంటుందని పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఎం.ఉమాదేవి పేర్కొన్నారు. మంగళవారం సీ్త్ర హక్కుల పరిరక్షణ, సీ్త్ర హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సత్తెనపల్లి) ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలా కరపత్రాలను ముద్రించటం శుభ పరిణామం అన్నారు. సమస్య వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఎదుర్కోవాలని పేర్కొన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయ నోడల్ అధికారి అరుణ, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, సభ్యులు మురళీకృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ ఫీజు షెడ్యూల్ విడుదల డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2026 మార్చి నెలలో నిర్వహించనున్న 10వ తరగతి, ఇంటర్మీడియేట్ దూరవిద్య (ఓపెన్ స్కూల్) పరీక్షలకు హాజరు కావాలనుకునే వారు ఫీజును డిసెంబర్ 1 నుంచి 10వ తేదీలోగా చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ మంగళవారం తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో డిసెంబర్ 11, 12వ తేదీలలో, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 13, 14, 15వ తేదీలలో చెల్లించవచ్చని పేర్కొన్నారు. 10వ తరగతికి రూ.100, ఇంటర్మీడియేట్ (థియరీ)కి రూ.150, ప్రాక్టికల్స్కు రూ.100 చెల్లించాలని వివరించారు. ఫీజును ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రం, ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని తెలిపారు. ఫీజు, సబ్జెక్ట్ వివరాలు సరిచూసుకోవాలన్నారు. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉందని, ఆన్లైన్ సేవాకేంద్రంలో సేవా రుసుం చెల్లించి తగిన రసీదు పొందాలని సూచించారు. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం సమావేశం యడ్లపాడు: పంచాయతీ కార్యదర్శుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.రమేష్ బాబు పేర్కొన్నారు. మండలంలోని మైదవోలు గ్రామంలో ఓ ప్రైవేటు భవనంలో సోమవారం రాత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. రమేష్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సముద్రపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి సిరిపురం హరిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. నియామక పత్రాన్ని హరికి అందించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. సాంబశివరావు, టి.మోహన్ రావు, ఇ.శంకరరావు, షేక్ ఫాతిమాబీ, షేక్ రమీజ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలతోపాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు బలమైన చట్టాలు
గుంటూరు లీగల్: మహిళల రక్షణ కోసం మన చట్టాలు బలంగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మహిళలపై జరిగే శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక, హింసలు, సైబర్ హింసల గురించి వివరించారు. వాటి ద్వారా మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలిపారు. ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 15 (లింగ వివక్ష నిరాకరణ), ఆర్టికల్ 21(జీవించే హక్కు) ద్వారా మహిళల హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. గృహ హింస, మెయింటెనెన్సు వంటి చట్టాల గురించి సమాజంలో, ఇంట్లో, పనిచేసే చోట మహిళలకు జరిగే శారీరక, మానసిక హింసలపై అవగాహన కల్పించారు. మీడియేషన్ అడ్వకేట్ వసుమతి పూర్ణిమ మాట్లాడుతూ మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు, మహిళలకు అందే హక్కుల గురించి వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు మాట్లాడుతూ సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా డిజిటలైజ్డ్ క్రైమ్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉందన్నారు. మహిళలను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. హక్కుల దుర్వినియోగం, పని చేసేచోట, ఇంట్లో వేధింపులకు గురి అవ్వడం, మహిళలకు ఉన్న ఇష్టాలు, అభిప్రాయాలను నియంత్రించడం ద్వారా ఎక్కువగా హింసలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలకు జరిగే హింసల నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ -
ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు మంగళవారం కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, వర్సిటీ రెక్టార్ ఆచార్య రామినేని శివరామప్రసాద్ ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులోనూ ముందుంటారని పేర్కొన్నారు. రెక్టార్ మాట్లాడుతూ.. ఏటా క్రీడల కోసం వర్సిటీ దాదాపు రూ.2 కోట్లు వ్యయం చేస్తుందని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పాతూరి శ్రీనివాసరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ వెంకట్రావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు, వైస్ ప్రిన్సిపల్ సతీష్బాబు, వివిధ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా, నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీలో వర్సిటీ పరిధిలోని 20 కళాశాలల జట్లు పాల్గొన్నారు. అంతర్ కళాశాలల విజేతతోపాటు వర్సిటీ జట్టును ఎంపిక చేయనున్నట్టు టోర్నమెంట చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. తొలిరోజు విజేతలు వీరే.. పురుషుల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 20 కళాశాలల జట్లు తలపడనున్నాయి. తొలిరోజు చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై విక్టరీ డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టు 25–13, 25–5తో విజయం సాధించింది. పీఎన్సీ అండ్ కేఆర్ కళాశాల (నరసరావుపేట) జట్టుపై బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 25–16, 25–17తో గెలిచింది. ఎస్కేఆర్బీఆర్ జట్టుపై వర్సిటీ కళాశాల జట్టు 25–14, 25–22తో విజయం సాధించింది. వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టుపై టీజేపీఎస్ కళాశాల (గుంటూరు) జట్టు 25–27, 25–23, 15–04తో గెలిచింది. విద్యా కేంద్రం (సత్తెనపల్లి) జట్టుపై కృష్ణవేణి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టు విజయం సాధించింది. -
లింగ వివక్ష తగదు
నరసరావుపేట: లింగ వివక్ష, మహిళా సాధికారత, ఆస్తుల్లో నిర్ణయాధికారం, సమాన పనికి సమాన వేతనం అంశాలపై అవగాహన కోసం మంగళవారం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలు నయీ చేతన్ 4.0 ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. లింగ వివక్ష వద్దు, సమానత్వమే ముద్దు, సీ్త్ర, పురుష సమానత్వం దేశ ప్రగతికి సమానం, ఇంటిపని అందరిపని అంటూ నినాదాలు చేస్తూ మహిళలు ర్యాలీగా బయలుదేరి స్టేషన్రోడ్డులోని గాంధీపార్కుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న తెలుగుతల్లి విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. దీనిలో డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, సోషల్ వెల్ఫేర్ పీడీ, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు. -
మాచర్లలో గంజాయి స్వాధీనం
మాచర్ల: పట్టణంలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, 12 మందిని అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ జగదీష్ చెప్పారు. మాచర్ల పట్టణ పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలో గంజాయి వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 15 రోజులుగా ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం రాత్రి పశువుల ఆసుపత్రి వెనుక పలువురు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పట్టణ ఎస్ఐ ఎం వెంకట్రావు, తహసీల్దార్ కిరణ్కుమార్ల ఆధ్వర్యంలో దాడి నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.40వేల విలువైన నాలుగు కిలోల గంజాయితోపాటు గంజాయి విక్రయించగా వచ్చిన మరో రూ.3వేల నగదు, ఆరు హషీఫ్ ఆయిల్ బాటిల్స్ను స్వాధీనపర్చుకున్నారు. మొత్తం రూ.52వేల విలువైన సామగ్రితోపాటు ఇందుకు మూల కారకులైన 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు మైనరు ఉన్నారు. వీరంతా గతం నుంచే గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది పాత నేరస్తులని తెలిపారు. పూర్తిస్థాయిలో గంజాయిపై దృష్టి సారించి వీరి ద్వారా గంజాయి విక్రయదారుల సమాచారం తీసుకొని పట్టణంలో గంజాయి లేకుండా అదుపు చేస్తామన్నారు. ఏ ఒక్కరైనా గంజాయి గురించి సమాచారమివ్వాలన్నారు. నిందితులందరినీ మాచర్ల కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ జగదీష్ చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. గంజాయి నిందితులను పట్టుకున్న వారిలో కీలక పాత్ర వహించిన పట్టణ సీఐ వెంకటరమణ, ఎస్ఐలు వెంకట్రావు, బి అనంతకృష్ణ, పోలీసులను డీఎస్పీ అభినందించారు. -
ప్రతికూల వాతావరణంతో సతమతమవుతున్న రైతుకు కనీసం కోసిన పంట వర్షాల బారిన పడకుండా కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం టార్పాలిన్ పట్టలు కూడా అందించడం లేదు. ఈనెల 27వ తేదీలోగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడంతో జిల్లాలో 53,090 హెక్టా
●సత్తెనపల్లి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతు భరోసా కేంద్రాలను అప్రమత్తం చేసేది. విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి రైతుమిత్ర సంఘాలకు పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు, కోతమిషన్లు, నూర్పిడి యంత్రాలు ఇలా అన్నిటిని అందించేది. ఇవే కాకుండా ప్రతి రైతు భరోసా కేంద్ర వద్ద కనీసం 50 నుంచి అధికంగా 150 వరకు టార్పాలిన్ పట్టలు అందుబాటులో ఉంచేది. 40 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఈ టార్పాలిన్లను రైతులకు 50 శాతం రాయితీతో అందించేది. రూ.1200 చెల్లిస్తే రైతులకు టార్పాలిన్లు అందేవి. వర్షాలకు పంట తడిసిపోకుండా కాపాడేవి. వరి పొలంలో కోత కోసిన కుప్పలపై రక్షణకు, పంట నూర్పిడి సమయంలో నేల మీద వేసేందుకు, ధాన్యం ఆరబెట్టేందుకు ఉపయోగపడేవి. అనంతరం రబీలో కూడా వీటి వినియోగం కొనసాగేది. వెలుగు కార్యాలయాలకు .. ఇవే కాకుండా డ్వాక్రా సంఘాల ద్వారా వెలుగు కార్యాలయాలకు మరికొంత పెద్ద సైజులో ఉండే టార్పాలిన్లను రాయితీపై ఇచ్చే వారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు. రాయితీలు లేకపోవడంతో రైతులు బయట వ్యాపారుల వద్ద అధిక మొత్తం డబ్బులు చెల్లించి టార్పాలిన్లు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. రైతులకు గతంలో మాదిరిగా కోత మిషన్లు, నూర్పిడి యంత్రాలు ఇవ్వకపోవడంతో పాటు ఈ–క్రాప్ నమోదు మందకొడిగా చేస్తుండడంతో రైతులు పంట నూర్పిడి చేయకుండా పంట పొలాల్లో, కల్లాల్లో కుప్పలు వేసి విడిచి పెడుతున్నారు. -
అమరావతి జిల్లా ఏమైంది?
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పడి పదకొండేళ్లు దాటినా జిల్లా ఏర్పాటు చేయకపోగా కనీసం అమరావతిలో రెవెన్యూ డివిజన్ కూడా లేదని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలు తమ అవసరాలకు గుంటూరుకు, అమరావతి టెంపుల్ సిటీ వారు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేటకు వెళ్లాల్సి వస్తోందన్నారు. కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న దృష్ట్యా అమరావతిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అమరావతిని కొత్త జిల్లా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇకనైనా వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పాముకాటుకు రైతు మృతి నాదెండ్ల: పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కనపర్రు గ్రామానికి చెందిన రైతు నరిశెట్టి చిన్నయ్య (55) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం మాచర్ల రూరల్: మండల పరిధిలోని కంభంపాడు గ్రామ సమీపంలోని సాగర్ కుడి కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు మాచర్ల రూరల్ ఎస్ఐ సంధ్యారాణి తెలిపారు. వయస్సు సుమారు 50 – 55 ఏళ్లు ఉంటుందన్నారు. ఒంటిపై ఆకుపచ్చ జాకెట్, నీలి రంగు చీర ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి మృతదేహం.. తాడేపల్లి రూరల్: విజయవాడ కృష్ణానది నీటిలో సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణలంక పోలీసులు మంగళవారం గుర్తు తెలియని ఓ బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం సీతానగరం నుంచి విజయవాడ వైపు వచ్చి ఉండవచ్చని భావించి తాడేపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. బాలుడి వయస్సు సుమారు 14 సంవత్సరాలు ఉండవచ్చని గుర్తించిన వారు తాడేపల్లి, కృష్ణలంక పోలీసుస్టేషన్లకు సమాచారం ఇవ్వాలని విజయవాడ పోలీసులు కోరారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి తెనాలి రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొలకలూరు రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డివైడర్ను ఢీకొట్టిన కళాశాల బస్సు తెనాలి రూరల్: ఇంజినీరింగ్ కళాశాల బస్సు డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. చేబ్రోలు మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు విద్యార్థులతో మంగళవారం తెనాలి వచ్చింది. ఇక్కడి ప్రకాశం రోడ్డులో పెట్రోలు బంకు వద్ద డివైడర్ను ఢీకొట్టింది. విద్యార్థులు అద్దాలపై పడడంతో అవి పగిలి పలువురు గాయపడ్డారు. తమకు ఫిర్యాదు అందలేదని టూ టౌన్ పోలీసులు తెలిపారు. -
ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి
తాడేపల్లిరూరల్: ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని ఆర్జేడీ పద్మ అన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలలో విద్యార్థు ల ఉత్తీర్ణత శాతాన్ని పెంచటానికి ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టిన సంకల్ప్–2026 అమలు పర్యవేక్షించటానికి మంగళవారంపెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆర్జేడీ ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి తరగతిని పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్ఆర్కేవీఎం పథకం ద్వారా విద్యార్థులకు ఉచిత నీట్, జేఈఈ మెటీరియల్ అందజేశారు. అనంతరం అధ్యాపకు లతో సమావేశమై ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సా ధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరావు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆర్జేడీ పద్మను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అచ్చంపేట: తాడువాయిలో కంది పంటను క్రోసూరు వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మస్తానమ్మ, ఏవో పి.వెంకటేశ్వర్లుతో కలసి మంగళవారం పరిశీలించారు. కంది పంటను ఆకుచుట్టు పురుగు, పూత పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ పురుగు లేత ఆకులను, పూతను కలిపి గూడుగా చేసుకుని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయన్నారు. నివారణకు క్లోరిపైరిఫోస్, నోవల్యూరోన్, తయోదికార్బ్ నీటితో కలిపి మొక్క పూర్తిగా తడిసే వరకు పిచికారి చేయాలన్నారు. పురుగు ఉధృతి బాగా ఉన్నప్పుడు లామిడా సైహలో త్రిన్ మందును నీటితో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. గుంటూరుఎడ్యుకేషన్: గుంటూరులోని అమరా వతి రోడ్డు భారత్పేట ఐదవ లైనులో వినియోగంలో ఉన్న బోరింగ్ పంపు కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో మూలన పడింది. స్థానికుల నీటి అవసరాలకు ఉపయోగకరంగా ఉన్న చేతిపంపు ఆర్నెల్ల క్రితం మరమ్మతుకు గురికావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది తిరిగి బిగించడం మరిచారు. అప్పటి నుంచి బోరును ఓపెన్గా అలాగే వదిలివేయడంతో చిన్నారులు ఎవరైనా అటువైపు వెళితే ప్రమాదం బారిన పడే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి తక్షణమే చేతి పంపును బిగించాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేట: సాతులూరు–నరసరావుపేట రైల్వే స్టేషన్ల మార్గంలో లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద ఈనెల 26వ తేదీ నుంచి 28 వరకు అత్యవసరంగా పట్టాలు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్వో వినయ్కాంత్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని కారణంగా ఆ మూడు రోజులు రైల్వేగేటు మూసివేయటం జరుగుతుందన్నారు. ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 582.80 అడుగులకు చేరింది. ఇది 290.5140 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,500, ఎడమకాలువకు 4,160, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 12,586, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 28,046 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. -
పేదలకు రుణాలు అందేనా!
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కార్పొరేషన్ల పట్ల చిన్న చూపుచూపుతోంది. కొద్ది నెలల కిందట ఇదిగో రుణాలు ఇస్తున్నాం..వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలను నమ్మించి మాట మార్చింది. ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్టీలకు కనీసం దరఖాస్తు చేసుకోమని చెప్పిన పాపన పోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుధవారం జెడ్పీ స్టాయీ సంఘ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్షించనున్నారు. ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వ అసమర్థ పాలనపై గుర్రుగా ఉన్నారు. ఎస్సీల ఆశలకు తెర జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో గుంటూరు జిల్లాకు రూ.990 యూనిట్లు కింద రూ.41.33 కోట్లు, పల్నాడు జిల్లాకు రూ.992 యూనిట్లు కింద రూ.38.56 కోట్లు మేర సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రకటించారు. రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకు(40 నుంచి 60శాతం వరకు సబ్సిడీ) రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు సమ యం ఉన్నా యూనిట్లను మారుస్తున్నామంటూ సైట్ను ప్రభుత్వం మూసివేసింది. దీంతో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సంక్షేమ హాస్టల్స్పై శీతకన్ను గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలపై ప్రభుత్వం శీతకన్ను చూపుతుంది. ఎస్టీ హాస్టల్లో భోజనం సరిగా లేకపోవడంతో, హాస్టల్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై ఎస్టీ నాయకులు మండిపడుతున్నారు. నెల రోజుల కిందట పెదనందిపాడు, అనపర్రు బీసీ హాస్టల్లో పుడ్ పాయిజన్ అయి 56 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో హాస్టల్స్లో విద్యార్థులు ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బాలికల హాస్టల్స్పై నియంత్రణ లేకుండా పోయింది. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ప్రచారాన్ని హోరెత్తించారు. అదే స్థాయిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేశారు. జిల్లాలోని బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎంపికలు(క్రెడిట్ క్యాంపులు) జరిగాయి. తీరా రుణాలు అందుతాయనే సమయంలో సైట్ క్లోజ్ చేసి రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని తేల్చేశారు. దీంతో బీసీ రుణాల కోసం ఆశించిన పేద వర్గాలకు నిరాశే మిగిలింది. -
స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే షెడ్యూల్ ప్రకటనపై విద్యార్థుల విస్మయం
ఏఎన్యూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూలు ప్రకటన ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అధికారుల వింత ధోరణికి విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. పీజీ కౌన్సెలింగ్లో రెండు విడతల్లో అడ్మిషన్లు నిర్వహించిన నిర్వాహకులు స్పాట్ అడ్మిషన్లపై ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ అధికారులు స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రి నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. వర్సిటీలోని పలు విభాగాల్లో స్పాట్ అడ్మిషన్ల వల్ల సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనివార్య కారణాల వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం ప్రతి ఏడాది స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. స్కాలర్షిప్ రాకపోయినా పర్వాలేదు, సంవత్సరం వృథా కాకూడదనే భావనతో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆయా కోర్సుల్లో చేరుతూ ఉంటారు. ఈ సారి స్పాట్ అడ్మిషన్ జరగకుండానే ఫీజుల షెడ్యూల్ ప్రకటించడం గందగోళానికి దారి తీసింది. వర్సిటీ అధికారుల నిర్ణయంతో తమకు ఏడాది కాలం వృథా అవుతుందని స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై సీఈఓ ఆలపాటి శివప్రసాద్ను వివరణ కోరగా అడ్మిషన్లకు తనకు సంబంధం లేదని, అకడమిక్ క్యాలండర్ ప్రకారం మంగళవారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెదకాకాని నవశక్తి క్షేత్రంలో చోరీ పెదకాకాని: పెదకాకాని నవశక్తి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి ఆభరణాలతో పాటు మూడు హుండీలను ఎత్తుకెత్తిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రమైన పెదకాకాని శివారులో వెనిగండ్ల నుంచి అగతవరప్పాడు వెళ్లే రోడ్డులో నవశక్తి పీఠం ఉంది. ఈ క్షేత్రంలో నిత్యం పూజా కై ంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఆలయ తలుపులకు అర్చకులు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం ఉదయం గుడి వద్దకు వెళ్లి చూడగా తాళాలు వేసిన గడి పగులగొట్టి తలుపులు తీసి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో అమ్మవారి ఆభరణాలు 12 మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, 2 ముక్కుపుడకలు, ఆలయంలో అమర్చిన మూడు హుండీలు ఎత్తుకెళ్లారు. ఆభరణాలు సుమారు 50 గ్రాములని ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
జాతీయ సైక్లింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసరావుపేట రూరల్: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికై నట్టు జొన్నలగడ్డ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.మల్లికార్జునరావు తెలిపారు. 69వ రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ పోటీలు ఎన్టీఆర్ జిల్లా నున్నా జెడ్పీ హైస్కూల్ నిర్వహించారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని హెచ్ఎం పేర్కొన్నారు. ట్రాక్ విభాగంలో సీహెచ్ విజయలక్ష్మి, ఎన్.పరమాత్మలు ప్రథమ స్థానం, రోడ్ విభాగంలో ఎస్కే నబీర్ (అండర్–17), వై.తేజస్విని (అండర్–14), ఎన్.సింధు (అండర్–14)లు ప్రథమస్ధానం, ఎన్.బింధుశ్రీ (అండర్–17), జి.నరేంద్ర (అండర్–14), ఎస్కే ఆమన్ (అండర్–14) ద్వితీయ స్థానం, జి.మణికంఠ (అండర్–17), ఎ.లావణ్య (అండర్–14)లు తృతీయ స్థానాలు సాధించినట్టు పేర్కొన్నారు. వీరిని వ్యాయమ ఉపాధ్యాయుడు ఐ.సునీల్, ఉపాధ్యాయులు అభినందించారు. -
విద్యుత్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
వినుకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించటానికి అదాలత్ దోహదపడుతుందని సీజీఆర్ఎఫ్ చైర్మన్, జిల్లా విశ్రాంత న్యాయమూర్తి ఎస్.విక్టర్ ఇమ్మానుయేలు అన్నారు. మంగళవారం పట్టణంలోని కారంపూడి రహదారి మార్గం విద్యుత్ స్టేషను ప్రాంగణంలో అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యలు ఉంటే ఆధారాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేస్తామన్నారు. రీడింగ్, మీటర్లలో పేర్లు మార్పు, అధిక బిల్లులు, కేటగిరీ మార్పులు తదితర సమస్యలు వస్తున్నాయని తెలిపారు. వీటిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించటంతో పాటు వినియోగదారులకు సకాలంలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జిల్లా స్థాయిలో రెండు నెలలకొకసారి ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్లైన్ విధానంలో సమస్యలు సులువుగా పరిష్కారం అవుతున్నాయన్నారు. నూజెండ్ల మండలం అల్లిభాయిపాలెం గ్రామంలో విద్యుత్ లైను సమస్యపై వచ్చిన ఫిర్యాదుపై అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖాధికారి డాక్టరు పత్తిపాటి విజయ్కుమార్, ఫోరం సభ్యులు సునీత, డి.కృష్ణనాయక్, ఆర్.శ్రీనివాసరావు, డీఈ చేజర్ల రాంబోట్ల, ఏడీఏ భవనం వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, ఏఈలు జవ్వాజి నటరాజ్ తదితరులు ఉన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేలు -
రైతులకు మేలు చేసేలా కేంద్రానికి లేఖ
సత్తెనపల్లి: పత్తి రైతులకు మేలు చేసేలా కేంద్రానికి లేఖ రాశామని, 18 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని విన్నవించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గుంటూరు రోడ్డులోని జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5.40 లక్షల హెక్టార్లలో పత్తి పండిందని, మోంథా తుఫాన్తో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పరిహారం చెల్లించేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. సీసీఐ నిబంధనలతో పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
అండర్–14 యోగా రాష్ట్రస్థాయి విజేత ప్రకాశం
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల నుంచి 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో యోగా పోటీ లు జరుగుతున్నాయి. రెండో రోజు సోమవారం అండర్ 14,17 విభాగాల్లో బాలబాలికలకు సంబంధించి యోగా పోటీల విజేతలను ప్రకటించారు. మరో రెండు రోజులపాటు అండర్–19 విభాగంలో యోగా పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల హెచ్ఎం గిరిజ ఆధ్వర్యంలో విజేతలు బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు.. ● అండర్–14 ట్రెడిషనల్ యోగా బాలికలు విభాగంలో ఎన్.శృతి (ప్రకాశం) మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికై ంది. కృష్ణా జిల్లాకు చెందిన జి.శ్రావణి రెండో స్థానం, చిత్తూరు జిల్లాకు చెందిన కె.తేజశ్రీ మూడో స్థానం సాధించారు. ● అండర్–14 ట్రెడిషనల్ యోగా బాలుర విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన సురేంద్ర మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించాడు. గుంటూరు జిల్లాకు చెందిన కౌషిక్ రెండో స్థానం, పశ్చిమ గోదావరికి చెందిన ఆర్.విక్రమాధిత్య మూడో స్థానం సాధించాడు. ● అండర్–17 ట్రెడిషనల్ బాలుర విభాగంలో తూర్పు గోదావరికి చెందిన క్రాతిక్ రామ్ మొదటి స్థానం, గుంటూరుకు చెందిన కె.సంపత్ రెండో స్థానం, వైజాగ్కు చెందిన పి.దేవాష్ మూడో స్థానం. ● అండర్–14 ఆర్టిస్టిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో ప్రకాశంజిల్లాకు చెందిన కుంచాల హెప్సిబా, నాయపాము శృతి మొదటి స్థానం, తూర్పు గోదావరికి చెందిన పి.హసిని, ఎం.శ్రీవల్లి రెండో స్థానం, అనంతపురానికి చెందిన కె.మోక్షిత, కె.మోహిత మూడో స్థానం సాధించారు. ● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో విశాఖపట్నంకు చెందిన వాసవి, కౌశల్య మొదటి స్థానం, ప్రకాశానికి చెందిన భవ్యశ్రీ, లిఖిత రెండో స్థానం, తూర్పు గోదావరికి చెందిన జంగీలాబీ, పావని మూడో స్థానం సాధించారు. ● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలుర విభాగంలో కర్నూల్కు చెందిన తులసి సాయి, షాహిద్ అప్రిద్ మొదటి స్థానం, కడపకు చెందిన ప్రశాంత్, లక్ష్మణ్ రెండో స్థానం, ప్రకాశానికి చెంది న మహేష్, మిల్టన్ మూడో స్థానం సాధించారు. ● అండర్–17 ట్రేడిషనల్ యోగా బాలికల విభాగంలో పశ్చిమ గోదావరికి చెందిన భవాని చౌదరి, తూర్పు గోదావరికి చెందిన ఛైత్రశివ వాసుకి రెండవ స్థానం, అనంతపురానికి చెందిన భరణి మూడో స్థానం సాధించారు. విజేతలకు అధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. -
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
సింగరాయకొండ: ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్ బా ల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో జరిగిన 30 మ్యాచ్ల్లో బాలబాలికలు పోటాపోటీగా పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్లలో బాలు ర విభాగంలో పూల్ ‘సి’లో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నర్స్గా కర్నూలు, పూల్ ‘డి’లో విన్నర్గా కడప, రన్నర్గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్ ‘బి’లో విన్నర్గా కడప, రన్నర్గా ప్రకాశం, పూల్ ‘సి’లో విన్నర్గా పశ్చిమ గోదావరి, రన్నర్గా విజయనగరం, పూల్ ‘డి’లో విన్నర్గా కృష్ణా, రన్నర్గా గుంటూరు జట్లు నిలిచాయి. ● మిగిలిన పూల్ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్ ఫైన ల్స్, సెమీ ఫైనల్స్ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సా యంత్రానికి ఫైనల్స్ నిర్వహించనున్నట్లు టోర్న మెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శంకర్రావు, అండర్–19 కార్యదర్శి చింపారెడ్డి తెలిపారు. ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు ఉన్నారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
నరసరావుపేట రూరల్: ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు దండుకున్నట్టు పలువురు బాధితులు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో పెద్దమొత్తంలో నగదును మోస పోయినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడు. వీటితో పాటు కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలకు సంబంధించి 111 ఫిర్యాదులు ఎస్పీకి అందాయి. పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరిగతిన పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మోసాలపై ఫిర్యాదులు ఇలా... ● ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ 36.40లక్షలు తీసుకుని మోసం చేసినట్టు 12మంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లికి చెందిన శిరికొండ వెంకట్రావు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని 2021లో డబ్బులు వసూలు చేశాడు. తరువాత నకిలి అపాయిమెంట్ లెటర్లు సృషించి వీరిని మోసం చేశాడు. దీన్ని గుర్తించిన బాధితులు డబ్బులు ఇవ్వమని నిలదీశారు. ఇవ్వకుండా వేధిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ● హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ మోసం చేసి రూ.5లక్షలు తీసుకున్నట్టు బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విజయవాడకు చెందిన మహిళ తాను హైకోర్టులో పని చేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డు చూపించింది. హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకు రూ.5లక్షలు ఇవ్వాలని చెప్పడంతో నమ్మి పలు ధఫాలుగా డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. రెండు నెలల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని చెప్పిందని, తరువాత నుంచి ఫోన్ చేయగా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. అనుమానంతో విచారించగా ఆమెకు హైకోర్డులో ఎలాంటి ఉద్యోగం లేదని తెలిందని, తనను మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరింది. ● ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే 200 రెట్లు లాభాలు పొందవచ్చని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్కాల్ నమ్మి రూ.81లక్షలు మోసపోయినట్టు నరసరావుపేట కాకతీయనగర్కు చెందిన వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఫోన్లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి మొదట రూ.3లక్షలు పెట్టుబడి పెట్టగా రూ.1.5లక్షలు లాభం వచ్చినట్టు తెలిపారు. దీంతో వారి మాటలు నమ్మి పొలం తాకట్టు పెట్టి రూ.81లక్షలు పలు దఫాలుగా పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. తరువాత లాభాల నగదు ఉపసంహరణకు ప్రయత్నించగా అదనంగా 20శాతం కమీషన్ చెల్లించాలని చెప్పారని పేర్కొన్నాడు. కొంత కాలానికి తన నంబర్ను బ్లాక్లో పెట్టారని ఫిర్యాదులో తెలిపాడు. జిల్లా ఎస్పీకి పలువురు బాధితుల ఫిర్యాదు -
సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన
నరసరావుపేట: సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే హెచ్ఆర్ పాలసీ, మినిమం ఆఫ్ టైమ్ శాలరీ(ఎంటీఎస్) అమలు చేయాలని జేఏసీ ఫెడరేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్టేషన్రోడ్డులోని గాంధీ పార్కు వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పీజీఆర్ఎస్లో ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ఏర్పడి 15 నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. జీతాల పెంపు, సమయానికి చెల్లింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్, రిటైర్మెంట్ వయస్సు 62ఏళ్లకు పెంచటం, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాల అమలు, ఆరోగ్య బీమా, మెడికల్ సదుపాయాలు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 10న చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు పాల్గొని తమ న్యాయమైన హక్కులకోసం పోరాడాలని జేఏసీ నాయకులు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ, ఉద్యోగులు ఖాసీంవలి, సుబ్బాయమ్మ, మంజూష, జయప్రకాష్ పాల్గొన్నారు. లింగాపురంలో ఘర్షణ ఇద్దరికి గాయాలు మాచర్ల రూరల్: మండలంలో పరస్పర దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన మండలంలోని లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జింకల వెంకటేశ్వర్లు, రాగి నాగేశ్వరరావు మధ్య చిన్న ఘర్షణ ఏర్పడి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని మహిళకు గాయాలు వేగంగా వెళ్తున్న కారు ఢీకొని పశువుల కాపరి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కె. రమణమ్మ పొలం నుంచి పశువులను తోలుకొని ఇంటికి వెళ్తుండగా, గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రమణ తల, కాలుకు గాయాలయ్యాయి. మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలించారు. -
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి:ఎస్టీయూ
వెల్దుర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకిచ్చిన హామీ మేరకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఎస్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి. రామిరెడ్డి కోరారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ అర్హతనిచ్చి, మినహాయింపునివ్వాలని, పెండింగ్లో ఉన్న కామన్ సర్వీసు రూల్స్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారన్నారు. అధికారులు యాప్లు త్వరగా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అలా చేస్తే ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. మండలంలోని నూతన ఉపాధ్యాయులకు అపరాజిత ఆగ్రోఫాం ద్వారా లంచ్ బ్యాగ్లు, సర్వీసు రిజిస్టర్లు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు హరినాయక్, కార్యదర్శి తాటి రాజా, మాచర్ల రాంబాబు, మాచర్ల అనిల్, కృష్ణ, జిల్లా నాయకులు గురవయ్య, రాజశేఖర్, ఏసురత్నం, జాన్, మంగ్లానాయక్, అమలబాబు, సంస్థ మేనేజర్ శేషుబాబు పాల్గొన్నారు. -
ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్ సీపీ అండ
దుర్గి: అక్రమ అరెస్టులు, కేసులు తనపై మోపినా ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కంచరగుంట, మంగాపురం తండా గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ సర్పంచ్ ఆలేటి వెంకటేశ్వర్లు, యాక్సిడెంట్కు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాణావత్ బాలునాయక్లను పరామర్శించారు. మంగాపురం తండాలో ఇటీవల అక్రమ కేసులు బనాయించి పోలీసులతో దెబ్బలుతిన్న పలువురిని పరామర్శించారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రతి కార్యకర్తను, నాయకులను, అభిమానులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అభయమిచ్చారు. అధికారముందని, అక్రమంగా, అన్యాయంగా వేధింపులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోవు రోజుల్లో ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. సంవత్సరంన్నర కాలంలోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, దీనికి తాజా ఉదాహరణే మాజీ సీఎం జగన్ పర్యటనకు తరలివస్తున్న ప్రజానీకమేనని వివరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం పెద్దబ్బాయ్, గొట్టం బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు పాశం కోటిరెడ్డి, బూడిద సైదులు, తోట మూర్తి, మాదాసు వాసు, అరిగెల కొండలు, కలవల వీరగోవిందు, మాదాసు భిక్షమయ్య, మోతీలాల్ నాయక్, కోటా రాజు, బొంతా కృష్ణ, మాదాసు హనుమంతరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వామీ.. మరలా జగనన్న పరిపాలనే రావాలి 2024 ఎన్నికల ప్రచారం తరువాత మొదటి సారిగా మండలంలోని మంగాపురం తండాకి చేరుకున్న పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూసిన మంగాబాయి అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆయన్ను భావోద్వేగంతో హత్తుకొని కన్నీటి పర్యంతమైంది. సోమవారం పర్యటనలో భాగంగా పీఆర్కే మంగాపురంతండాకు చేరుకున్నారు. గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన పీఆర్కేను ద్దేశించి వృద్ధురాలు మాట్లాడుతూ ‘‘స్వామీ.. జగనన్న పాలన ఎప్పుడు వస్తుందయ్యా’’ అంటూ కన్నీటి పర్యంతమైంది. తమ బాగోగులు చూసే నాథుడే కరువయ్యారని పేర్కొంది. పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
ఐఎంఏ గుంటూరు శాఖకు అవార్డులు
గుంటూరు మెడికల్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖకు వివిధ రంగాల్లో అందించిన సేవలకు లభించిన అవార్డులను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బన్సాలి నుంచి గుంటూరు ఐఎంఏ శాఖ కార్యనిర్వహకవర్గం అందుకుంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఐఎంఏ రాష్ట్ర సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికష్ణ, డాక్టర్ వి.మహేష్ డాక్టర్ డి.అమరలింగేశ్వరరావు, డాక్టర్ ఎన్.కిషోర్, డాక్టర్ ఎం.పర్నికుమార్ తదితరులు డాక్టర్ బన్సాలి నుంచి అందుకున్నారు. గుంటూరు శాఖకు ఐదు అవార్డులు దక్కటం పట్ల పలువురు వైద్య ప్రముఖులు అభినందనలు తెలిపారు . ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు బొల్లాపల్లి : వెల్లటూరులోని సోమేశ్వరస్వామి దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసినట్లు దేవదాయ శాఖ అధికారి సీహెచ్ శివనాగిరెడ్డి సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన బేతపూడి వెంకటేశ్వర్లు, అడక లింగరాజులు రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఇప్పటికీ వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.33.18 లక్షలు, సోమేశ్వరస్వామి ఆలయానికి రూ.78.39 లక్షలు దాతల నుంచి విరాళాలు అందాయన్నారు. స్వర్ణ కుటీరం నిర్మాణానికి భూమి పూజ వినుకొండ : స్థానిక కొండమెట్ల వద్ద ఉన్న అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు స్వర్ణ కుటీర నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ ఏజీపీ పోట్లూరి సైదారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ కుటీర కాశీ వజ్ర వారాహి అమ్మవారి మందిర నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఐదుగురు దాతలు ఒక్కొక్కరు రూ.1.08 లక్షల చొప్పున మొత్తం రూ.5.40 లక్షలు మందిరం నిర్మాణానికి విరాళాలు ప్రకటించారు. కార్యక్రమంలో మేలిశెట్టి ఉషారాణి, ఏటుకూరి కృష్ణవేణి, వి.రమ, పత్తి భ్రమరాంబ, బుర్ర సుజాత పాల్గొన్నారు. పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్ట ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్టా కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబరు మూడవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో తొలి రోజు మేత్రాసన ప్రొక్యురేటర్, ఛాన్సలర్ గురుశ్రీ దాసరి కిరణ్, ఫాదర్లు దిలీప్కుమార్, బాలశౌరి, కన్నీ థామస్లతో కలిసి జెండాను ప్రతిష్టించారు. ఏసును స్తుతిస్తూ ఆరాధించారు. డిసెంబర్ 3న గురువులతో సమిష్టి పండుగ దివ్యబలి జరుగుతుందని ఫాదర్ దిలీప్ కుమార్ చెప్పారు. రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా గుంటూరుఎడ్యుకేషన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్మేళా సద్వినియోగంచేసుకోవాలన్నారు. 98663 66187, 95817 94605 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
పోలీసు వనంలో విద్యా సుగంధం
చిలకలూరిపేట: ఓ ఐపీఎస్ అధికారిగా కల్లోల కాశ్మీరంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్... నక్సల్స్ ప్రభావిత చత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్ నియంత్ర విధులు... వెస్ట్ బెంగాల్లో కోల్ మాఫియా, దేశ సరిహద్దుల్లో స్మగ్లర్లతో తలపడటం వంటి సాహసభరిత, అత్యంత ప్రమాదభరిత విధుల నిర్వహణ ఒక వైపు.. మరోవైపు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల నుంచి ఎంబీఏ, పీహెచ్డీ, డాక్టర్ ఆఫ్ లా వంటి విద్యార్హతలు సాధించడం ఆయనకే సాధ్యమైంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారి బొప్పూడి నాగరమేశ్ స్వగ్రామం చిలకలూరిపేటలోని బొప్పూడి. ఊరి పేరే ఇంటిపేరుగా కలిగిన ఆయన్ను ఆయనను లక్ష్యసాధనకు మరోపేరుగా చెప్పుకోవచ్చు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారనే విధంగా కొనసాగుతున్న ఆయన జీవన పయనం ఎందరికో స్ఫూర్తిదాయకం. పరాక్రమవంతుడైన అధికారి బొప్పూడి పాండురంగారావు, నాగమణి దంపతులకు 20 జులై 1963లో బొప్పూడి నాగ రమేశ్ జన్మించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా వ్యవహరించిన తండ్రితోపాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంటర్ వరకు విద్యాభ్యాసం కొనసాగింది. 1983లో ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బీటెక్ పట్టా పొందారు. అక్కడి నుంచి ఐదేళ్లపాటు జెంషెడ్పూర్లోని టాటా మోటార్స్లో ఇంజినీర్గా విధులు నిర్వహించారు. 1988లో ఐఐఎంలో ఎంబీఏ సీటు, సివిల్ సర్వీసెస్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. దీంతో ఐపీఎస్లో చేరి హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ అనంతరం వెస్ట్ బెంగాల్ కేడర్కు నియమితులయ్యారు. తొలి పోస్టింగ్ ఎస్డీపీవోగా వనగ్రామ్లో నియమితులయ్యారు. అక్కడ యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్స్లో పాల్గొని రూ.కోట్లు విలువైన స్మగ్లింగ్ సామగ్రి పట్టుకోడవం ద్వారా సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. అనంతరం 1991లో బారక్పూర్ ఏడీఎస్పీగా పదోన్నతి లభించింది. అక్కడ గ్యాంబ్లింగ్, హెరాయిన్ స్మగ్లింగ్ ముఠాల నియంత్రణకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. విద్యా ప్రస్థానం ఒకవైపు సీఆర్పీఎఫ్, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ వంటి ప్రమాదభరిత విధులు నిర్వహిస్తూనే తనకు అత్యంత ఇష్టమైన విద్యా వ్యాసంగాన్ని నాగరమేశ్ కొనసాగించారు. ● మొదటగా ఐఐఎంలో ఎంబీఏ సీటు వచ్చినా, ఐపీఎస్ కారణంగా వదులుకున్న నేపథ్యంలో అక్కడి నుంచే విద్యాప్రస్థానం కొనసాగించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఐఐఎం కోల్కత్తా నుంచి ఎంబీఏ డిగ్రీని 2003లో పూర్తి చేశారు. ● 2004–10 మధ్య ఖరగ్పూర్ ఐఐటీ నుంచి మేనేజ్మెంట్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టాలు పొందారు. ● 2014–18 మధ్య నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ● కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎంఏ సైకాలజీతోపాటు స్పానిష్, చైనీస్ భాషల్లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కోర్సులు పూర్తి చేశారు. ● 2024లో నేషనల్ లా యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ లా పట్టా పొందారు. ● 2015 ప్రాంతంలో అమెరికాలోని నేషనల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు భారత ప్రభుత్వం తరుఫున వెళ్లి పాఠాలు బోధించారు. ● ప్రస్తుతం తెలంగాణా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్న ఆయన పేద ప్రజలకు న్యాయసేవలు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాక్షికి వివరించారు. దీనికి తోడు విదేశీ యూనివర్సిటీల నుంచి అంతర్జాతీయ అంశాలపై పరిశోధన చేయనున్నట్లు తెలిపారు. చివరగా దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నిజాయతీగా, ఎవరికీ లొంగిపోకుండా విధులు నిర్వహిస్తే దేశంలో అవినీతి, అరాచకం అంతరించి పోయి దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీస్ విధులు నిర్వహిస్తూనే నాగ రమేశ్ అపారమైన జ్ఞాన సముపార్జన ఉద్యోగ ప్రస్థానంలో పలు పతకాలు ప్రతిష్టాత్మక ఐఐటీ,ఐఐఎం వంటి సంస్థల నుంచి డిగ్రీలు అనంతరం 2001–03 మధ్య కాలంలో వర్ధమాన్జిల్లా ఎస్పీగా నియమితులై కోల్ మాఫియాను సమర్థంగా ఎదుర్కొవడం ద్వారా ప్రభుత్వరంగ ఈసీఐఎల్ కు రూ.రెండువేల కోట్లు లాభం చేకూరేందుకు దోహదపడ్డారు. 2005లో డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన 2008లో సీఆర్పీఎఫ్ డీఐజీగా(యాంటీ ఇన్సర్జెన్సీ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేశారు. 2010లో చత్తీస్గఢ్లోని దర్బాఘాటీ ప్రాంతంలో మావోయిస్టులు 73 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చటంతో ఆ ప్రాంతంలో ఐజీ ఆపరేషన్స్గా నియమితులయ్యారు. అక్కడ ఆయన విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలకు పరాక్రమ మెడల్ లభించింది. అదే ఏడాది చివరిలో కశ్మీర్లో యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్స్ ఐజీగా నియమితులయ్యారు. అక్కడ 2011–12 ప్రాంతంలో హార్డ్కోర్ పాకిస్తానీ టెర్రరిస్టు అబ్దుల్లా ఉని ఎన్కౌంటర్ ఆయన సారథ్యంలో జరిగింది. ప్రభుత్వం నుంచి రూ.3లక్షలు రివార్డు సైతం అందుకున్నారు. అనంతరం 2013–15 కాలంలో ఢిల్లీలోని ఇంటర్నల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా, సీఆర్పీఎఫ్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 2016లో తిరిగి వెస్ట్బెంగాల్కు అడిషనల్ డీజీగా వెళ్లిన ఆయన 2020లో డీజీగా పదన్నోతి పొంది 2023లో డీజీపీగా పదవీ విరమణ చేశారు. -
పైసా పరిహారం ఇస్తే ఒట్టు ..!
సత్తెనపల్లి: రైతు సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే..దానికి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. తాజాగా మోంథా తుఫాన్తో రైతులకు తీవ్రంగా పంట నష్టం జరిగింది. అయినా ఇప్పటివరకు రైతులను ఆదుకునే ప్రయత్నమే చేయలేదు. రైతులకు అండగా ఉండాల్సింది పోయి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది. జిల్లాలో 1730.25 హెక్టార్లలో పంట నష్టం.... పల్నాడు జిల్లా వ్యాప్తంగా 2024 అక్టోబర్లో కురిసిన అకాల వర్షాలకు రైతులకు నష్టం వాటిల్లింది. అప్పట్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదికలు కూడా పంపారు. కానీ ఒక్క పైసా పరిహారం విడుదల కాలేదు. తాజాగా గత నెలలో మోంథా తుఫాన్ ధాటికి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పత్తి పంట చేతికి వచ్చే తరుణంలో కాయ నల్లగా మారి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. జిల్లాలో మొత్తం 1730.25 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు, 3,377 మంది రైతులకు పరిహారం అందించేలా జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. -
తుఫాన్ వచ్చి నెల దాటుతున్నా ఆదుకోని ప్రభుత్వం
నేను ఐదు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. సుమారు రూ. 1.70 లక్షలకు పైన పెట్టుబడి పెట్టా. ఎకరాకు 35 బస్తాలు చొప్పున 175 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించా. పంట కీలక సమయంలో మోంథా తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసింది. ప్రస్తుతం ఎకరానికి 25 బస్తాలు మించి దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. తుఫాన్ వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందించలేదు. దీనికి తోడు అన్నదాత సుఖీభవ పథకం గత ఏడాది కానీ, ఈ ఏడాది కానీ అందించలేదు. – కొత్తపల్లి యోహాన్, కౌలు రైతు, చేజర్ల ● -
అర్జీలు నాణ్యతతో పరిష్కరించాలి
ధాన్యం సేకరణ పోస్టర్ ఆవిష్కరణ నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు అందిన అర్జీలు నాణ్యతతో పరిష్కరించటంపై దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 122 అర్జీలు స్వీకరించారు. అర్జీలకు సంబంధించిన ఆడిట్ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్లినప్పుడు గ్రీవెన్స్ జాబితా సిద్ధంగా ఉంచి అధికారులకు చెప్పాలన్నారు. ఒకటీ రెండు అర్జీలు స్వయంగా తనిఖీ చేయటం ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకొని ఫీడ్ బ్యాక్ అందించాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిచాలన్నారు. తాను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయగా అర్జీల పరిష్కారంలో నాణ్యత సరిగా లేదని గుర్తించినట్లు తెలిపారు. తహసీల్దార్లు వారి దగ్గరకు వచ్చిన గ్రీవెన్స్ సరైన విధంగా పరిష్కరించారా అనేది చూడాలన్నారు. అర్జీలు పరిష్కరించే బాధ్యత క్షేతస్థాయి అధికారులపైనే ఉందన్నారు. లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్షేత్రస్థాయి అధికారులు కలెక్టరేట్ నుంచి ఏ అర్జీ వచ్చినా వ్యక్తిగతంగా పరిశీలన చేసి పరిష్కరించాలని, ఆ విధంగా చేయకుండా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన రెఫరెన్స్లను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులకు ఈ ఆఫీసు ద్వారా తపాలా పంపించటం జరుగుతుందని, వాటిని తీసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
టీ స్టాల్ యజమాని హత్య
నరసరావుపేట రూరల్: పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో టీ స్టాల్ నిర్వహిస్తున్న ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున టీ స్టాల్లో పనిచేస్తుండగా గుర్తుతెలియని ఇరువురు ఘాతకానికి పాల్పడ్డారు. హత్యలో ఓ మహిళ కూడా పాల్గొన్నట్టు పోలీసులు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ద్వారా నిర్ధారించారు. పట్టణంలోని కొండలరావుపేటకు చెందిన షేక్ బాజి (35) గతంలో టీ స్టాల్లో మాస్టర్గా పనిచేస్తుండేవాడు. ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలోని చిలకలూరిపేట రోడ్డులో తానే సొంతగా టీ స్టాల్ ప్రారంభించాడు. తెల్లవారుజామున 6 గంటల సమయంలో టీ స్టాల్ తెరిచి పనిచేస్తుండగా ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడకి వచ్చి బాజీపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాజీని గుర్తించిన స్థానికులు లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తలపైన, ఛాతీపైన బలమైన గాయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ కిషోర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పల్నాడు రోడ్డులోని ఏరియా వైద్యశాలకు తరలించారు. దాడిలో పాల్గొన్న మహిళ బాజీ హత్య కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మృతుడి భార్య, బంధువుల నుంచి అనుమానితుల వివరాలు సేకరించారు. దీంతోపాటు ఘటనా స్థలానికి సమీపంలోని సీసీ పుటేజ్ను పరిశీలిస్తున్నారు. సీసీ పుటేజ్లో హత్యలో ఇరువురు పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇద్దరిలో ఒకరిని మహిళగా గుర్తించినట్టు తెలిసింది. మృతుని భార్య జబీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ సుబ్బారావు తెలిపారు. -
కమిషన్తో సమగ్ర కుల గణన చేపట్టాలి
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేసి, పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలన్నా, ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్రంగా బీసీ కులాల జనగణన జరిపించాలని ఆయన కోరారు. 139 బీసీ కులాల్లో ఎవరెంతో తెలియకుండా రిజర్వేషన్లు అమలు జరుపుతారని ఆయన ప్రశ్నించారు. బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు జరిపి సామాజిక న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సరికొండ తిమ్మరాజు, తన్నీరు వెంకట్, ముదిరాజ్, జిల్లా నాయకులు బి.శ్రీనివాసరావు, శీలం వెంకట్రావు పాల్గొన్నారు. -
చివరిలో కలవరం!
చంద్రబాబు సర్కారు వచ్చాక ఆరుగాలం చెమటోడ్చిన అన్నదాతలకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. కనీసం ఇంటిలో తిండి గింజలైనా వస్తాయనే ఆశతో సాగు చేసిన వారికి తుపానులు, చీడపీడలు, మద్దతు ధర దక్కకపోవడం వంటి దెబ్బలు తప్పడం లేదు. పెట్టుబడులు రావడం లేదు. మోంథా తుఫాన్ నుంచి తేరుకున్న రైతులకు మళ్లీ ఇప్పుడు పంట చివరి దశలో మళ్లీ తుపాను తప్పదేమోననే ఆందోళన వెంటాడుతోంది. సత్తెనపల్లి: జిల్లాలో తుపాను ప్రభావం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ చల్లని గాలులు వీస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవక రైతులు ముప్పుతిప్పలు పడ్డారు. తర్వాత ఆలస్యంగా కురిసిన వర్షాలతో వరి నాట్లు గతంలో కంటే అధికంగా వేశారు. మరి కొన్ని చోట్ల పొలాల్లో సరిపడా నీరు లేక మోటార్ల సహాయంతో నింపుకొని దమ్ములు చేసి మరీ వరినాట్లు వేశారు. ఆ తర్వాత అడపాదడపా కురిసిన భారీ వర్షాలతో వరి పొలాలు కొంత ముంపు బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల భయాందోళనలకు గురి చేసిన మోంథా వర్షాలు పంటలను ముంచేయడంతో తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 114.75 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ గణంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను వస్తే పరిస్థితి ఏంటని రైతులు కలవరం చెందుతున్నారు. కోతలు ప్రారంభం జిల్లాలో ఈ ఏడాది వరి నాట్లు ఆలస్యంగా మొదలైనప్పటికీ ఆయా రకాల వరి విత్తనాలు కాలపరిమితి మేరకు గింజ తయారై ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని నకరికల్లు ఏరియాలో వరి కోతలు ప్రారంభం కాగా... మరో 15 రోజుల్లో జిల్లా అంతటా కోతకు సిద్ధం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం 38,599 హెక్టార్లు. ఈ ఏడాది 53,090 హెక్టార్లలో వరి సాగైంది. రానున్న 15 రోజుల్లో కోతకు పూర్తి స్ధాయిలో సిద్ధమవుతున్నా. గత నెలలో మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వరి పంట నీట మునిగి రైతులు నష్టపోయారు. మళ్లీ తుపాను వస్తే కోలుకోలేని నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పులు... జిల్లాలో వారం రోజుల క్రితం గజగజ వణికించిన చలిగాలులు ఇప్పుడు కాస్త చల్లగాలులుగా మారిపోయాయి. రాత్రీపగలు తేడా లేకుండా చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణ మార్పులు తుపాను హెచ్చరికలను సూచిస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే గింజ తయారై కొన్ని కోతలకు రాగా, మరికొన్ని పొలాలు 15రోజుల్లో కోతకు సిద్ధం కానున్నాయి. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. పంటలతో పాటు వరి పొలాల్లో నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత ఈ నెల 24న తుపాను అనుకున్నప్పటికీ ప్రస్తుతం 26 నుంచి 29 వరకు రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాపై ఎటువంటి ప్రభావం ఉండదని వాతావరణ శాఖ ప్రకటనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో తుపాను ప్రభావానికి అవకాశం లేదని వాతావరణ శాఖ ద్వారా తెలుస్తోంది.రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అయితే అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇప్పటికే జిల్లాలోని నకరికల్లు ప్రాంతంలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మంచి ధర పలికేలా కొనుగోలు కేంద్రాలు కూడా ఒకటి, రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నాం. –ఎం. జగ్గారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పల్నాడు -
ప్రసన్నాంజనేయునికి సర్వాంగం బహూకరణ
శలపాడు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు లీగల్: జిల్లాలోని న్యాయవాదుల వన సమారాధన ఆదివారం చిన్న పలకలూరులోని పెట్రోల్ బంకు సమీపంలోని మామిడి తోటలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, వివిధ కోర్టుల న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. న్యాయవాదులు, కోర్టు స్టాఫ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివ సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏర్పాట్లు చేశారు. -
రషీద్ కుటుంబం
కన్నీరుమున్నీరైన గురజాల/ రెంటచింతల: రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన బయో డీజిల్ అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతుడిని గురజాలకు చెందిన రషీద్గా గుర్తించారు. రషీద్ గత ఆరు సంవత్సరాలుగా బయోడీజిల్ ప్లాంటులో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర కిందటే వివాహం కాగా, ఆయిదు నెలల కుమారుడు ఉన్నాడు. రషీద్ తండ్రి ఆరేళ్ల కిందట చనిపోవడంతో తల్లి ఖాశీంబీ, భార్య అమిజాబేగం, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రషీద్ అకాల మరణంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. తహున్షాకు గుండెలో రంధ్రం ఉండటంతో రెండు నెలల క్రితమే ఆపరేషన్ చేయించారు. వారం రోజులుగా ప్లాంట్లో డీజిల్ లేదని, శనివారం రాత్రి ట్యాంక్ వస్తుందని విధులకు వెళ్లి ఆదివారం ఉదయానికే రషీద్ చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పారిశ్రామికంగా పల్నాడు ప్రాంతం ప్రసిద్ధి చెందింది. సిమెంటు, కెమికల్, సున్నం వంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయిు. వేల మంది కార్మికులు వాటిల్లో పనిచేస్తుంటారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక కేంద్రాలు పల్నాడు ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. 50 కిలోమీటర్లు దూరం వరకు ఒక్క అగ్నిమాపక శాఖ కార్యాలయం లేకపోవడం గమనార్హం. పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువజాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. -
పల్నాటి వీరుల ఆయుధాలకు ఘనంగా వీడ్కోలు
కారెంపూడి: ఐదు రోజులుగా పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. వీరాచారులు ఉదయాన్నే నాగులేరు గంగధారి ఒడ్డున వీరుల ఆయుధాల అలంకారాలు తీసివేసి నూతన అలంకారాలు చేశారు. తర్వాత ఊరేగింపుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికెళ్లి ఆయనను తోడ్కొని చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. చెన్నకేశవునికి పూజలు చేశాక తీర్థం తీసుకున్నారు. ఆలయం ముందు మరికొందరు వీరంగమాడారు. తర్వాత బ్రహ్మనాయుడు విగ్రహానికి పూజలు చేశారు. అంకాలమ్మను దర్శించుకున్నారు. అంతా కలిసి నాయకురాలు నాగమ్మ వేషంలో ఉన్న వీరాచారుడిని తరుముకుంటూ లంకన్న ఒరుగు ప్రాంతానికి పరుగున చేరుకున్నారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ నాయకత్వంలో వీరాచారులంతా రణక్షేత్ర వీధుల్లో ఉగ్రరూపంలో పరుగు లాంటి నడకతో విషాద వదనాలతో లంకన్న ఒరుగుకు చేరుకున్నారు. అక్కడ లంకన్న వేషధారణలో మృతి చెందినట్లుగా పడి ఉన్న లంకన్న పాత్ర పోషిస్తున్న ఆచారవంతుని వద్దకు వారంతా చేరుకున్నారు. అక్కడ పెద్దపెట్టున ఏడుపులు విన్పించాయి. విషాద వదనాలతో అంతా ఉద్విగ్నంగా ఉన్నారు. లంకన్న వద్దకు పీఠాధిపతి చేరుకుని ముసుగు తొలగించి ఆయన నోట్లో శంఖుతీర్థం పోసి ప్రాణ ప్రతిష్ట చేసిన ఘట్టాన్ని ప్రదర్శించారు. తర్వాత ఆచారవంతులంతా లంకన్నను తోడ్కొని నాగులేరు గంగధారిలో స్నానం ఆచరింపచేశారు. బ్రహ్మనాయుడు లంకన్నకు ప్రాణ ప్రతిష్ట చేశాడనే చారిత్రక గాథను ఉత్సవాలలో నాటకీయంగా ప్రదర్శించారు. ఆసాంతం ప్రశాంతంగా.. సాయంత్రం వీరుల ఆయుధాలన్నింటికి నాగులేరు ఒడ్డున అలంకారాలు తీసి వేశారు. ఆయుధాలను శుభ్రం చేశారు. రాత్రికి శంఖుతీర్థ మండపంలో బ్రహ్మనాయుడు పాత్రలో ఉన్న పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇచ్చిన తీర్థం తీసుకుని అలంకారాలు లేని ఆయుధాలతో వీరాచారులు పరుగులు తీస్తూ ఆయుధాలకున్న గంటలు మోగిస్తూ కారెంపూడి వీధులను కలియతిరిగారు. వీరుల ఆయుధాలు కళ్లికి ఒరిగాయి. దీంతో కళ్లిపాడు ఉత్సవ ఘట్టం ముగిసింది. అప్పటికే కళ్లి మండల కోసం వేచి ఉన్న ప్రజలు వాటిని తీసుకుని పొలాలలో చల్లుకున్నారు. ఇళ్లలో పెట్టుకున్నారు. దీంతో ఉత్సవాలు ముగిశాయి. మరో వైపు అప్పటికే వీరాచారుల కుటుంబాలు స్వస్థలాల ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. -
కార్టూనిస్ట్ సుభానీకి అరుదైన గౌరవం
కారంచేడు: పొలిటికల్ కార్టూనిస్టు సుభాని షేక్కి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్లోని(ఆత్రేయపురం) బాపు రమణ అకాడమీ వారు సుభానీ ప్రతిభను గుర్తించి బాపు అవార్డును ప్రకటించింది. వివరాలు.. కారంచేడు గ్రామంలో 1961లో జన్మించారు. ప్రాథమిక విద్యను కారంచేడులోను, కాలేజ్ విద్యను సమీపంలోని చీరాలలో పూర్తి చేశారు. మాస్టర్స్ డిగ్రీని గుజరాత్లో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి కార్టూన్లపై ఉన్న మక్కువతో ఆయన హైదరాబాద్లోని ఆంధ్ర భూమి వారపత్రికలో 1985లో జాయిన్ అయ్యారు. 1988 వరకు అక్కడే ఉన్న ఆయనను 1991లో వరకు పొలిటికల్ కార్టూనిస్ట్గా విధులు నిర్వహించారు. అక్కడ నుంచి సౌత్ ఇండియాలోనే ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన దక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్గాను, తరువాత కార్టూన్ ఎడిటర్గాను అంచలంచలుగా ఎదిగారు. 40 సంవత్సరాల తన సర్వీస్లో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 11 అర్జీలు స్వీకరించారు. వాటిని సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మట్టి అక్రమ తవ్వకాలు నిలిపివేయండి హైకోర్టు స్టేటస్కో ఉన్న సర్వే నెంబరు భూమిలో టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. అదేమని అడిగిన వారిని పోలీసుల అండదండలతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. –గ్రామ దళితులు, మురికిపూడి, చిలకలూరిపేట మండలం పీఎం ఈజీపీ రుణాలు మంజూరు చేయండి ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ కింద పీఎం ఈజీపీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి. మూడేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అమలు కాలేదు. రుణాలు అందక వడ్డీదారుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. సిబిల్స్కోరు, ఒకరికి ఒకరు ష్యూరిటీ లేకుండా వెంటనే ఇవ్వాలి. –మీరయ్యమాదిగ, ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు -
రెండు పళ్ల విభాగం విజేత కేసానుపల్లి ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలలో భాగంగా శనివారం రెండు పళ్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ప్రారంభించారు. ప్రథమ బహుమతిని దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన పొన్నబోయిన విష్ణుభరత్ యాదవ్ జత, తృతీయ బహుమతిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజశ్రీరెడ్డి, ప్రకాశం జిల్లా కంభం మండలం యర్రబాలెంకు చెందిన వెంకటగిరి హేమలతా నాయుడు కంబైన్డ్ జత గెలుచుకున్నాయి. నాల్గవ బహుమతిని నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జత, ఐదో బహుమతిని బెల్లంకొండ మండలం మాచాయపాలెంకు చెందిన గౌరు కార్తికేయ, అమరావతి మండలం గిడుగుకు చెందిన భూపతి శ్రీనివాసరావు కంబైన్డ్ జత కై వసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని పల్నాడు జిల్లా మాచవరం మండలం మల్లవోలుకు చెందిన ఘంటా రమ్య నాయుడు ఎడ్ల జత గెలుచుకున్నాయి. ఈ ఆరు బహుమతులను కారెంపూడికి చెందిన టీడీపీ నాయకుడు సంగినేడి ధనుంజయ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సంగినేడి బాలకృష్ణ ప్రదానం చేశారు. పోటీలలో పాల్గొన్న మిగిలిన రెండు జతలకు కూడా నగదు బహుమతులను ప్రదానం చేశారు. బహుమతి ప్రదానంలో పంగులూరి అంజయ్య, చప్పిడి రాము కారెంపూడి రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతులు క్లస్టర్ విధానం అవలంబించాలి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లానరసరావుపేట: జిల్లాలో రైతులు ప్రాంతాలను బట్టి క్లస్టర్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎఫ్పీఓ రైతులకు మునగ విత్తనాలు, సంక్షేమ హాస్టళ్లకు కంప్యూటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పంట ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వరకూ అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండటం వల్ల రైతులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు దక్కుతాయన్నారు. రైతులకు మునగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు భూమి, సబ్సిడీలో రుణాలు అందిస్తామన్నారు. విత్తనాల పంపిణీతో సరిపెట్టకూడదని, పది కాలాలపాటూ రైతులకు ఆదాయానిచ్చే వనరుగా మునగ సాగును అభివృద్ధి చేసేలా శిక్షణ నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎస్ఆర్ నిధులతో ఇన్పోసిస్ అందజేసిన కంప్యూటర్లు, దుప్పట్లను సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ మురళి, డీఆర్డీఎ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో సత్యసాయి జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జయంతి వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ–వార్డు సచివాలయ సెక్రెటరీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో సత్యసాయి జయంతి వేడుకలలో పాల్గొనాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. -
సూర్యలంకలోని హరిత రిసార్ట్స్ను అభివృద్ధి చేస్తాం
బాపట్ల: సూర్యలంకలోని హరిత రిసార్ట్స్ను ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ శనివారం పరిశీలించారు. రిసార్ట్స్లో లభ్యమయ్యే వసతి సదుపాయా లు, బీచ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సౌకర్యా లు, పర్యాటకులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆయన సూర్యలంకను ఆకర్షణీయమై న పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రిసార్ట్స్ సౌకర్యాల విస్తరణ, భద్రతా ఏర్పాట్ల మెరుగుదల, పర్యాటకులను ఆకట్టుకునే ప్రత్యే క ప్యాకేజీల రూపకల్పనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వారాంతాలు, సెలవుదినాల్లో పెరిగే పర్యాటక రద్దీ దృష్ట్యా సేవల నాణ్యత, పరిశుభ్రత, జనసంచారం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నా రు. కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టోల్ వసూలుపై అసంతృప్తి సూర్యలంక వెళ్తున్న చైర్మన్ వాహనాన్ని టోల్ వసూలు పేరుతో నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. టూరిజం ప్రాంతానికి వచ్చే వాహ నాలపై టోల్ వసూలు చేయడం సరికా దని, ఈ అంశంపై కలెక్టర్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. పంచా యతీ సిబ్బంది టోల్ వసూలు చేస్తున్నారన్న విషయంపై ఎలా వసూలు చేస్తున్నారు, దానికి ఆధారం ఏమిటో తెలుసుకోవాలన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 584.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 36,765 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 4,227 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది.కారెంపూడి: కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా శనివారం వీరుల గుడి ఆవరణలో కోడిపోరు నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. ముందుగా వీర విద్యావంతు లు కోడిపోరు కథాగానం చేశారు. తర్వాత బండ్ల గణేష్ ఒక పుంజును మరొకరు మరో పుంజును బరి లోకి వదిలారు. రెండు పందేలలో బ్రహ్మనాయుడు పుంజు గెలిచిందని మూడో పందెంలో బ్రహ్మనాయు డు పుంజు ఓడిందని ప్రకటించారు. పీఠాధిపతి పిడు గు తరుణ్ చెన్నకేశవ బ్రహ్మనాయుడు పాత్రలో మరొ కరు నాయకురాలు నాగమ్మ పాత్రను పోషించారు. రణక్షేత్రంలో గ్రామోత్సవాల సందడి వీరుల ఆయుధాలతో వీరాచారులు పౌరుషంతో ఊగిపోయారు. అలనాటి వీరుల ఆయుధాలతో వీరంగమాడారు. కత్తులతో విన్యాసాలు చేశారు. వీరుల ఆయుధాలను వారిపై వాల్చి ఆవేశాన్ని తగ్గించారు. పాత కారెంపూడి బజార్లన్నింటిలో గ్రామోత్సవాలు కొనసాగాయి. గ్రామస్తులంతా ప్రతి ఇంటి వద్ద వారు పోసి కొబ్బరికాయలు కొట్టి పూల దండలు వేసి వీరులకు నీరాజనాలు పలికారు. వీరాచారులు ఆయుధా లను వారిపై వాల్చి ఆశీర్వాదం అందించారు. ఉద యాన్నే వీరుల గుడి నుంచి గ్రామోత్సవాలు ప్రారంభమయ్యాయి. చెన్నకేశవస్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద కత్తి సేవలు చేసుకున్నారు. తర్వాత వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అక్కడ కత్తి సేవలు కొనసాగించారు. తర్వాత నుంచి గ్రామోత్సవానికి వీరుల ఆయుధాలు బయలుదేరాయి. మొదట తోట బజారులో ఉన్న బ్రహ్మనాయుడు మేడ వద్దకు ఆయుధాలన్నీ తరలివెళ్లాయి. సంప్రదాయ కత్తి విన్యాసాలు చేశారు. ఆ ప్రాంత వాసులంతా పల్నాటి వీరులకు నీరాజనాలు పట్టారు. ఆ బజారులోనే వీరుల ఆయుధాలు ప్రతి గడప నుంచి పూజలందుకున్నాయి. గ్రామోత్సవం పూర్తయ్యే సరికి అర్థరాత్రి దాటే అవ కాశం కన్పిస్తోంది. కోట బురుజు సమీపంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి హారతులిచ్చారు. ఉదయాన్నే వీరాచారులు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత నుంచి గ్రామోత్స వా లు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు చేసుకుని అంకాలమ్మ తల్లి చెన్నకేశవస్వామి నైవే ద్యం అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీరాచారు లతో పాటు ప్రజల వేలాదిగా ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ ఉత్సవాలలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. వారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలసి వీరుల గుడిలో ఆయుధాలకు పూజలు చేశా రు. అనంతరం ఎడ్ల పోటీలను ప్రారంభించారు.బ్రహ్మనాయుడు మేడ వద్ద వీరుల ఆయుధాలకు పూజలుకోడిపుంజును వదులుతున్న బండ్ల గణేష్, వీక్షిస్తున్న ఎమ్మెల్యే జూలకంటి7ఐదు రోజులుగా జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కళ్లిపాడు నాడు వీరుల ఆయుధాలు కళ్లి పోతురాజు మండపం వద్ద కళ్లికి ఒరగడంతో ఉత్సవాలను ముగించి వీరాచారులు స్వగ్రామాలకు పయనం కానున్నారు. -
అరకొర వేతనాలు.. చాకిరి మోపెడు
పెదకూరపాడు: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అరకొర జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ భద్రత అయినా ఉందా అంటే అదీ లేదు. దీంతో వారు పోరాట దీక్షకు దిగ్గారు. పల్నాడు జిల్లాలో క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు(సీఆర్ఎంటీ), మండల సమన్వయకర్తలు(ఎంఐఎస్), డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 192 మంది పనిచేస్తున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా వారి ఎదుగుదలలో ఎలాంటి మార్పులు లేదు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకునేందుకు దశల వారీగా ఉద్యమం చేపట్టారు. వీరి డిమాండ్లు..... ● సమగ్ర శిక్షలోని అన్ని కేటగిరీలకు హెచ్ఆర్ పాలసీ తక్షణం అమలు చేయాలి. ● అన్ని కేటగిరీలకు మినిమయం టైం స్కేల్ అమలు చేయాలి. ● ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ సెలవులు, చైల్డ్ కేర్ సెలవులు అందించాలి. ● రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి ● గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలి. ● సమగ్ర శిక్షలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు మెడికల్, చైల్డ్ సెలవులు అందించాలి. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకే ఈ పోరాటం. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. –జి.జ్యోతి, క్లస్టర్ మొబైల్ టీచర్ -
దత్తత మరో మార్గం!
మాతృత్వం ఓ వరం.. సత్తెనపల్లి: వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా సంతాన సాఫల్యానికి నోచని దంపతులకు దత్తత ఓ వరం. దత్తత తీసుకోవడంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అనధికార దత్తత చట్ట రీత్యా నేరం. కొంతమంది ఈ విషయం తెలియక దళారుల చేతిలో మోసపోతున్నారు. అక్రమ మార్గాలను ఎంచుకొని చిక్కుల్లో పడుతున్నారు. జాతీయ దత్తత మాసోత్సవం సందర్భంగా నెలరోజుల పాటు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటిన ప్రారంభమైన జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఈ నెల 30 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 24న సత్తెనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శిశు గృహ కేంద్ర అధికారులు దత్తత ఏ విధంగా పొందాలి. దత్తత తీసుకునేందుకు ఉండాల్సిన అర్హతల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. అనధికార దత్తత చెల్లదు... కొందరు బంధువులకు చెందిన పిల్లలను, తెలిసిన వారి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారు. తీసుకున్న వారికి జేజే యాక్ట్ సెక్షన్ 81 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం... దత్తత కోరే తల్లిదండ్రులు తొలుత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కారా.ఎన్ఐసీ.ఇన్ వెబ్ సైట్లో దరఖాస్తు నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లోడ్ చేయాల్సిన పత్రాలు ... భార్యాభర్తల ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్, పాన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువపత్రం, సంవత్సరం ఆదాయ ధ్రువీకరణ పత్రం, దీర్ఘకాలిక అంటూ వ్యాధి లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడలేదని, దత్తత తీసుకోవడానికి అర్హులని ధ్రువీకరిస్తూ మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నలుగురికి తీవ్రగాయాలు రెంటచింతల: మండల పరిధిలోని గోలి గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హాలియాకు చెందిన కంటోజు పరిపూర్ణాచారి(42) తన అన్న శ్రీనివాసచారితో కలిసి గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెలు భర్త గోవిందాచారిని పరామర్శించారు. వా రు తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం హాలియా వెళ్తున్న సమయంలో నాగమయ్య దేవస్థానం సమీపంలో సమాధానపేటకు చెందిన వేల్పుల నరేంద్ర, జొన్నలగడ్డ సంతోస్, గుంజరి వెంకటేష్ ముగ్గురు మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలపై నున్న ఐదుగురు కిందపడ్డారు. ప్రమాదంలో పరిపూర్ణాచారి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాల య్యా యి. వారిని ఏపీ జన్కో అంబులెన్స్ వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని నరసరావుపేట తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
25 నుంచి అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు చెప్పారు. పోటీల కరపత్రాలను శనివారం వారు విడుదల చేశారు. పోటీలలో భాగంగా వర్సిటీ టీమ్ను ఎంపిక చేస్తారని వివరించారు. పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీలను ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), డాక్టర్ చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట), వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల జట్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
నరసరావుపేట టౌన్: స్వల్ప వివాద నేపథ్యంలో ఓ వ్యక్తిని కాళ్లతో, చేతులతో విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నరసరావుపేట ఇన్చార్జి డిఎస్పీ ఎం. హనుమంతరావు తెలిపారు. డిఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈపూరు మండలం అంగుళూరు గ్రామానికి చెందిన అచ్చు కట్ల రాంబాబు ఈనెల 10వ తేదీ సాయంత్రం వినుకొండ పట్టణంలో నిందితులు ఓ మద్యం షాపు వద్ద ఉండగా దారిన పోతూ ఉమ్మి వేశాడని దాంతో తమను చూసి ఉమ్మి వేసినట్లుగా వాళ్లు భావించి వివాదానికి దిగారన్నారు. ఈ నేపథ్యంలో రాంబాబు నిందితులలో ఒకరిపై చేయి చేసుకోవడంతో నలుగురు కలిసి రాంబాబుపై విచక్షణరహితంగా కాళ్లు చేతులతో దాడి చేశారన్నారు. తీవ్ర గాయాలపాలైన రాంబాబు చికిత్స పొందుతూ 13వ తేదీ వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో మృతి చెందాడన్నారు. గుండె, లివర్లపై తగిలిన బలమైన దెబ్బలతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ఈ ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ ఫుటేజ్ ఆధారంగా వినుకొండ పట్టణానికి చెందిన పల్లె మరియబాబు, పల్లె వినయ్లతో పాటు మరో ఇద్దరు మైనర్ యువకులు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో వినుకొండ పట్టణ సీఐ బలగాని ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
సతీష్కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షుడు తుర్లగుంట నాదెండ్ల: టీటీడీ పరకామణి విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్కుమార్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని నాదెండ్ల పీఏసీఎస్ మాజీ సీఈవో, పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షుడు తుర్లగుంట చిన్నఅంజయ్య డిమాండ్ చేశారు. విధుల్లో నిజాయితీగా సేవలందిస్తూ, పరకామణిలో అవకతవకలు వెలుగులోకి తెచ్చిన సతీష్కుమార్ సేవ లు ఎనలేనివన్నారు. ఆయన మరణంపై ప్రభు త్వం పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, సతీష్కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మధుబాబు మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా అర్బనన్ డెవలప్మెంట్ అథారిటీ(పీఏయూడీఏ)చైర్మనన్గా్ నియోజకవర్గ టీడీపీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు నియమితులయ్యారు. 2012లో జరిగిన మాచర్ల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మధుబాబు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. మధుబాబు నియామకంపై నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీకి చేసిన సేవలకు గానూ పదవి వరించిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, మధుబాబుకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర బట్రాజ కార్పొరేషన్ చైర్మన్గా సరికొండ సత్తెనపల్లి: ఏపీ బట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన 12వ వార్డు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వరరాజు అలియాస్ మార్కెట్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం 11 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రకటించింది. సరికొండ వెంకటేశ్వరరాజుకు బట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించింది. వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వరరాజుకు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభి నందనలు తెలిపారు. -
తల్లి, కుమారుడిని కలిపిన జ్యోతి ఫౌండేషన్
సత్తెనపల్లి: మతిస్థిమితం లేని యువకుడు ఐదు నెలల క్రితం తప్పి పోవటంతో తల్లి వెతకని చోటు లేదు. ఎక్కడా జాడ కనిపించక ఆందోళన చెందుతున్న తరుణంలో సత్తెనపల్లి నుంచి వచ్చిన ఫోన్తో ఆ తల్లి ఆనందానికి ఆవధులు లేవు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్లో గత రెండు రోజుల క్రితం మాసిపోయిన బట్టలతో మతిస్థిమితం లేక తిరుగుతున్న యువకుడ్ని ఆటో వాళ్ళు గుర్తించి జ్యోతిఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓలేటి కుమారి మతిస్థిమితం లేని 20 సంవత్సరాల మంజునాథ్ అనే కర్ణాటకకు చెందిన యువకుడిని అక్కున చేర్చుకొని జ్యోతి ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకుని వచ్చి సపర్యలు చేయించింది. అతనికి స్నానం చేయించే క్రమంలో అతని చేతి మీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా కర్ణాటకలో ఉన్న యువకుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం తో వారి తల్లిదండ్రుల వద్ద ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి వారికి వారి కుమారుడు మంజునాథ్ను అప్పగించింది. ఈ సందర్భంగా మంజునాథ్ తల్లి అన్నపూర్ణ మాట్లాడుతూ సత్తెనపల్లిలో నా బిడ్డ ఉన్నాడని జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారి ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్లో నా బిడ్డను చూసుకొని చాలా సంతోషించానని, తమ కుమారుడ్ని తమకు అప్పగించిన ఓలేటి కుమారికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాది దివ్వెల శ్రీనివాస రావు, సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొతుగంటి రామకోటేశ్వరరావు వెంట ఉన్నారు.


