Palnadu District News
-
ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
ఈనెల 24 వరకు ఏపీ ఈఏపీ సెట్–2026 దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో తాజాగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2026 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 36 ఇంజనీరింగ్ కళాశాలల్లో 30,240 సీట్లు ఏపీ ఈఏపీసెట్ సైట్లో పూర్తి సమాచారం సైట్కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2026పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్టక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు ఇలా -
60 కిలోల రాగి తీగలు స్వాధీనం
తెనాలిరూరల్: ౖరెల్వేకు చెందిన వైర్లను దొంగిలించి వాటిని కాల్చి రాగి తీగలను అమ్మిన నిందితులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి వైర్లు, రాగి తీగలను స్వాధీనపర్చుకున్నారు. తెనాలి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి. హీరాసింగ్ వివరాలను శుక్రవారం వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ టెలికాం స్టోరులో ఈ నెల 8వ తేదీన సుమారు రూ. 2.25 లక్షల విలువైన వైర్లు అపహరణకు గురయ్యాయి. నిందితు లు స్టోర్ రూమ్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రయ త్నించారు. నిందితులు కావలికి చెందిన దార్ల శ్రీను, దార్ల సింహాద్రి, దార్ల పుట్టయ్య, పర్తపు దుర్గయ్య, పర్తపు వల్లూరయ్య, నెల్లూరుకు చెందిన పర్తపు శ్రీనుగా గుర్తించారు. నిందితులు కొంత కాలంగా తెనాలి వీఎస్ఆర్ కళాశాల ఎదురు కఠెవరం కాల్వకట్టకు వెళ్లే దారిలో ఐసీడీఎస్ కా ర్యాలయం ఎదుట పాకలు వేసుకుని ఉంటున్నా రు. అదను చూసి రైల్వే వైర్లను దొంగలించారు. అపహరించిన వైరులో సగ భాగం కాల్చి రాగి తీగలను నందివెలుగులోని ఓ వ్యక్తికి విక్రయించారు. అతను విజయవాడలోని మరో వ్యక్తికి విక్రయించాడు. విజయవాడ వ్యక్తి విజయవాడ ఆటోనగర్లోని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివరామకృష్ణయ్య, విజయవాడ ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు ఉన్నారు. -
రంజాన్ ప్రార్థనలకు సర్వం సిద్ధం
పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని గ్రామ పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. బాబావారి గుర్రం దర్గాలోకి చేరుకోగాలనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు గంధం పంపిణీ చేశారు. గంధం పంపిణీ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది. భక్తులందరికీ గంధం పంపిణీ జరిగిందని వక్ఫ్బోర్డు ఈఓ షేక్ ఖాజావలి తెలిపారు. -
మోసం తెలియని నేత వైఎస్ జగన్
రొంపిచర్ల: మోసం చేయడం తెలియని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఉగాది సందర్భంగా రొంపిచర్లలో గురువారం రాత్రి శ్రీ బాల త్రిపుర సమేత శంకరేశ్వరస్వామి తిరునాళ్లలో పాల్గొని ఆయన మాట్లాడారు. రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజలకు ఏమి చేయకుండా నయవంచన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల శివారెడ్డి, పడాల చక్రారెడ్డి, గెల్లి బ్రహ్మారెడ్డి, గెల్లి కోటిరెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కురుగుంట శ్రీనివాసరెడ్డి, పునుగోటి వెంకట్రావు, మోతుకూరి వెంకటేష్, నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు మోరబోయిన శ్రీనివాసరావు, పచ్చవ రవీంద్రబాబు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
దీక్ష ముగిసె .. దువా ఫలించే
సత్తెనపల్లి: పవిత్ర రంజాన్ మాసం నేటితో ముగియనుంది. శుక్రవారం సాయంత్రం చంద్ర వంక దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్–ఉల్–ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు (రోజా), ప్రత్యేక తరావీహ్ నమాజ్, సహర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముస్లింలు గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా నిష్టతో దీక్షలు పాటించారు. చివరకు నెల వంక దర్శనం కావడంతో పండుగ చేసుకోనున్నారు. ఈదుల్ ఫితర్ నమాజ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈద్గాలతోపాటు మసీదుల్లో సౌకర్యాలు కల్పించారు. పండుగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈదుల్ ఫితర్ నమాజ్ చేయడం ఆనవాయితీ. నెల రోజులు తమ నమాజులు ఫలించాలని, సర్వ మానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ అల్లాహ్కు దువా చేస్తారు. 2.50 శాతం జకాత్ రంజాన్లో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. మనిషి ఆరోగ్యం, తాను సంపాదించిన ధనం పై అల్లా నిర్దేశించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకుమించి విలువైన ధన, ఆస్తులు కలిగితే జకాత్కు అర్హులు. వాటి వెల లెక్క కట్టి 2.5 శాతం పేదలకు జకాత్ రూపేణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రంజాన్లో ఇస్తే 72 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుందనేది ముస్లింల విశ్వాసం. ఫిత్రా ఇవ్వాల్సిందే .. సాధారణ ముస్లిం రంజాన్ సందర్భంగా 2.6 కిలో గ్రాముల గోధుమలు, వరి (ప్రధాన ఆహార ధాన్యం), సమానమైన డబ్బు పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మత పెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని నిరుపేద ముస్లింలకు ఫిత్రా దానం ఇవ్వాలి. సద్ఖా–ఎ–ఫిత్రాతో ఆరోగ్య బీమాను అల్లాహ్ కల్పిస్తారంటారు. సూత్రప్రాయంగా ఈ ఏడాది మత పెద్దలు రూ. 105 ఫిత్రా ఇవ్వాలని సూచించారు. దీని కంటే ఎక్కువ ఇవ్వవచ్చు. కానీ తగ్గించరాదు. పండుగకు కనీసం ఒకరోజు ముందే ఫిత్రా చెల్లిస్తే పేదలు సైతం పండగ చేసుకునే వీలుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున ఫిత్రా ఇవ్వాలి. అల్లా ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్ ఎతెకాఫ్ అల్లా ఇంటి (మసీదు) ఆతిథ్యం వంటిది. రంజాన్లో దీనికెంతో ప్రాధాన్యం ఉంది. ఊళ్లో0 ఒక వ్యక్తి కూడా ఎతెకాఫ్ ఉండకపోతే, ఆ ఊరిపై అల్లా కరుణ, కటాక్షాలు ఉండవని పవిత్ర ఖురాన్ బోధిస్తోంది. ఎతెకాఫ్ను రంజాన్ చివరి పది రోజుల్లో పాటించాలి. ప్రాపంచిక జీవితానికి దూరంగా, వీలుపడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో అల్లా ధ్యానంలో గడపడమే ఎతెకాఫ్. అన్నిటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే వానిపై అల్లాహ్ అత్యంత కరుణతో మొర ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు. సామూహిక నమాజులకు ముందు మహా ప్రవక్త మొహమ్మద్ సంప్రదాయ ప్రకారం ఖర్జూరం సేవించి, నూతన వస్త్రాలు ధరించి, అత్తరు రాసుకొని నమాజు కోసం ఈద్గాకు చేరుకుంటారు. అక్కడ ఈద్ నమాజు చదివి, అనంతరం పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకొంటారు. అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఇంటి నుంచి ఇద్గాకు వెళ్లి, నమాజ్ పూర్తయ్యాక వేరే మార్గంలో ఇంటికి చేరుతారు. రంజాన్లో సేమియా పాయసం ప్రత్యేకం. బంధుమిత్రులకు ఇరుగుపొరుగు వారికి సేమియా పాయసం ఇచ్చి తమ ఆత్మీయతను పంచుకుంటారు. చిన్నపిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు. -
నిద్రలోకి నిఘా.. బుకీలదే హవా
నిండు ప్రాణాలు బలి సాక్షి, నరసరావుపేట: దాదాపు 30 మందికిపైగా క్రికెట్ బుకీలు నరసరావుపేట పట్టణంలోనే ఉన్నారని సమాచారం. పల్నాడు జిల్లాతో పాటు మూడు, నాలుగు రాష్ట్రాలలో నరసరావుపేటకు చెందిన బుకీలు క్రికెట్ పందేలు నిర్వహిస్తుంటారు. ఇంత జరుగుతున్నా పల్నాడు పోలీసులు వారిపై గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు బుకీలపై రౌడీషీట్లు తెరిచారు. అయినా వారిలో మార్పు రాకపోగా మరింతగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీరి వలలో పడి బెట్టింగ్ ఆడుతున్న యువత అర్ధంతరంగా జీవితాలనే ముగిస్తున్నారు. అరెస్ట్ చేసినా పరార్ నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ను ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు గత వారం అరెస్ట్ చేశారు. గోల్డ్ శేఖర్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు కమ్యూనికేటర్ బాక్సులు, రెండు ల్యాప్టాప్లు, 21 మొబైల్ ఫోన్లు, రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ శేఖర్ ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన మరో బుకీని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి లిస్ట్లో మరో పది మంది వరకు ఉన్నట్టు తెలియడంతో సదరు బుకీలు మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకొని గోవా, శ్రీలంకలకు పారిపోయినట్టు సమాచారం. ఓవైపు ప్రకాశం పోలీసులు నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీల విషయంలో ఇంత చేస్తూంటే పల్నాడు జిల్లా పోలీసులు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరసరావుపేట అడ్డాగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా ఎందుకు స్థానిక పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారని విమర్శలొస్తున్నాయి. బుకీలు ఇస్తున్న మామూళ్లతో కొందరు పోలీసులు బెట్టింగ్ దందాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. బెట్టింగ్ జడలు విప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా దీనిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. నరసరావుపేటతో పాటు మారుమూల గ్రామాల్లో సైతం బెట్టింగ్ చాపకింద నీరులా విస్తరించింది. ఇటీవల జరిగిన వరల్డ్ టీ20 ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్కు జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల చేతులు మారాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో ఈ బెట్టింగ్ జరుగుతోంది. అవగాహన సదస్సులు పెట్టి, ప్రెస్నోట్లు ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఐపీఎల్ మొదలు కానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై క్షేత్రస్థాయిలో మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
కార్మెల్ కొండ వద్ద విద్యార్థుల ప్రార్థనలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్ మాత వద్ద సెయింట్ ఆన్స్ సెంటినరీ ఇంగ్లిషు మీడియం పదవ తరగతి విద్యార్థులు ప్రార్థనలు నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం సిస్టర్ కె.నిర్మల తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా దైవానుగ్రహం అందేలా ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాథ్యాయులు కె.అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు. పోలేరమ్మ తిరునాళ్ల వేడుకలు రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయ 37వ వార్షికోత్సవ తిరునాళ్ల వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజనరీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తిరునాళ్లకు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామస్తులు విద్యుత్ ప్రభను నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రొంపిచర్ల పోలీసులు తిరునాళ్లలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నీటి మట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 535.70 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,541, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 18,864 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 18,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
పల్నాడు
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. ధనలక్ష్మీగా అమ్మవారు పిడుగురాళ్ల: నాగులగుడిలో దేవీ వసంత నవరాత్రులలో భాగంగా మహా సరస్వతి అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
భృతి భ్రమ.. కొలువు మమ!
సత్తెనపల్లి: చదువుకున్నారక ఉద్యోగాలు రాక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే ప్రతి నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు .. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మానేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగ అవకాశాలపై పలుచోట్ల హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు తొలగించడం తప్ప కొత్తగా ఇవ్వడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇచ్చేది గోరంత .. ప్రచారం కొండంత అన్నట్టుగా ఉంది ప్రభుత్వ తీరు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు.ఒక ఏడాది గడిచిపోగా .. రెండో ఏడాది కేవలం 10 వేల పోస్టులతో అరకొరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5.23 లక్షల మందికిపైగా.. ఉగాదికి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. అసెంబ్లీ సాక్షిగా 90 వేలకుపైగా ఖాళీ పోస్టులు ఉన్నట్లు గతంలో ప్రకటించింది. తీరా చూస్తే అన్ని విభాగాల్లో ఉన్న వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 20.42 లక్షలు. జిల్లా వ్యాప్తంగా 5.23 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొకరు చొప్పున లెక్క వేసిన జిల్లాలో 5.23 లక్షల మందికిపైగానే నిరుద్యోగులు ఉన్నారు. రాష్ట్రమంతటికీ కలిపి కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల హామీ మేరకు ఉద్యోగం ఇవ్వకపోగా.. కనీసం రూ. 3 వేల భృతి వరకే తీసుకున్నా ప్రతి నెలా ప్రభుత్వం రూ. 156.90 కోట్లకు పైగా చెల్లించకపోవడంపై కూడా నిరుద్యోగులు నిరసన గళం వినిపిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వలస బాట... చదువుకున్నా ఇక్కడ ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో అనేక మంది యువతీయువకులు తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబై వంటి సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస పోవాల్సి వస్తోంది. గుంటూరులోని ఉమ్మడి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యాన కొన్నేళ్లుగా ప్రభుత్వ నియామకాలు జరగడమే లేదు. వాటిల్లో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది ప్రైవేట్ సంస్థల్లో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఎన్నికల వేళ ‘బాబు ష్యూరిటీ – జాబ్ గ్యారెంటీ’ అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారం చేపట్టిన తర్వాత యువతను నట్టేట ముంచారు. టీడీపీ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించారు. ఇప్పుడు పదివేల పోస్టులతో సరిపెడుతూ నిరుద్యోగులను సర్కార్ మోసం చేస్తోంది. ఈ క్రమంలో కనీసం నిరుద్యోగ భృతి అమలు చేస్తారని ఎదురు చూస్తున్న యువతకు కూడా మొండిచేయి చూపుతోంది. రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా భర్తీ చేయకుండా కేవలం కొద్ది పోస్టులతో పరిమితమవడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమే. ఇంటికో ఉద్యోగం లేకపోతే నెల నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. –కోట సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్, పల్నాడు జాబ్ కావాలంటే బాబు రావాలని, తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోగా .. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. వలంటీర్లు, ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారు, ఏపీ ఫైబర్ నెట్, ఏపీఎండీసీ కాంట్రాక్ట్ వర్కర్లు, యానిమేటర్లు, విద్యుత్ మీటర్ రీడర్లు, విద్యుత్ సబ్స్టేషన్లలో ఆపరేటర్లు, ఆశా కార్యకర్తలు, స్కూల్ ఆయాల వంటి వారు వీరిలో ఉన్నారు. వీరందరూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వలంటీర్లకు రూ. 5 వేలు కాకుండా, రూ. 10 వేలు ఇస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల హామీ గాల్లో కలసిపోయింది. వలంటీర్లను చివరకు రోడ్డుపైకి నెట్టేశారు. -
ముస్లింలతో మమేకమైన వైఎస్సార్సీపీ నేతలు
మాచర్ల: రంజాన్ నెల చివరి రోజున మాచర్ల పట్టణంలోని నూర్ మసీదు, మర్కస్ మసీదుల్లో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులకు పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డిలు రంజాన్ ముందుగా శుభాకాంక్షలు తెలిపి దువా చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడి ఆధ్వర్యంలో నాయకులంతా మసీదులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్తీసాబ్ షేక్ గౌస్ దువా చేసిన అనంతరం ఉపవాసం విడిచిన ముస్లింలకు వారు ఖర్జూర పండ్లు, స్వీట్లు అందజేశారు. ముందుగా పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మసీదు వరకు నడుచుకుంటూ వెళ్ళి ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్, నియోజక వర్గ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, ఉప్పలపాటి జాని, పఠాన్ గౌస్, షేక్ రహమాన్, షేక్ అంగార్బాషా, షేక్ సులేమాన్, ఉప్పలపాటి జాని, షేక్ నాగూర్, కిజర్, సైద్మస్తాన్, షేక్ జాని, పఠాన్బద్రుద్దీన్, అబ్దుల్ రహీం, చికెన్ బాజి, మాయ సుభాని, మహ్మద్ రఫి, పట్టణ పార్టీ అధ్యక్షులు పోలా శ్రీను, మున్సిపల్ మాజీ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, కామనబోయిన కోటయ్య, కౌన్సిలర్ మందా సంతోష్, వేల్పుల గురవయ్య ్డ తదితరులున్నారు. -
నడుముకు రాయి కట్టి.. చెరువులోకి పడేసి..!
గుంటూరు రూరల్: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. మృతదేహం కూడా కనిపించకుండా చేసేందుకు శరీరానికి హద్దు రాయి కట్టి గోనెసంచిలో చుట్టి చెరువులోకి పడేసిన దారుణ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరువులో చేపలు పట్టుకునేందుకు గురువారం ఒక యువకుడు వెళ్ళాడు. ఆ సమయంలో చెరువులో తెలియాడుతూ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరహరి స్థానికులు, సిబ్బందితో కలిసి మృత దేహాన్ని బయటకు తీయించారు. -
భూసేకరణ ఎవరి కోసమో చెప్పాలి?
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణయ్య నరసరావుపేట: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.24,700 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించి గెజిట్ విడుదల చేశారని, అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో 250 మీటర్ల వెడల్పు 129 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 59 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్రోడ్డు దీనికి అనుబంధంగా 32 రేడియల్ లింక్ రోడ్ల నిర్మాణానికి 300 గ్రామాల్లో 15 వేల ఎకరాల అసంబద్ద భూసేకరణ ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య ప్రశ్నించారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో గురువారం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. అసంబద్ధ భూసేకరణ వల్ల అమరావతిలో కొన్ని గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రేటు క్వింటా రూ.2400లు ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా రైతులను మోసం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 9.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా పల్నాడు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలు సాగు చేశారన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయులు నాయక్, జిల్లా కమిటీ సభ్యులు గద్దె చలమయ్య, డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, జె.శంకరరావు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, గుంటుపల్లి బాలకృష్ణ పాల్గొన్నారు. -
ట్రేడ్ దోస్త్ కంపెనీ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
లక్ష్మీపురం: గుంటూరు అరండల్పేటలో నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ కంపెనీ పేర్లతో భారీ మొత్తంలో మోసం చేసి పరారైన నిర్వాహకుడిపై బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేరుతో అరండల్పేట 16వ లైనులో అన్నం పూర్ణచంద్రరావు, మరికొంత మందితో కలిసి గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నామని, పెట్టుబడి పెట్టిన వారికి 20 నెలల్లో రూ. లక్షకు రూ. 2 లక్షలు కలిపి ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అక్రమంగా వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారి పేర్లపై డ్రా తీసి 40 గ్రాముల బంగారం, తదితర స్కీమ్ల పేర్లతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇటీవల అన్నం పూర్ణచంద్రరావు తీరుపై అనుమానం వచ్చిన బాధితులు సంబంధిత డ్రాల గురించి నిలదీసే ప్రయత్నం చేయగా.. పూర్ణ చంద్రరావు పరారయ్యాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతా శివకోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవటమే లక్ష్యం
తెనాలి:మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే అందరి లక్ష్యంగా కృషిచేద్దామని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గత అయిదేళ్లు చైర్పర్సన్లుగా, కౌన్సిలర్లుగా, కో–ఆప్షన్ సభ్యులుగా పదవీకాలం పూర్తిచేసిన సందర్భంగా బుధవారం రాత్రి అభినందన సత్కారాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శశివేదికలో జరిగిన సభకు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా, పార్టీకి ఎలాంటి డ్యామేజి లేకుండా, తనకు ఎలాంటి మచ్చ తేకుండా పరిపాలన చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికను శివకుమార్ ముందుగా అభినందించారు. ఓటమితో కుంగిపోకుండా పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ పాటుపడిందని చెప్పారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అయిదేళ్లపాటు దిగ్విజయంగా ప్రజాసేవలో గడిపే అవకాశం దక్కిందని గుర్తుచేశారు. శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో రూ.1800 కోట్ల సంక్షేమం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1800 కోట్ల సంక్షేమాన్ని అందించే అవకాశం తనకు కలిగినట్టు చెప్పారు. ఓసీలకు రిజర్వు చేసిన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తానని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ప్రకటించినట్టు శివకుమార్ గుర్తుచేశారు. ఆ ప్రకారం తొలిగా ముస్లిం మైనారిటీకి చెందిన సయ్యద్ ఖలేదా నసీమ్, తర్వాత బీసీ వర్గానికి చెందిన తాడిబోయిన రాధికకు చైర్పర్సన్గా అవకాశం కల్పించినట్టు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తికాలం వైఎస్సార్ సీపీ కౌన్సిల్ నడిచేందుకు తాడిబోయిన రమేష్ కృషిచేశారని చెబుతూ ఆయన్ను అభినందించారు. అనంతరం చైర్పర్సన్, వైస్చైర్మన్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులను శివకుమార్ సత్కరించారు. మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, మాజీ వై స్చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, కోటేశ్వరరావు, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, గెడ్డటి సురేంద్ర, ఝాన్సీవాణి, కుర్రా సుజాత, అన్నాబత్తుని పద్మజ, కఠారి రత్నకుమారి, మల్లెబోయిన సురేఖ, పెదలంక లక్ష్మీలావణ్య, మట్లపూడి సంధ్యారాణి, వీర్లపాటి విజయలక్ష్మి, షేక్ దుబాయ్బాబు, షేక్ ఇస్మాయిల్, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, కో–ఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుభాని, షేక్ గౌసియా, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ -
గ్యాస్ సిలిండర్... నో స్టాక్
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా తాడేపల్లి మండలంలో 24.4 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1 మి.మీ వర్షం పడింది. సగటున 5.6 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 19 మి.మీ., తుళ్ళూరు 18.2, తాడికొండ 17.4, మంగళగిరి 13, పెదకాకాని 5.2, గుంటూరు తూర్పు 1.4, గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ చొప్పున వర్షం పడింది. కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర ఆర్పేట పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఎ.రఘునాథశర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక ఉంది. ఆమైపె అర్చకుడు రఘునాథశర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్యకు దగ్గర చేశాడు. అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి కుటుంబం ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలతో పాటు ఆ బాలికనూ తీసుకెళ్లేవాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు ఆమైపె లైంగికదాడి చేశాడు. బాలిక బుధవారం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భంధరించిందని నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆగ్రహంతో అందుకు కారణం ఎవరంటూ బాలికను ప్రశ్నించారు. తాను గర్భం దాల్చటానికి కారణం రఘునాథశర్మ అని ఆమె చెప్పటంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథశర్మను అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎస్ఐ యోహాను, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ పాతరాజరాజేశ్వరికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే దేవరపాటి రాజేష్ అలియాస్ నాని కళ్లు ఆ బాలికపై పడ్డాయి. బాలికతో మాట్లాడుతూ చనువుగా ఉండటమే కాకుండా ప్రేమిస్తున్నాని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆరా తీయగా, విషయం బాలిక తన తల్లికి చెప్పింది. బాలిక తల్లి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
స్ట్రోక్ చికిత్స వ్యవస్థ బలోపేతానికి కృషి
గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ 19వ వార్షిక సదస్సు ఈనెల 13 నుంచి 15 వరకు కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి ప్రముఖ న్యూరాలజిస్టులు, స్ట్రోక్ నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ నిపుణులు పాల్గొన్నట్లు వెల్లడించారు. సదస్సులో డాక్టర్ విజయ ప్రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ముఖ్య ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. 1990లలో థ్రోంబోలైటిక్ చికిత్స అందుబాటులోకి రాకముందు పరిస్థితుల నుంచి ప్రారంభించి, 1995లో 3 గంటల్లో క్లాట్ బస్టింగ్ థెరపీ ఆవిష్కరణ, 2005లో స్ట్రోక్ కేర్ అభివృద్ధి, 2015లో న్యూరో ఇమేజింగ్, మెకానికల్ థ్రోంబెక్టమీ పురోగతి వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపిక చేసిన రోగులకు 24 గంటల వరకు చికిత్స అవకాశాలు విస్తరించిన విషయాన్ని డాక్టర్ పి.విజయ ప్రస్తావించారు. అత్యంత ప్రేరణాత్మకంగా నిలిచి, 400 మందికి పైగా జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల స్టాండింగ్ అవేషన్ అందుకున్నట్లు తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ -
భక్తిశ్రద్ధలతో బాజీబాబా దర్గా ఉరుసు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం గురువారం కనుల పండువగా ప్రారంభమైంది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున ప్రత్యేక ప్రార్థనలతో ఉరుసు మహోత్సవం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు షఫా బావి నీటితో స్నానాలు చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం 7 గంటలకు బాజీబాబా గుఱర్రం దర్గాలో ప్రదక్షిణలు చేసింది. దర్గా ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందిని అలంకరణలో గంధం బిందెలతో ప్రారంభమైన బాజీబాబా వారి గుర్రంతో శుక్రవారం ఉదయం వరకూ వెనిగండ్ల గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఈ మహోత్సవం బాణసంచా వెలుగులు, తీన్మార్ తప్పెట్లు, సన్నాయి వాయిద్యాలు, బాండ్మేళాలు, విద్యుత్ కాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. దర్గాకు చేరుకున్న భక్తులు బాబా వారి గుర్రం వెంట నడిచారు. ఊరేగింపు ముగించుకుని బాబావారి గుర్రం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు దర్గాకు చేరుకుంటుందని అనంతరం భక్తులకు గంధం పంచిపెట్టడం, సలామి ప్రార్ధనలతో ఉరుసు మహోత్సవం ముగుస్తుందని ఈఓ షేక్ ఖాజావలి తెలియజేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్, ఆడిట్ జనరల్ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్, జనరల్, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ ఎం.రమేష్ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్స్పెక్టర్ బాధ్యతలు అప్పగించారు. -
పిన్నెల్లికి జన నీరాజనం
నకరికల్లు: అక్రమ కేసులో 98 రోజులపాటు అక్రమ నిర్భంధం అనుభవించి బెయిల్పై వస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మండలంలో ఘన స్వాగతం పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డరోడ్డుకు చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటలపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాకకోసం ఎదురుచూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డరోడ్డు చేరుకోగానే హర్షధ్వానాలతో అభిమానులు హోరెత్తించారు. పిన్నెల్లిని, సత్తెనపల్లి ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. శ్రీ అభయాంజనేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడులో టీడీపీ రెండు వర్గాల పోరులో వాళ్లకు వాళ్లు హత్యలకు పాల్పడితే కావాలని తమను అనవసరంగా ఇరికించారని వాపోయారు. 98 రోజులపాటు అక్రమంగా జైలులో పెట్టారన్నారు. ఎస్పీ సైతం ఆధిపత్యపోరులో ఈ హత్యలు జరిగాయని చెప్పినా తమను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. తమకంటూ ఒకరోజు వస్తుందని... తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని... అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు బలంతో పోరాడతామన్నారు. డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ మేడికొండ పరమేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్కుమార్రెడ్డి, దూదేకుల బాషా పాల్గొన్నారు. దాచేపల్లిలో.. దాచేపల్లి : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాచేపల్లిలో ఘన స్వాగతం లభించింది. నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య కుటుంబ సభ్యులు గజమాలతో సన్మానించారు. చైర్మన్ సాంబయ్య , నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ మాజీ చైర్మన్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ కందులు జాను, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్ బాషా, కొమరభత్తిన విజయకుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్లు మందపాటి రమేష్ రెడ్డి, బుర్రా విజయ్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు తదితరులు ఉన్నారు. ప్రత్యేక పూజలు మాచర్ల: మాచర్ల పట్టణానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. రాయవరం జంక్షన్లో ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు చేశారు. -
ఘనంగా ఉగాది సంబరాలు
నరసరావుపేట: జిల్లాలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని గుర్రం జాషువా మీటింగ్ హాలులో సాంస్కృతికశాఖ, ధర్మాదాయ, దేవదాయ శాఖల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు. ఉగాది పంచాగం విని పచ్చడిని సేవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు. ఉగాది పచ్చడి మాదిరిగా జీవితంలో కూడా సుఖం, దుఃఖం ఉంటాయని చెప్పారు. అన్నీ అధిగమించే శక్తి ఆ దేవుడు అందరికీ ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ప్రదర్శించిన ఓక్ల్యాండ్ స్కూలు, పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను అభినందించారు. మాజీ ప్రిన్సిపాళ్లు, సాహితీవేత్తలైన చేరెడ్డి మస్తాన్రెడ్డి, శ్రీవేదాంతం శ్రీనివాస అయ్యంగార్, మేళ్లచెరువు భానుప్రసాదులతో పాటు ఎనిమిది మంది ప్రముఖులను శాలువాలతో సత్కరించి, షీల్డు అందజేశారు. ప్రత్యేక ఉగాది డైరీని ఆవిష్కరించారు. ఆటోవర్కర్స్ తీసుకొచ్చిన కేకును కట్ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ నారదముని, ధర్మాదాయశాఖ అధికారి దుర్గారావు, గురజాల ఆర్డీఓ మురళి, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. -
బాలిక ఆపరేషన్కు రూ.లక్ష వితరణ
బాపట్ల: కర్లపాలెం మండలంలోని పెద్దపులివారిపాలెం సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండగా మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతితోపాటు పార్టీ నాయకులు కలిపి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె ఆపరేషన్ నిమిత్తం నగదు అందజేసి ఆరోగ్యం మెరుగుపడేలా చూసుకోవాలని సూచించారు. వైద్యులతో కోన మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, పేరాల వెంకట సురేష్, ధర్మేంద్ర, ఆట్ల నాగేశ్వరరెడ్డి ఉన్నారు. గుండెపోటుతో ఎస్ఐ మృతి చీరాల: ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఇంటి వద్ద గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్, ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు, టూటౌన్, రూరల్ సీఐలు అశోక్కుమార్, శేషగిరిరావులు, ఎస్ఐలు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1982 బ్యాచ్లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరిన ఆయన ఎస్ఐగా పదోన్నతి పొంది చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. 42 సంవత్సరాల పాటు పోలీస్శాఖలో సేవలందించారు. ఆయన మరణంపై సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ఎక్కడ ?
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: ఆంధ్రప్రదేశ్లో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎలా ఉన్నారో, కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు పంట నష్టం జరిగినప్పుడు సహాయం అందించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోనే పరిహారం జమ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో క్వింటా రూ.2400 అమ్మిన మొక్కజొన్నలు కేవలం రూ.1600కు కూడా కొనుగోలు లేక రైతులు లబోదిబోమంటున్నారని చెప్పారు. పొగాకు, ధాన్యం, కందులు, ఇతర పంటలు కూడా గిట్టుబాటు ధరకు కొనేవారు లేరని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీస అవసరాలకు కూడా గ్యాస్ లభించే పరిస్థితి లేదన్నారు. గంజాయి, డ్రగ్స్కు కేంద్రంగా... గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయని, డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్యాదవ్ పోలీసులకు దొరకడం సిగ్గుచేటన్నారు. మదనపల్లిలో చిన్నారి హత్య వంటి దారుణాలు కూడా గంజాయి మత్తులోనే జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రేషన్సరుకులు ఇంటి వద్దకే సరఫరా చేశామని పేర్కొన్నారు. గతంలో సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇస్తామంటూ, ప్రజలకు, ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు టోపీ పెట్టారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్ సాగవుతుందని ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పారని, మిరప, కంది, పత్తి అన్ని పంటలను కలిపినా 50 వేల ఎకరాల సాగులో లేదని గుర్తు చేశారు. గ్రానైట్ అక్రమ రవాణా, బెట్టింగ్లు, లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించడం వంటివి తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. పోలీస్స్టేషన్ల్లో అక్రమ కేసులు బనాయించడం, కాలనీల్లో బ్రాందీషాపులు ఏర్పాటు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నాయని తెలిపారు. అదేమని ప్రశ్నిస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని మహిళలు ధర్నా చేస్తుంటే వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అంతా గ్రాఫిక్స్లో తప్ప వాస్తవ రూపంలో కనిపించడం లేదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని చిన్న, చితక వారిని బెదిరించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పీ4 పథకంలో భాగంగా 100 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చెబుతున్న ఎమ్మెల్యే జీవీ ఒక్కరికన్నా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలందరికి ఉగాది నూతన సంవత్సరాది శుభాకాంక్షలు, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం నాయకులు జుజ్జూరి ఐరామ్మూరి, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ బేతం గాబ్రియేలు, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, వినుకొండ మండలం రూరల్ కన్వీనర్ దండు చెన్నయ్య, శావల్యాపురం కన్వీనర్ బోడెపూడి కొండలు, గుంజి వాసు, కొత్త కృష్ణారెడ్డి, బి.నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
అకాల వర్షంతో అన్నదాతలు కుదేలు
● మిర్చిని కాపాడుకునేందుకు తంటాలు ● మిర్చి, శనగ, మొక్కజొన్నలపై వాన ప్రభావం నాదెండ్ల:మండలంలో బుధ వారం కురిసిన వర్షంతో రైతులు పరుగులు తీశారు. ఆరుగాలం కష్టించి పండించి కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు టార్పాలిన్ పట్టలు తీసుకుని పరుగున వెళ్లి మిర్చి తడవకుండా కప్పారు. కారుమబ్బులు కమ్మి ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. శనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. సత్తెనపల్లి: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే దశలో నీటి పాలవుతుందని భావించిన రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో మిరపకాయల కల్లాలను రైతులు ఏర్పాటు చేశారు. ఆ పంటను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. రొంపిచర్ల: మండలంలో అకాల వర్షం మొక్కజొన్న, మిర్చి రైతులను ఆందోళనకు గురిచేసింది. కల్లాలలో ఆరబోసి ఉన్న మొక్కజొన్నలను, ఎండబోసిన మిర్చిని కుప్పలుగా చేసి వర్షానికి తడవకుండా టార్పలిన్ పట్టలను కప్పేశారు. అక్కడక్కడ మొక్కజొన్న పైరు నేలవాలిందని రైతులు తెలిపారు. గాలులకు కూలిన కమ్యూనికేషన్ టవర్ పిడుగుపాటుకు మహి ళ మృతి నూజెండ్ల : కురిచేడు మండలం పడమర వీరాయపాలెం, చౌడేశ్వరి కాలనీకి చెందిన కాటూరి సుబ్బరత్నం (51) మిరపకాయలు కోసే పనుల నిమిత్తం నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఆటో వద్దకు వస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు భర్త, కుమార్తెలు ఉన్నారు. -
గ్యాస్ కోసం తప్పని క్యూ
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు బుధవారం సిలిండర్ల లారీ వస్తుందని తెలిసిన వినియోగదారులు ఉదయం నుంచి పడిగాపులు కాశారు. రాత్రి ఏడు గంటల సమయంలో గ్యాస్ సిలిండర్లతో కూడిన లారీ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. వారిని అదుపు చేయడం నిర్వాహకుల వల్ల కాలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి వినియోగదారులను క్యూలైనులో నిలబెట్టారు. అనంతరం ఏజెన్సీ నిర్వాహకులు ఒక్కొక్కరికి కూపన్లు ఇచ్చి గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం చేపట్టారు. రాత్రివేళ వినియోగదారుల నిరీక్షణ -
గోలివాగులో సంచరిస్తున్న మొసలి
రెంటచింతల: మండలంలోని గోలి గ్రామ సమీపంలోని గోలివాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోలి వాగు బ్రిడ్జిపై మొసలి సంచరిస్తున్న విషయం గమనించిన గ్రామస్తులు తహసీల్దార్ దొప్పలపూడి మేరి కనకం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్, అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియచేసి వాగు సమీపంలో హెచ్చరిక ప్లెక్సీ ఏర్పాటు చేయించారు. ప్రతి రోజు వాగులో దుస్తులు శుభ్రం చేసే మహిళలకు, ఈ రహదారిపై నుంచి జెట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్కు వెళ్తున్న గోలి గ్రామానికి చెందిన విద్యార్థులకు, గ్రామ సమీపంలో నాపరాయి క్వారీ కార్మికులకు, నాగమయ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, వాగులో పశువులకు దాహార్తిని తీర్చేందుకు వచ్చే పశుపోషకులు ఈ వాగులో మొసలి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: సమాజానికి చేటు కలిగించే బాల్య వివాహాల నివారణే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. గత నవంబరు 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించాల్సిన ప్రత్యేక కార్యాచరణ పై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికల ఆరోగ్యం పెద్ద సమస్యగా మారుతుందని, యుక్త వయసులోనే కుటుంబభారం పడుతుందని, జీవితం అంటే ఏమిటో తెలిసే సమయానికి జీవితం చరమాంకానికి చేరుతుందని అన్నారు. సమాజంలో బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ నిర్మాణంలో వారికి కీలక పాత్ర అందేటట్లు సహకరించాలని తెలిపారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరయిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ బాల్య వివాహిత రహిత గ్రామాలుగా గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలను తీర్మానించే క్రమంలో ఆ శాఖకు చెందిన వివిధ స్థాయిలలోని బాల్య వివాహ నిషేధిత అధికారులు తమ బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఎక్కువసార్లు బడికి హాజరు కానీ పిల్లలపై దృష్టి పెట్టి, అటువంటి పిల్లలు బాల్య వివాహ బాధితులు కాకుండా విద్యా సంస్థలు అన్నిటిలో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మునిసిపల్ అధికారులు, మండల, గ్రామ, వార్డు అధికారులు పాల్గొన్నారు. -
హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
నరసరావుపేట: వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతోపాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులు, సమాజానికి మెరుగ్గా వివరించగలరని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరా అధికారి ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అది సకాలంలో, సరైన తూకంతో వస్తోందా, లేదా అని గమనించాలని కోరారు. సమావేశంలో భాగంగా ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల యంత్రాలను ప్రదర్శించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను ఎలా గుర్తించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. వినియోగదారుల హక్కులపై రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీఐ సంస్థ ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత లేదు...
గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం స్థానిక బస్టాండ్ దగ్గరలో ఉన్న ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న వినియోగదారులతో ముఖాముఖీ మాట్లాడి ఎప్పుడు బుక్ చేశారో తెలుసుకొని, బుధవారం ఉదయం నాటికి సిలిండర్ పంపిణీ చేయాలని గోడౌన్ ఇన్చార్జిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అనవసరమైన ఆందోళనతో గ్యాస్ బుక్ చేయవద్దని వినియోగదారులను కోరారు. కొందరు డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంగా ఉన్నారని ఫిర్యాదు చేయగా, వారి పనితీరు మార్చుకోనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ బుకింగ్లకు సంబంధించి కొండపల్లి ప్లాంట్ నుంచి లోడ్ వస్తుందని, బుధవారం నుంచి ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందు పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని గోడౌన్ ఇన్చార్జి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ కోమలి పద్మ, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
రూ.1.15 కోట్లకు మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : సుమారు రెండేళ్లకుపైగా మిర్చి డబ్బులు కోసం కాళ్లు అరిగేలా పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తున్నామని బాధిత మిర్చి రైతులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా తనగల గ్రామ వాసులు బోయ నారాయణ, పచ్చర్ల రాజు, ఈడిగ నరసింహగౌడ్, కురవ వెంకటేశ్ (సర్పంచ్), ఉప్పర లక్ష్మణ (షాబాదా గ్రామం)లు మంగళవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత రెండేళ్లుగా చవి చూసిన కష్టాలను మొరపెట్టుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందించారు. అనంతరం మిర్చి బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరులోని రెండు చిల్లీస్ ట్రేడింగ్ సంస్థల నిర్వాహకులకు మిర్చి బస్తాలు పంపించేవాళ్లమని అన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం 2,300 మిర్చి బస్తాలు తీసుకురాగా, ప్రస్తుతం ధరలేదని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేయాలని నిర్వాహకులు సూచించారని చెప్పారు. వారి చెప్పినట్లుగానే సదరు స్టోరేజీలో నిల్వ చేశామన్నారు. నిర్వాహకులను డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అంటూ దాటవేశారు. దీంతో అనుమానం వచ్చి స్టోరేజీలో ఆరాతీయగా మా పేర్లపై మిర్చి బస్తాల్లేవని, నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులపై ఉన్నాయని అన్నారు. మేమంతా మోసపోయిన గుర్తించి నిర్వాహకులను గట్టిగా అడిగితే, మిర్చి విక్రయించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీనికిగాను చెక్కులు, ప్రామిసరీనోట్లు, రూ.100ల అగ్రిమెంట్లు రాసిచ్చారని అన్నారు. అలాగే గుంటూరు లాలుపురంలో స్థలం, కర్నూలులో ఎకరంన్నర పొలం విక్రయించగా వచ్చే డబ్బులు చెల్లిస్తామని బురిడి మాటలు చెప్పారని వాపోయారు. అయితే ఆ చెక్కులు, అగ్రిమెంట్ ఇతరత్రా కాగితాలు వల్ల ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్సి మోసగించి, రూ.1.15 కోట్లు చెల్లించకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రం నుంచి వందలాది కి.మీ ప్రయాణించి గుంటూరు వస్తుంటే సదరు ట్రేడింగ్ నిర్వాహాకులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. సదరు ట్రేడింగ్ కంపెనీల నిర్వాహకులను నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. -
తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్బన్: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కాయల్ప బృందం మంగళవారం సందర్శించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, క్వాలిటీ మేనేజర్ వాసుబాబు, క్వాలిటీ కన్సల్టెంట్ వాసు రాజు తతదితరులు ఆసుపత్రిలోని పలు వార్డులు, ఓపీ సేవలు, ల్యాబ్, రేడియాలజీ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలువురు అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్డర్ సౌభాగ్యవాణి, ఆర్.ఎం.వో డాక్టర్ మల్లిఖార్జునరావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తల్లి మందలించిందన్న కారణంలో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన మన్నవ తిరుపతయ్య(35) బేలుదారు పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుంతా మద్యంకే వాడేస్తుండడంతో తల్లి సోమవారం మందలించింది. మనస్థాపానికి గురై పురుగులమందు తాగిన అతన్ని కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. మృతుడి భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. వేటపాలెం: బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడు పిట్ల సూరిబాబుకు 10 ఏళ్ల జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఒంగోలు పీఓసీఎస్ కోర్టు న్యాయమూర్తి కె. శైలజ మంగళవారం తీర్చు ఇచ్చారు. 2025లో ఓ బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడి పై నేరం రుజువు కావడంతో జడ్జి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించారు. బాలిక తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేలు నగదు పరిహారం కింది చెల్లించాలని తీర్పులో వెల్లడించారు. కేసు దర్యాప్తును వేగవంతంగా నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అభినందించారు. -
నేడు గోవాడలో కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): గోవాడలో ప్రసిద్ధి గాంచిన గంగ పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి కుంకుమార్చన సామూహిక లలిత పారాయణం జరగనున్నట్లు చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ఇప్పటి వరకు 7 అమావాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో 18వ తేదీన ఫాల్గుణ అమావాస్య మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, ఎస్ఎస్ఎఫ్ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా వీరభద్రుడి పూజ, గవ్యాంత పూజలు, తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలను ఎస్ఐ అపర్ణ సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతం నుంచి రెండు లారీలు నల్ల మట్టితో విజయవాడ వెళ్తుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాటికి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తెనాలిలో పర్యటించిన ఢిల్లీ బృందం తెనాలిఅర్బన్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని బృందం తెనాలిలో మంగళవారం పర్యటించింది. ఆదిత్య శుక్లా నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులు బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డును పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వాహణపై ఆరా తీశారు. వర్మీ, ఆర్గానిక్ కంపోస్టు, కోకో పిట్ కేంద్రాన్ని, ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.ఆర్.అప్పల నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఏఈ సునీల్, పంచాయతీ రాజ్ డీఈ శివరామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై భారీ మంటలు నరసరావుపేట రూరల్: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై పెట్లూరివారిపాలెం వద్ద మంగళవారం రాత్రి భారీగా మంటలు వ్యాపించాయి. రోడ్డు పక్కన ఉన్న చెత్తకు అగ్గి అంటుకోవడంతో ఈ మంటలు వ్యాప్తి చెందాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. -
మద్యం దుకాణం వద్దు బాబోయ్
సత్తెనపల్లి(ముప్పాళ్ళ): నివాసాల మధ్య వైన్ షాప్ (మద్యం దుకాణం) వద్దు బాబోయ్... వద్దంటూ సత్తెనపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య మహిళలు మంగళవారం కదం తొక్కారు. గుడి, బడికి దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆదేశాలను లెక్కపెట్టకుండా గృహాల మధ్య దుకాణం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయటం ఏంటని నిలదీశారు. గుడికి వెళ్లే వారికి రక్షణ కల్పించాలంటూ ప్ల కార్డులతో రోడ్డెక్కారు. వైన్షాప్ ఏర్పాటు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, త్వరలో మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పట్టణంలోని గార్లపాడు బస్టాండ్ ఏరియా గీతామందిరం ఎదురుగా వైన్షాప్ ఏర్పాటుకు సిద్ధమవుతుండటంతో స్థానికులు ఆందోళన బాటపట్టారు. వైన్షాప్ నిర్వహించే స్థలం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్ల కార్డులతో నిరసనగా గడియారం స్తంభం వద్దకు చేరి మానవహారంగా ఏర్పడ్డారు. రక్షణ కల్పించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైన్షాప్ ఏర్పాటు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిప్రం అందించామని, మంగళవారం స్థానిక ఎమ్మెల్యేను కలిసి కలిగే ఇబ్బందులను వివరించామని ఆర్యవైశ్య మహిళలు, ప్రాంత వాసులు తెలిపారు. సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని మహిళలు తెలిపారు. -
టీటీడీ చైర్మన్ను తొలగించండి
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నరసరావుపేట: తిరుమల–తిరుపతి దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడుని తక్షణమే తొలగించి టీటీడీ పవిత్రత, ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు కాపాడాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ శాసన సభ్యులు కాసు మహేష్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలో ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ మహిళలపై టీడీపీ వ్యక్తులు దాడి చేసినందుకు నిరసనగా మంగళవారం పట్టణంలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎర్రటి ఎండలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురజాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, విద్యార్థి, రైతు విభాగాల జిల్లా అధ్యక్షులు జి.ఆకాష్కుమార్, అన్నెం పున్నారెడ్డి, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, అంగన్వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శి హెల్డా ప్లోరేన్స్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి నెలటూరి సురేష్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతా పాల్, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, మాజీ ఎంపీపీ టి.మంగమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనకా పుల్లారెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుక్కల పౌలయ్య, మాజీ సర్పంచ్ కోడూరి వెంకటేశ్వరరెడ్డి, మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు షేక్ శిలార్, సయ్యద్ ఖాదర్ బాషా, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు బూదాల కల్యాణ్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
రేపు శంకరస్వామి తిరునాళ్ల
రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శంకరస్వామి తిరునాళ్లను ఉగాది పర్వదినాన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన స్వామి వారి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ దేవాలయం 13వ 14వ శతాబ్ద కాలంనాటిదిగా అక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. కాకతీయుల కాలం నాటి పరిస్థితులు ఇక్కడ ప్రతిబింబిస్తున్నట్లు చరిత్రకారులు భావిస్తారు. కోట భీమరాజు, గణపతి దేవుని పరిపాలన కాలం నాటి శాసనాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయంలో కార్యక్రమాల నిర్వహణ, తిరునాళ్ల ఏర్పాట్లను ఆలయ ఈవో ఎం. వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
ఒప్పిచర్లలో ఉద్రిక్తత
కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని పొట్టి శ్రీరాములు కాలనీలో నందమూరి తారక రామారావు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తాత్కాలికంగా తొలగించి పక్కన పెట్టి మరలా పునరుద్ధరణ చేసుకోవాలని మంగళవారం చేపట్టిన కార్యక్రమం వివాదంగా మారి ఉద్రిక్తతలకు దారితీసింది. వైఎస్సార్సీపీ కాలనీ నాయకులు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడానికి వీల్లేదని అడ్డుతగలడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాలనీ కూడలిలో ప్రధాన రహదారి పక్కనే కల్యాణ మండపం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులకు వైఎస్సార్, ఎన్టీఆర్ విగ్రహాలు అడ్డుగా ఉన్నాయని వాటిని తాత్కాలికంగా తీసి పక్కన పెట్టి నిర్మాణం పూర్తయ్యాక ఏర్పాటు చేసుకుందామనే ఆలోచనతో కాలనీ యువకులు ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. ఈ క్రమంలోనే విగ్రహాలను పక్కన పెట్టే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని జేసీబీతో తొలగించి పాఠశాల ఆవరణలో పెట్టారు. తర్వాత వైఎస్సార్ విగ్రహం తొలగింపును కాలనీ వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. తాము విగ్రహం తొలగింపునకు అంగీకారం తెలపలేదని, తీయడానికి వీల్లేదని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం పోలీసు అధికారుల దృష్టికి వెళ్లింది, దీంతో సీఐ శరత్బాబు, ఎస్ఐ వాసులు తక్షణం స్పందించి విషయాన్ని పై అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్ధితిని చక్కదిద్దారు. దీంతో వైఎస్సార్ విగ్రహం తొలగింపు కార్యక్రమం ఆగిపోయింది. గ్రామంలో ఉద్రిక్తతలు కూడా తగ్గాయి. వైఎస్సార్ విగ్రహం తొలగింపును అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు -
మహిళ కిడ్నాప్నకు యత్నం
రొంపిచర్ల: ఓ వితంతువు కిడ్నాప్నకు యత్నించిన సంఘటన మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేపల్లి ముప్పాళ్ళకు చెందిన ఓ మహిళ నరసరావుపేటలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. రోజుమాదిరిగా డ్యూటీ ముగించుకొని ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరారు. పరిస్థితిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి మోటారు సైకిల్పై వెంబడించాడు. తుంగపాడు గ్రామ సమీపంలోకి వెళ్లగానే బండి అడ్డుపెట్టాడు. వాహనం వెనుక ఏదో అడ్డుపడుతుందని ఆమెకు చెప్పాడు. అప్పటికే ఆమె బంధువులతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. ఆ మహిళ దిగి బండి వెనుక భాగం చూడబోగా ఆ దుండగుడు ఆమె చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. అదే మార్గంలో వేరే వారు వస్తుండటంతో దుండగుడు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి లాక్కెళ్లాడు. జరుగుతున్న సంఘటనను ఫోన్లో గమనించిన బంధువులు వెంటనే షాపువారికి, ఆమె బంధువులకు తెలియజేశారు. వారు వెంటనే 100కు సమాచారం అందించటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుడు ఆమెను మరి కొంత దూరం పొలంలోకి లాక్కెళ్లి పరారయ్యాడు. ఆ మహిళ సంతగుడిపాడు సమీపంలోని కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వే పైకి చేరుకొని రొంపిచర్లకు వచ్చారు. ఆమె సురక్షితంగా చేరుకోవటంతో బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. -
నేటి నుంచి జిల్లాలో దివ్యాంగ శక్తి పథకం
నరసరావుపేట: జిల్లాలో దివ్యాంగులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన దివ్యాంగ శక్తి పథకం బుధవారం నుంచి అమలు చేస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.అజితకుమారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. నాన్స్టాప్ ఎక్స్ప్రెస్, అంతరాష్ట్ర అల్ట్రాడీలక్స్ సర్వీసులు, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి బస్సుల్లో 50శాతం రాయితీ సౌకర్యం కల్పించబడిందన్నారు. ప్రయాణించే దివ్యాంగులు సర్టిఫికెట్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నరసరావుపేట ఆర్డీఓగా బాలకృష్ణ నియామకం నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా కె.బాలకృష్ణ నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో ఆయన నందిగామ ఆర్డీఓగా పనిచేస్తూ నరసరావు పేటకు బదిలీ అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్న కె.మధులతను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. ఇప్పటివరకు గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 536.00 అడుగులకు చేరింది. ఇది 180.0950 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 20,754, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 39,618 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
ప్రజలకు చెప్పిన పనులు చేయాలి
దాచేపల్లి : పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయసేకరణ సభలో ప్రజలకు చెప్పిన పనులన్నీ తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. మండలంలోని గామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంధ్రా సిమెంట్స్ ఫ్యాక్టరీ రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో 191 హెక్టారులలో లైమ్స్టోన్ ఉత్పత్తి కోసం ప్రజాభిప్రాయ సేకరణ సభను రామాపురంలో మంగళవారం నిర్వహించారు. రామాపురం, శ్రీనగర్, గామాలపాడు గ్రామాలకు చెందిన ప్రజలు సభలో వారి సమస్యలపై చర్చించారు. ఫ్యాక్టరీ విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరారు. ఫ్యాక్టరీలో చేస్తున్న భారీ బ్లాస్టింగ్స్ వల్ల గృహాలు దెబ్బతింటున్నాయని, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించటంతో పాటుగా కనీస భద్రత చర్యలు తీసుకోవాలని పలువురు చెప్పారు. సీఎస్సార్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలన చేసి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.. పరిశ్రమ విస్తరణ కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించామని, వీటన్నింటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికగా పంపిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సహకరించిన ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి జరిగేలా యజమాన్యం చర్యలు తీసుకోవాలని, సీఎస్సార్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ.. తమ యజమాన్యం ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సభలో కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, భూగర్భ గనులశాఖ సహయ సంచాలకులు ప్రకాష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి ఔటర్ రింగ్రోడ్డు రైతులను ఆదుకోవాలి
ధర్నా చేసి జేసీకి వినతిపత్రం అందజేసిన నాయకులు, రైతులునరసరావుపేట: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు కంటే అదనంగా రెండున్నర రెట్లు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భూములు కోల్పోతున్న రైతులతో ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం అందజేశారు. గోపాలరావు మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అమరావతి మండలంలో రెండు గ్రామాలు, పెదకూరపాడు మండలంలో ఏడు గ్రామాలు కలిసి మొత్తం తొమ్మిది గ్రామాల్లో 990 మంది రైతుల నుంచి 648 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ రైతులంతా సన్న, చిన్న కారు రైతులు కావడంతో ఈ భూములే జీవనాధారం కావడం వలన, రైతులకు భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు న్యాయమైన పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పు 240 మీటర్లకు పెంచడం వల్ల సన్నా, చిన్నకారు రైతులు మరింతగా నష్టపోతున్నందున రింగురోడ్డు నిర్మాణం 70 మీటర్లు వెడల్పుతో మాత్రమే చేయాలని కోరారు. అదేవిధంగా 2013 భూ సేకరణ చట్టంలో గ్రామసభ జరిపి రైతుల అనుమతితో నష్టపరిహారం నిర్ధారణ చేయాలని, అటువంటి నిబంధనను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. రైతు సంఘం కూరపాడు మండల నాయకులు దర్శి శేషారావు, అమరావతి మండల రైతు నాయకులు బి.సూరిబాబు. పతకమూరి రాములు, ఆలపాటి వీరయ్య, వట్టికుంట అంకమరావు, విజయ్, భిక్ష మయ్య, నూతలపాటి సాంబశివరావు పాల్గొన్నారు. -
బెదిరింపులు.. మోసాలు
● జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ● ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ కృష్ణారావు నరసరావుపేట రూరల్: ఆర్థిక, భూ వివాదాలతో పాటు పలు రకాల మోసాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 88 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక వివాదాలు–18, భూ వివాదాలు–18, భార్యభర్తల వివాదాలు–16తో పాటు బెదిరింపులు, ఆస్తినష్టం, కుటుంబ తగాదాలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలను వేగంగా చట్టబద్దంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని ఎస్పీ తెలిపారు. నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఐ బెదిరిస్తున్నారు.. లంచం తీసుకుని తమకు అన్యాయం చేశాడని ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన జాష్టి నాగజ్యోతి ఈపూరు ఎస్ఐ వేణగోపాల్ పై ఫిర్యాదు చేసింది. తమ ఇంటి స్థలంలో గోడను ఐదు నెలల క్రితం తాము నిర్మించుకున్నామని, అయితే ఈ గోడ వలన వాస్తుదోషం వస్తుందని పక్క ఇంటికి చెందిన గుర్రం బుచ్చారావు, విజయలక్ష్మి, నాగరత్నంలు తమపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎస్ఐ ఇరువురిని పిలిచి విచారించారని, మమ్మల్ని స్టేషన్లో కూర్చబెట్టిన ఎస్ఐ గోడను ఎప్పుడు పడేస్తారని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద మాట్లాడితే రౌడీషీట్ తెరుస్తానని బెదిరింపులకు దిగారని తెలిపారు. ఎస్ఐ అండతో గోడను కూల్చివేశారని వివరించారు. కూల్చిన గోడను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడ భవానీపురానికి చెందిన వ్యక్తి చెప్పిన మాటల నమ్మి రూ.2 లక్షలు మోసపోయినట్టు నరసరావుపేట పెదచెరువుకు చెందిన జంగటి సురేష్ ఫిర్యాదు చేశాడు. డీఎస్సీకి సిద్ధమవుతున్న తనకు విజయవాడకు చెందిన మాధవ సత్యనారాయణ పరిచయమై ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకు రూ.2లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసి డబ్బులు వసూలు చేసిన సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరాడు. వీసా పేరుతో మోసం పోలాండు దేశానికి వీసా ఇప్పిస్తానని గుంటూరుకు చెందిన కన్సల్టెన్సీ మోసం చేసినట్టు నరసరావుపేటలోని బరంపేటకు చెందిన మారం నాగార్జున బాబు ఫిర్యాదు చేసాడు. గ్రీస్లో ఉద్యోగం చేస్తున్న తన వీసా కాలపరిమితి ముగియడంతో విదేశాలకు వెళ్లేందుకు స్నేహితుడి ద్వారా కన్సల్టెన్సీని సంప్రదించినట్టు తెలిపాడు. అతని మాటలు నమ్మి పోలాండ్ పంపేందుకు రూ.1.20లక్షలు, వీసా కోసం రూ.1.20లక్షలు రెండు దఫాలుగా చెల్లించినట్టు ఫిర్యాదులో తెలిపాడు. వీసా ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని, కన్సల్టెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ దోచుకున్నాడు మాయ మాటలతో తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.16లక్షలు దోచుకున్నారని మాచర్ల మున్సిపల్ ఆఫీసు విశ్రాంత ఉద్యోగి బొగ్గవరపు చెన్నయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసాడు. మాచర్లకు చెందిన సుభాని చెప్పిన మాయమాటలు నమ్మి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్కు చెందిన రూ.16లక్షల చెక్కు అవ్వగా.. అతను తన ఖాతాకు బదిలీచేసుకున్నాడని తెలిపాడు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని పలు మార్లు అడిగినా స్పందించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపాడు. మా కుమార్తె, అల్లుడిపై దాడికి కూడా పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
రెండు కాళ్లకు దెబ్బతగిలినా... పరీక్షకు
పిడుగురాళ్ల : రెండు కాళ్లకు దెబ్బలు తగిలినా పరీక్షలు రాయాలనే దృఢ సంకల్పంతో ఓ విద్యార్థి పరీక్ష హాల్కు వచ్చి పరీక్ష రాశాడు. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన సయ్యద్ ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. 20 రోజుల కిందట ఉదయం పూట ట్యూషన్కు వెళ్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. మంగళగిరిలో చికిత్స నిర్వహించారు. పరీక్షలు రాయాలనే సంకల్పంతో సోమవారం పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. తల్లిదండ్రులు, బంధువులు జానపాడు నుంచి ఆటోలో జాబిర్ను తీసుకొని వచ్చారు. పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య స్కూలులో మూడో ఫ్లోర్లో ఉండటంతో తల్లిదండ్రులు ఆటోలోని సీట్ సహాయంతో జాబిర్ను ఎత్తుకొని తీసుకొని వెళ్లటం, తీసుకొని రావటం చేశారు. -
వస్తువుల కొనుగోలులో మోసపోరాదు
బాపట్ల: ప్రజలు ఏ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో మోసానికి గురికాకుండా అవగాహన పొందాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నాణ్యత ప్రమాణాలతో రూపొందించిన తూనికలు, కొలతలు యంత్రాల ప్రదర్శించారు. వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన గోడపత్రాలను జేసీ విడుదల చేశారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల కార్పొరేషన్ జీఎం శ్రీలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్, తూనికలు కొలతలశాఖ సహాయ కమిషనర్ లిల్లీ, డీటీఓ పరందామరెడ్డి, వాణిజ్య శాఖ అధికారి గౌరీ, డీసీఐసీడీ ఇమ్మానియేలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా జేసీ భావన వశిష్ట -
పెన్షనర్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
మాచర్ల రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు అందించకపోవటం దారుణమని, వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని పెన్షనర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదె రామకృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పెన్షనర్స్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 3.70లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలు, క్వాంటం ఆఫ్ పెన్షన్స్ ఉత్తర్వుల గురించి ఎదురుచూస్తున్నారని, ఉత్తర్వులు విడుదల చేయటంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తగదన్నారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు కోసం హామీలిచ్చి నేటికీ అమలు చేయకపోవటం ఏటంటూ ప్రశ్నించారు. పీఆర్సీ కమిషన్ నియమించి 30శాతం ఐఆర్ను ప్రకటించటమే కాకుండా రావాల్సిన అన్నీ సౌకర్యాలను అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంఘం అధ్యక్షుడు నందా నరసింహయ్య మాట్లాడుతూ ఈహెచ్ఎస్ కింద పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్ కార్డు వలన ఎటువంటి ప్రయోజనాలు లేకుండా పోతున్నాయని, బకాయిలు చెల్లించలేదనే సాకుతో ఆసుపత్రిలో వైద్యమందటం లేదని, వెంటనే మెడికల్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి వైద్యమందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రయ్య, ట్రెజరర్ గౌస్, సుబ్బారావు, ఆంజనేయులు, జాన్ సాహెబ్, నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేశ్వర్లు, లక్ష్మీకుమారి, పాపిరెడ్డి తదితరులున్నారు. – పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణారావు -
అందరికీ ఆరాధ్యులు పొట్టి శ్రీరాములు
కలెక్టరేట్లో నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే, నాయకులునరసరావుపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం తెలుగు ప్రజలకేగాక యావత్ భారతీయులకు ఆరాధ్యుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి పాల్గొన్నారు. అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి ఆత్మార్పణతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంతోపాటూ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. శ్రీరాములు లాంటి పట్టుదల ఉన్నవారు మరో పది మంది నా దగ్గర ఉంటే మనకు పదేళ్ల ముందే స్వాతంత్య్రం వచ్చేదని మహాత్మాగాంధీ కీర్తించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. శ్రీరాములు స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా ప్రజలు దశదిశాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ తన సందేశం ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయకుమార్, శ్రీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నపాటి ఈశ్వరరెడ్డి, బీసీ సంక్షేమసంఘ నాయకులు బాదుగున్నల శ్రీను పాల్గొన్నారు. -
గోల్షాట్ బాల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం విజయవంతం
కొల్లూరు, (వేమూరు) : గోల్ షాట్ బాల్ దేశవ్యాప్త ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు మండలంలోని చిలుమూరు శ్రీరామ సైనిక్ స్కూల్లో విజయవంతంగా జరిగాయి. ఈనెల 14, 15 తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశాల్లో దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యదర్శులు పాల్గొన్నారు. గోల్డ్ షాప్ బాల్ క్రీడాభివృద్ధికి, భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యాచరణ, క్రీడ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కోచ్లు, పీఈటీలు, పీడీలకు గోల్ షాట్ బాల్ ఆటపై అవగాహన సదస్సు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొన్న వ్యాయామ ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారికి రాష్ట్ర స్థాయి రిఫరీలుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ గేమ్ ఫౌండర్, ప్రధాన కార్యదర్శి నోట్ల రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. శ్రీ రామా సైనిక్ స్కూల్ అధ్యక్షులు కె.తులసి విష్ణు ప్రసాద్, గోల్డ్ షాట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు బిహార్ రాష్ట్రానికి చెందిన రామ్ పరమేష్ కుమార్ (అసోసియేషన్ ట్రెజరర్), తమిళనాడుకు చెందిన ఆర్. కరుణాకర్ (సౌత్ ఇండియా ఇన్చార్జ్), మహారాష్ట్రకు చెందిన యోగేష్ పటేల్ (వెస్ట్ ఇన్చార్జ్), ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ (ఈస్ట్ ఇంచార్జ్), ఢిల్లీకి చెందిన నితిన్ షైన్ (నార్త్ ఇన్చార్జ్), వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దేవి ప్రియ ప్రారంభించిన కార్యక్రమంలో ఆర్గనైజర్ సెక్రటరీ వణుకూరి గోపికృష్ణ, వర్కింగ్ సెక్రటరీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు -
అనుమానంతో మహిళపై కత్తితో దాడి
చినగంజాం: మహిళపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని మోటుపల్లి శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్సై శీలం రమేష్ వివరాల మేరకు.. ఒక మహిళతో మోటుపల్లి గ్రామానికి చెందిన పొగడదండ శ్రీనివాసరావు అనే వ్యక్తి గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సదరు మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సోమవారం ఉదయం మోటుపల్లి గ్రామ శివారు ప్రాంతంలో కత్తితో ఆమైపె దాడి చేసి హత్యాప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి గాయాలపాలైన ఆమెను 108 వాహనంలో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు చినగంజాం ఎస్సై తెలిపారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 59 మంది బాధితులు హాజరై వారి సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బాధితుల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న ఎస్పీ సమస్యలను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఎస్.ఐ లక్ష్మీరాజ్యం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేటపాలెం: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా దూసుకెళ్తున్న బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన దేశాయిపేట పంచాయతీలోని మార్కెట్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. చీరాలకు చెందిన బి.వెంకటరమణ(60) దేశాయిపేట మార్కెట్ వద్ద చీరాల–వేటపాలెం ప్రధాన రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో చీరాల వైపు బైక్పై వెళ్తున్న యువకుడు ఢీకొట్టడంతో వెంకటరమణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న యువకుడికి సైతం తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక, జనరల్ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 22లోపు సాయంత్రం 3.00 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పనిదినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్దిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో 2025 డిసెంబర్లో జరిగిన బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్కు 925 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 795 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్కు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి, రీవాల్యుయేషన్ దరఖాస్తులను 26వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలని ఆలపాటి తెలిపారు. -
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా కలెక్టర్, రెవెన్యూ క్లినిక్కు జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 135 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 29 అర్జీలు స్వీకరించగా వాటిలో నరసరావుపేట డివిజన్ నుంచి 17, గురజాలకు చెందిన ఎనిమిది, సత్తెనపల్లి నుంచి నాలుగు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా, సకాలంలో పరిష్కరించాలని, గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్ఓ నారదముని, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏడేళ్లుగా మా గ్రామంలోని చెరువు నుంచి మురుగు నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగలేక సమీప గ్రామాల నుంచి తెచ్చుకుంటున్నాం. పంచాయతీరాజ్ డీఈకి ఫిర్యాదు చేస్తే వచ్చి చూసి వెళ్లారు. చెరువుకి ఐదు ఫిల్టర్ బెడ్లు, రెండు ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఏవీ పనిచేయట్లేదు. ఇప్పటికై నా మంచినీరు సరఫరా చేయగలరు. – పోలయ్య, గోవిందపురం, చిలకలూరిపేట మండలం -
పల్నాడు
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026రసవత్తరంగా మారిన బార్ అసోసియేషన్ ఎన్నిక అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. సత్తెనపల్లి: మునుపెన్నడూ లేని విధంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. రాజకీయాలకతీతంగా న్యాయవాదులు ఎన్నుకోవాల్సిన బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని కై వసం చేసుకునేందుకు టీడీపీ లీగల్ సెల్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ముందస్తు సమావేశం నిర్వహించింది. -
పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భక్తులకు పరమపద నాథ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలియజేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరు గ్రామానికి చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు వ్యవహరించగా ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. -
ప్రశాంతంగా ప్రారంభమైన పది పబ్లిక్ పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 128 పరీక్ష కేంద్రాలలో 25,167 మంది విద్యార్థులకుగాను 24,955 మంది హాజరయ్యారు. 212మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే 1087 మంది దూరవిద్య విద్యార్థులకుగాను 963 మంది హాజరు కాగా 124 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తీసుకున్న చర్యలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన ఏడు పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. పది పబ్లిక్ పరీక్షలు తొలిరోజు కావటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన గదులు సరిచూసుకొని వెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులను గదులలోకి అనుమతించారు. -
భక్తిశ్రద్ధలతో సత్తెమ్మతల్లి 16 రోజుల పండుగ
అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మతల్లి దేవాలయంలో సత్తెమ్మతల్లి, సత్యదేవుళ్ల కళ్యాణ 16 రోజుల పండుగ మహోత్సవాలు సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పొంగళ్లు పొంగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవ నిర్వహకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి 16వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 1వ తేదీన అమ్మవారికి కల్యాణం నిర్వహించామని, తిరిగి 16 రోజుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీనివాసరావు, సత్యవతి దంపతులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అచ్చంపేట: ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక గ్రామదేవతగా వెలుగొందుతున్న అచ్చమ్మ పేరంటాళమ్మ తల్లి మహోత్సవాలు మంగళ ,బుధ, గురు వారాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ కన్వీనర్ సూరే వెంకట సుబ్బారావు సోమవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాదికి ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలిరోజు తోరణపాకు అలంకరణ, విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధనలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మూడు రోజుల పాటు ప్రాతఃకాల పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు, లలితాసహస్రనామ పారాయణం, పంచాంగ శ్రవణం, మహో నైవేద్యం, వేపపూత ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గుంటూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన గుంటూరు నగర పర్యటన ప్రతిపాదనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్లు అందుకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్రోడ్ శ్రీ కన్వెన్షన్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్స్టాండ్ వరకు పర్యటించే అవకాశాలు ఉన్నందున వాటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం, ట్రాఫిక్ డీఎస్పీ బి. శ్రీనివాస్, ఈస్ట్ డీఎస్పీ అజీజ్, పాత గుంటూరు సీఐ వెంకటరావు, లాలాపేట సీఐ శివరామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ సీతారామిరెడ్డి, ఈస్ట్ తహసీల్దార్ సుభాని, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గ్యాస్ నిర్ణీత సమయంలోనే బుక్ చేసుకోండి
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ ప్రసాదు నరసరావుపేట: ఒకసారి గ్యాస్ బుక్ చేసుకొని సిలిండర్ పొందిన తర్వాత మళ్లీ పట్టణంలో 25 రోజుల తర్వాత, గ్రామాల్లో 45 రోజుల తర్వాతనే గ్యాస్ బుక్ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి.ప్రసాదు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గ్యాస్ వినియోగంపై వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో వినియోగదారులు తమ వద్ద సిలిండర్ల గడువు ముగియక ముందే బుక్ చేస్తున్నారన్నారు. అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దని వినియోగదారులకు సూచించారు. దీని వల్ల గతంలో 24 గంటలు లేదా 48 గంటలకు డెలివరీ చేసే గ్యాస్ పానిక్ బుకింగ్ వల్ల మూడు నుంచి ఆరు రోజులు సమయం పడుతుందన్నారు. ప్రతి మండలంలో ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు చేశామని, సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినా, నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ఫ్రీ నంబరు 08647–252999ను సంప్రదించాలని సూచించారు. -
కూటమి ప్రభుత్వంలో డ్రగ్గిస్టులు
పట్నంబజారు: కూటమి ప్రభుత్వంలో కామాంధులు, డ్రగ్గిస్టులకు కేరాఫ్కు మారిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ఒక ఫామ్ హౌస్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని దొరకటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేష్ ఈ విధంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులను నేరుగా మత్తు పదార్థాలకు అలవాటు అవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం డబ్బులు కోసం గంజాయి, డ్రగ్స్ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. రౌడీలను, డ్రగ్గిస్టులను, మహిళలను వేధించే వారిని పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా ఎంపీ మహేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
డాక్టర్ రమణ యశస్వికి ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు
గుంటూరు మెడికల్ : కవి, సేవా తత్పరుడు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.ఽ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో డాక్టర్ యశస్వి రమణ అవార్డు తీసుకున్నారు. థలసీమియా రోగులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసినందుకు, వాక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 ఏళ్లకు పైగా వికలాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా అందజేసి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు, పేదలకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నందుకు డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజర్ శ్రీకాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా నుండి డాక్టర్ యశస్వి రమణను మాత్రమే ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అవార్డు అందుకున్న డాక్టర్ రమణ యశస్వికి గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులు, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, ఐఎంఏ నేతలు, రోటరీ క్లబ్ నేతలు, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో జాలాది వాసి మృతి
చిలకలూరిపేటటౌన్: బైక్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన పిల్లి దొరకరాజు (38) ఆదివారం తెల్లవారుజామున వ్యక్తిగత పనులపై చిలకలూరిపేట వెళ్లి తిరిగి బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామం దాటిన తర్వాత, బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఎండిపోయిన పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజు తలకు బలమైన రక్త గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అమరావతి: విజయవాడ నుంచి అమరావతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అమరావతి గ్రామ సమీపంలో ఒక్కసారిగా ముందు టైరు పేలి రోడ్డు పక్కన కందకంలో దిగబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అమరావతికి వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని పెదమద్దూరు దాటి అమరావతి సమీపానికి రాగానే ఒక్కసారిగా ముందుటైరు పేలింది. ఈక్రమంలో బస్సు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూసుకు వెళ్లి దిగబడి పూర్తిగా ఒకపక్కకి ఒరిగి పోయింది. ఈసమయంలో బస్సులో ఉన్న ఇరవై మంది ప్రయాణీకులు, డ్రైవర్, కండక్టర్లు ఎలాగోలా బస్సునుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు నాగవర్ధిని, శివపార్వతి, రమాదేవిలకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని అందరు ఊపిరిపీల్చుకున్నారు. అమరావతి: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మై భారత్ కేంద్రం గుంటూరు ఆధ్వర్యంలో అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం ఆదివారం అమరావతిలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో త్రిపుర రాష్ట్రం నుంచి యువతీయువకులు క్షేత్ర దర్శనంలో భాగంగా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయాన్ని, ధ్యాన బుద్ధ విగ్రహాన్ని, పురావస్తు మ్యూజియాన్ని దర్శించారు. త్రిపుర రాష్టానికి చెందిన 37 మంది యువతీయువకులు పాల్గొన్నారు. మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాలు, విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో తుళ్ళూరి సాంబశివరావు బెజ్జం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు అక్షరాస్యులు కావాలి
● డీఆర్డీఏ పీడీ పి. ఝాన్సీరాణి ● వయోజనుల అక్షరాస్యత వార్షిక పరీక్ష కేంద్రాల తనిఖీ యడ్లపాడు: మండలంలోని 22 గ్రామాల్లో ఆదివారం అక్షర ఆంధ్ర–అక్షర పల్నాడు కార్యక్రమంలో భాగంగా అధికారులు వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలనకు జిల్లా డీఆర్డీఏ పీడీ పి ఝాన్సీరాణి ఆకస్మికంగా మండలాన్ని సందర్శించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రలో జరిగే పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 2200 మంది వయోజనులు అక్షరాభ్యాసం చేస్తున్నారని వీరిలో 1670 మంది డ్వాక్రా సభ్యులు కాగా, 530 మంది ఉపాధి కూలీలు ఉన్నట్లు తెలిపారు. చదువుపై వయోజనులు చూపుతున్న ఆసక్తిని ఆమె అభినందించారు. చదువు లేని డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు తమ రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. పొదుపు సంఘాల్లో డబ్బుల లెక్కలు తెలుసుకోవడం, ఉపాధి హామీ కూలీ డబ్బుల లెక్కలు చూసుకోవడం ,బ్యాంకు చెక్కులపై సొంతంగా సంతకాలు చేయడం వంటి అంశాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశమని ఆమె పేర్కొన్నారు. మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు వందశాతం హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎంపీడీవో వి హేమలత, డిప్యూటీ ఎంపీడీవో షేక్ జాకీర్హుస్సేన్, సచివాలయ మండల అధికారి నాగిరెడ్డి, ఏపీఎం కె రవీంద్రకుమార్, ఏపీఓ డి సుందరరావు, సీసీలు వై పెద్దయ్య, సీహెచ్ నాగేశ్వరరావు, జి నాగేశ్వరరావు, ఎం ద్రాక్షాయమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. -
అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలు
● పూలింగ్కి ఇచ్చిన భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ● జేబులు నింపుకొంటున్న తమ్ముళ్లు ● పట్టించుకోని మైనింగ్ ఇతర అధికారులు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో అధికార పార్టీ నాయకులు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. కొండ వెనుక ఉన్న ఫూలింగ్ భూముల్లో రాత్రివేళ గ్రావెల్ తవ్వకాలు చేసి అక్రమంగా తరలించడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు. రాజధానిలో గ్రావెల్కు తీవ్ర డిమాండ్ ఉండటంతో అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రివేళ జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో భారీగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. ఈ గ్రావెల్ను అమరావతి మండలం వైకుంఠపురం ఇతర గ్రామాలకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై అటు మైనింగ్, రెవెన్యూ ఇటు పోలీసులు కూడా తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో యధేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలిపోతుంది. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వర్సిటీ పురుషుల ఖోఖో విజేత కృష్ణవేణి
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల ఖోఖో టోర్నమెంట్లో కృష్ణవేణి కళాశాల జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్లో తమ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించటంతోపాటు జట్టులోని పి.గోపినాథ్, బి.దిలీప్, ఎన్.అనిల్, పి.వెంకట్రావు, ఎం.యూష్లు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగనున్న సౌత్జోన్ ఖోఖో పోటీల్లో ఏఎన్యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జట్టు విజయానికి కృషి చేసిన వ్యాయామ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, ప్రిన్సిపల్ నాతాని, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, అధ్యాపకులు ఎం.తిరుపతిరావు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షునిగా వెలుగూరి కృష్ణమూర్తి, కార్యదర్శిగా కోట శివకృష్ణ, కోశాధికారిగా కొలిపాకుల లక్ష్మీకాంత్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా చిట్టెపు శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. నూతన కార్యవర్గం సభ్యుల చేత జిల్లా అధ్యక్షులు చక్కా సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు. సభలో నూతన అధ్యక్షులు కృష్ణ్ణమూర్తి మాట్లాడుతూ నూతన సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. కార్యదర్శి శివకృష్ణ్ణ మాట్లాడుతూ వ్యాపార ధోరణే కాకుండా సమాజం పట్ల తమ వంతు బాధ్యతగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. మాస్టర్ ప్రింటర్స్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శి నేతగాని ఫిలిప్స్ తన సందేశాన్ని అందించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు తోట శ్రీనివాస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఆదివారం బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్పై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐఆర్సీ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్కు సంబంధించిన ముఖ్యాంశాలు, తాజా నియమాలు, మార్గదర్శకాలు, ఆడిట్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలపై అవగాహన కల్పించారు. అనంతరం బ్రాంచ్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్ బ్యాంకు శాఖల ఆడిట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్ దోహదం చేస్తుందన్నారు. వర్క్షాప్లో ఐసీఏఐ గుంటూరుశాఖ వైస్ చైర్మన్ వనిమిరెడ్డి వెంకట నరేష్, కార్యదర్శి కన్నెగంటి మృత్యుంజయరావు, కోశాధికారి నాగబీరు రాజశేఖర్, సి కా సా చైర్మన్ షేక్ బాజీ, కమిటీ సభ్యులు దేసు సంపత్ , చింతా రఘు నందన్, సీఏలు పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు డాక్టర్ గద్దె రాజేంద్రప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు. -
కనుల పండువగా బదరీ కేదారేశ్వర శాంతి కల్యాణం
కర్లపాలెం: అగ్రహారం గ్రామంలో ఉన్న గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి శివపార్వతుల శాంతి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా శివాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి పలు రకాల పూలమాలలతో అలంకరించారు. లోక కల్యాణం కోసం శాస్త్రోక్తంగా శివపార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. -
గంజాయి కేసులో నిందితుల అరెస్ట్
పట్నంబజారు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కే.వెంకట ప్రసాద్ వివరాలను వెల్లడించారు. గుంటూరు తారకరామానగర్కు చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ 220 బాషా గంజాయి తాగటానికి అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో లంబసింగ్ వాటర్ ఫాల్స్ దాటిన తరువాత అన్నారం అనే గ్రామం వద్ద తాబేలీ ఛత్రపతి, తామిలి కొండలరావు వద్ద లిక్విడ్ గంజాయి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఛత్రపతి, కొండలరావుకు గంజాయి కావాలని ఫోన్ చేయగా, లిక్విడ్ గంజాయి తీసుకుని వారు ఈనెల 15వ తేదీన వస్త్ర నగర్ వద్దకు వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు వారినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
తాడేపల్లి రూరల్: దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి.. వారి సమగ్ర అభివృద్ధికి పాలకుల ప్రణాళికలు చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బీసీ రమణ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేక 80 శాతం బీసీ కులాలు చట్టసభల్లో అడుగుపెట్టడం లేదని అన్నారు. దీంతో ఆయా వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. బహుజన పోరాట వీరుడు కాన్షీరాం జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో బీసీ భవనాలకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. బీసీలను చైతన్యం చేయడమే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్య బీసీ నాయకులు పాల్గొన్నారు. -
అండర్–17, 19 బాక్సింగ్ జట్లు ఎంపిక
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–17, 19 బాలుర బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల పర్యవేక్షణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.చిరంజీవి, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాఽథ్లు పర్యవేక్షించారు. చిరంజీవి మాట్లాడుతూ ఎంపికై న జట్లు 21 నుంచి 23 వరకు విశాఖలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు.. అండర్–19 : సీహెచ్ అభిషిత్ పాల్, రామేశ్వర్, ఎన్.లోకేష్ చౌదరి, అండర్–17లో జి.సాయిహర్ష, బి.దేవ సుధాకర్, ఎస్.కుశ్వంత్ రాజ్ కుమార్, ఎస్.చరణ్ దీప్, బి.వెంకట మనోహర్, ఎస్.సత్యకుమార్, పి.కార్తీక్, ఎస్.రోహిత్ కుమార్, ఎస్.విజయ్ కుమార్, జి.కనిష్క్, జి.సాయిరామ్ చరణ్ ఉన్నారు. -
జోన్–111 ఎన్నికలు ఏకగ్రీవం
ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ శాఖ టెక్నికల్ అధికారుల సంఘం (జోన్–111) ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఒంగోలు అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్ ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించారు. ఒంగోలులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో మొత్తం 9 మంది ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలలో జోన్ 3 పరిధిలో నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షునిగా వి.బాలకృష్ణ, (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మంగళగిరి), గుంటూరు జిల్లా, ప్రధాన కార్యదర్శిగా కె.జయప్రకాశ్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ఒంగోలు), ట్రెజరర్గా కె.కరుణాకరన్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కావలి, నెల్లూరు జిల్లా) ఎన్నికై నట్లు వెల్లడించారు. జిల్లా రిప్రజెంటేటివ్ పోస్టులు మొత్తం ఆరు ఏకగ్రీవం కాగా, వారిలో గుంటూరు జిల్లాకు చెందిన జి.అమృతరాణి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తెనాలి), పల్నాడు జిల్లాకు చెందిన సీహెచ్ మనీషా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, నరసరావుపేట), బాపట్ల జిల్లాకు చెందిన కె.రవినాయక్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, చీరాల) ప్రకాశం జిల్లాకు చెందిన బి.భాను ప్రకాష్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ప్రకాశం) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏ మల్లికార్జున్రెడ్డి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), మార్కాపురం జిల్లాకు చెందిన కె.ఎల్.రావు (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, మార్కాపురం) ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా కార్యదర్శి మక్దూం షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో జోన్ 3 పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొని నూతనంగా ఎన్నికై న జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్
నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టరేట్లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి కచ్చితమైన, పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని వెల్లడించారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చునని సూచించారు. స్తంబోద్భవం అలంకారంలో నరసింహస్వామి మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్తంబోద్భవం అలంకారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. భక్తులు కనులారా దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావులు వ్యవహరించారు. -
విద్యార్థీ... విజయీభవ
ఏడాదంతా నేర్చుకున్న జ్ఞానాన్నంతా పేపర్పై పెట్టే సమయం ఆసన్నమైంది.. మదిలో నిక్షిప్తమై ఉన్న అక్షర గనిని వెలికి తీసే ఘడియ రానే వచ్చింది. కంగారు పడకుండా ఆత్మవిశ్వాసంతో అడుగేయాల్సిన శుభ తరుణమిదే. బంగారు భవితకు బాటలు వేసుకునే అద్భుత క్షణమిదే. ఈరోజు నీ కలం నుంచి జాలువారే ‘అక్షరాలే’.. నుదుటి రాతను మారుస్తాయని గుర్తుంచుకోవాల్సిన తరుణమిదే. పదవ తరగతి పరీక్షలు రాయబోయే ఓ విద్యార్థీ.. విజయీభవ! సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్తో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లోకి 8:45 గంటలకే విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారు హాల్ టికెట్ చూపి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ జిల్లా అధికారి అజిత్కుమారి తెలిపారు. కేంద్రాల్లో సమస్యలు ఉంటే చెప్పడానికి ఈ నెల 16 నుంచి మే 1వ తేదీ వరకు పల్నాడు జిల్లా డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 99636 38232, 93948 84558 ఫోన్ నంబర్లకు కాల్ చేయొచ్చని వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది కూడా అన్ని కేంద్రాల్లో సెల్ఫోన్లను నిషేధించారు. చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, సిబ్బంది వద్ద కూడా సెల్ఫోన్ ఉండకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది కచ్చితంగా గుర్తింపు కార్డు ధరించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 26,515 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 30 స్టోరేజ్ పాయింట్లలో రెండు సెట్ల ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. పోలీస్ బందోబస్తు మధ్య ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను సమీపంలోని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లనున్నారు. జిల్లా విద్యాశాాఖ అధికారి పీవీజే రామారావు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల– విప్పర్లరెడ్డిపాలెం, ఎస్బీఆర్ మున్సిపల్ హై స్కూల్ – బరంపేట, నరసరావుపేట; జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల– క్రోసూరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల– కొమెరపూడి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – బండ్లమోటు, గవర్నమెంట్ హైస్కూల్ –విజయపురిసౌత్, వైఆర్ఎస్ హైస్కూల్ –రెంటచింతల పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మూసేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే కేంద్రంలోకి స్మార్ట్ వాచీలు, క్యాలిక్యులేటర్లు, సెల్ఫోన్లను నిషేధించారు. జిల్లా వ్యాప్తంగా 1,350 మంది ఇన్విజిలేటర్లను, 128 మంది చీఫ్ సూపరిండెంట్లు, 128 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఎస్ఎస్సీ) పరీక్షలు ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ బొనిగల హైమారావు తెలిపారు. ఈ పరీక్షల కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,136 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. -
సంగ్రామానికీ వెనకడుగే!
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చంద్రబాబు సర్కారు మల్లగుల్లాలుగ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేకాధికారుల పాలన అమలు కానుంది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. నిబంధనల ప్రకారం ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల కమిషన్ గత ఏడాది సెప్టెంబర్లో ప్రీ షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. కానీ సాంకేతిక, పాలనపరమైన కారణాలతోపాటు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఎన్నికల వాయిదాకు కారణంగా భావిస్తున్నారు. సత్తెనపల్లి: వాస్తవానికి ప్రీ ఎన్నికల షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 15వ తేదీలోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం, డిసెంబర్ 16 నుంచి 30వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల ఖరారు కావాలి. డిసెంబర్ 15వ తేదీలోగా రిజర్వేషన్ల ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఎక్కడా ఆ మేరకు చర్యలు తీసుకున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే నిర్వహించేస్తుందంటూ గత ఏడాది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే స్థానిక సమరానికి చంద్రబాబు సన్నద్ధం అవుతున్నారన్నట్లుగా హడావుడి చేశారు. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై అధికారికంగా ముఖ్యమంత్రిగానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రత్యేకాధికారుల పాలన తప్పని పరిస్ధితి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక వంటి సాంకేతిక, న్యాయపరమైన అంశాల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలస్యానికి ప్రధాన కారణాలు... జిల్లాలో 529 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎంపీడీవోలు, ఈఓపీఆర్డీలు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అవకాశం ఉంది. అధికారులు కొరత ఉన్న ప్రాంతాల్లో ఒక అధికారికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం (ట్రిపుల్ టెస్ట్) రిజర్వేషన్ల అమలకు ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభించడానికి మరో రెండు నెలలు పట్టొచ్చు ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మారనున్నారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి ఎన్నికలు జూన్ తర్వాతే జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కూటమిలోని నాయకులు, కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికలు జరిగితే అందర్నీ సంతృప్తి పరచలేమని భావించి వాయిదా వేసిందని అంటున్నారు. మరోవైపు ప్రజల్లో అసంతృప్తిని సైతం అంచనా వేసి, ఎన్నికల నిర్వహణకు వాయిదా వేస్తోందని వాదనలు కూడా వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని చంద్రబాబు సర్కారు వెనుకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు. గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దారులు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్లు, మండల విద్యాశాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు, పశువైద్యాధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, ఉప తహసీల్దార్ల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కింది స్థాయి అధికారుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. అధికారుల కొరత ఏర్పడితే చిన్న పంచాయతీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను ప్రత్యేకాధికారులుగా నియమించే అవకాశం ఉంది. మండల కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారులను, ప్రధాన గ్రామ పంచాయతీలకు తమసీల్దార్లను, ఎక్కువ జనాభా గల పంచాయతీలకు ఎంపీడీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించే ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే ఒక అధికారికి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
వంటలకు గ్యాస్ మంట
నరసరావుపేట టౌన్: వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. హోటళ్లు, టీస్టాల్స్, ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ లేక తలలు పట్టుకుంటున్నారు. సరిపడ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా నిలిచిపోవటంతో రెస్టారెంట్లలో మెనూలను కుదించారు. రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వండే చైనీస్ వంటకాలు పూర్తిగా గ్యాస్ పొయ్యిలపైనే ఆధారపడి ఉంటాయి. కమర్షియల్ గ్యాస్ సిలీండర్లు అందుబాటులో లేకపోవటంతో ఇప్పటికే కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతబడ్డాయి. బ్లాక్లో అధిక ధరకు సిలిండర్లు కొనుగోలు చేస్తుండటంతో కొన్ని రెస్టారెంట్లలో ఆహార ధరలను పెంచారు. టీస్టాళ్లలో గ్యాస్ లేక ఎలక్ట్రిక్ స్టౌలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. అయితే గ్యాస్ కన్నా విద్యుత్ ఖర్చే అధికం అవుతుందని, దీంతో నష్టాలు చవిచూస్తున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. మరో వైపు హోటళ్ల నిర్వాహకులు కట్టెలు, బొగ్గు పొయ్యిలను వినియోగిస్తున్నారు. వాటికి డిమాండ్ పెరగటంతో ధరలు అమాంతం పెరిగాయి. వ్యాపారులకు ఇది అదనపు భారంగా మారింది. చిన్న వ్యాపారాల బతుకుబండిని నడిపించటంలో గ్యాస్ కీలకం. హోటళ్లు, టీస్టాల్స్, బేకరీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్ వంటివి పూర్తిగా గ్యాస్పై ఆధారపడి ఉంటాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడం యజమానులతోపాటు అక్కడ పనిచేసే కార్మిక కుటుంబాలను ఆందోళన కలిగిస్తోంది. హాస్టళ్లలో మెనూ కుదింపు.. వంట గ్యాస్ కొరత ప్రభావం ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే వారిపై పడింది. విద్యా కేంద్రంగా విరజిల్లుతున్న నరసరావుపేట పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటూ ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉదయం టిఫిన్కు బదులు రాగిజావ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో ఒక కూర, పెరుగు మాత్రమే అందిస్తున్నారు. వారం క్రితం మూడు కూరలు, ఒక ఫ్రై వడ్డించారు. విద్యార్థులు కడుపునిండా తినలేక ఇబ్బందులు పడుతున్నారు. 8 నుంచి సరఫరా బంద్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను ఈ నెల 8వ తేదీ నుంచి డీలర్లు నిలిపివేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గ్యాస్ సరఫరాలో సమస్య లేదని చెప్పుకొస్తుంది. వాస్తవానికి అనేక హోటళ్లు, వ్యాపార సంస్థలు మూసివేసి ఉండటం బహిరంగంగానే కనిపిస్తోంది. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గృహవినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే గ్యాస్ సంక్షోభం చిన్న వ్యాపారుల ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తుంది. -
మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆది మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం ఈనెల 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం బాజీబాబా దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు మహోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వహణకు రాష్ట్ర వక్ఫ్బోర్డు రూ.17.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఉరుసు నిర్వహణకు వక్ఫ్ బోర్డు సూపరిండెంట్లు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19వ తేదీ సాయంత్రం చాందిని అలంకరణ, రాత్రి 10 గంటలకు పెదకాకాని ముస్లింపాలెం జెండా చెట్టు నుంచి వైభవంగా ఉరుసు మహోత్సవం ప్రారంభం అవుతుందన్నారు. 20వ తేదీ దీపారాధన, గంధం పంపిణీ, ఖురాన్ పఠనం, సలామి ప్రార్థనలు జరుగుతాయన్నారు. 19వ తేదీ రాత్రి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కలసి దర్గాలో ఉరుసు మహోత్సవ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. దుగ్గిరాల: దుగ్గిరాల రైలుపేటలోని పసుపు యార్డు సమీపంలోని వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, శాంతి హోమంతో వేడుకలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కల్యాణం కనులారా తిలకించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. కల్యాణం ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది. -
పిన్నెల్లి, కర్నాటిలకు ఎటువంటి సంబంధం లేదు
నరసరావుపేట: పల్నాడులో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు, దాడులు, అరెస్టులతో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు పార్టీ పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన పిన్నెల్లికి వీరభద్రరరావు అనుచరుడు అంటూ తప్పుడు కథనం రావటం దారుణం అన్నారు. హైకోర్టు అడ్వకేటు హరిబాబు వద్ద అమెరికాలో ఉండే కర్నాటి సతీష్ 2018–19లో రూ.2.40 కోట్లు అప్పు తీసుకొని అందులో రూ.1.40కోట్లు చెల్లించాడని, మిగతా చెల్లించాల్సి ఉండగా అది ఇవ్వకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హరిబాబు ఆస్తులు బలవంతంగా రాసిచ్చాడంటూ తప్పుడు అభియోగం మోపి కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో అప్పటి డీఎస్పీ పల్లంరాజు, పిడుగురాళ్ల ఎస్ఐ రబ్బానిలపై కూడా కేసు నమోదు చేశారన్నారు. వీరభద్రరావు క్రోసూరు మండలంలో నివాసం ఉంటాడని, అతడికి పిన్నెల్లికి ఎటువంటి సంబంధం లేదన్నారు. పిన్నెల్లి సోదరులకు బెయిలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. బ్రాహ్మణపల్లికి చెందిన మైనార్టీ వర్గీయుడు మాబుపై రంజాన్ పర్వదినాల్లో ఆరు అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారని, పీడీయాక్ట్ అమలు చేసి జైలుకు పంపారన్నారు. పల్నాడులో ఇప్పటివరకు పది నుంచి 12మందిపై దాడిచేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టి మళ్లీ నడిచేందుకు వీలులేకుండా చేశారన్నారు. మందా సాల్మన్ను కొట్టి చంపిన తర్వాత కూడా జూలకల్లు, రామాపురం గ్రామాల్లో మరో ముగ్గురిపై దాడిచేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారన్నారు. పోలీసుల చేతులు కట్టేసి టీడీపీ నాయకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పిన్నెల్లి సోదరులకు బెయిల్ వచ్చేందుకు పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు వెళతామని పేర్కొన్నారు. మురళీధర్రెడ్డి మాట్లాడుతూ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై అక్రమకేసులు, దాడులు చేస్తూ వేధిస్తున్నారన్నారు. కమ్మ కులానికి చెందిన వీరభద్రరరావు టీడీపీ సానుభూతిపరుడని అన్నారు. 22 నెలల క్రితం కోర్టు ఆదేశాల మేరకు ఫైల్ చేసిన ఈ కేసులో వీరభద్రరరావును అరెస్టు చేస్తే పిన్నెల్లి అనుచరుడు అరెస్టు అంటూ దారుణమైన కథనం రాశారన్నారు. పిన్నెల్లి సోదరులపై 18 అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. టీడీపీ వారిని సొంత పార్టీ వారే చంపితే పిన్నెల్లి సోదరులపై అక్రమంగా కేసు పెట్టి జైలు పాలు చేశారన్నారు. ఇటీవలనే రామాపురం ఎంపీటీసీపై దాడి, వీరారెడ్డిపై హత్యాయత్నం కేసుల్లో కాళ్లు చేతులు విరగ్గొట్టారన్నారు. ఇప్పటివరకు 30 నుంచి 40 మందిపై టీడీపీ వారు దాడులు చేశారన్నారు. దాడిచేసిన వారికి స్టేషన్ బెయిలు ఇచ్చి బాధితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బాధ్యులతోపాటు అధికారులను కూడా ఎక్కడున్నా పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గం ఎన్నిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ ఉమ్మడి గుంటూరు జిల్లా విభాగానికి నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షురాలిగా ఎన్. నిర్మల భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో సంఘ ప్రధాన కార్యదర్శిగా పి. శామ్యూల్ పాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంఎల్ఎల్వీ. ప్రతాప్, కోశాధికారిగా ఎల్. రవీంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా వి. గణేష్ కుమార్. ఎస్. పురుషోత్తం రాజు, బి. నాగేశ్వరరావు నాయక్. జి.వి.ఆర్.ఏ. శేషారావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, ఎం. బుల్లయ్య, ఎస్కే. నీలోఫర్, వి. పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి గా ఆర్. శివరామయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి. శ్రీనివాసరావు, కె. మోహన్ రావు, వి. చంద్ర మోహన్, కె. విద్యాసాగర్ రెడ్డి, జేఏసీ సభ్యుడిగా బి. మధుసూదన్ ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితులుగా బి.సిరిల్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు షేక్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమాన్ని సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షురాలు నిర్మల భారతి మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీసీ చంద్రమోహన్ పూర్ణ చంద్ర రెడ్డి, రామచంద్రరావు, తోట ఉషాదేవి పలువురు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం
● ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏప్రిల్ 20 నుంచి వీఆర్ఏల సమ్మెబాట ● ఈ నెల 27న వీఆర్ఏల సంఘం జిల్లా మహాసభ ● వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందగీ సాహెబ్ సత్తెనపల్లి: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఏ) ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ అన్నారు. పల్నాడు జిల్లా వీఆర్ఏల సంఘం జిల్లా కమిటీ సమావేశం సత్తెనపల్లి పట్టణంలోని పుతుంబాక వెంకటపతి భవన్లో శనివారం నిర్వహించారు. సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ● పక్క రాష్ట్రాలలో వీఆర్ఏలకు పేస్కేలు, జీతాలు అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో వీఆర్ఏలకు 8 సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు ఇవ్వకుండా, నామిని సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. ● ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు సమ్మెలో పాల్గొంటారని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి వీఆర్ఏలు సమ్మెబాట పట్టానున్నారన్నారు. ● ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా వీఆర్ఏల సంఘం మహాసభ ఈ నెల 27న నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభకు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వీఆర్ఏ తప్పనిసరిగా హాజరుకావాలని, సమ్మెకు సంబంధించి వీఆర్ఏలు అంగీకార పత్రాల మీద సంతకాలు చేసి సమ్మెలో పాల్గొనడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో వీఆర్ఏల సంఘం సత్తెనపల్లి డివిజన్ అధ్యక్షుడు సంజీవరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, వివిధ మండల నాయకులు రవి, మునఫ్, శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకటేష్, కొండలు, అశోక్, రామకృష్ణ, సుందరరావు, నాగేశ్వరరావు, సుబ్బారావు, బుడే సాహెబ్, డేవిడ్, రాజు, రమేష్, తదితర నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
రేపల్లె: మైనేనివారిపాలెం గ్రామం కృష్ణానది ఒడ్డున గురు నిలయం ఆవరణంలోని శ్రీ గాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు శనివారం మూడవ రోజు కనుల పండువగా జరిగాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన నిర్వహించారు. స్వామివారికి, దేవేరులకు మంగళస్నానాలు ఆచరించి వధువరులుగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడము శాంతి కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు కళ్యాణ్ చక్రవర్తి స్వామివారి కల్యాణ ఘట్టాలను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కన్నులారా తిలకించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బాపట్ల: బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్లో ఉన్న లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారి 55వ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివా రం ఉదయం స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులతో పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. మహిళలు కోలాటం నిర్వహించారు. తాడికొండ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తుళ్లూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. తుళ్లూరులో నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనా న్ని ఏర్పాటు చేస్తున్నారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలి పారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైశ్య ట్రస్ట్ ప్రెసిడెంట్ రూండి రాకేష్ వివరాలను అందిస్తూ పదివేల మంది కార్యక్రమానికి హాజరవుతారన్నారు. రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ లూర్దుమర్రెడ్డి 36వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. కానుకమాత చర్చి సహాయ గురువులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ పరిశోధనల్లో నైతిక ప్రమాణాలు పాటించాలి
చేబ్రోలు: పరిశోధనల్లో జంతువుల వినియోగం విషయంలో ఎథికల్ గైడ్లైన్స్ను కచ్చితంగా పాటించడం అవసరమని ఢిల్లీలోని సీసీఎస్ఈఏ సీనియర్ కన్సల్టంట్ డాక్టర్ వివేక్ త్యాగి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీసీఎస్ఈఏ (కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్సిపెరిమెంట్స్ ఆన్ యానిమల్స్) ఆర్థిక సౌజన్యంతో ‘‘రీడిఫైనింగ్ ఎక్సిపెరిమెంటల్ ఫార్మాకాలజీ’’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్ శనివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ‘‘ఎథికల్, ఆల్టర్నేటివ్ అండ్ డిజిటల్ ఫ్రాంటియర్స్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. డాక్టర్ వివేక్ త్యాగి మాట్లాడుతూ పరిశోధనల కోసం ప్రయోగ జంతువులను ఉపయోగించే సందర్భంలో జంతు సంక్షేమాన్ని కాపాడడం అవసరం అన్నారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్. హరీష్ శంకర్ మాట్లాడుతూ వైద్యశాస్త్రం, ఫార్మకాలజీ మరియు జీవశాస్త్ర పరిశోధనల్లో జంతు నమూనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ అనేక రోగాలపై పరిశోధనలు చేయడంలో జంతు నమూనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. 350 మందికిపైగా విద్యార్థులకు నిర్వహించిన ఓరల్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్లలో సత్తా చాటిన వారికి బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జే. మహేష్ కుమార్, సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే. సురేష్ బాబు, బెంగళూరులోని దయానంద్ సాగర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విజయ్ కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆయుష్ ఆస్పత్రిపై విధ్వంస రచన!
అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రం, పర్యాటకకేంద్రమైన అమరావతిలో అమరేశ్వరస్వామి దేవాలయం, అలాగే అమరావతి స్థూపం తర్వాత అంతే పురాతనమైన ఆయుర్వేద ఆస్పత్రిని ధ్వంసం చేయటంపై గ్రామస్తులు, మేధావులు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ వైద్యశాలను కాపాడాలని కోరుతున్నారు. బ్రిటిష్ హయాంలో 1923 సంవత్సరంలో ఈ ఆయుర్వేద ఆస్పత్రి స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆయుర్వేద ఆస్పత్రిపై ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు హెల్త్సెంటర్ నిర్మాణం చేయాలనే సాకుతో ప్రహారీ, హెర్బల్ గార్డెన్ ధ్వంసం చేయటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1947 వ సంవత్సరంలో ఏర్పడిన గ్రామ పంచాయతీ 1923లో నిర్మాణం చేయబడిన ఆయుర్వేద ఆస్పత్రికి స్థలం ఇచ్చిందనే వాదనతో విభేదిస్తున్నారు. ● పదేళ్ల క్రితం ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై మక్కువ పెరగటం, అప్పటికే ఆయుర్వేద వెద్యశాల శిఽథిలావస్థకు చేరటంతో రూ.లక్షల ఖర్చుతో నూతన భవనాలను నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈనేపధ్యంలో 2015 సంవత్సరంలో ఆయుష్శాఖ గ్రామపంచాయతీ నుంచి 25సెంట్ల స్థలం ఆయుర్వేద ఆస్పత్రి వారికి చెందినదని పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. ఈక్రమంలో సుమారు రూ.25లక్షల నిధులతో ఆయుర్వేద ఆస్పత్రితో పాటుగా యోగా హాల్, పంచకర్మ నిర్వహించటానికి ప్రత్యేక గదులు నిర్మాణం చేశారు. ● ప్రస్తుతం ఈ ఆయుర్వేద వైద్యశాలలో అనుభవజ్ఞులైన వైద్యులు అన్ని రోగాలకు చికిత్స చేయటంతో పాటుగా మందులు ఉచితంగా అందస్తున్నారు. వాటితో పాటుగా పంచకర్మ, యోగా వంటి పద్ధతులలో రోగులకు చికిత్సలు అందించటంతో రోజుకు సుమారు వందమంది పైగా ఇక్కడ చికిత్సకు వస్తున్నారు. అలాగే రోగులకు ప్రకృతిలో దొరికే ఆయుర్వేద మొక్కలపై అవగాహన ఏర్పరచటానికి అస్పత్రి ఆవరణలో రూ.లక్ష వ్యయంతో హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేసి అందులో ఆయుర్వేద అవసరాలకు ఉపయోగించే అరుదైన మొక్కలను నాటి వాటి ఉపయోగాలను పేర్లను తెలియచేసే బోర్డులను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం కొందరు టీడీపీ నాయకులు ఇక్కడ హెల్త్ సెంటర్ నిర్మాణం చేయాలని.. స్థలం కావాలంటూ ఆస్పత్రి ప్రహరీని, హెర్బల్ గార్డెన్ను ధ్వంసం చేశారు. నిత్యం వందమంది రోగులకు అవపరమైన వైద్యసేవలు అందిస్తున్న ఈ వైద్యశాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఆయుర్వేద వైద్యశాల ప్రహరీ పడగొట్టడం, మొక్కలు, చెట్లు ధ్వంసం చేసిన మాట వాస్తవం. ఈ సంఘటన వివరాలను ఆయుష్ శాఖ, జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. దీనిపై తదుపరి వారి ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుంది – డాక్టర్ జైనబ్జహా వైద్యాధికారి, ఆయుర్వేద వైద్యశాల, అమరావతి -
ఉరేసుకుని వృద్ధుడి బలవన్మరణం
నాదెండ్ల: అసలే వృద్ధాప్యం.. ఆపై పక్షవాతం.. ఈ కారణంగా మతిస్థిమితం కోల్పోయిన ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గణపవరం గ్రామంలో నివాసం ఉండే పోతురాజు కృష్ణారావు (70) ముఠా పనులకు వెళ్తుండేవాడు. గడిచిన నాలుగేళ్ళుగా పక్షవాతంతో బాధపడుతూ చిలకలూరిపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధాప్యం పైబడటంతో కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. శనివారం ఉదయం గణపవరం నుంచి నాదెండ్ల వెళ్ళే డొంక రోడ్డులో ఐసీఎం కంపెనీ సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్ఐ వెంకయ్య సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. -
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలు ● హాజరు కానున్న 32,585 మంది విద్యార్థులు ● నో సెల్ఫోన్ జోన్లుగా కేంద్రాలు, 144 సెక్షన్ అమలు ● డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ● పల్నాడు జిల్లా పరిధిలోని 470 ఉన్నత పాఠశాలల నుంచి 32,585 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 256 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 14,193 మంది, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 12,322 మంది రెగ్యులర్ పరీక్షలకు హాజరవుతుండగా, 512 మంది సప్లిమెంటరీ, 5,558 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ● నరసరావుపేట డివిజన్లో 68, సతైనపల్లి డివిజన్లో 60 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు హాజరు కానున్నారు. వీటిలో ఏడు కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ● పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాన్ని ముందురోజు సందర్శించి నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా ఎటువంటి ఆందోళనకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. ● పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా కేంద్రాలకు 128 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 128 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ డీఓలను నియమించారు. ● అలాగే కేంద్రాలను నిరంతరం తనిఖీ చేసేందుకు 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ● పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ● ఇప్పటికే పరీక్ష పత్రాలు ఆయా కేంద్రాల సమీపంలోని పోలీస్స్టేషన్లో భద్రపరిచారు. అలాగే జిల్లా స్టోరేజ్ పాయింట్ను కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న కేబీఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ● పరీక్షలకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా జిల్లాను జోన్లుగా విభజించి రూట్ ఆఫీసర్లును నియమించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో వీరు ఆయా కేంద్రాలను సందర్శించి ఏవైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. ● పరీక్ష కేంద్రాలను నో సెల్ఫోన్ జోన్లుగా ప్రకటించారు. కేంద్రాలలోకి సీఎస్ల సహా ఎవరూ సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అలాగే కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ● పరీక్షలను ప్రశాంతంగా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమాచారం కోసం కంట్రోల్ రూంను సంప్రదించాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. డిప్యూటీ డీఈఓ ఎస్.ఎం.సుభానీ 9963638232, డీసీఈబీ సెక్రటరీ ఐ.కృష్ణానాయక్ 9394884558, డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ షేక్.ఉమర్ రషీద్ 6302671571, కంట్రోల్ రూమ్ 8341135357 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
మంచు ఎండ!
ఉదయం దట్టమైన పొగమంచు.. మధ్యాహ్నం మండుటెండ.. ఒకే రోజులో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి నరస రావుపేట పట్టణాన్ని దట్టమైన మంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. ఉదయం 8 గంటల వరకు మంచు తీవ్రత అలానే ఉంది. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎండ ఠారెత్తడంతో ప్రజలు ఇంటినుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. చలి కాలం నుంచి వేసవి కాలానికి మారే ఈ సమయంలో వాతావరణం స్థిరంగా ఉండదని, అందుకే ఉష్ణోగ్రతలో మార్పులు చోటుచేసుకుంటాయని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా లేకుంటే వైరల్ జ్వరాల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. – నరసరావుపేట టౌన్ -
ప్రస్తుతం ఉన్న స్థలం అవసరం..
1923లోనే ఈ ఆస్పత్రిని బ్రిటిషు ప్రభుత్వం నిర్మా ణం చేసింది. ఇంత చరిత్ర కలిగిన ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రోగులుకూడా అధికసంఖ్యలో చికిత్స పొందుతున్నారు. పంచకర్మ చికిత్స అందించటంతో రోగులు పెరిగారు. భవిష్యత్లో ఆస్పత్రి విస్తరించాలంటే ప్రస్తుతమున్న స్థలం అవసరం. – డాక్టర్ వావిలాల సుబ్బారావు, చైర్మన్, ధాన్యకటకబుద్ద విహార ట్రస్టు గ్రామాభివృద్ధి కోసం హెల్త్సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్థలసేకరణ కు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా గోడలు పడగొట్టటం, మొక్కలు, చెట్లు ధ్వంసం చేయటం మంచిది కాదు. – భవిరిశెట్టి హనుమంతరావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆయుర్వేద వైద్యం అంటేనే మొక్కలు, ఆకులు ఉపయోగించి చేసేది. కొన్ని వైద్యప్రక్రియలు, బతికిఉన్న మొక్కలతో, వాటి ఆకులతో చేయాల్సి వస్తుంది. అందుకోసం వనమూలికల మొక్కలు పెంచటానికి ఇంకా స్థలం కేటాయించాల్సింది పోయి ఉన్న స్థలం లాక్కోవడం సరికాదు. – కోలా వెంకటేశ్వరరావు, వీహెచ్పీ నాయకుడు, అమరావతి నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శిఖనం బాలయ్యను పల్నాడు జిల్లా కార్యదర్శి (యాక్టివిటీ)గా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం
నరసరావుపేట: గౌరవ వేతనంతో విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, లేనిపక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి హెచ్చరించారు. పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏఎల్ ప్రసన్న అధ్యక్షతన యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. మల్లీశ్వరి మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలనే దశలవారీ పోరాటాలలో భాగంగా ఇటీవల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గం అన్నారు. యూనియన్ నాయకులతో నిర్వహించిన చర్చల సందర్భంగా ప్రభుత్వ పెద్దలు 10 డిమాండ్లకు గాను తొమ్మిది నెరవేర్చామని అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉగాది సందర్భంగా పండగ నాటికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె సందర్భంగా శిబిరానికి వచ్చిన కూటమి అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతమణి కోశాధికారి మాధవి, సభ్యులు సావిత్రి, జయలక్ష్మి పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.మల్లేశ్వరి -
జాతీయ లోక్ అదాలత్ లో 1670 కేసులు పరిష్కారం
నరసరావుపేట టౌన్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1670 కేసులు పరిష్కారమైనట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. సివిల్, క్రిమినల్, చెల్లని చెక్కు, కుటుంబ, లావాదేవీలు, ముందస్తు వ్యాజ్యం కేసులు మొత్తం కలిపి 1670 పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు రూ.8.86 కోట్ల మేర లబ్ధి చేకూరింది. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి శరత్బాబు నేతృత్వంలో న్యాయాధికారులు కె.మధుస్వామి, ఏ సలోమిలు రెండు బెంచ్లుగా ఏర్పడి కేసులు పరిష్కరించారు. లోక్ అదాలత్లో న్యాయవాదులు మేరీ బ్లెస్సీనా, అచ్చి ఏడుకొండలు, నసీమా రాజశేఖర్, ముక్కడాల సుబ్బారావు, వై శ్రీనివాసరెడ్డి, ఎం.హరీష్కుమార్, వై సురేష్బాబు, బి సురేష్, కక్షిదారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం .. కళ మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం .. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల తూకాల్లో పట్టుతప్పుతున్నా, వాటిని నియంత్రించేందుకు చట్టాలున్నా .. ప్రజల్లో అవగాహన లేమి అవరోధంగా మారింది. ఎవరికి వారే తమకెందుకులే అనే ధోరణిలో ఉండటం వల్ల .. ఈ దందా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అడుగడుగునా కొనుగోలుదారులను ఏమార్చి దోచుకుంటున్నా .. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ధర్మం చెర..సత్తెనపల్లి: ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నిత్యావసర సరుకులు, వస్తు సామగ్రి కొనుగోలు చేయాలన్నా .. వినియోగించుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ వస్తువు ఎక్కడ కల్తీ జరుగుతుందో, ఎక్కడ నాణ్యత లోపించిందో కనిపెట్టలేని దుస్థితి. నిత్యం ఉపయోగించే పాలు, పెరుగు, కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, వాహనాలకు ఉపయోగించే పెట్రోల్, డీజిల్, చికెన్, మటన్, చేపలు, కోళ్లు తదితర వాటి గురించి తెలుసుకొని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏ వస్తువు కొందామన్నా అధిక ధరలైనా ఉంటాయి.. లేదంటే నాణ్యత లోపం ఉంటుంది. పై వాటిల్లో ఏ వస్తువు వినియోగించినా ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారెంటీ కూడా లేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ తెలుసుకొని ఫిర్యాదు చేసినా, రాత పూర్వకంగా ఫిర్యాదు చేసి తమతో పాటు నడిస్తేనే అలాంటి వారిపై చర్యలు తీసు కుంటామని అధికారులు చెబుతుండడం గమనార్హం. దీంతో తమకెందుకులే అనుకుంటూ ‘ఏదో కొంటున్నాం .. తింటున్నాం’ అని వినియోగదారులు కాలం గడిపే స్తున్నారు. జిల్లాలో తూనికలు కొలతల శాఖకు సంబంధించి ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక ఏసీ ఉన్నారు. గడిచిన ఏడాదిలో తూనికలు కొలతల శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 673 కేసులు నమోదు చేశారు. కాపౌండింగ్ ఫీజు కింద రూ. 29.48 లక్షలు, స్టాంపింగ్ కింద రూ.66,76,505 వసూలు చేశారు. సత్తెనపల్లిలో మృతజీవాల మాంసం విక్రయిస్తుండగా పట్టుకున్న మున్సిపల్ కమిషనర్ ఆనంద్కుమార్, అధికారులు (ఫైల్) 7దుకాణదారులు తూకాల్లో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. వినియోగదారులకు నాణ్యతా ప్రమాణమైన సరుకులను అందించి ఎమ్మార్పీకే అమ్మకాలను సాగించాలి. దుకాణదారులు కచ్చితంగా తూకాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వినియోగదారులకు ఏవైనా సందేహాలు ఉంటే 1915 టోల్ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలించిన పరిష్కారానికి చర్యలు తీసుంటుంటాం. – బీవీ హరిప్రసాద్, ఉమ్మడి గుంటూరు జిల్లా డిప్యూటీ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ తూకాల్లో పెరిగిన మోసాలు వినియోగదారుల జేబులకు చిల్లు అడుగడుగునా అవకతవకలు నాణ్యతలేని సరుకుల విక్రయాలు అందుబాటులో లేని ధర్మకాటా నష్టపోతున్న వినియోగదారులు నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శనివారం 537.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. గొరిగపూడి(భట్టిప్రోలు):గొరిగపూడి పంచాయ తీ వరికూటివారిపాలెంలో శనివారం సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మంగళగిరి టౌన్ : విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందిన ఉయ్యాల చందు (27) మంగళగిరి మండలం ఆత్మకూరులోని వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం పని నిమిత్తం ఆత్మకూరు వాటర్ ప్లాంట్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి వాటర్ ట్యాంక్ ఉన్న ఆటోతో మంగళగిరి పట్టణం టిప్పర్ల బజార్లో నారాయణ స్కూల్కు చేరుకున్నాడు. అక్కడి వాటర్ ట్యాంక్లోకి ఆటోలోని ట్యాంక్ నుంచి పైపు ద్వారా నీరు నింపుతున్నాడు. విద్యుత్ వైర్లు, వాటర్ ట్యూబ్స్ ఎర్త్ కావడంతో ఆటోలో కూర్చుని ఉన్న చందుకు విద్యుదాఘాతం తగిలింది. సిబ్బంది అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్: సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంలో ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని పంజాబ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఇంద్రపాల్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.ఎస్. నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్ సమాచార హక్కు కమిషన్ పనితీరు, సెకండ్ అప్పీల్ కేసులను ఎలా డిస్పోజ్ చేస్తున్నారో వివరించారు. అనంతరం ఇంద్రపాల్ సింగ్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ పాల్గొన్నారు. నెహ్రూనగర్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ రెండో రోజు కూడా కొనసాగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మీట్లో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు శుక్రవారం క్రికెట్, ఇతర పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, త్రోబాల్, స్కిప్పింగ్, 100 మీటర్స్ వాకింగ్, టెన్నికాయిట్ డబుల్స్, చెస్, క్యారమ్స్ వంటి పోటీలు జరిగాయి. స్పోర్ట్స్ మీట్ శనివారంతో ముగుస్తుందని డీసీ శ్రీనివాసులు చెప్పారు. -
గుంటూరు జీజీహెచ్లో కేంద్ర కమిటీ పరిశీలన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు పలు వార్డులను పరిశీలించారు. ఎన్ఐసీ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ రవీంద్రకుమార్, జాయింట్ డైరెక్టర్ రాజ్కుమార్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చెందిన రూపల్ ప్రకాష్, శ్యామల్రావు, హుస్సేన్లు అధికారుల బృందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు ఆన్లైన్లో నెక్ట్స్జెన్ పేరుతో నమోదు చేసేందుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా గుంటూరు జీజీహెచ్లో కాగిత రహిత ఓపీ సేవలు రోగులకు అందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జీజీహెచ్ అధికారులు నెక్ట్స్జెన్ పేరుతో రోగుల డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను నమోదు చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను ఏవిధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం స్వయంగా పరిశీలించారు. అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రిలో పరిశీలనకు తరలి వెళ్లారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ కలెక్టర్, స్పెషల్ అడ్మినిస్ట్రేటర్ సుధారాణి, అడ్మినిస్ట్రేటర్ డి.ప్రవీణ్కుమార్, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ప్రసాద్, తదితరులు కేంద్ర బృందం వెంట ఉండి వారికి సమాచారం అందజేశారు. -
‘మూగ’బోయిన వైద్యం
వ్యవసాయ మార్కెట్ యార్డులకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. రైతులకు ఆదరువుగా ఉండేందుకు గతంలో క్రమం తప్పకుండా పశు వైద్య శిబిరాలు నిర్వహించేవారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించేవారు. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పశు వైద్య శిబిరాలు అటకెక్కాయి. పశువులు పలు జబ్బులతో మృత్యువాత పడుతున్నాయి. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నా పాలకులు, అధికారులు దృష్టి సారించని దుస్థితి నెలకొంది. రూ.కోట్లలో ఆదాయం.. ఏదీ సాయం! సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకొంటుంటారు. ఏటా సీజన్లో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా 2025–26 సంవత్సరంలో రూ 32.42 కోట్లు ఆదాయం లక్ష్యం కాగా 2026 జనవరి 31 నాటికి రూ.18.17 కోట్లు ఆదాయం రావడం విశేషం. ప్రతి మార్కెట్ యార్డు పరిధిలోని గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏటా ఇందుకోసం రూ. లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఏడాది కాలంలో ఐదు శిబిరాలు నిర్వహించాలి. ఒక్కో శిబిరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాలి. పశువైద్య శాఖ సహకారంతో వీటిని ఏర్పాటు చేయాలి. కాలానుగుణంగా వస్తున్న వ్యాధులను బట్టి మందులు కొనుగోలు చేయడం పశువైద్య శాఖ బాధ్యత. శిబిరం ఏర్పాటు, ప్రచారానికి రూ. 2 వేలు, మందుల కోసం రూ. 18 వేలు వెచ్చించాలి. మందుల కొనుగోలు విషయంలో మార్కెటింగ్ శాఖ, పశువైద్య శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పశు వైద్య శిబిరాల ఊసే లేదు. కమిటీ ఏం చేస్తోంది...? పశువైద్య శిబిరాలు నిర్వహణకు కమిటీ ఉంది. ఈ కమిటీలో మార్కెట్ యార్డు కార్యదర్శులు, పశువైద్య శాఖ అధికారులు ఉంటారు. ఏ ఏ ప్రాంతాల్లో పశువులు అధికంగా ఉన్నాయి..ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి. అనే విషయాలను కమిటీలో చర్చించాల్సి ఉంటుంది. వ్యాధులకు అనుగుణంగా మందులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మూలకు చేరింది. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ద్వారా వ్యవసాయ మార్కెట్ యార్డులు ఏటా కోట్లాది రూపాయల లాభాలు వస్తున్నా వాటి పరిధిలోనున్న రైతులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుత పాలకవర్గాలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. మాటల్లో రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు. జిల్లాలో 11.55 లక్షల పశు సంపద .. జిల్లాలో 11,55,833 పశుసంపద ఉంది. వీటిల్లో గేదెలు, దున్నలు 4,65,046, ఆవులు, ఎద్దులు 65,072, గొర్రెలు 4,69,424, మేకలు 1,56,291 ఉన్నాయి. వీటిలో ఏటా వివిధ వ్యాధుల బారిన పడి వేలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు పశు వైద్యశాలలు ఉన్నప్పటికీ మందుల కొరత కారణంగా పశు వైద్యం సక్రమంగా అందక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎంఎస్పీ కారణంగా రైతుబంధు అమలు కావడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి పశువైద్య శిబిరాలు నిర్వహణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
అన్నదాత దుఃఖీభవ
భారీగా తగ్గిన అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య సాక్షి, నరసరావుపేట: అన్నదాతలను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో నగదు సాయం చేస్తామని హామీనిచ్చారు. తీరా గెలిచాక కేంద్రంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారు. రైతులకు ఏటా రూ.6 వేలు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు లబ్ధిదారుల సంఖ్యను అమాంతం తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చివరి ఏడాదైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ రైతు భరోసా పేరిట పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,80,181 మందికి నగదు జమ చేశారు.ఇక చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి లబ్ధిదారుల సంఖ్యను 2,40,530 మందికే పరిమితం చేస్తోంది. ఏకంగా 40 వేల మంది లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం మారగానే రైతుల సంఖ్య ఎందుకు తగ్గిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సహేతుకమైన కారణాలు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తొలి ఏడాది దగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లు వైఎస్సార్ రైతు భరోసా పేరిట రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లు పాటు వారి ఖాతాల్లో నగదు జమచేశారు. ఇలా గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లాలో ఏకంగా రూ.1,738.58 కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశారు. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20వేలు అందజేస్తామని గత ఎన్నికల్లో టీడీపీ రైతులకు హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం హామీని మరిచిపోయింది. 2024–25 సంవత్సరంలో పథకం ఊసే ఎత్తలేదు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ కింద రూ.6 వేలు మాత్రమే రైతుల ఖాతాలో జమైంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14 వేలను ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా సుమారు రూ.392 కోట్లను రైతులకు ఇవ్వకుండా మోసం చేసింది. కౌలు రైతులకు ఈ ఏడాదీ మొండి చేయి... – మరో వైపు కౌలు రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు కౌలు రైతులకు ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ నిధులు జమచేయలేదు. గురింపు కార్డుల జారీలోనే తాత్సారం చేస్తున్నారని రైతులు, రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 17,662 మంది కౌలు రైతులున్నారు. వీరు కాకుండా అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మందికి పైగా కౌలు రైతులున్నారు. వీరికి ఎప్పుడు నిధులు జమ చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు. సూపర్–6లో భాగంగా టీడీపీ మేనిఫెస్టోలో రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం 2019–20 2,41,515 326.04 2020–21 2,50,469 338.13 2021–22 2,48,812 335.90 2022–23 2,66,871 360.27 2023–24 2,80,181 378.24 మొత్తం 2,80,181 1,738.58 ఎన్నికల్లో అడ్డగోలు హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వివిధ కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించింది. ఇప్పుడేమో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ అంటూ రెండు జాబితాలు తయారు చేసి అనర్హులు చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పోల్చితే సుమారు 40 వేల మంది లబ్ధిదారులు తగ్గడం అన్యాయం. – అన్నెం పున్నారెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, అన్నదాత సుఖీభవ నిధులు వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వమేమో కౌలు రైతులకు పీఎం కిసాన్ ఇవ్వమంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటున్నా ఇప్పటివరకు కౌలు రైతు కార్డుల మంజూరులో సమస్యలు తీర్చడంలేదు. భూ యజమాని సంతకం లేకుండా కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు తప్ప జీవోలు విడుదల చేయలేదు. దీంతో కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ లేదు, పంటలు అమ్ముకోలేరు, బ్యాంక్ రుణాలు రావు. –పెండ్యాల మహేష్, కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుటీడీపీ నేతలు ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలను కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు. తీరా గెలిచాక పీఎం కిసాన్తో కలిపి అంటున్నారు. ఇప్పుడేమో ఈ–కేవైసీ సాకుతో కొందరికి రూ.4 వేలు, మరికొందరికి రూ.2 వేలు జమ చేసి రైతులను మభ్యపెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని బూచి చూపకుండా నేరుగా రూ.20 వేలు జమ చేయాలి. – ఏపూరి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి -
రుక్మిణి కల్యాణం అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రుక్మిణి కళ్యాణం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్రప్రసాద్ కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా శ్రీ ప్రగడ నరసింహమూర్తి వ్యవహరించారు. -
కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ
నరసరావుపేట:పట్టణంలోని కుమ్మరబజార్లో ఆ వర్గీయులు ఏర్పాటుచేసిన తొలి తెలుగు మహిళ రామాయణం కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కవయిత్రి మొల్ల గొప్పతనం గురించి వివరించారు. సమీపంలోని మహాలక్షమ్మ చెట్టు వద్ద పూజలు చేశారు. ఇరువురిని కుమ్మరి సంఘ వర్గీయులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీపీ మంగమ్మ, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు తొర్లకొండ చిన అంజయ్య, ఇంటలెక్చువల్ ఫోర్ రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, పట్టణ వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, నాయకులు మోరా శ్రీనివాసరావు, షేక్ శిలార్, సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి రూ.3.33లక్షలు విరాళం నరసరావుపేటరూరల్: ఇస్సపాలెం మహంకాళీ అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఇస్సపాలెం గ్రామానికి చెందిన గరికపాటి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మీ దంపతులు, సురేష్, సాయి శిరీష దంపతులు రూ.3.33,333 విరాళంగా అందజేశారు. ఈవో నలబోతు మాధవిదేవిని శుక్రవా రం కలిసి విరాళం నగదు అందించారు. కార్య క్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్, అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణలు పాల్గొన్నారు. చిదంబర రామలింగేశ్వర స్వామి వారికి సంప్రోక్షణ మాచవరం:వేమవ రం గ్రామంలో అతి పురాతనమైన పార్వతి సమేత చిదంబర రామలింగేశ్వర స్వామి వారికి శుక్రవారం సంప్రోక్ష ణ కార్యక్రమం జానపాటి సీతారామశర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణోత్తములు నిర్వహించారు ఆలయ పునః నిర్మాణలో భాగంలో దేవతామూర్తులను బాల ఆలయంలోకి మార్చి నిత్య ధూప దీప నైవే ద్యం నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపా రు. సంప్రోక్షణ క్రతువుని పవిత్ర జలాలతో మంత్రోచ్ఛారణల నడుమ ఆలయం దేవతామూర్తులను మహా సంప్రోక్షణతో శుద్ధి చేసి మూలమూర్తికి దైవ శక్తిని పునరుద్ధరించడానికి గర్భగుడిలోని కలశాలకు ఉత్సవమూర్తుల దైవ శక్తి కోసం నిత్య ధూప దీప నైవేద్యం నిర్వ హిస్తామని తెలిపారు. నరసింహమూర్తి శర్మ భార్గవ్ రాకేష్ శర్మ, మాచవరం మండల దేవదాయ గ్రూప్ ఈవో సుబ్బారెడ్డి గ్రామపెద్దలు పాల్గొనిభక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులుగా హనుమత్ప్రసాద్ నరసరావుపేట: పద్మశాలి సంఘం జిల్లా నూతన అధ్యక్షులుగా జొన్నాదుల హనుమత్ ప్రసాద్ (నరసరావుపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాష్నగర్లో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకోటి అంజిబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు జంజనం వెంకటసాంబశివరావు హాజరయ్యారు. గౌరవాధ్యక్షులు జంజనం వెంకటేశ్వర్లు, నరసరావుపేట పద్మశాలి సంఘం సెక్రటరీ గుంటి వెంకటేశ్వరావు, కోశాధికారి చిన్నం రామాంజనేయులు పాల్గొన్నారు. -
వాహనం బోల్తా..22 మందికి గాయాలు
రెంటచింతల: రెంటచింతల గ్రామ శివారులోని హోసన్నా మందిరం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 మంది వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోనున్న పాములపాడు మండలం నల్లకాలువకు చెందిన 26 మంది వ్యవసాయ కూలీలు గురువారం రాత్రి 12గంటలకు గురజాల మండలం గంగవరం గ్రామంలో మొక్కజొన్న కోత కోయడానికి వాహనంలో బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గ్రామ శివారులోని హోసన్నా మందిరం సమీపంలో కల్వర్టు గోడకు ఢీకొనడంతో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 22 మందికి గాయాలుకాగా వారిని వెంటనే 108 వాహనంలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో ఏసయ్య, బొల్లా వీరమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరమ్మను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో ఏడుగురు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స అనంతరం పంపించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. రెంటచింతల ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
ఏసీబీ ఉమ్మడి గుంటూరుకు ఉగాది పురస్కారాలు
నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం ఉగాది–26 పురస్కారాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుంటూరు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉత్తమ, రెండు సేవా పతకాలు లభించాయి. ఉమ్మడి జిల్లా అదనపు ఎస్పీ మహేంద్ర మత్తేకు సేవా పతకం, హెడ్కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావుకు ఉత్తమ సేవా పతకం, కానిస్టేబుల్ యు.సురేష్బాబు సేవా పతకానికి ఎంపికయ్యారు. ఏఎస్పీ మహేంద్ర మత్తే తొలుత గ్రేహాండ్స్, విశాఖపట్నం, పాడేరు, విజయవాడ జీఆర్పీ, విశాఖపట్నం అర్బ న్ ఇంటిలిజెన్స్, శ్రీకాకుళం జిల్లా డీఎస్పీగా, విశాఖ పట్నం సిటీ టాస్క్ఫోర్స్ ఏసీపీ గా విధులు నిర్వర్తించారు. 2023లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, ఏసీబీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు బదిలీయ్యారు. -
పల్నాడు
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఏరియా ఆసుపత్రి తనిఖీ నరసరావుపేట: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించారు. నిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,500, గరిష్ట ధర రూ.8,500, మోడల్ ధర రూ.7,300 వరకు పలికింది. I -
వంటకు యుద్ధం మంట
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ ప్రభావం అన్ని వర్గాల ప్రజలను భయపెడుతోంది. ఇదే అదనుగా గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపివేశాయి. గృహ వినియోగానికి సంబంధించి బుకింగ్లను సైతం తాత్కాలికంగా ఆపేయడంతో వంటింట గుబులు నెలకొంది. గ్యాస్ సిలిండర్ల నిల్వలు సరిపడా ఉన్నాయని, కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కృత్రిమ కొరత.. హోటళ్ల మూత ఓ వైపు హోటళ్లు, హాస్టళ్లపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ నిర్వహణ భారంగా మారింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంటకాలు చేస్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్పై రూ.60లు, కమర్షియల్ సిలిండర్లపై ఏకంగా రూ.115 పెంచి ప్రజలపై భారాన్ని మోపారు. అయినప్పటికీ సరఫరా సక్రమంగా లేకపోవటం ఇబ్బందులకు గురి చేస్తోంది. బ్లాక్లో అమ్మకాలు.. గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరా చేసుకొన్న కొందరు మధ్యవర్తులు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో కుమ్మకై ్క సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారికంగా గ్యాస్ బుకింగ్ లభించకపోవటంతో హోటల్ యజమానులు అదనపు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుకింగ్ కోసం గ్యాస్ కంపెనీలకు ఫోన్ చేస్తే స్పందించటం లేదు. నేరుగా కార్యాలయానికి వెళ్లి సంప్రదిస్తే నెలరోజులు వ్యవధి పడుతోందని చెబుతున్నారు. అంతా అగమ్యగోచరం... పరిస్థితులు ఇలానే కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్, హాస్టళ్ల నిర్వాహణ కష్టతరంగా మారి మూత పడే ప్రమాదం ఉంది. నరసరావుపేటలో వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడ పూర్తిగా వంట కార్యకలాపాలన్ని గ్యాస్ పొయ్యిలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో హాస్టళ్లు మూతపడితే విద్యార్థుల కోచింగ్ పై ప్రభావం పడనుంది. దీంతోపాటు గ్యాస్పై అధారపడి పని చేసే బేకరీలు, టీ స్టాల్స్, స్వీట్ తయారీ, క్యాటరింగ్ తదితర చిన్న తరహా వ్యాపారాలు ఈ సమస్యతో నలిగిపోతున్నాయి. ప్రస్తుతం వివాహ, శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలోనే మాకు కొంచెం ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. అయితే బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ రూ.2,500లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది రోజులు ముందుగానే శుభ కార్యాలకు క్యాటరింగ్ ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాం. ఈ సమయంలో గ్యాస్ కొరత ఏర్పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం. – ఘట్టా శ్రీనివాసరావు, క్యాటరింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నరసరావుపేట -
మొబైల్ ఫోన్లలో పోలీస్ సేవలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్న్స్ ద్వారా మొబైల్ ఫోన్లలోనే పోలీస్ సేవలను సులభంగా పొందవచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టారని అన్నారు. ఈ సేవల ద్వారా ప్రజలు పోలీస్స్టేషన్లకు ప్రత్యక్షంగా వెళ్లకుండానే మొబైల్ ఫోన్లలో ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈ–చలానా వివరాలు, పోలీస్ శాఖకు సంబంధించి సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్న్స్ సేవలు పొందేందుకు ముందు 95523 00009 అనే నంబర్ను మొబైల్ఫోన్లలో సేవ్ చేసుకోవాలని అన్నారు. వాట్సాప్ ద్వారా ‘హెచ్ఐ’, లేదా ‘హెచ్ఏఐ’ అని మెసేజ్ పంపించాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వం పలు సేవలకు సంబంధించి మెనూ ప్రదర్శిస్తుందని అన్నారు. అందులో ‘సేవను ఎంచుకోండి’ అనే ఆప్షన్ను క్లిక్ చేసి అవసరమైన సేవలు ఎంపిక చేసుకోవచ్చని వివరించారు. ఆ మెనూలో పోలీస్శాఖ సేవలు అనే ఆప్షనన్ను ఎంచుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు, ఎఫ్ఐఆర్ స్థితి, ఈ–చలానా వివరాలు తదితర సేవలు సులభంగా అందుబాటులో ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సైబర్ క్రైంపై 1930కి, పోలీసుల సహాయంపై 112 కి కాల్స్ చేసి పోలీస్ సేవలు పొందవచ్చునని తెలిపారు. -
ఎండు ఫలం... భలే బలం
రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్కు విపరీతమైన డిమాండ్ చిలకలూరిపేట: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నెలరోజుల పాటు నియమనిష్టలతో ఉపవాసం ఉండి, రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం దీక్ష విరమించేవరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా దైవభక్తితో ఉపవాసదీక్ష చేపడతారు. సాధారణంగా ఇలాంటి దీక్షలు ఎవరు చేపట్టినా నీరసం వస్తుంది, అలసట, నీరసం దరిచేరనీయకుండా డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపయోకరం కావటంతో వీటి విక్రయాలు ఊపందుకున్నాయి. ఎండు ఖర్జూరంతో మేలు... డ్రైఫ్రూట్స్ ఎన్ని లభ్యమౌతున్నా ఖర్జూరానికి ముస్లింలు ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాస దీక్ష అనంతరం ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష (కిస్మిస్), బాదం, పిస్తా, అంజూర్, జీడిపప్పు, ఆఫ్రికార్డ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఇవి అత్యంత శక్తిని ఇవ్వటంతో పాటు , ఉల్లాసంగా ఉండటానికి ఎంతగానో ఉపకరిస్తాయి. ఔషధ గుణాలు... ఎండిన ఫలాల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. వీటి వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. శరీరానికి అవసరమైన ఖనిఖాలు, విటమిన్లుతో పాటు జీర్ణశక్తికి తోడ్పడి, రక్తాన్ని శుద్ధిచేస్తాయి. హృద్రోగాన్ని , క్యాన్సర్ వంటి వాటిని దరిచేరనీయవు. దీంతో మసీదుల సమీపంలో ప్రత్యేక దుకాణాల్లో ఈ డ్రైఫ్రూట్స్ దర్శనమిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి .... ఒకప్పుడు రంజాన్ పండుగ వేళల్లో బండ్లపై ఎక్కువగా వీటిని అమ్మేవారు. గత కొన్నేళ్లుగా ఎండు ఫలాలు గుంటూరు నగరంతో పాటు ,చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి వంటి పెద్ద పట్టణాల్లో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. ఈ ఎండు ఫలాలను ఢిల్లీ , ముంబాయి తదితర ప్రాంతాల నుంచే కాక దుబాయి, షార్జా, సౌదిఅరేబియా, కువైట్ వంటి దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఆకర్షణీయ ప్యాకెట్లలో ... ఎండు ఫలాలను ఆకర్షణీయ ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. స్వదేశి వాటితో పాటు ఇతర దేశాల ఫలాలకు డిమాండ్ అధికంగానే ఉంది. కొనుగోలు దారుల సౌలభ్యం కోసం రూ. 100 నుంచి రూ. 1000 దాక విలువైన ప్యాకెట్లలో లభ్యమౌతున్నాయి. వందగ్రాముల ప్యాకెట్ల నుంచి ఐదు కేజీల గిఫ్ట్ ప్యాకెట్ల వరకు దొరుకుతున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలుపుతున్నారు. దాతల సహాయంతో.... పలు మసీదుల వద్ద , చిన్న స్థాయి దుకాణాలతో పాటు తోపుడు బండ్లపై ఎండు ఫలాలు విరివిరిగా విక్రయిస్తున్నారు. దాతలు ఇఫ్తార్ విందు సమయాల్లో ఉచితంగా అందిస్తున్నారు. -
వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీ ఆవిర్భావం
పెదకాకాని: దివంగత ముఖ్యమంత్రి, మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్ సీపీ అని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లపాటు సుపరిపాలన అందించారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మంచి జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే వైఎస్సార్ సీపీ ద్వారానే సాధ్యమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజల ఆదరణ, అభిమానాలతో వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. -
ఒత్తిడి తగ్గించుకుందామా?
సత్తెనపల్లి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. మంచి మార్కులను సాధించాలని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని కోసం ఎక్కువ మంది విద్యార్థులు నిద్ర, భోజనం మానేసి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చదువుతోపాటు మన ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వైద్యులు చెబుతున్నారు. ఏకాగ్రత ఉండాలి అంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలని, మానసిక ఒత్తిడిని జయించాలంటే పోషకాహారం తీసుకో వాలని, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలు... ● పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సత్తెనపల్లి విద్యా డివిజన్ పరిధిలోని అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, దాచేపల్లి, గురజాల, కారంపూడి, క్రోసూరు, మాచవరం, ముప్పాళ్ళ, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి మండలాల్లో 87 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 4,936 మంది ఉన్నారు. వీరందరూ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టి సారిస్తున్నారు. ● ఈ క్రమంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఏకాగ్రతగా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లు, నిద్ర అవసరమని తెలుసుకోవాలి. ● ప్రతి రోజు ఆరు నుంచి ఏడు గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ● శరీరానికి ఉల్లాసం కావాలి అంటే పండ్ల రసాలు తీసుకోవాలి. పుచ్చకాయ, బత్తాయి రసం వంటివి ఉండాలి. ● బార్లీ గంజిని సాయంత్రం వేళల్లో తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగాలి. ● టీ, కాఫీలను మోతాదుకు మించి తాగకూడదు. కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. ● ప్రతి రోజు 15–20 నిమిషాలు వ్యాయామం చేయాలి. టిఫిన్ చేయడానికి ముందు రాగిజావ తీసుకుంటే మంచిది. సులభంగా జీర్ణమయ్యే ఆకుకూరలు వంటివి తినాలి. ● ఆహారంతో పాటు అరటిపండు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ● విద్యార్థులు ఒత్తిడికి గురి కావడం వలన శరీరం వేడి చేసే అవకాశం ఉంది. దీంతో తలనొప్పి, నీరసం వంటివి వస్తాయి. ఇలాంటి వాటిని అధిగమించాలి అంటే మంచి నీరు ఎక్కువగా తాగాలి. ● పాల ఉత్పత్తులను తీసుకుంటే గ్లూకోమిక్స్ పాటు క్యాల్షియం తగినంత లభిస్తుంది. ● పరీక్షల సమయంలో స్వీట్లు, చాక్లెట్లు, నూనె పదార్థాలు వంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతపై దృష్టి సారించాలంటే ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా ఆహార నియమాలను ప్రతి విద్యార్థి పాటించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు వంటివి తీసుకుంటే మంచిది. పరీక్షల సమయంలో ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి. –డాక్టర్ బి.లక్ష్మణరావు, సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాల, సత్తెనపల్లి -
ఆనందం.. ఆవిర్భావం
చిలకలూరిపేటలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ నాయకులుక్రోసూరులోని పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, యెనుముల, పార్టీ నాయకులుపిడుగురాళ్లలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిరాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త శక్తి మేర కృషి చేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం స్థానిక లింగంగుంట్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వందలాదిమంది నాయకులు, కార్యకర్తల నడుమ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్సార్ ప్రతిమకు పూలు చల్లి నివాళులర్పించారు. కార్యకర్తలు ఏర్పాటుచేసిన 16 కేజీల భారీ కేకును కట్చేసి ఆనందోత్సవాల మధ్య పంపిణీ చేశారు. సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్బావ వేడుకలను పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాలు, పట్టణాలలోని పార్టీ కార్యాలయాలు, వైఎస్సార్ విగ్రహాల వద్ద సంబరాలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, నేతలు కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ అన్ని వర్గాలకు చేసిన మేలును గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టారు. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడి కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇలా... పెదకూరపాడులో... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం ప్రజల్లో పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. గురువారం పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రోసూరులోని నాలుగు రోడ్ల కూడలిలోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. పార్టీని నమ్ముకున్న ఉన్న ప్రతి ఒక్క పార్టీ నాయకుడు, కార్యకర్తకు శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. గురజాలలో... భారతదేశంలో సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తులు నలుగురేనని.. వారిలో ఎంజీ రామచంద్రన్, ఎన్టీఆర్, కేసీఆర్, జగన్మోహన్రెడ్డి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించి కేక్ కట్చేశారు. సత్తెనపల్లిలో... వైఎస్సార్ సీపీ ప్రజల కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చిందని ఆ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద గురువారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మాచర్లలో.... దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాల కోసం 16 సంవత్సరాల కిందట మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీని ఏర్పాటు చేసి జనంలో తిరుగులేని నాయకుడుగా ఎదిగారని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమాదేవి అన్నారు. గురువారం మాచర్ల నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వినుకొండలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం వినుకొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సూచనలు మేరకు స్థానిక పార్టీ నాయకులు పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ కార్యాయంలో కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కోసం... ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న ఆమె నివాస ప్రాంగణంలో గురువారం వైఎస్సార్ సీపీ ఆవిర్బావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. -
పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్పై వర్క్షాప్
నరసరావుపేట రూరల్: పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్పై రెండు రోజులపాటు ఎంఏంఎ కళాశాలలో నిర్వహించిన వర్క్షాప్ గురువారం ముగిసింది. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి మండలం నుంచి ఇద్దరు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్స్, ఇద్దరు ఎస్జీటీలు వర్క్షాప్లో పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు పాల్గొని నేషనల్ అసెస్మెంట్ సర్వే గురించి సమగ్రంగా చర్చించారు. పాఠశాలకు మంచి కరికులం అందించడానికి, జాతీయ, రాష్ట్ర, మండల స్థాయిలో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఈ వర్క్షాపు ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక స్ధాయిలో జిల్లా మూడవ స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వర్క్షాపు ఆర్పీలుగా ఏఎంవో పూర్ణచంద్రరావు, ఎం.గుర్రుహ్మం, బాల సౌరయ్య, అబ్దుల్ ఖాదర్లు పాల్గొన్నారు. -
రూర్బన్తో రేఖ మారేనా ?
సత్తెనపల్లి: జిల్లాలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ ఆదాయం, జనాభా ప్రాతిపదికన వీటిని పునర్ వర్గీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మూడు రకాల పంచాయతీలు ఇక నుంచి నాలుగు వర్గాలుగా ఏర్పడనున్నాయి. వీటిలో కొత్తగా రూర్బన్ పంచాయతీల ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 529 గ్రామ పంచాయతీలు ఉండగా, 13 రూర్బన్ పంచాయతీలు, 169 గ్రేడ్–1 పంచాయతీలు, 110 గ్రేడ్ –2 పంచాయతీలు, 237 గ్రేడ్–3 పంచాయతీలున్నాయి. రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సదుపాయాలు కల్పించనున్నారు. ఇదీ ఎంత వరకు అమలుకు నోచుకుంటుందో వేచి చూడాలి. జిల్లాలో ఇలా... గ్రామపంచాయతీల పునర్ వర్గీకరణలో కొత్తగా రూర్బన్ పంచాయతీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మైదాన ప్రాంతం, గిరిజన ప్రాంతాలకు వేర్వేరు నిబంధనలను అమలు చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో పది వేలకు పైగా జనాభా ఉండి వార్షిక ఆదాయం రూ.కోటి కంటే ఎక్కువ ఉండాలి. అదే గిరిజన ప్రాంతంలో ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే సరిపోతుంది. జిల్లాలో అమరావతి, అచ్చంపేట, కారంపూడి, క్రోసూరు, నకరికల్లు, పెదకూరపాడు, రెంటచింతలతోపాటు పెదగార్లపాడు, గణపవరం, లింగంగుంట్ల, రావిపాడు, గుండ్లపల్లి, జానపాడు పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన వర్గీకరణ.. జనాభా లెక్కల ప్రకారం పంచాయతీల పునర్ వర్గీకరణ చేశారు. 2,500 నుంచి 5 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్–1 పరిధిలోకి తీసుకు వచ్చారు. జిల్లాలో 169 గ్రామపంచాయతీలు గ్రేడ్ –1 పరిధిలోకి వచ్చాయి. 1,500 నుంచి 2000 లోపు జనా భా ఉంటే వాటిని గ్రేడ్–2 పరిధిలోకి తీసుకొచ్చారు. జిల్లాలో 110 గ్రామపంచాయతీలు గ్రేడ్–2లో ఉన్నా యి. పంచాయతీలో 1500 కంటే తక్కువ జనాభా ఉంటే గ్రేడ్–3లోకి తీసుకువచ్చారు. జిల్లాలో 237 గ్రామ పంచాయతీలు గ్రేడ్–3లో ఉన్నాయి. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీలను వర్గీకరించడం వల్ల ఉపయోగం లేదు. వాటికి పూర్తిస్థాయిలో ఆదాయం మార్గాలను పెంచాల్సిన అవసరం ఉంది. పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం సకాలంలో నిధులు విడుదల చేయాలి. కేవలం పన్నుల రూపంలోనే పంచాయతీలకు ఆదాయం వస్తుంది. వాటిలో చాలా వరకు పారిశుద్ధ్య కార్మికులకు సరిపోతుంది. పంచాయతీలకు ఆదాయం వచ్చేలా వనరులను ఏర్పాటు చేయాలి. కొత్తగా ప్రకటించిన పంచాయతీలకు గ్రేడ్లు వారీగా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ భవనాల నుంచి పంచాయతీలకు సకాలంలో పన్నులు వసూలైతే బాగుంటుంది. – బొలమాల నాగమల్లేశ్యరరావు, సర్పంచ్, గణపవరం -
ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం
వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేట: పెదకూరపాడు నియోజకవర్గంలో 2014 – 19 వరకు టీడీపీ పాలనలోగానీ, గత రెండేళ్ల కూటమి పాలనలోగానీ జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఏంటో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరావు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం అచ్చంపేటకు వచ్చిన శంకరరావు విలేకరులతో మాట్లాడుతూ... 5 సంవత్సరాల వైఎస్సార్ సీపీ పాలనలో తానేం చేశానో నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అమరావతి నుంచి బెల్లంకొండ వరకు ట్రిబుల్ రోడ్డుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని, 60 శాతం పనులు పూర్తి చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎందుకు పనులు ఆపారో చెప్పాలన్నారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై రూ.63 కోట్లతో వంతెన మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తే దానికి కూడా కొనసాగించడం లేదన్నారు. మాదిపాడు నుంచి తండాలను కలుపుతూ పులిచింతల ప్రాజెక్టు రోడ్డుకు నిధులు మంజూరు చేయిస్తే ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, దొడ్లేరు గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్రోసూరులో పాలిటెక్నిక్ భవనం, గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పక్కా స్కూలు భవనాలు, అదనపు తరగతి గదులు, గ్రామ గ్రామానికి అంతర్గత పక్కా రహదారులు తమ హయాంలోనే నిర్మించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ప్రజలను మభ్యపెట్టడం, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని మంజూరు చేయించడానికి, బిల్లులు ఇప్పించడానికి తేడా తెలియని టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం హ్యస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన వెంట నియోజకవర్గ పరిశీలకులు మురళీధరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
సోషల్ మీడియా కేసులకు పీడీ యాక్ట్ పెడతారా?
పిడుగురాళ్ల: సోషల్ మీడియా పోస్టులపై కేసులకు పీడీ యాక్ట్ ఎలా పెడతారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో గురువారం మాట్లాడుతూ... పీడీ యాక్ట్ పెట్టిన పోలీసు అధికారులపై రేపు విచారణ జరుగుతుందని, అక్రమంగా పెట్టిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. పల్నాడు జిల్లాల్లో రామకృష్ణారెడ్డిపై అక్రమంగా మర్డర్ కేసులు పెట్టి జైలుకు వెళ్లేలా చేశారన్నారు. పిన్నెల్లి, తురకపాలెం గ్రామాలలో భయభ్రాంతులకు గురి చేసి గ్రామాలు విడిచివెళ్లేలా చేయటం చూశామన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మందా సాల్మన్ను హత్య చేసి, ఖననం చేయటానికి కూడా గ్రామాలకు వెళ్లేలేని పరిస్థితిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చూశారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అనేక కేసులు నమోదు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వెన్నా రాజశేఖర్రెడ్డి, ఎస్ఎం మాబు, సురేష్రెడ్డిలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. చివరికి ఓ కొత్త రాజకీయం వచ్చిందని, పీడీ యాక్ట్ కూడా మాబుపై పెట్టినట్లు తెలుస్తుందన్నారు. ఈ రోజు నేర్పిన పాఠాలే రేపు టీడీపీ వారికి గుణపాఠాలు అవుతాయని ఆయన హెచ్చరించారు. ఒకరి మీద పీడీ యాక్ట్ పెడితే రేపు పది మందిపై పెట్టడం ఖాయమన్నారు. సోషల్ మీడియా కేసులకు పీడీ యాక్ట్ కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా కేసులు పెట్టిన వారికి కూడా శిక్షలు తప్పవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. -
నేడు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల
నూజండ్ల:మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో శుక్రవారం కోటిగట్ల ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల నిర్వహించనున్నారు. తిరునాళ్ల సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మొక్కుబడి ప్రభను ఏర్పాటుచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది గ్రామస్తులంతా ఐకమత్యంతో తిరునాళ్లను జరుపుకోవటం ఆనవాయితీ. నూజండ్ల, రెడ్డిపాలెం, దాట్లవారిపాలెం, మారెళ్లవారిపాలెం, తలార్ల పల్లె, అప్పాపురం తదితర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులుపాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెద్దలు తెలిపారు. రేపల్లె: బాపట్ల జిల్లా మైనేనివారిపాలెం గ్రామంలోని శ్రీ గురు నిలయంలో శ్రీగాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామికి సుప్రభాత సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని, దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం శ్రీ రంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కై ంకర్యపరులుగా కొడాలి సీతారామయ్య, బసవానంద్, వెంకట అజయ్లు, ఆస్థాన కై ంకర్యపరులుగా పచ్చళ్ల విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. నకరికల్లు: ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న మరో లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న లారీ బోల్తా పడింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటన మండలంలోని చల్లగుండ్ల వద్ద అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం జరిగింది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ వైపు నుంచి కోడిగుడ్లు లోడుతో లారీ చెన్నయ్కు బయలుదేరింది. మార్గమధ్యలో చల్లగుండ్ల వద్ద రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ వంట చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వస్తున్న కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టడంతో కోడిగుడ్ల లారీ హైవే పక్కన ఉన్న పొలాలలో బోల్తా పడింది. దీంతో లారీలోని సుమారు రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వాగులోకి కారు బోల్తా
దాచేపల్లి: తిరుమలకు బయలుదేరిన కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో కారు వేగంగా డివైడర్ని ఢీకొట్టి వాగులో దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గోపవరం శ్రీనివాసరెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి కారులో తిరుపతికి బయలుదేరారు. దాచేపల్లిలోని నడికుడి వ్యవసాయ మార్కెట్యార్డు సమీపంలో కారు బ్రేకులు ఫెయిల్ అయినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో రోడ్డు మార్జిన్లోకి కారును దింపే క్రమంలో రోడ్డు డివైడర్ని ఢీకొట్టి వాగులోకి పల్టీలు కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వాగు వద్దకు చేరుకున్నారు. కారు తలుపులు, అద్దాలు పగులగొట్టి అందులో చిక్కుకున్న వారిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శ్రీనివాసరెడ్డి, అతని భార్య, కుమారుడు అద్విత్, కుమార్తె అద్వితి, మామ కృష్ణారెడ్డి, అత్త సుమతీలు గాయపడ్డారు. వీరిలో కృష్ణారెడ్డి, సుమతీ, అద్విత్కు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఆరుగురికి గాయాలు -
పోలీసుస్టేషన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
మాచర్ల: కన్నకూతురు పది రోజులుగా అదృశ్యమైంది. పట్టణానికి వచ్చిన తమ కుమార్తెను గుర్తు తెలియని యువకుడు తీసుకెళ్లాడని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ పోలీసులను దంపతులు పది రోజుల కిత్రం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా ‘విచారణ చేస్తున్నాం. మీ అమ్మాయిని తీసుకొస్తామంటూ’ కాలం గడుపుతున్నారు. పది రోజులైనా తమ కుమార్తె ఆచూకీ తెలుసుకోవటానికి పోలీసులు ప్రయత్నం చేయటం లేదని ఆవేదన చెందిన ఆమె తల్లిదండ్రులు కామనబోయిన చంద్ర శ్రీను, గంగలు బుధవారం రాత్రి పోలీసు స్టేషన్కు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని న్యాయం చేస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుమార్తె ఆచూకీ విషయం పట్టించుకోకుండా పట్టణ సీఐ వెంకటరమణ నిర్లక్ష్యం వహించటం వల్లనే తమకు ఆవేదన మిగిలిందని వాపోయారు. పైగా దురుసుగా మాట్లాడారని, చేయి పట్టుకొని తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేశారని గంగ ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను అదుపులోకి తీసుకున్నాక బంధువులను రానివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. ఈ విషయమై గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ విచారించి చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కావాలని పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు వాపోయారు. తమ కుమార్తెను ఇప్పటికే గ్రామానికి చెందిన వారే హత్య చేసి ఉంటారని చంద్రశ్రీను ఆవేదనతో చెప్పారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా పోలీసులు తమను మభ్యపరుస్తూ విచారిస్తున్నామని పేర్కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటలకుపైగా పట్టణ పోలీసు స్టేషన్ ముందు తల్లిదండ్రులు వేచి ఉండటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనిపై ఇన్చార్జి డీఎస్పీ మాట్లాడుతూ యువతి అదృశ్యంపై కేసు నమోదు చేశామన్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలను ఆచూకీ కనుగొంటామన్నారు. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ ఆందోళన -
పురాతన బ్రిడ్జి పిల్లర్లు తొలగింపు
తాడేపల్లిరూరల్ : కృష్ణానది దిగువ ప్రాంతంలో బ్రిటీష్కాలం నాటి రైల్వే బ్రిడ్జి పిల్లర్లను తొలగించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు చేపట్టారు. మొదటి పిల్లర్ను పగలకొట్టడం ప్రారంభించి బుధవారానికి వారం రోజులు దాటింది. ఆ పిల్లర్ను సగం కూడా పగలకొట్టేందుకు భారీ బ్రేకర్ వల్ల కావడం లేదు. నల్లరాయి, సిమెంట్తో కట్టిన ఈ బ్రిడ్జి చాలా దృఢంగా ఉంది. సగం వరకు పిల్లర్ను పగలకొట్టి పెద్ద పెద్ద జేసీబీలు తీసుకువచ్చి తోసినా పిల్లర్లను కదలించలేకపోతున్నారు. కృష్ణానదిలో మొత్తం 15 పిల్లర్లు ఉన్నాయి. రైల్వే అధికారులు ఈ పిల్లర్లను తొలగించి డబుల్లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక పిల్లర్ పగలకొట్టడానికి సుమారు 15 రోజుల వ్యవధి పడుతుందని, 15 పిల్లర్లు తొలగించాలంటే రెండు బ్రేకర్లు 5 నెలలు సమయం పడుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు. నరసరావుపేట రూరల్: పదవ తరగతి పరీక్షలు పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా నోడల్ అధికారి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పి.శైలజ తెలిపారు. కేసానుపల్లిలోని ఎంఏంఎం కళాశాలలో బుధవారం మండల స్థాయి అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శైలజ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఏ ఒక్క విద్యార్థి నేల మీద కూర్చుని పరీక్ష రాయకూడదని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మాట్లాడుతూ సీఎస్, డీవోలు పోలీస్స్టేషన్ నుంచి పాఠశాలకు ప్రశ్నపత్రాలు తరలించే క్రమంలో పోలీసు ఎస్కార్ట్తో వెళ్లాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే నోడల్ అధికారికి తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో పూర్ణచంద్రరావు, ఉపవిద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఇండియన్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే పురస్కారాల్లో భాగంగా గుంటూరుకు చెందిన శాఖమూరు పద్మ పెయింటింగ్స్ అండ్ క్లే క్రాఫ్ట్స్ విభాగంలో ‘ఇండియా ఆర్ట్స్ 2026’ అవార్డు పొందారు. ఈ మేరకు బుధవారం శాఖమూరు పద్మ అవార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. సైన్స్లో బీఈడీ పట్టభద్రురాలైన పద్మ కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసి, పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై ఉన్న మక్కువతో ఆయా అంశాల్లో బోధకురాలిగా మారారు. ఐదేళ్ల వయసు మొదలు అన్ని వయసుల వారికి వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్స్ నేర్పుతున్న పద్మ ప్రస్తుతం గుంటూరు జిల్లా లాం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
అత్యవసర చికిత్సకు గుంటూరు వెళ్లాల్సిందే..
నరసరావుపేట మండలం లింగంగుంట్లకు చెందిన కల్యాణి మూర్చవ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో ఇంటిపై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయాయ్యయి. సమీపంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అవసరమని, గుంటూరుకు తీసుకెళ్లమని సూచించారు. ఆమె బంధువులు అప్పటికప్పుడు 108 సాయంతో జీజీహెచ్కు తరలించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అత్యవసర సేవలు కూడా అందుబాటులో లేకపోవడం రోగులకు భారంగా మారింది. మరోవైపు కార్డియాలజీ విభాగం లేకపోవడంతో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు అధికంగా ఉండే పల్నాడు జిల్లా లో కీలకమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నరసరావుపేట వైద్యశాల నుంచి గుంటూరు జీజీహెచ్కు బాధితురాలు కల్యాణి తరలింపు -
మందులు బయటే...
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురంకు చెందిన తుమ్మరి కోటేశ్వరరావు అనారోగ్యంతో ఏరియా వైద్యశాలకు వచ్చాడు. ఆయాసం ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాడు. రక్తపరీక్షలు అవసరమని మూడవ అంతస్తుకు వెళ్లమని సూచించారు. ఆయాసంతో బాధపడుతున్న కోటేశ్వరరావు మూడవ అంతస్తుకు మెట్ల మీద నుంచి ఎక్కడం కష్టంగా మారింది. ఇబ్బందులు పడుతూ మూడవ అంతస్తుకు చేరి రక్తపరీక్షలు చేయించుకొని వైద్యున్ని సంప్రదించాడు. కొంతకాలం మందులు వాడాల్సి ఉంటుందని తెలిపిన వైద్యుడు అవసరమైన మందుల చీటిని చేతిలో పెట్టాడు. ఫార్మసీకి వెళ్లిన కోటేశ్వరరావుకు ఒక రకం మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన రెండు రకాలు బయట తీసుకోవాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆసుపత్రిలో ప్రాంగణంలోనే ఉన్న జనరిక్ మెడికల్ షాపులో డబ్బులు చెల్లించి మందులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. -
పురాధీశులు
చిలకలూరిపేటకు జేసీ సంజనా సింహ... స్థానికం ఇప్పట్లో లేనట్లేనా? అవిశ్వాసంతో .. విశ్వాసం కోల్పోయి.. చిలకలూరిపేట ప్రత్యేకాధికారిగా జేసీ సంజనా సింహ పిడుగురాళ్లకు గుంటూరు ఆర్డీఎంఏ హరికృష్ణ వినుకొండకు పులిచింతల ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రమేష్ మాచర్ల, సత్తెనపల్లికి ఆర్డీఓలు మురళీకృష్ణ, శ్రీరాములు ఈ నెల 16తో ముగియనున్న పాలకవర్గాల పదవీ కాలం ప్రత్యేక పాలనపై ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం ‘స్థానిక’ఎన్నికల నిర్వహణకు టీడీపీ ప్రభుత్వం వెనుకంజ -
భార్యను హత్య చేసిన భర్త
నరసరావుపేట రూరల్: భార్యను భర్త హత్య చేసిన ఘటన మండలంలోని ములకలూరులో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... నెల్లూరు జిల్లా వనంతోపు సెంటర్కు చెందిన యాటగిరి వెంకయ్య, అదరత్తమ్మ(41)లు గత ఆరు సంవత్సరాలుగా పట్టణంలో పాతసామగ్రి సేకరించి విక్రయిస్తూ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో జీవిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఇస్సపాలెం తిరునాళ్ల సందర్భంగా ఇరువురు గ్రామానికి వెళ్లారు. మంగళవారం ఉదయం ములకలూరు సమీపంలోని వాగు దగ్గర అదరత్తమ్మ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తలపై గాయం ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. భర్త వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో అదరత్తమ్మ తలపై రాయితో మోది హత్య చేసినట్టు విచారణలో వెంకయ్య వెల్లడించినట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు. -
పురపాలక సంఘాలకు ప్రత్యేకాధికారులు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఈ నెల 17వ తేదీతో పాలకవర్గ కాలం ముగియనున్న పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేడ్–2 పురపాలక సంఘాలైన పిడుగురాళ్ల, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, వినుకొండలకు వరుసగా గుంటూరు ఆర్డీఎంఏ, గురజాల ఆర్డీఓ, సత్తెనపల్లి ఆర్డీఓ, డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, చిలకలూరిపేట సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరందరూ ఆరు నెలలు లేదా నూతన పాలకవర్గం ఏర్పడే వరకు వాటికి ప్రత్యేకాధికారులుగా వ్యవహరించనున్నారు. నకరికల్లు: మండలంలోని రూపెనగుంట్ల గ్రామంలో వినాయకుని విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతంలో క్లూస్టీం, డాగ్స్క్వాడ్ మంగళవారం ఆధారాలు సేకరించాయి. గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన పాఠకులకు విదితమే. మంగళవారం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్ఐ కె.సతీష్, సిబ్బంది గ్రామానికి చేరుకొని విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డ్వాగ్స్క్వాడ్ సహాయంలో పలు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ పి.కిరణ్ మాట్లాడుతూ ఘటనపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం
నాదెండ్ల: గణపవరం జాతీయ రహదారి వద్ద శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల దర్శనార్ధం ప్రత్యేక క్యూలైనులు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారులు పి. లక్ష్మీనారాయణ, కన్నా శాస్త్రి భక్తుల గోత్రనామపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమాలను మాజీ సర్పంచ్ వలేటి హిమంతరావు, గణపవరం మద్ది లక్ష్మయ్య కంపెనీ ముఠాకూలీలు, కార్మికులు, సిబ్బంది పర్యవేక్షించారు. వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరు గ్రామ దేవతలు ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ, పరివార దేవతల ఆవరణలో మంగళవారం అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి నెల రెండవ మంగళవారం జరపతలపెట్టిన కార్యక్రమంలో భాగంగా భక్తులు, వివిధ భజన మండలి వారు పాల్గొని చాలీసా పారాయణం చేశారు. స్వామి వారికి పూజలు చేశారు. తెనాలి: మండల గ్రామం అంగలకుదురులోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన చేశారు. అనంతరం హారతి, రాత్రి 8 గంటల వరకు సాయిబాబా నామ సంకీర్తనను జరిపారు. ఉదయం 10 గంటలకు భజన, 11 గంటలకు వెస్ట్బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యంచే సత్సంగం జరిగాయి. మధ్యాహ్నం హారతి, అనంతర ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం అంగలకుదురులో శ్రీరామభక్త హనుమాన్ మహిళా కోలాట బృందంచే కోలాటంతో సాయిబాబా నామ సంకీర్తనలతో పురవీధుల్లో చిత్రరాజాలను ఊరేగించారు. రాత్రి అన్నప్రసాద వినియోగం జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్):అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సాంబ్రాజ్యం అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు జి.సౌజన్య, ఎ.ఉషాకిరణ్ పాల్గొన్నారు. ఆర్టీసీ సర్వీసుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
పట్టణ ప్రణాళికపై ఏసీబీ కన్ను
నగరంపాలెం: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ప్రధాన కార్యాలయ ఆవరణలోని పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం ఉమ్మడి గుంటూరు ఏసీబీ అధికార, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే నేతృత్వంలో నలుగురు సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు, ముగ్గురు ఎస్ఐలు సిబ్బంది ఒక్కసారిగా బృందాలుగా ఏర్పడి ఉదయం 11 గంటల తర్వాత గుంటూరు జీఎంసీకి చేరుకున్నారు. మొదటి అంతస్తులోని పట్టణ ప్రణాళిక విభాగంలోకి వెళ్లారు. అందులో కార్యాలయపు రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఆన్లైన్ ఫిర్యాదులను పరిశీలించారు. ఎక్కువగా వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, తనిఖీలు చేశారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగపు సిటీ ప్లానర్ రాంబాబుతో మాట్లాడారు. ఇటీవల ఆన్లైన్, నేరుగా వచ్చిన ఫిర్యాదులపై సిటీ ప్లానర్ను ఆరాతీశారు. కీలక రికార్డులు స్వాధీనం అప్పటికే కార్యాలయంలో కూర్చుని ఉన్న ఇద్దరితో మాట్లాడారు. ఓ పని నిమిత్తం వచ్చానని, గతంలో ఒకరికి కొంత మొత్తంలో ముట్టజెప్పినట్లు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే సదరు అధికారి ఎవరనేది ఫిర్యాదు చేప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. అంతేగాక పట్టణ ప్రణాళిక విభాగపు అధికార, సిబ్బందితోనూ ఏసీబీ అధికారులు చర్చించారు. వివిధ ఫైళ్లకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పలువురు అధికారులను విచారించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలపై ఆరా తీస్తున్నారు. కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ఉల్లంఘనలు, వరుస ఫిర్యాదుల దృష్ట్యా కార్యాలయపు సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి రెగ్యులర్గా వచ్చే ఫిర్యాదులపై పరిశీలన చేస్తున్నామని అన్నారు. బుధవారం సైతం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. మధ్యాహ్నా వేళ ఏసీబీ జేడీ (విజయవాడ) సురేష్బాబు గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చారు. ఏఎస్పీ మహేంద్ర మత్తేతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఏఎస్పీకి సిబ్బందికి జేడీ పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలు దాదాపు రాత్రి వరకు కొనసాగాయి. ఏసీబీ తనిఖీలతో జీఎంసీ ఆవరణలోని మిగతా విభాగపు అధికార, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
బిడ్డా.. మూగబోయావా
సెల్ ఫోన్ వద్దన్నందుకు బాలుడి బలవన్మరణం నరసరావుపేటటౌన్: తల్లి మందలించిందని కుమారుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నరసరావుపేట పట్టణంలో కలకలం రేపింది. ఇస్లాంపేటకు చెందిన షేక్ రిహాన్ (11) ప్రకాష్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో సెల్ఫోన్న్తీసుకొని గంటల కొద్ది ఆన్లైన్ గేమ్ ఆడేందుకు అలవాటు పడ్డాడు. అనేక సార్లు తల్లిదండ్రులు వారించినా వినలేదు. సోమవారం సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్న కుమారుడిని చూసి తల్లి మందలించింది. దీంతో అలిగి డాబా పైరూంకి వెళ్లిన బాలుడు ఎంతసేపటికీ కిందకు రాలేదు. దీంతో పైకి వెళ్లి చూడగా ఫ్యానన్కు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. ఒక్క మాట అనకుండా ఉండాల్సింది అంటూ బోరున విలపించింది. రిహాన్ మృతితో పాఠశాలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఆందోళనకరంగా సెల్ఫోన్ వినియోగం.. ఇటీవల కాలంలో యువతకు సెల్ఫోన్ లేనిదే రోజు గడవటం లేదు. సెల్ఫోన్ వినియోగం విపరీతంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది. మొబైల్ లేకుండా ఒక్కరోజు కూడా గడవలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, ఆన్లైన్ గేమ్లకు యువత పూర్తిగా ఆకర్షితులౌతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిన కొందరు యువకులు గంటల కొద్ది అదే ప్రపంచంలో మునిగిపోతున్నారు. అదే విధంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ల్లో ఆర్థికంగా నష్టపోయి అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ సమయం సెల్ఫోన్కే.. చదువుకు కేటాయించాల్సిన విలువైన సమయాన్ని మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమం పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది. అన్నం తినాలన్నా, పుస్తకం పట్టాలన్నా చివరకు నిద్రపోవాలన్నా కాసేపు ఫోన్ పట్టే పరిస్థితి ప్రతి ఇంటా ఉంటుంది. ఎక్కువ సేపు సామాజిక మధ్యమాల్లో గడపటంతో చదువుపై ఏకాగ్రత సన్నగిల్లుతోంది. ఫలితంగా విద్యలో వెనుకబడటమే కాక మానసికంగా కూడా దెబ్బతింటున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గిపోగా, వర్చువల్ ప్రపంచమే అసలు జీవితంలా మారిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కోపం, నిరాశ ఆవేశం పెరిగి తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తున్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు. పిల్లలు మంచి మార్గంలో నడవాలని తల్లిదండ్రులు మందలిస్తే దాన్ని అర్థం చేసుకోలేని కొందరు యువకులు క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు కుటుంబాలను శాశ్వతంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి. మొబైల్ఫోన్ అవసరమైన సాంకేతిక సాధనమే అయినప్పటికీ అధిక వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలు రోజంతా సెల్ఫోన్తో గడపకుండా తల్లిదండ్రులు స్పష్టమైన సమయపరిమితి పెట్టాలి. సెల్ఫోన్కు అలవాటు పడ్డ పిల్లల నుంచి ఒక్కసారిగా ఫోన్ తీయకుండా, క్రమంగా తగ్గించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మాడ్లాడి వారి భావాలు, సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల వచ్చే అనర్థాల గురించి వివరిస్తూ చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై అవగాహన కలిగించాలి. చదువు, ఆటలు, విశ్రాంతి అన్ని సమతుల్యంగా ఉండేవిధంగా చూడాలి. – డాక్టర్ అత్తిలి సతీష్, మానసిక వైద్య నిపుణులు -
మామాఅల్లుళ్లను మింగేసిన కంటైనర్
నకరికల్లు: కంటైనర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై బోల్తా పడడంతో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని అడ్డరోడ్డు వద్ద అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన జిల్లా గురుమూర్తి (55), గుంటూరు నగరం లక్ష్మీపురానికి చెందిన గోపిదేశి సత్యనారాయణ (45) వరుసకు మామాఅల్లుళ్లు. ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలోని మామిడితోటకు మందు పిచికారీ చేయించి స్కూటీపై గుత్తికొండకు బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి పిడుగురాళ్ల వైపు అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి స్కూటీపై బోల్తా పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి ఎస్ఐ కె.సతీష్, సిబ్బంది వచ్చి స్థానికుల సహాయంతో క్రేన్ ద్వారా కంటైనర్ని పక్కకు తీయించారు. కంటైనర్ కిందనున్న మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. భారీగా నిలిచిన ట్రాఫిక్ అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై కంటైనర్ బోల్తా పడడంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైవేపై వెళ్లే వాహనాలతోపాటు నరసరావుపేట–పిడుగురాళ్ల వైపు రాకపోకలు సాగించేవి కూడా భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. మండుటెండ కావడంతో ప్రయాణికులు వేచి ఉండలేక రెండుగంటల పాటు అవస్థలు పడ్డారు. కంటైనర్ను వెలికితీసిన పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. బైకుపై వెళ్తుండగా వాహనం పడి మృతి -
బరితెగిస్తున్న
గ్రానైట్ లారీలను తెలంగాణ తరలించే క్రమంలో మరో సీటీఓ(కమర్షియల్ టాక్స్ ఆఫీసర్)పై దాచేపల్లి మండలం పొందుగల వద్ద మాఫియా సభ్యులు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. తమ లారీలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని, చేస్తే అంతుచూస్తామని, దిక్కున్నవారికి చెప్పుకోమంటూ బెదిరించారట. దీనిపై సదరు అధికారి దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పల్నాడు జిల్లా ఎస్పీ అనుమతి తీసుకొని కేసు నమోదు చేస్తామని చెప్పి పంపారట. దీంతో ఆ అధికారులు ఇద్దరు చేసేదేమిలేక తమ ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారట. ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డొచ్చి, బెదిరిస్తున్నా పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకపోతే ఎలా అనే విమర్శలొస్తున్నాయి. సాక్షి, నరసరావుపేట: అధికార మదంతో రెచ్చిపోతున్న ‘పచ్చ’ మాఫియా సహజ వనరులను కొల్లగొట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రానైట్, ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తమ్ముళ్ల జేబుల్లోకి తోస్తున్నారు. అడ్డుకుంటున్న అధికారులను బెదిరించి, భయపెట్టి దౌర్జన్యంగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. సోమవారం, మంగళవారం పల్నాడు జిల్లా మీదుగా వెళ్తున్న అక్రమ గ్రానైట్ లారీలను ఆపి పత్రాలను పరిశీలించే ప్రయత్నం చేసిన కమర్షియల్ టాక్స్ అధికారులపై గ్రానైట్ మాఫియా దౌర్జాన్యానికి దిగింది. ● సోమవారం రాత్రి మాచవరం పోలీసుస్టేషన్ పరిధిలోని పిల్లుట్ల రోడ్డులో ఆపి ఉన్న రెండు గ్రానైట్ లారీలను ఓ మహిళా అధికారి పరిశీలించి పత్రాలను చూపమని అడిగారు. దీంతో ఆమైపె మాఫియా సభ్యులు దౌర్జన్యానికి దిగారు. పత్రాలు చూపాలని ఆడిగినందుకు తాము గురజాల ఎమ్మెల్యే యరపతినేని అనుచరులమని బెదిరింపులుకు దిగారట. మహిళా అధికారి కారుకు గ్రానైట్ మాఫియా కారు అడ్డుగా పెట్టి లారీలను అక్కడి నుంచి దౌర్జన్యంగా తరలించారు. దీనిపై సదరు అధికారి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు. మంగళవారం ఆ అధికారి మాచవరం పోలీసుస్టేషన్ ముందే పడిగాపులు కాసినా కేసు నమోదు చేయకుండా అధికార పార్టీ నేతలతో చర్చించి వారి అక్రమ రవాణాకు సహకరించాలని పోలీసులు సలహా ఇచ్చారట. దీంతో చేసేదేమి లేక మాచవరం నుంచి ఆ మహిళా అఽధికారి వెళ్లిపోయారు. ‘సాక్షి’ విలేకరి ఆమెను ప్రశ్నించగా మళ్లీ మాచవరం పోలీసుస్టేషన్కు వస్తానని, అప్పుడు సమాధానం చెబుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లా మీదుగా మార్టూరు నుంచి నిత్యం పదుల సంఖ్యలో అక్రమ గ్రానైట్ లారీలు జిల్లా సరిహద్దులు దాటి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్రమ గ్రానైట్ లారీలు ప్రయాణించే దారిలో ఉన్న ప్రజాప్రతినిధులకు నెలవారీ ముడుపులు సైతం భారీ మొత్తంలో ముట్టజెబుతున్నట్టు సమాచారం. ఇందులో కొందరు ప్రభుత్వ అధికారులకు సైతం మూమూళ్ల అందుతున్నాయి. అయితే ఈ వాటాల పంచాయితీలో వచ్చిన తేడాలతో తామే గ్రానైట్ అక్రమ రవాణా చేస్తామని గురజాలకు చెందిన అధికారపార్టీ నాయకులు అక్రమ రవాణా చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో లారీలను అడ్డుకుంటున్న అధికారులపై గురజాలకు చెందిన అక్రమ రవాణా బ్యాచ్ దౌర్జన్యాలకు దిగి బెదిరిస్తున్నట్టు సమాచారం. వారి ఆగడాలు శృతిమించి పోలీసుస్టేషన్కు చేరడంతో అధికారులతో స్థానిక టీడీపీ నేతలు మధ్యవర్తిత్వం నడుపుతున్నారు. చూసీచూడనట్టు పోతూ అక్రమరవాణాకు సహకరించాలని సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
ఏఎన్యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ సంవత్సరానికి రెండేళ్ళ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష కేంద్రాలు: సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), విజయ దుర్గ డిగ్రీ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ (అనంతపూర్), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎస్బీఎస్వైఎం డిగ్రీ కాలేజ్( మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం) మొత్తం 12 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ ఐసెట్ 2025లో అర్హులకు మినహాయింపు.. ఏపీ ఐసెట్–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను, ర్యాంక్ కార్డులు పొందవచ్చని దిట్టకవి ఆచార్య రామచంద్రన్ పేర్కొన్నారు. -
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలలో తృతీయస్థానం
సత్తెనపల్లి: కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన 3వ రాష్ట్రస్థాయి మినీ బాల, బాలికల రగ్బీ పోటీలలో పల్నాడు జిల్లా బాల,బాలికల జట్లు తృతీయ స్థానం సాధించాయని పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.డానియేల్ తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ యం.ప్రకాష్లు మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ జట్టుకి కోచ్గా యం.బాలాజీ వ్యవహరించారన్నారు. నాగార్జుననగర్లో వివాహిత బలవన్మరణం సత్తెనపల్లి: వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని నాగార్జుననగర్లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగార్జుననగర్కు చెందిన జెల్లి ఆదిలక్ష్మి (28) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మ రణానికి పాల్పడింది. మృతురాలికి భర్త నాగరాజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల క్రితం వివాహం కాగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆదిలక్ష్మీ తిరిగి వచ్చింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురౌతూ బలవన్మరణానికి పాల్పడింది. తన మరణానికి ఎవరు కారకులు కాదని, భర్త, అత్త,మామలు మంచి వాళ్ళు అంటూ ఆమె లేఖ రాసింది. బలవన్మరణానికి గల కారణం ఏమిటనేది రాయలేదు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్ఐ పి. పవన్కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కిలారి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు బ్రాంచి కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం నకరికల్లు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మండలంలోని కండ్లకుంట సమీపంలోని గుంటూరు బ్రాంచి కెనాల్లో గుర్తించినట్లు ఎస్ఐ కె.సతీష్ మంగళవారం తెలిపారు. గుర్తించిన వ్యక్తికి సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. లేత ఆకుపచ్చ రంగు నిక్కరు, సిమెంట్రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. కేసీపీ పవర్ప్లాంటు–4 వద్ద మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మార్చురీకి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు 9440796246, 9966460427 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ప్రకృతి వ్యవసాయంలో బయో రిసోర్స్ సెంటర్లు కీలకపాత్ర
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ విస్తరణలో బయో రిసోర్స్ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. జిల్లాలోని ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 35 ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు జరుపుతున్నట్టు తెలిపారు. రాబోవు రెండు నెలల్లో బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా 30 రకాల విత్తనాలతో 15 కిలోల బరువు ఉండే ప్యాకెట్లను సిద్ధంచేసి రైతులకు అందజేస్తామని తెలిపారు. రబీ పంట కోత అనంతరం రైతులు ఈ విత్తనాలను పొలాల్లో చల్లడం ద్వారా వివిద రకాల వేరు వ్యవస్థలు భూమిలో ఏర్పడి భూసారం పెరుగుతుందని వివరించారు. భూమిలో నీటిని నిలుపుకునే సామర్ధ్యం పెరగడంతో పాటు ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపారు. రాబోవు ఆరు నెలల్లో మరో 100 ప్రకృతి వనరుల కేంద్రాలను జిల్లాలో ఏర్పాటుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజు, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, మేరి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో ఈతకు దిగి వ్యక్తి మృతి
మంగళగిరి టౌన్: కాలువలోకి ఈతకు దిగి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాజ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందినబొడ్డు వెంకటరమణ (22) సోమవారం మధ్యాహ్నం సమయంలో తోటి స్నేహితులు మహేష్, శ్రీనివాస్లతో కలసి మోటారు సైకిల్పై బయటకు వెళ్లారు. అనంతరం కాజ గ్రామ చెరువు వద్దకు చేరుకున్నారు. బహిర్భూమికి వెళ్లిన అనంతరం వెంకట రమణ ఈత కొట్టేందుకు చెరువులోకి దిగాడు. చెరువులోని కొంతదూరం వెళ్లాక రెండు చేతులు పైకి ఎత్తి కనబడడంతో స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. చుట్టపక్కల ఉన్న రైతులు చెరువు వద్దకు చేరుకుని మునిగిన వెంకట రమణను బయటకు తీసుకు వచ్చారు. అప్పటికే వెంకటరమణ మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన ఘటనపై వెంకటరమణ భార్య మంజుల మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి మంగళగిరి టౌన్: ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొలసాని వెంకటేశ్వరరావు(60) మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ రామవరప్పాడులో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వరరావు 1980లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా చేరారు. 2005లో ఏఆర్ కానిస్టేబుల్గా, 2019లో సివిల్ పీసీగా బదిలీ అయ్యి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్గా ఉంటూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలోని డాగ్ స్క్వాడ్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయనకు 2008లో గుండెజబ్బు రావడంతో స్టంట్స్ వేశారు. 2011లో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో పీపీటీ టెస్ట్లో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మంగళగిరి ఎయిమ్స్కు తరలించగా, పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగింపు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వివిధ ఎయిడెడ్ పాఠశాలల్లో పలు ఉపాధ్యాయ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తు స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. చెరుకుపల్లి మండలంలోని బాపూజీ ఎయిడెడ్ హైస్కూల్, శాస్త్రి మెమొరియల్ ఎయిడెడ్ యూపీ స్కూల్, గుంటూరు శ్రీనివాసరావు పేటలోని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాల, అరండల్ పేట 10/4 లోని రెసిడెన్షియల్ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్, బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో ప్ర భుత్వ అనుమతి మేరకు వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల మేరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆయా పాఠశాల కరెస్పాండెంట్కు వ్యక్తిగతంగా, పోస్టు ద్వారా పంపాలని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీఎస్//సీఎస్ఈ.ఏపీ.ఇన్ను సందర్శించాలని సూచించారు. -
హత్య కేసును ఛేదించిన రైల్వే పోలీసులు
వివరాలు వెల్లడించిన జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పెదకాకాని రైల్వే స్టేషన్లో ఈనెల 4వ తేదీన జరిగిన హత్యకేసు మిస్టరీని గుంటూరు రైల్వే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు అరెస్టు చూపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4వ తేదీన పెదకాకాని రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ చివర భాగంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి హత్యకు గురి అయినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశ ంలో మృతి చెందిన వ్యక్తిని పరమడం అనీష్(40) అలియాస్ బ్లేడ్గా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును డీఎస్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు రైళ్లలో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడని మృతుడి పై చైన్నె, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో పలు దొంగతనాలు, నేరాలకు పాల్పడిన కేసులు నమోదు అయినట్లు విచారణలో తెలిసింది. మృతుడు అనీష్ తనతో కలిసి దొంగతనాలు చేసే తోటివారిని నిత్యం వేధిస్తుండటం.. ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరందరినీ పలు రైల్వే స్టేషన్లలో బ్లేడ్ బ్యాచ్గా పిలుస్తారని, మృతుడు అనీష్ దొంగతనం చేసిన సొత్తులో ఎక్కువ భాగం తనకు ఇవ్వాలని, తోటి సహచరులపై ఒత్తిడి తేవడం వారిని కూడా పలు మార్లు బ్లేడ్తో కోస్తా అని బెదిరించడం వల్ల ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనీష్ వేధింపులను తాళలేక ఈనెల 4వ తేదీన హతమార్చేందుకు పథకం రూపొందించారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఎఫ్.కుమార్ అలియాస్ అంతోని కుమార్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్న దీపేష్ ఎం.ఎస్, అలియాస్ మెంటల్ భాయ్, అనంతపురంకు చెందిన కొప్పుల వెంకటేష్ అలియాస్ వెంటి, అలియాస్ వెంగీ భాయ్లు పెదకాకాని రైల్వే స్టేషన్లో అనీష్పై బ్లేడ్లతో దాడి చేసి అతి కీరాతకంగా హతమార్చి పరారయ్యారు. ఈనెల 9వ తేదీన సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్–1లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని జీఆర్పీ సీఐ అంజిబాబు పట్టుకుని స్టేషన్కు తరలించి విచారించగా అనీష్ను హత్య చేసినట్లు అంగీకరించారు. వీరందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసును ఛేదించిన జీఆర్పీ సీఐ జి.అంజిబాబు, ఆర్పీఎఫ్ ఎస్ఐ మహబూబు సుభాని, కానిస్టేబుల్లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, శంకర్, ఆర్పిఎఫ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్, ఏఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని డీఎస్పీ, రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. -
రైతులకు న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వాలి
అమరావతి: మండలంలో 8 గ్రామాల్లో భూ సమీకరణలో భూమి కోల్పోతున్న రైతాంగానికి న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులవారిని ఆదుకోవాలని సీపీఎం పలనాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు అన్నారు మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, లేమల్లె, కర్లపూడి గ్రామాల్లో భూమి మొత్తాన్ని రాజధాని అవసరాలు నిమిత్తం రెండో విడత భూ సమీకరణ, ఔటర్ రింగ్ రోడ్డు అవసరాల కోసం ధరణికోట, లింగాపురం గ్రామాల్లో భూమిని భూ సమీకరణ చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరానికి మించి భూమిని 250 మీటర్లు వెడల్పులో సేకరిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని వెడల్పున 70 మీటర్లకు తగ్గించాలన్నారు. రైతాంగానికి న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వటానికి, అదేవిధంగా కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆదుకోవటానికి ఆయా గ్రామాలలో గ్రామసభలను జరిపి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, వారికున్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. భూసమీకరణ చేస్తున్న గ్రామాల్లో అభివృద్ధి అవసరాల కోసం ఉపాధి హామీ పనులను కొనసాగించాలన్నారు. గ్రామాలలో మౌలిక సౌకర్యాలు మురుగు కాలువలు తాగునీరు సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి కూడా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు బి. సూరిబాబు, రూరల్ శాఖ కార్యదర్శి సయ్యద్ మోహిద్దీన్, నండూరి వెంకటేశ్వరరాజు, షేక్ నాగుల్ మీర పాల్గొన్నారు. -
వైభవంగా విఘ్నేశ్వరుని ఆలయ వార్షికోత్సవం
రేపల్లె: పట్టణంలోని పెదకూరగాయల మార్కె ట్ సమీపంలో వేంచేసియున్న శ్రీసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవలతో పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేక మహోత్సవాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నసంత ర్పణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెనాలి: శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఈనెల 13వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు బుర్రిపాలెంరోడ్డులోని శ్రీమహాత్మ సేవాశాంతి ఆశ్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి, ఆశ్రమవాసులకు అన్నదానం చేయటానికి నిర్ణయించినట్టు సంఘ నాయకులు వేజండ్ల శివన్నారాయణ, నిమ్మలూరి కమలాకరరావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. శాలివాహన సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘ నాయకులు మోదుకూరి శివరామకృష్ణప్రసాద్, నాంచార య్య, అయ్యవార్లు, క్రిష్టరావు, శంకరరావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఉరిటి శ్రీనివాసరావు, పి.జ్వాలారావు, వి.నాగరాజు, ఎం.శ్రీనివాసరావు తదితరులున్నారు. మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సోమవా రం గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్, శేషాంజనేయ గోపాల్లు వ్యవహరించగా, ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. గుంటూరువెస్ట్: జి. రామ్. జి – గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పమని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. వికసిత్ భారత్– జి. రామ్. జి పోస్టర్ను సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. జేసీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం, ఉపాధికి కొత్త హామీగా జి రామ్ జి నిలుస్తుందన్నారు. 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తుందన్నారు. సమయానికి కూలి చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం వంటి అంశాలను ఇందులో చేర్చారన్నారు. -
వైద్యశాలలో మురుగు మయం
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో మురుగు నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉపశమనం లభించాల్సినచోట అపరిశుభ్ర వాతావరణం స్వాగతం పలకటం ఆందోళన కలిగిస్తుంది. ఉన్నరోగాలకు తోడు కొత్త వ్యాధులు వస్తాయని రోగు లు కలవరపాటు చెందుతున్నారు. దీంతో అక్కడ విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందితో పాటు రోగులు వారి సహాయకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వైద్యశాల్లో రోగులు వినియోగించిన నీరు మురుగు కాల్వ లో పారక ఎక్కడికక్కడే ని లిచిపోతుంది. ఆ నీరు పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతుంది. నెలల తరబ డి మురుగు నిల్వ ఉండ టంతో దోమలు వృద్ధి చెంది స్వైరవిహారం చేస్తున్నా యి. కొన్ని నెలలుగా డ్రైనేజ్ సమస్యపై అనేక ఫిర్యాదులు వచ్చినా అధి కారులు స్పందించిన దాఖలాలు లేవు. సాయంత్రం సమయాల్లో ఉండలేక పోతున్నామని రోగులు వాపోతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో బాధ పడుతూ మరో వైపు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొస్తున్నారు. రోగులు ఉండే గదుల పక్కనే మురుగు కాల్వ ఉండటం అసౌకర్యంగా మారింది. గదుల్లోకి దుర్వాసన వస్తుండటంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో అభివృద్ధి పనులు జరుగుతున్న డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుకు అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
పాలనపై చిత్తశుద్ధి ‘ఖాళీ’
జిల్లాలో ఖాళీగా కీలకమైన అధికారుల పోస్టులు సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక జిల్లాగా పేరొందిన పల్నాడు జిల్లాలో పరిపాలన కుంటుపడుతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలలో పరిపాలన పరంగా కీలకమైన పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండడమే అందుకు కారణం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. డీఆర్వో, ఆర్డీఓ, డీఎస్పీ వంటి కీలక పదవులు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జిల పాలన కొనసాగుతోంది. తద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారుల నియామకం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. భర్తీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కలెక్టరేట్లో ముందుకు కదలని ఫైళ్లు... జిల్లా రెవెన్యూ పరిపాలనలో కీలకమై డీఆర్వో పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. డీఆర్వోగా పనిచేస్తున్న మురళిని లంచం తీసుకుంటుండగా కలెక్టర్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు రెండు నెలల కిందట పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆ స్థానంలో ఎవర్ని నియమించకపోవడంతో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి నారదమునికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి. పనుల కోసం అర్జీదారులు, కిందస్థాయి రెవెన్యూ అధికారులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డివిజన్లలోనూ అదే పరిస్థితి.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిధిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సేవలు చేరువ చేయడంలో ఆర్డీఓలది కీలకపాత్ర. నరసరాావుపేట, సత్తెనపల్లి ఆర్డీఓలు హైకోర్టు తీర్పు కారణంగా బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో ఎవర్ని నియమించలేదు. జిల్లా మీదుగా కీలకమైన జాతీయ రహదారులకు భూసేకరణ జరుగుతున్న సమయంలో వీరు లేకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడుతోంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన పల్నాడులో ఎన్న డూ లేనివిధంగా అధికార సంక్షోభం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్డీఓల పర్యవేక్షణ కొరవడంతో క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు పెట్టి వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారు. ఎనిమిది నెలలుగా డీఎస్పీ లేరు.. పల్నాడు జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతూనే ఉంది. గత సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు నరసరావుపేట నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రౌడీ మూకలు దాడులకు తెగబడ్డారు. జిల్లా కేంద్రంలో నిత్యం ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వినుకొండ, నరసరావుపేటలో నడిరోడ్లపై హత్యలు, కిడ్నాపులతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై పాశవికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా జిల్లాలో కీలకమైన పోలీసు అధికారుల పోస్టులు ఇన్చార్జిలతో నడిపిస్తున్నారు. గతేడాది జూలై నెలలో నరసరావుపేట డీఎస్పీగా పనిచేసిన కె.నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవటంతో సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 8 నెలలుగా ఆయన రెండు సబ్ డివిజన్లకు డీఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లాలోనే పెద్దదైన నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 13 పోలీసుస్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఉన్నాయి. ఇక్కడ డీఎస్పీ పోస్టు భర్తీ కాకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. హైకోర్టు తీర్పుతో మూడు గ్రూప్–1 పోస్టులు ఖాళీ... పల్నాడు జిల్లాలో ఇప్పటికే అధికారుల కొరత వేధిస్తుండగా అంతలోనే హైకోర్టు తీర్పుతో మరో మూడు ముఖ్యమైన పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. 2018 గ్రూప్–1 ఉద్యోగాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ బ్యాచ్కు చెందిన వారిని అ ప్రధాన పోస్టులకు బదిలీ చేయమని హైకోర్టు తీర్పునిచ్చింది. 2018 బ్యాచ్కు చెందిన ముగ్గురు అధికారులు జిల్లాలో ఉండగా, వారిలో గురజాల డీఎస్పీ జగదీశ్, నరసరావుపేట ఆర్డీఓ మధులత, సత్తెనపల్లి ఆర్డీఓ రమణకాంత్రెడ్డిలు జిల్లా నుంచి బదిలీ మీద వెళ్లారు. జిల్లాలో ఉన్న నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్లలో డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల్లో సత్వర న్యాయం, విచారణలో జాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ నియామకంలో తీవ్రజాప్యం జరుగుతోంది. కమిషనర్ జస్వంతరావును బదిలీ చేసి మూడు నెలలవుతున్నా ఆయన స్థానంలో ప్రభుత్వం ఎవర్ని నియమించలేదు. ఇన్చార్జి కమిషనర్గా ఎంఈ రవికుమార్ వ్యవహరిస్తున్నారు. ఓ వైపు పాలకవర్గం లేకపోవడంతో స్పెషలాఫీసర్గా నరసరావుపేట ఆర్డీఓ వ్యవహరిస్తుండగా, ఆమె ఇటీవల బదిలీ అవ్వడంతో స్పెషలాఫీసర్ స్థానం సైతం ఖాళీ ఏర్పడింది. స్పెషల్ ఆఫీసర్, కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలపై నిర్ణయాలు తీసుకునే అధికారులు లేక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
అమ్మవారికి రూ.3లక్షల విరాళం
పెనుగంచిప్రోలు: అమ్మవారికి ఆభరణాలు చేయించేందుకు మధ్యవర్తి ద్వారా ఇచ్చిన విరాళం ఎట్టకేలకు ఆలయానికి చేరింది. ఆయా వివరాలను దాతలు మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులుసోమవారం విలేకరులకు వివరించారు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న తిరుపతమ్మవారికి వెండి ఆభరణాలు చేయించేందుకు మొక్కుకున్నారు. ఏడాదిన్నర కిందట రూ.3లక్షలతో మూడు కేజీల వెండితో అమ్మవారికి ఐదు వస్తువులు తయారుచేయించేందుకు హైదరాబాద్కు చెందిన తయారీదారులతో అంచనా వేయించారు. ఈక్రమంలో శ్రీతిరుపతమ్మ ఆలయంలో సత్యనారాయణ అనే ఉద్యోగి ద్వారా అవే వస్తువులు తయారుచేయించేందుకు దాతలు, తెనాలికి చెందిన ఆభరణాల తయారీదారుడు కృష్ణారెడ్డికి రూ.3లక్షలు అందజేశారు. అయితే ఏడాదిన్నరగా ఆయా వస్తువులను అప్పగించలేదు. ఈ విషయంపై తయారీదారుడు కృష్ణారెడ్డిని తొమ్మిదినెలల కిందట దాతలు నిలదీయడంతో ఐదు వెండి వస్తువులకుగాను ఓ కిరీటం అందజేశాడు. ఆ కిరీటాన్ని అమ్మవారికి అలంకరిస్తే సరిపోకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చారు. అప్పట్నుంచి ఆయా వస్తువులను తయారుచేసి ఇవ్వకుండా తయారీదారుడు తమను తిప్పుకుంటున్నారంటూ దాతలు మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు సమస్యను నాలుగురోజుల కిందట గ్రామ పెద్దలు, ఆలయ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో గ్రామపెద్దలు, ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడంతో సదరు తయారీదారుడు కృష్ణారెడ్డి రూ.3లక్షలను దాతలకు పంపించారు. ఈ మేరకు ఆ నగదును మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు సోమవారం ఆలయ ఉత్సవ కమిటీసభ్యులు చుంచు రమేష్బాబు సమక్షంలో ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆలయంలోని అంకమ్మవారి ఉపాలయం గోపురం వెండి తాపడం పనులకు వినియోగించాలని కోరారు. ఏడాదిన్నర తర్వాత ఆలయానికి చేరిన విరాళం -
ఏర్పాట్లు పూర్తి చేశాం
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పది పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, విద్యుత్ సదుపాయం వంటి సదుపాయాలు కల్పిస్తున్నాం. పరీక్ష కేంద్రాలను నో సెల్ఫోన్ జోన్లు గుర్తించాం. ఎవరూ పరీక్ష కేంద్రాలలోకి ఫోన్లు తీసుకవెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పరీక్షలను విజయవంతం చేసేందుకు సహకారం కోరాం. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. –పీవీజే రామారావు, డీఈఓ -
అందుబాటులో టెన్త్ దూరవిద్య హాల్టికెట్లు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూరవిద్య) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష అభ్యర్థుల హాల్టికెట్లు అందుబాటులో ఉన్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు సోమవారం తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్లు, వాట్సాప్ (9552300009), మన మిత్ర ద్వారా పొందవచ్చని వివరించారు. అలాగే దూరవిద్య వెబ్సైట్ httpr://www.apope nrchoo.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్టికెట్లో వివరాలు పరిశీలించి ఏవైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకరావాలని తెలిపారు. అమరావతి: నదిలో స్నానానికని వెళ్లి విద్యార్థి గల్లంతయిన సంఘటన సోమవారం దిడుగులో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని దిడుగు గ్రామానికి చెందిన శీలం నందగోపాల్ మధ్యాహ్న సమయంలో తన స్నేహితులతో కలిసి కృష్ణానదిలోకి స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన ఏడుగురులో శీలం నందగోపాల్ లోతుకు వెళ్లటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సీఐ అచ్చియ్య తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి వరకు ఎంతగా గాలించినా నందగోపాల్ జాడ తెలియలేదు. చీకటి పడి గాలింపు చర్యలు కష్టంగా ఉండటంతో మంగళవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. నందగోపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు నదిఒడ్డున గుండెలవిసేలా విలపించటం గ్రామస్తులను కలచివేసింది. -
పాము కాటుకు గురై వివాహిత మృతి
నకరికల్లు: గుర్తుతెలియని దుండగులు వినాయకస్వామి రాతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మండలంలోని రూపెనగుంట్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. రూపెనగుంట్ల గ్రామం శివారులో పొలాల మధ్యన వినాయకస్వామి ఆలయం ఉంది. కాగా గుర్తుతెలియని దుండగులు రాత్రివేళ విగ్రహాన్ని ఆలయం వెనుకభాగంలోని తీసుకెళ్లి ధ్వంసం చేశారు. విగ్రహం గుర్తించిన ప్రాంతంలో గోతాలు, మంటలు వేసిన ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. దీంతో పురాతన ఆలయం కావడంతో నిధులు నిక్షేపాల కోసం అత్యాశపరులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
బుల్లెట్ బైక్ చోరీ
వెంబడించి పట్టుకున్న యువకులు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరం లాలాపేటలోని బంగారం దుకాణాలలో సోమవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెంట్స్ (బీఐఎస్) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాలాపేటలోని సన గోల్డ్ టెస్టింగ్ దుకాణంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆభరణాల టెస్టింగ్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్మార్క్ను బంగారు ఆభరణాలపై మిషన్ ద్వారా ముద్రిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. బీఐఎస్ అధికారి వివేక్రెడ్డి మాట్లాడుతూ సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో లైసెన్సులు లేకుండా హాల్మార్క్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. షాపులో హాల్ మార్క్ వేసిన నాలుగు ఉంగరాలు, మరికొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లేజర్ మిషన్, కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మీడియాపై దాడి... బీఐఎస్ అధికారులు సన గోల్డ్టెస్టింగ్ దుకాణంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కవరేజ్కు వెళ్లిన మీడియాపై షాపు నిర్వాహకులు దాడి చేశారు. మాషాపులోకి ఎలా వస్తారంటూ దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. దుకాణ షట్టర్లు పగలగొట్టి రూ. 50 వేలు అపహరణ నరసరావుపేట టౌన్: ప్రకాష్నగర్లో వరుసగా ఉన్న నాలుగు దుకాణాల షట్టర్ తాళాలు పగలగొట్టి దుండగులు నగదు అపరించుకు వెళ్లిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి స్కూల్ సమీపంలో వరుసగా ఉన్న నాలుగు దుకాణాలను యజమానులు ఆదివారం రాత్రి యథావిధిగా తాళాలు వేసి వెళ్లారు. సోమవారం ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చి చూడగా మెడికల్ దుకాణంలోని కౌంటర్లో ఉన్న రూ.50వేల నగదు కనిపించలేదు. పక్కనే ఉన్న టైలరింగ్ షాప్లో కొంత నగదు అపరించుకు వెళ్లారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. -
ప్రత్యేక దృష్టి పెట్టండి
అర్జీల పరిష్కారంపై 131 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు కలెక్టర్ కృతికా శుక్లా, రెవెన్యూ క్లినిక్లో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 131 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెనన్స్పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 22 అర్జీలు రాగా అందులో నరసరావుపేట మండలం నుంచి 15, గురజాల నుంచి ఐదు, సత్తెనపల్లి నుంచి రెండు అర్జీలు అందుకున్నారు. డీఆర్ఓ నారదముని, డీపీఓ నాగేశ్వరనాయక్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
మహిళల ఆరోగ్యం, అభ్యుదయంతోనే అభివృద్ధి
నరసరావుపేట: మహిళా ఆరోగ్యం, అభ్యుదయం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఆర్డీఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని పెరేడ్ గ్రౌండ్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర శాసనసభ విప్ జీవీ ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పోలీస్ అధికారి బి.కృష్ణారావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి గురించి తెలియజేస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ను పరిశీలించారు. బ్యాంకు ద్వారా మంజూరు చేసిన ఆటోలను జిల్లా కలెక్టర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీ్త్ర నిధి, మెప్మా గ్రూపులకు రుణ మెగా చెక్కులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు మహిళల ఆర్థిక పురోగతి కోసం ఏర్పాటు చేసిన తరుణంలో ప్రతి ఒక్క మహిళ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా స్థిరపడాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నందున వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటల్ ద్వారా జరిగే అంశాలను తెలుసుకోవాలి అంటే తప్పని సరిగా చదువు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు కొంతమంది మాత్రమే వారి వారి ఆర్థిక పురోగతి గురించి తెలిపారని, రాబోయే మహిళా దినోత్సవం నాటికి వందలాదిమంది ఆర్థిక పురోగతి సాధించాలని కోరారు. కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, పలు విభాగాల మహిళా అధికారులతోపాటు పలు రంగాల్లో విశేష సేవలు అందజేస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు అలరించాయి. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఏపీఎం కమలకుమారి, డీసీ హెచ్ఎస్ ప్రసూన, ఐ అండ్ పీఆర్ డీడీ దీప్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సుమారు 3 వేల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విజయకీల్రాదిపై హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠాపన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం విఘ్న విమోచక హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠను ఘనంగా నిర్వహించామని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ, ప్రథమారాధన, తీర్థ ప్రసాద గోష్టి, విశేష తదియారాధనలతో కార్యక్రమాలు ముగిశాయని తెలిపారు. మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, భక్తు లు పాల్గొని స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్: కాకినాడలో ఈనెల 11వ తేదీన నిర్వహించే వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఏకలవ్య విగ్రహాలకు ఆదివారం ఆయన రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్లతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ గోరెబాబు, ఈపూరి ఆదాం, కట్టెపోగు నాగభూషణం, గొర్నిపూడి శుభాకర్, మాతంగి బాబు, కలకోటి చక్రవర్తి, బుర్రా శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి: పాలనాదక్షుడు కొత్త రఘు రామయ్య ను స్మరించుకుంటూ నూతనోత్తేజంతో ముందుకు వెళదామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణం విజయవాడ రోడ్డులోని కెనాల్ బండ్పై ఏర్పాటు చేసిన ప్రముఖ పార్లమెంటేరియన్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఉదయం మంత్రి మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వార్థం లేని రాజకీయాలు నడిపిన రఘురామయ్య స్మారకార్థం ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కొత్త సుబ్రహ్మణ్యం, కొత్త రమేష్బాబులను అభినందించారు. కార్యక్రమంలో విగ్రహదాతలు, ఎన్నారైలు పరుచూరి మీనాక్షిదేవి, డాక్టర్ సీతారామాంజనేయులు, రఘురామయ్య కుటుంబసభ్యులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు కొత్త హరికుమార్, కొత్త కృష్ణకుమార్, కొత్త శేషుబాబు, బసవయ్య, జెట్టి గుణ తదితరులు పాల్గొన్నారు. తొలుత రఘురామయ్య విగ్రహా నికి పుష్పాంజలి ఘటించారు. హోటల్ గౌతమ్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రఘురామయ్య సంస్మరణ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. -
అందరికీ సాగర్మాత దీవెనలు
విజయపురిసౌత్: భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి సాగర్మాత అని ఖమ్మం పీఠాధిపతులు మహాఘన డాక్టర్ సగిలి ప్రకాష్ ఉద్బోధించారు. రెండో రోజైన ఆదివారం ఆయన సాగరమాత ఆలయంలోని జపమాల క్షేత్రంలో ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో జరిగిన సమష్టి దివ్యబలిపూజలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవ భక్తులంతా సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలన్నారు. సాటివారిని ఆదరించడం, ప్రేమను పంచిపెట్టడం క్రైస్తవ్యంలో ప్రధానమన్నారు. సృష్టికర్త సహితం అమ్మ ద్వారానే ఈ లోకానికి వచ్చాడన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. మరియమాత మన మధ్యలో నిలిచి మనల్ని కాపాడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను ఆచరించాలని సూచించారు. సాగరమాతపై భక్తిభావంతో మెలిగి దైవకృపకు పాత్రులు కావాలని కోరారు. క్రీస్తును నమ్ముకుని సత్ప్రవర్తనతో మెలిగేవారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ● ఉదయం 5 గంటలకు గురుశ్రీ కె.ఎలీషాచే, 6కు గురుశ్రీ బి. మేఘానంద్చే, 7కు గురుశ్రీ రాచకొండ రాజుచే, 8కి గురుశ్రీ గోవిందు బాలస్వామిచే దివ్యబలిపూజ, 9.30 గంటలకు గురుశ్రీ బెన్నీచే భక్తుల ఆహ్వానం, జపమాల, స్తుతి ఆరాధన, వాక్యపరిచర్య, ఉదయం 11.30గంటలకు దివ్యబలిపూజ, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం, 2 గంటలకు వాక్యపరిచర్య, స్వస్థతా ప్రార్థనలు, సాయంత్రం 4 గంటలకు కోలాటం, 5.30 గంటలకు ఖమ్మం పీఠాధిపతులు మహాఘన డాక్టర్ సగిలి ప్రకాష్చే జపమాల క్షేత్రంలో సమష్టి దివ్యబలిపూజ, రాత్రి 7.30గంటలకు కొవ్వుత్తులతో తేరు ప్రదక్షిణ, 8 గంటలకు సాగర్మాత బృందం వారిచే సాగర్మాత మహిమలు బుర్రకఽథ, 9 గంటలకు శిరిగిరిపాడు కళా నాట్య మండలి ప్రతినిధులచే శిలువ ధారి బైబిల్ నాటకం ప్రదర్శించారు. -
కేంద్రానికెళ్లడమే పెద్ద పరీక్ష!
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు వారం రోజులే వ్యవధి ఉంది. పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 27,699 మంది విద్యార్థులకు 149 కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిరునామాలు లేకుండా జారీ హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల విడుదల చేసింది. వాటిపై పరీక్ష కేంద్రం కోడ్ నంబరు, పేరు ముద్రించి వదిలేశారు. ఆ కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో స్పష్టత ఇవ్వలేదు. కేంద్రాలను కనుక్కోవడమే విద్యార్థులకు పెద్ద పరీక్షగా మారింది. ఒకే పేరుతో ఉన్న పాఠశాలల క్యాంపస్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కనిపెట్టడం మరింత ఇబ్బందిగా మారింది. కేంద్రం కోడ్తోపాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలో కొన్ని చోట్ల ప్రాంతాల పేర్లు లేకుండా కేవలం పాఠశాల పేరుతో హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి. ఆ పాఠశాలే లేదు గుంటూరు నగరంలో సెంటర్ కోడ్ 54036తో నారాయణ ఇంగ్లిషు మీడియం స్కూల్ పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేశారు. సంబంధిత కేంద్రంలో పరీక్ష రాసేందుకు వివిధ పాఠశాలలకు చెందిన 170 మంది విద్యార్థులను కేటాయించారు. బృందావన్ గార్డెన్స్ 4వ లైను చిరునామాతో జారీ చేసిన హాల్ టిక్కెట్లు ఆధారంగా అక్కడకు వెళ్లిన విద్యార్థులు అవాక్కయ్యారు. నారాయణ స్కూల్ బదులుగా ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల ఉంది. నారాయణ స్కూల్ ఇక్కడి నుంచి పాఠశాలను తరలించి ఏళ్లు గడుస్తున్నా ఏటా ఇదే పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేస్తుండటం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా నిలుస్తోంది. గుంటూరులో సెంటర్ కోడ్: 54002, 54003తో భాష్యం హైస్కూల్ చంద్రమౌళీనగర్ పేరుతో హాల్ టికెట్లు జారీ చేశారు. ఒకే పేరుతో రెండు కేంద్రాలు ఉండటంతో వాటిని తె లుసుకోవడం ఇబ్బందిగా మారింది. చంద్రమౌళీనగర్ 3వ లైను అని ముద్రించడంతోపాటు ఏ, బీ సెంటర్లు అని పేర్కొనాల్సి ఉంది. జీకేఆర్ హై స్కూల్ పరీక్ష కేంద్రం చిరునామా హాల్టిక్కెట్లపై ముద్రించలేదు. ఆ పేరుతో ఏటీ అగ్రహారం, పట్టాభిపురంలో వేర్వేరుగా క్యాంపస్లు ఉన్నా యి. ‘సెంటర్ కోడ్ 54019, ఎస్ఎస్ఎన్వో హైస్కూల్, బ్రాడీపేట’ పేరుతో జారీ చేసిన హాల్ టకెట్లపై చిరునామా అస్పష్టంగా ఉంది. ’శ్రీశారదానికేతన్ ఓరియెంటల్ హైస్కూల్, బ్రాడీపేట 2/14’గా పేర్కొనాలి. సెంటర్ కోడ్ 54046తో జారీచేసిన హాల్ టికెట్పై హెచ్సీహెచ్ఎస్, గుంటూరు పేరుతో ముద్రించిన కేంద్రం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిని మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ’సంటర్ కోడ్: 54047, కేఎస్సార్ మున్సిపల్ హైస్కూల్’ పేరుతో జారీ చేసిన హాల్ టిక్కెట్ చిరునామా కేవీపీ కాలనీగా మార్చుకోవాలి. -
ప్రకృతి దోబూచులాట...
యడ్లపాడు: ప్రకృతి తన పరదాలను వింతగా మార్చుకుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో కాలాలు దోబూచులాడుతున్నాయి. పగటి వేళ భానుడు భగభగలాడుతూ సెగలు గక్కుతుంటే, రాత్రి కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ‘చలిపులి’ పంజా విసురుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పంటపొలాల పరిసరాల్లో తెల్లవారుజామున దృశ్యాలు కాశ్మీరాన్ని తలపిస్తున్నాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మంచు తెరల వల్ల జాతీయ రహదారిపై ప్రయాణం సాహసంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనం ఆనవాలు కూడా తెలియని రీతిలో మంచు ముసుగు పరుచుకోవడంతో వాహనదారులు దీపాలు వెలిగించుకుని అతి జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు మంచు కురుస్తున్న వేళ ప్రకృతి సోయగం కనువిందు చేస్తున్నా, మరోవైపు వాహనదారులకు మాత్రం అది ఒక సవాలుగా మారింది. ఎండలు మండుతున్నా తగ్గని ఈ పొగమంచు తీవ్రత, నియోజకవర్గ ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పగలు సెగలు.. రాత్రి హిమపాతం.. వెరసి చిలకలూరిపేట నియోజకవర్గంపై వాతావరణం ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రకృతి కావ్యంలా ఆవిష్కృతం అవుతోంది. -
పల్నాడు
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026భక్తి గుడారం.. స్తుతి నైవేద్యం అట్టహాసంగా ముగిసిన 49వ గుడారాల పండుగ దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,316 క్యూసెక్కులు వదిలినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కొమ్మూరు కాలువకు 733 క్యూసెక్కులు వదిలారు.అమరావతి: మంచి గంధం చెక్కకు ఎన్ని కోతలు చేస్తే, అంత సుగంధం వెదజల్లినట్లు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్రైస్తవ్యంలో ఉన్న కీస్తు విశ్వాసులు ప్రపంచాన్ని, దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటారని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం అన్నారు. అమరావతి మండలం లేమల్లె గ్రామంలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 49వ గుడారాల పండుగ చివరి రోజైన ఆదివారం పగటి పూట ముగింపు ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గుడారాల పండుగలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట దేవుడు నడిచి వారిపై తన ఆశీర్వాదాలను విస్తారంగా కురిపిస్తాడన్నారు. నాలుగు రోజులపాటు చేసిన ప్రార్థనలకు అనుగుణంగా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని తోడు మనతో ఉండాలన్నారు. పోగొట్టుకున్న వాటిన్నింటినీ దేవుని ఆశీర్వాదంతో రెట్టింపుగా పొందుతామన్నారు. అందరికీ కృతజ్ఞతలు.. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులు పూర్తిస్థాయిలో వసతులు కల్పించడంలో సహకరించిన వారందరికీ పాస్టర్ అబ్రహాం కృతజ్ఞతలు తెలిపారు. తొలి ఏడాది అనుభవాలతో ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది 50వ గుడారాల పండుగ మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ గుడారాల పండుగ ఎంతో ఘనంగా జరగటానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బంది ప్రతి ఒక్కరికి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలుతున్నామని పేర్కొన్నారు. నిరంతర స్తుతి అవసరం.. తొలుత చివరి రోజు సభలకు పాస్టర్ జేమ్స్ ప్రారంభ ప్రార్థన నిర్వహించారు. అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ ప్రసంగిస్తూ ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండియున్నదని తెలిపారు. మానవుడు దేవుడిని ఎంతగా ప్రార్థిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వాదాలు ఇస్తాడన్నారు. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఆయన కృప ఉన్నప్పటికీ ఎవరైతే స్తుతిస్తూ తమ హృదయాలను బలిపీఠంగా చేస్తారో వారిపై ఆయన ప్రత్యేక కృప కనబరుస్తాడన్నారు. లోకమంత దేవుని కృపతో నిండియున్నప్పటికీ దానిని అందిపుచ్చుకోవటానికి ప్రతి ఒక్కరూ దేవుడిని నిరంతరం స్తుతించాలన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. హోసన్నా మినిస్ట్రీస్ దైవ జనులు రమేష్, ఫ్రెడ్డీ పాల్ దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రార్థనలలో ఆదివారం కావటంతో దాదాపు 20 లక్షల మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ప్రసంగిస్తున్న దైవజనులు చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ, హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం -
వైభవంగా నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ల
తరలివచ్చిన భక్తులు దుర్గి: పల్నాట ప్రసిద్ధిగాంచిన నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి 79వ తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు మొక్కుబడులు చెల్లించుకొని, పొంగళ్లు పొంగించారు. ఆలయ అధికారులు భక్తులకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. పలువురు దాతలు మజ్జిగ, అన్నదానాన్ని, పులిహోర పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి పటం, నైవేద్యం అందజేశారు. అడిగొప్పల, ఓబులేశునిపల్లె, నరమాలపాడు, దుర్గి నుంచి 25కుపైగా కుంకుమ బండ్లు సాయంత్రం నుంచి ఆలయానికి చేరుకున్నాయి. ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. చైర్మన్ యాగంటి వెంకటేశ్వర్లు, సహాయకార్యదర్శి ఆదిశేషు నాయుడు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వాధికారులు వారి విధులను సక్రమంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించారు. -
ఘనంగా సాగర్మాత మహోత్సవాలు ప్రారంభం
విజయపురి సౌత్: శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, వాత్సల్యాలను భక్తులకు ప్రసాదించాలని నల్గొండ పీఠాధిపతులు మహాఘన డాక్టర్ కరణం ధమన్కుమార్ ప్రార్థిచారు. మాచర్ల మండలం విజయపురిసౌత్లో శుక్రవారం ప్రారంభమైన సాగర్మాత మహోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సమష్టి దివ్యబలిపూజ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పరిశుద్ధాత్మ అయిన ఏసుక్రీస్తుకు జన్మను ప్రసాదించిన సాగర్మాత(మరియమ్మ) ఆశీస్సులు అందరిపైనా ఉంటాయని తెలిపారు. మహోత్సవాల సందర్భంగా ఆలయాలను, జపమాల క్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం సాగర్మాత విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్, గురుశ్రీ కాకుమాను కిరణ్సాగర్, గురుశ్రీ రాజవరపు అనిల్కుమార్లచే దివ్యబలిపూజ, గురుశ్రీ మధు జపమాల, స్తుతి ఆరాధన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, గురుశ్రీ మధుచే వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, సాయంత్రం మహా ఘన డాక్టర్ కరణం ధమన్కుమార్చే జపమాల, నవదిన జపములు, దివ్యబలిపూజ, రాత్రి కొవ్వొత్తులతో తేరు ప్రదక్షిణ, సాగర్మాత కళాకారుల బృందంచే యేసేపు చరిత్ర బుర్రకథ, ఽభక్త యోబు బైబిల్ నాటక ప్రదర్శన నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో విజయపురిసౌత్ కళకళలాడింది. స్థానిక లాంచీస్టేషన్ సెంటర్ నుంచి సాగర్మాత దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా తినుబండారాల విక్రయ కేంద్రాలు, ఫ్యాన్సీషాపులు, వివిధ రకాలైన ఆటబొమ్మల దుకాణాలు వెలిశాయి. సాగర్మాత ప్రాంగణంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, రంగులరాట్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
రాష్ట్రంలో జంగిల్ రాజ్.. గురజాలలో గూండారాజ్
పిడుగురాళ్ల: శాంతిభద్రతలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడిన వీరారెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన బతుకు తాను బతుకుతున్న వీరారెడ్డిని నిన్న సాయంత్రం మాట్లాడాలని తెలుగు దేశం పార్టీ నాయకులు పిలిచి అతి దుర్మార్గంగా కొట్టటం జరిగిందన్నారు. అతణ్ణి హత్య చేసేందుకు యత్నించగా గాయాలతో బయటపడ్డాడన్నారు. -
మహిళల కోసం వన్ స్టాప్ టూ సెంటర్
మాచర్ల: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు సేవలందించేందుకు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వన్ స్టాప్ టూ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఎం.ఉమాదేవి తెలిపారు. మాచర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ టూ సెంటర్ పరిశీలించేందుకు శనివారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఇతర అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇంటి నుంచి తప్పిపోయిన బాలికలు, ఆపదలో ఉన్న మహిళలు, కుటుంబ కలహాలతో బయటకు వచ్చిన వారికి, ప్రేమ వివాహాలు చేసుకుని విడిపోయన మహిళలకు, రన్వే బాలికలకు వైద్య, ఆర్ధిక సహాయం, షెల్టర్ ఇచ్చేందుకు వన్ స్టాప్ సెంటర్ను మాచర్లలో ఆదివారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం వర్చువల్ ద్వారా సెంటర్ను ప్రారంభిస్తారన్నారు. ఒంటరి మహిళలు, ఇబ్బందులకు గురైన మహిళలకు ఐదురోజులపాటు ఈ సెంటర్లో వసతి కల్పించడంతోపాటు, భోజనం, వైద్య సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. కుటుంబ కలహాలు ఉన్నవారికి కౌన్సెలింగ్ చేయడం జరుగుతోందన్నారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతోందన్నారు. మహిళల రక్షణ కోసం ఈ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఏఎన్యూ (పెదకాకాని): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాట్లను శనివారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చును. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మార్చి 9, 10 తేదీలలో బాలికలకు, మార్చి 12,13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ పురుషు అభ్యర్థులకు, మార్చి 15,16 తేదీలలో తెలంగాణ పురుషు అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళ అభ్యర్థులు మార్చి 9వ తేదీన, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి 10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలానే ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. -
విశ్వాసులకు తప్పక విజయం
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తు మనకు అప్పగించిన పనిని పూర్తిచేస్తే విశ్వాసులను విజయం తప్పక వరిస్తుందని హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రమేష్ అన్నారు. లేమల్లె హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 49వ గుడారాల పండుగ మూడవరోజు శనివారం రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాదిమంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మనం సమాజాన్ని ప్రభావితం చేయాలంటే క్రీస్తును స్తుతించటమే మార్గమన్నారు. తొలుత హోసన్నామినిస్ట్రీస్ అధ్యక్షుడు ఫాస్టర్ అబ్రహాం, చీఫ్పాస్టర్ జాన్వెస్లీ, రమేష్లు స్తుతి గీతాలాపన చేశారు. రెండవ వర్తమానంలో ఒంగోలుకు చెందిన పాస్టర్ రాజు మాట్లాడుతూ దేవుడిని సంపూర్ణసిద్ధితో ఆరాధించాలన్నారు. ఏసుక్రీస్తు వాక్యాలను హృదయాలలో స్థిరపరుచుకుని నిరంతరం ధ్యానించాలన్నారు. పాస్టర్ల బృందం, సిస్టర్ల బృందం స్తుతి గీతాలు అలపించారు. హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న బైబిల్ సెమినార్లో 2025లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ ప్రార్థనలకు దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది హోసన్నా ఆరాధికులు తరలివచ్చారు. ప్రసంగిస్తున్న దైవజనులు పాస్టర్ రాజు ప్రసంగిస్తున్న దైవజనులు పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రమేష్ -
మత్తు పదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
చీరాల: యువత భవిష్యత్ను చిదిమేస్తున్న గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చీరాల ఒన్టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు అన్నారు. జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసులు శనివారం మెగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో చీరాల ఒన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజిలీపేట, హరిప్రసాద్ నగర్, దండుబాడు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో భాగంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 24 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోతో సహా మొత్తం 27 వాహనాలను సీజ్ చేశారు. గంజాయిని కూకటి వేళ్లతో పెకలించి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని చీరాల ఒన్టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు అన్నారు. -
మహిళల కోసం పనిచేయటం సంతోషం
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఏర్పడి నాలుగేళ్లవుతుంది. తొలిసారిగా మహిళా మణులు పల్నాడు జిల్లాను పాలిస్తున్నారు. కలెక్టర్గా డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన సింహ జిల్లా నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. జిల్లాకు నాల్గవ కలెక్టర్గా డాక్టర్ కృతికా శుక్లా నియామకం జరిగి నాలుగు నెలలవుతుంది. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలోని పలు విభాగాల బాధ్యులుగా ఎక్కువ మంది మహిళలే నియమించబడ్డారు. పౌరసంబంధాల శాఖ డీడీగా దీప్తి మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. జిల్లా ఫారెస్టు ఆఫీసర్గా కృష్ణప్రియ, సోషల్ వెల్ఫేర్ డీడీగా రాజ్యలక్ష్మి, డీఆర్డీఏ పీడీగా ఝాన్సీరాణి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల కో ఆర్డినేటర్గా డాక్టర్ ప్రసూన, సర్వే ఏడీగా భానూకీర్తి, ఆర్టీసీ ప్రజా జిల్లా రవాణా అధికారిగా టి.అజితకుమారి, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా గీతారాణి, జిల్లా లైబ్రరియన్గా రాధ, లీగల్ అడ్వయిజర్గా న్యాయవాది అమూల్య, డ్రగ్ ఇన్స్పెక్టర్గా మంగమ్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్గా రమాదేవి వ్యవహరిస్తున్నారు. తమ విధుల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఒక మహిళగా తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ విభాగాల అధ్యక్షులుగా కూడా సమర్థంగా కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి అధికారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... సంజనా సింహ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ ఒక మహిళగా మహిళాభివృద్ధి కోసం పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో 36 వేల గ్రూపుల క్రింద 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక వ్యాపారిని తయారు చేయాలనే ఆదేశంతో ప్రతి వారికి అవసరాన్ని బట్టి రుణాలు ఇచ్చాం. ఎదో ఒక చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుచేసుకొని లాభం గడించే విధంగా మా వంతు కృషిచేస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి 50 వేల మందిని చిరు వ్యాపారులుగా ప్రోత్సహించటమే లక్ష్యం. ఆరోగ్యం, పోషణ కింద కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుచేసి వాటిలో పండే కూరగాయలనే కుటుంబ అవసరాలకు వినియోగించుకునేవిధంగా ప్రోత్సహిస్తున్నాం. –ఝాన్సీరాణి, డీఆర్డీఏ పీడీ -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చిలకలూరిపేట: త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు నిర్మాణ పనుల్లో సిబ్బంది సమన్వయలోపం కారణంగా భారీ గడ్డర్ నేలకొరిగింది. చీరాల వాడరేవు నుంచి పల్నాడు జిల్లా నకరికల్లు వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విదితమే. వాడరేవు నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి వరకు 47 కిలో మీటర్ల మేర ఒక నిర్మాణ సంస్థ, ఇక్కడి నుంచి నకిరికల్లు వరకు మరో నిర్మాణ సంస్థ కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో వాడరేవు నుంచి చిలకలూరిపేటలోని బొప్పూడి వరకు రోడ్డు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో ఎన్హెచ్16 పై ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయి. రోడ్డు వేసేందుకు అవసరమైన ఫిల్లర్లు, వాటిపై పీయర్క్యాప్ల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫిల్లర్లపై ఐరన్ రాడ్స్, సిమెంట్తో నిర్మాణం చేసిన గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. శనివారం రెండు భారీ క్రేన్ల సహాయంతో 43 మీటర్ల పొడవైన గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో క్రేన్కు అమర్చిన ఇరన్రోప్లు జారడంతో వందల టన్నుల బరువైన సిమెంట్, ఐరన్తో నిర్మించిన గడ్డర్ నేలకొరిగింది. భారీ శబ్దంతో గడ్డర్ నేలకొరగడంతో నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వాహనదారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. పిల్లర్లపై గడ్డర్ను అమర్చేందుకు అప్పటికే ట్రాఫిక్ను మళ్లించిన నేపథ్యంలో పెనుముప్పు తప్పినట్లైంది. కూలిన గడ్డర్ జేసీబీకు సంబంధించిన ట్రాలీపై పడి పోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గడ్డర్ శిథిలాలను గ్యాస్ కట్టర్లు, క్రేన్ల సహాయంతో రోడ్డు కాంట్రాక్టు సంస్థకు చెందిన సిబ్బంది తొలగిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నేలకొరిగిన భారీ గడ్డర్ -
దరఖాస్తుల ఆహ్వానం
జెట్టిపాలెం(రెంటచింతల): జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్)లో 6వ తరగతి ప్రవేశానికి ఽ2026–27 విద్యాసంవత్సరానికి మార్చి 31 వ తేదీలోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. పాపయ్య కోరారు. శనివారం ఆయన పాఠశాలలో మాట్లాడుతూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారన్నారు. వివరాలకు ఫోన్ నంబరు 91829 58496 సంప్రధించాలని ఆయన కోరారు. భర్తతో కలిసి తల్లి ఇల్లు ఫోర్జరీ పత్రాలతో స్వాధీనం మంగళగిరి టౌన్: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మచ్చలా నిలుస్తున్నాయి. చివరకు కని, పెంచి ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తోంది. వృద్ధాప్యంలో కాస్తంత ఆదరవుగా ఉండి, ఆశ్రయం ఇవ్వాల్సిన కుమార్తె తన భర్తతో కలిసి ఫోర్జరీ సంతకాలతో కన్నతల్లిని మోసం చేసి ఇంటిని తనపేరిట రాయించుకుని ఆమెను ఇంటి నుంచి గెంటేసిన హృదయ విదారక సంఘటన మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం జరిగింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కూతుళ్లు. కొన్ని నెలల క్రితం చిన్న కూతురు, అల్లుడు ఆదిలక్ష్మి ఇంటికి వచ్చి, ఆమెతోపాటు ఉంటూ ఆదిలక్ష్మి ఉంటున్న ఇంటిని ఫోర్జరీ పత్రాలతో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. శనివారం వృద్ధురాలిని ఇంట్లో నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడంతో మంగళగిరి పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమార్తెను, అల్లుడిని స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు. -
దయతో వైద్య సేవలందించాలి
గుంటూరు మెడికల్: వైద్యులు దయతో రోగులకు వైద్య సేవలందించాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఎంబీబీఎస్ 2020 బ్యాచ్ వైద్య విద్యార్థుల గ్రాడ్యూయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ● వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య వృత్తి చాలా ఉన్నతమైందని, సేవ చేసే అవకాశం వైద్యులకే దక్కుతోందన్నారు. మంచిగా సేవ చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశోధనల వైపు దృష్టి సారించాలన్నారు. గతేడాది గుంటూరు రూరల్ మండలంలో మెలోడేస్ మరణాలు సంభవించాయని, మంత్రి పెమ్మసాని చెప్పారు. అలాంటి మరణాలను కేస్ స్టడీగా తీసుకుని పరిశోధనలు చేయవచ్చన్నారు. ● వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి మాట్లాడుతూ డాక్టర్ పట్టా పొందడం విజయం కాదని, ఇది విజయానికి ప్రారంభమని చెప్పారు. వైద్యులుగా వృత్తిలో రాణించాలంటే విలువలు పాటించాలని, నిజాయితీగా, హుందాగా ఉండాలని, క్యారెక్టర్ పెంపొందించుకోవాలన్నారు. డాలర్స్ కోసం పరుగులు తీయవద్దని, కుటుంబ సభ్యుల మాదిరిగా రోగులను ఆదరించాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్శ్రీధర్, జింకానా కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మధుర క్షణాలతో కళ్లు మెరిశాయి ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా చేతికొస్తుందన్న ఆనందంతో పలువురు వైద్య విద్యార్థులు గ్రాడ్యూయేషన్ డే వేడుకలకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. డాక్టర్ డిగ్రీ పట్టాలు చేతికి అందిస్తున్న తరుణంలో కుటుంబ సభ్యులు, బంధువుల కళ్లు ఆనంద భాష్పాలతో మెరిశాయి. డాక్టర్ పట్టా తీసుకునే మధుర సన్నివేశాలను వెయ్యి కళ్లతో చిత్రీకరించేందుకు పలువురు కెమెరాలు తీసుకుని పోటీ పడ్డారు. కళాశాల అంతా గ్రాడ్యుయేషన్ డే కోర్టులు ధరించి కలియతిరిగి వైద్య విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన కళాశాల బోధనా సిబ్బందితో జీవితాంతం గుర్తుండేలా డిగ్రీ పట్టాలు అందుకున్న 250 మంది వైద్య విద్యార్థులు గ్రూఫ్ ఫొటోలు దిగారు. పలువురు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఆడిటోరియం అంతా రంగుల హల్లులతో అదిరిపోయింది. వైద్య విద్యార్థుల డిగ్రీ పట్టా తీసుకునే సమయం పండుగలా మారాయి. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశోధనల వైపు దృష్టి సారించాలి ఘనంగా గుంటూరు వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యూయేషన్ డే వేడుకలు -
సమాజాభివృద్ధిలో కీలకంగా మారిన మహిళలు
గుంటూరుఎడ్యుకేషన్: సమాజాభివృద్ధిలో మహిళలు కీలకంగా మారారని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటం గర్వకారణమని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళ్ళగలుగుతున్నారంటే అది వారికున్న ఆత్మ విశ్వాసమన్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో మహిళలు ముందుకు సాగాలని సూచించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగాయని తెలిపారు. మైహోం గ్రూప్స్ అధినేత శ్రీమాన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ఆంజనేయుని అనుగ్రహాన్ని, శ్రీస్వామి వారి మంగళశాసనాలని పొందారని పేర్కొన్నారు. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, అఖండ హరేరామనామ సంకీర్తన, హనుమద్ పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మంగళగిరి టౌన్: మంగ ళాద్రిలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు వటపత్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా, అలంకార ఆస్థాన కై ంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన మేళ్లచెరువు సీతామహాలక్ష్మి వ్యవహరించారు. గుంటూరుఎడ్యుకేషన్: జోన్–3 పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11 గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్ సైట్లో ఉంచినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. హెచ్టీటీపీఎస్://డీఈఓగుంటూరుబ్లాగ్స్పాట్.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ప్రకాశంస్కూల్ఈడీయూ.కామ్, హెచ్టీటీపీఎస్://డీఈఓనెల్లూరు.50వెబ్స్.కామ్ లో ఉంచిన సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో ఈనెల 13లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. -
మహంకాళి సేవలో జిల్లా కలెక్టర్
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి 51వ తిరునాళ్ల మహోత్సవాలు రెండవ రోజుకు చేరాయి. శనివారం భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పొంగళ్లు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ ఈవో మాధవిదేవి స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి పొంగళ్లు పొంగించారు. ఆలయ అభివృద్ధి, తిరునాళ్ల ఏర్పాట్లుపై ఆలయ అధికారులతో సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం జాగరణ ఉంటుందని ఈవో తెలిపారు. ‘అగ్నివీర్ ర్యాలీ’ని సద్వినియోగం చేసుకోండి నరసరావుపేట: భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లాలోని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల తొమ్మిదవ తేదీన గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఎటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అభ్యర్థులు నేరుగా రావచ్చునని తెలిపారు. -
సన్మార్గదర్శిని దివ్యఖురాన్
చిలకలూరిపేట: ప్రపంచంలోని ముస్లింలందరికీ నెలరోజుల పండుగ రంజాన్. దివ్యఖురాన్ దైవం నుంచి భువికి అవతరించిన మాసం కూడా ఇదే. ఈ పవిత్ర గ్రంథం వెలుగులో ఆత్మప్రక్షాళన చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. సాఫల్య జీవితానికి సోపానం ఈ దివ్యగ్రంథం. పవిత్ర ఖురాన్ అల్లా నుంచి అవతరించి భూమిపైకి వచ్చిన గ్రంథం కావటంతో దీనికి దివ్యఖురాన్ అంటారని మౌల్వీలు పేర్కొంటున్నారు. మానవుడు ఉన్నత జీవితం గడిపేందుకు అవసరమైన అన్ని సూచనలు, నియమాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రాపంచిక విషయాల్లో ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులకై నా ఈ గ్రంథంలో పరిష్కార మార్గం ఉంటుంది. మానవ సంబంధాలు, శాంతియుత జీవనం, అహింస, విశ్వసనీయత, సౌభ్రాతృత్వం, ఎవరితో ఎలా మసలుకోవాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, నిత్య జీవితం ఎలా గడపాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా నడుచుకోవాలి, సాటివారితో ఎలా మసలుకోవాలి వంటి ఇహలోక అంశాలతో పాటు పరలోక సౌఖ్యం పొందటానికి అవసరమైన మూలసూత్రాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రవక్త అనుసరించిన గ్రంథం పవిత్ర ఖురాన్లో సూచించిన మార్గాన్ని మహమ్మద్ ప్రవక్త అనుసరించారు. ఈ లోకానికి ఆచరించి చూపారు. దివ్యఖురాన్ రంజాన్ మాసంలో అవతరించటంతో ముస్లింలు ఈ మాసంలో ఖురాన్ను పఠిస్తూ దాని పవిత్రతను చాటుతుంటారు. ఖురాన్లో 114 సూరాలు, 6,666 ఆయాత్లు, 540 రుకూలు ఉంటాయి. సంపూర్ణ గ్రంథాన్ని 30 భాగాలుగా విభజించారు. వాటిని పారాలుగా పేర్కొంటారు. రంజాన్ మాసంలో తరావి నమాజు కింద పూర్తి పఠనం గావిస్తారు. అవతరించిన నాటి నుంచి చిన్న మార్పు కూడా లేని గ్రంఽథంగా ప్రాచుర్యం పొందింది. మంచి మార్గంలో నడిపేలా... దైవం దివ్య ఖురాన్ను ప్రపంచ మానవాళికి మహిమాన్విత వరంగా ప్రసాదించారు. అజ్ఞానపు కారు చీకట్ల నుంచి విజ్ఞానమనే వెలుగు బాటను చూపిన ఈ దివ్య గ్రంథం మానవుడి అవివేకాన్ని తుడిచిపెట్టేందుకు ఉత్తమమైన మార్గంగా నిలుస్తోంది. మామూలు వ్యక్తిని కూడా మహోన్నతునిగా మార్చేందుకు దోహదపడుతుంది. ఈ దివ్యగ్రంథంలో మొత్తం 30 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ‘ఎఖ్రా’ (విద్య) సంబంధించినది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ చదువు తప్పని సరి అన్న సూచన అందుతోంది. చదువు విలువను ఈ భాగం ద్వారా తెలుసుకోవచ్చు. మనిషిని ఉత్తముడిగా మార్చేందుకు ఎన్నో సూచనలు ఉన్నాయి. రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించాల్సిన విధుల గురించి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ మాసంలో ధనికులు జకాత్, ఫిత్రాలను కచ్చితంగా అందజేస్తే రంజాన్ ఈద్ ప్రార్థన సమయానికి పేదలనే వారు ఉండరని ఈ గ్రంథం వివరిస్తుంది. మానవుడిలోని మద్యం, వ్యభిచారం, పాపం, ద్రోహం, హింస, చెడుగా మాట్లాడటం, కించపరచాలనుకోవటం వంటి విషయాలను ఈ గ్రంథం తీవ్రంగా నిరసిస్తుంది. నైతిక విలువలతో జీవించాలని ప్రబోధిస్తుంది. ముఖ్యంగా సీ్త్రలను బానిసలుగా చూడకూడదని, పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలని, వాటి రక్షణ బాధ్యత పురుషుడే వహించాలని సూచిస్తుంది. అనాథలు, వితంతువులకు సహాయకారులుగా ఉండాలని చెబుతుంది. ఖురాన్ గ్రంథం ఎంత పవిత్రమైనదో అంత శాసీ్త్రయమైనది కూడా అని ప్రపంచ మేధావులు కొనియాడుతున్నారు. ప్రకృతిలో చెట్టు ఎంత విలువైనదో ఈ గ్రంథంలో కొన్ని చోట్ల ప్రస్తావించారు. ఖురాన్ను చదివి దానిని అమలు పరిచేవారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మౌల్వీలు చెబుతారు. పఠించే వారికి ప్రశాంతతోపాటు మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసుల నమ్మకం. దివ్యఖురాన్ సాధారణ గ్రంథం కాదు. ఇది దైవం మనకు ప్రసాదించిన దివ్యమైన కాంతిపుంజం. దాని పవిత్రతను తెలుసుకొని ఆచరించి ఆరాధిస్తే దైవం ద్వారా మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో పఠించటం ముఖ్యమే. అయినా జీవితాంతం క్రమం తప్పకుండా పఠించటం ముక్తిదాయకం. ఖురాన్ను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పేవారు అందరికంటే ఉన్నతులు. – మౌలానా మొహమ్మద్ అబ్బాస్ఖాన్ నద్వి, ఇస్లామిక్ పండితుడు -
బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
నాదెండ్ల: డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ పి. సుభాష్ చెప్పారు. గణపవరం బొడ్డురాయిసెంటర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. బ్యాంక్ జీఎం (విజిలెన్స్) హరీష్బేతా, జీఎం (స్ట్రాటజీ) రాజశేఖరమ్ రిబ్బన్ కట్ చేసి బ్యాంకు శాఖను ప్రారంభించారు. స్ట్రాంగ్ రూమ్ను గ్రామ మాజీ సర్పంచ్ కెల్లంపల్లి సుందరరావు, లాకర్ రూమ్లను ఉపాధ్యాయురాలు కట్టా రమాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆర్ఎం సుభాష్ మాట్లాడుతూ తమ బ్యాంకు వ్యాపార, వ్యవసాయ రుణాలతోపాటు విద్య, తనఖా, కారు, గృహ, సోలార్, ముద్ర తదితర రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కన్నా తమ బ్యాంకు అరశాతం అధిక వడ్డీ అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,351 శాఖల్లో రూ.1.33 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ బ్యాంకు ఖాతాదారుడేనని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలు తమ బ్యాంకు లక్షల మందికి దరి చేరుస్తోందన్నారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ వి. సురేష్, భవన యజమాని నన్నపనేని శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని హ్యాపీ హోమ్స్ సమీపంలోని పొలాల్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం పొలాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిలకలూరిపేట పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని, కొంతకాలంగా ఈ ప్రాంతంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు గుర్తించారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు సీఐ పి. రమేష్ తెలిపారు. నరసరావుపేట టౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వలంటీర్లగా వ్యవహరించటానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని 13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి ఆర్. శరత్బాబు శుక్రవారం తెలిపారు. సామాన్య ప్రజలకు, న్యాయసేవల సంస్థలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించే వారధిగా వలంటీర్లు ఉంటారన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలు, న్యాయ వ్యవస్థపై శిక్షణ పొంది అవగాహన కల్పిస్తారన్నారు. ఎటువంటి ఆదాయం ఆశించకుండా సేవా దృక్పథంతో పనిచేసేవారు ముందుకు రావాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజెన్లు, అంగన్వాడీ కార్యకర్తలు, న్యాయ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు స్థానిక మండల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2025 అక్టోబరు, నవంబరు నెలలో జరిగిన బీఏ, బీబీఏ, ఎల్ఎల్బీ, ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. ఎంబీఏ(హాస్పటల్ మేనేజ్మెంట్) మూడో సెమిస్టర్కు 28 మంది హాజరు కాగా 23 మంది, ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) మూడో సెమిస్టర్కు 52 మంది హాజరు కాగా 50 మంది ఉత్తీర్ణులయ్యారు. బీఏ, బీబీఏ, ఎల్ఎల్బీ రెండో సెమిస్టర్కు 56 మంది హాజరు కాగా వారిలో 51 మంది, బీఎ, బీబీఏ, ఎల్ఎల్బీ నాల్గవ సెమిస్టర్కు 47 మంది హాజరు కాగా వారిలో 44 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు ఈనెల 16 చివరి తేదీ కాగా రీవాల్యుయేషన్ దరఖాస్తులను 17వ తేదీలోగా పీజీ కో ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రీవాల్యుయేషన్ ఫీజు రూ.1860 కాగా పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను చూడాలని ఆలపాటి సూచించారు. తెనాలి రూరల్: గంజాయి కలిగి ఉన్న కేసులో నిందితుడికి జైలు శిక్ష , జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ... ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్ డ్రైవ్లో భాగంగా 2022 ఏప్రిల్ 24న అప్పటి సెబ్ ఇన్స్పెక్టర్ ఎ. వెంకటాచలం మండలంలోని సోమసుందరపాలెం ఆటోనగర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ టింబర్ డిపో వద్ద పుల్లల వ్యాపారం చేసే కురగంటి ప్రసాద్ వద్ద 120 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసు శుక్రవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన తెనాలి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎ. పవన్కుమార్... నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్కుమార్ వాదించారు. గుంటూరు రూరల్: బ్రెయిన్ స్ట్రోక్తో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగళాయపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... వెంగళాయపాలెం గ్రామానికి చెందిన మన్నవ మనీష (30) చైన్నెలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. గత కొంత కాలంగా వర్క్ ఫ్రం హోం తీసుకుని ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి వద్ద విధులు నిర్వహిస్తుండగా తలనొప్పిగా ఉండటంతో కొంతసేపు నిద్రించింది. ఎంత సేపటికీ లేవకపోవటంతో తల్లిదండ్రులు చూడగా.. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మనీషాను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిందని తెలిపారు. సంఘటనపై మృతురాలి తండ్రి పోలయ్య ఫిర్యాదు మేరకు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


