breaking news
Palnadu District News
-
● బంగారం, డబ్బుల కోసం భర్తతో కలిసి తల్లిని చంపిన వైనం ● ఈనెల 12న వృద్ధురాలి హత్య ఉదంతంలో వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు
కన్న కూతురే హంతకురాలు పొన్నూరు: ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని కూలి పనులతో జీవనం భారమై.. భర్తతో సహా తల్లి పంచన చేరి, డబ్బు, నగల కోసం ఆమెనే హత్య చేసిన కసాయి కూతురి ఉదంతమిది. పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్థనరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని క్యాబిన్ పేటలో ఈ నెల 12వ తేదీన తల్లిని హతమార్చిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. క్యాబిన్ పేటలో నివాసం ఉంటున్న మృతురాలు ఈవూరు లక్ష్మీకి కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన మనవడు జాషువాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కుమారుడు మరణించినప్పుడు వచ్చిన ఇన్య్సూరెన్స్ డబ్బులతో లక్ష్మీ బంగారం నగలు చేయించుకున్నారు. ఆమె కూతురు పుష్పలత మొదటి భర్తతో విడిపోయి, రెండో భర్త చనిపోవడంతో, ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయమైన సఖినేటిపల్లికి చెందిన రాకేష్ కుమార్ను మూడో పెళ్లి చేసుకొని తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ జీవన సాగిస్తోంది. కూలి పనులతో జీవనం భారంగా మారడంతో ఆర్థిక సహాయం కోసం పొన్నూరులో ఉంటున్న తల్లి లక్ష్మిని వారు ఆశ్రయించారు. అయితే రెండు నెలల పాటు కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయకుండా ఉండడంతో తల్లి వారిద్దరిని తిరుపతికి వెళ్లిపోవాలంటూ మందలించింది. అయితే ఎలాగైనా తల్లి మెడలోని బంగారం, బీరువాలోని డబ్బులు కాజేయాలని కూతురు, అల్లుడు పన్నాగం వేశారు. 12వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మి నిద్రలో ఉండగా గొంతుకు చున్నీ బిగించి హత్యకు పాల్పడ్డారు. ఆమె మెడలోని బంగారం తాడుతోపాటు బీరువాలోని డబ్బులు అపహరించి పరారయ్యారు. హత్య చేయడాన్ని చూసిన మనవడు జాషువా వివరాలను పోలీసులకు తెలిపాడు. మృతురాలి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో నిందితులైన పుష్పలత, రాకేష్కుమార్ను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. కుంభకర్ణ రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత మంగళగిరి రూరల్: పాడైన ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న మాంసం అపరిశుభ్రంగా ఉన్న వంటగది మొదలగు లోపాలు రెస్టారెంట్లో బయటపడటంతో మండల పరిధి కాజా గ్రామం టోల్ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యూజియన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఐపీఎం డైరెక్టర్ అరుణ్బాబు స్వయంగా తనిఖీ చేసి పాడైన మాంసం, అపరిశుభ్ర వంటగది తదితర లోపాలను గుర్తించారు. దీంతో రెస్టారెంట్ వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత అధికారులు బి.నరసింహుడు, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
దళితుల భూములను పరిరక్షించండి
ప్రజాసంఘాల నాయకులు, దళితుల వినతి నరసరావుపేట: శావల్యాపురం మండలం పిచికలపాలెం దళితుల భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని, దీనికి బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు, దళితులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, డీఆర్ఓ కె.అద్దెయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 110 కుటుంబాల మాదిగ వర్గానికి చెందిన పేదలకు సర్వే నంబర్ 246 / సీలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, సర్వే నంబర్ 122లో తాగునీటి చెరువు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. మరో సర్వే నంబర్లోని భూమిలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతుండగా టీడీపీకి చెందిన మాజీ మండల ప్రెసిడెంట్ కె.కోటయ్య అండదండలతో గ్రామానికే చెందిన మరికొందరు మాఫియాగా ఏర్పడి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకొని ఆ భూములను అభివృద్ధి చేయాలని కోరారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కోట నాయక్, రైతు సంఘ నాయకులు ఘనపర్తి వెంకటేశ్వర్లు, పీడీఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, ప్రసాద్, దళితులు పాల్గొన్నారు. -
జిల్లా పోలీసు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం
నరసరావుపేట రూరల్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులు, కంటి, దంత వైద్య పరీక్షలు చేశారు. మహాత్మాగాంధీ హాస్పిటల్, డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి ఆస్పత్రి, వసంత్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది శిబిరంలో పాల్గొని పోలీసు సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను వైద్యులు అందించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసామని, వైద్య సమస్యలు ఉన్నట్టయితే ముందుగా తెలుసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉటుందని ఏఆర్ డిఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్ఐ ఎస్.కృష్ణ, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్.గోపినాథ్ పాల్గొన్నారు. -
దళిత యువకుల మృతిపై న్యాయవిచారణ చేయండి
లక్ష్మీపురం: రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో దళితులపై దాడులు గణనీయంగా పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. దొంగతనం నెపంతో మంగళగిరిలో హత్య గురైన మేకల రమేష్ కుటుంబ సభ్యులను తుళ్లూరు మండలం దొండపాడులో వి.శ్రీనివాసరావుతో పాటు కేవీపీఎస్ నాయకులు బుధవారం పరామర్శించారు. అలాగే పోలీసు దెబ్బలకు తాళలేక మృతిచెందిన దళిత యువకుడు చీకటి గోపి కుటుంబ సభ్యులను కూడా తాడికొండ మండలం పొన్నెకల్లులో పరామర్శించారు. అనంతరం గుంటూరులోని బ్రాడీపేట పార్టీ కార్యాలయంలో విలేకరులు సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో దళితులు పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. దళితుల కేటాయించిన తాడికొండ నియోజకవర్గంలో ఈ ఘటనలపై ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించలేదన్నారు. దొంగతనం నెపంతో మేకల రమేష్ పెత్తందారులు కొట్టగా చనిపోగా, చీకటి గోపి పోలీసులు కొట్టడంతో చనిపోయాడని తెలిపారు. ఈ రెండు ఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా ఉందన్నారు. తాడికొండ సీఐపై ఆరోపణలు వస్తే మేడికొండూరు సీఐని విచారణ అధికారిగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే స్థాయి అధికారిని విచారణ అధికారిగా ఇలా నియమిస్తారా అని ప్రశ్నించారు. విచారణ పూర్తికాకుండానే పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే జ్వరంతో చీకటి గోపి మృతి చెందాడని డీఎస్పీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధితులను ఇంతవరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శించలేదన్నారు. కొద్దిరోజుల క్రితం తాడేపల్లిలో ఎస్టి యువకుడు కూడా దొంగతనం కేసులో మృతి చెందాడని ఆరోపించారు. ఈ ఘటనలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివద్ధి కన్నా పేదలపై దాడులు పెరిగాయన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద గురువారం దళిత సంఘాలు చేయనున్న ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు బి.లక్ష్మణరావు, జె.నవీన్ప్రకాష్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు -
రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలి
జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు నూజండ్ల: నీటి వసతి కలిగిన ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు సూచించారు. మండల పరిధిలోని పువ్వాడలో విజయ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు ఆయిల్ ఫామ్ సాగు, రాయితీల గురించి రైతులకు వివరించారు. నూరు శాతం రాయితీతో ఒక హెక్టారుకు గాను 125 మొక్కలు ఇస్తామని చెప్పారు. ఇందులో భాగంగా హెక్టార్కు నాలుగు సంవత్సరాలకు గాను సాగు ప్రోత్సాహకం కింద రూ.21 వేలు అందిస్తారని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు నిబంధనల మేరకు డ్రిప్ సిస్టమ్ ఇస్తామన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శాఖాధికారులు షేక్ నబీ రసూల్, మేకల నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
పింఛన్లు మంజూరు చేయండి మహాప్రభో అని ఎన్నోసార్లు కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తిరిగినా చంద్రబాబు ప్రభుత్వం ఇంతకాలం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా కొత్త పింఛన్ల మంజూరు ఊసెత్తని ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. దరఖాస్తు చేసుకోవాలని ఆశలు రేపింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకు అర్హులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు తెలుగు తమ్ముళ్లు వసూళ్లకు తెరలేపారు. బెదిరింపులు, ఆన్లైన్ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. -
ఓజోన్ పరిరక్షణపై విద్యార్థుల అవగాహన
రొంపిచర్ల: మండలంలోని విప్పర్లరెడ్డిపాలెం పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్లో ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రవినాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన నినాదాలు, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించారు. ఓజోన్ పొరను సూచిస్తూ త్రికారంలో కూర్చొని పర్యావరణ పరిరక్షణపై సందేశం అందించారు. ఓజోన్ పరిరక్షణపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, కాలుష్య నియంత్రణ, మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టాలని సంకల్పించారు. ప్రతి విద్యార్థి ‘ఓజోన్ రక్షకుడు’గా మారి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. -
డీజే సౌండ్.. గుండె గుభేల్!
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 70 డెసిబెల్స్ పైగా శబ్దం దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 85 డెసిబెల్స్ దాటితే శ్రవణ లోపం ప్రమాదం ఉండగా, 100 డెసిబెల్స్ పైబడి శబ్దం మరింత ప్రమాదకరంగా భావిస్తున్నారు. సత్తెనపల్లి: డీజే శబ్దంతో వినికిడి లోపం, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఒక వైపు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ డీజేలు ఏర్పాటు చేయడం తప్పనిసరిగా మారింది. శబ్దాలు రెండు రకాలు. శ్రావ్యంగా ఉండి మనసును ఉల్లాసపరిచేవి, ఫాస్ట్బీట్తో తనువును ఉర్రూతలూగించేవి. పరిధి దాటనంత వరకూ ఈ రెండు సంగీత ప్రక్రియలను అందరూ ఆస్వాదిస్తారు. ఇది మితిమీరితేనే సమస్య. ఇటు వాయించే వారికి, అటు వినేవారికి కూడా ప్రమాదమే. ఏదైనా బాణసంచా పేలితే కుక్కలు, పశువులు, ఇతర జంతువులు శబ్దాలకు కట్లు తెంచుకోవడం, నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాలకు పారిపోవడం చేస్తుంటాయి. అవి పెద్ద శబ్దాలను తట్టుకోలేవు. మనుషుల పరిస్థితి అంతే. పెద్ద శబ్దాలు గుండెలయ తప్పేలా చేస్తాయి. డీజే సౌండ్ బాక్స్ల శబ్దాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాటి నియంత్రణ ఎంతో అవసరం. శుభకార్యం, ఉత్సవం ఏదైనా డీజే శబ్దాలు ఇప్పుడు ఉండాల్సిందే. డీజే సంగీతానికి దాని దగ్గర ఉండి ఉత్సాహంగా డాన్స్ చేసే వారికి ఆనందంగా ఉంటుందేమో కానీ కొందరికి అదే ప్రాణ సంకటంగా మారుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డీజేల వద్ద డాన్స్ చేస్తూ గుండె ఆగి చనిపోయారన్న వార్తలు ఇటీవల తరచూ వింటున్నాం. అంతేకాక శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు వినికిడి, గుండె, మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా వాటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. పెరిగిన వినియోగం ప్రస్తుతం డీజే సౌండ్ బాక్స్ల వినియోగం పెరిగిపోతోంది. రాజకీయ నాయకులకు స్వాగతం పలికేందుకు చేసే ఊరేగింపులు, జాతరలు జరిపేటప్పుడు, వినాయక నిమజ్జనాలు, ఉత్సవాల ముగింపు సందర్భాల్లోనూ డీజే సౌండ్ బాక్స్లు ఉండాల్సిందే. యువత ఉత్సాహపు వికృత డాన్స్లతో ఆ ప్రాంతం మారుమోగిపోవాల్సిందే. ర్యాలీగా తిరిగేటప్పుడు కిటికీలు, తలుపులు, మంచాలపై ఉండే వృద్ధులు, చిన్నారులు కంపిస్తున్నారు. గాఢనిద్రలో ఉండేవారు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనివల్ల అధిక శబ్ద కాలుష్యం వెలువడుతున్నా, హృద్రోగులు, సున్నిత మనసుగలవారు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టింపు ఉండదు. వారి ఆనందం వారిదేనన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. విపరీతమైన శబ్దాలతో ఊరేగే డీజే బాక్స్లు ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నా రాజకీయాల ప్రభావంతో పట్టించుకునేవారు కరువయ్యారు. వైరెటీ హారన్లు కూడా.. జిల్లాలో ఆకతాయిలు వికృత పోకడలతో రెచ్చిపోతున్నారు. వైరెటీ హారన్లు, వింత సౌండ్లతో బెంబేలెత్తిస్తున్నారు. చిన్నారుల ఏడుపుతో ఉన్న హారన్, వెనుక నుంచి భారీ వాహనం వచ్చినట్లు ఉండే హెవీ హారన్, జంతువుల శబ్దాలతో ఉండే హారన్లతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో అధిక డెసిబెల్స్ శబ్దం చేసే వింత హారన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫ్రెషర్ హారన్స్, మ్యూజికల్ హారన్స్, మల్టీ టోన్ హారన్స్ వంటివి వినియోగించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం వాహన హారన్ల శబ్దం సాధారణంగా 80 నుంచి 90 డెసిబెల్స్ మధ్యలో ఉండాలి. నివాస ప్రాంతాలు, సైలెంట్ జోన్లలో ఇది 60కి మించకూడదని మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనేక వాహనాల్లో అమరుస్తున్న హారన్లు 120 నుంచి 200 పైగా డెసిబెల్స్ ఉంటున్నాయని సమాచారం. ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు చికిలి ఇమాంబీ(56). భర్త పేరు పెద్ద మీరా. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిది నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామం. గ్రామంలో కొందరు పెట్టిన డీజే శబ్దానికి గుండెపోటుకు గురై మృతి చెందింది. డీజే సౌండ్లు ప్రమాదకరమని చెబుతున్నా లెక్క చేయకపోవటమే ఆమె మృతికి కారణమైంది. -
ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల గుర్తింపు
సత్తెనపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు 34 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, తదితర అధికారులు బుధవారం జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 34 బ్లాక్స్పాట్లు, 40 హాట్స్పాట్లు గుర్తించారు. డీటీఓ జి.సంజీవ్కుమార్, నాయి రోడ్ సేఫ్టీ సీఐ రమేష్బాబు, పిడుగురాళ్ల ఎంవీఐ సీహెచ్ రాంబాబు, సత్తెనపల్లి రూరల్ సీఐ హైమారావు, రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ పాల్గొన్నారు. రొంపిచర్ల: పుట్టపర్తిలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల బేస్బాల్ పోటీల్లో పల్నాడు జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించింది. ఈ మేరకు రొంపిచర్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సైదయ్య బుధవారం తెలిపారు. పల్నాడు జిల్లా టీమ్లో రొంపిచర్ల పాఠశాలకు చెందిన పి.చంద్రిక, బి.శ్రీలక్ష్మి, ఇ.పూజిత, ఎస్.ప్రజ్ఞశ్రీ, ఎ.నక్షత్ర ప్రాతినిధ్యం వహించారన్నారు. జిల్లా జట్టు విజయానికి కీలకంగా నిలిచిన క్రీడాకారులను హెచ్ఎం బి.ఎం. సుభాని, వ్యాయామ ఉపాధ్యాయుడు, గ్రామ పెద్దలు అభినందించారు. సత్తెనపల్లి: జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ జాస్మిన్ ఎంపికైంది. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పుట్బాల్ పోటీల్లో రాష్ట్రం నుంచి జాస్మిన్ ప్రాతినిధ్యం వహించనుంది. సత్తెనపల్లి సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జాస్మిన్ ఆటలో రాణిస్తోంది. ఆమె ఎంపికపై ఫుట్బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వర రావు, పాఠశాల హెచ్ఎం లతా ప్రియదర్శిని, పీడీ షేక్ రియాజు అభినందించారు. కొరిటెపాడు (గుంటూరు): సహకార సొసైటీల్లోని ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. బ్రాడీపేటలోని బ్యాంకు పరిపాలనా భవనంలో బుధవారం డీఎల్ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల అభ్యర్థనలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. సీఈఓ పోస్టుల భర్తీ, ఉద్యోగులకు పదోన్నతులపై చర్చించారు. బ్యాంకు సీఈఓ వి.వి.ఎస్. ఫణికుమార్, గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారి రత్నకుమారి, పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి నాగరాజు, ఆప్కాబ్ అధికారులు ఎం. శామ్యూల్ ధీరజ్, సీహెచ్. ధనాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.తెనాలి రూరల్: మహిళ మృతికి కారణమైన డ్రైవర్కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 మార్చి 14న తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన కావూరి ఉషారాణి, మేనల్లుడు మాచర్ల నవీన్బాబులు స్కూటీపై రేపల్లెకు బయలుదేరారు. కొల్లూరు గ్రామం కృష్ణానది కరకట్ట వద్ద టిప్పర్ ఢీకొని ఉషారాణి మరణించింది. డ్రైవర్ బుడంపాడు వాసి మస్తాన్ను అరెస్టు చేశారు. తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఏకా పవన్ కుమార్ బుధవారం నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. -
అప్పుల బాధతో డ్వాక్రా మహిళ మృతి
రాజుపాలెం: అప్పుల బాధతో డ్వాక్రా మహిళ ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందిన ఘటన మండలంలోని కొండమోడులో చోటుచేసుకుంది. గ్రామంలో ఆశియా డ్వాక్రా గ్రూపులో పది మంది సభ్యులున్నారు. సయ్యద్ ఖాశీంబి అలియాస్ గౌసియా(35) ఆశియా గ్రూపులో రెండవ లీడర్గా వ్యవహరిస్తున్నారు. గౌసియా గ్రూపు సభ్యులకు తెలియకుండా గ్రూపునకు సంబంధించిన డబ్బులను తన సొంత ఖర్చులకు వాడుకోవడం వలన ఆశియా డ్వాక్రా గ్రూప్కు రూ.3 లక్షలు అప్పు పడడంతో సభ్యులందరూ ఇంటికి వెళ్లి పదేపదే అడగడంతో మనస్తాపానికి గురై తన ఇంటిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. భర్త చాంద్బాషా, కుటుంబ సభ్యులు గౌసియాను పిడుగురాళ్ల ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమస్టర్ నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలికి ఇంటర్ చదివే కుమారుడు, పదవ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. -
విద్యార్థినిని బెదిరించిన యువకుడు అరెస్ట్
తెనాలిరూరల్: ఇన్స్ట్రాగామ్లో పరిచయమై బీటెక్ విద్యార్థినిని నమ్మించి మోసం చేయడమే కాకుండా నగలను అపహరించి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ డి.రవీంద్రబాబు వివరాలను వెల్లడించారు. స్థానిక గంగానమ్మపేటకు చెందిన బీటెక్ విద్యార్థినికి ఇన్స్ట్రాగామ్లో కఠెవరం గ్రామానికి చెందిన కమాధుల సాయి అలియాస్ పవన్ సాయి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు చెబుతూ నమ్మించి ఆమె నుంచి బంగారపు వస్తువులు, రూ. 40,700 నగదు, వెండి పట్టీలు తీసుకున్నాడు. వాటిపై ఉమా కీర్తన పలుమార్లు ప్రశ్నించడంతో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని, ఆమె వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1.30 లక్షల విలువైన బంగారపు గొలుసు, రెండు ఉంగరాలు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ సిహెచ్. రాజ్యలక్ష్మి నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించారని, ఆమెను డీఎస్పీ అభినందించారని తెలిపారు. చుట్టంలా వచ్చి చోరీలు.. చుట్టంలా వచ్చి కొద్ది రోజులు ఇంట్లో ఉండి విడతల వారీగా వస్తువులు దొంగిలించి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టు టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఐ డి. రవీంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక ఐతానగర్కు చెందిన నిమ్మగడ్డ జితేంద్ర శ్రీనివాస ప్రసాద్ ఇంటికి తాడికొండ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన బంధువు జాగర్లమూడి భరత్ వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటన్న భరత్ తనకు ఇంటర్వ్యూ ఉందంటూ చెప్పి నమ్మించాడు. దాదాపు నెల రోజులపాటు ఉన్న భరత్, ఇంటిలో ఒక్కొక్కటిగా వస్తువులు దొంగిలించాడు. వెళుతూ శ్రీనివాస ప్రసాద్కు చెందిన వాహనాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.7.50 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల బంగారు పూసల గొలుసు, 18 గ్రాముల బంగారు గొలుసు(తాకట్టు), నిందితుడు అపహరించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. -
వీరిది మరో వ్యథ
సత్తెనపల్లి: సత్తెనపల్లి 11వ వార్డు రఘురామ్నగర్కు చెందిన రామకోటమ్మకు 67 ఏళ్లు. ఈమె కుమార్తెకు ఏడేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగితో వివాహం జరిగింది. ఆరేళ్ల కుమార్తె ఉంది. ఏలూరు జిల్లాలో వారు నివాసం ఉంటారు. వృద్ధాప్య పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంది. పరిశీలించిన అధికారులు 7వ సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయి ఉందని అక్కడికి వెళ్లమన్నారు. ఆ సచివాలయానికి వెళ్లితే అందరూ ఒకే హౌస్హోల్డ్లో ఉన్నట్లు చూపడంతో కంప్యూటర్ అప్లికేషన్ను స్వీకరించడం లేదని అధికారులు చెప్పారు. ఆమే కాదు.. పల్నాడు జిల్లాలో ఇటువంటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది హౌస్హోల్డ్ మ్యాపింగ్ల వల్ల, మంచాలకే పరిమితమై సర్టిఫికెట్లు ఉన్నా ఆరోగ్యశాఖ వెబ్సైట్ తెరుచుకోక, పింఛన్లు మంజూరు పేరుతో కొందరు తెలుగు తమ్ముళ్లు పైసా వసూల్, తమ వద్దకు రావాలంటూ కొందరు టీడీపీ నాయకులు బెదిరింపుల మధ్య పింఛన్ దరఖాస్తులు పెట్టలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంత వరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. మరో నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఒక్కసారిగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై ప్రేమ కురిపిస్తూ ఈ నెల 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు, సర్వర్ సమస్యల నేపథ్యంలో ఈ నెల 18 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. హౌస్హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు... ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంటింటికీ పర్యటించిన అధికారులు ప్రతి ఇంట్లో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారందరి ఆధార్ కార్డు నంబర్లను ఒకే హౌస్హోల్డింగ్లో మ్యాపింగ్ చేశారు. తర్వాత కొంతమందికి పెళ్లిళ్లయి అత్తవారింటికి వెళ్లిపోయినా ఇంకా పాత హౌస్ హోల్డింగ్లోనే ఉన్నట్లు చూపుతోంది. అటువంటి దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. కొన్ని గ్రామాలలో సచివాలయ సిబ్బందిని అధికార పార్టీ నేతలు తాము చెప్పినవారికే పింఛన్లు ఆన్లైన్లో పెట్టాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్లు, ఇతర పథకాల దరఖాస్తుల కోసం వలంటీర్లే నేరుగా ఇంటి తలుపు తట్టేవారు. దరఖాస్తు ప్రక్రియను నిమిషాల్లో పూర్తి చేసేవారు. ఒకవేళ సచివాలయానికి వెళ్లినా సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉండి వెంటనే పనులు పూర్తి చేసిపెట్టేవారు. నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని అర్హులు వాపోతున్నారు.జిల్లాలో పరిస్థితి ఇదీ.... 16వ తేదీ వరకు దరఖాస్తులు : 55,142 గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవి: 43,713 అర్బన్ ప్రాంతాలలో దరఖాస్తులు : 11,429 అప్రూవ్ అయిన దరఖాస్తులు : 2,292 తిరస్కరించిన దరఖాస్తులు : 32 పెండింగ్లో ఉన్నవి : 52,818పల్నాడు జిల్లా సత్తెనపల్లి 22వ వార్డు నాగన్నకుంటకు చెందిన కుంచనపల్లి శ్రీనివాసరావు, శివకుమారి దంపతుల కుమారుడు మణికంఠ పుట్టుకతోనే నరాలు చచ్చుబడి, మెంటల్ డిజార్డర్తో జన్మించాడు. 26 సంవత్సరాల అతడు శారీరక వైకల్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు. తన దయనీయ స్థితిపై వైద్య ఆరోగ్యశాఖ పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా, పీజీఆర్ఎస్లో వినతి పెట్టుకున్నా ఆలకించలేదు. చివరకు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వినతి పత్రాలు ఇచ్చి గోడు నివేదించినా ఇంత వరకూ ఎవరూ స్పందించలేదని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలని కోరిన నేపథ్యంలో ఇకనైనా మణికంఠకు పింఛన్ మంజూరు చేస్తారా? అనేది వేచి చూడాలి. -
కాళ్లు అరిగేలా తిరుగుతున్నా
నాకు వెన్నెముక అరిగిపోయింది. కుమారుడికి 26 ఏళ్ల వయస్సు ఉన్నా మంచానికే పరిమితమయ్యాడు. మెదడులో నరాలు చచ్చుబడినట్లు 95 శాతం మెడికల్ బోర్డు సర్టిఫికెట్, మెంటల్ డిజార్డర్ వంద శాతం సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే కేవలం దివ్యాంగ పింఛన్ మాత్రమే వస్తోంది. నాలుగు నెలల క్రితం మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కావాలంటే తెచ్చాను. ప్రస్తుతం కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో ఎంతో ఆశతో దరఖాస్తు చేసేందుకు వెళ్లితే వెబ్సైట్ కూడా తెరుచుకోలేదు. అదేమంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికై నా వైద్య ఆరోగ్యశాఖ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – కుంచనపల్లి శ్రీనివాసరావు, 22వ వార్డు, సత్తెనపల్లి -
విద్యార్థుల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ
డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు సూచించారు. బుధవారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాలల్లో నేషనల్ గ్రీన్ కార్ప్స్, ఎకో క్లబ్ల ఏర్పాటుపై అవగాహన సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, మొక్కల పెంపకం, నీరు, విద్యుత్ పొదుపు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా సమన్వయకర్త షేక్ ఆయేషా సుల్తానా మాట్లాడుతూ, పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటం, విత్తన బంతుల తయారీ, మిల్లెట్ లడ్డూ, హెర్బల్ పళ్లపొడి వంటి అంశాలపై వర్క్షాప్లు నిర్వహించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, తడి–పొడి వ్యర్థాలను వేరు చేయటం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన పర్యావరణ హిత వస్తువుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఓజోన్ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, మాజీ అధికారి ఏఏ మధుకుమార్ పాల్గొన్నారు. -
బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సాయికౌశిక్ ప్రతిభ
వినుకొండ: బాల్బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలలో మెడిశెట్టి సాయి కౌశిక్ ప్రతిభ చాటాడు. మార్కాపురంలో ఇటీవల 11వ ఏపీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. వినుకొండలోని శ్రీవిజేత హైస్కూల్ విద్యార్థి మెడిశెట్టి సాయి కౌశిక్, ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున అండర్–16 విభాగంలో ప్రాతినిధ్యం వహించి 3వ ర్యాంక్ సాధించాడు. రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు మంచి పేరు తెచ్చిన విద్యార్థిని స్కూల్ కరస్పాండెంట్ కావూరి సాయికుమార్, డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మయ్య అభినందించారు. ఆర్టీసీ బస్సులో పొగలు నరసరావుపేట రూరల్: ఆర్టీసీ బస్సులో పొగలు రావటంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన మండలంలోని జొన్నలగడ్డ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సులో ఒక్కసారిగా పొగలు రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా దించారు. బస్సు బీ6 టెక్నాలజీ కావటంతో రేడియేటర్ వేడెక్కిన కారణంగా పొగలు వచ్చినట్టు గుర్తించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం దుర్గి: నాగార్జున సాగర్ కుడికాలువలో అడిగొప్పల చానల్ వద్ద మంగళవారం గల్లంతైనా మాదారపు అజయ్(19) మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానిక ఎస్ఐ బి.గోపాల్ నేతృత్వంలో గజ ఈతగాళ్లు సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా నరమాలపాడు లాకుల వద్ద మృతదేహం దొరికింది. మంగళవారం వినాయక నిమజ్జనం చేసేందుకు పలువురితో కలసి వెళ్లి కుడి కాలువ నీళ్లలో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడు. చేతికొచ్చిన కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మంగళగిరిలో మహిళా క్రికెట్ సందడి ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మంగళగిరి టౌన్: మహిళా క్రికెట్కు ప్రోత్సాహం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు వేదిక కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఏపీఎల్) 2026 సీజన్–1కు మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 13 మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్ ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడంతో నగరానికి మరోసారి క్రీడావేదికగా గుర్తింపు లభించనుంది. అమరావతిలో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలి మంగళగిరి టౌన్: రాజధాని అమరావతిలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 25 అడుగుల భారీ విగ్రహంతో పాటు ఘంటసాల కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర చైతన్య వేదిక, ఘంటసాల చైతన్యవేదిక అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్ర చైతన్య వేదిక 17వ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ, వేదిక గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి ఆంజనేయ రాజు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ‘సాఫ్ హ్యాక్ఫెస్ట్’ వాల్పోస్టర్లు ఆవిష్కరణ గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19వ తేదీన చైన్నెకి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, కళాశాల సంయుక్తంగా జాతీయ స్థాయి సాప్ హ్యాక్ఫెస్ట్ 2026 నిర్వహించనున్నట్లు చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవీ ఆంజనేయులు తెలిపారు. బుధవారం కళాశాలలో పెస్ట్ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సాంకేతిక పరమైన పోటీ ప్రపంచంలో విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హ్యాకఫెస్ట్ ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్టీసీ భవిష్యత్కు రాజీ లేని పోరాటం
నరసరావుపేట: ఆర్టీసీ భవిష్యత్, ఉద్యోగుల భద్రత, ప్రయాణికుల అవసరాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఈయూ పల్నాడు జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజా అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి జి. తిరుపతిరావు ఆధ్వర్యంలో బుధవారం రెవెన్యూ భవన్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దామోదరరావు మాట్లాడుతూ ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఆర్టీసీ ఆస్తులు, డిపోలు, రూట్లు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. విద్యుత్ బస్సుల ప్రవేశంతో మూసివేసిన డిపోలను ఆరు నెలల్లో పునఃప్రారంభించాలని కోరారు. పల్నాడు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ఎస్. నాగమల్లేశ్వరరావు, స్టేట్ ఉపాధ్యక్షుడు మందపాటి శంకరరావు, నెల్లూరు జోన్ జోనల్ అధ్యక్షుడు బెజవాడ రవి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. కోటేశ్వరరావు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. కోటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, ఆర్టీసీ జిల్లా కార్యదర్శి జి. తిరుపతిరావు, నెల్లూరు జోన్ కమిటీ నాయకులు దిల్షాద్ బేగం, కమల, జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఒ. సుశీల పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అమ్మేందుకు చంద్రబాబు సిద్ధం
వినుకొండ: ఆంధ్ర రాష్ట్రాన్ని కొనేవాళ్లు ఎవరైనా ఉంటే అమ్మేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అలవి కాని హామీలు ఇచ్చి ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని, ఇచ్చిన 16 వేల డీఎస్సీ పోస్టులు అనర్హులకు ఇచ్చి వాస్తవాలు బయటకు తెలిసేటప్పటికీ చేసిన తప్పులు సరిదిద్దుకోలేక గతంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీపీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేయాలని చెప్పినా కూడా సిగ్గు లేకుండా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ధరలు పెరిగాయంటూ.. గతంలో ధరలు పెరిగాయని బాదుడే బాదుడు అని గోల చేసిన టీడీపీ నాయకులు, పెట్రోలు దగ్గర నుంచి నిత్యాసరాలు ధరలు పెరిగితే ఏమి చేస్తున్నారని బొల్లా ప్రశ్నించారు. ఇక స్థానిక ఎమ్మెల్యే వినుకొండకు తాగునీరు అందించే సింగర చెరువు ఉంటే చెరువుల్లో చేపలు పెంచిన ఘనత మీ నాయకులదేనన్నారు. తాగునీటి సమస్యను అడ్డం పెట్టుకొని ట్యాంకర్ ద్వారా వందల కోట్లు డ్రా చేసిన విషయం వినుకొండ ప్రజలందరికీ తెలుసు ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లు టీడీపీ హయాంలో 20 శాతం పూర్తయితే మిగతా 60 శాతం మా ప్రభుత్వం హయాంలో పూర్తి చేశామని, మిగిలిన ఇళ్లను పూర్తిచేసే అర్హులైన పేదవాళ్లకి ఇప్పటికై నా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాదర్బార్ ఓ డ్రామా.... ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు తీసుకుంటూ ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. వినుకొండకు మీరు చేసిన అభివృద్ధి పక్కన పెడితే వారికి పురుషుల ప్రాజెక్టు నిర్మాణం, వినుకొండకు వంద పడకల ఆస్పత్రి, ముస్లిం మైనారిటీ కళాశాల, షాదీఖానా, కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్, వంటి అభివృద్ధి పనులు తమ హయాంలో అనుమతులు తీసుకురాగా రెండున్నరేళ్లయిన వాటిని పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో యథేచ్ఛగా ఆక్రమణలు.. పట్టణంలో ఆర్యవైశ్యుల ఆస్తులు, క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులు సామాన్యుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ నయీమ్ గ్యాంగ్ పేరుతో ఆక్రమిస్తున్నారని, మీరు పంచాయతీ చేసిన సన్నిధి వారి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తుంటే టీడీపీ నాయకులు రాత్రికి రాత్రి పడవేశారని ఆరోపించారు. రెవెన్యూ, పోలీస్ ఇతర అధికారుల తీరు అత్యంత దారుణంగా ఉందని, టిడిపి నాయకులతో కలిసి లంచాలు తీసుకోవడం అలవాటు పడ్డారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుది పార్టీలు మారే సంస్కృతి అని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అయిందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి పగడాల వెంకట్రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ పాల్గొన్నారు. -
చెత్త కాదు.. చేతిలో పడితే కళాఖండమే..
చిలకలూరిపేట టౌన్: పనికిరావని పక్కన పడేసిన వస్తువులే వారి చేతుల్లో అందమైన కళాఖండాలుగా రూపుదిద్దుకున్నాయి. చెత్తగా కనిపించే ప్రతి వస్తువులోనూ ఓ కళ దాగి ఉంటుందని మద్దిరాల జవహర్ పీఎం శ్రీ నవోదయ విద్యాలయ విద్యార్థులు తమ సృజనతో చాటిచెప్పారు. స్కూల్బ్యాగ్ రహిత దినోత్సవాల్లో భాగంగా బుధవారం విద్యాలయంలో వ్యర్థ పదార్థాలతో కళాత్మక వస్తువుల తయారీపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విద్యాలయ ఆర్ట్ విభాగం ఉపాధ్యాయుడు ఆకాష్ నేతృత్వంలో వారు ప్రత్యేకత చాటారు. కార్డ్బోర్డులు, పాత వార్తాపత్రికలు, ఖాళీ పెన్నులు, పెన్ క్యాపులు, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర వ్యర్థ పదార్థాలను విద్యార్థులు సృజనాత్మకంగా వినియోగించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ పంతంగి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. కళాఖండాలను ప్రత్యేక ర్యాక్లో ప్రదర్శనగా భద్రపరిచినట్లు తెలిపారు. -
భయాందోళనలు సృష్టించేందుకే అక్రమ కేసులు
నరసరావుపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భయాందోళనలు సృష్టించేందుకే మాచర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలకు పంపారని, దీనిపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. అక్రమ కేసులో అరైస్టెన మాచర్ల మండలం నాగులవరానికి చెందిన మాజీ ఎంపీపీ బూడిద మంగమ్మ కుమారులు శ్రీనివాసరావు, సైదులు కుటుంబసభ్యులు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరిని కలిశారు. ఘటన జరిగిన మూడు నెలల తరువాత సంబందం లేని కేసులో తమ భర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియాతో బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ మాచర్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందిందన్నారు. తమ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో శ్రీనివాసరావు, సైదులు అక్కడికి వెళ్లి పరామర్శించి వచ్చారని తెలిపారు. ఈ ఘటన జూలై నెలలో జరిగితే ఈనెల 10వ తేదీ వీరిపై కేసు నమోదు జైలుకు పంపారని పేర్కొన్నారు. సంబంధం లేని కేసులో పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా గ్రామం విడిచి ఉంటున్నామని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమను బెదిరించడానికే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రెండేళ్లుగా వేధిస్తున్నారు రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి తమ కుటుంబంపై రెండేళ్లుగా కక్షసాధింపునకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే మూడు కేసులు పెట్టారన్నారు. ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని, కుట్ర రాజకీయాలను ప్రజలు హర్షించరని తెలిపారు. చేతనైతే ప్రజలకు మంచి పనులు చేయాలని, రెండేళ్లలో చేసిన పనులను ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన మహిళ చనిపోతే సాయం చేసేందుకు కూడా తమకు హక్కు లేదా అని ప్రశ్నించారు. వాహనాలు నిలిపివేత అక్రమ కేసులపై జిల్లా అదనపు ఎస్పీని కలిసేందుకు వస్తున్న బాధితులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మాచర్ల నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తున్న 15 వాహనాలను పోలీసులు మండలంలోని రావిపాడు వద్ద అడ్డుకున్నారు. అనుమతి తీసుకోలేదని వాహనాలను నిలిపివేశారు. వాహనాలను వెనక్కు పంపారు. బాధిత కుటుంబానికి చెందిన వారికి మాత్రమే జిల్లా అదనపు ఎస్పీని కలిసేందుకు అనుమతించారు. అనంతరం బాధిత కుటుంబానికి మద్దతుగా వచ్చిన వారు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఖండించారు. నకరికల్లు : మాచర్ల నుంచి నరసరావుపేట వెళుతున్న వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నాయకులను నకరికల్లు అడ్డరోడ్డు వద్ద పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. నకరికల్లు అడ్డరోడ్డు వద్ద సీఐ కిరణ్, ఎస్ఐ సతీష్ అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని వెనక్కి పంపారు. తంగిరాల రామిరెడ్డి, బీర్నేడి రమేష్ బాబు, మట్టపల్లి బ్రహ్మం, మహమ్మద్ ఇస్మాయిల్, నారి, గుర్రం సాగర్బాబు, గోగుల సిద్ధ్దు, బి.అమర్, చింత ఇజ్రాయిల్, హరి నాయక్, నేలటూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తమైన పేట పోలీసులు
నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులోని లగేజ్లో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటనతో నరసరావుపేట పోలీసులు అప్రమత్తం అయ్యారు. బ్యాగ్లో దొరికిన గిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల మూలాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ వ్యవహారానికి నరసరావుపేటతో సంబంధం ఉండటంతో స్థానిక పోలీసులు మంగళవారం దర్యాప్తు చేపట్టారు. వివరాలు.... ఉత్తరప్రదేశ్కు చెందిన ఆషిక్ అలీ కొంతకాలంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మాహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని మున్నా మగ్గమ్ వర్క్స్లో పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి వెళ్లేందుకు నరసరావుపేట బస్టాండ్లో బస్కు ఎక్కి విజయవాడలో దిగాడు. అనంతరం బ్యాగ్ చూసుకోగా లగేజ్ మారినట్లు గుర్తించాడు. బ్యాగ్ను బస్టాండ్లో అవుట్పోస్టు పోలీసులకు అప్పగించాడు. పరిశీలించగా 46 గిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని బ్యాగ్ అప్పగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నరసరావుపేట టూటౌన్ పోలీసులు కూడా అతడు పనిచేసే దుకాణం వద్దకు చేరుకొని అతని ఉద్యోగం, నివాసం, గత కదలికలపై ఆరా తీశారు. ఆర్టీసీ బస్టాండ్లో సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. కాగా ఇద్దరు మావోయిస్టులు సోమవారం పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఎదుట లొంగిపోయారు. అదే సమయంలో లగేజీలో పేలుడు పదార్థాలు బయట పడటం చర్చనీయాంశంగా మారింది. రెండు ఘటనలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారిస్తున్నట్లు సమాచారం. -
పండుగ వేళ విషాదం
రొంపిచర్ల /ఈపూరు: ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇరువురు యువకులు మృతి చెందిన దుర్ఘటన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ వేపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... ఈపూరు మండలం ఇనిమెళ్ళ గ్రామానికి చెందిన నడికోట రామాంజనేయులు(38), పాలవెల్లి వెంకటాంజనేయులు (36) వినాయక చవితి సందర్భంగా విగ్రహం కోసం బైక్ మీద నరసరావుపేటకు వెళుతున్నారు. ఈ క్రమంలో స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద హైవే రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కందుకూరు వైపు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. కొద్దిదూరం లాక్కొని వెళ్లింది. బైక్ నడుపుతున్న రామాంజనేయులు, వెనుక కూర్చొని ఉన్న వెంకటాంజనేయులు కింద పడిపోవడంతో తలలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాళ్ళు, చేతులు నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ట్రావెల్స్ బస్సును పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వర్ రావు తెలిపారు. కన్నీరుమున్నీరైన బాధిత కుటుంబాలు వినాయక చవితి వేడుకల కోసం ఆనందంగా బయలుదేరిన వారు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పండుగ ఏర్పాట్లతో సందడిగా ఉండాల్సిన ఇళ్లలో విషాదం నెలకొంది. వెంకటాంజనేయులుకు భార్య త్రివేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో మిగతావారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రామాంజనేయులుకు భార్య కోటేశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. తండ్రికి సాయంగా పొలం పనులలో చురుకుగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. అండగా ఉంటాడునుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తండ్రి గుండెలవిసెలా విలపించాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెండు కుటుంబాల వేదన చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు నెల రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బస్సు కింద పడి యువకుడు మృత్యువాత కారంచేడు: యువకుడి మృతితో పండగ పూట మరో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎస్ఐ షేక్ ఖాదర్బాషా కథనం మేరకు.. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్ల ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ద్విచక్రవాహనాలపై చీరాల సమీపంలోని వాడరేవు బీచ్కు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బీచ్లో సరదాగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు. వారిలో ఒకడైన బొజ్జా బాలకోటయ్య (27) తన బైక్పై వెళ్తూ... చీరాల నుంచి షాపూర్ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. బస్సుకు ద్విచక్రవాహనం హ్యాండిల్ తగలడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. బండితోపాటు, బాలకోటయ్య బస్సు కింద పడిపోయాడు. తల మీదుగా బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఆసుపత్రికి పంపించారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా గుట్టురట్టు
దర్శి: పంట పొలాల్లోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్జిల్లా ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గత కొన్ని నెలలుగా ముండ్లమూరుతో పాటు పలు మండలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో కరెంట్ సరఫరా నిలిచి పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ రామారావు, ముండ్లమూరు ఎస్సై కోటేశ్వరరావు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి 9 కేసుల్లో 12 మంది నిందితులను గుర్తించారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వారిలో ఒంగోలులో నివాసముంటున్న పులి నాగరాజు (విప్పర్ల, రొంపిచర్ల మండలం), షేక్ రజాక్, పామూరి శ్రీకాంత్ (సంతమాగులూరు), పోలా మంగ (తూర్పుగంగవరం, తాళ్లూరు మండలం), రావూరి సురేష్ (ఉదయ్నగర్ తండా, నకరికల్ మండలం)లను అరెస్ట్ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి రాగితీగను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జనపాటి బ్రహ్మయ్య (రాజుపాలెం, మార్టూరు మండలం), షేక్ మదర్షా (బోయపాలెం, యడ్లపాడు మండలం)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముండ్లమూరు మండలంలో 26, దర్శి పరిధిలో 10, దొనకొండలో 4, సంతమాగులూరులో ఒకటి చొప్పున మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లకు చెందిన 255 కిలోల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముండ్లమూరులోని ఓ ఇంట్లో దివాన్కాట్ కింద దాచిన రూ.లక్షతో పాటు పర్సులోని వెయ్యి కలిపి మొత్తం రూ.1,01,000 నగదును కూడా ఈ ఐదుగురే చోరీ చేసినట్లు గుర్తించి, వారి వద్ద నుంచి రూ.40 వేలను రికవరీ చేశారు. ఇదే ముఠాకు చెందిన పొట్లూరి ప్రభుదాస్ అలియాస్ నాని, అల్లంసెట్టి భాగ్యరాజు, రావూరి కలగయ్య, చేవూరి వంశీకళ్యాణ్, రావూరి గోపి, చేవూరి వెంకటేష్, తిరువీధుల లోకేష్లు గతంలో కృష్ణా జిల్లా అట్కూరు పరిధిలో చేసిన దొంగతనాల కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులు, సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీ అభినందించారు. -
కొమ్మమూరు చానల్ బ్రిడ్జి వద్ద ప్రమాదం
చేబ్రోలుః చేబ్రోలు సమీపంలోని బ్రిటీషు కాలం నాటి పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరటంతో అక్కడ ప్రయాణం వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. తెనాలి రూరల్ మండలం మల్లెపాడు ప్రాంతానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి కొమ్మమూరు బ్రిడ్జికి చేబ్రోలు వైపు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలి నుంచి పొన్నూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తాడిబోయిన గోపి కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కన తవ్వకాలు చేయటంతో గుంతలుగా ఉన్న ప్రాంతంలో పడిపోయాడు. ముఖానికి, కాళ్లు, చేతులకు గాయాలైన బాదితుడిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
రేపు కలెక్టరేట్ వద్ద ధర్నా
నెహ్రూనగర్: రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల దాడులు, అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ తదితరులు మాట్లాడారు. నగరంపాలెం: వినాయకచవితి పండుగ సందర్భంగా జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని డీఎస్పీలు, ఎస్హెచ్ఓలతో సెల్ఫోన్ కాన్ఫరెనన్స్ నిర్వహించారు. వినాయక ప్రతిమల ఏర్పాటు, పూజా కార్యక్రమాలు, నిమజ్జనం తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సమీక్షించారు. నేడు నామినేషన్ల స్వీకరణ నగరంపాలెం: గుంటూరు నగరంలోని ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఈనెల 26న జరగనున్న ఎన్నికలకు బుధవారం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలు ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష పీఠం ఎవర్ని వరిస్తుందనే ఉత్కంఠ వ్యాపార వర్గాల్లో నెలకొంది. ఏళ్ల క్రితమే గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఉంది. అందులో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని వ్యాపార వర్గాలకు సభ్యత్వాలు ఉన్నాయి. సుమారు 3,200 మంది ఓటర్లు ఉండగా, ఈనెల 26న ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 16న చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అధ్యక్ష పదవితోపాటు పలు పదవులకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరగనున్న ఈ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి ఐదారు మంది అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. మూడు దశాబ్ధాలకుపైగా అధ్యక్షుడిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గత రెండేళ్లుగా అధ్యక్ష పదవికి పోటీపడటం అనివార్యమైంది. దీంతో అప్పటి నుంచి చాంబర్ ఎన్నికలు వేడెక్కాయి. దీంతో గత రెండేళ్లు ఏల్చూరి వెంకటేశ్వర్లు అధ్యక్షునిగా కొనసాగారు. ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీపడేందుకు వ్యాపార ఓటర్ల వర్గాల్లో ఆశావాహులు ఎక్కువయ్యారు. ఈసారైనా అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నూతన అభ్యర్థులు బరిలో పోటీపడనున్నారు. రెండేళ్లుగా అధ్యక్షునిగా కొనసాగిన ఏల్చూరి వెంకటేశ్వర్లు మూడోసారి హాట్రిక్ సాధించేందుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్ల స్వీకరణ ముగిసిన రోజే నూతన అధ్యక్షుడు ఎవరనేది తెలుస్తోందని చాంబర్లో బాహాటంగానే వినిపిస్తోంది. -
మోగిన బడి ఎన్నికల నగారా
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన డీఈవోనరసరావుపేట ఈస్ట్: పాఠశాలల ఎన్నికల నగారా మోగింది. పాఠశాలల్లో రెండేళ్ల కిందట ఏర్పడ్డ పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 15 నుంచి 29వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించింది. నేతల ఏర్పాట్లు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదల కావటంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ పక్షాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రామాల వారీగా ఓటర్ల జాబితా పరిశీలనలో ఉన్న నేతలు ఒక్కసారిగా బడి ఎన్నికలకు అధికారులు షెడ్యూల్ విడుదల చేయటంతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించటంలో బిజీగా మారారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్ట్ 8వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల కాల పరిమితితో అప్పట్లో ఏర్పాటైన కమిటీల పదవీ కాలం పూర్తయి నెలరోజులకు పైగా కావటంతో పాఠశాల విద్యాశాఖ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఇప్పుడు ఏర్పడే కమిటీలు రెండేళ్లపాటు పదవిలో ఉండనుండటంతో నేతల దృష్టి పాఠశాలలపై పడింది. బడుల అభివృద్థి, విద్యార్థులకు అందించే సంక్షేమ పథకాలు అమలులో కమిటీల పాత్ర కీలకంగా మారటంతో కమిటీల చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర పదవుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే నేతల నుంచి మాట తీసుకున్నట్టుగా చెబుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా 12 నుంచి 25 మంది వరకు సభ్యులను ఎన్నుకొనే అవకాశం ఉంటుంది. పాఠశాలల్లో వంద మంది విద్యార్థులు ఉంటే 12 – 15, వంద నుంచి ఐదు వందల మంది లోపు ఉంటే 15– 20, ఐదు వందల మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో 25 మంది సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లాలో 2,077 బడులు ఉండగా, వాటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 15,056 ఉన్నాయి. వీటిలో 1.36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ిపీవీజే రామారావు మంగళవారం వివరాలు ప్రకటించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నోటీస్ బోర్డులో ఎస్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, 18వ తేదీన ఓటర్ల జాబితా విడుదల, జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి ఈ నెల 25వ తేదీన తుది జాబితాను నోటీస్ బోర్డులో ప్రకటిస్తారన్నారు. అలాగే ఈ నెల 29వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యుల ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఫలితాలు ప్రకటించి మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక, ప్రమాణ స్వీకారం, 3 గంటలకు తొలి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేటు బడుల యాజమాన్యాలు సైతం ఎన్నికల నిర్వహించేలా ప్రోత్సహించాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వినాయకుడి పూజలు
నెహ్రూనగర్: నగరంలో వినాయక చవితి వేడుకలను వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తూర్పు నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్న్ అధ్యక్షుడు శేషగిరి పవన్కుమార్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరితో పాటు, 4వ డివిజన్న్లో కన్నా యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న అంబటి రాంబాబు, నూరి ఫాతిమా -
ప్రారంభమైన గణేశ్ నిమజ్జనాలు
అమరావతి: పుణ్యక్షేత్రమైన అమరావతి వద్దగల కృష్ణానదిలో వినాయక విగ్రహ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. గురువారం గణపతి నవరాత్రుల్లో రెండవరోజు మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా గణేష్ విగ్రహాలు తరలి రావటం ప్రారంభమైంది. నది ఒడ్డున ధ్యానబుద్ధ ఘాట్లో పోలీస్ అధికారులు నిమజ్జ నోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ అచ్చియ్య తమ సిబ్బందితో గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించారు. మైకుల ద్వారా నిమజ్జనానికి వచ్చిన భక్తులను హెచ్చరిస్తూ ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. కృష్ణానది మధ్యలోకి పడవల సహాయంతో వినాయక విగ్రహాలను తీసుకువెళ్ళి నిమజ్జనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
జై గణేశా.. జైజై గణేశా..
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వినాయక చవితిని జిల్లాలోని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. సోమవారం భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ఇంటింటా కొలిచారు. ఆనందంగా వేడుకలను జరుపుకొన్నారు. ఊరూవాడా మండపాలు ఏర్పాటు చేసి వైవిధ్య రూపాల్లో గణపయ్యను కొలువుదీర్చారు. పూజలు, భజనలు, నైవేద్యాలతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ భక్తులు ‘‘జై గణేశా.. జై జై గణేశా’’ అంటూ ఎంతో ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ -
ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు పోటీలు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చండ్రాకోల్ చేతబట్టి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టచ్ పళ్ల పోటీలను ఆరంభించారు. ఆయా జిల్లాల నుండి వచ్చిన ఒంగోలు జాతి గిత్తలు పోటీల్లో పాల్గొన్నాయి. ప్రారంభించిన ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల -
విశేషాలంకారంలో గణనాథుడు
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరాలయంలో సోమవారం వేకువజామునే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణనాథునికి పత్రితో సహస్రనామ పూజ చేశారు. విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. పెదకాకాని: శివాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మహా గణపతిని ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూలతో అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గణపతి నవరాత్రులలో భాగంగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం విశేష అర్చనలు జరుగుతాయన్నారు. ఈ నెల 23వ తేదీన విఘ్నేశ్వరుని నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది వినూత్న రీతిలో సర్కారుకు తమ నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత నెల నుంచి గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది రోజూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణపతి విగ్రహానికి తమ వినతి పత్రం అందజేశారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలని, బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విగ్రహానికి అందజేశారు. తమ కోరికలు నెరవేరేలా అనుగ్రహం చూపాలని స్వామి వారిని మొక్కుకున్నారు. చవితి రోజు సైతం ఆసుపత్రిలో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. బంగారం, నగదు కాజేత గుంటూరు రూరల్: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి కాలనీలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరస్వతి కాలనీ ఏడో లైనుకు చెందిన కె.వీరాంజనేయులు ఇబ్రహీంపట్నం స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. 26 గ్రాముల బంగారం చైను, 12 గ్రాముల బ్రాస్లెట్, 17 గ్రాముల చెవి రింగులు, రూ. 2.96 లక్షల నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు విరమించుకోండి
సత్తెనపల్లి: ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తూ పినాకిల్ కంపెనీకి అప్పగించే ప్రతిపాదనలను విరమించుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాసరావు అన్నారు. సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ.నాగమణికి డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తూ పినాకిల్ అనే ప్రైవేటుకంపెనీకి అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిం చారు. ఈ ప్రతిపాదనలను తక్షణమే విరమించుకొని ప్రభుత్వ యాజమాన్యంలోనే రవాణా సేవలను కొనసాగించాలన్నారు. సత్తెనపల్లి డిపో పరిధిలో ఆర్టీసీ బస్సుల కొరత, విద్యార్థుల బస్సు పాసుల సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందు లను పరిష్కరించాలన్నారు. ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వేలాదిమంది విద్యార్థులకు, నిత్యం ప్రయాణించే సామాన్య ప్రజలకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడపకపోవడం శోచనీయమన్నారు. వేళాపాళాలేని బస్సు సర్వీసుల వల్ల విద్యార్థులు సమయానికి విద్యాసంస్థలకు చేరుకోలేక చదువు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో విద్యార్థులు, ప్రయాణికుల రవాణా హక్కుల పరిరక్షణకై డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె రాజ్కుమార్, ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు సీహెచ్ ఆంజనేయులు, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు -
ఓటు హక్కు కోసం 10,944 దరఖాస్తులు
నరసరావుపేట: ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ప్రారంభమైన నాటి నుంచి కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఫారం–6 కింద మొత్తం 10,944 దరఖాస్తులు అందాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వీటిలో ఇప్పటికే 4,044 దరఖాస్తులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్యూమరేషన్ పత్రాలలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన 2,51,888 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వారిలో ఇప్పటికే 2,24,135 మందికి సంబంధించిన విచారణ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. 3,708 మందిని అనర్హులుగా తేల్చినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్లో ఉన్న ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తుల పరిశీలన, ఎన్యుమరేషన్ పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం అక్టోబరు 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ అక్టోబరు 5 వరకు కొనసాగుతుందన్నారు. రాజీవ్ స్వగృహపై నివేదిక సమర్పించండి అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ భవనాల వేలం కోసం కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని, వినియోగంలో లేని భూమిని ప్రభుత్వానికి అప్పగించడానికి చర్యలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలోని రాజీవ్ స్వగృహ భవనాలను అధికారులతో మంగళవారం కలిసి పరిశీలించారు. వేలం ప్రక్రియకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వెంట ఆర్డీఓ కె.బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన, సర్వేయర్ ఉన్నారు. -
108లో కవలల జననం
నరసరావుపేట టౌన్/మాచర్ల: కవలపిల్లలు 108 వాహనంలో జన్మించిన సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఎం. అనురాధ పురిటి నొప్పులతో బాధపడుతూ సోమవారం రాత్రి 108 అంబులెన్స్ను అశ్రయించింది. అక్కడకు చేరుకున్న సిబ్బంది ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి కాన్పు కావటంతో హైరిస్క్ కేసుగా నిర్థారించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రిఫర్ చేశారు. దీంతో మాచర్ల 108 అంబులెన్స్లో ఆమెను అర్థరాత్రి తీసుకొని బయలుదేరారు. మార్గమధ్యంలో గర్భిణికి నొప్పులు తీవ్రం కావటంతో వాహనం పక్కకు నిలిపి పరిస్థితిని 108 ఈఆర్సీపీ డాక్టర్ సుప్రియ, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లుకు వివరించారు. వారి సూచనల మేరకు ఈఎంటీ హుస్సేనమ్మ, పైలెట్ అర్జున్ కుమార్, ఓఈ మారుతి ప్రసవ ప్రక్రియను నిర్వహించారు. మొదట మగ శిశువు జన్మించాడు. కొద్ది సేపటి తరువాత మరో మగ శిశువు పుట్టాడు. ప్రసవం అనంతరం తల్లితో పాటు ఇద్దరు శిశువులకు అవసరమైన ఆక్సిజన్, ప్లూయిడ్స్ అందించారు. ప్రథమ వైద్యసహాయం అనంతరం నరసరావుపేట వైద్యశాలలో చేర్పించారు. ఆపదసమయంలో సకాలంలో స్పందించి తల్లితో పాటు ఇద్దరు శిశువులను రక్షించిన 108 సిబ్బందిని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకం గురించి ఆ తల్లి కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు సురక్షితం -
చవితి పూజల్లో ఏఎస్పీ రోహిత్కుమార్ దంపతులు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి దంపతులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పోలీసు కార్యాలయంలో విఘ్నేశ్వరుని ప్రతిమను సోమవారం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అదనపు ఎస్పీ దంపతులు పోలీసు అధికారులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి సుఖశాంతులు కలగాలని అదనపు ఎస్పీ ప్రార్థించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఎస్.ఆంథోని రాజు, ఆర్ఐలు కృష్ణా, గోపినాథ్, రాజు, యువరాజు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: భారత రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా జిల్లా పరిధిలో ఎస్సీ రిజర్వేషన్లను పక్కాగా అమలు అమలు చేసి అర్హులైన, నిజమైన ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని ఆయా వర్గాల వారు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు జిల్లాలోని 40 గ్రామాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ అర్చకులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రపతి 1950లో ఇచ్చిన ఆర్డర్ క్లాజ్ (3) ప్రకారం కేవలం హిందూ మతాన్ని అవలంబించే వారే ఎస్సీ వర్గానికి చెందుతారని, తదనంతర సవరణల ప్రకారం బౌద్ధులు, సిక్కులు కూడా ఈ పరిధిలోకి వస్తారన్నారు. చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. జిల్లా పరియోజన ప్రముఖ్ గోగినేని వెంకటరమణ, ఎస్సీ, ఎస్టీ దేవాలయ అర్చక స్వాములు పాల్గొన్నారు. నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయం కోసం ప్రత్యేకంగా రూ.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 160 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇప్పటివరకు కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలకు ఒకే డీటీఆర్ ద్వారా విద్యుత్ సరఫరా నిర్వహించేవారు, ఇప్పుడు కేవలం కలెక్టర్ కార్యాలయం కోసం ప్రత్యేకంగా డీటీఆర్ ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.విజయ్కుమార్, ఈఈ రాంబొట్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి... సత్తెనపల్లి మండలం వెన్నాదేవి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం గుర్తించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.హైమారావును సంప్రదించాలని పోలీసులు తెలి పారు. నరసరావుపేట: పల్నాడులో ఏపీ అగ్నిమాపక సేవా రాష్ట్ర శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం 25 ఎకరాల భూమిని కేటాయించాలని ఆ శాఖ అదనపు సంచాలకులు ఆర్.జ్ఞానసుందరం కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ను మంగళవారం ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జిలానీతో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాజుపాలెం: అధిక వేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి మలుపు వద్ద పాడుబడిన ఇంటిని ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని అద్దంకి నార్కెటుపల్లి రహదారిపై పెద్ద నెమలిపురిలోని మలుపు వద్ద పోలేరమ్మ గుడి వద్ద మంగళవారం జరిగింది. హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యక్తులు చీరాల బీచ్కి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో నరసరావుపేట వైద్యశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఎస్ఐ మణికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. కారులో ప్రయాణిస్తూ గాయాలైన సుమిత్, గౌతమ్, యుగంధర్లు నరసరావుపేటలో వైద్య పరీక్షలు చేయించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లినట్లు ఎస్ఐ తెలిపారు. -
దుమ్ముచక్రాల ట్రాక్టర్, బైక్ ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు క్రోసూరు: మండలంలోని నాగవరం గ్రామ శివారులో దమ్ముచక్రాల ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నాగవరం గ్రామ శివారులో దమ్ముచక్రాల ట్రాక్టర్ సత్తెనపల్లి వైపు వెళ్తుంది. అదే దిక్కున మండలంలోని హసనాబాద్ గ్రామానికి చెందిన తోకల లక్ష్మీనారాయణ, కాశింసెట్టి గణేష్ ద్విచక్రవాహనంపై సత్తెనపల్లి వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో దమ్ముచక్రాల బండి, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనం పై ఉన్న ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరిని గుంటూరు జీజీహెచ్కు, మరొకరిని నరసారావుపేట ప్రభుత్వసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎస్ఐ పి.రవిబాబు మాట్లాడుతూ ప్రమాద సంఘటన తెలిసిందని, వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గ్రామానికి చెందిన కృష్ణవేణి(50) అనే మహిళ మృతిచెందింది. గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో కూడిన పిడుగు కృష్ణవేణి సమీపంలో పడడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త కృష్ణారెడ్డి పొలంలో కాస్తంత దూరంలో పనిచేస్తుండడంతో అతనికి ప్రమాదం తప్పినట్లయింది. -
ఏఎన్యూ స్వర్ణోత్సవాలు విజయవంతం
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వర్సిటీ వీసీ కె గంగాధరరావు అన్నారు. స్వర్ణోత్సవాలు విజయవంతం కావడంతో మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచేలా స్వర్ణోత్సవాలు నిర్వహించామన్నారు. వేడుకల నిర్వహణలో బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. దశల వారీగా నిర్వహించిన కార్యక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ, విదేశాలలో ఏఎన్యూ కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం మాట్లాడుతూ స్వర్ణోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వర్సిటీ పాలకమండలి సభ్యులు ఎం.త్రిమూర్తిరావు, ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డాక్టర్ పి.సుధాకర్, వర్సిటీలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్ సిహెచ్.లింగరాజు, ప్రొఫెసర్ పీపీఎస్ పాల్ కుమార్, ప్రొఫెసర్ తేజోమూర్తి, ప్రొఫెసర్ నిరూపమా, దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డి.రామచంద్రన్ పాల్గొన్నారు. -
మణిపాల్ హాస్పిటల్కు ప్రతిష్ఠాత్మక అవార్డులు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ అందిస్తున్న ఆధునిక వైద్యసేవలకు గుర్తింపుగా ఇటి హెల్త్కేర్ అవార్డ్స్–2026లో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ శ్రీరామాంజనేయరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలో నైపుణ్యం, వివిధ వైద్య విభాగాల సమన్వయంతో అందించే క్లినికల్ కేర్, అత్యాధునిక చికిత్సా విధానాలు, సమగ్ర వైద్యసేవలు అందించడంలో చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ‘హాస్పిటల్ ఆఫ్ ది ఇయర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సౌత్’ అవార్డు లభించిందని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ వైద్యులు డాక్టర్ జీవీ రెడ్డికి ‘ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ది ఇయర్–సౌత్’ అవార్డు వచ్చినట్టు వివరించారు. ఈ రెండు అవార్డులు తమ హాస్పిటల్కు ప్రత్యేకమైన గుర్తింపుగా నిలుస్తాయని ఆయన తెలిపారు. -
ఆట్యా–పాట్యా పోటీల్లో జిల్లా రికార్డు
నకరికల్లు: రాష్ట్ర స్థాయి ఆట్యా–పాట్యా సబ్జూనియర్స్ పోటీల్లో పల్నాడు జిల్లా బాలబాలికల జట్లు రెండూ ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాయి. ఈనెల 12, 13 తేదీలలో 11వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ ఆట్యా–పాట్యా పోటీలు కర్నూలులో నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తలపడ్డారు. పోటీల్లో పల్నాడు జిల్లా బాలికల, బాలుర జట్లు అత్యంత క్రీడాస్ఫూర్తిని చాటి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాయని ఆట్యా–పాట్యా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.రోహిత్ జోయల్ తెలిపారు. బాలికల జట్టుకు జి.ఝాన్సీరాణి, బాలుర జట్టుకు చింతా పుల్లయ్య కోచ్లుగా వ్యవహరించారు. ఉత్తమ ప్రతిభను చాటిన క్రీడాకారులకు, కోచ్లకు అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ ఆర్.దుర్గాప్రసాద్, కార్యదర్శి ఆర్.చరణ్, ట్రెజరర్ కృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సీహెచ్.సామాజ్య్రం తదితరులు అభినందించారు. -
హెచ్ఐవీపై అవగాహనకు ప్రచార రథం
పిడుగురాళ్ల రూరల్: హెచ్ఐవీ పట్ల సమాజంలో ఇంకా నెలకొన్న అపోహలను తొలగించడమే ప్రచార ముఖ్య ఉద్దేశమని కామేపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు స్నేహశ్రీ, అఖిల్ దాస్ అన్నారు. పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలోని మెడికల్ విద్య, వైద్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఈడీ ప్రచార రథం ఆదివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 15 రోజులపాటు ఎల్ఈడీ రథం వివిధ ప్రాంతాలు, గ్రామాలు తిరుగుతూ హెచ్ఐవీ వ్యాప్తి చెందే విధానాలు, తదితర జాగ్రత్తలపై లఘు చిత్రాలు, ఆడియో–విజువల్ సందేశాల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లింక్ వర్కర్ స్కీమ్, డిస్ట్రిక్ట్ రిసోర్స్పర్సన్ వాసుదేవరావు, లింక్ వర్కర్ స్కీమ్ జోనల్ సూపర్వైజర్ వై.విశ్వేశ్వరరావు, లింక్ వర్కర్ దీనకుమారి, ఐసీటీసీ కౌన్సిలర్ నాగరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆయా గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
గుంటూరు యువకుడికి క్రౌన్ ఆఫ్ ఏపీ 2026 టైటిల్
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): గుంటూరు జిల్లాకు చెందిన కె.వరుణ్ చౌదరి ప్రతిష్టాత్మక క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 పోటీలో మిస్టర్ కేటగిరీలో విజేతగా నిలిచి టైటిల్ను కై వసం చేసుకున్నారు. విశాఖపట్నంలోని గదిరాజు ప్యాలెస్లో ఈనెల 12న జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని టాలీవుడ్ అసోసియేట్ డైరెక్టర్ సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో నిర్వహించారు. సతీష్ అడ్డాల ఇప్పటికే 50కి పైగా షోలను నిర్వహించిన అనుభవంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ సహకారం అందించింది. పోటీల్లో మొత్తం 200 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, ప్రతిభ ఆధారంగా ప్రతి కేటగిరీలో 20 మంది చొప్పున ఎంపిక చేశారు. అనంతరం పోటీని మూడు ప్రధాన రౌండ్లుగా నిర్వహించారు. టాలెంట్ రౌండ్, వెస్ట్రన్ రౌండ్, ట్రెడిషనల్ రౌండ్లో కె.వరుణ్ చౌదరి తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. మూడు రౌండ్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, తుది ఫలితాల్లో క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 మిస్టర్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. -
విద్యాభివృద్ధికి ఆవోపా కృషి ప్రశంసనీయం
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలో విద్యాభివృద్ధికి ఉపకార వేతనాలను పంపిణీ చేయడం ద్వారా ఆవోపా చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదివారం మార్కెట్ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఆవోపా) ఏపీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.45 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షుడు తడవర్తి రాంబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకే రవికృష్ణ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం చేసే ప్రయత్నం ఎంతో గొప్పదని అన్నారు. క్రేన్ గ్రూప్ అధినేత జీవీఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ చదువుతో జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో తల్లిదండ్రులను అనాథలుగా మార్చడం తగదని, సంస్కారం లేని విద్య వ్యర్థం అన్నారు. తెనాలి డబుల్ హార్స్ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఆవోపా నగర అధ్యక్షుడు కేవీ బ్రహ్మం, కృష్ణ సాయి గ్రానైట్స్ ఎండీ ఎస్.హనుమంతరావు, ఆవోపా జాతీయ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర అధ్యక్షుడు పి.కనకరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచపూడి సుబ్బారావు, గార్లపాటి సత్యనారాయణ, నంబూరు శివనాగేశ్వరరావు, చింతా కృష్ణారావు, చిట్టం రమేష్, మలిపెద్ది నాగేశ్వరరావు, ఆరవేటి నిర్మల, కూరపాటి సత్యనారాయణ, ఒలివేటి కృష్ణ పాల్గొన్నారు. -
పీఆర్కే వినాయక చవితి శుభాకాంక్షలు
నరసరావుపేట: జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24గంటల వ్యవధిలో 590.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మొత్తం 28మండలాలకు గాను 20 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిలకలూరిపేటలో 94.2 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా పిడుగురాళ్లలో 2.0 కురిసింది. యడ్లపాడులో 50.6, నాదెండ్ల 78.4, ముప్పాళ్ల 22.6, నరసరావుపేట 8.0, రొంపిచర్ల 82.6, ఈపూరు 11.6, నూజెండ్ల 46.8, వినుకొండ 4.2, నకరికల్లు 54.6, రాజుపాలెం 10.6, సత్తెనపల్లి 30.6, పిడుగురాళ్ల 35.4, అమరావతి 6.8, క్రోసూరు 10.6, అచ్చంపేట 4.2, బెల్లంకొండ 7.2, మాచవరం 20.4, కారెంపూడి 8.4 మి.మీ వర్షం కురిసింది. చిలకలూరిపేటటౌన్: మట్టి కుప్పను ఢీకొని కారు పల్టీలు కొట్టడంతో ఇద్దరు గాయపడిన ఘటన అన్నంభోట్లవారిపాలెం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..చీరాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న మట్టి కుప్పను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారులో హైదరాబాద్కు చెందిన వారు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడపడం వల్లే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు, క్షతగాత్రుల పరిస్థితులు వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. చిలకలూరిపేట టౌన్: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలు సమీపంలోని ఈతముక్కల ప్రాంతానికి చెందిన వూట్ల రాజేశ్వరి (24) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను ప్రతివారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చికిత్స పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులతో ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బైపాస్ వంతెన వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో రాజేశ్వరితో పాటు మరో భర్త అశోక్, వృద్ధురాలు మర్రిపూడి సుశీలకు గాయాలయ్యాయి. వీరిలో సుశీల తీవ్రంగా గాయపడింది. డ్రైవర్కు నిద్రమత్తుతో ఇబ్బంది పడుతుండగా అశోక్ తనకు డ్రైవింగ్ వచ్చని చెప్పి కొద్దిదూరం ఆటో నడిపేందుకు ప్రయత్నించాడు. పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో బైపాస్పై కొనసాగాలా.. సర్వీసు రోడ్డులోకి దిగాలా అనే విషయంలో అశోక్ అయోమయానికి గురయ్యాడు. అప్పుడే వాహనంపై నియంత్రణ కోల్పోయి వెంటనే బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. 108 సిబ్బంది వెళ్లి గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో గుంటూరు జట్ల ప్రతిభ
రొంపిచర్ల: విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా బాలబాలికల జట్లు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాలు సాధించాయని వ్యాయామ ఉపాధ్యాయుడు కె.సైదయ్య ఆదివారం తెలిపారు. బాలుర విభాగంలో గుంటూరు జట్టు రెండో స్థానంలో నిలవగా, విజయనగరం జిల్లా జట్టు ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. బాలికల విభాగంలో శ్రీకాకుళం జట్టు ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించాయని పేర్కొన్నారు. రెండు విభాగాల ఫైనల్ మ్యాచ్లకు భారీ వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్లు పూర్తిగా నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో లీగ్ మ్యాచ్లలో ఆయా జట్లు సాధించిన రన్న్ రేట్ను పరిగణనలోకి తీసుకుని న్యాయ నిర్ణీతలు స్థానాలను నిర్ణయించారు. పోటీల్లో రొంపిచర్లకు చెందిన క్రీడాకారులు వ్యక్తిగత ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. బాలికల విభాగంలో వెంగళరాజు శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బెస్ట్ క్యాచర్గా ఎంపికయ్యారు. బాలుర విభాగంలో బొజ్జ వెంకట సాయికృష్ణ రాష్ట్రస్థాయి బెస్ట్ పిచ్చర్గా ఎంపికయ్యారు. వీరి ప్రతిభను నిర్వాహకులు అభినందించారు. పోటీల ముగింపు కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే.రంగారావు (బేబీ నాయన) ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల విజయంపై క్రీడాభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
పేరుకు ఒకటే మద్యం దుకాణం.. కానీ అనుబంధంగా 20కి తక్కువ కాకుండా బెల్ట్ షాపులు.. బాటిల్పై ‘అదనపు’ బాదుడు. 24 గంటలూ అమ్మకాలతో ఈ రెండేళ్లలో మద్యం దుకాణాలు నడుపుతున్న కూటమి పార్టీల నాయకులు భారీగానే ఆర్జించారు. తాజాగా గల్లాపెట్టెకు కిక్కు సరిపోలేదు.. ఇంకో ఏడాద
సత్తెనపల్లి: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. ప్రజల సొమ్మును లూటీ చేసే రీతిలో రాష్ట్రంలో మద్యం వ్యాపారం సాగుతోంది. మద్యం దుకాణాల లైసెన్సు గడువు ఈ నెలతో ముగుస్తోంది. కానీ, ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాకుండా పాత సిండికేటుకే మరో ఏడాది కట్టబెడుతూ రెన్యూవల్కు అవకాశం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుకాణదారులు నష్టపోయారంటూ తప్పుడు ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. మళ్లీ వారికే ఏడాది పాటు లైసెన్సులు రెన్యూవల్ చేసేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 129 మద్యం దుకాణాలున్నాయి. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లకుగాను ఈ దుకాణాలకు లాటరీ విధానంలో లైసెన్సు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో గీత కార్మికులకు కూడా కొన్ని అప్పగించారు. ఈ దుకాణాల గడువు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం మరో రెండేళ్లకు లాటరీ తీస్తోందనే ప్రచారం జరిగింది. కానీ మళ్లీ వారికే అవకాశం కల్పించారు. జిల్లాల్లో అధికార పార్టీ కీలక నేతల చేతుల్లోనే మద్యం దుకాణాలున్నాయి. వారందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏడాది పాటు రెన్యూవల్ చేసేలా పట్టుబట్టారు. డీడీల నుంచే సిండికేటు... జిల్లాలో మద్యం దుకాణాలకు 2024లో లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో దుకాణాన్ని పొందేందుకు రూ. 2 లక్షల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ విధానాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారులు అప్పట్లోనే సిండికేటుగా మారారు. జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎక్కువ మంది పోటీ పడకుండా ఒక్కో దుకాణానికి ఆరుగురు మాత్రమే ధరావత్తు చెల్లించారు. ఏ ఒక్కరి పేరుతో దుకాణం వచ్చినా ఆరుగురు కలిసి భాగస్వాములుగా వ్యాపారం చేసుకునేలా రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారనే విమర్శలు ఉన్నాయి. ‘స్థానిక’ ఎన్నికల నిధికి సిండికేట్ సిద్ధం.... వచ్చే నెలలో మున్సిపల్, పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మద్యం సిండికేటు ద్వారా భారీగా నిధులు సమకూర్చుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేతలే ఇప్పుడు మరో ఏడాది పాటు లైసెన్సు పొడిగించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం లైసెన్సు గడువు పెంచుతూ ‘పచ్చ’జెండా ఊపడంతో మద్యం దుకాణదారులు రెన్యూవల్కు సిద్ధమయ్యారు. సామాన్యుడిపైనే బాదుడు మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం దుకాణదారులకు 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పింది. తొలుత 9 శాతం చొప్పున కమీషన్ ఇచ్చి, తరువాత ఒకశాతం పెంచింది. తరువాత 14 శాతం చేసింది. దీనివల్ల తాము నష్టపోయామంటూ సిండికేట్లు కట్టుకథ అల్లాయి. ప్రభుత్వం కూడా ఇదే తప్పుడు ప్రచారాన్ని ప్రచారంలో పెట్టింది. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చే కమీషన్కు పదింతలు ఎక్కువగా మందుబాబుల నుంచి మద్యం సిండికేట్లు లూటీ చేశాయనే విమర్శలు ఉన్నాయి. ఎంఆర్పీ కన్నా అదనంగా ఎప్పటి నుంచో వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాపులకు ఇంకా అదనంగా బాదేస్తున్నారు. ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా 15 నుంచి 20 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార పర్మిట్ రూములు, బార్ల తరహాలో ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారిలోని దాబా హోటళ్లలో సైతం విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలోని సత్తెమ్మ తల్లి గుడి వద్ద, ఆలయ సమీపంలో బహిరంగంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలు: 8 మండలాలు: 28 మద్యం దుకాణాలు: 129 కల్లుగీత కార్మికులకు దుకాణాలు: 13 ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ స్టేషన్లు: 10 -
చెలరేగుతున్న చోరులు
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోరులు చెలరేగిపోతున్నారు. దొంగతనానికి వచ్చి ఇంట్లోని వారిని సైతం చంపేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ దొంగతనాలు, దోపిడీలతో హడలిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా నేరాల నియంత్రణకు చంద్రబాబు సర్కారు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే దోపిడీ ముఠాలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆధారాలు దొరక్కుండా వ్యూహాత్మకంగా దోపిడీలకు పాల్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడడంతో బయట రాష్ట్రాల వారితోపాటు జిల్లాకు చెందిన కొంతమంది కూడా ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడులో హత్యలు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీల పరంపరను పరిశీలిస్తే.. అధిక శాతం దొంగతనాలు తాళాలు వేసి ఊరికి వెళ్లిన వారి ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు ఉండే ఇళ్లను ముందుగానే రెక్కీ వేసి ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. 80 శాతం దొంగతనాలు ఇలాంటివే కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో... బాపట్ల జిల్లాలో... బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల, మార్టూరు వంటి ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో భారీ మొత్తంలో సొత్తు చోరీకి గురైనట్లు కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో సొత్తు మాత్రం రికవరీ చేయని పరిస్థితి నెలకొంది. వినుకొండ పట్టణంలో వరుస దొంగతనాలు అక్కడి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించి రాత్రిపూట గస్తీలు ముమ్మరం చేసి దొంగతనాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లక్ష్మీపురం: క్రికెట్ అండర్–19 వన్డే ఆంధ్రా జట్టుకు గుంటూరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎ.దేవ ప్రమోద్ వికెట్ కీపర్ కం బ్యాటర్, ఎం. శ్రీ సమన్విదత్త ఓపెనింగ్ బ్యాటర్గా, కె.వి.కౌశిక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా, ఎస్.కె. అబ్దుల్ జబ్బర్ లెగ్ స్పిన్నర్గా జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆంధ్రా జట్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు త్రీ మెన్ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. త్వరలో జరగబోయే అంతర్రాష్ట్ర పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్కి, సెలక్షన్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గంటల కొద్దీ ట్రాఫిక్కు అంతరాయం చేబ్రోలు: చేబ్రోలు – మంచాల గ్రామాల మధ్య ఉన్న కొమ్మమూరు బ్రిడ్జిపై శనివారం రాత్రి లారీ నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొన్నూరు, గుంటూరు మార్గాల వైపు కి.మీ.ల పొడువున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎనిమిది రోజుల కిందట కొమ్మమూరు బ్రిడ్జికి ఒకవైపు కొంతభాగం కూలిపోయింది. అప్పటి నుంచి పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. పెద్ద వాహనాలు బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది. పొన్నూరు వైపు లారీ వెళుతుండగా బ్రిడ్జిపైభాగంలో ఎదురుగా మరో వాహనం వచ్చింది. లారీ ఆగిపోవటంతో దీనిని సర్దుబాటు చేయటానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. రెండు వైపులా సుమారు ఐదు కి.మీ. మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్రిడ్జి దాటడానికి వాహనదారులకు గంటలకొద్దీ సమయం పట్టడంతో అవస్థలు తప్పలేదు. మరోవైపు వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి అయినప్పటికీ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో క్లియర్ కాకపోవడంతో పోలీసులకు కూడా కష్టాలు తప్పలేదు. ఈపూరు: తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ జలాలను విడుదల చేసిన క్రమంలో 85వ మైలు సమీపంలో కుడి ప్రధాన కాలువను ఎస్ఈ టి. రమేష్ శనివారం పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహ కొలతలను తెలుసుకున్నారు. నీటి వృథా జరగకుండా కాలువలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను పరిగణనలో తీసుకుని తాగునీటి చెరువులను సకాలంలో నింపాలని ఆదేశించారు. వెంట ఈఈ ఆర్.మల్లికార్జున, డీఈఈ షేక్ ఖాదర్, ఏఈ ఎం యుగంధర్ ఉన్నారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,535 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హై లెవెల్కి 96 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 604, తూర్పు కాలువకు 403, పశ్చిమ కాలువకు 150, నిజాంపట్నం కాలువకు 250, కొమ్మమూరు కాలువకు 915 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ తమ్ముళ్లకే కాసుల కిక్కు!దొంగతనాలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడంతో పాటు, దొంగలు దొరికినా బాధితులు పోగొట్టుకున్న సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో వారి చేతికి అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఐ ప్రతీకాత్మక చిత్రం -
జాతీయ లోక్ అదాలత్లో 3,716 కేసులు పరిష్కారం
నరసరావుపేటటౌన్: జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం స్థానిక మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్లో సివిల్, క్రిమినల్, ముందస్తు వ్యాజ్యాలు, బ్యాంకు, కుటుంబ సంబంధిత లావాదేవీలు, మోటార్ వాహన ప్రమాద కేసులు తదితర అన్ని రకాల కేసులను పరిష్కరించారు. మొత్తం 3,716 కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో కక్షిదారులకు రూ. 3.38 లక్షల మేరకు ఆర్థికపరమైన లబ్ధి చేకూరింది. న్యాయాధికారులు బి.కిరణ్ కుమార్, జోత్స్నశ్రీలు రెండు బెంచ్లుగా ఏర్పడి కేసులను పరిష్కరించారు. ఈ అదాలత్లో న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం వినాయక చవితి పర్వదినం కారణంగా ప్రభుత్వ సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కోరారు. ఎవరైనా తాము దాఖలు చేసిన అర్జీలు ఇంకా పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలనుకున్నా 1100 ఫోన్నంబర్కు కాల్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. -
సమీకృత లేబరేటరీ ప్రారంభం
నరసరావుపేట: స్థానిక ఏరియా హాస్పిటల్లో రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన ఇంటిగ్రేటెడ్ లేబరేటరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. స్థానికంగా దీనిలో పాల్గొన్న పలువురు నాయకులు, అధికారులు ల్యాబ్లోని పలు విభాగాలను రిబ్బన్ కట్చేసి ఆరంభించారు. ఈ ఆధునిక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ అందుబాటులోకి రావడంతో నరసరావుపేట పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో చేపట్టిన ల్యాబ్ పనులు పూర్తయి ప్రజలకు ఇపుడు అందుబాటులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సమన్వయకర్త డాక్టర్ ప్రసూన, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్, ఆర్డీఓ కె.బాలకృష్ణ, కూటమి నాయకులు, డాక్టర్లు పాల్గొన్నారు. -
జాతీయ ఇన్స్పైర్ పోటీలకు జిల్లా విద్యార్థి
నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఇన్స్పైర్ మనక్– 2024–25 సంవత్సరానికిగాను జాతీయస్థాయి పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపిక కావడంపై జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి మండలం లేమల్లె గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థి చినరావూరి మణికంఠసాయి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావటం అభినందనీయమని తెలిపారు. డీఈఓ కార్యాలయంలో శుక్రవారం విద్యార్థి మణికంఠసాయి, గైడ్ టీచర్స్ అంకం బుజ్జిబాబు, డాక్టర్ చివుకుల సాంబశివరావులను సత్కరించారు. ఉపాధ్యాయుల సహకారంతో మణికంఠసాయి రూపొందించిన ప్రొటెక్టీవ్ హెల్మెట్ ఫర్ ప్రొఫెషన్ వెండర్స్ ప్రాజెక్ట్ను రాష్ట్రస్థాయి ప్రదర్శనలో అధికారులు జాతీయస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారులు షేక్.సుభాని, వి.ఏసుబాబు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఆకులు, కూరగాయలతో వినాయక విగ్రహం
రొంపిచర్ల: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు సృజనాత్మకతను చాటుతూ మండలంలోని పీ.ఎం. శ్రీ ఏపీ మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి జి.సంజయ్ ఆకులు, కూరగాయలతో వినూత్నంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించాడు. పాఠశాలలోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో కార్వింగ్ కళను ఉపయోగించి వినాయకుని ప్రతిమలను తయారు చేశాడు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాదృష్టిని వెలికితీసేందుకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ శిక్షణ అందిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రవినాయక్ తెలిపారు. మట్టితో మాత్రమే కాకుండా ఆకుకూరలు, కూరగాయలతోనూ పర్యావరణహితంగా వినాయక ప్రతిమలను రూపొందించవచ్చని విద్యార్థి తన ప్రతిభ ద్వారా చాటాడన్నారు. భవిష్యత్లో ఇలాంటి వినూత్న కళల ద్వారా ఉపాధి, ఆదాయ మార్గాలను సైతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతిమను రూపొందించిన సంజయ్ను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. -
పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన జీవితం
ఈపూరు: పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ పీడీ ఎం నాగమల్లేశ్వరి అన్నారు. పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా ఈపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలకు పోషకాహార విలువలపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు, భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడగాలన్నారు. పోషక విలువలు పోకుండా ఆహార పదార్థాల తయారీ విధానాన్ని వివరించారు. పోషకాహార విలువలు తెలి సేలా గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రు లను చైతన్య పరచాలని అంగన్వాడీ కార్యకర్తల కు సూచించారు. గిరిజన ప్రాంతాలలో తొమ్మిది నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు రూ.1.53 కోట్లు మంజూరయ్యా యని తెలిపారు. నోడల్ అధికారిణి అరుణ, సీడీపీఓ ఈ వాణి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో 10 మంది అరెస్టు మాచర్ల: పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ నమోదైన కేసులో 10 మందిని శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మండలంలోని సుబ్బారెడ్డిపాలేనికి చెందిన పుణ్యమూర్తి సిలువరాణి జూన్ 25న ప్రసవం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. శిశువుకు జన్మనిచ్చి ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సుబ్బారెడ్డి, నాగులవరం, కొప్పునూరు గ్రామాలకు చెందిన పలువురిపై అప్పట్లో పట్టణ సీఐ షేక్ నజీర్ బేగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ కేసులో నిందితులుగా ఉన్న పేరువాల రమేష్, బూడిద శ్రీనివాస్, బూడిద సైదులు, నోముల కృష్ణ, జి.నాగమల్లయ్య, పి.రంగానాయక్, బొమ్మా వెంకటేశ్వర్లు, బొమ్మా తిరుపతయ్య, సీహెచ్ గోవిందరాజుతోపాటు మరొకరిని అరెస్టు చేసి శుక్రవారం మాచర్ల న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా వారికి ఆయన రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కేసుకు సంబంధించి అప్పట్లో ఇరువర్గాలు రాజీ చేసుకున్నాయి. ఆ సమయంలో వివాదం నేపథ్యంలో సీఐ నజీర్ బేగ్ కొద్ది రోజులు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల పై హత్యాయత్నం, విధులకు ఆటంకంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గురజాల సీఐ ఎం మురళీ విచారించారు. -
ప్రజలను మోసగించిన టీడీపీ
మాచర్ల: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన చరిత్ర చంద్రబాబు, లోకేష్ది అని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పి. గౌతమ్రెడ్డి అన్నారు. ‘‘మేం సవాలు చేస్తున్నాం. మీరు ప్రభుత్వం వచ్చాక చేసిన అక్రమాలపై చర్చకు సిద్ధమా? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. డీఎస్సీలో అక్రమాలతోపాటు ప్రజలను మోసగించిన ప్రతి విషయం మేం చర్చిస్తాం. పూర్తి ఆధారాలతో నిరూపిస్తాం. మీ డ్రామాలు ఆపండి’’ అని వారు పేర్కొన్నారు. మాచర్లలో శుక్రవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని పీఆర్కే ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో గుంటూరు రోడ్డులోని మహాలక్ష్మీ కోల్డ్ స్టోరేజీ వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పార్టీ శ్రేణుల ధైర్యం అభినందనీయం ముఖ్య అతిథిగా పి. గౌతమ్రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు అధికారంలోకి రావడానికి వంద మాయమాటలు చెప్పారని, ఆ తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. వేలాది మందిపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. తండ్రి, కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా అందరికీ జగనన్న గుండె ధైర్యమిస్తారని అన్నారు. భయపడకుండా పీఆర్కే ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లడం మంచి విషయమని పేర్కొన్నారు. బాధపడవద్దని, భయపడవద్దని సూచించారు. అధికార పార్టీ వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రైతులను దగా చేసిన సీఎం పీఆర్కే మాట్లాడుతూ.. చంద్రబాబు వరికపూడిశెల పేరుతో రైతులను మోసగించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘‘బ్రహ్మారెడ్డి, మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉంటేనే వరికపూడిశెల గురించి మాట్లాడాలా? 20 ఏళ్లు నియోజకవర్గాన్ని వదిలి పారిపోయావు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం నీకు అలవాటు. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చాక కుటుంబాలు ఊళ్లు వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటికే మా పార్టీ కార్యకర్తలు, నాయకులపై వందల కేసులు పెట్టావు. నాపైనా 16 కేసులు పెట్టించావు. ఇవన్నీ నీ ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనం. నిన్ను, నీ పార్టీ కార్యకర్తలు, నాయకులే నమ్మడం లేదు. రేషన్, ఇసుక, మట్టి అన్నీ మాఫియాలు నువ్వే చేస్తున్నావు. ఇదీ.. నీ చరిత్ర. తగిన మూల్యం చెల్లిస్తావు’’ అని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ‘‘సీఎం చంద్రబాబు... నువ్వు చేసే మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో పార్టీ కోసం వేలాది మంది తరలివచ్చి జగన్, పీఆర్కేలకు జేజేలు కొడుతున్నారంటే వారికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకో. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం’’ అన్నారు. -
ప్రమాదాల నివారణకు పాత హైవేపై ప్రత్యేక దృష్టి
యడ్లపాడు: పట్టణంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు వద్ద ఆగస్టు 26 రాత్రి జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో పాత హైవేపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం 11న ప్రధాన కూడళ్లను అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. పట్టణంలోని ఎన్న్ఆర్టీ సెంటర్, అడ్డరోడ్డు, విజయాబ్యాంక్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, ఏఎంసీ చెక్పోస్టు ప్రాంతాల్లో ఎన్న్హెచ్ఏఐ అధికారులు, చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్, పల్నాడు జిల్లా ట్రాఫిక్ ఎన్న్ఫోర్స్మెంట్ సీఐ రమేష్, పట్టణ ఎంవీఐ ఎన్ గోపాల్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. వాహనాల వేగం, ట్రాఫిక్ రద్దీ, మలుపులు, ప్రమాదాలకు దారితీసే ఇతర అంశాలను గుర్తించారు. వేగానికి కళ్లెం.. ప్రమాదాలకు చెక్ ప్రమాదకర ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పలు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మూడు లేయర్ల స్పీడ్ బ్రేకర్లు, ఎస్–టైప్ బ్యారికేడ్లు, రోటరీ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. రహదారిపై ప్రమాదకర వస్తువులు, అడ్డంకులు వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఆబ్జెక్ట్ హజార్డ్ మార్కింగ్స్ చేయనున్నారు. వీటితోపాటు స్పీడ్ బ్రేకర్లు, ఓహెచ్ఎంఎస్, టీఎంబీలు, రోడ్ మార్కింగ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేసేవిధంగా పరిశీలిన చేశారు. వేగ నియంత్రణ, బారికేడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్కు ప్రతిపాదనలు ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనదారులకు ప్రమాదకర ప్రాంతాలు ముందుగానే కనిపించేలా హెచ్చరికలు, సూచికలు ఏర్పాటు నిర్ణయాన్ని వెలిబుచ్చారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన ప్రాంతాల్లో త్వరలోనే అవసరమైన ఏర్పాట్లను పునరుద్ధరించడంతో పాటు కొత్తగా భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా..ప్రమాదానికి అవకాశం ఉన్న చోటే ముందుగా అప్రమత్తం కాావాలన్నదే అధికారుల లక్ష్యంగా ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో భద్రతా చర్యలకు అధికారుల కసరత్తు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో పలువురు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర విభాగంలో నియమిస్తూ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల విభాగ ప్రధాన కార్యదర్శిగా రామగిరి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శిగా ములకా రామతులసీరెడ్డి (వినుకొండ), రాష్ట్ర యూత్ విభాగ కార్యదర్శిగా కొమ్మినేని శంకరరావు, రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శిగా శానంపూడి మహేంద్రరెడ్డి (గురజాల) నియమితులయ్యారు. కాపు జేఏసీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గాలి నాదెండ్ల: కాపు జేఏసీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గణపవరం గ్రామానికి చెందిన గాలి హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్నాయుడు నుండి శుక్రవారం గుంటూరులో జరిగిన కాపు కార్యవర్గ సమావేశంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. గాలి హనుమంతరావు మాట్లాడుతూ తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ శ్రీనివాస్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపుల అభ్యున్నతి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు. పలువురు కాపు సంఘ నాయకులు అభినందించారు. నేడు జాతీయ లోక్ అదాలత్ నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన సీనియర్ సివిల్ న్యాయాధికారి కిరణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కోర్టు ప్రాంగణంలో శనివారం అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌనన్స్ కేసులు, భరణం కేసులు, కుటుంబ, రెవెన్యూ, ముందస్తు వ్యాజ్యాలను కక్షిదారులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని విలువైన సమయాన్ని వృథా కాకుండా కాపాడుకోవాలన్నారు. డప్పు, చర్మకారులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మయ్య నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలోని డప్పు కళాకారులు, చర్మకారులు తమ పెన్షన్ దరఖాస్తులను వారికి సమీపంలోని స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాదికారి ఎం.లక్ష్మయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా కార్యాలయానికి రానవసరం లేదని స్పష్టం చేశారు. అర్హత కలిగిన గ్రామీణ ప్రాంతం వారు స్వీయ ధ్రువీకరణతో వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, పట్టణ ప్రాంతం వారు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రట రీ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన నిబంధనల మేరకు సంబంధిత అధికారులు నిర్వహిస్తారని వివరించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే స్వర్ణ గ్రామ, వార్డుల అధికారులను సంప్రదించాలని తెలిపారు. కరువు మండలంగా ప్రకటించాలి రొంపిచర్ల: రొంపిచర్ల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం తగ్గిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందే తెలిసినా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అన్నారు. పంటలు లేక ఖాళీగా ఉన్న రైతులకు ఎకరాకు రూ.10వేల రూపాయలు కరువు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ బి.నిర్మలకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి రొడ్డా అంజిరెడ్డి, సీపీఐ మండల నాయకులు పిడెం హుస్సేన్, జమ్ములమూడి వెంకటేశ్వరరావు, చెరుకూరి నాగేశ్వరరావు, తన్నీరు వెంకట కోటయ్య, అనీల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.5.47 లక్షలు మాచర్ల: పట్టణంలోని పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. రెండు నెలలుగా సంబంధించి ఆలయాలకు చెందిన హుండీలను సత్తెనపల్లికి చెందిన దేవాదాయ శాఖాధికారులు లీలావతి, భ్రమరాచారి, పట్టణ ఈఓ సైదులు, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమెర అనంతరాములు ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కింపు జరిపారు. 2నెలల 15 రోజులకు రూ. 5లక్షల ,47 వేల ,556 ఆదాయం చేకూరినట్లు ఈఓ సైదయ్య తెలిపారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 44 బెంచెస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్, చెక్కు బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మీడియేటర్స్కు వర్చువల్ పద్ధతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రైనీ ఆర్. విజయ కమల మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వీఎస్వీ హిమబిందు, సీనియర్ సివిల్ జడ్జి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అదనపు కార్యదర్శి హెచ్. అమరలింగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి కొండపై కొలువైన గండాలయ స్వామికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కొండపై దీపాలు వెలిగించారు. మంగళగిరితోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున గండాలయ స్వామికి దీపాలు వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి అమావాస్యకు కొండపై స్వామి సన్నిధికి చేరుకుంటారు. దీపాలు వెలిగించడం వల్ల చీకటి దూరమై వెలుగులు నిండుతాయని, జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మంగళగిరి కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో మిర్చి యార్డులో క్రయవిక్రయాలు, ఇతర మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెలవు రోజుల్లో మిర్చి పంటను యార్డుకు తీసుకురావద్దని యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి యార్డులో యథావిథిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు. యడ్లపాడు: చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్ఎన్ మూర్తి, సీఆర్డీఏ పర్యవేక్షక ఇంజినీర్ బీవీ సుధాకర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట టౌన్ సెక్షన్ పరిధిలో ఈ తనిఖీలు చేశారు. 34 బృందాలు, 34 మంది అధికారులు, 85 మంది సిబ్బంది పాల్గొన్నారు. 1,885 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. ప్రత్యేక తనిఖీల్లో 115 కేసుల్లో వినియోగదారులకు రూ.8.79 లక్షల అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ ఇంజినీర్ డీపీఈ సీహెచ్ వెంకటేశ్వరరావు, గుంటూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ వై. ఏడుకొండలు వివరాలను వెల్లడించారు. విద్యుత్ అక్రమ వినియోగంపై 94408 12263, 94408 12360 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో పలు విభాగాల డీఈఈలు పి. భార్గవి, కె.రవికుమార్, ఎన్. మల్లికార్జున ప్రసాద్, ఏఈఈలు ఎన్. కరుణాకర్, ఎం.సతీష్కుమార్, యు. శివశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన శిబిరం
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రెడ్క్రాస్ సహకారంతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో అదనపు ఎస్పీ రక్తదానం చేశారు.ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. విధి నిర్వహణలో దేశం కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అమరవీరుల స్పూర్తిని కొనసాగిస్తూ సమాజ సేవలో భాగంగా రక్తదానం చేయడం గొప్ప కార్యక్రమమని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, వెల్పేర్ ఆర్ఐ గోపినాథ్, హోంగార్డు ఆర్ఐ ఎస్.కృష్ణ, ఎంటీ ఆర్ఐ యువరాజ్, బీడీ టీం ఆర్ఐ ఎం.రాజా, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు ఎంవి శేషగిరిరావులు పాల్గొన్నారు. -
గంజాయి గుప్పెట్లో గజగజ
నరసరావుపేట టౌన్: చిలకలూరిపేట పట్టణం సుగాలి కాలనీకి చెందిన పవన్కుమార్ నాయక్, మణిగోపాల్ నాయక్లు 1,300 గ్రాముల గంజాయితో ఈ నెల 9వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. యడ్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. జూలై 15వ తేదీన సత్తెనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు షేక్ మహ్మద్ రఫీ అల్లూరి జిల్లా నుంచి 220 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. తాజాగా నరసరావుపేటలో గురువారం సాతులూరు గ్రామానికి చెందిన కంచెర్ల నాగవెంకట్, బరంపేటకు చెందిన కటారి సాయి కల్యాణ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పట్టుబడ్డ టీడీపీ మహిళా నేత కుమారుడిని పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దందాకు రాజకీయ అండ.. గంజాయితో పట్టుబడ్డ టీడీపీ మహిళా నేత కుమారుడికి రాజకీయ నాయకులు అండగా నిలిచారు. నిందితుడిగా ఉండాల్సిన కేసులో గంజాయి వినియోగదారుడిగా పేర్కొన్నారు. మొదట నిందితుడిగా చేర్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి మేరకు వారు నిందితుడిగా మార్చారు. రాజకీయ నాయకులు రంగప్రవేశంతో గంజాయి కేసు నీరుగారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి విక్రయించే చిన్నస్థాయి వ్యక్తులను పట్టుకోవటంతో ఈ దందా పూర్తిగా ఆగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లాకు ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతుంది? ఎన్ని చేతులు మారుతున్నాయి? వంటి మూలాలపై అధికారులు దృష్టి సారించి లోతైన దర్యాప్తు చేపట్టటం లేదు. గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవటం వల్ల దాని ప్రభావం ప్రధానంగా యువతపై పడుతోంది. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టుకొంటుకున్నారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాపై ప్రత్యేక నిఘా అవసరమని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా దర్యాప్తు జరిగితేనే సూత్రధారులు చిక్కుతారని, సరఫరా నెట్వర్క్ కట్టడి చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేరాల బాటలో... గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన యువత అనేక మంది నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వ్యసనపరులు ద్విచక్ర వాహనాలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. గురువారం నరసరావుపేట రూరల్ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులు ఈ కోవకు చెందిన వారే. ఓ బుల్లెట్ వాహనాన్ని చోరీ చేసి, దాన్ని అమ్మి వచ్చి సొమ్ముతో గంజాయి కొనుగోలు చేశారని వెల్లడైంది. గంజాయిని అధిక ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. జిల్లాలో విచ్చలవిడి గంజాయి అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అడపాదడపా పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ, సరఫరా మూలాలను ఛేదించకపోవటంతో నియంత్రణ సాధ్యం కావటం లేదు. టీడీపీ నేతలు గంజాయి మాఫియా అవతారమెత్తి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిద్రావస్థ నటిస్తున్నారు. అధికార పార్టీ నాయకులే సూత్రధారులు కావటంతో దందా జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. యువత మత్తు వ్యసనానికి బానిసలుగా మారడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతోంది. గడిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబడటం పరిస్థితికి అద్దం పడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్పోస్టులన్నీ ఎత్తేసి అక్రమ వ్యాపారులకు అవకాశం కల్పించారు. కొందరు టీడీపీ నాయకులు ఉపాధి మార్గంగా గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. యథేచ్ఛగా గంజాయిని ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేసి, వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వినుకొండ ఫొటోగ్రాఫర్ బ్రహ్మంకు జాతీయ పురస్కారం
వినుకొండ: ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఛాయాచిత్ర పోటీల్లో వినుకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మం ప్రతిష్టాత్మక ‘భారతీయ వారసత్వ, దేశభక్తి పురస్కారం’తోపాటు నగదు బహుమతికి ఎంపికయ్యారు. ‘నా భారతదేశం: 80 ఏళ్ల ప్రజాస్వామ్యం మరియు స్వచ్ఛత‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పోటీల్లో, ఆగస్టు 15న వినుకొండ గీతాంజలి స్కూల్లో ఆయన చిత్రీకరించిన ‘ఒక దేశం – అనేక హృదయాలు‘ అనే ఫోటోకు ఈ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని నిర్వాహకులు మెయిల్ ద్వారా ధృవీకరించారు.అక్టోబర్ 2న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే వేడుకలో బ్రహ్మంకు విశ్వవిద్యాలయ బంగారు పతకంతో సత్కరించనున్నట్లు తెలిపారు. గీతాంజలి స్కూల్ ప్రతినిధి కిషోర్, పోటీల చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డిలతోపాటు వినుకొండ నియోజకవర్గం ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశనపల్లి సుబ్బారావు, పలువురు సభ్యులు బ్రహ్మంను అభినందించారు. -
ముందుకుసాగని మాదిపాడు వంతెన
అచ్చంపేట: పల్నాడు జిల్లా సరిహద్దులోని మాదిపాడు వద్ద కృష్ణానదిపై ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ చేపట్టిన వంతెన పనులు పూర్తిగా ఆగిపోయాయి. అధికారులు గతంలో చెప్పినట్లుగా ఇప్పుడు అధిక వర్షపాతాలు లేవు, కృష్ణానది పొంగి పొర్లడం లేదు, పులిచింతల ప్రాజెక్టు నుంచి అధిక జలాలను విడుదల చేయడం లేదు. కృష్ణానదిలో నీరు చాలా తక్కువగా ఉంది. ఎల్నినో ప్రభావంతో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే వంతెన నిర్మాణ పనులు చేయడానికి ఇదే సరైన సమయం. టీడీపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. బిల్లులు చెల్లించడంలోనూ విఫలం బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడానికి కారణం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యమే. బ్రిడ్జి డిజైనులో మార్పులు, చేర్పులు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకుతోడు నదికి రెండు వైపులా స్థల సేకరణలో లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్ము ఇంతవరకు అందలేదు. బ్రిడ్జి నిర్మాణం ఆరు నెలల క్రితం ఏ స్థాయిలో ఉందో, ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మూడు, నాలుగు నెలలుగా అసలు పనులే జరగడం లేదు. వాస్తవంగా 2025 జనవరిలో ప్రారంభమైన పనులు రెండేళ్లలో, అంటే 2027 జనవరి నాటికి పూర్తి చేయాలి. శ్రీకారం జగన్ హయాంలోనే... ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నడుమ రాకపోకలను సుగమనం చేసేందుకు ఇటు అచ్చంపేట, అటు ముక్త్యాల సరిహద్దులను కలుపుతూ మాదిపాడు వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాలన్న ఆలోచన అప్పటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు హయాంలోనే వచ్చింది. తన అభిప్రాయాన్ని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించి ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ ఇంజినీర్లను పంపారు. అనువైన ప్రాంతాన్ని గుర్తించి, వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేయించారు. రూ.60.54 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేయించి, జూన్ 12న క్రోసూరులో వర్చువల్గా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టేందుకు రెండు జిల్లాల సరిహద్దుల్లో ఘాట్ రోడ్లకు స్థల సేకరణ, డీపీఆర్లు తయారు చేయడం వంటి పనులు చకచకా సాగాయి. కృష్ణానదిలో 14 పిల్లర్స్ వేసి వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన 13.35 ఎకరాల భూమిని సేకరించారు. పల్నాడు జిల్లా మాదిపాడు వైపు 4.45 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాల వైపు 9 ఎకరాల భూమిని సేకరించారు. ముక్త్యాల వైపు కిలోమీటరు, మాదిపాడు వైపు అర కిలోమీటరు రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు చేశారు. టెండర్ల ప్రక్రియ ఇలా.. కృష్ణానదిపై అచ్చంపేట మండల సరిహద్దులోని మాదిపాడు నుంచి ముక్త్యాల సరిహద్దు వరకు కృష్ణానదిలో 14 పిల్లర్స్ వేసి, 600 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం నాలుగు టెండర్లను ఆహ్వానించింది. ఎన్నికల కోడ్ రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని కన్స్ట్రక్షన్స్ టెండర్ దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంలో కేవలం మూడు పిల్లర్స్ పూర్తి అయ్యాయి. మిగిలిన పనులకు మరెంత కాలం పడుతుందోనన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మూడు పిల్లర్స్కే పరిమితమైన మాదిపాడు బ్రిడ్జి -
ఆటో నుంచి జారిపడి వృద్ధుడు మృతి
యడ్లపాడు: ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడికి పిట్స్ రావడంతో కిందపడిపోయి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..గుంటూరు నుంచి యడ్లపాడు వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వంకాయలపాడు గ్రామాన్ని దాటిన అనంతరం సర్వీస్ రోడ్డులోకి చేరింది. అదే సమయంలో ఆటోలో డోర్ వైపు కూర్చొని ఉన్న యడ్లపాడు గ్రామం దళితవాడకు చెందిన తుమ్మపూడి సుబ్బారావు(64) పిట్స్ రావడంతో జారీ కిందపడ్డారు. హైవే సర్వీస్ మార్గం వెంట నిర్మించిన కాలువ దిమ్మెకు తల బలంగా తగిలింది. గమనించిన ఆటో డ్రైవర్ షఫరుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వ్యక్తిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు నాయుడుపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, విధులు ముగిశాక ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పిడుగురాళ్ల: పట్టణంలోని ఓ ప్రైవేట్ శుక్రవారం విజిలెన్న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్పై పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నుంచి జిల్లా కలెక్టర్కు సమాచారం రావడంతో కలెక్టర్ ఆదేశాలతో మెడికల్ టీం అవసరమని డీఎంహెచ్ఓకు లెటర్ రావడంతో ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు కలసి టీంగా ఏర్పడి హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించడంతోపాటు పనితీరు పరిశీలించారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీలు, సీఐలతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్కు సంబంధించి పల్నాడు జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ రత్న మనోహర్, అడిషనల్ డీఎంహెచ్ఓలతోపాటు పలువురు అధికారులు హాజరైనట్లు తెలిపారు. పరిశీలించిన రికార్డులు, హాస్పిటల్కి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని తెలిపారు. మహిళపై కత్తితో దాడి చిలకలూరిపేటటౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలో జరిగింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బొందిలిపాలేనికి చెందిన రాజవరపు మల్లేశ్వరి ఎన్్ఆర్టీ సెంటర్లోని ఓ భోజన హోటల్లో క్లీనింగ్ పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త కొద్దికాలం కిందట చనిపోయాడు. అదే హోటల్ సమీపంలోని ఓ లాడ్జిలో కర్నూలు జిల్లాకు చెందిన కొప్పుల శ్రీనివాసరావు కొద్దికాలంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆమెను తనతో వచ్చేయాలని బలవంతం చేయసాగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో రెండుసార్లు ఘర్షణ పడ్డాడని, పక్కా వ్యూహంతో శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి కూరగాయల కత్తితో దాడి చేసి ఒంటిపై పలుచోట్ల గాయాలు చేసినట్లు తెలిపారు. సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ పి రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని, అయితే దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివాహిత ఆత్మహత్యక్రోసూరు: భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక వివాహిత ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్ఐ పి.రవిబాబు తెలిపిన వివరాల మేరకు అమరావతి మండలంలోని తురగావారిపాలెం గ్రామానికి చెందిన బంకాశ్రీలేఖ(21)కు నాలుగున్న సంవత్సరాల కిందట ఊటుకూరులోని బంకా మాణిక్యరావుతో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఏదో కారణంగా తన కుమార్తెను వేధిస్తున్నారని, దీంతో మనస్థాపం చెంది ఉరేసుకుని మృతి చెందిందని మృతురాలి తండ్రి రామకోటేశ్వరరావు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతురాలికి కుమార్తె ఉన్నట్లు తెలిపారు. దీనిపై భర్త, అత్తమామల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అన్యాయం జరిగిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
అచ్చంపేట: అన్యాయానికి గురై అక్రమంగా అరెస్ట్ అయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెదకూరపాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మండలంలోని గ్రంథశిరిలో కూటమి ప్రభుత్వం అన్యాయంగా బనాయించిన పీడీ యాక్టు కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కోటపాటి రాజశేఖర్ ఇటీవల బెయిల్పై విడుదలైన విషయం విదితమే. మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పిన్నెల్లి, నంబూరులు రాజశేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలితో పిన్నెల్లి, నంబూరులకు ఆహ్వానం పలికారు. పిన్నెల్లి, నంబూరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎవ్వరూ అధైర్య పడొద్దని మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులు రావెళ్ల శ్రీధర్, కోట శ్రీనివాసరావు, యాటగిరి రామకృష్ణ, తిరుపతిరావు, కిలారి అప్పయ్యచౌదరి, చిల్కా బెంజిమెన్, ఏలూరి గోవిందయ్య, అడుసుమల్లి వెంకటేష్, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుల అత్యుత్సాహం ఇది చూసి ఓర్పుకోలేని టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను గ్రామంలోకి రానీవ్వకుండా పోలీసులను పావులుగా చేసుకుని అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గ్రామం ప్రారంభంలో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో వాటిని తొలగించారు. దారివెంట కట్టిన ప్లెక్సీలను తొలగించారు. మొదట నిర్ణయించిన దారిన కాకుండా వేరే దారికి నాయకులను మళ్లించారు. -
అందుబాటులో మెరుగైన వైద్య నిర్ధారణ సేవలు
నరసరావుపేట: పల్నాడు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య నిర్ధారణ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ (ఐపీహెచ్ఎల్)ను శనివారం ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించగా ఇప్పటికీ అందుబాటులోకి వచ్చింది. ఇటువంటి ల్యాబరేటరీలను రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించారు. అందులో నరసరావుపేట ఒకటి. అందుకోసం విదేశాల నుంచి 12 మెషీన్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న ల్యాబొరేటరీలో 63 వైద్య పరీక్షలు జరుగుతుండగా ఇప్పుడు ప్రారంభించే ఐపీహెచ్ఏల్ ల్యాబొరేటరీ ద్వారా థెరాయిడ్, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్, హార్పోన్స్ పరీక్షలు లాంటివి మరో 71 పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. దీని నిర్వహణకు 12 మంది టెక్నీషియన్లు అవసరం కాగా ప్రస్తుతం ఐదుగురే పనిచేస్తున్నారు. వీరందరూ కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగులే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ల్యాబొరేటరీని వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఏరియా ఆసుపత్రిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ ల్యాబొరేటరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పీఎం అభిమ్ పథకం కింద నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ పాల్గొంటారన్నారు. ప్రత్యేక అతిథులుగా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్, ఆరోగ్యశాఖ కమిషనర్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ కెవీఎన్.చక్రధరబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొననున్నారు. -
కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగుల నిరసన
నరసరావుపేట: రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ, తమ ఉద్యోగ భద్రత, న్యాయమైన డిమాండ్లపై తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవటం అన్యాయమని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నాగరాజు పేర్కొన్నారు. స్థానిక ఏరియా వైద్యశాలలో గురువారం కాంట్రాక్ట్ ఉద్యోగులు ‘‘మేము సేవ చేస్తాం–మాకు న్యాయం కావాలి అనే నినాదంతో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నాగరాజు మాట్లాడుతూ ఈ నిరసన చేయడం ద్వారా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని కోరారు. నిరసనలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, రేడియోగ్రాఫర్లు, టెక్నీషియన్లు తదితర కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
స్థానిక సమరానికి సిద్ధం
పల్నాడుశుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● ఎంపీటీసీలకు 23న, జెడ్పీటీసీలకు 24న ముగియనున్న పదవీ కాలం ● నేడు ఫొటో ఓటర్ల జాబితా విడుదల చేయనున్న అధికారులు సత్తెనపల్లి: జిల్లాలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తొలుత ఫొటో ఓటర్ల జాబితాలను ప్రకటించడానికి సమాయత్తం అవుతున్నారు. ఫొటో ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. ప్రజల పరిశీలనార్థం ఈ జాబితాలను ప్రకటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2021వ సంవత్సరంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 23న, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24న ముగియనుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని 28 మండలాల్లో 425 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. అంతేగాక మండలానికి ఒకరు చొప్పున 28 మంది ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త జిల్లా పరిషత్లు అమల్లోకి వస్తాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత అధికారులను నియమించే అవకాశం ఉంది. ఉద్యోగుల సమాచారం, వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. జనాభా దామాషా ప్రకారం జెడ్పీకీ సిబ్బందిని కేటాయించనున్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఈ నెల 11న ప్రచురించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు జాబితా లను ప్రజల పరిశీలనార్థం ప్రచురించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధమే అనే రీతిలో యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాత ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తదితర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. తొలగించాల్సిన ఓట్లు ఎలా కొనసాగిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది. జిల్లాలో గ్రామీణ ఓటర్ల జాబితా ప్రచురణకు ఎంపీడీఓలు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని 28 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలవారీగా రూపొందించి, ఓటర్ల ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్కు ముందున్న వివరాల మేరకు ఓటర్ల ముసాయిదా జాబితాను శుక్రవారం జిల్లాలోని 28 మండలాల్లో గల గ్రామాల్లో విడుదల చేయనున్నారు. ప్రజల పరిశీలనార్థం నోటీస్ బోర్డుల్లో అతికించనున్నారు. -
శంకరపురం కొండను పరిశీలించిన అధికారులు
● కొండపై తవ్విన సొరంగాలు పూడ్చివేత ● కొండ చుట్టూ పటిష్ట నిఘా ఏర్పాటు ● ‘‘రంగురాళ్లకు పచ్చవల’’ అనే ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం సమీపంలోని అటవీ భూములను అటవీ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. శంకరపురం కొండలో సొరంగాలు తవ్వి రంగురాళ్ల అక్రమ తరలింపుపై ‘సాక్షి’ దినపత్రిక ఈ నెల 9వ తేదీన ‘‘రంగురాళ్లకు పచ్చవల’’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి ఏవీ నీలకంఠేశ్వరరెడ్డి, డెప్యూటీ రేంజ్ అధికారి డి.రామ్మోహన్రావు శంకరపురం కొండపైకి వెళ్లి రంగురాళ్ల కోసం తవ్విన సొరంగాలు పరిశీలన చేశారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి కొండపై మొత్తం తిరిగి సొరంగాలు గుర్తించారు. రంగురాళ్ల కోసం తవ్విన సొరంగాలను యుద్ధప్రాతిపదికన పొక్లెయిన్తో పూడ్చి వేయించారు. సొరంగాలు ఆనవాలు కన్పించకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం శంకరపురం, భట్రుపాలెం, కాట్రపాడు, మాదినపాడు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. శంకరపురం కొండపైకి వెళితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి నీలకంఠేశ్వరరెడ్డి మాట్లాడుతూ శంకరపురం కొండపై అక్రమంగా తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొండ చుట్టూ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తామని, కొండపైకి రాకపోకలు సాగించేవారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు. శంకరపురం కొండపై తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని, తవ్వకాలు జరిపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటవీశాఖ సిబ్బంది నిరంతరం కొండ చుట్టూ పర్యవేక్షణ చేస్తారని, ఎక్కడికక్కడే చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి కొండపైకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో బీట్ అధికారి షేక్ జానీబాషా తదితరులు పాల్గొన్నారు. -
యడ్లపాడులో భారీ చోరీ
యడ్లపాడు: నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. యడ్లపాడుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ వెళ్లారు. ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.75 లక్షల విలువైన సొత్తు కాజేశారు. మండల కేంద్రమైన యడ్లపాడు మెయిన్ బజార్లో ప్రపత్తి ఆంజనేయస్వామి గుడి సమీపంలోని ఓ నివాసంలో ఈ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పార్వతి నాగలక్ష్మి ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో 8వ తేదీ రాత్రి యడ్లపాడులోని ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించారు. నాగలక్ష్మి గ్రామంలోని బంధువులకు ఫోన్ చేసి ఇంటి వద్దకు పంపించారు. వారు పరిశీలించగా, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించారు. నాగలక్ష్మి హైదరాబాద్ నుంచి గురువారం ఉదయం తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని లాకర్ను కూడా దుండగులు పగులగొట్టారు. అందులో ఉన్న సుమారు 50 సవర్ల బంగారం, 5.4 కిలోల వెండి వస్తువులు, రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో సొత్తు చోరీ కావడంతో పోలీసులు ఘటనను సీరియస్గా తీసుకున్నారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితుల కదలికలకు సంబంధించిన ఆధారాలను గుర్తించే ప్రయత్నం చేశారు. రెక్కీ చేసి మరీ... ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు ఉన్న విషయాన్ని దుండగులు ముందుగానే తెలుసుకున్నారా..? చోరీకి ముందు పగటిపూట ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఎంచుకుని చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, అనుమానితుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. 50 సవర్ల బంగారం, 5.4 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ -
కెనాల్ నీటిని సాగుకు వినియోగిస్తే చర్యలు
ఎన్నెస్పీ సీఈ కె.రమేష్, ఎస్ఈ టి.రమేష్ నకరికల్లు: సాగర్ కాలువల ద్వారా విడుదల చేస్తున్న నీటిని సాగుకు కాకుండా కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలని ఎన్నెస్పీ సీఈ కె.రమేష్ తెలిపారు. మండలంలోని గుంటూరు బ్రాంచికెనాల్, ఒంగోలు బ్రాంచికెనాల్, అద్దంకి బ్రాంచి కెనాల్లో నీటి సరఫరాను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుడి కాలువ ద్వారా 8 టీఎంసీలు నీటిని మొదటి దఫా తీసుకోగా తాగునీటి అవసరాల దృష్ట్యా మరో రెండు టీఎంసీలు అదనంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలోని తాగునీటి చెరువులు నింపేందుకు రెండుసర్కిల్స్లో పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. గుంటూరు బ్రాంచి కెనాల్కు 1400 క్యూసెక్కులు, ఒంగోలు 1800 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచికెనాల్కు 900 క్యూసెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లింగంగుంట్ల సర్కిల్ పరిధిలో 218 చెరువులకు గాను దాదాపు అన్ని నింపడం జరిగిందన్నారు. ఒంగోలు, మార్కాపురం వైపు మరో వారం రోజులు నీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. పెట్రోలింగ్ సిబ్బంది నీటిని నిలుపుదల చేసే వరకు 24 గంటలు పహారా కాస్తారన్నారు. నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు. ఆయన వెంట లింగంగుంట్ల సర్కిల్ ఎస్ఈ తలపల రమేష్, మెయిన్ కెనాల్ ఈఈ రేపూడి మల్లికార్జునరావు, లింగంగుంట్ల డీఈ శ్రీనివాసరావు, మానిటరింగ్ సబ్డివిజన్ డీఈ కె.లింగమూర్తి, డీఈఈ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
1.3 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరు యువకుల అరెస్ట్ చిలకలూరిపేటటౌన్: పట్టణం పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. స్థానిక సుగాలీ కాలనీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మంగళవారం ఎస్ఐ వి.సోమేశ్వరరావు, సిబ్బంది సుగాలి కాలనీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 1.3 కిలోల గంజాయి కలిగిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి.రమేష్ తెలిపారు. బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరిచగా, రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కాలువలో దూకి మహిళ ఆత్మహత్య నకరికల్లు: అనారోగ్యంతో పాటు మతిస్థిమితం లేని మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని దేచవరం పరిధిలోని చిలుకలూరిపేట మేజర్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు... మండలంలోని అడ్డరోడ్డు గ్రామానికి చెందిన తుమ్మా తిరుపతమ్మ (31) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కాగా మతిస్థిమితం కోల్పోయిన తిరుపతమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లింది. ఆమె కోసం వెతకగా బుధవారం చిలకలూరిపేట మేజర్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీసి మృతురాలు తిరుపతమ్మగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రజాకవి కాళోజీకి ఘన నివాళి యడ్లపాడు: ప్రజల సమస్యలను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చిన కాళోజీ.. సామాజిక చైతన్యానికి తన సాహిత్యాన్ని వేదికగా మలిచారని సాహితీ విమర్శకులు డాక్టర్ పీవీ సుబ్బారావు, జనవిజ్ఞాన వేదిక శాఖ ప్రధాన కార్యదర్శి బొంత అజయ్బాబు పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో బుధవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాళోజీ చేసిన విశిష్ట సాహితీ సేవలను, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాన్ని వివరించారు. కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు మాట్లాడారు. తొలుత కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయ ఇన్చార్జి సాతులూరి అచ్చమ్మ, సరోజినీ పాల్గొన్నారు. విద్యుత్శాఖ ఆకస్మిక తనిఖీలు అమృతలూరు(వేమూరు): అక్రమంగా విద్యుత్ వాడుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ బాపట్ల జిల్లా పర్యవేక్షణ ఇంజినీర్ జి.ఆంజనేయులు అన్నారు. ఆంజనేయులు ఆధ్వర్యంలో 60 బృందాలు బుధవారం అమృతలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ మీటర్ల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అధిక లోడు వాడుతున్న, డైరెక్ట్ ట్యాపింగ్ 287 సర్వీసులను గుర్తించి, వారి నుంచి రూ 11,86,500 అపరాధ రుసుము విధించడం జరిగిందని ఆయన తెలిపారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జి.భాస్కరరావు, డీపీఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎం.భాస్కరరావు, డిప్యూటీ ఎగ్జక్యూటివ్ ఇంజినీరు, ఆర్.విజయశ్రీనివాస్, చుండూరు ఆపరేషన్ డిప్యూటీ ఎగ్జక్యూటివ్ ఇంజినీరు, డి.శ్యామ్ సుధాకర్బాబు, అమర్తలూరు అపరేషన్ అసిస్టెంట్ ఇంజినీరు ఎల్.నిరంజన్ సిబ్బంది పాల్గొన్నారు. లీటర్ లిక్విడ్ గంజాయి స్వాధీనం ఇద్దరు పల్నాడు యువకుల అరెస్ట్ ఏలూరు టౌన్: జిల్లాలు దాటి తరలిస్తున్న లిక్విడ్ రూపంలో ఉన్న గంజాయిని పెదపాడు పోలీసులు పట్టుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన తిరుమల సాయి, వెంకట సాయి అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అరకు నుంచి పల్నాడు జిల్లాకు లిక్విడ్ రూపంలో ఉన్న గంజాయి (హాషిష్ ఆయిల్) ఒక బాటిల్లో లీటర్ నింపుకుని తరలిస్తున్నారు. అదే సమయంలో పెదపాడు మండలం కలపర్రు టోల్ప్లాజా వద్ద ఇన్చార్జి ఎస్ఐ వెంకట్ కుమార్ తనిఖీలు చేస్తున్నారు. యువకుల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా లిక్విడ్ రూపంలో ఉన్న గంజాయిని గుర్తించారు. వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లిక్విడ్ గంజాయి విలువ సుమారు 13 లక్షల వరకు ఉంటుందని అంచనా. 14 కేజీల గంజాయి ఒక లీటర్ లిక్విడ్ గంజాయితో సమానమని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో సీఐ రాజశేఖర్, సిబ్బంది కమలాకర్ ఉన్నారు. -
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు ఈపూరు: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు అన్నారు. మండలంలోని ముప్పాళ్లలో బుధవారం క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నీటి లభ్యతను బట్టి పంట ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొనే అపరాలు కందులు, మినుములు, పెసలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని వివరించారు. అర్హులైన రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం ఏపీ ఏఐఎంఎస్ 2.0 పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఆర్.రామారావు పాల్గొన్నారు. రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో రైతులతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రైతులు సాగు చేయనున్న పంటలు, వర్షపాతం నమోదైతే చేపట్టాల్సిన పంటల సాగు తదితర అంశాలపై రైతులతో చర్చించారు. రాబోయే రోజుల్లో సరైన స్థాయిలో వర్షపాతం నమోదై కాలువలకు నీరు వచ్చే పరిస్థితి ఏర్పడితే మొక్కజొన్న పంట సాగు చేస్తామని, తగిన నీటి వసతి లేకపోతే శనగ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతామని రైతులు జిల్లా వ్యవసాయ అధికారికి వివరించారు. ఈ సందర్భంగా రైతులు తాము సాగు చేస్తున్న గడ్డి పంటకు యూరియా అవసరముందని జిల్లా వ్యవసాయ అధికారిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన రైతులకు అవసరమైన యూరియాను తప్పకుండా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్హార్స్’ అవుట్లెట్
తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్హార్స్ గ్రూప్ (టీడీహెచ్) కొంతకాలంగా దేశీయ రిటైల్ మార్కెట్పై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్–65)పై సూర్యాపేట మండలం, రాయన్గూడెం గ్రామంలోని సూర్యాపేట హోటల్–7 ప్రాంగణంలో తమ ఆరవ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. మధ్యాహ్నం జరిగిన ప్రారంభ వేడుకలో తెనాలి డబుల్హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ప్రసాద్ మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రయాణీకులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అవుట్లెట్ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇకపై వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు, 130పైగా రకాలను (ఎస్కేయూ) ఒకేచోట నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. వీటిలో తమ బ్రాండ్కు చెందిన పప్పుధాన్యాలు, ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో పాటు ప్రీమియం చాకెట్లు, టీడీహెచ్ ఫుడ్స్, మిల్లెట్ మార్వెల్ కౌమ, గోపురం బ్రాండ్ల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. విమాన ప్రయాణికులకు విజయవాడ ఎయిర్పోర్టులో, రోడ్డుమార్గాన వెళ్లేవారికి సూర్యాపేట హోటల్–7వద్ద తెనాలి డబుల్ హార్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మోహన్ శ్యాంప్రసాద్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి మేళ్లచెరువు: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు కేంద్రంలోని ఎన్ఎస్పీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బోగం ఏసుబాబు (30) రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఏసుబాబుతో పాటు అతడి బంధువులైన ఏడుకొండలు, ప్రవీణ్ కలిసి మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని ఎన్ఎస్పీ ముక్త్యాల బ్రాంచ్ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏసుబాబు వల విసరగా, అది నీటిలో ఎక్కడో చిక్కుకుంది. ఆ వలను బయటికి తీసేందుకు ఏసుబాబు కాలువలోకి దిగాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయన కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. బుధవారం మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ నవీన్కుమార్ తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం తాడికొండ: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్న్లు, ట్రాన్న్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ అధికారిక వెబ్సైట్ www.apcpdc.in లేదా ఏపీసీపీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్న్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
వైద్య విద్యపై సమస్యల వల
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోవాల్సిన ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీ ప్రారంభ దశలోనే సమస్యల వలయంలో చిక్కుకుంది. కనీస మౌలిక వసతులు లేకుండానే ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం పలకాల్సిన దుస్థితి నెలకొది. అక్టోబర్ 1 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్న తరుణంలో, క్షేత్ర స్థాయి పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. కనీస వసతులు కల్పించకుండానే హడావుడిగా తరగతులు ప్రారంభిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రంగుల మార్పుపైనే కూటమి శ్రద్ధ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన ఈ నిర్మాణ పనులు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా నత్త నడకన సాగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా.. కాలేజీలో తరగతి గదులు, ల్యాబ్ మిగిలినవి అసంపూర్తిఉన్నాయి. పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యార్థుల చదువుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై దష్టి పెట్టని ప్రభుత్వం, కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం వేసిన రంగులను మార్చడంలోనే సమయం వథా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు ఇవీ.. హాస్టల్ సమస్యతో విద్యార్థులకు అభద్రతాభావం కాలేజీల్లో చదువు సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలోని నలుమూలల నుంచీ, ఇతర ప్రాంతాల నుంచీ కామేపల్లి కాలేజీకి వచ్చే విద్యార్థుల బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. వసతి గృహాలు సిద్ధం కాకుండానే తరగతులు ప్రారంభం అంటే, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదంటున్నారు. స్పందించాలని వినతి క్షేత్రస్థాయిలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. కామేపల్లి మెడికల్ కాలేజీలో ల్యాబ్లు, హాస్టళ్లు, ఇతర మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యావర్గాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సెమినార్ రూమ్ ను స్టోర్ రూమ్ గా మార్చారు పరికరాలు అమర్చని హిస్టాలజీ ల్యాబ్ రాష్ట్రంలో వైద్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చాలని, పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను చేరువ చేయాలన్న గొప్ప సంకల్పంతో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ దార్శనికతకు అనుగుణంగా, పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారు. ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని భూసేకరణ నుంచి పనుల ప్రారంభం, నిర్మాణం వరకు ప్రతి దశలోనూ పర్యవేక్షించడంతో, అప్పట్లోనే ఈ కాలేజీ నిర్మాణం 60 శాతానికి పైగా శరవేగంగా పూర్తయింది. -
దళితుల హత్యలను పట్టించుకోని ప్రభుత్వం
గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 25 మంది దళితులను హత్యలు చేసి తగలబెట్టినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం పెదపలకలూరు గ్రామంలో ఇటీవల అమానుషంగా హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టబడిన దావులూరి ప్రసన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావులూరి ప్రసన్నపై ఆగస్టు 13 తేదీన పెట్రోలు పోసి దహనం చేసిన ఘటనలో మరణించిన మాదిగ బిడ్డ ప్రసన్న కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా పాలకుల స్పందన శూన్యమన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపలకలూరూకు చెందిన నిరుపేద టైల్స్ కార్మికుడు దావులూరి ప్రసన్న హత్యతో కలిపి ఇప్పటివరకు ఏకంగా 25 హత్యలు జరిగినా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఈ మారణహోమం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు హత్య బాధాకరమే కానీ ఆ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ప్రకటించినట్టే అదే రీతిలో ప్రసన్న కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో దళితుల తీవ్ర ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదని సువర్ణ రాజు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రావూరి శ్యామ్, ఇంజుమూరి విజయ్కుమార్, తలారి నాని, కేశవరపు దానియేలు, జె.విజయ్, వి.బుజ్జి, ఎన్.రాంబాబు పాల్గొన్నారు.ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు -
చేనేత పింఛన్లకు నిబంధనలు సడలించాలి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులకు కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్లకు విధించిన నిబంధనలను సడలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విన్నవించింది. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కార్యాలయంలో బుధవారం జాయింట్ డైరెక్టర్ రాజారావుకు కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద నుంచి పొందుతున్న కూలి మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో తీసుకుంటున్నట్లుగా ఆధారం చూపాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. నూలు, ఇతర ముడి సరుకులు కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ బిల్లులు సమర్పించాలనే నిబంధనను కూడా తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ వినతులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, పూర్ణచంద్రరావు, మోహనరావు, రామారావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఉదయం 9 గంటల నుంచి దృష్టిదోష నివారణ, గ్రహదోష నివారణ, ఆయురారోగ్య అభివృద్ధి నిమిత్తం సర్వరక్షాకర శ్రీ సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు ఉదయం 8.30 గంటలకు ఆలయానికి చేరుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నెహ్రూనగర్: సాంఘిక సంక్షేమ శాఖ(ఎస్సీ వెల్ఫేర్) జిల్లా ఇన్చార్జిగా డి.దుర్గాబాయి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా అధికారిగా పనిచేస్తున్న హర్షిత 45 రోజుల పాటు హెచ్ఆర్డీ (హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్) ట్రైనింగ్ నిమిత్తం వెళ్లారు. ఆమె స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న దుర్గాబాయిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయపురిసౌత్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం వద్ద జిప్ రైడ్, జిప్ సైక్లింగ్ను కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. వీటిని ఏపీ టూరిజం, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు రూ.16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందజేయగా ఆ వాహనాలను వారు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.1.71 కోట్లతో చేపట్టిన జిప్రైడ్, జిప్ సైక్లింగ్ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురజాల ఆర్డీఓ మురళి, తహసీల్దార్ కిరణ్ కుమార్, టూరిజం డీవీఎం కృష్ణచైతన్య, డీటీఓ నాయుడమ్మ, యూనిట్ మేనేజర్ బ్రహ్మయ్య, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఖాజా మొయిద్దీన్, జెస్టిన్ జోసఫ్, నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమల్ హాసన్ పాల్గొన్నారు. తెనాలి: డివిజన్ సబ్ కలెక్టర్గా సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్. 1992లో జన్మించారు. సివిల్స్ పరీక్షలు రాసి, 259వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఆయన్ను తీసుకున్నారు. శిక్షణ అనంతరం గతేడాది ఏప్రిల్ 28న తిరుపతిలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. తెనాలి సబ్కలెక్టర్గా తొలి పోస్టింగ్ చేపట్టనున్నారు. ప్రస్తుతం కె.శ్రీరమణి ఆర్డీఓగా పనిచేస్తుండగా.. ఆమె స్థానంలో సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. -
పోరాటానికి సహకరించండి
డీఎంహెచ్ఓకు కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగుల వినతినరసరావుపేట: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమ కార్యాచరణకు సహకరించాలని పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ను నాయకులు కోరారు. ఈ మేరకు కార్యాలయంలో బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ ఉద్యమ కార్యాచరణ, ప్రధాన డిమాండ్లు, ప్రస్తుత కార్యక్రమాలు, తదుపరి కార్యాచరణ తదితర అంశాలను డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో రోగులకు అందించే వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సహకారం అందించాలని కోరారు. ఆన్లైన్ రిపోర్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారన్నారు. జేఏసీ కన్వీనర్ శాంతరాజు, చైర్మన్ బి.నాగరాజకుమారి, పి.శివరామకృష్ణ, సతీష్, నాగేంద్ర, నూర్జహాన్, ఎస్.సురేష్, రేడియోగ్రాఫర్ బి.రాజు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
పెన్షన్.. టెన్షన్!
పల్నాడుగురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కొత్తగా పింఛన్ల మంజూరుకు రెండున్నరేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. ఎట్టకేలకు అవకాశం కల్పించారనుకుంటే సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. అర్హులకు చుక్కలు చూపిస్తున్నారు. దరఖాస్తుకు గడువు తక్కువగా ఇచ్చి.. వివిధ సర్టిఫికెట్ల పేరుతో ఆందోళనకు గురిచేస్తున్నారు. పత్రాలు తీసుకువస్తే సర్వర్ డౌన్.. అంటూ బయటకు తరిమేస్తున్నారు. చిన్నపాటి తప్పులు ఉన్నాయని సాకులు చెప్పి మార్చుకుని రావాలని పంపుతున్నారు. పింఛన్కు దరఖాస్తు ప్రక్రియ ఓ ప్రహసనంగా మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7తెనాలి: స్థానిక మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.9 వేలు, గరిష్ఠ ధర రూ.13 వేలు, మోడల్ ధర రూ.10 వేల వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం. ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ పిడుగురాళ్ల రూరల్: హక్కుగా రావాల్సిన పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో వైద్యులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జనరల్ సెక్రటరీ వైకేసీ రంగయ్య మాట్లాడుతూ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. కొత్త పే కమిషన్ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సైకాలజీ, హెల్త్ సర్వీసెస్ పరిధిలోని వైద్యులకు టైమ్ బౌండ్ పే స్కేల్స్ను వర్తింపజేయాలని అన్నారు. వైద్యులకు రావాల్సిన పెండింగ్ డీఏ అరియర్స్ను వెంటనే చెల్లించాలని అన్నారు. అర్హులైన అన్ని విభాగాల్లోని వైద్యులకు నాన్–ప్రాక్టీసింగ్ అలవెన్స్ను అమలు చేయాలని తెలిపారు. సీనియారిటీ ప్రాతిపదికన వైద్యులకు ఎప్పటికప్పుడు సకాలంలో ప్రమోషన్లు కల్పించాలని పేర్కొన్నారు. వైద్యులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సర్వీసు సంబంధిత సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. లేకుంటే తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ బాబు, వైద్యులు సత్యనారాయణ, మనోజ్ రాజ్, భాను ప్రకాష్, త్రినాథ్, విజయలక్ష్మి, దేవసేన, సునీత,రాజేష్, విద్యాసాగర్, విక్టర్ పాల్, వెంకటేష్,సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ధ్రువీకరణ సమస్యలు లబ్ధిదారుల ఆశలను ఆందోళనగా మారుస్తున్నాయి. ఒకవైపు దరఖాస్తులకు గడువు తక్కువగా ఉండటం.. మరోవైపు ఆన్లైన్ ప్రక్రియలో అవరోధాలు ఎదురవుతుండటంతో దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. కొత్త పింఛన్లు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గంటల తరబడి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొత్త పింఛన్ దరఖాస్తుకు ఈ నెల 16వ తేదీనే చివరి గడువుగా నిర్ణయించారు. ఈ కొద్దిరోజుల వ్యవధిలోనే శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు. మిగిలిన అతి కొద్ది రోజుల్లోనైనా దరఖాస్తు చేసుకుందామంటే సర్వర్లు మొరాయిస్తున్నాయి. వయసు మీద పడిన వారు, శారీరక ఇబ్బందులతో ఉన్న దివ్యాంగులు గంటల తరబడి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం వస్తే సాయంత్రం వరకు పని పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సత్తెనపల్లి: జిల్లాలోని అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కొత్త పింఛన్ల ప్రక్రియ నరకప్రాయంగా మారింది. ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించామని ఘనంగా డప్పు కొట్టుకుంటోంది. అయితే క్షేత్రస్థాయిలో సవాలక్ష కొర్రీలతో పేదలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఒకవైపు స్వల్ప గడువు, మరోవైపు సాంకేతికంగా సర్వర్ మొరాయింపు సమస్యలు, ఇంకోవైపు నిర్లక్ష్యంతో అర్హులైన పేదలు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 645 స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో గత రెండు రోజుల్లో కొత్త పింఛన్లకు 2,405 దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘తమ్ముళ్ల’ దోపిడీ.. పింఛన్ దరఖాస్తుకు కావలసిన సదరం, ఆదాయ, కుల ధ్రువీకరణ, ఆధార్ ఐడెంటిఫికేషన్, ఓటర్ కార్డు, ఇతర పత్రాల మంజూరులో అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సర్టిఫికెట్ల మంజూరు పేరుతో కొందరు తెలుగు తమ్ముళ్లు దళారులుగా మారి అందినకాడికి దోచుకుంటున్నారు. క్లిష్ట సమయాన్ని అదునుగా చూసుకుని డబ్బులు ఇస్తేనే పని అవుతుందని తేల్చి చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీ పెట్టించి తిరస్కరింపజేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లిలో దివ్యాంగులు కాని వారికి తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలతో కూడిన సదరం సర్టిఫికెట్లను పెట్టి పింఛన్ మంజూరు చేయిస్తామంటూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కులం సర్టిఫికెట్ దేనికి? పింఛన్ మంజూరు కోసం కూడా కుల ధ్రువీకరణ పత్రం అడుగుతుండడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే పింఛన్కు కులానికి ఏం సంబంధం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంటి పన్నుకు సంబంధించి అసెస్మెంట్ నంబర్ తీసుకురావాలంటున్నారు. అసెస్మెంట్ నంబర్ నమోదు చేస్తేనే ఆన్లైన్లో దరఖాస్తు ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం ఈ అసెస్మెంట్ను తొలగిస్తున్నట్లు తెలిపినా సర్వర్లో మాత్రం ఇంకా అప్డేట్ కాలేదు. దీంతో అసెస్మెంట్ నంబర్తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరెంట్ మీటర్ల షాక్ దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారి వివరాలు సచివాలయంలో నమోదు చేసినప్పుడు వారి పేరున రెండు, మూడు, నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్నట్లు చూపిస్తోంది. నెలకు 300 యూనిట్లు దాటితే పింఛన్లకు అర్హులు కారు. రెండు, మూడు మీటర్లు ఉంటే అంతకుమించి యూనిట్ల వినియోగం జరిగినట్లుగా గుర్తించి అప్లోడ్ చేసే సమయంలో దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇప్పుడవన్నీ సరిచేసుకొని మళ్లీ అప్లోడ్ చేద్దామంటే సమయం లేదు. కేవలం నాలుగు పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మళ్లీ దరఖాస్తు చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయానికి వచ్చాక మీటర్ల విషయం తెలియడంతో చాలామంది ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.జిల్లా సమాచారం మండలాలు : 28 పంచాయతీలు : 525 మున్సిపాలిటీలు : 08 స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు : 645 మొత్తం జనాభా : 20.41 లక్షలు 2024 జూన్ 1 నాటికి పింఛన్లు : 2,80,568 ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య : 2,66,360 రెండున్నరేళ్లలో కోతకు గురైన పింఛన్లు : 14,238 గత రెండు రోజులుగా వచ్చిన దరఖాస్తులు : 2,405 -
న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం
పురుగుమందు డబ్బాతో ఓ రైతు ఆవేదన మాచర్ల: తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని, దీనికి మాచర్ల అధికారులే కారణం అవుతారంటూ మాచర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు శ్రీహరి మాట్లాడుతూ తన పొలంలో గ్రామానికి చెందిన మద్దిగపు శ్రీనివాసరెడ్డి, చిన్న వెంకట్రామిరెడ్డి అక్రమంగా బోర్లు వేశారని ఆరోపించారు. పల్నాడు జాయింట్ కలెక్టర్, గురజాల ఆర్డీవో మురళి, మాచర్ల తహసీల్దార్ కిరణ్కుమార్, మాచర్ల రూరల్ సీఐ, నాగార్జునసాగర్ ఎస్ఐలకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. బోర్లు వేసిన వ్యక్తులను పిలిపించి సమస్య పరిష్కరించకపోతే పురుగుమందు తాగి చనిపోతానని పేర్కొన్నారు. రాజుపాలెం: ప్రకృతి వ్యవసాయంలో అమలు చేస్తున్న పంటల వైవిధ్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్యం పెంపు విధానాలు ఆదర్శంగా నిలుస్తాయని యూకేకు చెందిన గ్రోయింగ్ రియల్ ఫుడ్ ఫర్ న్యూట్రీషన్ సంస్థ కో ఫౌండర్ మాథ్యూ పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు గుర్రాల మల్లికార్జురావు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మాథ్యూ, పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారిలు బుధవారం పరిశీలించారు. క్షేత్రంలో పది రకాల పండ్ల మొక్కలతోపాటు పీఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాథ్యూ.. పొలంలోని నేల పరిస్థితి, వానపాముల ఉనికి, నేలలో సూక్మజీవుల చురుకుదనం, పంటల వైవిధ్యం, ఎరువుల తయారీ తదితర అంశాలను ఆసక్తిగా గమనించారు. ఆరోగ్యకరమైన నేల నుంచే నాణ్యమైన ఆహారం ఉత్పత్తి అవుతుందని పీఎం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యాంకర్ మౌనిక, జూనియర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ శ్రీలేఖ, యంగ్ రీసెర్చ్ ఫెలో దేవిక, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ మాధవి, ఎన్ఎఫ్ఏ సైదయ్య, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలకు రైతులు సిద్ధం కావాలి
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యనరసరావుపేట: వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతులపై పెనుభారం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో బుధవారం రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర విధానాలను ప్రశంసించటం బాధాకరమన్నారు. అమెరికా నుంచి క్వింటా పత్తి రూ.4 వేలకే దిగుమతి అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో సుమారు 26 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గతంలో 25కు పైగా ఉన్న చెరకు కర్మాగారాలలో అనేకం ప్రభుత్వ విధానాలతో మూతపడ్డాయన్నారు. ప్రస్తుతం మూడు మిగిలాయన్నారు. వాస్తవ విరుద్ధంగా సీఎం సూచన అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, రైతులతు దేశంలో ఎక్కడైనా ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఉచిత విద్యుత్ అంశంపై చట్టానికి కూటమి ఎంపీలు మద్దతు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26న దేశ వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పల్నాడును తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించారన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ, సహాయ కార్యదర్శి సీహెచ్ సురేష్ రాజా, రైతు నాయకులు ఎం.నరసింహారావు, ఇ.అప్పిరెడ్డి, ఆర్.ముని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
జిల్లా అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరినరసరావుపేట రూరల్: వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటుకు పోలీసు శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి తెలిపారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం, సరళతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పోలీసు, ఫైర్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అనుమతులు ఒకే చోట పూర్తిగా ఉచితంగా పొందవచ్చని వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలన తరువాత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. అనుమతులు పొందిన క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ ఎన్వోసీని పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మండపం వద్ద కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. మండపాలు ప్రజల రాకపోకలకు, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర సేవలకు ఎలాంటి అటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద తగినంత వెలుతురు, విద్యుత్ భద్రత, అగ్నిమాపక పరికరాలు, మెరుగైన పారిశుద్ధ్యం వంటివి ఉండాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లౌడ్ స్పీకర్లు, డీజేలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిమజ్జనాన్ని అధికారులు గుర్తించిన ప్రాంతాల్లో నిర్వహించి సహకరించాలని కోరారు. -
విద్యుత్ దీపాలకు మరమ్మతులు
వినియోగంలోకి వచ్చిన సెంట్రల్ లైటింగ్నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో విద్యుత్ దీపాలు సక్రమంగా వెలుగక రాత్రి వేళల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై ‘నిర్లక్ష్యపు చీకట్లు’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సెంట్రల్ లైటింగ్ విద్యుత్ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ డీఈ రఫీ పనులను పర్యవేక్షించి మాట్లాడారు. హైఓల్టేజ్ కారణంగా ప్యానల్ బోర్డు దెబ్బతిందన్నారు. సాంకేతికత సమస్య తలెత్తి విద్యుత్ దీపాలు వెలగటం లేదని గుర్తించామన్నారు. మరమ్మతులు చేపట్టి సెంట్రల్ లైటింగ్ను పునరుద్ధరించినట్లు తెలిపారు. పట్టణంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిశీలించి అవసరమైన చోట రిపేర్లు చేసి వీధి దీపాలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. మల్లమ్మ సెంటర్లో సరిపడా విద్యుత్ కాంతి లేకపోవటంతో రాత్రి వేళ్లల్లో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ట్రాఫిక్ సీఐతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని డీఈ తెలిపారు. -
21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేత
లక్ష్మీపురం: కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేయనున్నట్లు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల దేవాలయ భూములను పేద రైతులు సాగు చేస్తున్నారని, వారికి దేవదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇవ్వాలని కోరారు. పంట వచ్చిన తరువాత కౌలు చెల్లంచేందుకు అనుమతినివ్వాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింప చేయాలని, పంట నష్టపరిహారాలు కౌలు రైతులకు కూడా ఇవ్వాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపునకు, నల్లమడ ఆధునికీకరణకు ఒకే సారి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నీలాంబరం, ఏడుకొండలు, మొగిలయ్య, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ -
విజ్ఞాన్కు హెచ్సీఎల్టెక్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్టెక్ ప్రతిష్టాత్మకమైన ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు అందజేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంగళవారం వైస్ చాన్సలర్ కృష్ణకిషోర్కు హెచ్సీఎల్టెక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ విభాగ ప్రతినిధి రాజమురుగన్ అథిముత్తు నాడర్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’కు సంబంధించిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు. హెచ్సీఎల్టెక్ సంస్థ తన ప్రశంసాపత్రంలో సాంకేతిక ప్రతిభావంతుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఇరువర్గాల ఉమ్మడి నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించింది. ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’గా విజ్ఞాన్ యూనివర్సిటీతో కలిసి విద్యా రంగం– పరిశ్రమ మధ్య బలమైన వారధిని నిర్మిస్తున్నామని, విద్యార్థులు తమ నైపుణ్యాలను చాటుకుని వృత్తిపరమైన కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు చీకట్లు
నరసరావుపేట టౌన్: పగలంతా వాహనాల రద్దీ.. రాత్రయితే విద్యుత్ దీపాలు వెలగక అలుముకునే చీకటి.. ఇదీ పల్నాడు జిల్లాలోని అన్ని పట్టణాల్లో పరిస్థితి. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల వంటి పురపాలక సంఘాల్లోని ప్రధాన రహదారులు, కీలక కూడళ్లలో సరిపడా వెలుతురు లేక వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకొని జాతీయ రహదారులు ఉండటంతో రాత్రుళ్లు తిరిగే వాహనాల సంఖ్య ఎక్కువైంది. జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణ నడిబొడ్డున ఉన్న మల్లమ్మ సెంటర్ రాత్రివేళల్లో చిమ్మచీకటిని తలపిస్తోంది. ట్రాఫిక్ సిగ్నళ్లు, డివైడర్లు ఎక్కడున్నాయో వాహనదారులకు సరిగ్గా కనిపించక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగిలిన పట్టణాల్లో ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక అంధకారం నెలకొంటోంది. వాహనదారులకు రహదారి సరిగ్గా కనిపించక తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీధి దీపాల్లో తగ్గిన కాంతి.. పురపాలక సంఘాల్లో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కాంతి ఇవ్వటం లేదు. కాలం గడిచేకొద్దీ వాటి వెలుతురు సామర్థ్యం తగ్గటంతో రహదారులపై ప్రకాశవంతమైన కాంతి కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల విద్యుత్ దీపాలు ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని వాహనదారులు చెబుతున్నారు. వీధిదీపాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ మరమ్మతులతో సరిపెడుతున్నారు. అవసరమైన పలు ప్రాంతాల్లో అదనపు వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చీకటిని ఆసరాగా చేసుకొని దొంగతనాలు చోటుచేసుకునే అవకాశాలూ లేకపోలేదు. అవసరమైన ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసి రాత్రంతా పూర్తిస్థాయిలో వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్, గుంటూరు, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల వైపు నుంచి నరసరావుపేటకు రాకపోకలు సాగించే వాహనాలు నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ మీదుగానే వెళ్లాలి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ కూడలి పట్టణానికి ప్రధాన ప్రవేశ మార్గంగా ఉంది. ఇంతటి ముఖ్య ప్రాంతంలో రాత్రిళ్లు సరైన వెలుతురు లేకపోవడం పట్ల వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లమ్మ సెంటర్ మధ్యలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లను ఇప్పటికే పలుమార్లు భారీ వాహనాలు ఢీకొన్న ఘటనలు ఉన్నాయి. రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్లను సైతం వాహనాలు ఢీకొంటున్నాయి. వీటన్నింటికీ అక్కడ సరైన వెలుతురు లేకపోవటమే కారణం. -
పర్యాటకాభివృద్ధికి చర్యలు
విజయపురి సౌత్: మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని తీసుకురానుంది. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైన ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించేందుకు నిత్యం పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో సరికొత్త థ్రిల్, వినోదం, అడ్వెంచర్ అనుభూతిని అందించేందుకు జిప్లైన్, జిప్ సైక్లింగ్ కార్యకలాపాలను ఏపీటీడీసీ టూరిజం యూనిట్ ఎత్తిపోతల జలపాతం వద్ద ఏర్పాటు చేసింది. రైన్బో ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో పర్యాటకశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ అడ్వెంచర్ కార్యకలాపాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఎత్తిపోతలను మరింత ఆకర్షణీయమైన అడ్వెంచర్, ఫ్యామిలీ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయడంలో కీలకంగా మారనున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులకు మరింత ఆనందంగా గడిపే అవకాశం లభించనుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రగతికి ఊతం ఎత్తిపోతలలో ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయం, శ్రీరంగనాథ స్వామి దేవాలయాలు ఆధ్యాత్మికతతో వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటికే ఎత్తిపోతల జలపాతం ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రారంభం కానున్న అడ్వెంచర్ కార్యకలాపాలతో పర్యాటకులు మరింత ఎక్కువ సమయం గడిపే అవకాశం ఏర్పడనుంది. భద్రతకు ప్రాధాన్యం ఎత్తిపోతల జలపాతానికి వచ్చే ప్రతి పర్యాటకుడికి ఒక ప్రత్యేకమైన, సురక్షితమైన, మరుపురాని అనుభూతిని అందించాలన్నదే లక్ష్యమని రైన్బో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పరికరాలు, నిర్మాణాలు, భద్రతా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలతో కలిసి రూ.1.71 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనుందన్నారు. హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, పర్యాటక ఆధారిత కార్యకలాపాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. -
వైద్య కళాశాలలో అత్యాధునిక ఎక్స్రే యూనిట్ ప్రారంభం
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ వైద్య రంగం ద్వారా చేరువ చేయడమే తమ ప్రధాన ధ్యేయమని పిడుగురాళ్ల మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌరి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ బాబు, అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి గ్రామంలోనే మెడికల్ వైద్య, కళాశాలలో అత్యాధునిక ఎక్స్–రే యూనిట్ను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అత్యాధునిక ఎక్స్–రే యూనిట్ అందుబాటులోకి రావడం వల్ల ఎముకల పగుళ్లు, ఛాతీ ఇన్ఫెక్షన్లు, ఇతర ప్రాథమిక ఆరోగ్య సమస్యలను తక్షణమే, ఖచ్ఛితంగా నిర్ధారించడం వీలవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు. రేడియాలజీ ఇన్చార్జి డాక్టర్ సౌజన్య, ఆర్థోపెడిక్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జోత్స్న, వైద్య సిబ్బంది, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు -
గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రత ముఖ్యం
నరసరావుపేట: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తితో పూజిద్దాం.. భద్రతతో పండుగ జరుపుకొందామని ప్రతి ఒక్కరూ భావించాలని పిలుపునిచ్చారు. మండపాల్లో విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్లు, ప్లగ్లు మాత్రమే వినియోగించాలని తెలిపారు. మండపాలకు అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలుగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు తెలిపారు. 500 వాట్లకు రూ.వెయ్యి, వెయ్యి వాట్లకు రూ.2,250 చొప్పున రుసుం ఉంటుందని ఆయన వెల్లడించారు. మండపాల నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధంగా విద్యుత్ను వినియోగించరాదని సీఎండీ హెచ్చరించారు. అనధికారిక కనెక్షన్లు తీసుకోవడం లేదా అక్రమంగా విద్యుత్ వినియోగించడం నేరమని తెలిపారు. అలాంటివి గుర్తిస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
పట్టా రైతులకు బ్యాంకు రుణాలు అందించండి
డీఎల్ఆర్సీ సమావేశంలో కలెక్టర్ నరసరావుపేట: కౌలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా రైతులకు సత్వరమే బ్యాంకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం డీసీసీ, డీఎల్ఆర్సీ జూన్ క్వార్టర్ సమావేశం నిర్వహించారు. దీనికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రధాన మంత్రి సురక్షిత భీమా యోజన (పీఎంఎస్బీవై) గురించి జిల్లాలోని ప్రజలకు అవగాహన కోసం బ్రాంచ్లలో పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వివిధ సబ్సిడీ పథకాలపై కనీసం నెలకు రెండు రుణ మేళాలు నిర్వహించాలన్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు రుణాలు అందించే విధంగా చూడాలని బ్యాంకర్లను కోరారు. ఈ ఏడాది జూన్ వరకు జరిగిన ప్రాధాన్యత, ఇతర రంగాల రుణ వితరణపై సమీక్షించారు. సాగు రంగానికి రూ.17,761 కోట్ల వార్షిక లక్ష్యానికిగాను జూన్ క్వార్టర్ నాటికి రూ.5,927.84 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.3,112 కోట్లకు గాను రూ.1,445 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ.21,490 కోట్లకు రూ.7,445 కోట్లు, ఏసీపీకి రూ.25,879 కోట్లకు రూ.9,086 కోట్లు లక్ష్యం సాధించినట్లు పేర్కొన్నారు. ఎల్డీఎం కేఎస్ రామ్ప్రసాద్, కన్వీనర్ డి.లక్ష్మీనారాయణ, యూబీఐ రీజినల్ హెడ్, నాబార్డు డీడీఎం శరత్, ఆర్బీఐ ఎల్డీఓ రామకృష్ణ, బ్యాంక్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
చెరువు భూముల్లో కబ్జాపర్వం
నరసరావుపేట: నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని వారం క్రితం నలుగురు కార్యకర్తలు సత్తెనపల్లి రోడ్డులోని సుమారు 37 ఎకరాల విస్తీర్ణంలోని కత్తవ చెరువులో కొంతభాగం ఆక్రమణలకు పాల్పడ్డారు. ఒకటవ వార్డులోని చెరువుకు ఉత్తరం వైపున సుమారు 12 సెంట్ల స్థలంలో మట్టిపోసి చదును చేశాక రేకుల షెడ్లు వేశారు. అధికారులు అటు వాటివైపు చూడకుండా ఆ షెడ్ల ముందు విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ ఫొటోలతో ఉన్న టీడీపీ జెండాలు పాతారు. సాయినగర్కు చెందిన శ్రీనివాస్, ఓ రేషన్డీలర్తో పాటు మరో ఇద్దరు టీడీపీ వర్గీయులు ఈ ఆక్రమణలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వారికి సమీపంలోని రేషన్ డీలర్ వృద్ధాశ్రమానికి స్థలం ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. నిధులు మంజూరు రెండు నెలల క్రితం కత్తవ చెరువును సుందరీకరణ చేసేందుకు అమృత్ పథకం కింద ఏపీ అర్బన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) సంస్థ రూ.5.50 కోట్లతో పనులు మొదలు పెట్టారు. ప్రొక్లయినర్తో చెరువులోని పిచ్చిమొక్కలు తలగించారు. సుమారు వందేళ్ల క్రితం ఈ చెరువు ఆవిష్కృతమైంది. పట్టణంలోని కత్తవ కాలువ గుండా వచ్చే నీరు అందులో చేరేది. దానికింద ఆయకట్టు కూడా ఉంది. చాలామంది రైతులు తమ పొలాల్లో పశువుల గడ్డిని పెంచుతున్నారు. కొన్నేళ్లుగా చెరువు కట్టలు అదృశ్యమై ఆక్రమణలకు నిలయంగా మారింది. సత్తెనపల్లిరోడ్డులో ఆ వైపున ఉన్న చెరువు కట్టను తొలచి లోపలికి ఆక్రమించుకుంటూ అనేక షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మాణాలు చేశారు. జిల్లా కేంద్రమైన తర్వాత పట్టణంలో ఏ మూల చూసినా సెంటు స్థలం రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు పలుకుతోంది. దీంతో అక్రమార్కుల దృష్టి ఈ చెరువుపై పడింది. అధికార బలాన్ని ఉపయోగించి అప్పనంగా ఆక్రమించుకొని కొన్నిరోజుల పాటు తమ కిందే ఉంచుకొని వాటిని ఎంతోకొంతకు అమ్ముకుంటూ లాభ పడు తున్నారు. -
రేషన్ మాఫియాలో అంతర్గత పోరు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం అంతర్గత పోరుకు దారి తీసింది. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మరో రేషన్ మాఫియా అడ్డుకొని దాడికి పాల్పడింది. వారి నుంచి డ్రైవర్ తప్పించుకునే క్రమంలో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టటం కలకలంరేపింది. సంఘటనలో గాయపడ్డ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అక్రమ రేషన్ మాఫియా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాలు ప్రకారం.. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు సోమవారం నరసరావుపేటలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి వాహనంలో అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన రేషన్ మాఫియా సభ్యులు నాలుగు మోటార్ సైకిళ్ల పై కోట సెంటర్ వద్దకు చేరుకొని వాహనాన్ని వెంబడించారు. ఒక చోట వాహనాన్ని అడ్డగించి డ్రైవర్పై దాడికి యత్నించినట్లు తెలిసింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ ఇరువురు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టాడు. అనంతరం వాహనం వేగంగా నడుపుకుంటు అక్రమ రేషన్ బియ్యంతో డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటన మొత్తం స్థానిక సీసీ కెమెరాలలో నిక్షిప్తమైంది. అక్రమ రేషన్ వాహనాన్ని అడ్డుకోవటంతో మొదలైన వ్యవహారం పల్నాడు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, తరలింపుల వెనుక ఉన్న వర్గాల మధ్య అంతర్గత పోరును బయటపెట్టింది. పేదలకు అందాల్సిన బియ్యం ప్రతినెలా యథేచ్చగా అక్రమంగా తరలి వెళ్తుతుందనటానికి ఈ సంఘటన అద్దం పడుతుంది. అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి విచారణ చేపట్టితే రేషన్ మాఫియా అక్రమాలు బయటపడతాయి. ఈ వ్యవహారం బహిర్గతం కావటంతో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతొంది. కాగా రేషన్ అక్రమ రవాణాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
పరిశ్రమల ఏర్పాటుకు సౌకర్యాలు కల్పిస్తాం
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అవసరమైన సౌకర్యాలను కల్పించి ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ స్లోగన్తో ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ మంగళవారం కాసు సెంట్రల్లో నిర్వహించారు. తొలుత శివశంకరరావు, మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాతో కలిసి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్పత్తి, మార్కెటింగ్, రుణ సౌకర్యాలు, డిజిటల్ ఆధారిత సేవల వినియోగం వంటి అంశాల మధ్య సమన్వయం సాధించేందుకు, సులభతరంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్నింటిని ఒకే వేదిక మీదకు తీసుకు వస్తున్నట్లుగా చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన పరిశ్రమలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను పల్నాడు జిల్లా యంత్రాంగం అందిస్తుందని తెలియజేశారు. నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన వివిధ అంశాలపై పరిజ్ఞానం అందించేందుకు ప్రత్యేక సెమినార్లు, హెల్ప్ డెస్క్, స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిని ముఖ్యఅతిధులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. జిల్లా పరిశ్రమల అధికారి వెంకట సురేష్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ డాక్టర్ గుడిపూడి చిన్నరాజు, సీఈఓ విశ్వ మనోహర్ పాల్గొన్నారు. ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు -
రిజిస్ట్రేషన్ రద్దుతో కథ కంచికేనా?
యడ్లపాడు: పట్టణ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన మున్సిపల్ రిజర్వు స్థలానికి సంబంధించి సాగిన రిజిస్ట్రేషన్ వ్యవహారం చివరకు రద్దుతో ముగిసింది. అయితే రిజిస్ట్రేషన్లు రద్దయినంత మాత్రాన అసలు ప్రశ్నలు మాత్రం సమసిపోలేదు. ప్రభుత్వ స్థలానికి ప్రైవేటు సంస్థ పేరుతో పన్ను రశీదు ఎలా జారీ అయింది? సర్వే నంబర్ మార్పుతో ఎండార్స్మెంట్ ఎవరి ఆదేశాలతో వచ్చింది? ఆ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లకు మార్గం ఎవరు సుగమం చేశారు? అనేది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్తో వెలుగులోకి... స్థానిక ఫైర్స్టేషన్ రోడ్డులోని హెచ్.హెచ్. డైక్మెన్ నగర్లో ఉన్న 27 సెంట్ల మున్సిపల్ రిజర్వు స్థలంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఆ స్థలంలో ఎన్నో ఏళ్లుగా ఏఎంజీ డేకేర్ సెంటర్ ఏర్పాటుతో అనేక సేవలు అందించింది. ఆ సేవలు నిలిచిపోయాక సదరు స్థలాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న ఏడుగురి పేర్లతో దాన దస్తావేజుల ద్వారా రిజిస్టర్ చేసినట్లు రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అధికారపార్టీ నేతలు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ‘‘ప్రజా ఆస్తి.. ‘పచ్చ’నేతల పరం’’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పట్టణంలోని కీలక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పేర్లకు బదలాయింపునకు దస్తావేజులు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. వివాదం ముదరడంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సోమవారం రాత్రి చిలకలూరిపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని దాన దస్తావేజులను రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థలం మున్సిపాలిటీదే...! ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును వివరణ కోరగా.. సర్వే నంబర్ 88/1లో ఉన్న స్థలం వివాదంలోకి రాగానే సదరు స్థలం తమ శాఖదేనని అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారు వాటిని స్వచ్ఛందంగా సోమవారం రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇక స్థలంపై ఎలాంటి వివాదం లేదని, పూర్తిగా తమ స్వాధీనంలో ఉందని వెల్లడించారు. -
గంజాయి తాగి, విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు తెనాలిరూరల్: గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను డీఎస్పీ బి.జనార్ధనరావు వెల్లడించారు. నందివెలుగు జంక్షన్ వద్ద బ్రిడ్జి కింద గంజాయి విక్రయాలు, తాగుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం సాయంత్రం తెనాలి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, డెప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, వీఆర్వోలు గుంపెన నాగరాజు, కొత్త జార్జి థామస్ సమక్షంలో దాడులు చేశారు. అబ్దుల్ కరీమ్(కొల్లిపర), అమిరె ఆనంద్ కిషోర్ అలియాస్ చోటు(కొల్లిపర), షేక్ సాధిక్(తెనాలి), కోలా రత్నరాజు(తెనాలి), దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లూ(తెనాలి), బత్తెన అజయ్కుమార్(తెనాలి), రెడ్డి సాయికుమార్(తెనాలి) గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా గంజాయిని గుంటూరుకు చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీరి సమాచారంతో మంగళవారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో దాడి చేసి ప్రధాన సప్లయర్లుగా పేర్కొన్న ఆరేటి నవీన్న్, షేక్ షఫీలను అరెస్టు చేశారు. తెనాలి ప్రాంతానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా లింక్ను ఛేదించారు. అరెస్టయిన వారిలో పలువురిపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కొందరిపై దొంగతనాలు, ఎన్న్డీపీఎస్ కేసులు ఉండగా, షేక్ షఫీపై ఎన్న్డీపీఎస్, ఆయుధాల చట్టం, హత్య, దాడి తదితర కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచగా రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్తో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్ధనరావు అభినందించారు. సమావేశంలో తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఇరువురికి తీవ్ర గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని అచ్చంపేటరోడ్లో పట్టణ శివారులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ఆదిమూలపు దివ్య, భర్త రాంబాబు ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన షేక్ సిద్ధిక్ స్కూటీపై పాకాలపాడు వైపు వెళుతుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆదిమూలపు దివ్య(35) తలకు బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. భర్త ఆదిమూలపు రాంబాబుకు తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అలాగే షేక్ సిద్ధిక్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఇరువురు క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సిద్ధిక్కు 15 కుట్లు పడగా పరిస్థితి విషమంగా మారింది.పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్ బస్లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్ బస్ల డిపోల ఏర్పాటు పేరుతో మూసివేసిన అలిపిరి, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు– 2, గుంటూరు– 2, విద్యాధరపురం డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణికుల దృష్ట్యా బస్లు, సిబ్బందిని పెంపొందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. మూతపడిన డిపోలను వెంటనే పునః ప్రారంభించాలని అన్నారు. శిబిరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు, ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు కె.గంగాధర్రావు, జె.నాంచారయ్య, కె.పాములు మద్దతు ప్రకటించగా, ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎంవీఎస్.రామకృష్ణ, కార్యకర్తలు వి.మధుసూదన్రావు, సిహెచ్.శ్రీను, టి.శ్రీను, రవిచంద్, జయశ్రీ, బి.రామాంజనేయులు, ఎల్.వి.ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: పన్నులు చెల్లించకుండా రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి, నిర్బంధంలో ఉన్న వాహనాలు ఈనెల 26 వేలం నిర్వహించనున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయ ఆవరణలోని 33, తెనాలి కార్యాలయంలోని 33 వాహనాలు (హెచ్జీవీలు, ఎంజీవీలు, ఎల్జీవీలు, మోటార్ సైకిల్స్, మోటార్కార్, మ్యాక్సిక్యాబ్లు) ఈ వేలంలో విక్రయిస్తామని తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు చెల్లించాల్సిన పన్నులు, అపరాధ రుసుం ఈనెల 25లోగా చెల్లించాలని అన్నారు. లేనిచో ఈనెల 26 మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు డీటీఓ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ఈ
సత్తెనపల్లి: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే లక్కరాజుగార్లపాడు రోడ్లోని చెరువును ఇరిగేషన్ ఎస్ఈ టీ రమేష్ మంగళవారం పరిశీలించారు. కాలువల నుంచి విడుదలైన నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును ఆయన పరిశీలించి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఇరిగేషన్ ఈఈ మురళీధర్, ఏఈ సుందర్రావు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బి.మధుసూదనరావు, ఏఈ సాగర్మరియరాజు, సిబ్బంది ఉన్నారు. గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న రెండు నెలలపాటు తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత, ఉత్పత్తుల తయారీ వంటి కోర్సులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సదుపాయం కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఐపాడ్ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీగా నిర్ణయించారన్నారు. ఆసక్తి కలిగినవారు మరిన్ని వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్ను గానీ, 70366 89346, 91822 45693 ఫోన్ నంబర్లనుగానీ ఉదయం 9–సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించాలన్నారు. గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఆగస్టు 21 వ తేదీ నుంచి పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జీజీహెచ్లో నల్లమాస్క్లు ధరించి నిరసన తెలియజేశారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలన్నారు. బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు రమాదేవి, సుజిత, హైమావతి, శైలజ, భార్గవి, అంజలి, ల్యాబ్ టెక్నీషియన్లు ఖాసీం, రమేష్, వాణి, ఆదిలక్ష్మి, శైలజ, ఫార్మాసిస్టులు శ్రీలక్ష్మి, సుజాత, అశ్విని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లీగల్: అక్షరాలు జీవితాన్ని మార్చగలవని, చదువుకున్న సమాజం దేశ భవిష్యత్తును మార్చగలదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం కాదన్నారు. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవడం అన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఒకరినైనా అక్షరాస్యులుగా మార్చేందుకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఎం.వెంకట రమణప్ప, జిల్లా బాలల పరిరక్షణ సంస్థ అధికారి సీహెచ్ విజయ్కుమార్, డీపీఓ పి.వి.నాగసాయికుమార్, సోషల్ వెల్ఫేర్ శాఖ సూపరింటెండెంట్ కె.మధుసూదన్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎ.పద్మావతి, ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
నరసరావుపేట: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చిలకలూరిపేట పురుషోత్తంపట్నం జంక్షన్ వద్ద గత నెలలో జరిగిన ఆటో ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతిచెందడం, ఆరుగురు గాయపడిన సంఘటనపై ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, పోలీస్ , చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల పరిస్థితి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, హాట్స్పాట్, బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు, రహదారి భద్రత ప్రమాణాలపై సమీక్షించారు. చిలకలూరిపేట హైవేపై ఐదు హాట్ స్పాట్లు, నాలుగు బ్లాక్ హోల్స్ను గుర్తించినట్లు కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. పురుషోత్తం పట్నం జంక్షన్, ఎన్ఆర్టీ జంక్షన్ల వద్ద రోడ్లపై ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని, ట్రాఫిక్ డివైడర్ల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కూడా తొలగించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి వాటిని తొలగించాల్సిందిగా చిలకలూరిపేట ఆర్డీవోని కలెక్టర్ ఆదేశించారు. పురుషోత్తంపట్నం, ఎన్ఆర్టీ, విజయ బ్యాంక్, ఏఎంజీ సెంటర్లు, బస్స్టాండుల వద్ద లైట్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పురుషోత్తంపట్నం యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. జిల్లా ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్, అదనపు ఎస్పీ -
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గ్రీన్ వాక్
గుంటూరు మెడికల్: స్వచ్ఛ వాయువు దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు నగరంలో గ్రీన్ వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుజ్జనగుండ్ల వరకు గ్రీన్వాక్ నిర్వహించారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు గ్రీన్వాక్లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ, వాయువు కాలుష్య నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్వాక్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హారం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిపిన వేసిన సమయంలో ఇంజన్లను ఆన్లైన్లో ఉంచకుండా ఆఫ్ చేసి ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం అన్నారు. వాహనాల ఇంజిన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆఫ్ చయడం వల్ల వాయువు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలన్నారు. కాలుష్య నియంత్రణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వాహనదారులు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే స్వచ్ఛమైన గాలి లక్ష్యాన్ని సాధించగలమన్నారు. విజయపురిసౌత్/నరసరావుపేట: జలవనరుల శాఖ ఫుల్ అడిషనల్ ఎస్ఈగా టి.రమేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎస్ఈగా పనిచేసిన వెంకటరత్నం గుంటూరుకు బదిలీ కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈఈ గా విధులు నిర్వర్తిస్తున్న టి రమేష్ అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన టి రమేష్ను ఇరిగేషన్ ఈఈ లు, డీఈలు, జేఈలు, ఉద్యోగులు అభినందించారు. మ్యూజికల్ నైట్కు హాజరుకానున్న దర్శకుడు బోయపాటి ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 5కె రన్, వాక్ నిర్వహించనున్నారు. అందుకుగాను వర్సిటీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు కలిపి సుమారు 6 వేల మంది ఉత్సాహంగా పాల్గొననున్నారు. క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు నుంచి ప్రారంభమయ్యే 5కే రన్–వాక్ క్యాంటీన, రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్ మీదుగా సాగుతుంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ జరిగే మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. అలానే పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం సంగీత విభావరి అందించనున్నారు. పాటలు, నృత్యాలతో పాటు వర్సిటీ విద్యార్థుల కళా ప్రదర్శనలు అలరించనున్నాయి. ప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ కారు అగ్నికి ఆహుతైన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ప్రత్తిపాడుకు చెందిన చేరెడ్డి శ్రీనివాసరరావు తన కుమార్తెను హైదరాబాద్కు చెందిన పుసులూరి దిలీప్కు ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు పాఠశాల సెలవులు కావడంతో కుమార్తె ప్రత్తిపాడుకు వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అల్లుడు తన టయోటా కారును ఇంటి వద్ద నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతై పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన కారును ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిరకాల స్వప్నం సాకారం
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కతమైంది. దశాబ్దాలుగా వైద్య విద్యకు అందనంత దూరంగా ఉన్న ఈ ప్రాంతవాసుల చిరకాల స్వప్నం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గురజాల నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిల కృషితో నేడు వాస్తవరూపం దాల్చింది. పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల పర్వం అధికారికంగా ప్రారంభమైంది. వైఎస్ జగన్ కృషితోనే సాకారం వైద్య సేవల కోసం, వైద్య విద్య కోసం పల్నాడు ప్రజలు గుంటూరు, విజయవాడ, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం, హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పల్నాడు ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిడుగురాళ్ల మండలం, కామేపల్లి గ్రామంలో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ సాధనలో అప్పటి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. కామేపల్లిలో కాలేజీ ఏర్పాటు కోసం భూసేకరణ నుంచి ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు వరకు ప్రతి అడుగులోనూ ఆయన పట్టుదలగా శ్రమించారు. స్థానికంగా భవన నిర్మాణాలు వేగవంతం కావడంలోనూ, ఈ ప్రాజెక్ట్ను పల్నాడు గడ్డపై సాకారం చేయడంలోనూ ఆయన చూపిన నాయకత్వ పటిమ మరువలేనిది. ముగిసిన కౌన్సెలింగ్ జాతీయ వైద్య కమిషన్ అనుమతులతో కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కౌన్సెలింగ్ ద్వారా తొలి విడతలో భాగంగా 22 మంది విద్యార్థులు పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలు పొందారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్ పొందడం ద్వారా వినుకొండ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఎస్.సన్నీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వెనుకబడిన ప్రాంతంగా పేరున్న పల్నాడు గడ్డపైనే స్థానికంగా వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కడంతో విద్యార్థిని కుటుంబంలోనూ, పల్నాడు ప్రాంతంలోను హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
నిత్యావసర ధరల పెరుగుదలను అరికట్టాలి
పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఐద్వా జిల్లా కమిటీ నిరసన నరసరావుపేట: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. కందిపప్పు, పంచదార, బియ్యం, ఉల్లిపాయలు, వంట నూనెల ధరలు పెరగడంతో కుటుంబాలపై ఆర్థిక భారం అధికమైందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో ప్రజలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని, కుటుంబ పోషణతో పాటు డ్వాక్రా రుణాలు, ఇతర అప్పులు తీర్చలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్పై పన్నుల భారాన్ని తగ్గించాలని, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందించి పాత రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్.దుర్గాబాయి, జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఆయేషా, పాల్గొన్నారు. -
పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం
నరసరావుపేట రూరల్: రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో జిల్లా హోంగార్డ్ ఆర్ఐ(అడ్మిన్) ఎస్.కృష్ణ కాంస్య పతకం సాధించారు. ఈనెల 1నుంచి 4వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో కృష్ణ ప్రతిభ కనభర్చి ద్వితీయస్ధానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పతకం సాధించిన ఆర్ఐ కృష్ణను అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనభర్చి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరుకు తీసుకువచ్చారని ప్రశంసించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నరసరావుపేట: చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన వ్యక్తి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఏడుగురి పేరుపై ఉన్న ప్రభుత్వం భూమిని ఆక్రమించి రూ.10కోట్లకు విక్రయించారని పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు, జనతా వారధి జిల్లా కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ కె.అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని, మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇంటి పన్ను వేయించి చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసి సర్వే నెంబరు 138/1 ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించారన్నారు. కొన్నవారు మరల అమ్మకానికి చూపగా అది ప్రభుత్వ భూమి అంటూ అందులో ఉన్న భవనాలు పడేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అందరిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వృద్ధురాలికి ప్రజాసంఘాల నాయకుల పరామర్శ చీరాల: వృద్ధురాలిపై టూటౌన్ సీఐ శశికుమార్ దురుసుగా ప్రవర్తించి అసభ్యపదజాలంతో దూషించిన ఘటనపై ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు, ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. సోమవారం ఆమె ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ.. వృద్ధురాలిని అసభ్యంగా దూషించిన సీఐపై చర్యలు తీసుకోకుంటే ప్రజాసంఘాలతో కలిసి దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. ఈ ఘటనతో వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురైందని, పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత ఆందోళనకరమన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే సంయమనం పాటించకుండా దూషణలకు దిగడం సరికాదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు చట్టాలకు అతీతులు కారని, టూటౌన్ సీఐపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.మోహన్కుమార్ ధర్మా, బలహీనవర్గాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శవనం శామ్యూల్, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు బి.లక్ష్మీనరసయ్య, డి.వందనం, వైహెచ్పిఎస్ నాయకులు మొగిలి ప్రతాప్, కె.ఉమాదేవి, మొగిలి శబరి, బ్రహ్మయ్య, పి.పోలయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీలు సత్వరం పరిష్కరించాలి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ రోహిహిత్ కుమార్ చౌదరి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పీజీఆర్ఎస్లో రోహిత్ కుమార్ చౌదరి పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదరింపులు, ఆక్రమణలు వంటి అంశాలకు సంబంధించిన 82 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. క్షేత స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఆదేశించారు. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్కుమార్ గుంటూరులో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్, జూదాలకు అలవాటుపడి డబ్బును దుర్వినియోగం చేశాడు. ఆర్థిక నష్టాలు భరించాలని బెదిరిస్తున్నాడు. 2025లో రూ.30 లక్షలు ఇచ్చానని, మిగిలిన ఆస్తి కోసం కుమారుడు, కొడలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. –చీమకుర్తి సుబ్రహ్మణ్యం, పిడుగురాళ -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారులతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అధ్యక్షత వహించి 115 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా 24 అర్జీలు స్వీకరించగా వాటిలో గురజాల డివిజన్కు చెందిన నాలుగు అర్జీలు, సత్తెనపల్లి –10, నరసరావుపేట డివిజన్కు చెందినవి 10 ఉన్నాయి. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ అందించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అర్జీ పెట్టిన వెంటనే ట్రై సైకిల్.. స్థానిక లింగంగుంట్లకు చెందిన దివ్యాంగుడు రమేష్ తనకు ట్రై సైకిల్ మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించారు. రమేష్ నుంచి కలెక్టర్ స్వయంగా అర్జీని స్వీకరించి, వెంటనే సంబంధిత శాఖ అధికారుల ద్వారా ట్రై సైకిల్ను రమేష్కు అందజేశారు. జేసీ సంజనా సింహ, డీఆర్ఓ అద్దెయ్య, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
నరసరావుపేట టౌన్: పార్క్ చేసిన ద్విచక్రవాహనాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. సోమవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహన చోరీలు అధికమయ్యాయన్నారు. దీంతో దొంగతనాల నివారణ కోసం వన్టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణాలు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆదివారం సాయంత్రం మొదటి రైల్వే గేటు వద్ద తనిఖీలు చేస్తుండగా నూజెండ్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన యన్నాబత్తుని మణికంఠ ద్విచక్రవాహనంపై అనుమానస్పదంగా సంచరిస్తున్నాడన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ద్విచక్రవాహన చోరీల వ్యవహారం వెలుగు చూసిందన్నారు. అత్యంత చాకచక్యంగా పది రోజలు వ్యవధిలోనే దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. పలు ప్రాంతాల్లో 22 ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించటంతో దొంగలించబడ్డ వాహనాలను నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. వన్టౌన్లో 12, టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు మొత్తం 13 బైక్ చోరీ కేసుల్లో మణికంఠ నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో నేరాలు చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుడు రిమాండ్కు వెళ్లిన తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తామన్నారు. నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ కనపరిచిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిను అభినందించారు. వారికి రివార్డు ప్రకటించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. 16 వాహనాలు స్వాధీనం బొల్లాపల్లి : ద్విచక్ర వాహనాల అపహరణకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వినుకొండ రూరల్ సీఐ బి బ్రహ్మయ్య తెలిపారు. బండ్లమోటు పోలీస్స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. మండలంలోని పేరూరుపాడు పంచాయతీ కేశవానిపేట తండాకు చెందిన వడితే సర్తార్ నాయక్, కదలికలపై అనుమానంతో నిఘా ఉంచామని, నిందితుడిని సోమవారం సరికొండపాలెం తండా వద్ద అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల పరిధిలో వరుసగా మోటార్ బైకులు చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. సుమారు రూ.11 లక్షల విలువచేసే, 16 ద్విచక్ర వాహనాలను నిందితుని వద్ద స్వాధీనపరచుకుని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. నిందితుడిపై బండ్లమోటు స్టేషన్లో 11 కేసులు, దొనకొండ, తిరుమల 2వ పట్టణ, మాచర్ల పట్టణం, శావల్యాపురం పోలీస్స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైందని వివరించారు. నిందితుడిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకోని వాహనాలు స్వాధీనపరచుకోవడంలో ప్రతిభ కనబరచిన బండ్లమోటు ఎస్ఐ సయ్యద్ షమీర్ బాషా, హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్, కానిస్టేబుల్లు ఇమ్రాన్ ఖాన్, కృష్ణమోహన్, సుమన్, గంగిరెడ్డి, లక్ష్మయ్యలను ఉన్నతాధికారులు అభినందించారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
రాజుపాలెం: పంట వైవిధ్యంతో ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతుకు ఆరోగ్యం, ఆదాయంతోపాటు ఆనందం లభిస్తుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. మండలంలోని రాజుపాలెం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు గల్లా ప్రసాద్, గుర్రాల మల్లికార్జున్ల పొలాలను ఆమె సోమవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మూడేళ్లుగా ఖరీఫ్కు ముందు పీఎండీఎస్ విధానంలో వివిధ రకాల విత్తనాలను సాగుచేస్తున్నట్లు తెలిపారు. రబీ అనంతరం డ్రైసోయింగ్ చేయడం వలన నేలలో సూక్మజీవుల చైతన్యం పెరిగి భూసారం పెరుగుతుందన్నారు. గల్లా ప్రసాద్ ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని, పొలంలోనే అన్ని వసతులతో కూడిన నివాసం ఏర్పాటు చేసుకుని కుటుంబసభ్యులంతా కలసి ప్రకృతి వ్యవసాయం చేయడం ఆనందదాయకం అన్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా క్షేత్రంలోని పంటలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. పండ్ల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయలు, పూలు, సీజనల్ పంటలను కలిపి సాగు చేయడం వలన రైతులకు పంటల ద్వారా నిరంతరం ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరించి రైతులను ప్రోత్సహించాలని కోరారు. -
విజయమే అందరి లక్ష్యం
‘స్థానిక’ ఎన్నికలపై వైఎస్సార్ సీపీ సన్నాహాక సమావేశం నరసరావుపేట: రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్యనాయకులు పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని ఓ కల్యాణమండపంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, జిల్లా, నియోజకవర్గాలకు చెందిన పలు విభాగాల నాయకులకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం పార్టీ నాయకుడు రేపాల శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతో ఎంపీగా గెలిచి, అనంతరం టీడీపీలో చేరి ఎంపీ అయిన వ్యక్తి తన పాత పరిచయాలతో ఫోన్లు చేసినా పట్టించుకోవద్దని కోరారు. నాయకులు, కార్యకర్తలు లైను దాటకుండా పార్టీ అఖండ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడారు. పార్టీ వలంటరీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సినిమాలో ఇంటర్వెల్ ఫైట్గా భావించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అక్రమ కేసులో పీఆర్కే జైలులో ఉండగా చూసేందుకు వెళ్లిన తనను అరెస్టుచేసి జైలు పాలు చేశారన్నారు. అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన పీఆర్కే, విడుదల రజిని, ఇతర నేతలకు పార్టీ అండగా నిలిచిందన్నారు. బీసీ మహిళ రజనిని పల్నాడు నాగమ్మగా భావించిన వెన్నుపోటు పార్టీ నాయకులు భయపడుతున్నారన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని వెన్నుపోటు ప్రభుత్వం ప్రకటించిందని, ఇదో పెద్ద మోసం, దొంగ వాగ్దానం అన్నారు. గత ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో 80 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరిని రూ.లక్ష కట్టమని అడుగుతున్నారని, అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చంద్రబాబు మాటలకు ఇదే అర్ధం అన్నారు. పేకాట క్లబ్పై తాను ఫిర్యాదుచేస్తే పట్టించుకోని పోలీసులు, అధికారులు ఆ క్లబ్పై మరో క్లబ్ నిర్వాహకులు దాడిచేసి ధ్వంసం చేస్తే మూడురోజుల్లో పట్టుకున్నారని, ప్రభుత్వ తీరు ఈవిధంగా ఉందన్నారు. గురజాల, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు పడాల శివారెడ్డి, బాసు లింగారెడ్డి మాట్లాడారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో పాటు జిల్లా పదవులు పొందిన వారందరికీ పార్టీ అందజేసిన గుర్తింపుకార్డులను నాయకులు అందజేశారు. పలు నియోజకవర్గాల పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, యెనుముల మురళీధర్రెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, పార్టీ నాయకులు గుబ్బా చంద్రశేఖర్, టీజీవీ కృష్ణారెడ్డి, చింతా విజయభాస్కరరెడ్డి, జాలయ్య, ఈదా శ్రీనివాసరెడ్డి, జిల్లా, నియోజకవర్గాలకు చెందిన పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో పట్టపగలు చోరీ
సత్తెనపల్లి: పట్టపగలే చోరీ జరిగిన సంఘటన సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫణిదం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కూచిపూడి రామారావు, మరియమ్మల గృహంలో సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో ఎవరు లేకపోవటంతో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మరియమ్మ డ్వాక్రా నగదు చెల్లించేందుకు వెళ్లడంతో ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మూడు సవర్ల బంగారు తాడు, మూడు సవర్ల రెండు బంగారు గాజులు, అరసవర రెండు చెవుల పోగులు, రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. డ్వాక్రా నగదు చెల్లించి ఇంటికి వచ్చిన మరియమ్మ ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి తన కుమారుడు కూచిపూడి సైమన్కు తెలిపింది. దీంతో సైమన్ సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడిచేసిన మరో యువకుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కాకుమాను వేణుగోపాల్ చిలకలూరిపేట పండరీపురంలో నివాసం ఉంటూ అడ్డరోడ్డు సెంటర్లో కార్ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన పట్టపురాజు సాయి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల వేణుగోపాల్ కుటుంబంపై సాయి అసభ్యంగా మాట్లాడాడు. ఈ విషయమై ఆదివారం సాయంత్రం గణపవరం జాతీయరహదారి టీమాక్స్ వద్ద ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాయి తాను ముందుగా తెచ్చుకున్న కత్తితో వేణుగోపాల్పై దాడి చేశాడు. స్ధానికులు సాయిని పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన వేణుగోపాల్ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాజుపాలెం: పాలిమర్ గోతాల లోడుతో అతివేగంతో వెళుతున్న లారీ నెమలిపురి గ్రామంలో మలుపు వద్ద బోల్తాపడిన సంఘటన మండలంలోని అద్దంకి–నార్కెట్పల్లి రహదారిపై నెమలిపురిలోని పోలేరమ్మ గుడి మలుపు వద్ద సోమవారం రాత్రి జరిగింది. గుజరాత్ నుంచి చైన్నె అతివేగంగా వెళుతున్న లారీ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ సాయికృష్ణ, క్లీనర్ ఈశ్వర్ ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ప్రొక్లెయిన్తో ఇరువురిని బయటకు తీసి 108 సహాయంతో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ సాయికృష్ణ(35) మృతిచెందాడు. ఇరువురు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారని ఎస్ఐ తెలిపారు. రాజుపాలెం: అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపులో ఇరువురు యువకులు ఘర్షణ పడగా ఒక యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని అనుపాలెం బస్టాండ్ సెంటర్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులో సోమవారం జరిగింది. టీడీపీ కార్యకర్త ఆలా రామయ్య కొంత కాలం నుంచి బెల్టు షాపును అక్రమంగా నడుపుతున్నాడు. షాపులోనే సిటింగ్ ఏర్పాటు చేశాడు. నిత్యం మందుబాబులు షాపులో తాగుతుంటారు. అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజులాగనే అనుపాలేనికి చెందిన కుంటా సైదారావు, అంచులవారిపాలెంకు చెందిన అంచుల గోపిలు బెల్టు షాపులో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఇరువురి మద్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఉన్నపళంగా అంచుల గోపి కుంటా సైదారావును బీరు సీసాతో మెడమీద పొడవడంతో సృహతప్పి పడిపోయాడు. బంధువులు హుటాహుటీన 108 సహాయంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బస్టాండ్ సెంటర్లో బెల్టు షాపు నిర్వహించవద్దని గ్రామస్తులు ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. -
కుంకుమ ప్రభ ఊరేగింపులో అపశ్రుతి
బొల్లాపల్లి: బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామంలో కుంకుమ ప్రభ ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. వర్షాలు కురవాలని గంగమ్మ తల్లికి కుంకుమ ప్రభ ఏర్పాటు చేయగా, ఆ గ్రామానికి చెందిన అరవా ముక్కంటికి చెందిన ఎడ్ల జతను కుంకుమ ప్రభకు కట్టి గ్రామంలో శనివారం రాత్రి 11 గంటలకు ఊరేగింపు ప్రారంభించి, ఊరేగిస్తుండగా తెల్లవారితే ఆదివారం 2.30 గంటల సమయంలో 11కే వీ విద్యుత్ లైన్ కు చెందిన కరెంట్ తీగలు ప్రభకు తగలడంతో షాక్కు గురై ఎడ్ల జత అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయని, వీటి ఖరీదు రూ. 3 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విద్యుత్ ప్రమాదంలో ప్రభకు సమీపంలో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, మరికొందరు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షాక్తో ఎడ్ల జత మృతి -
వినాయక మండపాలకు ఆన్లైన్లో అనుమతులు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతుల కోసం ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓ (సీఐ)లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని నేరుగా పరిశీలించాలని సూచించారు. ప్రజా, అత్యవసర వాహనాల రాకపోకలు, విద్యుత్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు పరిశీలించాక అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు, విద్యుద్దీపాల ఏర్పాట్లల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక సిలిండర్లు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చూడాలన్నారు. ప్రధాన రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ ఏరియాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. నిఘా పెంచాలి నిమజ్జన ఊరేగింపు తేదీలు, మార్గాలను ముందుగా సమీక్షించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా పెంచాలని సూచించారు. ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు, నినాదాలు, రెచ్చగొట్టే చర్యలు వద్దని నిర్వాహకులకు సూచించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం స్పష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. -
ఐదు రాష్ట్రాలస్థాయి కరాటే పోటీలు ప్రారంభం
దాచేపల్లి: దాచేపల్లిలోని తిరుమల కల్యాణ మండపంలో ఐదు రాష్ట్రాలస్థాయి కరాటే పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. చోటోఖాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య ప్రారంభించారు. ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 500మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–12, అండర్––14, అండర్–18 విభాగాల్లో కరాటే పోటీలు నిర్వహించినట్లు నిర్వహకులు కొప్పుల నరసింహరావు, కొప్పుల పార్వతి తెలిపారు. గ్రాండ్ చాంపియన్ షిప్ తెలంగాణ, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడవస్థానంలో కర్నాటక రాష్ట్రాలు నిలిచినట్లు వారు వెల్లడించారు. విజేతలైన క్రీడాకారులకు షీల్డ్స్, సర్టిఫికెట్లను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జెడ్పీ
మూడుగా మారిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు ● 25 నుంచి మొదలుకానున్న కార్యకలాపాలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో జెడ్పీ ● ఇప్పుడు 17 మండలాలకు గుంటూరు పరిమితం ● పల్నాడులో 28, బాపట్ల పరిధిలో 20 మండలాలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కొత్తగా పల్నాడు, బాపట్ల జెడ్పీలు ఏర్పడనుండగా.. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లా 17 మండలాలకు పరిమితం కానుంది. అదే విధంగా పల్నాడులో 28, బాపట్లలో కొత్తగా కలిసిన వాటితో కలిపి 20 మండలాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే అధికంగా మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 57 మండలాల నుంచి 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని మండలాల వారీగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న దృష్ట్యా, త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. 1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 నుంచి 1959 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. 1921 నుంచి 1927 వరకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పీజీఎన్ యతిరాజుల నాయుడు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా 1921 నుంచి 1959 వరకు తొమ్మిది మంది జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిలో కొనసాగారు. మూడు సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 1959లో అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా డిసెంబర్ ఒకటో తేదీన మేడూరి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వరకు గత 66 ఏళ్ల కాలంలో 36 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో నాలుగు సార్లు ఇన్చార్జ్ చైర్మన్లు, 18 సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగారు. జెడ్పీకి 16 మంది చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో కాసు వెంగళరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు తదితర ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన మోహన్ కందా గుంటూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన కాలంలో జెడ్పీ ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతమున్న జెడ్పీ పరిపాలన భవనాన్ని 1964 జూలై 15న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కాకుమాను, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వట్టిచెరుకూరు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో అమృతలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కర్లపాలెం, కొల్లూరు, మార్టూరు, నగరం, నిజాంపట్నం, పర్చూరు, పిట్టలవానిపాలెం, రేపల్లె, చుండూరు, వేమూరు, వేటపాలెం, యద్దనపూడి మండలాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు, గురజాల, ఈపూరు, కారంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, నూజెండ్ల, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్వరూపం మారింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పడనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా పరిషత్లను ఏర్పాటు చేస్తూ జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇక నుంచి మూడు జిల్లాల వారీగా విడిపోనుంది. -
ప్రజా ఆస్తి.. పచ్చ నేతల పరం
● ఏకంగా 27 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ ● ఆక్రమిత భూమి విలువల దాదాపు రూ.పది కోట్లపైనే ● ఏఎంజీకి అప్పగించిన స్థలం ఏడుగురి పేరిట రిజిస్ట్రేషన్ యడ్లపాడు: చిలకలూరిపేట పురపాలక సంఘానికి ఆనుకుని ఉన్న పరిధిలోని ప్రజాప్రయోజనాల కోసం నిర్దేశించిన రిజర్వ్డ్ స్థలం అది. కార్మికుల కుటుంబాల పిల్లల విద్య, మధ్యాహ్న భోజనం కోసం ఏఎంజీ స్వచ్ఛంద సంస్థకు అధికారులు అప్పగించారు. కొంతకాలం డే–కేర్ సెంటర్గా కొనసాగిన రూ. పది కోట్ల విలువైన ఆ భూమి ఇప్పుడు యాజమాన్య హక్కుల వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న ఈ స్థలం ఏడుగురు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ అయినట్లు పత్రాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలదే ఇందులో కీలక పాత్రగా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఏంఎజీకి అప్పగించిన ఈ భూమిలోని భవనాన్ని తొలగించి స్థలాన్ని చదును చేయడంతో విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సెప్టెంబర్ 4న అధికారికంగా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి, స్థలం రక్షణ గేటుకు తాళంతో పాటు మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ స్థలాన్ని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఆస్తిగా అధికారులు స్పష్టం చేస్తున్న భూమికి ప్రైవేటు హక్కులు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు రాజకీయ కోణం కూడా తోడవుతోంది. అయితే ఈ స్థలం వాస్తవంగా ఎవరిది? మున్సిపల్ ఆస్తి అయితే ప్రైవేటు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఒకవేళ స్వచ్ఛంద సంస్థకు గుత్తాధిపత్యం ఉంటే మున్సిపల్ అధికారులు సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ఈ ఆస్తి వివాదంలో చిక్కుకోవడంపై బాధ్యులెవరనే విషయంపైనే ఇప్పుడు ప్రజల్లో హాట్టాపిక్గా మారింది. ఏఎంజీకి స్థలం అప్పగింత ఇలా... హెచ్హెచ్ డైక్మెన్ నగర్ నివాసితుల కమ్యూనిటీ అవసరాల కోసం ఉద్దేశించిన ఈ రిజర్వ్డ్ స్థలాన్ని 1998లో పురపాలకశాఖ ఏఎంజీ సంస్థకు అప్పగించింది. పారిశుధ్య కార్మికుల పిల్లలకు విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్కడ డే–కేర్ సెంటర్ నిర్వహించారు. ఏఎంజీ ప్రధాన దాత జర్మనీకి చెందిన డాక్టర్ హెచ్హెచ్ డైక్మెన్ మరణం తర్వాత ఆ కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మున్సిపాలిటీ ఆ స్థలాన్ని ఏ ప్రాతిపదికన ఏఎంజీకి అప్పగించింది? లీజా.. వినియోగానికి అనుమతా.. లేక ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారమా? అనే వివరాలను నిర్ధారించే పాత రికార్డులేవీ దొరకలేదని, వాటి కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. డోర్ నంబర్ 80/1, సర్వే నంబర్ 138/1గా పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టు 11న స్థలం ఏడుగురి పేర్లతో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పన్ను అసెస్మెంట్ నంబర్ 1020025573 కూడా పత్రాల్లో ఉన్నట్లు సమాచారం. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు అందించిన సేవలకు ప్రతిఫలంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్కుమార్ కంటి మహంతి తరఫున వారికి స్థలాన్ని కానుకగా ఇచ్చినట్లు దస్తావేజుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, రిజిస్ట్రేషన్ సమయంలో అక్కడ డే–కేర్ భవనం ఉన్నప్పటికీ ఖాళీ స్థలంగా చూపించినట్లు సమాచారం. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న భూమి విషయంలోనే యాజమాన్య హక్కులపై ఇంతటి వివాదం తలెత్తడం ఇప్పుడు అధికారుల పాత్రపైనా అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును దీనిపై ‘సాక్షి’ వివరణ కోరగా.. వివాదాస్పద స్థలం సర్వే నంబర్ 88లోని 27 సెంట్లు మున్సిపల్ ఆస్తిగా స్పష్టం చేశారు. పన్ను అసెస్మెంట్ ఇటీవలే ఇచ్చారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. గతం నుంచే అసెస్మెంట్ నంబర్ ఉందన్నారు. సదరు స్థలం ఏఎంజీకి ఏ ప్రాతిపదికన అప్పట్లో ఇచ్చారనే విషయంపై రికార్డులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. తమ స్థలంలోని భవనం తొలగించారని తెలిసి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు ఎలా రిజిస్ట్రేషన్లు చేసుకున్నా అది పక్కా మున్సిపల్ ఆస్తి అని, ఆ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని పేర్కొన్నారు. వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కూ లభించదని తేల్చి చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో కిరాణా వ్యాపారి మృతి
రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వే పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంచనపల్లి గురుమూర్తి(50) మృతి చెందాడు. 30 ఏళ్లుగా కిరాణా వ్యాపారం చేస్తున్న గురుమూర్తి తన ద్విచక్రవాహనంపై సరుకుల కొనుగోళ్ల నిమిత్తం నరసరావుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో సంతగుడిపాడు నుంచి హైవేపై కొంత దూరం ప్రయాణించి పాలపాడు రోడ్డు మలుపు తిరుగుతుండగా స్కార్పియో కారు వెనుకగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన గురుమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలివేసి డ్రైవర్, కారులో ఉన్నవారు పరారీ అయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం
నరసరావుపేట రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం సోమవారం సాయంత్రం 3గంటలకు పట్టణంలోని ఏ–1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 9,11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం చిలకలూరిపేటటౌన్: నియోజకవర్గంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ (ఎల్ఈఎస్టీ–2027) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలో, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా సమీప మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. యడ్లపాడు: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కొండవీడు కోటకు ఆదివారం సందర్శకులు అధికసంఖ్యలో వచ్చారు. కొత్తపాలెం గ్రామం నుంచి ఘాట్రోడ్డు, కొండపైన పురాతన కట్టడాల వద్ద గుంపులు గుంపులుగా వచ్చి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. పలు జిల్లాల నుంచి వచ్చిన 35 మంది వెటర్నరీ వైద్యులు కొండవీడును సందర్శించారు. వారంతా సాహస క్రీడలపై ఆసక్తి చూపారు. పల్నాడు జిల్లా అటవీశాఖ, ఔట్రీచ్ ట్రెక్కింగ్ అకాడమీ ఆధ్వర్యంలో కొండలపై ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ యువతతో పాటు వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు. ట్రెక్కింగ్లో భాగంగా కొండవీడు కోట చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకుంటూ, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా సాగిన ట్రెక్కింగ్ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. వారితో పాటు కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి, అటవీశాఖ అధికారులు ఉన్నారు. బావిలో గుర్తు తెలియని మృతదేహం పిడుగురాళ్ల: పొలం బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మండలంలోని కామేపల్లి శివారు పొలాల్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. కామేపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో పల్లా నాగయ్య నేలబావిలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం లభించిందన్న స్థానికులు సమాచారం మేరకు.. బావిలోని మృతదేహాన్ని వెలికి తీయటం జరిగిందన్నారు. మృతుడు ఆకుపచ్చ రంగు లుంగీ, తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో ఉంచామని, మృతుడి సంబంధీకులు పట్టణ సీఐ వెంకట్రావు 9440796236, ఎస్ఐ మోహన్ 7207271178 నెంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ మోహన్ తెలిపారు. తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చీకటి గోపిది ముమ్మాటికి పోలీసుల హత్యే
లక్ష్మీపురం: చీకటి గోపిది ముమ్మాటికి పోలీసుల హత్యేనని, బాధ్యులపై చర్య తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులతో కలిసి పోలీసులపై చర్య తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్కుమార్ మాట్లాడుతూ పోలీసుల చర్యల వలనే గోపి మృతి చెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న ఘటనలో అదే పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారణ చేయడం వల్ల విచారణ నిష్పక్షపాతంపై అనుమానాలు ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చీకటి గోపి ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో గత కొంతకాలంగా పోలీసుల కస్టడీ, విచారణ లేదా పోలీసుల చర్యల అనంతరం వ్యక్తులు మృతి చెందిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఇది ఒక్క గోపి కుటుంబం సమస్య కాదని, చీకటి గోపి మరణాన్ని ఒక కుటుంబానికి జరిగిన విషాదంగా మాత్రమే చూడకూడదన్నారు. పోలీసు స్టేషన్కు విచారణ కోసం పిలిపించిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హింస, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేస్తూ పోలీసుల దుర్మార్గంపై, సీఐడీ ఎస్పీ చెప్పే అబద్ధాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ప్రత్యేకంగా కలిసి సమస్య తీవ్రతను వివరించాలని, డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమస్య పరిష్కారం కాకపోతే చలో గుంటూరు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు ప్రకటించారు. -
వినూత్న బోధనకు జాతీయ గుర్తింపు
యడ్లపాడు: విద్యార్థుల వికాసమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తున్న కొండవీడు జెడ్పీహైస్కూల్ ప్రాంగణంలోని పీఎంశ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ జున్నుసాహెబ్కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత్ గురు రత్న అవార్డు–2026ను ఆదివారం అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాకుండా సేవగా భావించే జున్నుమాస్టారు.. సంప్రదాయ బోధనకు భిన్నంగా కృత్యాధార, అనుభవపూర్వక పద్ధతులను అనుసరిస్తున్నారు. విద్యార్థుల్లో అభ్యసన ఆసక్తిని పెంచుతూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. కాలిగ్రఫీలో డిప్లొమా చేసిన ఆయన సెలవు రోజుల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల్ని ఏర్పాటు చేసి ఉచిత హ్యాండ్రైటింగ్ శిక్షణ అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ హాల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్, శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పట్నం కమల మనోహర్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేసి ఆయనను ఘనంగా సత్కరించారు. భారత్ గురురత్న అవార్డు–2026 అందుకున్న డాక్టర్ జున్నుసాహెబ్ -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● లారీని ఢీకొన్న కారు ● మంటలు చెలరేగి కారు దగ్ధం ● ప్రయాణికులు సురక్షితంపిడుగురాళ్ల: ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేట వైపు నుంచి కారంపూడి వైపునకు ఓ లారీ వెళుతోంది. ఇంతలో కారంపూడి వైపు నుంచి గుత్తికొండ వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొంది. గుత్తికొండ గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న నలుగురు వ్యక్తులను క్షేమంగా కాపాడారు. అదృష్టశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘ఉత్త మా’ పురస్కారాలు
● అవార్డు పొందిన ముగ్గురు అధ్యాపకులూ సీఎం సామాజిక వర్గమే ● రాష్ట్ర స్థాయి ఎంపిక తీరు చూసి విస్తుపోతున్న విద్యావేత్తలు ● ఇతర సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధ్యాపకుల విద్యాపరమైన రికార్డుతోపాటు విద్య, పరిశోధన అంశాలనూ లెక్కలోనికి తీసుకోలేదు. వారు వ్యక్తిగతంగా కనబరిచిన ప్రతిభ, అందుకున్న పురస్కారాలు పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలు, వాటి ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న వారి జాబితా చూస్తే ఇవేమీ కనిపించవు. దీంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిపాలన, వ్యవస్థాపరమైన అన్ని పదవులు, నియామకాలన్నింటిలోనూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అగ్రతాంబూలం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వాములమైనప్పటికీ తమకు కనీస ప్రాధాన్యత కూడా ఉండటం లేదని కొన్ని సామాజిక వర్గాలు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి. కానీ అవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, ఏఎన్యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన అవార్డుల ప్రక్రియను కూడా ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం, ముగ్గురూ సైన్స్ కళాశాలకు చెందిన వారే కావడం టీడీపీ ప్రభుత్వ విపరీత ధోరణికి అద్దం పడుతోందని విద్యావంతులు మండిపడుతున్నారు. ఆరోపణలున్నా పట్టింపేదీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల నిర్వహణ పదవిని ‘ఉత్తమ’ అవార్డుకు ఎంపికై న ఓ అధ్యాపకుడు నిర్వర్తించేవారు. ఆయన హయాంలో యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది పరీక్ష ప్రారంభానికి ముందే బీఈడీ ప్రశ్నపత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీకేజీ ఘటనపై అప్పట్లో పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఓ బీఈడీ కళాశాల క్లర్క్ను, కొందరు ఒడిశా విద్యార్థులను నామమాత్రంగా బాధ్యులను చేసి చేతులు దులుపుకొన్నారు. పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటే గతంలో ఆ పదవిలో ఉన్న వారిని యూనివర్సిటీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అధికారికి మరింత అగ్రపీఠం వేసినట్లు వ్యవహరించారు. ఆ తరువాత కూడా పీజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు తప్పుగా రావడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇవ్వడం వంటి అనేక ఘటనలు ఈ అధికారి హయాంలో చోటుచేసుకున్నాయి. ఇక బోధన, పరిశోధన అంశాల్లో ఈ అధ్యాపకుడు కనబరిచిన ప్రత్యేక ప్రతిభ ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఈడీ పేపర్ లీక్ జరిగిన సమయంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం చాలా సీరియస్ అయ్యిందని, ఏఎన్యూ ఉన్నతాధికారులను నివేదిక కూడా అడిగిందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఘటన చోటుచేసుకున్న విభాగానికి చెందిన అధికారికి ఇప్పుడు అదే శాఖ నుంచి ఉత్తమ అవార్డును ప్రదానం చేయడం.. లోకేశ్, చంద్రబాబులకు ఉన్న సామాజిక ప్రేమను చాటి చెబుతోందని పలువురు పేర్కొంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ముప్పాళ్ళ: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఇద్దరు గాయపడిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన బద్దిగం వెంకటరెడ్డి, వి.శ్రీనివాసరెడ్డిలు సత్తెనపల్లిలో జరిగే వివాహానికి ద్విచక్రవాహనం పై బయలుదేరారు. మార్గమధ్యలో ఇరుకుపాలెం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద నరసరావుపేట వైపు నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని వెనుక ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం పై ఉన్న వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు ఎగిరి రోడ్డు మార్జిన్లో పడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనపై బాధితులు ముప్పాళ్ళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైల్లో నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు సత్తెనపల్లి: రైల్లో నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం గుడిపూడి–లక్ష్మీపురం గ్రామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒడిశా రాష్ట్రం కలహందిజిల్లా తండిమండలం బలిజీ వాహన్ గ్రామానికి చెందిన బలిజివార్ శివ అనే యువకుడు హైదరాబాద్–భువనేశ్వర్ రైల్లో నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న 108 బృందం ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనా స్థలం వద్దకు 108 వాహనం చేరే పరిస్థితి లేకపోవడంతో క్షతగాత్రుడు శివను సుమారు మూడు కిలోమీటర్లు పంట పొలాల గుండా మోసుకుంటూ 108 వాహనం వద్దకు చేర్చారు. అనంతరం క్షతగాత్రుడు శివను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గంజాయి మత్తులో యువకుల వీరంగం నడిరోడ్డుపై గొడవేందని ప్రశ్నించిన వారిపై దాడి శావల్యాపురం: గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించిన సంఘటన మండల కేంద్రం శావల్యాపురలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణానికి చెందిన కొందరు యువకులు నడిరోడ్డుపై బీరు సీసాలతో హాల్చల్ చేస్తూ మత్తులో బైకుపై వస్తున్నారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన ఒక యువకుడుకి బైకు తగిలించారు. ఇదేమని ప్రశ్నించిన యువకుడుపై దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన గ్రామస్తులపై మత్తులో ఉన్న యువకులు దౌర్జనంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషణకు దిగారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయి మత్తులో ఉన్న యువకులను పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించటంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పిల్చుకున్నారు. ఈవిషయం గురించి స్టేషను రైటరు సలీమ్బాషను వివరణ కోరగా.. గంజాయి మత్తులో శాంతి భద్రతలు విఘూతం కల్గించిన యువకులపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామన్నారు. యువకుడిపై కత్తితో దాడి నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కాకుమాను వేణుగోపాల్ చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తుంటాడు. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పట్టపురాజు సాయికి, వేణుగోపాల్కు కొంతకాలంగా పాతకక్షలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వేణుగోపాల్ భార్య సుకన్యను సాయి ఫోన్లో అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో జాతీయ రహదారి సమీపంలోని టీ దుకాణం వద్దకు వేణు దంపతులు వచ్చారు. కక్షపెంచుకున్న సాయి తన వద్ద ఉన్న కత్తితో గోపాల్పై దాడి చేశాడు. దీంతో గాయాలైన గోపాల్ను పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన సాయి నాదెండ్ల పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపారు. -
సాఫ్ట్బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక
పెదకాకాని: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని ఏకలవ్య నగర్లోని రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శనివారం రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు సుమారు పది క్వింటాళ్ల బరువు కలిగిన 23 రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. స్థానికంగా నివసించే మేడా కుమారి ఇళ్ల వెంట తిరిగి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసు స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పోలీసులు నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఇర్ఫాన్లు పాల్గొన్నారు. 15లోపు పేరు నమోదుకు అవకాశం మధురానగర్(విజయవాడ సెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. తాము ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 93475 72766, 98481 11138 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేస్తామన్నారు. తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. -
గుంటూరు జిల్లాకు హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ
నగరంపాలెం: ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించి, పోలీస్శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో అండర్–10, అండర్–14, మిక్స్డ్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఫౌండేషన్ కార్యదర్శి జీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం ఏడు గంటలకు స్టేడియం టెన్నిస్ కోర్టులో రిపోర్ట్ చేయాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలన్నారు. మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలోని ఒక రేషన్ దుకాణం నుంచి బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. డీలర్ దుకాణం మూసివేసి వెళ్లిపోగా, లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.. వారి కోసం ఎదురు చూస్తుండగా బియ్యం అక్రమ వ్యాపారి తన అనుచరులతో వచ్చి దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనంతరం మినీ లారీని వేగంగా డ్రైవ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామస్తులు పక్కకు తప్పుకోవడంతో లారీ తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికే పలుమార్లు రేషన్ బియ్యం తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం శనివారం 535.70 అడుగులకు చేరింది. ఇది 179.4878 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 8,022, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 16,875 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 16,875 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నెహ్రూనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ వినాయక చవితిని కాలుష్య రహితంగా జరుపుకొందామని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా 11వ తేదీన నగరంలోని సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ‘ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి’ నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. -
ఇదేం... విభజన?
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన వ్యవహారం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే తెరపైకి తెచ్చిన బహిరంగ కుట్రలా కనిపిస్తోందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు ఉన్న 57 డివిజన్లను ఏకంగా 76కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అగ్గి రాజేస్తోంది. క్షేత్రస్థాయి భౌగోళిక సరిహద్దులు, సహజ నిర్మాణం, పరిపాలనా సౌలభ్యం, కనీస శాసీ్త్రయ ప్రమాణాలను గాలికొదిలేసి.. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లే అధికారులు జీ హుజూర్ అంటూ సరిహద్దులను గీసేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని విభజన కత్తి దూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రాంతాలను ఒక క్రమపద్ధతి లేకుండా రెండు మూడు డివిజన్లలోకి అడ్డగోలుగా ముక్కలు చేసి పంపించారు. అంతేకాకుండా, పలుచోట్ల సహజ హద్దులైన ప్రధాన రహదారులను కాకుండా నాలుగు అడుగుల సందులను బౌండరీలుగా చూపించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. అనేక డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చి పక్క డివిజన్లో కలిపినప్పటికీ, కొన్ని డివిజన్లలో జనాభా భారీగా పెరగడం, మరికొన్నింటిలో తీవ్రంగా తగ్గిపోవడం వంటి అంతుచిక్కని లెక్కలు అధికారుల పనితీరును బట్టబయలు చేస్తున్నాయి. ఉదాహరణకు నల్లపాడు, అంకిరెడ్డిపాలెం లాంటి విలీన ప్రాంతాలను అసంబద్ధంగా కలపడం వల్ల స్థానిక ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది. జన సైనికుల్లోనూ అసంతృప్తి సెగలు ఈ అశాసీ్త్రయ విభజన కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోనే కాకుండా, క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామి అయిన జనసేన కేడర్లోనూ అసంతృప్తి రగిలిస్తోంది. తమకు పట్టున్న డివిజన్లు, జనసైనికుల ప్రాబల్యం ఉన్న కాలనీలను కూడా అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా చీల్చి బలహీన పరిచారంటూ జనసేన స్థానిక శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. స్వప్రయోజనాల కోసమే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ మ్యాపింగ్ చేయించారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కమిషనర్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 11 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రస్తుతం డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 11వ తేదీ వరకు గడువు విధించారు. వచ్చిన అభ్యంతరాలను 12వ తేదీన సీడీఎంఏకు పంపడం, 13న సీడీఎంఏ తుది జాబితా ఖరారు చేసి, 14న ఫైనల్ జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అన్యాయంగా మార్చిన సరిహద్దులను సవరించాలంటూ నగరవ్యాప్తంగా నిరసన స్వరాలు మిన్నంటుతున్నాయి. -
విద్యార్థులకు ఉపాధ్యాయులే స్ఫూర్తి
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాష్నగర్లోని టౌన్హాల్లో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ కృతికా శుక్లా, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు పాల్గొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 70 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్కు తల్లిదండ్రుల త్యాగంతో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకమని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాన వికాసంతోపాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయత వంటి సద్గుణాలు పెంపొందిస్తూ వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అభిప్రాయపడ్డారు. ప్రతిభ గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతను 95 శాతం వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీఈ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిభ గల విద్యార్థులను నగదు బహుమతితో ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర శిల్పారామం, సాంస్కృతిక విభాగం సంస్థ చైర్మన్ చేరెడ్డి మంజులారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ పి.శ్యామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
చేపల వేటలో ‘తూటాల’ మోత
కృష్ణా నదిలో దుండగులు యథేచ్ఛగా తూటాలు పేలుస్తున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా ఇలా పేలుస్తూ భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారు. చేపల కోసం భారీ స్థాయిలో మందుగుండుతో చేసిన ఈ తూటాలను వేస్తూ వాటి మృతికి కారణమవుతున్నారు. విచ్చలవిడిగా విసరడం వల్ల చేపలు మృతి చెంది నీటిపై తేలియాడుతున్నాయి. వాటినే ప్రజలకు విక్రయిస్తున్నారు. నదిలో నీరు కూడా కలుషితం అవుతోంది. ప్రజారోగ్యం పణంగా పెడుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. దాచేపల్లి: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో మందుగుండు సామగ్రితో చిన్న పరిమాణంలో నాటు బాంబుల తరహాలో చేసిన తూటాల పేలుళ్లు ఎక్కువ అవుతున్నాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదిలో కొంతమంది చేపల కోసం తూటాలను విసురుతున్నారు. అక్రమ మార్గంలో మందుగుండు సామగ్రిని తీసుకువచ్చి తూటాలను తయారు చేస్తున్నారు. దీంతో చేపలు చనిపోయి నీటిపై తేలుతున్నాయి. బలమైన తూటాల వలన అడుగున ఉన్న చేపలు సైతం నీళ్లపైకి వస్తున్నాయి. దాచేపల్లి మండలం పొందుగుల, తెలంగాణలోని వాడపల్లి, ఇర్కిగూడెం ప్రాంతాల్లో ఈ పేలుళ్ల తీవ్రత ఎక్కువగా వినిపిస్తున్నట్లుగా సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. తూటా వేసిన చోట క్షణాల్లోనే చేపలు మృతి చెంది గుట్టలుగుట్టలుగా పైకి తేలుతున్నాయి. చాలావరకు గాయపడినవే మృతిచెందుతున్నాయి. వాటినే ఐస్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అక్రమ మార్గంలో మందుగుండు సామగ్రి కృష్ణా నదిలో వలలు వేయడం ద్వారా కొంతమంది మత్స్యకారులు చేపలు పడుతున్నారు. మరికొంతమంది తూటాలను వేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామగ్రి అక్రమ మార్గంలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పిడుగురాళ్ల, దాచేపల్లి, దామరచర్లలో కొంతమంది నుంచి దుండగులు ఈ సామగ్రిని తీసుకొచ్చి తూటాలను తయారు చేసి నదిలో విసురుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో దాచేపల్లిలో అక్రమంగా మందుగుండు సామగ్రిని నిల్వ చేసిన ఇంట్లో పేలుడు సంభవించి ఏకంగా 15 మంది మృత్యువాత పడ్డారు. ఇకనైనా అధికారులు అక్రమంగా మందుగుండు సామగ్రిని సరఫరా చేసే వ్యక్తులపై నిఘా పెట్టాల్సి ఉంది. లేదంటే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుంది. తాగునీరు కలుషితం కృష్ణా నదిలో తూటాల పేలుళ్ల ధాటికి నీరు కలుషితమవుతోంది. కృష్ణా నది నుంచి దాచేపల్లి మండలంతోపాటు తెలంగాణలోని పలు గ్రామాలకు రక్షిత తాగునీటి పథకాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. రోజూ లక్షల లీటర్ల నీటిని కృష్ణా నది నుంచి ఈ పథకాలకు తరలిస్తున్నారు. ఈ నీటినే ఫిల్టర్ చేసి ప్రజలకు అందిస్తున్నారు. తూటాల పేలుళ్ల ప్రభావంతో తాగునీరు కలుషితం అవుతోందని నదీ పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందుగుండు సామగ్రి ఎక్కువగా వినియోగించడం వలన నీరు రంగు మారడంతోపాటు దుర్వాసన కూడా వస్తున్నట్లుగా చెబుతున్నారు. అధికారులు నదిలోని మత్స్య సంపదను కాపాడేందుకు, తాగునీరు కలుషితం కాకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడు పోలింగ్ కేంద్రాల వద్ద స్పెషల్ క్యాంపెయిన్
సత్తెనపల్లి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని ప్రత్యేక శిబిరాల్లో బూత్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ఓటర్ల నుంచి క్లైయిమ్లు, అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రచురించిన ముసాయిదా జాబితాలను సైతం అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు ఉందో, లేదో పరిశీలించుకోవచ్చు.వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంత రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేగాక ఓటర్లు తమ సెల్ఫోన్ నుంచి 1950 నెంబర్కు మెసేజ్ పంపటం ద్వారా కూడా తమ ఓటు నమోదు స్థితిని తెలుసుకోవచ్చు. మెసేజ్లో ఈసీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈపీఎల్సీ నంబర్ నమోదు చేసి 1950 కు పంపితే ఓటరు వివరాలు, సర్ నమోదు స్థితికి సంబంధించిన సమాచారం తెలుస్తోంది. అంతేగాక కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారు, చిరునామా, పేరు, ఫోటో లేదా ఇతర వివరాల్లో మార్పులకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ విధానంలో తమ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. -
ఆమ్యామ్యాల తడాఖా
అమాత్యుని ఇలాకా.. జిల్లా ఇన్చార్జి మంత్రి అంటే.. ఆ జిల్లాలోని పరిపాలన మొత్తానికి ఆయనే కీలకం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలపైనా పర్యవేక్షణ ఆయనదే. కానీ గొట్టిపాటి రవికుమార్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న పల్నాడు జిల్లాలో సాక్షాత్తూ ఆయన శాఖలోనే పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్నా చోద్యం చూస్తున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నామంటూ ఉపన్యాసాలకే ఆయన పరిమితం అయ్యారు. మరోవైపు ఆయన శాఖకు చెందిన అధికారులు ప్రతి పనికో రేటు కట్టి వినియోగదారుల నుంచి దొరికినకాడికి దోచుకుంటున్నారు. నరసరావుపేట టౌన్: జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్ శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించాల్సిన శాఖలో ప్రతి పనికీ ‘రేటు’ నిర్ణయించారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కావాలన్నా.. కొత్త విద్యుత్ కనెక్షన్ పొందాలన్నా.. లోడ్ పెంచుకోవాలన్నా.. లైన్ మార్పులు, ఇతర సాంకేతిక అనుమతులు పొందాలన్నా మామూళ్లు లేకుండా పని జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు ముడుపుల వ్యవహారం సాగుతోందని ఆరోపిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నిద్రావస్థలో ఉండటం అవినీతిపరులకు వరంగా మారింది. అవినీతి అధికారికి అందలం.. విద్యుత్ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంపైనా ఉందని ప్రజలు అంటున్నారు. గతంలో నరసరావుపేట విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసిన అధికారిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కెపాసిటీని బట్టి వసూలు చేశాడు. ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిపోయి పదోన్నతి కల్పించి మరో నియోజకవర్గానికి బదిలీ చేయటం ఉద్యోగ వర్గాలతో పాటు వినియోగదారులకు విస్మయానికి గురిచేసింది. ఇప్పటివరకు అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి సమగ్ర విచారణ జరిగిందే లేదు. ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలపై మంత్రి నేరుగా దృష్టి సారించి, నరసరావుపేట విద్యుత్ శాఖలో పారదర్శక విచారణకు ఆదేశిస్తారా లేక ఈ ‘అవినీతి చీకట్లు’ ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్ శాఖ అధికారులపై ఇంత తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి
మృతులు వదిన, మరదలు కావడంతో శోకసంద్రంలో కుటుంబంపెదకూరపాడు: అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన వదిన, మరదలు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పాలు తాగే పసిబిడ్డలను వదిలి పొట్టకూటి కోసం ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లిన తల్లులు మృత్యువాత పడటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. వివరాలు... దిడుగు గ్రామానికి చెందిన బాపట్ల వెంకటేశ్వరమ్మ (28), బాపట్ల లక్ష్మీ తిరుపతమ్మ (25) గ్రామంలో ఉపాధి పనులు లేక విజయవాడకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ సహకారంతో ఫంక్షన్లలో వంట పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో గత రెండు రోజులుగా ఫంక్షన్ పనులు ముగించుకొని ఒంగోలులోని వివాహ వేదికకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఒంగోలు సంఘమిత్ర ఫ్లయ్ఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాపట్ల వెంకటేశ్వరమ్మ భర్త ప్రభుదాస్ గత ఏడాది హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారికి కుమార్తెలు పాలి వేణు (8), సింధు (3), కుమారులు పోలయ్య (7), ప్రభుదాస్ (1) ఉన్నారు. లక్ష్మీ తిరుపతమ్మ భర్త రామాంజనేయులు గ్రామంలోని కూలి పనులు చేస్తుంటాడు. వీరికి కుమార్తెలు పావని (8), సుశీల (1), మూడేళ్ల కుమారుడు ఉన్నారు. పాలు తాగే పసిబిడ్డలను వదిలి పొట్టకూటి కోసం వెళ్లిన తల్లులు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ చిన్నారుల వేదన వర్ణనాతీతంగా మారింది.ప్రభుదాస్కు లక్ష్మీ తిరుపతమ్మ సొంత చెల్లెలు కావడంతో ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనతో దిడుగు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మీతిరుపతమ్మ, వెంకటేశ్వరమ్మ (ఫైల్) -
రద్దీ వేళ... భద్రత డొల్ల
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగా మారింది. వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో, టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మహిళల రద్దీ పెరగడంతో దొంగలకు మరింత అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని నెలలుగా బస్టాండ్లో దొంగలు సెల్ఫోన్లు, నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం నిలబడినప్పుడు చేతివాటం ప్రదర్శించి అందినకాడికి కాజేస్తున్నారు.నరసరావుపేట టౌన్: సీ్త్రశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో బస్టాండ్ ప్రాంగణంతో పాటు బస్సుల్లోనూ కిక్కిరిసిన పరిస్థితి నెలకొంటోంది. దీనికి అనుగుణంగా భద్రత, నిఘా వ్యవస్థ, మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల బ్యాగులు, పర్సులు, సెల్ఫోన్లు, నగదుపై చోరులు కన్నేసి, పథకం ప్రకారం కొల్లగొడుతున్నారు. గత ఆదివారం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగులో ఉన్న 12 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. రద్దీని దొంగలు ఎంతగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది. కెమెరాలు ఉన్నా ప్రయోజనం శూన్యం బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిలో కొన్ని పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. చోరీ జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీ కీలకం. అయితే కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సైతం కష్టతరంగా మారింది. కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతో పాటు కీలక ప్రాంతాల్లో అదనపు కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బుకింగ్ కౌంటర్లు, బస్సులు ఎక్కే ప్రదేశాలు, ప్లాట్ఫారాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను పూర్తిస్థాయిలో నిఘా పరిధిలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. కీలక కేంద్రం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ పల్నాడు జిల్లా కేంద్రమే కాకుండా, రాయలసీమ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, విజయవాడ, శ్రీశైలం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు కీలక కేంద్రంగా ఉంది. రోజూ వేలాది మంది ప్రయాణాల కోసం బస్టాండ్ను ఆశ్రయిస్తుంటారు. ఇంతటి రద్దీ ఉన్న బస్టాండ్లో ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. సమన్వయ లోపం చోరీలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షించడం, రద్దీ సమయాల్లో పోలీసు లేదా సెక్యూరిటీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని నిరంతరం పరిశీలించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చోరీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల గుర్తింపు కోసం ఆర్టీసీ, పోలీసు శాఖలు సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. చోరీలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే వాటిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీసీ కెమెరాలను తక్షణమే బాగుచేసి, రద్దీ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా తగిన సిబ్బందితో ఇక్కడ నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులు సరిపడా లేక అవస్థలు పడుతున్న తమకు ఈ చోరులతో ఆందోళన తప్పడం లేదని వాపోతున్నారు. -
ఆర్టీసీ బస్సులో సెల్ఫోన్ చోరీ
ఇటీవల అద్దంకి వెళ్లేందుకు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా నా సెల్ఫోన్ కాజేశారు. అదే రోజు మరో ఇద్దరు ప్రయాణికుల సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. బస్సు ఎక్కే సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.1.40 లక్షల విలువైన ఫోన్ పోగొట్టుకుని, రికవరీ కోసం పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. బస్టాండ్లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – సీహెచ్ నరసింహారావు, ప్రయాణికుడు -
సర్పై 10 వరకు అభ్యంతరాల స్వీకరణ
నరసరావుపేట రూరల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే సర్ ముసాదాను అగస్ట్ 31వ తేదీన విడుదల చేసినట్లు తెలిపారు. ముసాదా ఓటరు జాబితా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈనెల 5, 6 (శని, ఆదివారం) తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా ప్రకటించి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాజకీయపార్టీల ప్రతినిధులు తమ బూత్ లెవల్ ఏజెంట్లను హాజరయ్యేలా చూసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు బీఎల్ఓల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువ ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని బరంపేటలోని ఇస్కాన్ ఆలయాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. శ్రీరాధా గోవిందులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. -
పేద రోగుల మృత్యుఘోష
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వెంటిలేటర్పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే శ్మశానం వద్ద కదలాడినట్లు గమనించి కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణి అక్కడ వైద్యులు లేక గంటలకొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించిన హృదయ విదారకమైన ఘటన.. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించిన దారుణం.. బతికుండగానే స్ట్రెచర్ సహా ఓ వృద్ధుడిని బయటకు గెంటేసిన వైనం.. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా రోగికి ఇంజెక్షన్ ఇవ్వని ఘటన.. ఇవన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జీజీహెచ్లో జరిగిన ఘటనలు. మళ్లీ చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ నిర్లక్ష్యం మరింత పెరిగింది. అత్యవసర వేళ వెటకారం తాజాగా ఈ నెల ఒకటో తేదీన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి(30) తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగంలో చేరాడు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నాడంటూ బంధువులు ఎంత వేడుకున్నా అక్కడి వైద్య సిబ్బంది చలించలేదు. పైగా ‘ఎవరి ఆక్సిజన్ మాస్క్ అయినా పీక్కుని వచ్చి మాకు ఇవ్వండి.. పెడతామంటూ’ వెటకారంగా మాట్లాడారు. కొద్ది సేపటికే ఊపిరి అందక గోపి మృతి చెందాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇలాంటి దారుణ ఘటనలు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో కోకొల్లలు. ఎంతో కీలక ఆసుపత్రి జీజీహెచ్కు గుంటూరుతో పాటు చుట్టుపక్కలనున్న ఆరు జిల్లాల ప్రజలు వైద్యం కోసం వస్తారు. రోజుకు దాదాపు 3,500 నుంచి 4 వేల మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యులు, వారు అందజేస్తున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షాత్తు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ వారంలో రెండు రోజులు సెలవులు పెట్టి మరీ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు పరుగులు పెడుతున్నారు. సీఎస్ఆర్ఎం వెంకటేశ్వరరావు సైతం రాత్రివేళ అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న ఇద్దరు అధికారులు సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో మిగతా వారు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు జీజీహెచ్లో గత తొమ్మిది నెలలుగా నమోదవుతున్న మరణాల రేటును పరిశీలిస్తే.. గుండెలు పగిలే నిజాలు వెలుగులోకొచ్చాయి. జీజీహెచ్లో 2024లో 7,846 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. 2025లో 6,529 మంది చనిపోయారు. 2026లో సైతం వారానికి వంద మంది చొప్పున మృత్యువాత పడుతున్న దయనీయ పరిస్థితి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. తీరు మార్చుకోని అఽధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్యచికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీఎస్ఆర్ఎంఓ, సూపరింటెండెంట్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని వైఎస్సార్ సీపీ హయాంలో నూతనంగా ప్రారంభించారు. అయితే ఎమెర్జెన్సీ వైద్యులు సరిగా డ్యూటీలు చేయకుండా సొంత ప్రాక్టీసు చేసుకుంటూ ఈ విభాగాన్ని గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసర వార్డుల్లోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఇంత జరుగుతున్నా వైద్యులు మాత్రం తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టును సీనియర్లకు ఇవ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారికి ఇవ్వడంతో సీనియర్ వైద్యులెవరూ వారి మాట లెక్కచేయని పరిస్థితి. ఇన్చార్జులు కావడంతో వారు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. అధికారికంగా 1,250 ... అనధికారికంగా మరో వెయ్యికిపైగా పడకలతో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా ఉంది. ఫలితంగా, ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకు కేటాయిస్తున్న సమయం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఇవ్వడం లేదు. ప్రధానంగా క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమెర్జెన్సీ వార్డులు, గైనిక్, పిల్లల వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. -
వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని బరంపేటలోని శ్రీ రాధా గోవింద చంద్రమందిరం (ఇస్కాన్) హరే కృష్ణ నామస్మరణతో మారుమోగింది. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, రంగవల్లులు తీర్చిదిద్దారు. తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీ రాధా గోవిందులకు శుభమంగళ హారతి సమర్పించారు. అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలతో ఉదయం 8.30 గంటలకు శుభదర్శన హారతితో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీమద్భాగవత ప్రవచనం, మహా హరినామ సంకీర్తనలతో ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు రాధాకృష్ణుల అలంకరణ చేసి ఆలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం ఆలయ ఆవరణలో నిర్వహించిన ఉట్లోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు ఉట్టి కొట్టేందుకు ఉత్సాహం చూపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రాత్రి ఉత్సవమూర్తులకు 56 రకాల ద్రవ్యాలతో మహాశంఖాభిషేకం, 108 రకాల భక్ష్యాలతో మహారాజభోగ నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏకాదశి ప్రసాద వితరణ గావించారు. -
నృసింహుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళగిరి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజా సామాగ్రితో హాజరై అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వరలక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. పుష్పాలు, పసుపు, కుంకుమ తదితర సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: నేటి యువతరం క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఐజీపీ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చి ఎనిమిది పతకాలు సాధించానని తెలిపారు. టేబుల్ టెన్నిస్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో పతకాలు సాధించి ఆల్రౌండర్గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈగల్ టీం టేబుల్ టెన్నిస్లో 40 ఫ్లస్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో రజత పతకాలు, 50 ఫ్లస్ సింగిల్స్, 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజత పతకం, షటిల్ బ్యాడ్మింటన్లో 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్లో రజతం, స్విమ్మింగ్లో 25 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. ఈగల్ విభాగం మొత్తంగా 40 పతకాలు సాధించడం విశేషమని పేర్కొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం – తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. మచిలీపట్నం – తిరుచానూరు (07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారు జామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పల్నాడు క్రీడాకారులు
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈనెల ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలలో వాటర్ పోలో విభాగంలో పల్నాడు జిల్లాకు చెందిన ఆర్.లోహిత్, కె.రుద్రప్రతాప్ సైదులురెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఏపీ స్విమ్మింగ్ కోచ్ జి.సురేష్ పర్యవేక్షణలో శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో శిక్షణ పొందారని తెలిపారు. జాతీయస్థాయి పోటీలో క్రీడాకారులు లోహిత్, రుద్రప్రతాప్లు ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. -
పేకాటకు ప్రోత్సాహం.. దాడులతో బీభత్సం
సాక్షి,టాస్క్ఫోర్స్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతం జూదానికి అడ్డాగా మారింది. పల్నాడు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని పేకాట క్లబ్లు నిర్వహించడంలో సత్తెనపల్లి పేకాట క్లబ్కు మంత్రి లోకేష్, చిలకలూరిపేట పేకాట క్లబ్కు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉండడంతోనే ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ బడా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తమదేపై చెయ్యిగా నడవాలన్నట్లు ఆ రెండు పేకాట క్లబ్ల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరుతో ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పేకాట క్లబ్పై గుర్తు తెలియని దుండగులు గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు దాడి చేశారు. నాలుగు కార్లలో 20 మంది దుండగులు పేకాట క్లబ్ వద్దకు చేరుకుని, అక్కడ పనిచేస్తున్న వాచ్మన్ చింతపల్లి రాజు, స్క్రోరల్ (పేక ముక్కలు పంచే వ్యక్తి)రెడ్డి ఆదినారాయణలపై దాడి చేశారు. వారి ఇరువురి వద్ద ఉన్న రూ.2,400 నగదు, రెండు సెల్ఫోన్లు తీసుకున్నారు. లోపలికి వెళ్లి నాలుగు క్యాష్ కౌంటర్లను పగల గొట్టారు. కౌంటర్లలో నగదు లేకపోవడంతో కుర్చీలు, టేబుళ్లు, అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలేవీ రికార్డు కాకుండా డీవీఆర్ బాక్స్ను అపహరించుకుపోయారు. తిరిగి కారులో ఎక్కి నరసరావుపేట వైపు వెళ్లారనేది ప్రచారం. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి టౌన్ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పేకాట క్లబ్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వాచ్మన్ రాజు, స్క్రోరల్ ఆదినారాయణతో మాట్లాడగా కారులో వచ్చారని ముందుగా నలుగురు దిగి తమను పట్టుకున్నారని, మిగిలిన వారు దాడి చేసి లోపలికి ప్రవేశించారని చెప్పారు. క్లబ్ ప్రెసిడెంట్ మేకల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటాల పంపకాల్లో విభేదాలే కారణం? సత్తెనపల్లి పేకాట క్లబ్ నిర్వహణలో వచ్చే లాభాల్లో నుంచి 50, 30, 20, 10 శాతం పర్సంటేజీల వంతున పంచుకునేందుకు ‘పెద్ద’మనుషుల ఒప్పందాలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రకారం వాటాల పంపిణీలో కొద్ది రోజులుగా జాప్యం చోటుచేసుకోవడంతో భాగస్వాములు ఎవరైనా దాడి చేయించి ఉంటారా? లేక వాటాలు మరికొన్ని రోజులపాటు ఆలస్యం చేసేందుకు నిర్వాహకులే దాడి చేయించారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రంగంలోకి పోలీసు బృందాలు సత్తెనపల్లిలో పేకాట క్లబ్పై దాడి జరగడాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మేరకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సత్తెనపల్లి పేకాట క్లబ్ ప్రాంతం నుంచి నరసరావుపేట వైపుగా రోడ్డుపైన ఉండే సీసీ కెమెరాలను పర్యవేక్షణ చేసుకుంటూ విచారణ చేపడుతున్నారు. సత్తెనపల్లి పేకాట క్లబ్పై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు కార్లలో నరసరావుపేట వైపు నుంచి చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా మార్టూరు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. వాచ్మన్ చింతపల్లి రాజు, స్క్రోరల్ రెడ్డి ఆదినారాయణల సెల్ఫోన్లు కూడా దుండగులు తీసుకొని వెళ్లడంతో ఆ ఫోన్లను ట్రాక్చేస్తూ పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. వీరిలో ఒకరిద్దరు పట్టుబడినట్లు సమాచారం. సత్తెనపల్లిలో పేకాట క్లబ్ ప్రారంభించిన నాటి నుంచి మూడు పువ్వులు .. ఆరు కాయలుగా సాగుతోంది. పేకాటరాయుళ్లను తీసుకువచ్చే బాధ్యత, పేకాట క్లబ్ నిర్వహణ, అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వచ్చిన ఆటగాళ్ల భద్రత ఏర్పాట్లు వంటి విధులను కూడా నిర్వాహకులు పంచుకొని క్లబ్ను నిర్వహిస్తున్నారు. దీంతో పల్నాడు జిల్లా వాసులే కాక గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతోపాటు హైదరాబాదు, నల్గొండ, తెలంగాణ వాసులు కూడా ఎక్కువగా వస్తున్నారు. రూ. వేల నుంచి రూ.లక్ష వరకు ఒక్కో విభాగంలో పదికి పైగా టేబుళ్లు ఏర్పాటు చేయడంతో జోరుగా పేకాట క్లబ్ నడుస్తోంది. సత్తెనపల్లి క్లబ్ నడవడం వల్లన చిలకలూరిపేట పేకాట క్లబ్కు వెళ్లే ఆటగాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సత్తెనపల్లిలోని పేకాట క్లబ్ను మూసి వేయించేందుకు చిలకలూరిపేట పేకాట క్లబ్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పారదర్శకంగా సర్ ప్రక్రియ
నరసరావుపేట ఈస్ట్: జిల్లాలో ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్యాదవ్ సర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులతో కలసి కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కు వివరించారు. కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దెయ్య, ఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జనగణన హ్యాండ్బుక్కు పక్కా సమాచారం ఇవ్వాలి.. నరసరావుపేట ఈస్ట్: జిల్లా జనగణన హ్యాండ్ బుక్ ప్రాంతీయ ప్రణాళిక, సామాజిక, ఆర్థిక విధానాల అమలుకు అత్యంత కీలక పత్రమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో గురువారం పల్నాడు జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీ, సంకలనంపై జిల్లా ఉన్నతస్థాయి సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.. జిల్లాలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని సమాచారాన్ని వ్యక్తిగతంగా ధ్రువీకరించి నిర్దేశించిన గడువులోపు అందచేయాలని ఆదేశించారు. సీఈఓకు వివరించిన కలెక్టర్ కృతికా శుక్లా -
వైఎస్సార్ సీపీలో జోష్
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కృష్ణం వందే జగద్గురుం సాక్షి, నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత కొన్ని రోజులుగా పల్నాడు జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అధికారపార్టీని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. ఇంకో రెండున్నర సంవత్సరాలు అధికారం చెలాయిస్తామన్న ధీమా కన్నా భవిష్యత్పైనే వారికి భయం పట్టుకున్నట్లుంది. దానికి ప్రధాన కారణం గత వారంలో రోజులుగా వైఎస్సార్ సీపీలోకి తెలుగుదేశం పార్టీలో నుంచి వస్తున్న వలసలు. అధికారపార్టీని వదలి, వారు పెడుతున్న భయాలు, ప్రలోభాలకు గురికాకుండా వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకుంటున్నారు. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒక చోట ప్రజాప్రతినిధులు, బలమైన సామాజికవర్గం అండ ఉన్న నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తుండగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదే ఊపు కొనసాగి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు మరింత మంది నేతలు అఽధికారపార్టీను వీడేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం. వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్న నేతలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత... స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ సీపీలోకి వస్తున్న వలసలు పార్టీలో కొత్త జోష్ను నింపుతున్నాయి. ఈ ఉత్సాహంతో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలు గత ప్రభుత్వంలో చేసిన మంచిని చెప్పుకొంటూనే, కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అఽధికార టీడీపీ నేతల్లో ఆంతర్మథనం మొదలైంది. ఎందుకు వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారన్న చర్చ గట్టిగా నడుస్తోంది. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే ఇలా నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుంటే ఎలా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇవ్వగలమన్న భయం వారిలో నెలకొంది. ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి వెళ్లడానికి అధికారపార్టీ నేతలు అలోచిస్తున్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ సైతం జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని కార్యకర్తల సమావేశంలో పెదవి విరిచినట్లు సమాచారం.పీఆర్కేను కలసి వైఎస్సార్సీపీ తోనే ఉంటామంటున్న మాచర్ల మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత జగన్నాథం శివయ్య, అనుచరులు గురజాలలో గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత టీడీపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని బేరీజువేసుకొని చాలా మంది టీడీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ ముశ్యం సీతారామయ్య కుమారుడు, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ముశ్యం శ్రీనివాసరావు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ ఎమ్యెల్యే కాసు మహేష్రెడ్డి చేతులు మీదుగా కండువా కప్పుకొన్నారు. గురజాల నియోజకవర్గంలో మరింత మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ నేతలే చెప్పుకొస్తున్నారు. ఊహించని దెబ్బతో ఖంగుతున్న గురజాల ఎమ్యెల్యే యరపతినేని శ్రీనివాసరావు గత రెండేళ్లుగా టీడీపీలో ఉంటున్న గురజాల నగరపంచాయతీ చైర్మన్ బడే జానీ మెడలో కొత్తగా పచ్చ కండువా కప్పి అభాసుపాలయ్యారు. -
ఫీజు కట్టివస్తానంటూ కానరాని లోకాలకు..
చిలకలూరిపేటటౌన్: ఇంటి నుంచి కళాశాలలో ఫీజు చెల్లించి వస్తానంటూ వెళ్లిన విద్యార్థి చెరువులో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లెమల్లి గ్రామానికి చెందిన గనిపినేని వెంకటేశ్వర్లు, నాగరాజా దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అభిలాష్ (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు చిలకలూరిపేట టిడ్కో గృహాల్లో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటూ చదువుకునేవాడు. ఏప్రిల్ తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయాడు. సప్లిమెంటరీ ఫీజు చెల్లించి వస్తానంటూ ఈనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఏమైందో ఏమో తెలీదు గాని చిలకలూరిపేట పట్టణం పరిధిలోని టిడ్కో గృహాల సమీపంలోని తాగునీరు సరఫరా చేసే కొత్త చెరువు గట్టుపై బుధవారం అభిలాష్ దుస్తులు, బ్యాగు, ఐడీకార్డు, చెప్పులు ఉండటాన్ని పురపాలక సిబ్బంది గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ ఎస్ఐ జి అనిల్కుమార్ అక్కడకు వచ్చి గజ ఈతగాళ్లతో చెరువులోనూ, ఫిల్టర్ బావిలోనూ గాలింపు ప్రారంభించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అభిలాష్ మృతదేహం చెరువులో తేలి కన్పించడంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మొదటి నుంచి కళాశాల పట్ల ఇష్టం లేదని, తనకు ఇష్టంలేని కారణంగానే ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యుల ద్వారా ప్రాథమిక సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా యశోదర
వినుకొండ: వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ వింజనంపాటి యశోదర ప్రతిష్టాత్మక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యా రంగంలో ఆమె అందిస్తున్న విశేష సేవలు, సాధించిన ఘనతలకు గాను ఈ గౌరవం దక్కింది. డాక్టర్ యశోదర 1995 జూన్లో బాపట్ల ఎస్.ఎమ్. గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్లో హిందీ గ్రేడ్–2 ఉపాధ్యాయురాలిగా తమ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2000 మే నెలలో సంగం జాగర్లమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. 2025 జూన్లో వినుకొండ బాలుర ఉన్నత పాఠశాల హెచ్.ఎమ్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ప్రస్తుతం రొంపిచర్ల మండలం ఎఫ్ఏసీ ఎంఈఓగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిశోధనలు, పుస్తక రచనల్లో ప్రతిభ 2017లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా ‘రామదర్శ మిశ్ర కే కథా సాహిత్య మే నారి‘ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి పీహెచ్డీ సాధించారు. 2021లో 7వ తరగతి హిందీ పాఠ్యపుస్తక రచయితగా వ్యవహరించారు. నేషనల్ బుక్స్ ట్రస్ట్ తరఫున హిందీ నుండి తెలుగులోకి ‘బిస్మిల్లా ఖాన్’, ‘ఏకతా కాసిని’, ‘కరోనా వైరస్ – సింబా’ అనే మూడు ప్రతిష్టాత్మక పుస్తకాలను అనువదించారు. నాలుగు సంవత్సరాలుగా యూటీఎఫ్ తరఫున పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు తయారు చేయడంతో పాటు, అనేక జాతీయ రీసెర్చ్ జర్నల్స్లో వ్యాసాలు ప్రచురించారు. పాఠశాల పురోగతిలో కీలక పాత్ర హెచ్.ఎమ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15శాతం పెరిగింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 14 మందికి పైగా విద్యార్థులు 500 కి పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని సమున్నతంగా నిలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న డాక్టర్ యశోదరను వినుకొండ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. మరొకరు అరెస్ట్ -
15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్లు
11మందికి తీవ్ర గాయాలు అచ్చంపేట: పిచ్చికుక్క స్వైర విహారం చేసి 11 మందిని తీవ్రంగా గాయపరచిన ఘటన అచ్చంపేట మండలం మాదిపాడులో గురువారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో షేక్ సైదా, ఫాస్టర్ విద్యాశేఖర్, యాంపొంగు శ్రావణి, మరికొంతమంది పడవ ప్రయాణికులు ఉన్నారు. అందరికి డాగ్బైట్ ఇంజక్షన్లు చేశారు. గాయపడినవారిలో ఒక చిన్నారి కూడా ఉన్నాడు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం లేదని, అందరికి ఇంజక్షన్లు చేశామని వైద్యాధికారి రాములునాయక్ తెలిపారు. సత్తెనపల్లి: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి విజయ్కుమార్రెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. అమరావతికి చెందిన ఒంటిపులి దావీదు, నాగలక్ష్మి భార్యా,భర్తలు. 17 సంవత్సరాల కిందట వీరికి వివాహమైంది. కొంతకాలంగా చెడు అలవాట్లకు బానిసైన భర్త భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తుండడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత సరిగ్గా చూసుకుంటానని నమ్మబలికి 2019 అక్టోబర్ 21న దావీదు తన భార్యను అమరావతి తీసుకొని వచ్చాడు. ఇంటికి రాగానే నిన్ను చంపడానికే ఇంటికి పిలిచానని, కూరగాయల కత్తితో ఆమె పీక కోసి కొన్నిచోట్ల గాయపరిచి పడవేసి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వారి సహాయంతో 108 అంబులెన్స్లో అమరావతి సీహెచ్సీలో చేరి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ తరలించారు. వైద్యశాలలో బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు భర్త దావీదుపై అప్పటి అమరావతి ఎస్ఐ డి రవీంద్రబాబు కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొల్లా వెంకటేశ్వరరావు కేసుకు సంబంధించిన న్యాయ పరమైన విషయాలను వివరిస్తూ కేసు నిరూపణ అవడంలో కీలకపాత్ర పోషించాడు. న్యాయమూర్తి విజయ్కుమార్రెడ్డి పై విధంగా తీర్పు వెలువరించారు. -
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సుజాత
గిరిజనుల విద్యాభివృద్ధిలో సుజాత సేవలకు గుర్తింపు మాచర్ల రూరల్: గిరిజన చిన్నారుల చేత బలపం పట్టించి అక్షరాలు దిద్దించి, వారి ఉన్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ గిరిజన విద్యార్థుల్లో సంకోచాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటంలో ఆ ఉపాధ్యాయురాలు సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసింది. మాచర్ల మండలం ఎత్తిపోతల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న మారుబోయిన సుజాతకు అరుదైన గౌరవం దక్కింది. 2012 డీఎస్సీ ద్వారా ఎస్ఎగా భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలుగా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, మురికిమళ్ల తండాలో విధుల్లో చేరారు. ఉపాధ్యాయురాలుగా నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చొరవచూపి తల్లిదండ్రుల విశ్వాసాన్ని సంపాదించారు. అక్టోబర్లో అంతర్జిల్లా బదిలీ ద్వారా పల్నాడుకు వచ్చి శిరిగిరిపాడు పాఠశాలలో పనిచేశారు. అక్కడ విద్యార్థులకు సైన్స్లో టాలెంట్ టెస్టులు, ప్రయోగశాలలు ఏర్పాటు చేసి కలెక్టర్ ద్వారా మెరిట్ సర్టిఫికెట్లను అందుకున్నారు. ముఖ్యంగా బడి మానేసిన విద్యార్థులను బడికి తీసుకురావటంతో పాటు, ఆరోగ్య సమస్యలతో పాటు బాధపడుతున్న వారికి సొంత ఖర్చులతో వైద్యం అందించి చిన్నారుల మనసు గెలుచుకున్నారు. వెల్దుర్తి మండల సైన్స్ అధికారిగా జిల్లా స్థాయిలో సైన్స్ కార్యక్రమం నిర్వహించి అవార్డు అందుకున్నారు. సైన్స్ పట్ల విద్యార్ధుల్లోని భయాన్ని పోగొట్టి వారికి సులభమైన రీతిలో ప్రయోగాల ద్వారా విద్యనందించటంలో ఆమె ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. -
బెయిల్పై సింగారెడ్డి విడుదల
మాజీ మంత్రి విడదల రజిని పరామర్శ నాదెండ్ల: అక్రమ కేసుల్లో అరైస్టె జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్యార్డు మాజీ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి గురువారం బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ ముప్పై ఏళ్ల తన రాజకీయ జీవితంలో కక్షసాధింపు రాజకీయాలు తానెప్పుడూ చూడలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒకసారి అరెస్టు చేశారని, ప్రస్తుత టీడీపీ పాలనలో నాతో పాటూ మాజీ సర్పంచ్, నా భార్య లక్ష్మిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, వైఎస్సార్ సీపీ కోసం తానెప్పుడూ పనిచేస్తానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాజకీయ వేధింపులతో నాయకులు, కార్యకర్తల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవటం తన బాధ్యత అని, చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా సాగాలన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఉడతా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దరియావలి, నాదెండ్ల మండల ఉపాధ్యక్షుడు అల్లడి రవికుమార్, ఎస్సీ సెల్ నాయకులు శేషయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, బూత్ కమిటీ అధ్యక్షుడు శేషిరెడ్డి ఉన్నారు. -
ఏ తల్లి కన్న బిడ్డో..
నరసరావుపేట టౌన్: ఆర్థిక భారమో లేకా మరో ఇతర కారణమో తెలియదు గానీ నవమాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి నిర్మాన్యుష్య ప్రదేశంలో వదిలి వెళ్లింది. శిశువు చీకట్లో ఏడుస్తుండగా ఆరోధనలు విన్న ఆసుపత్రి సిబ్బంది అక్కడకు చేరుకొని కాపాడిన ఉదంతమిది. నరసరావుపేట పట్టణంలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల పరిధిలోని శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో మంగళవారం అర్థరాత్రి పసికందు ఏడుపు వినిపించింది. ఆసుపత్రి మేనేజర్ కృష్ణచైతన్యారెడ్డి అక్కడకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ రెండు రోజుల కిందట పుట్టినట్లు కనిపిస్తున్న ఆడశిశువును గుర్తించి వెంటనే వైద్యశాలకు తరలించారు. శిశువును వైద్యల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని గురువారం నరసరావుపేట రూరల్ పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. డీఎస్పీ హనుమంతరావు, ఎస్ఐ కిశోర్ వైద్యశాలకు చేరుకుని పసికందును పరిశీలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శిశువును అక్కడ ఎవరు వదిలి వెళ్లారు.. తల్లిదండ్రులు ఎవరు.. ఏ పరిస్థితుల్లో పసికందును నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న సీసీ కెమారాల పుటేజ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. శిశువుకు సంబంధించి తల్లిదండ్రులు లేదా కుంటుంబ సభ్యుల గురించి సమాచారం తెలిసిన రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ఏకై క మార్గం ప్రకృతి వ్యవసాయం
జర్మనీ శాస్త్రవేత్త వాల్టర్ నార్నెపాడు(ముప్పాళ్ళ): ఎల్నినో ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయ విధానాలే ఏకై క మార్గమని జర్మనీకి చెందిన శాస్త్రవేత్త వాల్టర్ అన్నారు. మండలంలోని నార్నెపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను హిమాచల్ప్రదేశ్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సడానా, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే.అమలకుమారిలతో కలిసి గురువారం సందర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఏటీఎమ్ మోడల్ విధానాన్ని అవలంభిస్తే ఏడాది పొడవునా వివిధ పంటల ద్వారా ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్త వాల్టర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న పంటలపై ఎల్నినో ప్రభావం పెద్దగా కనిపించకపోవడం పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఆర్ఎఫ్ ధనలక్ష్మి, జిల్లా సిబ్బంది సైదయ్య, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ కే.పూజ, ప్రకృతి వ్యవసాయ రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
గణిత బోధకుడికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
యడ్లపాడు: విద్యారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇప్పటికే మండల, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్న జగ్గాపురం జెడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు ఎస్ ఆదినారాయణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన విద్యార్థులకు గణితాన్ని సులభతరం చేస్తూ.. వినూత్న బోధనా పద్ధతులతో వారి ప్రతిభను వెలికితీస్తూ.. విద్యారంగంలో విశిష్ట సేవలందించారు. బోధనలో వినూత్నం, లోకాస్ట్తో టీఎల్ఎం, ఐఎల్ఎం మెటీరియల్తో గణితాన్ని ఆసక్తికరంగా, గణిత, విజ్ఞాన ప్రదర్శనలతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం ఆయన ప్రత్యేకత. దూరదర్శన్సప్తగిరి ఛానల్లో 1నుండి 10వ తరగతి వరకు గణిత బోధకుడిగా సేవలందించారు. ఆదినారాయణ మార్గదర్శకత్వంలో విద్యార్థులు రాష్ట్రస్థాయి గణిత క్విజ్తో పాటు క్రీడలు, చిత్రలేఖనం, నాటక పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. 2012 నుంచి 2025 వరకు పాఠ్యపుస్తకాలు, మాడ్యూళ్ల రచయితగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ వైదిక గణిత రిసోర్స్ పర్సనన్గా కొనసాగుతున్నారు. వేదిక్ మ్యాథమెటిక్స్ విషయ నిపుణుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గణిత పాఠ్యపుస్తక రచయితగా విద్యారంగంలో తనదైన గుర్తింపు పొందారు. మానవతా సంస్థ ద్వారా 204 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపిక కావడం ఆయన విద్యా ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. గణితంలో ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో పాటు నూటికి నూరు మార్కులు సాధించారు. విద్యార్థులను వివిధ ప్రతిభా పరీక్షల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ.. వారు అనేక పతకాలు, నగదు బహుమతులు సాధించేలా మార్గనిర్దేశం చేశారు. ఉపాధ్యాయ బాధ్యతలే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఈనెల 5న విజయవాడలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి ఆయన పురస్కారాన్ని అందుకోనున్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చెట్లు లేకుంటే.. భూమి మరో మార్స్
ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కె.నాగేంద్రబాబు చిలకలూరిపేట(యడ్లపాడు): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం పట్టణంలోని ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించాలని సూచించారు. చిలకలూరిపేటలో రూ.3 కోట్లతో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ కృష్ణప్రియ పాల్గొన్నారు. గుర్తు తెలియని వృద్ధుడు మృతి సత్తెనపల్లి: పట్టణంలోని గుంటూరు బస్స్టాప్ సెంటర్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని పట్టణ పోలీసులు గుర్తించారు. మృతుని వయసు సుమారు 70 ఏళ్ల వరకు ఉంటుందని, తెల్లచొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు సత్తెనపల్లి టౌన్ పోలీస్స్టేషన్ లేదా సీఐ 9440796230 నంబర్కు సమాచారం తెలియ చేయాలని పట్టణ ఎస్ఐ పీ.పవన్కుమార్ బుధవారం తెలిపారు. చీకటి గోపి మృతిపై కేసు నమోదు తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపిని కేసు విచారణలో భాగంగా తాడికొండ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూధనరావును నియమించడంతో ఆయన పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన తాడికొండ పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు ఏంటి అనే విషయాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ పుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తెనాలిలో అవినీతి ఆరోపణలు ఎదుక్కొని వీఆర్లో ఉంటూ తాడికొండకు పోస్టింగ్పై వచ్చిన ఓ కానిస్టేబుల్తో పాటు తాడికొండలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ కేసు విచారణలో భాగంగా మృతుడిని కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తి నివేదిక అంది విచారణ జరిగితే కానీ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్ గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి గుంటూరు జీజీహెచ్లో మంగళవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్లో ఆందోళన చేసిన విషయం విధితమే. పోలీసుల లాఠీ చార్జి వల్లే గోపి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించడంతో బుధవారం గోపి పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పూర్తి చేశారు. -
అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలి
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవాలలో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. దేశ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వర్సిటీ ప్రాంగణం సందడిగా మారింది. పాత మిత్రులను కలుసుకుని, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమానికి పూర్వ విద్యార్థులు సహకారం అందించాలన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ టి. జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను అందించిందన్నారు. రాష్ట్ర సీఐడీ డీజీపీ డాక్టర్ ఎస్. రవిశంకర్ అయ్యనార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలామణి, కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు, మాజీ డీజీపీ బండి మరియాకుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం. ప్రేమ్కుమార్, వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తదితరులు ప్రసంగించారు. -
మంచినీటి చెరువులు నూరుశాతం నింపాలి
శావల్యాపురం: సాగర్ జలాలతో మంచినీటి చెరువులను నూరుశాతం నింపాలని జిల్లా ఎన్ఎస్పీ ఈఈ తమ్మిశెట్టి చంద్రశేఖర్ కోరారు. బుధవారం మండలంలోని పోట్లూరు, శానంపూడి గ్రామాల్లోని తాగునీటి చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఈఈ మాట్లాడుతూ జిల్లాలో రక్షిత తాగునీటి చెరువులు 132 ఉన్నాయని, ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. చెరువులు, నీటి కుంటలు పూర్తిస్థాయిలో నిండేలా పంచాయతీ, ఆర్డబ్యూఎస్, ఎన్నెస్పీ అధికారులు సమన్వయంతో నింపటానికి శక్తివంచన లేకుండా చేయాలన్నారు. పోట్లూరు గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకి ఫిల్టర్బెడ్స్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో రూ.17 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మంచినీటి చెరువులో చేపల పెంపకంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. శానంపూడిలో జలజీవన్ మిషన్ నిధులు రూ.50 లక్షలతో జరుగుతున్న పైపు నిర్మాణ పనులు తుది దశకు చేరాయని త్వరలో మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు డీఈ ఆర్.కుమార్రాజా, ఏఈ రత్నబాబు ఉన్నారు. ఎన్ఎస్పీ ఈఈ చంద్రశేఖర్ -
వెళుతున్న బైక్పై నుంచి దూకిన యువకుడు మృతి
గుంటూరు రూరల్: ద్విచక్రవాహనంపై వెళుతూ ద్విచక్రవాహనంపైనుంచి దూకే క్రమంలో యువకుడు మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చల్లా నాగవర్థన్రెడ్డి (25), అదే గ్రామానికి చెందిన మస్తాన్లు ఇద్దరు నల్లపాడులోని ఒక బార్లో మద్యం సేవించారు. అనంతరం గుంటూరువైపు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం నడుపుతున్న మస్తాన్ వాహనాన్ని అతి వేగంగా నడిపిస్తుండగా వెనుక కూర్చున్న నాగవర్థన్రెడ్డి భయపడి ద్విచక్రవాహనంపై నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. వేగంగా వెళుతున్న ద్విచక్రవాహనంపై నుంచి దూకటంతో స్పీడుకు తట్టుకోలేక రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఢీకొన్నాడు, అక్కడినుంచి పక్కనే ఉన్న పంచర్షాపులోని గాలిసిలెండర్కు ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మస్తాన్ అదేవిధంగా స్పీడుగా వెళుతూ రోడ్డుపక్కన నిలిపిఉన్న లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో మస్తాన్కు గాయాలయ్యాయి. సంఘటనలో స్థానికులు మస్తాన్ను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించగా, నాగవర్థన్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి మృతుని బంధువులకు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
అమరేశ్వరునికి పవిత్రాల సమర్పణ
అమరావతి: పంచారామాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతి శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలలో రెండవ రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయ అర్చకులు, వేదపండితులు మండప పూజ, దీక్షా హోమం, రుద్ర హోమం, పవిత్రధారణ, చండీ హోమం, దీక్షా హోమం, హారతి, మంత్రపుష్పములు సమర్పించారు. అనంతరం అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీదేవికి, 18 ఉపాలయములలో పట్టు పవిత్రాలు సమర్పించి రుద్ర, చండీ, విశేష హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అమరేశ్వరునికి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. గురువారం ఉదయం పవిత్రోత్సవాలలో ముగింపు సందర్భంగా 11 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ శ్రీ స్వామివారి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల నిరసన
నరసరావుపేట ఈస్ట్: కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లాల ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయం ఎదుట ఉద్యోగులు ‘టీమ్ పల్నాడు– ఏపీ పారా మెడికల్ జేఏసీ’ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, వంద శాతం గ్రాస్ జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలన్నారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీసెట్–2026 నోటిఫికేషన్లో పొందుపర్చిన విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ఈనెల 8వ తేదీలోగా ఆన్లైన్లో పూర్తి చేయాలని సూచించారు. ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులై, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీలో ఎమ్మెస్సీ జువాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెనాలి: దుబాయ్లో జరగనున్న సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ పోటీలకు తెనాలికి చెందిన పల్నాటి నాగరాజు ఎంపికయ్యారు. చాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ పిల్ల శరత్ ఈ మేరకు సమాచారం పంపారు. గత ఆగస్టు నెలలో తునిలో సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించారు. తొలి సీజనులో ప్రతిభ చాటిన 24 మందిని దుబాయ్లో జరిగే టీ 20, వన్డే మ్యాచ్లకు ఎంపిక చేశామని తెలిపారు. ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రత్తిపాడు: మహిళల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమాలు 15వ రోజుకు చేరాయి. బుధవారం మధ్యాహ్నం రమాదేవి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. హక్కులపై అవగాహన పెంపొందించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. చుండి రంగనాయకులు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ టి.వెంకట నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. నగరంపాలెం: ప్రజలు, ప్రభుత్వ అధికారులకు కొంత మంది వ్యక్తులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల పేర్లు, హోదాలను ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటి నకిలీ ఫోన్ కాల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత/ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, పీన్లు, ఇతరత్రా రహస్య సమాచారాన్ని తెలియజేయవద్దని తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తే స్థానిక పోలీస్స్టేషన్లోగానీ ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064, ఏఎస్పీ 94913 05638, డీఎస్పీ 92465 37807 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
గ్రూపు రాజకీయాలతో పార్టీకి ఇబ్బంది
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలున్నాయి.. వాటి వల్ల పార్టీకి ఇబ్బందులొస్తాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రూపు రాజకీయాలను పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామన్నారు. జిల్లాలో కొందరు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. పార్టీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నరసరావుపేట ఎస్ఆర్కేటీ జంక్షన్లో ఉన్న పార్టీ కార్యకర్తలు మల్లమ్మ సెంటర్ వరకు కూడా రాకపోవడం, ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చే సరికి ఎవరూ లేకపోవడంపై స్థానిక టీడీపీ నేతలతో లోకేష్ ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు జేఎన్టీయూ కళాశాలను యూనివర్సిటీగా ఉన్నతీకరించాలని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్పై హామీ ఇవ్వకపోవడంతో పెదవి విరిచారు. కళాశాల అధ్యాపకుల కొరత, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులలో వేగం పెంచడంపై స్పందించకపోవడంపై కళాశాల విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇరు వర్గాల ఘర్షణ.. ఎనిమిది మందికి గాయాలు
ఈపూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఎనిమిది మందికి గాయాలైన ఘటన మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం రొంపిచర్ల మండలంలోని ఆరేపల్లి గ్రామానికి శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తూ ఈపూరు మండలం బొగ్గరం గ్రామ ఎస్సీ కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళలతో ఘర్షణ పడ్డారు. అనంతరం అగ్నిగుండాల గ్రామంలోని బంధువుల ఇంటికి చేరారు. గొడవ సమాచారం తెలుసుకున్న బొగ్గరం ఎస్సీ కాలనీ వాసులు అగ్నిగుండాల చేరుకొని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు, రాళ్లు, కరల్రతో దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో బొగ్గరానికి చెందిన పావులూరి రాంబాబు, పావులూరి ప్రవీణ్ కుమార్, కొలనీడి రవిశంకర్, కోలనీడి నాగరాజు, గడ్డం వెంకటరమణ, పావులూరి అంకమ్మ, కోలనీడి చెన్నమ్మకు గాయాలవ్వగా ఈపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పావులూరి రాంబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట తరలించారు. వెల్లటూరుకు చెందిన ఏడుకొండలు తలకు తీవ్ర గాయాలు కాగా వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
లోకేష్ పర్యటన.. ప్రజలకు నరకయాతన
నరసరావుపేట టౌన్: మంత్రి నారా లోకేష్ పర్యటన నరసరావుపేట ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాకాని గ్రామం వద్ద ఉన్న జేఎన్టీయూ కళాశాల హాస్టల్ భవన ప్రారంభోత్సవానికి బుధవారం మంత్రి హాజరయ్యారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు పట్టణంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రయాణికులతో పాటు రోజు వారీ పనులకు వెళ్లే ప్రజానీకం నరకయాతన అనుభవించారు. చిలకలూరిపేట రోడ్డు నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా లోకేష్ ర్యాలీగా రావటంతో మల్లమ్మ సెంటర్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పట్టణంలోకి ప్రవేశించేందుకు ఉన్న నాలుగువైపుల మార్గాలకు బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా గుంటూరు, సత్తెనపల్లి మార్గాలకు వెళ్లే బస్సుల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న మార్గాల్లోనూ ట్రాఫిక్ స్తంభించి పోవటంతో వాహనాలు గంటల తరబడి ముందుకు కదలలేదు. దీంతో రోడ్లపైనే ప్రయాణికులు ఉండిపోయారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, అత్యవసర పనులపై ఆసుపత్రులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంక్షలు అమలు చేసే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్దం చేయాల్సిన అధికారులు ఆదిశగా ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపించాయి. మంత్రి మెప్పు కోసం ఆరాటం.. మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా వ్యవహరించలేదు. మంత్రి కాన్వాయ్ సాఫీగా వెళ్లేందుకు ప్రధాన రహదారులను గంటలతరబడి నిలిపివేశారు. ప్రజాప్రతినిధుల రాకపోకల కోసం రవాణా వ్యవస్థను పూర్తిగా స్థభింపచేయటం సరైన పద్దతి కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవటంతో సమస్య తలెత్తింది. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో అంబులెన్స్లు, అత్యవసర వైద్యసేవలకు వెళ్లే వారి పరిస్థితి ఏంటన్నా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కీలకమైన ఓవర్బ్రిడ్జి మార్గాన్ని పూర్తిగా నిలిపివేయటంతో సత్తెనపల్లి, గుంటూరు వెళ్లే వారు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు ఓవర్బ్రిడ్జి మూసివేత.. మరోవైపు మంత్రి ర్యాలీ.. ఇంకో వైపు ప్రత్యామ్నయ మార్గంలో వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.


