Palnadu District News
-
బాల మేధావి అభయ్
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదవుతున్న కడియాల అభయ్ తన అసాధార ణ జ్ఞాపకశక్తితో ఇండి యా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ తేజస్విని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభయ్ కేవలం 5 నిమిషాలలో ప్రపంచ పటం నుంచి 90 దేశాల పేర్లు, వాటి రాజధానులను అనర్గళంగా చెప్పి ఇండియా బుక్లో స్థానం సాధించాడని వివరించారు. వైద్యులు డాక్టర్ గొట్టిపాటి లలిత్సాగర్, డాక్టర్ లక్ష్మి తమ కుమారుడు అభయ్ ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్.ప్రకాశరావు, డైరెక్టర్ ఎన్.సబిత, అభినందనలు తెలిపారు. -
అవినీతి క్యాన్సర్ను నయం చేస్తారా?
క్యాన్సర్ కణం కంటికి కనిపించకుండా శరీరంలో దాగి ఉండి ట్యూమర్స్లాగా మారి కొన్నిసార్లు మనిషి మరణానికి దారితీస్తుంది. ఈ మహమ్మారిపై గత 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎంతో మంది రోగులకు చికిత్సలు అందించి నయం చేశారు ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్. ఆయన శుక్రవారం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన జీజీహెచ్లో పాతుకుపోయిన అవినీతి క్యాన్సర్పైనా ఆయన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుంటూరు మెడికల్: వ్యాధి నిర్ధారణకు అవసరమైన సర్టిఫికెట్లు మెడికల్ బోర్డు, కిడ్నీ బోర్డు, సదరం బోర్డుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఇస్తున్నారు. ఇలా ఇచ్చేందుకు అధిక మొత్తంలో లంచాలు అడిగినట్లు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. జిల్లా అధికారులకు సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో ఆస్పత్రి పరువు బజారున పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఏడు జిల్లాలకు చెందిన లక్షల మంది పేద, మధ్య తరగతి రోగులకు ఉచిత వైద్యసేవలు జీజీహెచ్లో అందించాలి. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తుంటారు. పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఇలా జీజీహెచ్కు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. కొంతమంది అవినీతి, అక్రమార్జన వల్ల ఆస్పత్రికి చెడ్డపేరు వస్తోంది. అత్యవసర సేవల విభాగంలో రోగి సహాయకులతో చికిత్సకు వినియోగించే సర్జికల్ ట్రే క్లీనింగ్ చేయించిన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారి జిల్లా అధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. కిందిస్థాయిలో కొంత మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అత్యవసర సేవల నిమిత్తం చేరే వారికి కనీసం వీల్చైర్స్ ఉంచకుండా, రోడ్డు ప్రమాద బాధితులను, తీవ్ర అనారోగ్యంతో చికిత్సకు ఎమర్జన్సీ వార్డుకు వచ్చే రోగులను చికిత్సకు తీసుకెళ్లకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గర్భిణికి వీల్చైర్ ఇవ్వకపోవడం, స్కానింగ్ కేంద్రానికి తీసుకెళ్లపోవడంపై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విధులకు సీనియర్లు డుమ్మా సీనియర్ వైద్యులు కొంత మంది సమయపాలన పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీజీహెచ్లో అందుబాటులో ఉండాలి. పలువురు మధ్యాహ్నం కల్లా సొంత క్లీనిక్లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్ వేసి సరిపుచ్చుతున్నారు. జూనియర్ వైద్యులే రోగులకు ఓపీ చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి బెడ్సైట్ టీచింగ్ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. ఓపీ రోగులను చూడకుండా టీచింగ్ చెప్పి మధ్యాహ్నం నుంచి సొంత పనులపై వెళ్లి పోతున్నారు. మామూలు ఇస్తేనే... జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే వైద్య సిబ్బందికి మామూలు ఇవ్వాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో ముక్కుపిండి వసూలు చేస్తారు. మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదు. పరిపాలనా కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా లంచం తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వాలన్నా అదే దుస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆసుపత్రుల తనిఖీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింఽపులు ఇలా ప్రతి విషయానికి ఎంతోకొంత ఇస్తేనే ఫైల్స్ కదులుతున్నాయని పలువురు యూనియన్ నాయకులు సైతం వాపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొండబాలివారిపాలెంకు చెందిన డాక్టర్ దుర్గాప్రసాద్ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అనంతరం హైదరాబాద్ వెళ్లి ఉస్మానియాలో పీజీ చేశారు. హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో ప్యాలెట్ చికిత్సలు అందుబాటులోకి తెచ్చి క్యాన్సర్ వైద్యుడిగా పేరు పొందారు. పదోన్నతిపై అనంతపురం వెళ్లి రేడియేషన్ ఆంకాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేసి మన్ననలు అందుకున్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్కు 2020లో వచ్చారు. క్యాన్సర్ చికిత్సల్లో విజయం సాధించిన ఆయన పరిపాలనాపరమైన పోస్ట్లోకి డెప్యూటీ సూపరింటెండెంట్గా ప్రవేశించి, నేడు నేరుగా సూపరింటెండెంట్ అయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి
ముప్పాళ్ల: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని వైద్య పరీక్షలకు హైదరాబాద్ తీసుకెళ్లాడు కొడుకు. కొంచెం నయం కావటంతో తండ్రీకొడుకులు ఇంటికి బయలుదేరారు. నల్గొండ జిల్లా రామన్నగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొంకావారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తోమాసయ్య(59) అనారోగ్యం బారిన పడ్డాడు. వైద్య పరీక్షల నిమిత్తం కుమారుడు ప్రకాశరావు(35) హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడే పది రోజులపాటు ఉన్నాడు. ఆరోగ్యం మెరుగుపడటంతో తండ్రీకొడుకులు గురువారం రాత్రి బాడుగకు కారు మాట్లాడుకొని ఇంటికి బయలుదేరారు. మార్గంమధ్యలో మేరీమాత వద్దకు వెళ్లి వచ్చేందుకుగాను నాగార్జునసాగర్ వైపు వస్తుండగా పెద్దాపూర మండలం రామన్నగూడెం తండా శివారులో రాంగ్రూట్లో వస్తున్న మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తోమాసయ్య, ప్రకాశరావులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తోమాసయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గ్రామంలో విషాదఛాయలు రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తోమాసయ్యకు ఇద్దరు కుమారులు. ప్రకాశరావు పెద్దవాడు. తోమాసయ్య మృతి వార్త తెలియగానే భార్య బెర్నలూర్థమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మరో రెండు గంటల్లో ఇంటికి వస్తారనుకుంటుండగా మరణవార్త తెలియటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రకాశరావు హైదరాబాద్లో ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు పిల్లలను పట్టుకొని ప్రకాశరావు భార్య లిఖిత రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కొంకావారిపాలెంలో విషాదం -
నేడు లింగంగుంట్లకు సీఎం చంద్రబాబు రాక
చిలకలూరిపేట: అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్ పథకం ప్రభుత్వం విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లింగంగుంట్ల గ్రామానికి శనివారం రానున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలసి శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు లింగంగుంట్ల గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారన్నారు. అనంతరం 12.50 నుంచి 1.20 వరకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. 2.15 నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని, సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల గ్రామం నుంచి బయలు దేరి వెళతారని వివరించారు. యడ్లపాడు: ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు ఆచరించటం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి చెప్పారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్మెంట్ సెంటర్ ప్రతినిధులు ఉషారాణి, శ్వేతబెనర్జీ, అభిషేక్ సింగ్ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. రైతు మానం శ్రీకాంత్, మహిళా రైతు గల్లా మల్లేశ్వరి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ మునగ పంటలో దొండ, గోంగూర, తోటకూర, క్యారెట్ వంటి అంతర పంటలు సాగు చేయటం ద్వారా ప్రధాన పంటల ఖర్చు తగ్గటమే కాక చీడపీడల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ప్రతి కుటుంబం ఈ విధానాన్ని అనుసరిస్తే వలసలు అవసరం లేకుండా జీవనోపాధి భద్రత లభిస్తుందన్నారు. అనంతరం గ్రామ సంఘ సమాఖ్య సమావేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాలని, అవసరమైన వనరులను గ్రామ సంఘాల ద్వారా సమకూర్చుకోవాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సంఘసభ్యులు వినియోగించుకుని మిగిలిన ఉత్పత్తులు సమష్టిగా మార్కెటింగ్ చేసుకోవాలని అమలకుమారి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజ్, జిల్లా సిబ్బంది అప్పలరాజు, మేరి తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 516.20 అడుగులకు చేరింది. ఇది 142.4378 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి నీటి చేరిక నిలిచిపోయింది. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ రైల్వే జోన్ అరక్కోణం జంక్షన్లో జరుగుతున్న నాన్–ఇంటర్లాకింగ్, స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న విల్లుపురం –ఖరగ్పూర్ (22604), 24న తిరునెల్వేలి –పురూలియా (22606), 25న టాటానగర్ –యర్నాకులం (18189) రైళ్లు మెల్పక్కం, తిరుత్తాని, రేణిగుంట, గూడూరు మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
జిల్లాలో 6,32,245 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
డిజిటలైజేషన్ 23,860ఫారాలు నరసరావుపేట:ఈనెల14 నుంచి జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 6,32,245 ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశామన్నారు. క్షేత్రస్థాయి నుండి సేకరించిన ఫారాల ఆన్న్లైన్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 23,860 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉన్నారని, వీరి వివరాల సేకరణ మరియు సవరణ కోసం క్షేత్రస్థాయిలో బీఎల్ఓల ద్వారా ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మొత్తం ఓటర్లు 2,33,756 ఉండగా 1.09,530మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసినట్లు అధికారులు తెలియచేశారు. 1041ఫారాలు డిజిటలైజేషన్ చేయటం జరిగిందన్నారు. నరసరావుపేటటౌన్: చోరీ సొత్తు కలిగి ఉన్నట్లు నేరం నిరూపణ కావడంతో మూడు కేసుల్లో నిందితులకు ఏడాది జైలు, రూ.2వేలు జరిమానా విధిస్తూ స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి ఎం.గాయత్రి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది జనవరి నెలలో నకరికల్లు మండలంలోని వివిధ ప్రాంతాల్లో నిందితులు మోటార్ సైకిళ్లు చోరీ చేసినట్లు మూడు కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న నకరికల్లు పోలీసులు నిందితులు పట్టణంలోని బరంపేటకు చెందిన శిఖా ఉదయ శంకర్, నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మర్రివేముల గోపిలను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం నిరూపణ కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్ష మొత్తాన్ని ఏకకాలంలో అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు. తండ్రిని హత్య చేసిన తనయుడు బొల్లాపల్లి: డబ్బులు ఇవ్వలేదని తండ్రిని, కుమారుడు కరత్రో కొట్టడంతో మృతి చెందిన విషయం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య(72)కు ముగ్గురు కుమారులు.మూడో కుమారుడు గజ్జ భద్రయ్య మతిస్థిమితం తక్కువ కావడంతో పెళ్లి కాలేదు. భద్రయ్య, తండ్రితో కలిసి ఉంటున్నాడు. క్రాప్ చేయించుకోవడానికి తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో, ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో కుమారుడు కర్రతో తండ్రి తలపై కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మతిస్థిమితం తక్కువగా ఉన్న మూడో కుమారుడు బాదరయ్య ఏడాది క్రితం కన్నతల్లి సోమమ్మ ను రాడ్డుతో మోదడటంతో అప్పట్లో తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సయ్యద్ సమీర్బాషా తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు అందజేశారు. ఎకరాకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి భూములు కోల్పోయే రైతులు డిమాండ్ పెదకూరపాడు: గుంటూరు– బీబీనగర్ రైల్వే లైన్ భూసేకరణ పేరుతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం భూములు కోల్పోతున్న రైతులతో సభ నిర్వహించారు. సభకు తహసీల్దార్ కుంభా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయ పర్యవేక్షకులు పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ పెదకూరపాడులో వ్యవసాయ భూమికి ఎకరాకు రిజిస్ట్రేషన్ విలువ సగటున రూ.13 లక్షలు ఉందన్నారు. ఆ విలువకు 1.25తో హెచ్చిస్తే రూ.16 లక్షల 25 వేలు వస్తుందన్నా రు. దానికి 100 శాతం పెంచితే రూ.32 లక్షల 50 వేలు పరిహారంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనికి అదనంగా నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 12 శాతం వడ్డీ లెక్కించి రైతుల ఖాతాలో దామాషా ప్రకారం జమ చేయడం జరుగుతుందన్నారు. హైవే పక్కన ఉన్న భూములు, ఇళ్ల స్థలాలు ఇల్లు కోల్పోయే వారికి నిర్ధారించిన ధర ప్రకారం ఇస్తారని తెలిపారు. లింగంగుంట్ల, వ్యవసాయ భూమి, చిన్నమక్కె న వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు పరిహారాలపై వివరించారు. పొలాల్లో బావి, చెట్లు ఉంటే వాటికి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇస్తారని తెలిపారు. రైతుల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదేళ్లలో పెరిగే ధరను నిర్ధారించి పరిహారంగా ఇవ్వాలని కోరారు. ఎవరికై నా వ్యక్తిగత సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కే శ్రీనివాసరావు కోరారు. ఇళ్లకు ప్రత్యేక ఇంజినీర్ను కేటాయించి ధర నిర్ధారణ చేస్తారన్నారు. భూమిని బట్టి కనీసం రూ.50 లక్షల నుండి కోటి రూపాయలు పైగా ఇవ్వాలని సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందించారు. -
ఎస్సీల జోలికి వస్తే ఊరుకునేది లేదు
ప్రైవేట్ పంచాయితీలు చేస్తున్న సీఐను సస్పెండ్ చేయాలిపిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్ని వేధింపులకు గురి చేసినా తట్టుకునే శక్తి తమలో ఉందని, అక్రమ కేసులు, వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జడ సురేంద్రను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిల విజ్ఞప్తి మేరకు వచ్చానని తెలిపారు. సురేంద్ర విషయంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యాపారంలో సురేంద్ర రూ. 30 లక్షలతో ఖలీల్ రెస్టారెంట్ను కొనుగోలు చేశారు. వ్యాపారం సజావుగా సాగాక ప్రభుత్వం మారడంతో వెంటనే పిడుగురాళ్ల పట్టణ సీఐ వెంకట్రావును అడ్డుపెట్టుకొని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఖలీల్ రెస్టారెంట్ను చేజిక్కించుకోవాలని సురేంద్రపై గంజాయి కేసుపెడతాను, రేప్ కేసు పెడతానని వేధించారని ఆరోపించారు. అక్రమంగా రూ. 30 లక్షలను సురేంద్ర నుంచి పోలీస్ ేస్టేషన్ వద్ద ఉన్న అరుగు మీద వసూలు చేయడం దుర్మార్గం అన్నారు. అందుకు సంబంధించిన వీడియో తమ దగ్గర ఉందని ఆయన తెలిపారు. సీఐ శ్రీరాం వెంకట్రావు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం చేసిన దళిత నాయకుడు జడ సురేంద్రకు అండగా తామంతా ఉన్నామని పేర్కొన్నారు. దళితుడైన మందా సాల్మన్ను నరికి చంపిన సంఘటన మరిచిపోకముందే జడ సురేంద్రను మానసికంగా చంపే ప్రయత్నాన్ని టీడీపీ నాయకులు, పోలీసులు చేయటం దుర్మార్గమన్నారు. సీఐ వెంకట్రావు ప్రైవేటు సెటిల్మెంట్లు చేస్తున్న వీడియోలు తమ వద్ద ఉన్నాయని ఆరోపించారు. వాటిని ఎస్పీకి అందజేస్తామని, ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంతానికి పౌరుషానికి పురిటిగడ్డ అయిన పల్నాడు గడ్డ మీద పుట్టిన మాలకన్నమ్మదాసు వారుసులం తామని, ఆ సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను లాకప్డెత్ చేశారని, ఇప్పటికీ మృతదేహం కనిపించని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన పేరుపోగు క్రాంతికుమార్ను సీఐ నాగరాజు వేధించటంతో అన్యాయంగా మృతి చెందాడన్నారు. ఇంతటి దుర్మార్గపు పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా నిలబడినందుకే అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకు పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని తెలిపారు. తమకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ కొమ్ము చంద్రశేఖర్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కాలే మాణిక్యరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చల్లగుండ్ల స్వామి, నేలటూరి సురేష్, పులిమళ్ల మాణిక్యరావు, ప్రమీణ్కుమార్, ఎస్సీ సెల్ నాయకులు గోసుల బుజ్జి, శ్యామ్, జి.నాగేశ్వరరావు, నోముల నర్సయ్య, దాసరి సునీల్కుమార్, శావల్యాపురం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినోద్, పట్టణ యూత్ కన్వీనర్ మందా సుధీర్, డేగల యోహాన్, కె.రత్నబాబు, రమణ, కందుకూరి మరియానందం, అందుగుల చరణ్, తాళ్లూరి సునీల్, ముద్దా ప్రేమ్కుమార్, ఏసుపొంగు శ్రీను, ముద్దా సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
రైతాంగ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
చిలకలూరిపేట: రైతాంగ సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు విమర్శించారు. కౌలు రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ కరపత్రాలను పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కౌలు రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు కూడా వ్యవసాయ రుణాలు అందజేయడటం లేదని అన్నారు. డాక్టర్ ఎన్ఎస్ స్వాఽమినాధన్ సిఫార్సుల మేరకు సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50శాతం అదనంగా అన్ని పంటలకు చట్టబద్దమైన మద్దతు ధర ప్రకటించాలని కోరారు. రుణాలు, ఇటీవల పెరిగిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. ఈ నెల 30న నిర్వహిస్తున్న ఛలో విజయవాడ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సుభాని, సీపీఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, బొంతా ధనరాజు, ఏలిక శ్రీనివాసరావు, బొంతా నాసర్ తదితరులు పాల్గొన్నారు. -
బఫర్ జోన్ ఆక్రమిస్తున్నా పట్టించుకోరా?
ముప్పాళ్ల: పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ బఫర్ జోన్ కుడి కట్టకు ఒక న్యాయం...ఎడమ కట్టకు మరో న్యాయం ఉంటుందా...కళ్ల ముందు ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ముప్పాళ్లలోని పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ కుడి, ఎడమ వైపున బఫర్ జోన్ల ఆక్రమణలను వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కృష్ణా నది కరకట్టను ఆక్రమిస్తే ఆ పార్టీ చోటా నాయకులు కాల్వకట్టలు, చెరువులు ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ కాలనీ వాసుల శ్మశానవాటికకు స్థలం కేటాయించమంటే కుదరదు అని చెప్పిన ఎన్నెస్పీ అధికారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. అప్పట్లో ఎన్నెస్పీ కాల్వకు భూమిని ఇచ్చిన రైతు కృష్ణమూర్తి పైపొలానికి వెళ్లేందుకు దారి లేదని చెప్పిన అధికారులు, సుమారు 0.20 సెంట్లు భూమిని పార్టీ ఆఫీస్ పేరుతో టీడీపీ నాయకులు ఆక్రమిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నారన్నారని ప్రశ్నించారు. పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ ఎడమగట్టు పక్కన ఆక్రమించారని తెలియగానే బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు, నెలరోజుల నుంచి కుడి గట్టు బఫర్జోన్ను ఆక్రమించి పది అడుగుల మేర మట్టి తోలకం చేస్తుంటే ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి పది అడుగుల దూరంలో ప్రభుత్వస్థలాలు ఆక్రమణలు చేస్తే కనిపించడం లేదా అని నిలదీశారు. ముప్పాళ్లలో నివాసాల పక్కనే ఉన్న చెరువులో పదిహేను అడుగుల మేర లోతు తవ్వి మట్టిని తరలించారన్నారు. ఈ గుంతలు ప్రమాదకరంగా మారినా పట్టించుకోక పోగా, చెరువు స్థలాన్ని సైతం రోడ్డు నిర్మాణం పేరుతో ఆక్రమించడం దుర్మార్గమన్నారు. మండలంలోని తొండపి, బొల్లవరం చెరువుల్లో ఇదే రీతిలో మట్టిని అమ్ముకుంటూ వాటాలు పంచుకుంటున్నారన్నారు. కనీసం అధికారులెవరూ ఈ తవ్వకాలపై పట్టించుకోకపోవటం దారుణమన్నారు. పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్పై టీడీపీ నాయకులు ఆక్రమించిన స్థలాలను వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ముప్పాళ్లలోని చెరువు ఆక్రమణలను పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యల తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ బాలవెంకటేష్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఇందూరి నరసింహారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఎంజేఎం రామలింగారెడ్డి, లీగల్సెల్ నాయకులు మణిరావు, పార్టీ నాయకులు వనమాల బ్రహ్మారెడ్డి, యనమాల సింగయ్య, ఎస్సీ సెల్ నాయకులు చావా రమేష్,యువజన విభాగం అధ్యక్షుడు సుబాని, నియోజక విభాగం అధ్యక్షుడు కిరణ్, చయికం వెంకటప్పారెడ్డి, షుకూర్, మస్తాన్వలి, కానాల పుల్లారెడ్డి, కిక్కురు రామిరెడ్డి, వీరారెడ్డి, పాలడుగు అప్పయ్య, కనుమూరి బాబు, మాజీ సర్పంచ్ మధిర రామకృష్ణారెడ్డి, కారుమూరి కృష్ణారెడ్డి, వీరారెడ్డి, శివరామిరెడ్డి, యర్రం పున్నారెడ్డి, శివారెడ్డి, కాటయ్య, జానీబాషా తదితరులు పాల్గొన్నారు. -
కూటమి దుర్మార్గ పాలనకు పరాకాష్టే సునీల్ అరెస్టు
కారుమూరి సునీల్ అరెస్టును ఖండించిన వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు నరసరావుపేట: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వ దుర్మార్గం, అరాచకానికి పరాకాష్ట అని పార్టీ బీసీ సెల్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బీసీసెల్ జిల్లా అధ్యక్షులు సిద్దాడపు గాంధీ మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వ అక్రమాల గురించి మాట్లాడతారో వారిపై ఈడీ కేసులు బనాయిస్తున్నారన్నారు. అందులో భాగమే సునీల్పై అక్రమ కేసుపెట్టి అరెస్టు చేశారన్నారు. కూటమి నాయకులకు విజయవాడలో కాపు యువకుడి లాకప్ డెత్ జరిగి నా, అక్కడి సీఐ బాధ తట్టుకోలేక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకునే సమయం లేదన్నారు. తునిలో ఓ బాలిక అదృశ్యమై 15రోజులు గడుస్తున్నా కనుగొనటంలో విఫలమయ్యారన్నారు. ముఖ్యంగా బీసీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం వర్తింపచేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంలో కన్పిస్తుందన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోకపోతే బీసీలు అందరూ ఐక్యమై తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరిచి సుపరిపాలన సాగిస్తే వారికి మనుగడ ఉంటుందని, లేనిపక్షంలో బీసీలు అందరూ ఏకమై తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, వావిలాల విజయశ్రీ నివాస్, తోట వీ రయ్య పాల్గొన్నారు. -
వచ్చే నెల 27 నుంచి శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. 27న ఆకుకూరలు, 28న కాయగూరలు, 29వ తేదీన కాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. శాకంబరీ ఉత్సవాలలో భాగంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను రైతులు, హోల్సేల్ వ్యాపారుల నుంచి సేకరించనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతల ద్వారా సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజుల పాటు ఉత్సవం -
బాబూ.. హామీలు అమలు కావేమి?
ఎన్నికల ముందు అడ్డగోలు హామీలతో ప్రజల ముందుకు వచ్చి గెలిచిన తరువాత వాటిని విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు రుజువైంది. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా చిలకలూరిపేట నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పనులు చేయలేదు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సందర్భంగా నేడు చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో పర్యటిస్తున్న నేపథ్యంలో గతంలో చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే పుల్లారావులు ఇచ్చిన హామీలు, ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నరసరావుపేట: ముఖ్యంగా జిల్లా రైతులకు ఎంతో అవసరమైన సాగునీటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించేలా కాలువలను అభివృద్ధి చేయడంతోపాటు పరిధి పెంపు పనులు పట్టాలెక్కలేదు. నియోజకవర్గ పరిధిలోని ఓగేరు, కుప్పగంజి, నక్కవాగులను ఆధునికీకరించాల్సి ఉంది. వాగులు గట్లు బలహీనపడి గండ్లు పడటంతో రైతుల పొలాలు ఏటా నీట మునుగుతున్నాయి. ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురైనా వాటి సంగతి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. పేటలో తాగునీటి కష్టాలు చిలకలూరిపేట మున్సిపాలిటీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. రోజుమార్చి రోజు నీటిని అందజేస్తున్నారు. అమృత్ పథకం పనులు పూర్తి చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నకిరికల్లు కాలువ నుంచి నీరు వచ్చి ఇంటింటికీ అందజేసే ఆస్కారం ఉండేది. దశాబ్దాల క్రితం పైపులైన్లు నిత్యం పట్టణంలో ఏదో ఒకచోటు పగిలిపోయి నీటి సరఫరాకు అంతరాయం కలగడంతోపాటు వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రముఖ పర్యాటక క్షేత్రం కొండవీడులో కేవలం ఉత్సవాలతో సరిపెడుతున్నారు. శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయడం లేదు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. తొలి ఏడాది దగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లు వైఎస్సార్ రైతు భరోసా పేరిట రైతులకు ఆర్థిక సహాయం అందజేసేది. ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 చోప్పున ఐదేళ్లు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఐదేళ్లలో జిల్లాలో ఏకంగా రూ.1,738.58 కోట్ల నిధులను నేరుగా రైతులకు అందించారు. తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి రైతులకు హామీ ఇచ్చింది. తీరా గెలిచి అధికారంలోకి వచ్చిన ఆ హామీని మరిచిపోయింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకం ఊసే రాష్ట్ర ప్రభుత్వ ఎత్త లేదు. కేంద్రప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు మాత్రమే రైతుల ఖాతాలలో జమైంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుండా రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఇలా సుమారు రూ.392 కోట్లను ఎగ్గొట్టింది. కనీసం ఎందుకు తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయలేకపోయారో సంజాయిషీ కూడా ఇవ్వలేదు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర సాయం, జాబితాలతో సంబంధం లేకుండా ఒకేసారి రూ.14 వేలు అందిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఇప్పటికే ఒక్కో రైతుకు రూ.28 వేలు అందజేయాలి. జిల్లాలోని 17,662 మంది కౌలు రైతులు ఖరీఫ్లో సాగు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారికి ప్రభుత్వం సుమారు రూ.50 కోట్లు అందజేయాల్సి ఉంది. కౌలు రైతులు సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశముందని, అందరికి మొత్తం నిధులను ఒకేసారి ఇవ్వాలని వైఎస్సార్సీపీతోపాటు పలు కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చివరి ఏడాదైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ రైతు భరోసా పేరిట పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,80,181 మందికి నగదు జమ చేశారు. నేడు జమ చేయనున్న అన్నదాత సుఖీభవ లబ్దిదారుల సంఖ్య మాత్రం 2,40,530 మందిగా ఉంది. ఏకంగా 40 వేల మంది రైతులు తగ్గిపోయారు. రైతుల సంఖ్య అమాంతంగా ఎందుకు తగ్గిపోయిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కోతల ప్రభుత్వమని రైతులు విమర్శిస్తున్నారు. భారీస్థాయిలో రైతుల సంఖ్య తగ్గడానికి సహేతుకమైన కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించింది. తీరా గెలిచిన తరువాత కేంద్ర సాయంతో కలిపి అని మాట మార్చి రైతులను ముంచింది. -
మద్యం మత్తులో టీడీపీ నాయకులు పరస్పర దాడులు
మాచర్ల రూరల్: కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభలో పాల్గొని ఫుల్గా మద్యం తాగిన మత్తులో తెలుగుతమ్ముళ్లు కర్రలతో కొట్టుకొని తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని రాయవరం జంక్షన్ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జమ్మలమడక గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కూరాకుల శ్రీనివాసరావు, రాయవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గాలి బ్రహ్మంలు విజయోత్సవ సభ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే జమ్మలమడక గ్రామం నుంచి శ్రీను తన కొడుకును పిలిపించుకొని రాయవరం వెళ్తున్న గాలి బ్రహ్మం పై దాడికి ప్రయత్నించారు. ఈ దాడులలో ఇరువురు కర్రలతో కొట్టుకున్నారు. ఈ సంఘటనలో కూరాకుల శ్రీనివాసరావు, గాలి బ్రహ్మంకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహించారు. జర్మనీ అమ్మాయి – దేచవరం అబ్బాయి నకరికల్లుః నిజమైన ప్రేమకు హద్దులు... సరిహద్దులు లేవని నిరూపించారు ఓ యువ ప్రేమజంట. శుక్రవారం నరసరావుపేటలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన వెంపటి శ్రీనివాసరావు కుమారుడు వెంకటేశ్వర్లు చదువుకునేందుకు జర్మనీ వెళ్లి అక్కడే ఉద్యోగం సాధించాడు. ఈ క్రమంలో అదే దేశానికి చెందిన పొలీన జొరీనతో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి ఫుట్బాల్ క్రీడ పట్ల ఆసక్తి కావడంలో తరచూ ఆడేందుకు వెళ్లే క్రమంలో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు 8 ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి సుముహూర్తం నిర్ణయించుకున్నా రు. జర్మనీ, రష్యాల నుంచి వధువు బంధువులు రాగా వరుడు తరపున బంధువులు కలసి నరసరావుపేటలో ప్రేమ వివాహం సంప్రదాయ బద్దంగా జరిపించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలి బ్రహ్మం, కూరాకుల శ్రీనివాసరావు -
మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి ఘన స్వాగతం
దాచేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి శుక్రవారం రాత్రి ఘనస్వాగతం పలికారు. ఓ కేసులో అరెస్టు అయ్యి బెయిల్పై విడుదలైన బ్రహ్మనాయుడు హైదరాబాద్ నుంచి వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి దాచేపల్లి చేరుకున్నారు. బ్రహ్మనాయుడుకు స్థానిక పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ప్రతి ఒక్కరిని బ్రహ్మనాయుడు అప్యాయంగా పలకరించారు. స్వాగతం పలికిన వారిలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, నియోజకవర్గ అధికార ప్రతినిధి షేక్ జాకీర్హుస్సేన్, నాయకులు కొప్పుల రవికుమార్, బొమ్మిరెడ్డి నరసింహారావు, సంకురాత్రి వీరయ్య, ముళ్లపాటి నరసింహారావు, బొమ్మిరెడ్డి నాగరాజు, మునగా శ్రీనివాసరావు, కొమ్ము బుజ్జి, కొమ్మా కరుణాకర్, షేక్ సైదా, గాదె రామకృష్ణారెడ్డి తదితరులున్నారు. బొల్లా విడుదలపై సంబరాలు వినుకొండ: వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంపై నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరైన సమాచారం తెలియగానే వినుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని జాలలపాలెం గ్రామంలో పార్టీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సత్యమే జయించింది స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడుపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేశారని, న్యాయస్థానంపై తమకున్న నమ్మకం నిజమైందని పేర్కొన్నారు. న్యాయమే గెలిచిందంటూ పరస్పరం సీట్లు తినిపించుకొని అభినందనలు తెలుపుకున్నారు. సంబరాల్లో నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. బొల్లా గిరిబాబు హర్షం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుమారుడు, యువ నాయకుడు బొల్లా గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు. గిరిబాబు మాట్లాడుతూ 14 రోజులుగా వినుకొండ నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మనాయుడు విడుదల కోసం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేసుకున్నారు. అందరి ఆశీస్సులు, ప్రార్థనలు, దేవుని కృపతోనే బెయిల్ లభించిందని తెలిపారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు, ప్రజలందరికి బొల్లా గిరిబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
అతివేగానికి రెండు ప్రాణాలు బలి
● కారు బోల్తా పడి ఇద్దరు మృతి ● మరో నలుగురికి గాయాలు దాచేపల్లి: అతివేగం రెండు నిండు ప్రాణాలు బలి తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు మృతి చెందారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో చింతల పుష్పలత(34), నారదాసు రమణమూర్తి (54) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న రాజశేఖర్ తన భార్య పుష్పలత ఇద్దరు పిల్లలతో హైదరాబాదు నుంచి సత్తెనపల్లికి కారులో వస్తున్నారు. పుష్పలత పుట్టిల్లు సత్తెనపల్లి. గామాలపాడు సమీపంలోకి రాగానే అతివేగం కారణంగా రాజశేఖర్ నడుపుతున్న కారు అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపై అదుపు తప్పింది. డివైడర్ని ఢీకొట్టి గుంటూరు వైపు నుంచి మేడ్చల్ వెళుతున్న మరో కారుపై పడింది. ఘటనలో పుష్పలత సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మరో కారులో ఉన్న నారదాసు రమణమూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా రమణమూర్తి మృతి చెందాడు. రాజశేఖర్, అతని ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. మరో కారులోని నలుగురూ గాయపడ్డారు. ప్రమాదంలో రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న దాచేపల్లి సీఐ ఎం.రాజేష్, ఎస్ఐ జి.పాపారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పుష్పలత, రమణమూర్తి మృతదేహాలు -
జడ సురేంద్రకు అండగా వైఎస్సార్ సీపీ
పిడుగురాళ్ల: జడ సురేంద్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎస్సీ ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్మూల్ శ్యామ్కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం పట్టణ కన్వీనర్ జడ సురేంద్రను గురువారం వారు పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి దళితులంటే అసూయ ఏర్పడిందని, ఆర్థికంగా బలంగా ఉన్న వారిని గుర్తించి వారిని పోలీసుల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని తెలిపారు. దళితుడైన జడ సురేంద్రకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయటం జరుగుతుందని, అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకై నా సిద్ధమని వారు హెచ్చరించారు. జడ సురేంద్రను ఇబ్బందులకు గురి చేసిన పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును, టీడీపీ నాయకుడు నల్లాటి సుబ్బారావులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ సభ్యులు జడ సురేంద్రను పరామర్శించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు కాలే మాణిక్యరావు, కార్యదర్శి, టౌన్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు చల్లగుండ్ల స్వామి, వైఎస్సార్సీపీ నాయకులు పిల్లి ప్రేమానందం, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సాతులూరి రమేష్, ఏడో వార్డు కన్వీనర్ మందా ప్రేమ్రాజు, 11వ వార్డు యూత్ కన్వీనర్ బంకా జాకోబ్, పిడుగురాల్ల మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ మందా జాషుబా, పిడుగురాళ్ల టౌన్ ప్రధాన కార్యదర్శి గోసుల బుజ్జి, పాస్టర్ మందా జోసఫ్, కత్తి చిన్న, కత్తి నిఖిల్, మంద అబ్రహం, పాస్టర్ అబ్రహం, 17వ వార్డు మాజీ కన్వీనర్ బంకా అనిల్కుమార్, దొప్పలపూడి చంద్రశేఖర్, జంటగా సన్నీ, బందులూరి మరియదాసు, పాశం శ్యాంబాబు, కొమ్ము మోష, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్మూల్ శ్యామ్కుమార్ -
ఆటోనగర్ కార్మికుల నైపుణ్యాల పెంపునకు కృషి
మంత్రి టీజీ భరత్ చిలకలూరిపేట: ఆటోనగర్ కార్మికులకు అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. మండలంలో పోతవరం గ్రామం వద్ద ఆటోనగర్ను గురువారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధికి అవసరమైన రూ. 2.80 కోట్ల నిధులు త్వరగా మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటో వర్కర్స్ పనితీరు మెరుగుపడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో లభించే ఆధునిక పరికరాలు, యంత్రాలతో కార్మికుల కష్టం తీరుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆటోనగర్లో ప్లాట్లు పొందిన వారు ఆటోనగర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎంఎస్ఎంఈ పార్కులకు దీటుగా ఆటోనగర్ అభివృద్ధి చెందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీచైర్మన్ షేక్ కరిముల్లా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ సువర్ణఫణి పాల్గొన్నారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026ఆర్జనకు తహతహసీల్దార్లు! లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో సత్తెనపల్లి ప్రథమం ● అధికార నేతల అండతో సొంత రెవెన్యూ డివిజన్లోనే పోస్టింగు ● తమ్ముళ్ల అవినీతి, అక్రమాలకు వత్తాసు పలకడమే కారణమని ఆరోపణలు 7నరసరావుపేట టౌన్: గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉండేవారు ఎవరు వారి సొంత డివిజన్లో ఉద్యోగాలు చేయకూడదు. దీనిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. జీవో నెం. 418 కూడా ఇదే చెబుతోంది. పల్నాడు జిల్లాలోని ఉన్నతాధికారులకు మాత్రం ఇవేమీ వర్తించడం లేదు. స్వతంత్ర నిర్ణయాలు, సొంత పాలన చేసుకుంటూ పోతున్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా పల్నాడు జిల్లాలో తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇచ్చారు. మొన్నటి వరకు డిప్యూటేషన్ పేరిట సొంత మండలాల్లోనే పనులు చక్కబెట్టారు. ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో ప్రసన్నం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టరేట్, ఇతర పాలనా కార్యాలయాల్లో ఈ వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. తహసీల్దార్లు అధికార పార్టీ శ్రేణులతో ఒకలా, ప్రతిపక్ష పార్టీ శ్రేణులతో మరోలా వ్యవహరిస్తూ పక్షపాతం చూపుతున్నారు. ఇప్పటికీ కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి పైరవీలు నడుపుతున్నారు. టీడీపీ నేతల సిఫార్స్లతో పోస్టింగ్ తెచ్చుకున్న కారణంగా తహసీల్దార్లు స్వామి భక్తి చాటుకుంటూ తెలుగు తమ్ముళ్లకు పనులను చక్కబెడుతున్నారు. పోస్టింగ్లు జీవో స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ ఉద్యోగుల బదిలీల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేసే అధికారులు వీరి పోస్టింగ్ విషయంలో మాత్రం ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. జీవోను ఉల్లఘించి జరిగిన పోస్టింగ్లపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పసుపు వైపు.. రైతు చూపు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 516.30 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.05 టీఎంసీలు. ఎగువ నుంచి 4130 క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2300, మోడల్ ధర రూ.1800 వరకు పలికింది. ఏదైనా చిన్న ధ్రువీకరణ పత్రం కావాలంటే ఆరాలు తీసి చుక్కలు చూపించే తహసీల్దార్లు వారి పోస్టింగుల్లో మాత్రం నిబంధనలకు నీళ్లు వదిలారు. రాజకీయ అండదండలు ఉంటే అయిన వారు, వడ్డించేవారు తమ వారైతే ఎలాంటి జీవోలైనా చెత్తబుట్టలోకి చేరుతాయని నిరూపించారు. పల్నాడు జిల్లాలోని కొందరు తహసీల్దార్లు నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్లు పొందారు. కొందరు రాజకీయ నేతలు సైతం వారికి వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా చూసిన ప్రజలు ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఐదుగురు తహసీల్దార్ల పోస్టింగ్ విషయంలో నిబంధనలను పక్కన పెట్టారు. ప్రస్తుతం చిలకలూరిపేట తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ స్వస్థలం నరసరావుపేట మండలం రావిపాడు గ్రామం. నరసరావుపేట తహసీల్దార్గా పనిచేస్తున్న షేక్ హుస్సేన్ స్వగ్రామం చిలకలూరిపేట పట్టణం. అయితే గత ఏడాది కాలంగా డిప్యూటేషన్పై వీరిద్దరు పరస్పర స్థానాలు మార్చుకొని ఏకంగా సొంత మండలాల్లో పనిచేశారు. ఇటీవల డిప్యూటేషన్ రద్దు కావటంతో తమ సొంత రెవెన్యూ డివిజన్ పరిధిలోనే విధులు కొనసాగిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పల్నాడు జిల్లాలో ఉన్న 28 మండలాలలో ఐదుగురు తహసీల్దార్లు సొంత రెవెన్యూ డివిజన్లో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో స్వస్థల గ్రామం క్రోసూరుకు చెందిన కుంభా శ్రీనివాసరావు పెదకూరపాడు తహసీల్దార్గా పనిచేస్తున్నారు. అదే విధంగా నూజెండ్ల మండలం తంగిరాల గ్రామానికి చెందిన సుధాకర్ బొల్లాపల్లి తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండలానికి చెందిన అర్జున్నాయక్, శావల్యాపురం తహసీల్దార్గా పనిచేస్తున్నారు. -
భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన భర్త
● చికిత్స పొందుతూ భార్య మృతి ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు వినుకొండ: భార్యపై అనుమానంతో హత్య చేసిన నిందితుడిని వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ బి. ప్రభాకర్ కథనం ప్రకారం.... వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన దుర్గం సుబ్బమ్మ (26)కు, కొండి అంజనేయులు (37)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన అంజనేయులు భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఈ నెల 10న జరిగిన గొడవ కారణంగా సుబ్బమ్మ ఊరిలోనే ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆంజనేయులు ఈ నెల 11న తెల్లవారుజామున నిద్రిస్తున్న సుబ్బమ్మపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆమెను రక్షించబోయిన తల్లి మహాలక్ష్మమ్మ (65), నిందితుడి తండ్రి పువ్వడయ్య (70)లకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సుబ్బమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో వినుకొండ సీఐ బి. ప్రభాకర్, హెచ్సీ సునీల్ బాబు, పీసీలు అశోక్ బాబు, లక్ష్మణ రావుల బందం దర్యాప్తు చేపట్టింది. ఈ నెల 17న సాయంత్రం వినుకొండ–ఏనుగుపాలెం రోడ్డులోని కాశీనాయన ఆశ్రమం వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. -
ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు రూ.2500 నుంచి రూ.3వేలకు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓ కె.బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెనూ బాగా పెంచామని హంగులు ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. వాస్తవానికి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఏ మాత్రం కూడా పెంచలేదని అన్నారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు నెలకు రూ.1200, ఇంటర్మీడియట్కు నెలకు రూ.1600లు బడ్జెట్ కేటాయిస్తే 30 రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టడానికి ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కామాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు, హేమంత్, యశ్వంత్, మధు ,హర్ష, చరణ్ పాల్గొన్నారు. -
మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో సత్తా
చినగంజాం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ గ్రాండ్ మాస్టర్లతో పోటీ పడి మూడో స్థానం సాధించాడు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పర్వతరెడ్డి అజయ్ సంతోష్. ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జూన్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన 360 వన్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్లతో పోటీలో పాల్గొన్న అజయ్ సంతోష్ 9కి 6 పాయింట్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచాడు. అజయ్ సంతోష్ ఈ పాటికే 2500 ఫిడే రేటింగ్ను దాటి తన మొదటి జీఎం నార్మ్ను సాధించాడు. గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించడానికి అతడు ఇంకా కేవలం 2 నార్మ్లు మాత్రమే సాధించాల్సి ఉంది. అజయ్ వచ్చే వారం మరో జీఎం టోర్నమెంట్ కోసం చైన్నె వెళ్ళనున్నాడు. అటు తరువాత మరిన్ని నార్మ్స్ సాధించేందుకు యూరప్లోని చెక్ రిపబ్లిక్, పారిస్.. ఫ్రాన్స్ దేశాలకు ప్రయాణం కానున్నట్లు అజయ్ తాతయ్య పర్వతరెడ్డి కాంతారావు తెలిపారు. అజయ్ ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. పెదకాకానిలో చోరీ పెదకాకాని:గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి బంగారం, వెండి, నగదు మాయం చేసిన ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని శివాలయం రోడ్డులోని న్యూఇండియన్ పబ్లిక్ స్కూల్ వెనుక బజారులో బత్తుల సుబ్బయ్య కుటుంబం నివశిస్తుంది. వారు రోజూ మాదిరిగానే ఇంటికి తలుపులు వేసి వరండాలో నిద్రించారు. ఆ ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గుండా గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులులోనికి ప్రవేశించి, బీరువా తెరచి అందులో ఉన్న 7 గ్రాముల బంగారు వస్తువులు, పిల్లలు దాచుకున్న మట్టి ముంత(కిడ్డీ బ్యాంక్)లో ఉన్న నగదు, సుమారు 200 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారు. ఈ చోరీలో వరండాలో పడుకున్న వారు ఇంటిలోపలికి రాకుండా ఇంట్లో ఉన్న తలుపునకు లోప ల గడియపెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. ఉదయం నిద్ర లేచి తలుపు తీస్తుండగా ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే వెనుక ఉన్న కిటికీ తొలగించి ఉంది. బీరువా తెరచి వస్తువులు చిందర వందరగా పడి ఉంటడం, కిడ్డీ బ్యాంక్ పగులగొడ్డడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలను సేకరించేందుకు క్లూస్టీంను రప్పించారు. నిందితులు బంగారు వస్తువులతో కలసి ఉన్న రోల్డ్గోల్డ్ వస్తువులను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలో సాగు ఇలా....
తెనాలి/కొల్లిపర: తొలకరి చినుకుల సవ్వడితో మెట్ట రైతులు పసుపు సాగుకు సమాయత్తం అవుతున్నారు. అడపాదడపా వర్షాలతో నేల పదునుతో లంక ప్రాంతాల్లో పసుపు విత్తటానికి శ్రీకారం చుడుతున్నారు. మిగిలిన చోట్ల నేలను సిద్ధం చేసుకోవటం, విత్తన సేకరణ సన్నాహాల్లో ఉన్నారు. ఎండు పసుపునకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో ఈసారి కొంత విస్తీర్ణం పెరిగేలా ఉంది. దీంతోపాటు కొందరు రైతులు తమ చేలల్లో 5–10 సెంట్ల విస్తీర్ణంలో సొంత అవసరాలకు మిరప, టామాటా, వంగ నారుమళ్లు చేస్తున్నారు. సిద్ధంగా విత్తన పసుపు... ఏటా పసుపు సాగుకు ముందు కడప జిల్లా నుంచి రైతులు, మధ్యవర్తులు పచ్చి పసుపును తీసుకొచ్చి కొల్లిపర మండల గ్రామం తూములూరులో నిల్వచేయటం తెలిసిందే. తొలకరి వర్షం రాగానే జిల్లాతోపాటు పరిసర జిల్లాల్లోని రైతులు ఇక్కడి నుంచి విత్తనం పసుపు కొనుగోలు చేస్తుంటారు. ఈసారి పసుపు విత్తనం పుట్టి (225 కిలోలు) ధర రూ.7,500 నుంచి రూ.8,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. విస్తీర్ణం పెరిగే అవకాశం .... ఎండు పసుపు ధర రెండేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.7 వేల వరకు ఉంది. ఈ సంవత్సరం మార్కెట్లో పసుపు ధర క్వింటా రూ.10– రూ.14 వేల వరకు కొనుగోళ్లు జరిగాయి. గత ఆరు నెలల నుంచి ధర కాస్త అటూఇటుగా నిలకడగా ఉంది. రానున్న సీజనులో ధర బాగుంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. దీంతో పచ్చి పసుపు ధర పుట్టి రూ.8 వేల వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి సాగుకు సమాయత్తం అవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 2026–27 సీజనులో పసుపు విస్తీర్ణం పెరుగుతుందన్న అంచనా ఉంది. కొత్త వంగడాలపై రైతుల ఆసక్తి... అధిక దిగుబడులతోపాటు నాణ్యమైన పంట సాగు కోసం రైతులు నూతన రకాలపై ఆసక్తి చూపుతున్నారు. తెగుళ్లను, తేమను తట్టుకొనే పసుపు రకాలైన నిజామాబాద్, మైదుకూరు, సేలం, టేకూరుపేట వంటి రకాలను సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటితోపాటు కుర్కుమిన్ శాతం అధికంగా ఉండే పసుపు విత్తన సేకరణకూ సన్నాహాలు చేస్తున్నారు. కొల్లిపర మండలం లంక గ్రామాల్లో ఇప్పటికే కొందరు రైతులు పసుపు విత్తటం పూర్తి చేశారు. గుంటూరు జిల్లాలో పసుపు సాగు సాధారణ విస్తీర్ణం 4,500 ఎకరాలు ఉంది. 2024లో 3,616 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పసుపు సాగు చేశారు. 2025లోనూ కొంచెం విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో అత్యధికంగా పసుపు సాగు తెనాలి వ్యవసాయ సబ్ డివిజనులోనే చేస్తుంటారు. ఇందులోనూ కొల్లిపర మండలంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. గతేడాది కొల్లిపర మండలంలో 1,950 ఎకరాలు, దుగ్గిరాలలో 234, తెనాలిలో 133 , మంగళగిరిలో 405, మేడికొండూరులో 222, తాడేపల్లిలో 365 ఎకరాలలో సాగు చేశారు. మిగిలిన మండలాల్లో అక్కడక్కడ 20 ఎకరాలలోపు సాగు చేశారు. దీంతో మొత్తం సుమారు 3,343 ఎకరాల్లో పంట సాగయింది. 2024లో మార్కెట్లో ఎండు పసుపు సరైన ధర లేకపోవటంతో కొందరు రైతులు ఇతర పంటలకు మళ్లారు. ఫలితంగా 2025లో కొంత మేర సాగు విస్తీర్ణంం తగ్గింది. ఈ సారి మార్కెట్లో పసుపు రేటు బాగానే ఉంది. లంక గ్రామాల్లో సాగు ఆరంభం విత్తన పసుపునకు గిరాకీ కొనుగోళ్లతో తూములూరు కళకళ కొత్త రకాలపైనా రైతుల ఆసక్తి -
పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత
వినుకొండ: వినుకొండ మండలంలోని వెంకుపాలెం గ్రామంలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు అలియాస్ చిన్న బుజ్జి (29) అక్కడికక్కడే మృతి చెందగా, గుడిపాటి బాలకోటయ్య, యలగాల శ్రీను, చెన్నుబోయిన కోటయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించారు. వ్యవసాయ పొలంలో ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఘటన జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఘటనలో... శావల్యాపురం: మండలంలోని కారుమంచి గ్రామంలో సాయంత్రం ఊరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన మల్లపరపు చిన కోటేశ్వరరావు (55) గేదెలు మేత కోసం పొలానికి వెళ్లాడు. పొలంలో గేదెలు మేత మేస్తుండగా అకస్మాతుగా పిడుగుపాటుకు గురై సంఘటన స్థలం మృతి చెందాడు. గేదెలు మాత్రం యథావిధిగా ఇంటికి వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతుకుతుండగా పొలంలో మృతదేహం గుర్తించారు. మృతుడుకి భార్య ముగ్గురు సంతానం కలరు. కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. పది గొర్రెలు కూడా... వినుకొండ: పట్టణంలో ఉరుములు, మెరుపులు, ఈ దురుగాలులతో కూడిన భారీ వర్షంతోపాటు పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో నాగమయ్య పుట్ట వద్ద చెట్టుపై పిడుగుపడటంతో చెట్టు కింద ఉన్న మేకల నరేంద్ర, మేకల శ్రీనుకు చెందిన 10 గొర్రెలు మృతి చెందాయి. మృతిచెందిన గొర్రెల విలువ సుమారు రూ.లక్షకుపైగా ఉంటుందని బాధితులు తెలిపారు. గుడిపాటి కోటేశ్వరరావు, మల్లవరపు చిన కోటేశ్వరరావు మృతదేహాలు మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
తీరంలో మద్యం విక్రయిస్తే ఉద్యమాలకు సిద్ధం
బాపట్లటౌన్: బీచ్ షాక్ పేరుతో తీరంలో మద్యం విక్రయిస్తే ఉద్యమాలు తప్పవని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్.గంగయ్య తెలిపారు. పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గంగయ్య మాట్లాడుతూ బాపట్లకి దగ్గరలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.97 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, దీనిని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే గోవా తరహాలో సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయాలని బీచ్ షాక్ పేరుతో సూర్యలంకలో రెండు వైన్ షాపులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎక్కడో దూర ప్రాంతాల నుండి అహ్లాదకరంగా, ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి కుటుంబ సభ్యులతో వేల సంఖ్యలో పర్యాటకులు సూర్యలంక బీచ్కు వస్తున్నారని, ఇక్కడ బార్ షాపులు ఓపెన్ చేస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణ దెబ్బతింటుందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐద్వా కార్యదర్శి సుభాషిణి, పార్టీ బాపట్ల నాయకులు కె.శరత్ పాల్గొన్నారు. -
గజాల్లోనే భూములను గుర్తించాలి
సత్తెనపల్లి: గుంటూరు–బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ సత్తెనపల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల నుంచి సేకరించే భూమిని గజాల ప్రకారం గుర్తించాలని రైతులు కోరారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగముగా సత్తెనపల్లి మండల పరిధిలోని రైతులతో అవార్డు ఎంక్వయిరీ సమావేశం కంపిటెంట్ అథారిటీ(భూసేకరణ) – రెవెన్యూ డివిజనల్ అధికారి కె.గోపాలకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. భూసేకరణలో భాగమైన అబ్బూరు, గుడిపూడి, భీమవరం, కంకణాలపల్లి, సత్తెనపల్లి, ధూళిపాళ్ల గ్రామాల పరిధిలోని నోటిఫైడ్ రైతులు హజరై తమ భూమికి సంబంధించిన హక్కు పత్రములను అందించారు. రైతులు మాట్లాడుతూ సబ్రిజిస్టార్ కార్యాలయంలో భూమి గజాలలో ఉన్నందున గజాలలోనే లెక్కించి పరిహరం అందించాలన్నారు. అలా కాకుండా సెంట్లలో లెక్కిస్తే పరిహరం తక్కువ వస్తుందన్నారు. అంతేగాక చిన్న రైతులు 5 సెంట్లు ఉంటే కేవంల 3 సెంట్లు మాత్రమే తీసుకోవడం వల్లన మిగిలిన రెండు సెంట్లలో ఏ పనులు చేసుకోవటానికి అనువుగా ఉండదని, ఆ భూమికి దారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. భూసేకరణ అధికారులు ఈ అవార్డ్ ఎంక్వయిరీకి హాజరైన రైతులం దరికీ పరిహారమునకు గురించిన పూర్తి సమాచారంను వివరించారు. సత్తెనపల్లి మండ ల పరిధిలోని గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగమైన వివిధ గ్రామాలలోని భూ విస్తీర్ణం వివరములు ఇలా ఉన్నాయి...అబ్బూరు ఎ.0.375 సెంట్లు, గుడిపూడి ఎ.0.610 సెంట్లు, భీమవరం ఎ 0.871 సెంట్లు, కంకణాలపల్లి ఎ.5.595 సెంట్లు, సత్తెనపల్లి ఎ.7.310 సెంట్లు, ధూళిపాళ్ల ఎ.11.960 సెంట్లుగా తేల్చారు. ఆయా గ్రామాలకు చెందిన మొత్తం 193 మంది రైతులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఆర్డీఓ కార్యాలయ ఏవీపీ చంద్రారెడ్డి, తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ నేలటూరి రవికుమార్, ఆర్ఐ భోస్బాబు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గోన్నారు. భూ సేకరణ సమావేశంలో రైతులు డిమాండ్ -
కేసుల కారణంగా వ్యక్తి ఆత్మహత్య
నకరికల్లు: ఓ కేసు విషయమై మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలాల్లో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో బుధవారం జరిగింది. మృతుని భార్య తిరుపతమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు... నకరికల్లులోని ఎస్టీ కాలనీలో కేసరి సూర్యనారాయణరెడ్డి(62) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వీరి ఇంటిపక్కనే ఉన్న కొణతం తిరుపతమ్మ, భర్త కొండారెడ్డిలకు మధ్య నీటిపంపు విషయమై రెండేళ్ల క్రితం వివాదం జరిగింది. అప్పట్లో సూర్యనారాయణరెడ్డిపై తిరుపతమ్మ కేసు పెట్టగా.. ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. కాగా సూర్యనారాయణరెడ్డి మద్యం తాగి తిడుతున్నాడంటూ నకరికల్లుకు చెందిన డీకొండ మహానంది అనే వ్యక్తి తిరుపతమ్మ వాళ్లను రెచ్చగొట్టి ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. ఇదే విషయమై పోలీసులు నాలుగురోజుల పాటు స్టేషన్కు పిలిపించారన్నారు. బుధవారం ఉదయం కేసు విషయమై మాట్లాడేందుకు రమ్మని పెద్దలు తిరుపతమ్మ వాళ్లకు ఫోన్ చేయగా రేపు వస్తామన్నట్లు పెద్దమనుషులు తెలిపారన్నారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో స్టేషన్కు వెళ్తున్నానని భార్యతో చెప్పిన సూర్యనారాయణరెడ్డి ఇంటి నుంచి బయలుదేరాడు. తిరిగి రాకపోవడంతో ఆమె పోలీస్స్టేషన్కు ఫోన్ చేయగా రాలేదని తెలిపారు. బంధువుల సహాయంతో వెతకగా గ్రామ శివారులోని చల్లగుండ్ల పొలాల్లో సూర్యనారాయణరెడ్డి విగతజీవిగా పడి ఉండడం గుర్తించారు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. కేసులతో వేధిస్తున్న కారణంగానే మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యనారాయణరెడ్డికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహమైంది. ఎస్ఐ కె.సతీష్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. -
జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి
నరసరావుపేట రూరల్: యోగాను జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రమైన కోటప్పకొండలో యోగాంధ్ర కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజనా సింహ మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మికతల కలయికే యోగా అని తెలిపారు. అవగాహన కల్పించేందుకు 21 రోజులపాటు వివిధ దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన వారు, మహిళలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ కంప్యూటర్ యుగంలో మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో తప్పనిసరి అని తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతోపాటు బీపీ, షుగర్ వంటి రోగాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. యోగా ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్ పెంచండి జిల్లాలో యోగా ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్లు మరింత పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమాల పురోగతిపై క్షేత్రాధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో యోగా ట్రైనర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 19న అమరావతిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
2,06,521 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 2,06,521 ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశామన్నారు. ఇందులో అత్యధికంగా పెదకూరపాడు నియోజకవర్గంలో 45,063, నరసరావుపేటలో 40,346 ఫారాలు పంపిణీ చేశామన్నారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన ఫారాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 5,455 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. వీరి వివరాల సేకరణ, సవరణ కోసం క్షేత్రస్థాయిలో బీఎల్ఓల ద్వారా ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మంత్రి లోకేష్కు వినతిపత్రం అందజేత సత్తెనపల్లి: ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 45, జీఓ ఎంఎస్ నంబర్ 54 ప్రకారం ఏపీ కారాగార, సంస్కరణల శాఖ(జైళ్ల శాఖ)లో విధులు నిర్వహిస్తున్న దిగువ స్థాయి ఉద్యోగులైన వార్డర్లు, హెడ్ వార్డర్లు, చీఫ్ హెడ్ వార్డర్ల సర్వీసు నిబంధనల్లో అన్వయించాలని ఏపీ జైళ్ల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నంబుల విశ్వేశ్వరరావు కోరారు. బుధవారం మంత్రి నారా లోకేష్కు ఆయన క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం ద్వారా ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పరిధిలో దిగువ స్థాయి ఉద్యోగులైన వార్డర్లు, హెడ్ వార్డర్లు, చీఫ్ హెడ్ వార్డర్లలో అనేక మంది ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు దూరంగా అనేక ఏళ్లుగా పనిచేస్తూ వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర అనారోగ్యాలకు గురై, ఆకస్మిక మరణాలకు కారణమైన దుర్భర పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆయనతోపాటు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మువ్వల శ్రీకృష్ణమూర్తి, కార్యదర్శి వి.ప్రభు, సలహాదారుడు కె.జ్ఞాన సుందరం ఉన్నారు. -
నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
నరసరావుపేట: ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ రీ ఎగ్జామ్ అత్యంత పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దెయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని పోలీస్, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, విద్యుత్ , విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు పరీక్ష కేంద్రాల ద్వారా 1,323 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆయా కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదని అన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. అభ్యర్థుల మార్గనిర్దేశం కోసం రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలను డీఆర్ఓ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు పూర్తి సహకారం అందించాలని డీఆర్ఓ కోరారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 516.50 అడుగులకు చేరింది. ఇది 142.9715 టీఎంసీలకు సమానం. -
అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వ్యక్తి ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆయన అవయవదానంతో ఐదు కుటుంబాల జీవితాల్లో వెలుగు నిండింది. ఎకై ్సజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పామర్తి నాగ వెంకట దుర్గ శ్రీనివాస్ (48) విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ నెల 10న బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. వెంటనే సహచర సిబ్బంది ఆయన్ను గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆరు రోజులపాటు వైద్య చికిత్స అందించినా బ్రెయిన్ స్ట్రోక్తో ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ నెల 16న బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఆయన భార్య వెంకట నాగలక్ష్మి, తల్లి పి.వి.జయలక్ష్మి తదితర కుటుంబసభ్యులు దుఃఖంలో ఉండి కూడా అవయవదానానికి అంగీకరించారు. జీవన్దాన్ కో ఆర్డినేటర్లు అవగాహన కల్పించడంతో వారు ముందుకొచ్చారు. బుధవారం రెండు నేత్రాలను ఎల్.వి.ప్రసాద్ ఇనిస్టిట్యూట్కు, ఒక కిడ్నీఎన్నారై హాస్పిటల్కు తరలించారు. మరో కిడ్నీ, లివర్ను ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్బాబు మాట్లాడుతూ అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు. -
నేడు వైద్యులకు అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాల సహకారంతో జిల్లాలోని ప్రైవేట్ వైద్యులకు గురువారం అంటువ్యాధుల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐఎంఏ హాల్లో సాయంత్రం 7 నుంచి 10 గంటల సదస్సు ఉంటుందని చెప్పారు. ప్రైవేట్ వైద్యులందరూ హాజరు కావాలని కోరారు. నరసరావుపేట: ఎస్సీ నిరుద్యోగులకు శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాబాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన కింద మేళాతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాలి: శ్రీలక్ష్మీనారాయణసహిత శ్రీసుదర్శనయాగ మహోత్సవం బుధవారం వైభవంగా ఆరంభమైంది. సామాజిక సేవకుడు వేమూరి విజయభాస్కర్ చేపట్టిన భారీ యాగశాలలో వేదాంతం నాగమారుతి పర్యవేక్షణలో 20 మంది రుత్వికులు ఉదయం ఏడు గంటలకు సూర్యనమస్కారాలు, దీక్షతో ఆరంభించారు. వేమూరి విజయభాస్కర్, సీత దంపతులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్నారు. తొలిరోజున సినీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, తాడిబోయిన హరిప్రసాద్ యాగాన్ని సందర్శించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు బుధవారం విడుదల చేశారు. ఏఎన్యూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,985 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,870 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యూషన్కు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాల 24వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చని చెప్పారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్, సబ్ జూనియర్ బాల బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేరేచర్ల ఫుట్బాల్ మైదానంలో జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ బాయ్స్ విభాగాలకు సంబంధించి ఆదివారం ఉదయం సెలక్షన్ జరుగుతాయని తెలిపారు. జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ గర్ట్స్ సంబంధించి 22వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 7337585790 సంప్రదించాలని కోరారు. పెడన: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి తమ ఆధ్వర్యంలో ఈ నెల 22న రాష్ట్రస్థాయిలో కలె క్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెడన పట్టణంలోని సర్వోదయ సొసైటీలో బుధవారం జరిగిన కృష్ణా జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అమలుపై చర్చించారు. -
ఈశాన్య ప్రాంత ప్రజలకు న్యాయసేవలు
గుంటూరు లీగల్: ఈశాన్య ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజల కోసం ఇన్చార్జి చైర్మన్ ఒకటో అదనపు జిల్లా జడ్జి వీఏఎల్.సత్యవతి చేతులమీదుగా లీగల్ ఎయిడ్ క్లినిక్ను జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ క్లినిక్ ద్వారా న్యాయ సేవలు మరింత విస్తృతం చేయవచ్చని పేర్కొన్నారు. న్యాయవాదులను, పారా లీగల్ వలంటీర్లను నియమించనున్నట్లు వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక క్లినిక్ ఉద్దేశం ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉంచడమేనన్నారు. ప్యానెల్ అడ్వొకేట్స్, పారా లీగల్ వలంటీర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
‘గోల్ రీచ్ కాలేకపోతున్నాను క్షమించండి’
తండ్రి సెల్ఫోన్కు మెసెజ్ పెట్టి అదృశ్యమైన విద్యార్థిని లక్ష్మీపురం: గుంటూరు ఓ కళాశాలలో ఇంటర్ సీఎంఏ చదువుతూ పరీక్షల్లో ఫెయిల్ అయి.. మనస్థాపంతో తండ్రికి మెసెజ్ పెట్టి ఓ కుమార్తె అదృశ్యమైన ఘటనపై అరండల్పేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చిల్లర అనురాధ అనే విద్యార్థిని గత మూడు సంవత్సరాలుగా బ్రాడీపేటలోని హాస్టల్లో ఉంటూ గుంటూరులోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఇంటర్ సీఎంఏ చదువుతోంది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయింది. ఈక్రమంలో పది రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్ళిన రోజు తన తండ్రికి ‘నన్ను క్షమించండి నేను జాబ్ కోసం వెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి సాధించి వస్తానని.. నేను గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాను’ అని సెల్ఫోన్కు మెసేజ్ చేసింది. దీంతో అప్పటి నుంచి చుట్టు పక్కన బంధుమిత్రుల వద్ద విచారించినా ఎంతకు ఆచూకీ తెలియక పోవడంతో దిక్కుతోచక అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అనురాధ తల్లి శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది. అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ ఎత్తివేయాలి
గుంటూరు వెస్ట్: రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని హైకోర్టు న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్రం తరఫున వై.కోటేశ్వరరావు (వైకె) ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో రాజ్యాంగ సవరణ ద్వారా 50శాతం సీలింగుని రద్దు చేయించవలసిందిగా తమ నివేదిక ద్వారా సిఫారు చేయవలసిందిగా కమిషన్ని కోరారు. అలాగే, రాజ్యాంగ సవరణ చట్టాన్ని పరిరక్షించే విధంగా, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఆ చట్టాన్ని చేర్చాలని కూడా సూచించారు. బీసీ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న విధంగా జనాభా దామాషా ప్రకారం కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో కల్పించే బీసీ రిజర్వేషన్లను అన్ని కులాలకు అందే విధంగా, ఏబీసీడీఈలుగా వర్గీకరించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 50 శాతం సీలింగుని ఎత్తివేయించే విధంగా ఒత్తిడి తేవాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.వి. రమణయ్య, బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గం సాంబశివరావు, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఓర్సు ప్రేమ రాజు, శాలివాహన సంఘం రాష్ట్ర నాయకురాలు నాగేశ్వరి, హైకోర్టు న్యాయవాది రాచర్ల కాంత్ ఉన్నారు. -
లారీ ఢీకొని దంపతులు మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన మండలంలోని వేములూరిపాడు గ్రామ శివారులో మల్కాచెరువు వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన ఉమ్మడిదల కోటేశ్వరరావు(65), పద్మావతి(60)లు విజయవాడలోని పెనుమలూరులో కుమారుడివద్ద ఉంటున్నారు. కాగా గుంటూరులోని కుమార్తెను చూసి తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం దేచవరం వెళుతుండగా మండలంలోని మల్కాచెరువు వద్ద గుంటూరు నుంచి వస్తున్న లారీ వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాడికొండ: రాజధాని అమరావతిలో లింగాయపాలెం – ఉద్ధండరాయునిపాలెం గ్రామాల మధ్య ఎన్ – 10 సీడ్యాక్సెస్రోడ్డు (ఈ–03) కూడలిలో అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సెంట్రల్ నర్సరీని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాజధాని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 34 ప్రధాన రహదార్లకు ఇరువైపులా సుమారు 700 కి.మి. మేర చెట్లు పెంచి మంచి గాలి, నీడ అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఈ సెంట్రల్ నర్సరీలో 45 వేల మొక్కలను పెంచాలని ఏడీసీ లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వెల్లడించారు. బుధవారం ఆమె సెంట్రల్ నర్సరీలో మొక్కలు నాటి నర్సరీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 18 ఎకరాలలో ఈ నర్సరీని అభివృద్ధి చేస్తారు. ఫేజ్ – 1లో తొలుత 10 ఎకరాలలో అభివృద్ధి పనులను చేపట్టారు. దఫాల వారీగా తక్కిన విస్తీర్ణంలో కూడా నర్సరీని తీర్చిదిద్దుతారు. ఏడీసీ ఉద్యనవన, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో బాలుడు దుర్మరణం
పెదకాకాని: విద్యుత్ షాక్కు గురైన బాలుడు మరణించిన సంఘటన పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి రత్నాల చెరువు చెందిన క్రోసూరి రవికిరణ్(17) గత కొంతకాలంగా గుంటూరు ఆటోనగర్లోని షెడ్లో లారీలకు బాడీలు అమర్చే పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు మంగళగిరి నుంచి గుంటూరు ఆటోనగర్ వచ్చి పనులు చేసుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఎప్పటి మాదిరిగానే మంగళవారం లారీకి బాడీ అమర్చే పనులు చేస్తుండగా కరెంట్ షాక్ గురై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రవికిరణ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ నుంచి మంగళగిరికి కనకదుర్గ వారధి మీదుగా వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని కారు బుగ్గిపాలైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన టి.వందనంరాజు కారులో నగరానికి వచ్చి మంగళవారం రాత్రి తిరిగి వెళ్తుండగా వారధిపై ఏడో నంబర్ పిల్లర్ వద్దకు రాగానే ఒక్కసారిగా కారులో నుంచి దట్టమైన పొగరావడం గమనించాడు. వెంటనే అతను అప్రమత్తమై కారును ఆపి బయటకు దిగిపోయాడు. చూస్తుండగానే ఒక్కసారిగా కారంతా మంటలు వ్యాపించాయి. ప్రయాణ సమయంలో కారులో ఒక్కరే ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ఘటనతో వారధిపై ట్రాఫిక్జామైంది. -
కాపర్ కేబుల్స్ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో కాపర్ కేబుల్స్ అపహరించిన వ్యక్తిని తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు మంగళవారం అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ యూనివర్సిటీలో లక్షల రూపాయల విలువ చేసే కాపర్ కేబుల్స్ దొంగతనానికి పాల్పడిన మానిగల మంగయ్యను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 30 కేజీల కాపర్కేబుల్స్, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో మంగయ్య పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ సమావేశంలో తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యువతిపై లైంగికదాడికి యత్నం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తెనాలిరూరల్: యువతిపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటనలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విశ్వసనీయ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చినరావూరుకు చెందిన యువతి ఇక్కడి వహాబ్ చౌక్లోని సోలార్ సిస్టమ్ షాపులో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. ఇదే షాపులో మేనేజర్గా పనిచేసే రాజేష్ నెల రోజులుగా యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. గాంధీచౌక్లోని షాపు గోడౌన్కు సోమవారం మధ్యాహ్నం పిలిచాడు. యువతి రాగానే తలుపు వేసి లైంగికదాడికి యత్నించాడు. యువతి తప్పించుకుని వెళ్లింది. విషయం యువతి బంధువులకు తెలియడంతో సుమారు 20 మంది రాజేష్కు దేహశుద్ధి చేసేందుకు మంగళవారం ఉదయం సోలార్ షాపు వద్దకు వెళ్లారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. ఐదు ఇసుక టిప్పర్లు సీజ్ కొల్లిపర: ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్లను స్వాధీనం చేసుకుని మంగళవారం కేసు నమోదు చేసినట్లు కొల్లిపర ఎస్సై ప్రసాద్ తెలిపారు. చిలుమూరు లంక నుంచి గుంటూరుకి ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మండల పరిధిలోని తూములూరు అడ్డ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఐదు టిప్పర్లను ఆపి పరిశీలించగా వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు, వే బిల్లు లేకపోవడంతో సీజ్ చేశారు. తహసీల్దార్ జి సిద్ధార్థకు నివేదిక సమర్పించారు. ఒక్కొక్క టిప్పర్కి రూ.10,000 చొప్పున మొత్తం రూ.50,000 జరిమానా విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ ఎటువంటి బిల్లులు, మైనింగ్ అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026సొంత భవనాల్లేక చింతలు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడంలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, పిల్లల బాగోగులు చూడాల్సిన అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. మౌలిక వసతులు లేక నిత్యం చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం టీడీపీ ప్రభుత్వ పాలనలో కనీసం నిధులు కేటాయించడం, భవనాల నిర్మాణం చేపట్టడం లేదు. సత్తెనపల్లి: చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం పనిచేయాల్సిన అంగన్వాడీ కేంద్రాలు డీలా పడుతున్నాయి. చాలా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు, ఇరుకై న గదుల్లో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చాలావరకు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అద్దె భవనాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో 2,301 అంగన్వాడీ కేంద్రాలుండగా... 571 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 1,065 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 395 కేంద్రాలు అద్దె చెల్లించాల్సిన పని లేకుండా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్లో కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం 0–6 ఏళ్లలోపు చిన్నారులు 97,502 మంది, గర్భిణులు 9,548 మంది, బాలింతలు 9,414 మంది నిత్యం సేవలు అందుకుంటున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్త భవనాలు మంజూరుకు నిధులు కేటాయించేందుకు చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటి పనులు ప్రారంభమైన కొంత కాలానికే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, తర్వాత ఏర్పడిన టీడీపీ సర్కార్ వీటి గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు. దీంతో ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. తుది దశలో 56, శ్లాబ్ లెవల్లో 14, రూఫ్ స్థాయిలో 2, బేస్మెంట్ లెవల్లో 2 నిర్మాణాలు ఉన్నాయి. వీటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ 3.80 కోట్లు మంజూరు చేయాలని ఐసీడీఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ఇవే కాక జిల్లాలో శాటిలైట్ కేంద్రాలు 11, ఫౌండేషన్ కోలొకేటెడ్ కేంద్రాలు 2 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి తుది దశకు చేరినప్పటికీ కేవలం తలుపులు, కిటికీలు, విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సదుపాయం వంటి చిన్న పనులను పూర్తి చేస్తే వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదు. ఉపాధి హామీ పథకం కింద 190 కేంద్రాల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని ఐసీడీఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు అతీగతీ లేదు. కొన్ని కేంద్రాలకు అద్దె చెల్లిస్తున్నప్పటికీ మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కూడా లేకుండా అధ్వానంగా ఉన్నాయి. కనీసం చాపలు లేకుండా పిల్లలు నేల మీద కూర్చునే పరిస్థితి చాలా కేంద్రాల్లో నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. సొంత భవనాలకు నోచుకోని అంగన్వాడీ కేంద్రాలు భవనాలు మంజూరు చేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ వచ్చాక పట్టించుకునే దిక్కే లేదు నిత్యం నానా ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, మహిళలుఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి 4,130 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. -
విత్తన ఎంపిక కీలకం
కొరిటెపాడు(గుంటూరు): విత్తనం మంచిదైతే పంట బాగా పెరుగుతుంది. దిగుబడులు మెరుగ్గా ఉంటాయి. కొంతమంది రైతులు విత్తనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోరు. దొరికింది కదాఅని ఏదో ఒకటి కొని విత్తుకుని నష్టపోతుంటారు. వ్యవసాయంలో రాణించడానికి, అధిక దిగుబడులు పొందడానికి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. రైతులు సరైన విత్తనం ఎంపిక చేసుకోకుండా ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదు. విత్తన ఎంపిక, కొనుగోలులో కొన్ని మెళకువలను తప్పనిసరిగా పాటంచాలి. మరో వారం, పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు తమ పొలాలను సీజన్కు సిద్ధం చేసుకుని పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాల కొనుగోలు, ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ఎం.పద్మావతి సూచిస్తున్నారు. మంచి దిగుబడి విత్తనం ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాల ఎంపిక, కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవేంటో చుద్దాం. -
ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చిలకలూరిపేట: నిరుద్యోగులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్లో మంగళవారం మెగా జాబ్మేళాను నిర్వహించారు. జాబ్మేళాను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండేళ్లలో నియోజకవర్గ పరిధిలో 1500 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయని, ఇందులో 600 మంది ఉద్యోగాల్లో చేరారని వివరించారు. ఈ రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా 6,500 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. వచ్చే నెలలో దివ్యాంగులకు ప్రత్యేక జాబ్మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగంతోనే జీవితానికి గుర్తింపు, విలువ, సమాజంలో గౌరవం లభిస్తాయని చెప్పారు. జాబ్మేళాకు 50 కంపెనీలు వచ్చినట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఇ.తమ్మాజీరావు తెలిపారు. దీనికి సంబంధించి ఉద్యోగాల కోసం 2,152 మంది హాజరుకాగా, దీనిలో 826 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి భరద్వాజ్, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అదనపు అధికారి వీసీహెచ్ రామాంజనేయులు, ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్రనాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులు నష్టపోకుండా చూస్తాం
రాజుపాలెం: రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, సకాలంలో నష్ట పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి ఆర్డీఓ గోపాలకృష్ణ రైతులకు భరోసా ఇచ్చారు. మండలకేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో రైల్వే ట్రాక్ వలన భూములు కోల్పోయే రైతులకు అవార్డు ప్రకటించే ముందుగా మంగళవారం రైతుల అభిప్రాయాలను సేకరించారు. మండలంలో అనుపాలెం, చౌటపాపాయపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాలకు సంభందించిన 249 మంది రైతులకు సంబంధించిన సుమారు 20 ఎకరాల సాగు భూములను రైల్వే అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి అవార్డు ప్రకటించే ముందుగా రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. కొంతమంది రైతులు ఆర్డీఓతో మాట్లాడుతూ ఇప్పుడు బయట మార్కెట్ రేటు ఎకరం రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ధర పలుకుతుందని ప్రభుత్వం చాలా తక్కువ నష్ట పరిహారం ఇస్తుందని వాపోయారు. దీంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రేటుతో కలిపి రెండున్నర రెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మీ పొలాల్లో ఉన్న బోర్లకు, బావులకు పెద్ద చెట్లకు అదనంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఇది సమంజసం కాదనిపిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తహసీల్దార్ దుర్గేశ్వరరావు, ఆర్ఐ గోపి, వీఆర్వోలు పుల్లయ్య, దుర్గాభాయి, శాంతి, తదితరులు పాల్గొన్నారు. -
ఐదు పాఠశాల బస్సులు సీజ్
నరసరావుపేట రూరల్: ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుపుతున్న ఐదు పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాల బస్సులలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆరు బృందాలు పాల్గొని పాఠశాల బస్సులను తనిఖీ చేశాయి. జిల్లా రవాణాధికారి జి.సంజీవ కుమార్ మాట్లాడుతూ చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్, పన్ను చెల్లింపు రసీదులు, పర్మిట్లు లేకుండా పాఠశాల బస్సులను నడపవద్దని హెచ్చరించారు. పది రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల వాహనాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.గుంటూరు వెస్ట్ (క్రీడలు): హైదరాబాద్లోని కొంపల్లిలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 2వ దక్షిణాది రాష్ట్రాల పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో గుంటూరు క్రీడాకారులు ఎనిమిది బంగారు, ఆరు రజత, ఆరు కాంస్య పతకాలు సాధించారు. మొత్తం 20 మెడల్స్ సాధించారని జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. పోటీల్లో తోట నిహిత మన్వి, అనపర్తి ఆరాధ్య, తోట నేహ, విన్సెంట్, చరణ్, కె. నిహాల్, రిషి మెడల్స్ సాధించారన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను పలువురు అభినందించారు. వేద సీడ్స్ ఆర్థిక సాయం కొరిటెపాడు(గుంటూరు): జూనియర్ బాల బాలికల జాతీయ బాక్సింగ్ పోటీలకు 70 కిలోల విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన కార్తికేయ ఎంపికైనట్లు గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ తెలిపారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అసోసియేషన్ సభ్యులతో కలసి మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో కార్తికేయ బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఈ పోటీలు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నట్లు వెల్లడించారు. కార్తికేయకు వేద సీడ్స్ తరఫున సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ జాతీయ పోటీలలో కూడా కార్తికేయ రాణించి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచిన కార్తికేయను అభినందించారు. కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ కోలా చిరంజీవి, గంధం వెంకటేశ్వరావు, ఎం.రాజేశ్వరరావు, కోచ్ ఇమ్మానియేల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 516.80 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
రేపు దుగ్గిరాల బంద్
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిబాధిత పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో వైఫల్యానికి నిరసనగా ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్ల పసుపు కాలి బూడిదైనా గాని ప్రభుత్వం పట్టించుకోవకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, అధికారులు చేసిన ఒప్పందానికి విలువ లేకపోతే రైతులకి ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కనీసం 179 సార్లు మంత్రులు, అధికారులు చుట్టూ అగ్ని బాధిత పసుపు రైతులు ప్రదక్షిణలు చేసినా కరుణించలేదన్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయని కూడా గుర్తుచేశారు. ఈ నెల 8న తెనాలిలో రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 10న దుగ్గిరాల పసుపు వ్యవసాయ మార్కెట్ యార్డు ముట్టడి చేసినట్టు తెలిపారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్కు అగ్ని బాధిత పసుపు రైతులు కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. దుగ్గిరాల ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, రైతు శ్రేయోభిలాషులు కార్మికులు, విద్యా వాణిజ్య సంస్థలు అందరూ బంద్కు సహకరించాలని కోరారు. వీరితో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు కూడా ఉన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి వాహనాలు దగ్ధం పట్నంబజారు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి ద్విచక్రవాహనాలు దగ్ధమైన ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం.. కొత్తపేట పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ సోమవారం రాత్రి ఈదురుగాలులకు పేలింది. నిప్పులు చెలరేగడంతో అక్కడ ఉన్న మూడు ద్విచక్రవాహనాలు తగలబడినట్లు సమాచారం. అయితే పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు సైతం పోలీసులు రోడ్డుపైనే పార్కింగ్ చేసిన పరిస్థితుల్లో, వాటితోపాటు ఇతరుల వాహనాలు కూడా తలగబడినట్లు తెలుస్తుంది. గంజాయి కేసులో నిందితులు అరెస్టు పట్నంబజారు: చెడు వ్యసనాలకు బానిసలుగా మారి గంజాయి సేవించడంతోపాటు, విక్రయాలు చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, కొత్తపేట సీఐ వీరయ్య వివరాలు మీడియాకు మంగళవారం వెల్లడించారు. నెహ్రూనగర్కు చెందిన గుర్రం శివకుమార్, బత్తుల శశాంక్, శ్రీనగర్కు చెందిన చెన్నంశెట్టి రుద్రబాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డితోటకు చెందిన దాసరి గురవయ్యలు నెహ్రూనగర్లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిందితుల నుంచి ఐదు కిలోల 360 గ్రాముల గంజాయి స్వాధీనం చసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై నిరసన మేడికొండూరు : గ్రామ పునర్నిర్మాణ సంఘం (వీఆర్ఓ)లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు తమకు రావలసిన పీఎఫ్, గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇతర చట్టబద్ధ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను ఎన్నో సంవత్సరాలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడంతో మరోసారి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ 2018 సంవత్సరం నుంచి తమకు రావలసిన బకాయిల కోసం నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపారు. పీఎఫ్ కమిషనర్ సహకారంతో పలుమార్లు సంఘ యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించడం, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు, చర్చలు నిర్వహించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ సంఘ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు ప్రాంత ప్రతినిధి టి.మురళి, కమిటీ సభ్యులు రమేష్బాబు, మోహన్, ఏసోబు, విజయలక్ష్మి, సునీల్ తదితరులు పాల్గొని మాజీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ‘పది’లో రోజువారీ పరీక్షలు ఉపసంహరించుకోవాలిగుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలలు పునః ప్రారంభమైన తరుణంలోనే పదో తరగతి విద్యార్థులకు రోజువారి పరీక్షలను నిర్వహించాలనే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడిపాటిదాస్, మొహమ్మద్ ఖాలిద్ డిమాండ్ చేశారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీమ్బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యాంశాలను చాప్టర్ వైజ్గా బోధించాల్సిన సమయంలో రోజువారి పరీక్షలు నిర్వహించడం వలన ప్రశ్న, సమాధానాలుగా తరగతులు మారిపోతాయని అన్నారు. రోజువారి పరీక్షలను ఉపసంహరించుకుని వారంతపు పరీక్షలు నిర్వహించే విధంగా ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీ టీఎఫ్ ఫిరంగిపురం, పొన్నూరు మండల శాఖల అధ్యక్షులు జహంగీర్, వి.కిషోర్షా తదితరులు పాల్గొన్నారు. -
రాంజీ చట్టంతో ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం
లక్ష్మీపురం: జూలై 1 నుంచి అమలులోకి రానున్న వీబీపీ రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు కోరారు. మంగళవారం గుంటూరులోని సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లతోందన్నారు. గ్రామాల్లో ఫేస్ యాప్ వలన ఉపాధి కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనికి మస్టర్ వేసే దాంట్లో భాగంగా ఫొటో మ్యాచ్ అయితేనే పని చూపుతున్నారని, ఇది కూడా పని ప్రారంభంలో ఒకసారి పని పూర్తయిన తర్వాత రెండవసారి ఫొటో తీస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్వర్ పనిచేయక ఫొటో మ్యాచ్ కాక ఉపాధి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కార్మికులకు పని చేసిన 15 రోజుల్లోపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో వేతనం ఇచ్చేటప్పుడు పే ిస్లిప్పులు ఇచ్చే వారిని, దానిలో ఎంత పని చేసింది ఎంత డబ్బులు పడుతుంది వివరంగా అర్థమయ్యేదన్నారు. ప్రస్తుతం ఎక్కడా ప్లే స్లిప్పులు ఇవ్వటం లేదన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ చట్టం ప్రకారం వంద రోజులు పనిని కల్పించాలని కోరారు. జూలై ఒకటిన గ్రామ సచివాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాల్లో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. -
‘బకాయిలకు’ చికిత్స చేసేదెవరు?
● జీజీహెచ్లో అడ్డగోలుగా పలువురు వ్యాపారుల తీరు ● అద్దెలు చెల్లించక, కరెంట్ బిల్లులు కట్టక ఖజానాకు గండి ● ప్రజాప్రతినిధుల అండకు తోడు అధికారుల మద్దతే కారణంగుంటూరు జీజీహెచ్లో కొందరు అడ్డగోలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆస్పత్రి ఆవరణలో దుకాణానికి నెలవారీ అద్దె చెల్లించాల్సిన పనిలేకుండా.. కరెంటు బిల్లులు కూడా కట్టనవసరం లేకుండా ఈ వ్యవహారం సాగుతోంది. ప్రజాప్రతినిధుల మద్దతు, ఆస్పత్రి పరిపాలన అధికారులను ప్రసన్నం చేసుకుని ఇలా పలువురు ఆర్జిస్తున్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో పాలు, పాల ఉత్పత్తుల షాపులు , ఫొటో స్టాట్ షాపు, టీ స్టాళ్లు, జనరిక్ మందుల షాపులు ఉన్నాయి. వీరు జిల్లా కలెక్టర్ అనుమతితో వ్యాపారాలు చేస్తున్నారు. కొంత మందికి అనుమతులు లేవని ఇటీవల జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందింది. నామినల్గా జిల్లాలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ అద్దెతో జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతి నెల అద్దె ఇవ్వడం లేదు. కరెంటు బిల్లులు సైతం చెల్లించడం లేదు. ఆసుపత్రి అధికారులు కూడా ఏళ్ల తరబడి ఇలా చేస్తున్న వ్యాపారులపై కనీస చర్యలు తీసుకోకపోవడం లేదు. హెచ్డీఎస్ ఆదాయానికి గండి ఆస్పత్రికి ఆదాయం వచ్చేలా పనిచేయాల్సిన పరిపాలన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు. సొంతంగా లబ్ధి పొంతుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి అభివృద్ధి సంఘం (హెచ్డీఎస్) చైర్మన్గా జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు ఉన్నారు. ప్రతినెలా, లేదా మూడు నెలలకొకసారి హెచ్డీఎస్ సమావేశాలు నిర్వహించి. ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కనీసం అలాంటి సమావేశాల్లోనైనా ఈ మొండి బకాయిల గురించి అజెండాలో పెట్టకుండా, చర్చించకుండా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతున్నారు. ఆసుపత్రిలో నిధుల కొరతతో హెచ్డీఎస్ అకౌంట్ ఎన్నడూ లేని విధంగా అల్లాడుతోంది. ఆసుపత్రిలో వ్యాపారాలు చేసేవారి వద్ద నుంచి సకాలంలో నిధులు సేకరించడం ద్వారా హెచ్డీఎస్ అకౌంట్కు నిధులు సమకూరుతాయి. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
నకరికల్లు: హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి అన్నారు. మండలంలోని కుంకలగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పీహెచ్సిలోని మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రికార్డులు తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంజీవని కార్యక్రమం, ఎలక్ట్రానిక్ హెల్త్కార్డుల నిర్వహణపై వాకబు చేశారు. పీహెచ్సీ పరిధిలోని గర్భిణుల వివరాలు నూటికి నూరుశాతం నమోదు చేయాలన్నారు. పీహెచ్సీలో చేస్తున్న రక్తపరీక్షలు గురించి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ధారణ ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఎం.పూజశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారి కొంపల వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ రాధాకృష్ణమూర్తి, స్టాఫ్ నర్స్ శివకుమారి, ఫార్మాసిస్ట్ కల్పన, ల్యాబ్ టెక్నీషియన్ లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి -
కుడికాలువకు నీరు నిలుపుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ కుడికాలువకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. గత నెల 25న తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణానది యాజమాన్య బోర్డు 10 టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తి అవ్వటంతో కుడికాలువకు పూర్తిగా నీటిని నిలుపుదల చేశారు. కార్యక్రమంలో డీఈఈ టి మురళీధర్, ఏఈఈ సుధ, డ్యాం సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు. పెదకాకాని: సినీ నటుడు వడ్డే నవీన్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ట్రానన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం వీవీఐటీయూలో సందడి చేసింది. ఈ చిత్రం జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. కార్యక్రమంలో హీరో వడ్డే నవీనన్తో పాటు హీరోయిన్ రాశి సింగ్ పాల్గొన్నారు. చిత్రబృందానికి వీవీఐటీయూ ప్రో–ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ స్వాగతం పలికారు. నవీన్ మాట్లాడుతూ ఈ చిత్రం బలమైన కథాంశంతో సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చిత్రబృందం విద్యార్థులతో కలసి నృత్యాలు, సెల్ఫీలతో సందడి చేసింది. బాపట్లటౌన్: బైండోవర్ బాండ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో నిందితుడిగా ఉన్న స్టువార్టుపురం గ్రామానికి చెందిన మాదిగాని రామచంద్రకుమార్ అలియాస్ పప్పును వెదుళ్లపల్లి పోలీసులకు సోమవారం కోర్టుకు అప్పగించారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ 30 రోజుల రిమాండ్, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు అనుమతితో సోమవారం రామచంద్రకుమార్ను బాపట్ల సబ్జైల్కు తరలించారు. గుంటూరు లీగల్: వృద్ధులకు ఏమైనా న్యాయపరమైన సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదే శాల మేరకు సోమవారం ఎస్వీఎన్ కాలనీ సమీపంలోని దాక్షిణ్య మానసిక వికలాంగుల స్కూల్, ఓల్డ్ ఏజ్ హోంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తొలుత దాక్షిణ్య స్కూల్ను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడారు. వారి సమస్యల గురించి అక్కడవున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కోయవారిపాలెం, గుంటూరులోని నవీన్ ఆదర్శ్ మహిళా మండలి ఓల్డ్ ఏజ్ హోంను సందర్శించి, వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నలందా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హైవే రోడ్డుపై గుర్తు తెలియని పాప తిరుగుతుండటాన్ని సత్తెనపల్లి పోలీసులు గుర్తించి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. పాప తన పేరు షేక్ జాన్, తండ్రి గౌస్ అని, గుంటూరు క్లబ్ వద్ద చినపలకలూరు గ్రామంగా చెబుతుందని ఎస్ఐ అమిరుద్దీన్ తెలిపారు. పాప ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ, ఎస్ఐ, పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
ఆత్మహత్యే దిక్కు...
గత రెండు సంవత్సరాలుగా నా భర్తను టీడీపీ నేతలు సీఐ వెంకట్రావు సహకారంతో వేధిస్తున్నారు. ఇప్పటికే రూ.30 లక్షలు కట్టించుకున్నా అక్రమ కేసులు బనాయిస్తునే ఉన్నారు. ఆదివారం సైతం తీవ్రంగా కొట్టడంతో అనారోగ్యానికి గురయ్యాడు. కులం పేరుతో సీఐ తిడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాన్ని తట్టుకోలేకనే నా భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా లాక్కుంటున్నారు. సీఐపై చర్యలు తీసుకోకుంటే పిల్లలతో కలసి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమే దిక్కు. – జడ యామిని, దళిత నేత సురేంద్ర భార్య -
జిల్లాలో క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లావ్యాప్తంగా క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో అభ్యుదయం కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మండలానికి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి ఎఫ్పీఓలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఒక్కో క్లస్టర్కు రూ.3కోట్ల వరకూ సబ్సిడీతో రూ.5కోట్లవరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికి బెల్లంకొండ, అచ్చంపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు ఐదు క్లస్టర్లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, పెండింగ్లో ఉన్న క్లస్టర్లకు త్వరగా రుణాలు మంజూరు చేయాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద సబ్సిడీ రుణాల ప్రాసెసింగ్ పూర్తిచేసి ఆరు నెలల్లోగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఎల్డీఎం రామ్ప్రసాద్ పాల్గొన్నారు. అంగన్వాడీల్లో విజయవంతంగా న్యూట్రీగార్డెన్లు.. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్ల నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. సోమవారం న్యూట్రీ గార్డెన్ల నిర్వహణపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖాళీ స్థలం అందుబాటులో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకు కూరల పెంపకం చేపట్టి, వాటితో వండిన ఆహారాన్ని అందించే కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు. ఇదే తరహాలో జిల్లాలోని అన్నిపాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్లు నిర్వహించాలని ఆదేశించారు. కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్లు మహిళలకు ఏటీఎం (ఎనీ టైం మనీ)లాగా పనిచేసే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. ఏపీ సీఎన్ఎఫ్ పీడీ అమలకుమారి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డ్వామా పీడీ సిద్ధలింగ మూర్తి, డీపీఓ నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అచ్చంగా పచ్చ పోలీసింగ్!
సాక్షి, నరసరావుపేట: ఖాకీ చొక్కొ వేసుకున్నా ఆ సీఐ చేసేది పచ్చ పోలీసింగ్. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త కన్నా ఆ పార్టీ కోసం సదరు సీఐ బరితెగించి మరీ పనిచేస్తుంటారు. స్థానికి ప్రజాప్రతినిధి నుంచి ఓ ఫోన్ కాల్ వస్తే చాలు పోలీసు బాస్ల ఆదేశాలను సైతం పక్కనపెట్టి అప్రజాస్వామికంగా పనిచేస్తుంటారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా పదుల సంఖ్యలో అక్రమ కేసులు బనాయించి వారిని వేధించడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడి దోచుకుంటున్నాడు. ఆ స్టేషన్ ముందు ఇక్కడ సివిల్ పంచాయితీలు పరిష్కరింపబడవు అని బోర్డు ఉంటుంది... కానీ లోపల మాత్రం నిత్యం అదే పంచాయితీల గోల. అదే పిడుగురాళ్ల పోలీసుస్టేషన్.. ఆయనే సీఐ శ్రీరాం వెంకట్రావ్. ఆయన వేధింపులు తాళలేక ఇప్పటికే పదుల సంఖ్యలో జనం ఊళ్లు వదలి వెళ్లిపోగా ఓ ఆర్యవైశ్య మహిళ స్టేషన్లోనే కత్తితో చేయి కోసుకోని ఆత్మ హత్యాయత్నం చేసింది. తాజాగా సోమవారం ఓ దళిత యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మ హత్యాయత్నం చేయడంతో మరోసారి సీఐ ప్రవర్తనపై చర్చ నడుస్తోంది. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులే లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిడుగురాళ్ల సీఐ వెంకట్రావ్ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారీ తీస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సానుభూతిపరులే టార్గెట్గా అక్ర మ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నాడు. పిడుగురాళ్ల పరిధిలోని ఓ గ్రామంలో రాజకీయ నాయ కుడి విగ్రహం చేయి విరిగింది. దానితో ఏమాత్రం సంబంధంలేని వైఎస్సార్ సీపీ కార్యకర్తను స్టేషన్కు తీసుకువచ్చి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తేనే ఆ కేసులో ఇరికించనని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. గాలికి అధికారపార్టీ ఫ్లెక్సీ చిరిగినా దానికి కారణం మీరేనంటూ వైఎస్సార్సీపీ నేతలను వేధించి తీవ్రంగా హింసించడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. వైఎస్సార్ సీపీ సోషల్మీడియా యాక్టివిస్టులే టార్గెట్గా రౌడీషీట్లు, పీడీ యాక్టులు తెరిచాడు. సివిల్ పంచాయితీలకు అడ్డా పిడుగురాళ్ల పోలీసుస్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా సీఐ వెంకట్రావ్ మార్చాడు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం వంటివి ఇక్కడినుంచే చేస్తుంటారు. ఆర్య వైశ్య వ్యాపారులను అనేకమందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారిచే ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుకు ఉన్న క్వార్టర్ట్స్లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. గత ఏడాది డిసెంబర్లో ఓ ఆర్యవైశ్య మహిళ పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఇంత జరిగినా ఆ సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో ఆర్యవైశ్యులు చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోకపోతే ఇంకెదరి ప్రాణాలు, ఆస్తులు పోతాయన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. -
రక్షణ కరువైనది
అచ్చంపేట: కృష్ణానది తీర గ్రామాల్లో రక్షణ కరువైంది. అధికారుల నిఘా కొరవడింది. ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉండవు. నదిలో ఎక్కడ లోతు ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ లోతు తక్కువగా ఉంటుందో తెలియని పరిస్థితులున్నాయి. దీనికి తోడు పలు గ్రామాల్లో నదిలో భారీ పొక్లెయినర్లతో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఇసుక తోడేస్తున్నారు. ఆ గుంతలలో పడి అనేక మంది మృత్యువాత పడ్డారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు, నదిలో ప్రమాదం జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావిడి చేయడం, ఆ తరువాత తమకేమి పట్టనట్లు ఉండటం అధికారులకు పరిపాటుగా మారింది. నదీ తీరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో కూడా కనీసం హెచ్చరిక బోర్డులు ఉంచకపోవడం గమనార్హం. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు మండలంలోని కోనూరు, కస్తల, కోగంటివారిపాలెం, గింజుపల్లి, మాదిపాడు, తాడువాయి, చింతపల్లి, చామర్రు గ్రామాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉంటాయి. ఈ గ్రామాలకు పండుగలకు, పబ్బాలకు వచ్చే బంధువులు ఫంక్షన్లు అయిపోగానే నది సందర్శనకు వెళ్లి అందులో స్నానాలకు, ఈతకు, లోతు తక్కువగా ఉందనుకుని ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు, ఒడ్డునే ఉండే చేపల పడవల్లో నదిలో సరదాగా తిరిగేందుకో యత్నిస్తూ.. ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. సెలవు రోజుల్లోనే.. కృష్ణానదిలో సెలవు రోజుల్లోనే ప్రమాదాలు ఎక్కు వగా జరుగుతున్నాయి. సెలవురోజు స్నేహితులతో రావడం, నదిలో దిగి ప్రాణాలు కోల్పోవడం ఇక్కడ నిత్యకృత్యం. అధికారులు నదివద్ద సిబ్బందిని కాప లా ఉంచి అందులోకి దిగకుండా చర్యలు తీసు కోవడం లేదు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ సిబంంది ఎవరికి వారు మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోనూరు వద్ద యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపు (ఫైల్)ఈతకోసం నదిలో దిగే వారికి ఇసుక గుంతలు ఎక్కడున్నాయో, నదిలో రాళ్లు ఎక్కడున్నాయో, ఎక్కడ దిగితే ప్రమాదమో తెలియక మృత్యుఒడిలోకి జారుకుంటున్నారు. అచ్చంపేట మండలంలో ఎక్కువగా గింజుపల్లి, చామర్రు, చింతపల్లి, అంబడిపూడి, కోనూరు, కోగంటివారిపాలెం గ్రామాలవద్దగల నది గర్భంలో అధికార టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద యంత్రాలతో తవ్వుతూ, లోతైన గుంతలు తీసి, ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో నింపి జేబులు నింపుకొంటున్నారు. దీంతో ఆయా చోట్ల నదిలో గుంతలు ఏర్పడి అందులో దిగినవారు బయటకు రాలేక మరణిస్తున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకుని, ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో నదిలో అక్రమ తవ్వకాలు, అకాల మరణాలు ఆగేలా లేవు. కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడే వారిలో దూర ప్రాంతాలనుంచి వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. మాదిపాడుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉండే సత్తెమ్మతల్లిని దర్శించుకునేందుకు ప్రతి ఆది, గురు, శుక్రవారాలలో వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారి దర్శనం తరువాత అక్కడకు దగ్గరలోనే రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పులిచింతల ప్రాజెక్టుకు వద్దకు వెళ్లి, అక్కడనుంచి ప్రాజెక్టుకు దిగువన ఉండే మాదిపాడు, గింజుపల్లి ఇసుక రేవులకు ఈత కొట్టేందుకు వెళుతుంటారు. ఇసుక కోసం తీసిన గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక లోతుల్లోకి వెళ్లి పోవడం, పాచిపట్టిన రాళ్లపై కాలువేసి జారి నదిలో పడిపోయి నదీ ప్రవాహానికి కొట్టుకుపోవడం జరుగుతోంది. -
జనసేనకు టీడీపీ ఝలక్
నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తామే ప్రధాన కారణమని భావిస్తున్న జనసేన శ్రేణులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఝలక్ ఇచ్చారు. వెన్నుపోటు పార్టీగా ముద్ర వేసుకున్న టీడీపీ నేతలు మరోసారి జనసేనకు తామేందో రుచిచూపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సోమవారం కూటమి నాయకులు విజయోత్సవ ర్యాలీ, సభ నిర్వహించారు. అయితే జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన జనసేన పార్టీ సమన్వయకర్తలు ర్యాలీలోగాని, సభకు గానీ హాజరు కాకపోవటం చర్చనీయాంశమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కొన్ని నియోజకవర్గాల నుంచి కొంతమంది కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్తలు రాకపోవడానికి ప్రధాన కారణం పిలుపు లేకపోవటమేనని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించామని భావిస్తున్న జనసేన శ్రేణులకు ఇది వెన్నుపోటుగానే భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రాత్రనకా పగలనకా కష్టపడిన జన సైనికులు విజయోత్సవ సభకు తమ నాయకులకు పిలుపునివ్వకపోవటంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్థానిక పార్టీ కార్యాలయానికి వచ్చిన అనేకమంది నాయకులు తమకు ఎటువంటి పిలుపులేదని వాపోయినట్లుగా తెలియవచ్చింది. ఇది కూటమి ధర్మాన్ని నిర్వీర్యం చేయడమేనని జనసైనికులు భావిస్తున్నారు. రెండేళ్లు కూటమి ప్రభుత్వంలో భాగమైన తమకు సభకు ఆహ్వానం అందించకపోవడం అవమానించడమేనని వారు భావిస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్కు సమీపంలోని పెరేడ్ గ్రౌండ్లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం‘ జిల్లా స్థాయి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గొట్టిపాటి కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతిని సూచిస్తూ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, పల్నాడు ప్రాంతంలో రెండు సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్గా మార్చడమే కాకుండా, కొత్త కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ వేడుకలకు హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావులతో కలిసి రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టం, వ్యవసాయ పరికరాలు, అలాగే డి.ఆర్.డి.ఎ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీ ఆటోలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సాధించిన ప్రగతిని వివరించారు. పల్నాడు జిల్లా ప్రగతి పథంలో మరింత వేగవంతంగా ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. -
సీఐపై కేసు నమోదు చేయాలి
టీడీపీ ప్రభుత్వంలో పోలీసులే దొంగతనం, గూండాయిజం చేస్తున్నారు. ఇందుకా చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చింది. సురేంద్ర అనే దళిత యువకుడిని సంవత్సరం క్రితం పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి భయపెట్టి రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారు. ఆస్తులు అమ్మి కట్టాడు. అయినా ఆగకుండా అతనిపై ఆదివారం మరో అక్రమ కేసు బనాయించి నానామాటలు అంటూ సీఐ వెంకట్రావు తీవ్ర వేధింపులకు దిగాడు. దీంతో చేసేదేమిలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసు ప్రభువు దయవల్ల ఆ యువకుడు బతికాడు. సీఐపై వెంటనే కేసు నమోదు చేసి, ఆ స్టేషన్ విధుల నుంచి తప్పించాలని ఎస్పీని కలిశాం. హైకోర్టులో కేసు వేస్తాం. జగనన్న ప్రభుత్వం రాగానే ఆ స్టేషన్లోనే కేసు నమోదు చేసి చట్టప్రకారం అరెస్ట్ చేయిస్తాం. – కాసు మహేష్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే -
ఓటు సర్చూసుకోండి!
సత్తెనపల్లి: భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) సర్వేలో భాగంగా బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ) ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారం–2ను ఓటరు నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతోపాటు తన కుటుంబం 23 ఏళ్లుగా భారతదేశంలోనే ఉన్నట్టు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ వారు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ పేరుతో భారీగా ఓట్లు గల్లంతు చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం అప్రమత్తంగా ఉండాల్సిదే.. జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల.. ఇలా ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 2002లో చివరిసారిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14వ తేదీ వరకూ బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా వెల్లడిస్తారు. ఫాం–2 లో ఏం నింపాలంటే... ‘సర్’ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫాం–2 నింపి బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరుంటే.. ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫాంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతర కుటుంబికుల పేర్లు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితోపాటు మీ పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నెంబర్, తండ్రి/ సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య/ భర్త పేరు, వారి ఎపిక్ నెంబర్ (అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్ పాస్పోర్ట్ సైజు ఫొటో అతికించి బీఎల్ఓకు అందజేస్తే ఇందుకు రసీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి. ఎలాంటి అపోహలు వద్దు సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి కె.గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సర్ ప్రక్రియపై అర్హులైన ఓటర్లు అపోహలు, ఆందోళన చెందాల్సిన పనిలేదు. చనిపోయిన వారి ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లును మాత్రమే తొలగిస్తారు. 2002 నాటి ఓటరు జాబితాను బీఎల్వోలు తీసుకొని ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. 2002లో ఓటు హక్కు ఎక్కడ ఉన్నది అనేది తెలియజేస్తే బీఎల్ఓ దాన్ని నమోదు చేస్తారు. అక్కడ వారి కుటుంబికుల ఓట్లతో సరి చూస్తారు. 15 వ తేదీ నుంచి బీఎల్వోలు సర్వే నిర్వహిస్తారు. ప్రతి బీఎల్ఓ ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారని’ చెప్పారు. నియోజకవర్గం ఓటర్లు మ్యాపింగ్ మ్యాపింగ్ పూర్తి శాతం పూర్తయిన వారు కాని వారునరసరావుపేట 2,33,756 1,71,911 61,845 73.54 చిలకలూరిపేట 2,26,959 1,51,993 74,966 66.97 వినుకొండ 2,66,031 1,80,096 85,935 67.70 సత్తెనపల్లి 2,43,048 1,78,047 65,001 73.26 పెదకూరపాడు 2,34,112 1,90,465 43,647 81.36 గురజాల 2,75,091 1,98,779 76,312 72.26 మాచర్ల 2,62,801 1,78,325 84,476 67.86 మొత్తం 17,41,798 12,49,616 4,92,182 71.74 -
రెయిన్ట్రీ పార్క్ విల్లాలో భారీ చోరీ
సుమారు 475 గ్రాముల బంగారం చోరీ మంగళగిరి టౌన్: మంగళగిరి ప్రాంతంలోని ఓ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. మంగళగిరి మండలం కాజ గ్రామం రెయిన్ట్రీపార్క్లోని ఓ విల్లాలో అడ్వకేట్ శైలేంద్ర నివాసముంటున్నాడు. ఆయన భార్య చినకాకానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. శైలేంద్ర నివాసముంటున్న విల్లా సెకండ్ ఫ్లోర్లో అతడి తల్లిదండ్రులుంటున్నారు. శైలేంద్ర భార్య శనివారం రాత్రి ఆస్పత్రిలో నైట్ డ్యూటీకి వెళ్లింది. స్నేహితులను కలిసేందుకు శైలేంద్ర శనివారం సాయంత్రం విజయవాడ వెళ్లాడు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున తను విల్లాకు చేరుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న గదికి వెళ్లగా.. అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో పాటు, ఆల్మరాలు తెరిచి ఉన్నాయి. మెయిన్ బెడ్రూమ్లో ఉండాల్సిన ఐరన్ సేఫ్ కనిపించలేదు. సెకండ్ ఫ్లోర్లో శైలేంద్ర తల్లిదండ్రులు ఆ సమయానికి నిద్రపోతున్నారు. వారి గది తప్ప విల్లాలోని అన్ని గదుల్లో ఉన్న ఆల్మరాలు తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారని నిర్ధారించుకుని వెంటనే భార్యకు సమాచారం ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ సేఫ్ లాకర్, డెస్క్లో ఉన్న బంగారు ఆభరణాలు సుమారు 475.5 గ్రాములు, రూ.3 లక్షల విలువైన పలు వస్తువులు, 350 యూఎస్ డాలర్లు చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం విల్లాను పరిశీలించారు. పోలీసు జాగిలాల బృందం సాయంతో నిందితుల ఆనవాళ్లను గుర్తించాలని, సీసీ టీవీ ఫుటేజ్లను, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. -
నీళ్లు వద్దు.. పార్టీ బిల్డింగ్ ముద్దు!
నరసరావుపేట రూరల్: కోట్లాది రూపాయల విలువైన చెరువు భూమిని నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీకి అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్న ఘటన నరసరావుపేట శివారులో ఉన్న ఇస్సపాలెం బైపాస్ రోడ్డు వద్ద సాయినగర్ సమీపంలోని సర్వే నంబర్ 49లో చోటుచేసుకుంది. ఇక్కడ పెద్దకుంట చెరువుగా పిలిచే వంకాయలవారి కుంట 1.70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నీటిని రైతుల పంట పొలాలకు వినియోగిస్తుంటారు. దీంతో పాటు స్థానికుల తాగునీటి అవసరాలకు చెరువు ఉపయోగపడుతుంది. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం కోసం ఆ పార్టీ నాయకులు పలు చోట్ల స్థల పరిశీలన చేశారు. పార్టీ కార్యాలయం నిర్మాణానికి అంత అనుకూలంగా స్థలాలు లేకపోవడం, అనుకూలంగా ఉన్న స్థలాలు వివాదంలో ఉండటంతో వీరి కన్ను వంకాయలవారి కుంటపై పడింది. అంతే వెంటనే ఈ ప్రాంతం లీజు కోసం దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు పంపినట్టు సమాచారం. కోట్లాది రూపాయల భూమి కొట్టేసే యత్నం మరోవైపు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో చెరువు పూడ్చివేత పనులను స్థానిక నాయకులు చేపట్టారు. చెరువులోని నీటిని ట్రాక్టర్ ఇంజన్ల ద్వారా బయటకు తరలించారు. ములకలూరు నుంచి వందలాది టిప్పర్లతో మట్టిని తీసుకువచ్చి చెరువును పూర్తిగా మట్టితో నింపారు. చెరువు పూడ్చివేతపై స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయినా అధికారులు కానీ, టీడీపీ నేతలు కాని పట్టించుకోలేదు. సాయినగర్ ప్రాంతంలో ఎకరం రూ.5 కోట్లుకు పైగా పలుకుతుంది. దీని ప్రకారం చెరువు భూమి విలువ దాదాపు రూ.8.5 కోట్ల పైమాటే. ఇంత విలువైన భూమిని.. అదీ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే వాటర్ బాడీలను పార్టీ కార్యాలయానికి కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకుల ఒత్తిడితో జిల్లా అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. –డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘గ్రామానికి చెందిన రైతులతో కలిసి పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. ఫలితం శూన్యం. చెరువులను ఇతర అవసరాలకు కేటాయించవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలను ఇక్కడ ఉల్లంఘిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడే చెరువును పూడ్చివేయడం దుర్మార్గం. ఈ అక్రమ వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి టీడీపీ జిల్లా కార్యాలయానికి ఈ భూమిని కేటాయించే ప్రతిపాదనలను విరమించుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు ఆక్రమణకు గురైన చెరువును డాక్టర్ గోపిరెడ్డి పరిశీలించారు. -
భద్రత డొల్ల.. ఇల్లు గుల్ల
ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మూడో నేత్రం కనురెప్ప మూతపడనే లేదు.. అయినప్పటికీ దొంగల చేతివాటం ఆగడం లేదు. ధైర్యంగా ఉండండి అంటూ పోలీసులు ఇచ్చిన భరోసాకు దిక్కేలేదు. శాంతిభద్రతలపై దృష్టి పెట్టని చంద్రబాబు సర్కారు తీరుతో ఎప్పటిలానే వేసవి కాలంలో ఇళ్లకు తాళాలు వేసి ప్రయాణం కట్టిన కుటుంబాల ఇళ్లు గుల్లయ్యాయి. పోలీసులపై పెట్టుకున్న నమ్మకాన్ని సవాల్ విసురుతూ దొంగతనాలు పెరిగిపోయాయి. నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తాళం వేసిన ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు. కుటుంబసభ్యులు ఊరు వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఇంట్లో దాచిన బంగారం, నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్తూ బాధితులకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. ఇటీవల కాలంలో పల్నాడు జిల్లాలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దుండగులు ముందుగా తాళం వేసిన ఇళ్లపై నిఘా పెట్టి ఆ తర్వాత చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అత్యవసర పనులపై తాళం వేసి బయటకు వెళ్లాలన్నా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీ సరిపడా లేకపోవటం, అనుమానస్పదవ్యక్తుల కదలికలపై పర్యవేక్షణ లోపించటం చోరీలకు ఆస్కారం కలిగిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు చోటుచేసుకున్న చోరీ కేసుల్లో పూర్తి స్థాయిలో పురోగతి కనిపించలేదు. పోగొట్టుకున్న సొత్తు తిరిగి చేతికి అందకపోవటంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జీవితకాల పొదుపులను కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్నారు. దొంగలను గుర్తించి తాము పోగొట్టుకున్న సొత్తును తిరిగి ఇప్పించాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. చోరీల భయంతో ఇప్పటికే కొందరు గృహ యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగా, మరి కొందరు రాత్రి వేళల్లో స్వచ్ఛందంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఇవిగో నిదర్శనాలు తలలు పట్టుకుంటున్న పోలీసులు.. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న చోరీ కేసుల్లో పురోగతి లేకపోవటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిందితులను గుర్తించి సొత్తు రికవరీ చేయటంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైంది. జిల్లాలో గడిచిన రెండు నెలల వ్యవధిలో ఏదో ఒక ప్రాంతంలో గృహాలను కొల్లగొట్టి దోచుకువెళ్లటం యజమానులకే కాకుండా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు 11కు పైగా గృహాల్లో చోరీలు జరిగాయి. రూ.కోట్ల సొత్తును దుండగులు దోచుకెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. దొంగతనాలను ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఉపయోగం ఉండటం లేదు. పోలీస్ గస్తీ రాత్రుళ్లు లేకపోవటంతో చోరులు చెలరేగిపోతున్నారు. యథేచ్ఛగా అల్లరిమూకలు, అసాంఘిక శక్తులు రాత్రుళ్లు మద్యం సేవించి స్వైరవిహారం చేస్తున్నాయి. గంజాయి తాగిన కొందరు యువత ద్విచక్రవాహనాలపై రాత్రుళ్లు తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచటంతోపాటు రాత్రుళ్లు గస్తీ పెంచి దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి వంటి అభివృద్ధి చెందిన పట్టణాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా తాళం వేసిన గృహాలను లూటీ చేయటం పోలీసుల భద్రత వైఫల్యాన్ని ప్రశ్నిస్తోంది. -
జాతీయ ఈత పోటీలకు టెక్నికల్ అధికారిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ 79వ సీనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలకు టెక్నికల్ అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. స్విమ్మింగ్ కోచ్గా కొనసాగుతున్న సురేష్ గతంలోనూ పలు అంతర్జాతీయ, జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఆక్వాటిక్స్లో సురేష్కు ఉన్న నైపుణ్యానికి, నిబద్ధతకు ఈ ఎంపిక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. సురేష్కు కళాశాల యాజమాన్య ప్రతినిధులు, పల్నాడు జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో నీటిలో గల్లంతైన బాలుడిని సాహసోపేతంగా పోలీసులు, మైరెన్ సిబ్బంది ఆదివారం కాపాడారు. మధ్యాహ్నం సమయంలో కర్లపాలెంకు చెందిన కంబం కమల్ దాస్ (17) తన నలుగురు స్నేహితులతో సూర్యలంక బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి లోతైన నీటిలోకి కొట్టుకుపోయాడు. విధుల్లో ఉన్న మైరెన్, బాపట్ల రూరల్ పోలీసులు బాలుడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఘటనలో.. చీరాల: చీరాల మండలం తోటవారిపాలేనికి చెందిన అఖిలేష్ (17) కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాడరేవు సముద్రతీరానికి వచ్చాడు. అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తెనాలి: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు కమిషన్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ సంతృప్తికరంగా అమలు జరిపేలా, బీసీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని, రాష్ట్రంలో బీసీల కుల గణన ద్వారా సరైన డేటా సేకరించి రిజర్వేషన్ల పెంపునకు కమిషన్ సహకరించాలన్నారు. జనగణన వివరాలను బీసీ కులగణన సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా చట్టసభలలో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు జనాభా దామాషాలో దక్కేలా తోడ్పడాలన్నారు. బీసీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జె.నాగమోహన్, జె.మురళి, ములికి జయకృష్ణ, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కరవేదిక(పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకురావద్దని సూచించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకొని రావాలి కోరారు. ‘మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100’ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. -
కృష్ణమ్మ ఒడిలో పెను విషాదం
● అందరిదీ ఒకే కుటుంబం● నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి అచ్చంపేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కృష్ణానదిలో మృతి చెందడంతో కోనూరు విషాదంలో మునిగిపోయింది. మండలంలోని కోనూరులో గంధం గంగయ్య ఇద్దరు మనమరాళ్లు, మనవడు, తమ్ముని కుమారుడు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ గ్రామంలో ఇలా జరగడం ఇది రెండవసారి. 2017 జనవరి 14వ తేదీన సంక్రాంతి నాడు ఒకే కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు నలుగురు కృష్ణానదిలో ఈత కొట్టడానికి వెళ్లి మృతి చెందిన ఘటనను గుర్తుకుతెచ్చుకుని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరదాగా బయలుదేరి... కోనూరు గ్రామానికి చెందిన గంధం గంగయ్య వ్యవసాయ కూలీ. బతుకుదెరువు కోసం గంగయ్య గ్రామం వదలి నకరికల్లు మండలం కుంకులగుంట గ్రామానికి వలసవెళ్లారు. కొన్ని సంవత్సరాలపాటు అక్కడ ఉన్నా నిలదొక్కుకోలేక పోవడంతో తిరిగొచ్చారు. గంగయ్య కుమారుడైన సత్యానందం– రాజ్యలక్ష్మి దంపతులకు కుమార్తెలు సంధ్య (11), షైని(9) ఉన్నారు. పిడుగురాళ్లలోని సున్నపుబట్టీలలో పనిచేసుకునేందుకు వీరు వలస వెళ్లారు. రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో ఉంటున్న కుమార్తె బత్తుల అరుణ కుమారుడు కార్తిక్ (11), చిలకలూరిపేటలో ఉంటున్న తమ్ముడు శ్రీనివాసరావు కుమారుడు చైతన్య (20). ఈ నలుగురు తమ తల్లిదండ్రులు, బంధువులతో గంగయ్య ఇంట్లో శనివారం రాత్రి జరిగిన ప్రార్థనలో పాల్గొనేందుకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి బంధువులంతా కృష్ణానది వద్దకు సరదాగా వెళ్లారు. సమీపంలో చేపల పడవలు కనిపించడంతో పడవలో నదిలో తిరగాలని ఉత్సాహపడ్డారు. పడవ ఎక్కిన పది మంది... వారిలో ముత్యాలు అనే వ్యక్తి పది మందిని పడవలో ఎక్కించుకుని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఉన్న లంక భూములకు వెళ్లాలని బయలుదేరారు. నది మధ్యలోకి వెళ్లేసరిగా పడవ అటు, ఇటు ఊగడం మొదలుపెట్టింది. పడవను నియంత్రించలేకపోయారు. అది కాస్తా తలకిందులైంది. అందరూ నీటలో పడిపోయారు. ముత్యాలు సాహసం చేసి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మిగిలిన నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పడవలతో వచ్చి ముమ్మరంగా గాలించారు. సంధ్య, షైని, కార్తిక్, చైతన్య మృతదేహాలు బయటపడటంతో తాత గంగయ్య తల్లడిల్లిపోయారు. సరదాగా వచ్చిన తమకు ఇలా పుత్రశోకంతో అల్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదేం కర్మ దేవుడా... అంటూ తలలు బాదుకున్నారు. ఆడుతూపాడుతూ తమ కళ్లెదుటే చిందులు వేస్తూ తిరిగిన పిల్లల మృతదేహాలను బంధువులు భుజాన వేసుకుని ఒడ్డుకు చేరుస్తుంటే తట్టుకోలేకపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆటోలు వేసుకుని తీసుకెళుతుంటే తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినట్లుగా శోకంతో అల్లాడిపోయారు. వారిని ఓదార్చడం గ్రామస్తులు, బంధువుల వల్ల కాలేదు. కోనూరు ఇసుక రీచ్లకు సమీపంలో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. -
కంభంపాడులో రోడ్డు ప్రమాదం
మాచర్ల రూరల్: రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం.బ్రహ్మారెడ్డి కంభంపాడు గ్రామంలో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి మాచర్ల వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీ కొట్టింది. దీంతో అతడికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై గ్రామస్తుల నిరసన నేషనల్ హై వే రోడ్డు గ్రామం మీదుగా ఏర్పాటు చేసి వీధి లైట్లు మాత్రం వెలిగించకపోవటంతో గ్రామంలోకి వెళ్లాలన్నా, రావాలన్నా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే ప్రమాదాలు చాలా జరిగినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు చేరి ఎద్దుల బండ్లు, నీళ్ల ట్యాంకులను అడ్డుగా పెట్టి ధర్నాకు దిగారు. గ్రామంలో హైవేపై లైట్లు వెలగటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఎక్స్ప్రెస్లను గ్రామంలో ఆపాలని ఆర్టీసీ అధికారులకు కోరుతున్నా స్పందించటం లేదని వాపోయారు. అతి పెద్ద జనాభా కలిగిన గ్రామ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవటంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపులా సుమారు కిలో మీటర్ దూరం వాహనాలు నిలిచిపోయాయి. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ లభించేంత వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు విజయపురిసౌత్, రూరల్ ఎస్ఐలు అశోక్కుమార్, సంధ్యారాణి ఉన్నతాధికారులకు తెలిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తెనాలిరూరల్: పట్టణ సుల్తానాబాద్లోని గాయత్రి వే బ్రిడ్జి సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. కూలి పనులకు వెళ్లే మరియమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గురువారం ఆమె బంధువుల ఇంటికి వెళ్లి.. శనివారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఆదివారం ఉదయం చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. బీరువా తాళాలు పెట్టన చోటే ఉన్నాయి. తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. తెనాలిలో పెరిగుతున్న చోరీలు.. తెనాలి ప్రాంతంలో ఇటీవల చోరీలు పెరుగుతున్నాయి. మండలంలోని కఠెవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 7వ తేదీ అర్ధరాత్రి వచ్చారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రూ. లక్ష నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు చేశారు. రూ.4 లక్షల నగదు, 25 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వస్తువులు మాయం -
ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి!
తెనాలిరూరల్: అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల లీలలు విచిత్రంగా ఉన్నాయి. అధునాతన వాహనాన్ని వెనక్కి తీసుకుని పాత వాహనాన్ని తెనాలికి పంపారు. ఏప్రిల్ 14వ తేదీన తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి ప్రత్యేక అగ్నిమాపక శకటాన్ని కేటాయించి పంపారు. పంపిన రెండు రోజులకే వెనక్కి పిలిపించి రాష్ట్ర సచివాలయంలో ఉంచారు. పరిధి పెద్దదైన తెనాలి కార్యాలయం కింద తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, బాపట్ల జిల్లా చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడ దశాద్దాల క్రితమే రెండు వాహనాలు అవసరముందని భావించిన అధికారులు రెండు వాహనాలను కేటాయించారు. ఒక వాహనం దశాబ్దంన్నర క్రితం శిథిలావస్థకు చేరుకోగా అప్పటి నుంచి కేవలం ఒక్క వాహనంతోనే నెట్టుకువస్తున్నారు. ఇటీవల రెండో వాహనం కేటాయించి పంపడంతో అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. ఈ ఆనందం కేవలం రెండు రోజుల్లోనే ఆవిరైపోయింది. -
వాన్పిక్ భూములు తిరిగి సాధించుకునేంత వరకు పోరాటం
చినగంజాం: వాన్పిక్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయిన దృష్ట్యా భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని.. వాటిని పొందేంత వరకు తమ పోరాటం ఆగదని చీరాల మాజీ శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, మండలంలోని 13 గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని మోటుపల్లి పంచాయతీ అడివీధిపాలెం గ్రామంలో వాన్పిక్ భూముల 13 గ్రామాల రైతులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెదప్రోలు సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. వాన్పిక్కు సంబంధించి విదేశీ కంపెనీ రసల్ఖైమా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం ఆపి వేసి వెనక్కు వెళ్లిన దృష్ట్యా ప్రభుత్వం తమకు సంబంధించిన భూములను వెనక్కి తిరిగి ఇచ్చేయాలని వారు సమావేశంలో కోరారు. రైతుల న్యాయపరమైన డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చట్టపరంగా చర్యలు తీసుకొని భూములను రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో న్యాయపరమైన హక్కులు సాధించుకునేందుకు చట్టపరమైన పోరాటం సాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పండ్రాజు శంకర్రావు, 13 గ్రామాల పెద్దలు, కాపులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. -
మద్యం ఇండెంట్లో గోల్మాల్
నరసరావుపేట టౌన్: మద్యం ఇండెంట్ల వ్యవహారంలో భారీ మోసం వెలుగు చూసింది. మద్యం కంపెనీ ప్రతినిధిగా చెలామణి అవుతున్న యువకుడు వ్యాపారుల నుంచి వసూలు చేసిన రూ.1.5 కోట్లతో పరారీ అయిన ఘటన పల్నాడు జిల్లాలో సంచలనం కలిగించింది. వివరాలు.. ప్రముఖ మద్యం కంపెనీ తరుఫున రిప్రజెంటేటివ్గా గురజాలకు చెందిన యువకుడు పనిచేస్తున్నాడు. దీంతో పాటు మద్యం కంపెనీ తరుపున నరసరావుపేట మద్యం డిపోలో అందుబాటులో ఉంటూ మద్యం సిండికేట్లకు డిపో నుంచి దుకాణాలకు కావాల్సిన మద్యం సరఫరా ఇండెంట్ వ్యవహారాలు చక్కదిద్దేవాడు. వ్యాపారులతో సన్నిహిత సంబందాలు ఏర్పాటు చేసుకున్నాడు. అతను చేసే సేవలకు గాను ప్రతి దుకాణం నుంచి నెలకు రూ.1500 జీతం తీసుకునేవాడు. గురజాల, మాచర్ల నియోజకవర్గాలలోని మద్యం దుకాణాలకు రోజూ వారి మద్యం సరఫరా ఇండెంట్ల లావాదేవీలు చూస్తుంటాడు. కొన్ని నెలలుగా మద్యం ఇండెంట్ కోసం వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బుల్లో సగం మాత్రమే బ్యాంక్లో జమ చేశాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న వ్యాపారులు రెండు రోజుల క్రితం యువకుడిని నిలదీశారు. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శనివారం గురజాల, మాచర్ల, వినుకొండలకు చెందిన వ్యాపారులు మద్యం డిపో వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న అధికారులను కలిసి తమకు జరిగిన మోసాన్ని వివరించారు. అయితే డిపోకు సదరు ప్రైవేటు ఉద్యోగికి ఎటువంటి అధికారిక సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. -
క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి
ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెనాలి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన వందమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్కో డీఈఈ పాగోలు భవాని తదితరులు మా ట్లాడారు. విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2 వేల ఉపకార వేతనం, నోట్ పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ మెటీరియల్, ఎగ్జిక్యూటివ్ ఫైల్, వాటర్ బాటిల్, రీడింగ్ చైర్, ఫ్లాంక్స్ పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచారయ్య, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు. పట్నంబజారు: లిక్విడ్ గంజాయిని తరలిస్తూ.. బీటెక్ విద్యార్థితో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, లాలాపేట పోలీసు స్టేషన్ సీఐ ఏవీ శివప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన రామిశెట్టి మహవీర్, అబ్బు సాయిమణికంఠతేజ, షేక్ రెహ్మాతుల్లాలు స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడైన రామిశెట్టి మహావీర్ గంజాయికి అలవాటుపడి, డబ్బులు కోసం ఒడిశా ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. శనివారం ఐపీడీ కాలనీలో సమీపంలోని సత్యసాయి బాబా ట్రస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్యూవీ కారులో ముగ్గురు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించటంతో పాటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి దొరికింది. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామిశెట్టి మహావీర్ ఒక కళాశాలలో బీటెక్ అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2కిలోల 110 గ్రాముల గంజాయి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ‘పంచాయతీరాజ్ మినిస్టీరియల్’ అసోసియేషన్ సమావేశం గుంటూరు రూరల్: నగరంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి నిర్వహించాల్సిన ఎన్నికలను జూలై 31లోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంపీడీవోల పదోన్నతులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కు అన్యాయం జరిగిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.సంఘం రాష్ట్ర ట్రెజరర్ పి.దస్తగిరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మోహన్రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రా ఘవులు, సంఘం వివిధ జిల్లాల అధ్యక్షులు ముర ళి, సత్తిబాబు, శ్రీధర్రాజు, ప్రసాద్, నిర్మలభారతి, పెంచలయ్య, మురళీధర్రెడ్డి, శశిధర్, గుంటూరు జిల్లా కార్యదర్శి సమ్యుల్పాల్ పాల్గొన్నారు. -
కనిపించని టాస్క్ఫోర్స్ టీం
సాక్షి, నరసరావుపేట: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కృష్ణా తీరంలో ‘మాన్సూన్ హాలీడే’ జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉండటంతో ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్ 1, 2వ తేదీలలో సైతం రాత్రీపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలతో ‘సాక్షి’ పత్రికలో జూన్ 3వ తేదీన ‘చెలరేగిపోతున్న ఇసుకాసురులు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందించి చర్యలకు ప్రారంభించారు. అచ్చంపేట మండలం చింతపల్లి, అమరావతి మండలం పొందుగల ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా గాడి కొట్టించారు. రీచ్లలో ఇసుక రవాణా జరిపేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. గాడిని పూడ్చి అక్రమ రవాణా... ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా అధికారులు కొట్టిన గాడిని మాఫియా పూడ్చివేసింది. గత రెండు రోజులుగా చింతపల్లి, పొందుగల–2 రీచ్లలోకి నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పంపి తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు దారికి గాడి కొట్టిన తరువాత నది సమీపంలో భారీ యంత్రాలను అక్కడ నుంచి పంపేయాలి. వాటిని అక్కడే ఉంచడంతో రాత్రిపూట, సెలవు రోజుల్లో గాడిని పూడ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నా మైనింగ్, ఇరిగేషన్, పోలీసు, విజిలెన్స్, రవాణా శాఖల అధికారులు పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇసుక రీచ్లలో భారీ యంత్రాలతో గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్నా అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా కొట్టిన గాడిని పూడ్చి ఇసుక రవాణా చేయడంపై పల్నాడు జిల్లా మైనింగ్ శాఖ ఏడీ నాగయ్యను వివరణ కోరగా... గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. అచ్చంపేట, అమరావతి మండలాల తహసీల్దార్లను ఇసుక తరలింపును అడ్డుకోమని ఆదేశిస్తానని తెలిపారు. ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదన్నారు. టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, వారు అక్రమ రవాణాను అడ్డుకుంటారని తెలిపారు. సాక్షి కథనానికి స్పందించి ఇసుక రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా దారికి గాడి కొట్టిన అఽధికారులు ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. ఈ టాస్క్ఫోర్స్ టీంలో మైనింగ్, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్, రవాణా శాఖల అధికారులు ఉంటూ కృష్ణానది తీరప్రాంతాల్లో నిఘా ఉంచాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు. అచ్చంపేట, అమరాతి మండలాల్లో నిషేధ సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా టాస్క్ఫోర్స్ టీం స్పందించి అక్రమ రవాణాను అడ్డుకొని చర్యలు తీసుకోవడం లేదు. -
యథేచ్ఛగా ఆక్రమణల పర్వం
నరసరావుపేట: గుంటూరు–కర్నూలు రహదారిపై వినుకొండకు వెళ్లే రోడ్డును ఆనుకొని ఉన్న ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతంలో ఆర్టీసీ అధికారుల వినతులతో ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి ఆక్రమణలు తొలగించారు. అదే ప్రదేశంలో గత రెండేళ్ల నుంచి మళ్లీ ఆక్రమణలు యథేచ్ఛగా చోటుచేసుకోవటం గమనార్హం. పెరిగిన రద్దీ జిల్లా కేంద్రంగా ఉంటూ రాయలసీమకు ప్రవేశమార్గంగా ఉండే నరసరావుపేట బస్టాండ్ నుంచి బస్సులు, వాటి ద్వారా ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సీ్త్రశక్తి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో బస్టాండ్ నిత్యం రద్దీగా మారింది. అలాగే సమీపంలోనే ప్రముఖ మాల్ ఉండటం వలన ఇటుగా రాకపోకలు పెరిగాయి. డిపోనకు చెందిన 90 బస్సులతోపాటు పైనుంచి నరసరావుపేట మీదుగా ప్రయాణం చేసే మరికొన్ని వస్తుంటాయి. నిత్యం రూ.12.50 లక్షల వరకు ఆదాయం ఆర్టీసీకి వస్తుంది. ఇంతటి రద్దీ ఉండే బస్టాండ్ చుట్టూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. బస్సులు బయటకు వచ్చే ప్రవేశమార్గాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశంలో బడ్డీ కొట్లు, ఇతర వాణిజ్య షాపులను గత ప్రభుత్వంలో ట్రాఫిక్ పోలీసుల పహారా మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. వాటి వలన డ్రైవర్లకు బస్టాండ్ దాటి రోడ్డుపైకి వచ్చే వరకు వినుకొండ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు కనిపించేవి కాదు. పలువురు డ్రైవర్లు చేసిన ఫిర్యాదు మేరకు డిపో అధికారులు ఆ అక్రమ వ్యాపారులను తొలగించారు. శుభ్రం చేసి ఆ ప్రదేశం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఆక్రమణల ప్రదేశంగా ప్రకటించి పోలీసు పహారాతో గతంలో ఆక్రమణలు తొలగించిన ప్రదేశంలో ఇటీవల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయటం చర్చనీయాంశమైంది. డిపో వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ చాలా అవసరం. లేకపోతే ఆటోవాలాలు బస్సులు ఆగిన ప్రదేశానికి వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దానిపై డిపో అధికారుల విజ్ఞప్తి మేరకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రదేశంలో ఓ బడ్డీ కొట్టును ఏర్పాటు చేసి దానిపై టీడీపీ, జనసేన జెండాలు పెట్టి కొనసాగించారు. ప్రస్తుతం దానిపై ఆ జెండాలు తొలగించారు. దానిపక్కనే ప్రభుత్వం స్పాన్సర్ చేసిన అరకు కాఫీ స్టాల్ ఏరా్పాటు చేశారు. దానిని స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధి ప్రారంభించారు. ఇటీవల వినుకొండరోడ్డులో జూపల్లి సెంటర్ను దాటి రోడ్డుకు ఇరువైపులా తొలగించిన ప్రదేశంలో మళ్లీ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. చిరు వ్యాపారులు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు రోడ్డు పక్కనున్న ఆర్ అండ్ బీ స్థలాలను ఆక్రమించారు. -
ఆరుగురు బాల కార్మికులకు విముక్తి
నెహ్రూనగర్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, చైల్డ్లైన్ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్లలో సోమవారం జరిపిన తనిఖీల్లో ఆరుగురు బాల కార్మికులను గుర్తించారు. వారిని వెంటనే పని నుంచి విడిపించి పాఠశాలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా వారికి చదువు అవకాశాలు కల్పించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ముగ్గురు యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. బాల కార్మిక చట్టం ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్లైన్ నంబర్కు, 9492555157కు సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ గాయత్రిదేవి, లేబర్ ఆఫీసర్ బొందలపాటి కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాసంతి, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ విచ్చేశారు. ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచందర్రావు, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలలో ఆయన పాల్గొన్నారు. ఐజీకి ఆలయ అర్చకస్వాములు, వేదపండితుల వేద ఆశ్వీర్వచనం చేసి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ధూపాటి శివ శంకరరావు, ఎక్స్ అఫీషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వర ప్రసాద్, సిబ్బంది ఉన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఐఎంఎస్ఈఏ) విజయవాడ రీజినల్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలో శనివారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా డాక్టర్ ఆర్.ప్రవీణ్కుమార్, వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ సి.సిద్దావలి, సెక్రటరీగా ఎస్.మురళి, జాయింట్ సెక్రటరీగా వి.చలపతిరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి.మంగతాయారు, ఆర్.నల్లయ్య, బేతపూడి రాము, జి.రాజేష్, బి.నాగరాజు, వి.మోహనరావు, ఎన్.ఆంజనేయులు ఎన్నికయ్యారు. స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.శేషగిరిరావు, స్టేట్ సెక్రటరీ వి.సురేష్కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.గిరిధర్ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) 12 ఏళ్ల ప్రగతి, విజయాలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ‘యాత్రి సౌకర్య దివస్’ నిర్వహించనున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలో విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించి దేశీయ విమాన రంగంలో కీలక కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. 2014–15లో రూ.5.98 కోట్లు ఉన్న ఎయిర్పోర్ట్ వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.87.97 కోట్లకు చేరిందని, ప్రయాణికుల సంఖ్య 2.33 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగిందన్నారు. ప్రస్తుతం రూ.791.59 కోట్లతో 51,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. పలు ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రక్తదాత... సుఖీభవ
నేటి కాలంలో రక్తసంబంధాలు కూడా భారంగా మారాయి. కానీ ఏ బంధం లేకపోయినా మానవత్వం రక్తదాతల రూపంలో ఇంకా ఇతరులకు సాయం చేస్తోంది. ఇలాంటి వారు ప్రాణదాతలుగా మారుతున్నారు. అర్ధరాత్రి... అపరాత్రి... అని తేడా చూసుకోకుండా ఫోన్ చేయగానే సొంత ఖర్చులతో ఆస్పత్రికి తక్షణమే వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ క్షణంలో వారు చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ..గుంటూరు మెడికల్: జిల్లాలో పలువురు యువత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రక్తం కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు రూపొందించి సేవ చేస్తున్నారు. మరికొంత మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. దానిని కృత్రిమంగా తయారు చేయలేం. మనిషి జీవించటానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో రక్తం కూడా అంతే ముఖ్యం. మానవ శరీరంలోని ప్రతి అవయవం రక్తసరఫరాతోనే పనిచేస్తుంది. కొన్ని ఆపరేషన్లు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా రక్తం అవసరం అవుతుంది. రోడ్డు ప్రమాద బాధితులు కొన్ని సందర్భాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు రక్తం దొరక్క ఆపరేషన్లు సైతం వాయిదాలు పడుతుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కో రక్తం గ్రూపు ఉంటుంది. ఏ మనిషిలో ఏ రక్తం ఉంది, రక్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అనే విషయాలను కనిపెట్టిన ఆస్ట్రేలియా దేశానికి చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ 1868 జూన్ 14న జన్మించారు. ఆయన జయంతి నాడే ఏటా ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క చుక్క మానత్వం అనే నినాదంతో ఈ దినోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ... రక్తంలో గ్రూపులు... రక్తంలో ఏ, బీ, ఓ, ఏబీ పేరిట పాజిటివ్, నెగిటివ్ గ్రూపులు ఉంటాయి. ఏబీ నెగిటివ్ రక్తం చాలా అరుదుగా లభిస్తుంది. ఏబీ పాజిటివ్ రక్తం గ్రూప్ వారు యూనివర్సల్ రిసీవర్స్. ఎవరి రక్తమైనా వీరికి ఎక్కించవచ్చు. ఓ నెగిటివ్ గ్రూప్ వారు యూనివర్సల్ డోనార్స్. వీరు ఎవరికై నా రక్తం ఇవొచ్చు. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా రక్తంలో ఉంటాయి. ఒక్క వ్యక్తి రక్తదానం వల్ల నలుగురికి ప్రాణదానం చేయవచ్చు. రక్తదానం చేసేందుకు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, కనీసం 45 కిలోల బరువు ఉండాలి. షుగర్, బీపీ, గుండెకు సంబంధించిన జబ్బులు, కంటి రోగాలు ఉండకూడదు. సుఖవ్యాధులు ఉన్న వారు, ఆపరేషన్ చేయించుకున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారు రక్తం ఇవ్వరాదు. ప్రతి మనిషి ఏడాదిలో నాలుగుసార్లు రక్తదానం చేయవచ్చు. శరీరం నుంచి 350 మిల్లీగ్రాముల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. రక్తదానం చేసేందుకు 10 నుంచి 15 నిమిషాల వ్యవధి చాలు. రక్తదానం చేయటం వల్ల మళ్లీ తాజా రక్తం శరీరంలోకి వస్తుంది. తద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటారు. రక్తాన్ని తీసుకునే ముందు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. రక్తం ఇచ్చిన అరగంట సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో ద్రవపానీయాలు ఉండేలా చూసుకోవాలి. రక్తదానం చేసిన ఆ ఒక్క రోజు బరువు ఉన్న వస్తువులు ఎత్తకూడదు. అవగాహన కల్పిస్తున్నారు.... జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, యువతలో స్వచ్ఛంద రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తూ వారు ముందుకు వచ్చి రక్తదానం చేసేలా వైద్య అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లను ముందస్తుగానే గుర్తించి కట్టడి చేయవచ్చు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం స్వాధీనం
తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని అంగలకుదురు గ్రామం సమీపంలోని తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కలవకొల్లు మధుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. మొత్తం 79 బస్తాలలో సుమారు 3,950 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐతానగర్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు వెనుక గల రేషన్ షాపు నుంచి లోడ్ చేసి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని హరీష్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గొంది అశోక్, కలవకొల్లు మధుబాబు, ఐతానగర్ రేషన్ డీలర్ కుటుంబ సభ్యుడు, అనంతవరప్పాడు ప్రాంతానికి చెందిన రైస్ మిల్ నిర్వాహకుడు హరీష్లను నిందితులుగా గుర్తించినట్టు రూలర్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. -
రొంపిచర్లలో దొంగతనం
రొంపిచర్ల: రొంపిచర్లలో గల ఓ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ఇంట్లో నాలుగు లక్షల రూపాయల విలువైన సొత్తు చోరీ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన బడిగుంచాల విజయ్కుమార్ రెండు సంవత్సరాల కిందట గ్రామానికి వచ్చి స్థానిక హైవే రోడ్డు సమీపంలో సాయిబాబా ఆలయం పక్కన గల స్థలాన్ని అద్దెకు తీసుకుని ఇల్లు నిర్మించుకుని, వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో తన స్వగ్రామానికి వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు ఇంటి తాళం పగులగొట్టి, రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి, లోపల బీరువాను పలుగుతో పగులగొట్టి, అందులో ఉన్న లక్ష రూపాయలు నగదు, మూడున్నర సవర్ల బంగారం తీసుకెళ్లారు. తన స్వగ్రామం నుంచి ఇంటికి వచ్చిన విజయ్కుమార్ ఇంటి తాళం పగులగొట్టి, ఇంట్లో బీరువా తెరిచి, వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. తన ఇంట్లో జరిగిన దొంగతనంలో మూడున్నర సవర్ల బంగారం, లక్ష రూపాయల నగదు చోరీకి గురైందని బాధితుడు తెలిపారు. సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువకల సొత్తు చోరీకి గురైందని బాధితుడు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు, క్లూస్ టీం సభ్యులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిత్యం జన సంచారం, సమీపంలో హైవే రోడ్డు పై ఎప్పుడూ వాహనాల తిరిగే ప్రదేశంలో దొంగతనం జరగటం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. మూడున్నర సవర్ల బంగారం, రూ.లక్ష నగదు మాయం -
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
పురపాలక శాఖ మంత్రి నారాయణ తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
44 సార్లు రక్తదానం చేశా
నేను కేఎల్ యూనివర్సిటీలో 2007లో బీటెక్ చదువుతున్న సమయంలో ఎవరైనా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడిగితే స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రారంభించాను. గుంటూరు జీజీహెచ్లో స్టేట్బ్యాంక్ ఇఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పనిచేస్తున్న సమయంలో ఆస్పత్రిలో రక్తం కొరత ఉందని, రక్తం సకాలంలో లభించక పలువురు చనిపోతున్న విషయం తెలుసుకున్నా. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రక్తం ప్రాధాన్యత గురించి వివరించారు. దాంతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాను. ఒడిశాలో రెండు రైళ్లు ఢీకొని పలువురు మరణించటం, అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వార్తలలో చూసి ఆ రాష్ట్రం వెళ్లా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేశా. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం రావడం, మంచి ఆరోగ్యం సొంతం అవుతుందని నా నమ్మకం. – జంగం అనుదీప్ సత్యప్రకాష్, ఎస్బీఐ సీనియర్ అసోసియేట్, గుంటూరు -
ప్రాణదానంతో సమానం
ఒకరు చేసే రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచిపోవాలి. జిల్లా జనాభాలో ఒక శాతం రక్తం సేకరణ చేయాల్సి ఉంది. జిల్లాలో 17 బ్లడ్ బ్యాంకుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు, సంస్థలను ఘనంగా సన్మానిస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు ● -
అగ్రిగోల్డ్ మోసానికి మరో బాధితురాలి మృతి
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ మోసానికి మరో వృద్ధురాలు బలైంది. భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్లో ఫిక్సిడ్ డిపాజిట్గా దాచుకున్న రూ.25,000 కోసం ఎదురుచూసి చివరికి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తన్నీరు పోలేరమ్మ(70) కూలి పనులు చేసుకుని జీవించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిపించింది. పిల్లలంతా తమ కుటుంబ సభ్యులతో ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటుండగా, భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని అప్పట్లో అగ్రిగోల్డ్ను నమ్మి రూ.25,000 కడితే చివరికి రూ.50,000 వస్తాయని ఆశతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంది. 2012లో కడితే 2018లో తనకు డబ్బు వస్తుందని ఆశ పడింది. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన దగ్గర నుంచి, అవసర పడతాయి అనుకున్నా డబ్బులు ఇక రావని దిగులుతో నిత్యం మదనపడుతూ ఉండేది. అప్పట్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు చూసి కొంత ధైర్యంగా ఉన్నా, వృద్ధాప్యంలో డబ్బులు లేక అనేక బాధలు పడుతూ ఉండేది. ఇప్పటికే 12 సంవత్సరాలు దాటి, ప్రభుత్వాలు మారుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ డబ్బులు తిరిగి బాదితులకు అందించే దిశగా కృషిచేస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి, రెండు సంవత్సరాలు అవుతున్న మాటలు చెబుతున్నారని, చేతల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోయిందని, మానసికంగా ఆలోచించి, గుండెనొప్పితో శనివారం మృత్యువాతకు గురైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టడంతో పాటు కంపెనీ డేటా ప్రకారం వడ్డీతో సహా ప్రతి బాధితునికి త్వరలో డబ్బులు ఇచ్చి న్యాయం చేసి మరో ప్రాణహాని జరగకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుంచాల అంకమ్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నీట మునిగిన నాగన్నకుంట
సత్తెనపల్లి: మబ్బులు పట్టి .. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంటే చాలు సత్తెనపల్లి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. శనివారం తెల్లవారుజాము సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సత్తెనపల్లి–నరసరావుపేట, సత్తెనపల్లి–అమరావతి రహదారిలో రాక పోకలు నిలిచిపోయాయి. ఉదయం సుమారు గంటకు సత్తెనపల్లి నుంచి నరసరావు పేట వెళ్లేందుకు నాగన్నకుంట సమీపంలో కాలువ పొంగి రహదారిపైగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు 9 గంటల సమయంలో కొంతమేర నీరు తగ్గడంతో ఆ నీటిలో నుంచే రాకపోకలు కొనసాగాయి. ఇక నాగన్నకుంట లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా నీటమునిగింది. వీధుల్లో వర్షపు నీరు చేరి ఇళ్ళల్లో నుంచి బయటకు రావడానికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పట్టణంలోని నాగన్న కుంట, శాలివాహననగర్, సుందరయ్యకాలనీ, వెంకటపతి కాలనీతో పాటు మాస్ట్రీన్పేట, దోబీఘాట్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచింది. ఆయా ప్రాంత ప్రజలు వర్షపునీరు నిల్వడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇది ఇలా ఉంటే సత్తెనపల్లి–అమరావతి మార్గమధ్యలోని నందిగామ లోలెవల్ చప్టా పైగా వరద ఉధృతి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా.. సమస్య పరిష్కారానికి మాత్రం చర్యలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందిగామలోని ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది. వరద నీరు గృహాల చెంతకు చేరి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మాతృశ్రీ అచ్చమాంబ తల్లి దేవాలయ సమీపంలో వరద నీరు నిలిచింది. -
వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విజయవంతం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్షి నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపులో భాగంగా ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం అయిందని పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ పార్టీ పిలుపులో భాగంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే ఈ విధంగా వ్యతిరేకత రావడం చరిత్రలోనే మొదటిసారి అన్నారు. ఎన్నడూ ఈ విధంగా తక్కువ కాలంలోనే వ్యతిరేకత సంపాదించుకున్న కూటమిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రానున్న కాలంలో కూడా అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలను ప్రశ్నించేలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రావాలన్నారు. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలకు పిన్నెల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘోర పరాజయం మూటగట్టుకుంటుందన్నారు. దుర్గమ్మకు విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కడప చిన్న చౌక్కు చెందిన కె.గోపిరెడ్డి కుటుంబం అయ్య వరమ్మ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడుకు చెందిన వై.కనకదుర్గ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. -
పల్నాడు
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 20267 సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలో కదం తొక్కుతున్న శ్రేణులు వినుకొండలో ర్యాలీలో నాగార్జునయాదవ్, మోదుగుల, బాసు లింగారెడ్డి, నాయకులు నరసరావుపేట ర్యాలీలో డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు వెన్నుపోటుపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సూపర్ సిక్స్ హామీలకు వ్యతిరేకంగా గత రెండేళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్లు చేస్తున్న అవినీతి పాలనపై వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేల మంది టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇప్పటికై నా సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది. -
బాల్యం ఓ వరం
ఏఎన్యూ (పెదకాకాని): పరీక్ష ఫలితాలను ఏఎన్యూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఏ హిస్టరీ, సంస్కృతం, ఎంహెచ్ఆర్ఎం 1,2,3,4 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, డిప్లమా ఇన్ సైకాలజీ పరీక్ష ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా రీవాల్యుషన్ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
మోగిన బడి గంట
నరసరావుపేట ఈస్ట్: బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తొలిరోజు కావటంతో ప్రాథమిక తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులతో పాఠశాలకు చేరుకున్నారు. నూతన ప్రవేశాల కోసం పలువురు వచ్చి పిల్లలను వివిధ తరగతులలో చేర్పించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని 2,018 పాఠశాలల్లో 2,75,254 మందికిగాను 1,39,425 మంది హాజరైనట్టు అధికారులు గుర్తించారు. జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు మండలంలోని యలమంద జెడ్పీ హైస్కూల్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంప్రసాద్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, డిప్యూటీ డీఈఓ సుభాని సొలస జెడ్పీ హైస్కూల్, ఎంఈఓలు తమ తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించారు. మనబడి పండుగ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, 6వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. అలాగే ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి, సూచనలు చేశారు. పాఠశాలలను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు -
అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన మొత్తం 484 అదనపు తరగతి గదులు, 55 టాయిలెట్ల నిర్మాణాలు నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 218 అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉందన్నారు. ఇప్పటికే పూర్తయిన తరగతి గదులకు విద్యాశాఖ వద్ద అదనంగా ఉన్న ఫర్నీచర్ను ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేయాలన్నారు. వీటికి తోడు 23 టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఏయే పాఠశాలలో నిర్మాణాలు ఏయే తేదీలోగా పూర్తి చేస్తారో టైమ్లైన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పూర్తయిన తరగతి గదులకు ఎప్పటికపుడు ప్రజాప్రతినిథులతో ప్రారంభోత్సవం చేయించాలన్నారు. డీఈవో రామారావు, పంచాయతీ రాజ్, పబ్లిక్ హెల్త్ (మున్సిపల్), గ్రామీణ నీటి సరఫరా, సమగ్ర శిక్ష, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారి నిర్మాణం వేగవంతం చేయండి జిల్లాలో చిలకలూరిపేట–నకరికల్లు మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167ఏ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టరును జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జాతీయ రహదారులు 544డి, 167ఏ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తీర్ణ పనులు ముందుగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. నకరికల్లు–ఓడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణ కోసం భూసేకరణకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ పాల్గొన్నారు. రెండేళ్ల నమ్మకం వేడుకలు జయప్రదంగా నిర్వహించాలి రెండేళ్ల నమ్మకం వేడుకలు జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఈ నెల 15న పెరేడ్ గ్రౌండ్స్లో రెండేళ్ల నమ్మకం కార్యక్రమం, నిర్వహణపై అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు, కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం‘ పేరుతో వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ఈనెల 15వ తేదీన జిల్లాస్థాయిలో వేడుకల కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రజాప్రతినిదులు పాల్గొంటారని అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన మహిళలను ఈనెల 15న సన్మానించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ అద్దెయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి
● కాసు కన్వెన్షన్ హాలులో ఆశా, ఏఎన్ఎంలతో యోగాంధ్ర ● పాల్గొన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు నరసరావుపేట: యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆశా, ఏఎన్ఎమ్లతో యోగాంధ్ర కార్యక్రమం పెద్దచెరువులోని కాసు కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యోగా శిక్షకులు ఆధ్వర్యంలో దాదాపు ఒక గంట పాటు నిర్వహించిన యోగా కార్యక్రమంలో అందరూ యోగాసనాలు వేశారు. అనంతరం యోగా మంత్రంతో కార్యక్రమాన్ని ముగించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. యోగా, నడక, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి రోజు యోగ చేయాలి అన్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల ఏడవ తేదీ నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని ప్రతి గ్రామం, మండలంలో యోగా ట్రైనర్, మాస్టర్లచే యోగ నిర్వహించడం జరుగుతున్నదన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ యోగాని విద్యార్థి దశ నుంచే ప్రారంభించాలని అన్నారు. యోగ వలన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పెదకూరపాడులో...
అమరావతి మండల కేంద్రంలో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి రహదారిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరలింగేశ్వర దేవాలయం సమీపంలోని వంగవీటి రంగా విగ్రహం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి వచ్చేవారిని అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ సూపర్సిక్స్ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈదా సాంబిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు వెంపా జ్వాలా నరసింహారావు, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
● జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● నిరసన కార్యక్రమాలకు కీలక నాయకులు హాజరు
నరసరావుపేట: ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. మాచర్ల నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం నంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే, పార్లమెంటు పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్లు ప్రత్యేక పూజలు చేశారు. వేల మంది వెంటరాగా నాయకులు ఎడ్లబండిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వివిధ ప్రాంతాల్లో అడ్డగించినా పట్టించుకోకుండా వేల మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కార్మికులు భారీగా పాల్గొన్నారు. రింగ్రోడ్డు, బస్టాండ్ సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రతులను బస్టాండ్లో దహనం చేశారు. పలువురు కార్యకర్తలు యాచకులుగా వినూత్నంగా నిరసన నిర్వహించారు. పీఆర్కే, గౌతంరెడ్డి, కేవీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అధికారంలోకి రాకముందు చీటర్ అవతారం ఎత్తి అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసిన గాలికి కొట్టుకుపోయే నాయకుడు చంద్రబాబు అన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసనను జయప్రదం చేశారని పేర్కొన్నారు. నరసరావుపేటలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేల మంది నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయ నుంచి ప్రారంభమైన ర్యాలీ స్టేషన్ రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా కొనసాగింది. ప్రతి ఒక్కరూ పార్టీ జెండా చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొనసాగారు. ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనాధికారికి కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్లు పూర్తిగా అవినీతిమయమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. మెగా డీఎస్సీని దగా చేసి స్పోర్ట్స్ కోటా కింద తమ వారికే ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన సూపర్సిక్స్ హామీలపై మోసం చేశారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు దొంతిరెడ్డి అంజిరెడ్డి, కనకా పుల్లారెడ్డి, ఎన్కే ఆంజనేయులు, టి.మంగమ్మ, ఎస్.సుజాతాపాల్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, కొత్తూరి కిషోర్బాబు పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై ప్రధాన రహదారి మీదుగా గడియారం స్తంభం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి తాలూకా సెంటర్ వరకు చేరుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు పెద్దసంఖ్యలో కదం తొక్కారు. తాలూకా సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు పరచకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. పార్టీ నాయకులు డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, డాక్టర్ గీతా వాసంతి, జంగారపు అనూష, చల్లంచర్ల సాంబశివరావు, రమావత్ కోటేశ్వరరావు నాయక్, రాయపాటి పురుషోత్తమరావు, షేక్ మౌలాలి, భవనం రాఘవరెడ్డి, నక్కా శ్రీనివాసరావు, వేపూరి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండలో రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జునయాదవ్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు బాసులింగారెడ్డితో పాటు ఐదు మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి శివయ్య స్తూపం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రసంగించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవటంతో ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రతిపక్షం, అధికారపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజలను మోసం చేయటం అలవాటుగా సాగుతోందన్నారు. -
చిలకలూరిపేటలో...
చిలకలూరిపేటలో నరసరావుపేట రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద నుంచి భాస్కర్సెంటర్లోని డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. పోలీసులు బైకు ర్యాలీని అడ్డుకోవటంతో పాదయాత్రగానే నిర్వహించారు. మైకులు కూడా అడ్డుకున్నారు. సెంటర్లో కార్యక్రమాన్ని ఉద్దేశించి రజని మాట్లాడుతూ సూపర్ సిక్స్కాదు సూపర్ స్కెచ్తో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో అన్నీ వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, మంగు ఏడుకొండలు, రాచమంటి చింతారావు, కందుల శ్రీకాంత్, సయ్యద్ జమీర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
17న రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్కు వినతులు సమర్పించండి
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబందించి ఏర్పాటుచేసిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్కు జిల్లాలోని బీసీ సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్ ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు గుంటూరు కలెక్టర్ కాంపౌండ్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశమౌతారన్నారు. తమ అభిప్రాయాలను సంబంధిత రుజువులతో సమర్పించాలని సూచించారు. వినతులు విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డెడికేషన్ భవనానికి రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా పంపవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు నేరుగా కూడా అందజేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 90104 00500 సంప్రదించాలని కోరారు. పల్టీలు కొట్టిన కారు – ఇరువురికి గాయాలు యడ్లపాడు: అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై యడ్లపాడు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నంద్యాలకు చెందిన కిరణ్ తన స్నేహితుడితో కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వైపు కారులో వెళ్తున్నారు. యడ్లపాడు వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. కిరణ్, అతని స్నేహితుడికి గాయాలుకాగా, కారు ధ్వంసమైంది. స్థానికులు క్షతగాత్రులను కారు నుండి బయటకు తీశారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
అమరజవాన్ల కుటుంబాలకు ఉచితంగా సిమెంట్
– శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి నరసరావుపేట రూరల్: దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా సిమెంట్ అందజేస్తున్నట్టు శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి తెలిపారు. పట్టణంలోని హెచ్–6 హోటల్లో శుక్రవారం దాచేపల్లి శ్రీ సిమెంట్ ప్లాంట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ జీఎంలు శ్రీనివాస్, శ్రీధర్ రాజు, ఏజీఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు శ్రీ సిమెంట్ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ నమాన్ పేరుతో వీరమరణం పొందిన అమరవీరుల కుటుంబాల వారసులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అమరవీరుల కుటుంబం తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు అవసరమైన సిమెంట్ను పూర్తిగా ఉచితంగా సరఫరా చేస్తామని వివరించారు. బాధిత కుటుంబాలు దేశంలోని శ్రీ సిమెంట్ ప్లాంట్ల నుంచి సిమెంట్ను సేకరించవచ్చని స్పష్టం చేశారు. ప్లాంట్ జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ దాచేపల్లి ప్లాంట్లో 180 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అత్యధిక శాతం స్ధానికులకే అవకాశం కల్పించినట్టు తెలిపారు. సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక వసతుల కల్పన, విద్యా వలంటీటర్ల నియామకం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. -
పీసపాడు వద్ద కారు, ఇసుక ట్రాక్టర్ ఢీ
క్రోసూరు: మండలంలోని పీసపాడు గ్రా మ ప్రధాన రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ దగ్గరలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. పెదకాకానికి చెందిన మాజీ ఎంపీపీ నల్లిమల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ బద్దిపూడి రమేష్, మరో ఇద్దరు వ్యక్తిగత పనులపై కారులో సత్తెనపల్లి మీదగా మండలంలోని పీసపాడు వస్తున్నారు.ట్రాక్టర్ క్రోసూరు వైపు నుంచి సత్తెనపల్లి వెళ్తుంది. ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురుకి గాయాలయ్యాయి. ఒకరు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మరో ముగ్గురు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు సమాచారం. ట్రాక్టర్ ముప్పాళ్ల మండలం కు చెందినదిగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అగ్రహారం భూముల సర్వే పూర్తి చేయాలి
నరసరావుపేట: జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న అగ్రహారం భూముల సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే ఏడాది మార్చి నాటికి సెటిల్మెంట్తో సహా అన్ని పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ అగ్రహారం భూములు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నాలుగు మండలాల్లోని అగ్రహారం భూములకు సంబంధించిన సర్వేను తక్షణమే ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా సెటిల్మెంట్ ప్రక్రియను ముగించాలని ఆమె స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్వే శాఖ ఏడీ శ్రీనివాస్, ఆర్డీఓ కె.బాలకృష్ణ, వినుకొండ, నూజెండ్ల, ఈపూరు, బొల్లాపల్లి తహసీల్దార్లు సురేష్, రమేష్, నళిని, చంద్రశేఖర్ పాల్గొన్నారు. తప్పులు లేకుండా ‘సర్’ నిర్వహణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియలపై గురువారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్ క్షేత్రస్థాయి సర్వేపై రాజకీయపార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో బీఎల్ఓలు పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు నిర్వహించే డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. ఓటర్ల వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత ఓటర్లకు అందించి, వివరాలను పరిశీలించి కలర్ ఫొటోతో పాటు సంతకాలు తీసుకోవాలని సూచించారు. సరిపోలని వివరాలను మాస్టర్ డేటాతో తనిఖీ చేసి, ఎన్నికల డేటా బృందంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి సర్వే, మ్యాపింగ్, డిలీషన్ అంశాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల డీటీ, ఏఈఆర్వో, ఈఆర్వోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, పూర్తి పారదర్శకతతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు అనుమతుల మంజూరుకు ఆదేశం జిల్లాలోని అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న ప్రజల నివాసాలు, గిరిజన తండాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం అటవీశాఖ అనుమతులను నిబంధనల ప్రకారం తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ శాఖ అధికారిణి కృష్ణప్రియలతో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోటప్పకొండ ఈవో, మార్కాపురం గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఐటీడీఏ అధికారి పీవో, ఏపీ విద్యుత్ శాఖ ఎస్ఈ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) గా డాక్టర్ కోనేటి నాగరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డాక్టర్ నాగరాజు వైఎస్సార్ కడప జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పదోన్నతి కల్పించి గుంటూరు ఆర్డీగా బదిలీ చేశారు. డాక్టర్ నాగరాజు తిరుపతిలో 1983లో ఎంబీబీఎస్ అభ్యసించారు. కడప జిల్లా కదిరిలో 1993లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా 2010లో, సివిల్ సర్జన్గా 2021లో పదోన్నతి పొందారు. రాజంపేట డెప్యూటీ డీఎంహెచ్ఓగా, వైఎస్సార్ కడప జిల్లా జిల్లా ఆసుపత్రిలో 13 సంవత్సరాల పాటు, వైఎస్సార్ కడప రిమ్స్లో ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఫుల్ అడిషనల్ చార్జి ఆర్డీగా డాక్టర్ జి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె జులై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. డీఈఓ షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై మార్కెట్లోకి రాని పాఠ్య పుస్తకాలు శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల కొరత ఉన్న వాస్తవేమనని, త్వరలోనే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 30.4 మి.మీ. కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా మంగళగిరి మండలంలో 81.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మేడికొండూరు మండలంలో 6.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 77.6 మి.మీ., దుగ్గిరాల 70.8, తెనాలి 67.8, కొల్లిపర 47.4, చేబ్రోలు 45, తుళ్లూరు 28.8, పెదకాకాని 27.2, గుంటూరు పశ్చిమ 26.4, గుంటూరు తూర్పు 18.4, వట్టిచెరుకూరు 16.6, ఫిరంగిపురం 8.6, పొన్నూరు 8.6, తాడికొండ 8.2, ప్రత్తిపాడు మండలంలో 7.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కొరిటెపాడు(గుంటూరు): సబ్ జూనియర్ బాలబాలికల అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు బాక్సర్లు ఎంపికై నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరిలో ప్రజ్ణ దియా జోష్లిన్ ఎంపికై ందన్నారు. బాలుర విభాగంలో 70 కిలోల కేటగిరిలో శ్రీ కార్తికేయ, 55 కిలోల విభాగంలో జ్ఞాన సాయి, 35 కిలోల విభాగంలో చంద్రహౌస్ ఎంపికై నట్లు వివరించారు. ఈ క్రీడాకారులతో పాటు బాక్సింగ్ కోచ్ ఇమ్మానియేల్ రాజు కూడా పోటీలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న గుంటూరు జిల్లా బాక్సర్లు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కోలా చిరంజీవి మాట్లాడుతూ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అసోసియేషన్ తరపున ఆర్తిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఫుట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
సత్తెనపల్లి: ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సుగాలికాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు గురువారం ఉత్సాహంగా సాగాయి. ఈ ఎంపికలకు 80 మంది బాలికలు, 120 మంది బాలురు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో 25 మంది, బాలికల విభాగంలో 25 మంది, జూనియర్ బాలుర విభాగంలో 25 మంది, బాలికల విభాగంలో 25 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న క్రీడాకారులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సత్తెనపల్లి జిల్లా పరిషత్ సుగాలికాలనీ ఉన్నత పాఠశాలలో శిక్షణ క్యాంపు నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె.సుబ్రహ్మేణ్యేశ్వరరావు తెలిపారు. ఆయనతోపాటు, కార్యదర్శి షేక్ షమ్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రియాజ్, అసోసియేషన్ బాధ్యులు సుభాని, శ్రీరామిరెడ్డి, ఆలి, శ్రీనివాసరెడ్డి, జాన్సైదా, మహేశ్వరి, శ్రీను, ప్రవీణ్, శ్రావణిలు ఉన్నారు. బాలికల జట్టు ఇదే.. సబ్ జూనియర్, జూనియర్స్ బాలికల జట్టుకు పి.విజయలక్ష్మి (సత్తెనపల్లి), పి.స్వాతి (సత్తెనపల్లి), షేక్ నాజియా (సత్తెనపల్లి), ఎన్.నిఖిత భవ్య (సత్తెనపల్లి), కె.సాయినిఖిత (సత్తెనపల్లి), కె.నాగమల్లేశ్వరి (సత్తెనపల్లి), పి.అక్షయ్ (సత్తెనపల్లి), పి.మానశ్రీ (సత్తెనపల్లి), ఆర్.శ్రీభవ్య (సత్తెనపల్లి), షేక్ ఆషికా (సత్తెనపల్లి), షేక్ మదీనా జాహ (సత్తెనపల్లి), ఎ.విశ్వఘ్నకృష్ణజ (సత్తెనపల్లి), పి.వేదశ్రీ (ముప్పాళ్ల), ఎస్.నాగరాజలక్ష్మి (ముప్పాళ్ల), వి.శ్రీమ్సీ (సత్తెనపల్లి), పి.విజయలక్ష్మి (సత్తెనపల్లి), షేక్జాస్మిన్ (సత్తెనపల్లి), టి.త్రివేణి (సత్తెనపల్లి), పి.అలేఖ్య (సత్తెనపల్లి), పి.ఈశ్వరి (సత్తెనపల్లి), పి.స్వాతికీర్తన (వినుకొండ), ఎస్.శ్రావ్య (మాదల), జి.చంద్రిక (ఇరుకుపాలెం), పి.ప్రవల్లిక (ఇరుకుపాలెం), పి.స్వాతి (అచ్చంపేట)లు ఎంపికయ్యారు. బాలుర జట్టు ఇదే.. బాలుర విభాగంలో డి.శివసాయి (సత్తెనపల్లి), షేక్ దరియా హుస్సేన్ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.ఇర్ఫాన్(సత్తెనపల్లి), షేక్ జావిద్ అలాం (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.వి.సాయిపుల్లా (నరసరావుపేట), ఆర్.వి.బి.శ్రీనివాస్ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.సల్మాన్ (సత్తెనపల్లి), కె.నాని (గురజాల), ఎస్.కె.ఎండి.ఇర్ఫాన్ (మాదల), ఎ.విజయదుర్గ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.అష్రఫ్ (సత్తెనపల్లి), ఎం.డి.ఎం.డి.రఫీ (సత్తెనపల్లి), కె.ఆకాష్ (సత్తెనపల్లి), గిరిప్రతాప్ (సత్తెనపల్లి), ఎం.కార్తీక్ (సత్తెనపల్లి), షేక్ ఫారూఖ్ (సత్తెనపల్లి), షేక్ జియావుద్దీన్ (సత్తెనపల్లి), కార్తీక్ (చల్లగుండ్ల), ఆర్.కార్తీక్ (సత్తెనపల్లి), కె.సాయిధనుంజయరెడ్డి (సత్తెనపల్లి), కె.షణ్ముఖ రెడ్డి (సత్తెనపల్లి), పి.రామాంజనేయులు (సత్తెనపల్లి), ఎం.ప్రణ్విత్ (సత్తెనపల్లి), అఖిల్ జోసఫ్ (రుద్రవరం), కె.చైతన్య (సత్తెనపల్లి), డి.నిభీష్రెడ్డి (సత్తెనపల్లి), టి.సాయివెంకటప్రసాద్ (సత్తెనపల్లి), వెంకట్ రుషీక్ (అచ్చంపేట), ఎస్.కె.ఎం.డి.సాయిముల్లా (నరసరావుపేట), పి.కఫీజ్ (సత్తెనపల్లి), కె.కార్తీకేయ (సత్తెనపల్లి), బి. లోకేష్ (చల్లంగుండ్ల), షేక్ రోహెల్ (సత్తెనపల్లి), పి.వాసు (సత్తెనపల్లి), షేక్రహీం (సత్తెనపల్లి), షేక్ అబ్దుల్ రెహమాన్ (సత్తెనపల్లి), టి.దీపక్ (సత్తెనపల్లి), ఎన్.నందకిషోర్ (సత్తెనపల్లి), పి.డాని (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.అబ్దుల్ రహీం (సత్తెనపల్లి), వై.నరసింహ (సత్తెనపల్లి)లు ఎంపికయ్యారు. -
మోగనున్న బడి గంట
నరసరావుపేట ఈస్ట్: బడి గంట మోగనుంది. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,566 పాఠశాలలు తెరుచుకోనున్నాయి. గత విద్యా సంవత్సరంలో 2,79,880 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,73,975 మంది విద్యార్థులు నమోదయ్యారు. 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో 10,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు ప్రకటించటంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటి వరకు కిట్లు జిల్లా కేంద్రానికి చేరుకోలేదు. గత ఏడాది మెగా పేరెంట్స్ మీటింగ్లో విద్యాకిట్లు అందిస్తామని ఆలస్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంతవరకు కిట్లు పాఠశాలలకు చేరవేయలేదు. జిల్లా పరిధిలోని 28 మండలాలకు ఇప్పటివరకు యూనిఫాం, షూస్, బ్యాగ్స్, నోట్బుక్స్, బెల్ట్లు చేరలేదు. పాఠ్యపుస్తకాలు 6,01,848 గాను 5,79,904, వర్క్బుక్స్ 1,28,194కు గాను 1,23,970 ఆయా మండలాలకు చేరుకున్నాయి. డిక్షనరీలను పంపిణీకి సిద్ధం చేశారు. నోట్ పుస్తకాలు మరో రెండు రోజుల్లో చేరుకుంటాయని భావిస్తున్నారు. వస్తువు కావలసినవి వచ్చినవి శాతం యూనిఫాం 1,41,879 0 0 షూస్ 1,41,879 0 0 బ్యాగ్స్ 1,41,879 0 0 నోట్బుక్స్ 8,04,253 0 0 బెల్ట్స్ 96,941 0 0 టెక్ట్స్ బుక్స్ 6,01,848 5,79,904 96.35 వర్క్బుక్స్ 1,28,194 1,23,970 97.70 ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 14,540 14,540 100 పిక్టోరియల్ డిక్షనరీలు 11,368 11,368 100 -
హత్య కేసులో దంపతుల అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్పీ హనుమంతరావు చిలకలూరిపేట: వ్యక్తిని దారుణంగా హతమార్చిన దంపతులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ఎస్ఎంఎస్ షాదీఖానా సమీపంలో షేక్ కాలేషావలి, షేక్ మనీషా దంపతులు నివాసం ఉంటారు. మనీషాకు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. కాలేషావలి రెడ్ల బజారులో వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ మనీషా, జాకీర్హుస్సేన్ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. జాకీర్ హుస్సేన్ జీవించి ఉన్నంత కాలం తమ మధ్య గొడవలు తప్పవని, అతనిని అడ్డు తొలగించుకొని సంతోషంగా ఉందామని భార్యకు నచ్చ చెప్పాడు. దీనికి అంగీకరించిన మనీషా తన భర్త చెప్పిన ప్రకారం జాకీర్ హుస్సేన్ను ఈ నెల ఒకటో తేదీన ఫోన్ చేసి పిలిపించింది. జాకీర్ హుస్సేన్ వచ్చాక దంపతులు ఇద్దరూ కలసి తీవ్రంగా కొట్టి, తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని వాహనం ద్వారా తీసుకువెళ్లి వేలూరు– జాలాది రోడ్డులో పడవేశారు. రెండో తేదీన మృతదేహాన్ని గుర్తించిన జాకీర్హుస్సేన్ భార్య షేక్ షఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఇరువురు సెల్ఫోన్లతోపాటు మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనం, మృతుడి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. సీఐ బి సుబ్బానాయుడు, రూరల్ ఎస్ఐ జి అనిల్కుమార్ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్ఐ లేఖా ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. -
జన‘ఇరికిరిక్’!
శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026నరసరావుపేట వంటి ప్రాంతానికి ఎన్నో ఏళ్ల తర్వాత నూతన ఆసుపత్రి భవనం ఏర్పాటు చేశారని సంబరపడాలో.. అదే ఆసుపత్రి ఆవరణకు రాజకీయ గ్రహణం పట్టిందని బాధపడాలో తెలియని పరిస్థితి. పేదలకు మరింత వైద్య సేవలు అందించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దాలని కోరుకోవాలో.. ఆసుపత్రిని ఆక్రమణలకు అడ్డాగా మార్చవద్దని వేడుకోవాలో అర్థంగాని దుస్థితి. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రతి అంగుళం పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ కవచంగా మార్చమని ప్రజలే ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన దీనస్థితి. ప్రస్తుతం నర్సరావుపేట ఏరియా వైద్యశాలలో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటు కిరికిరి చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణల పర్వంలో ప్రభుత్వ వైద్యశాల నరసరావుపేట టౌన్న: పేదలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణం వ్యాపార కేంద్రంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల జోక్యం వెరసి ప్రైవేటు మెడికల్ దుకాణాల విస్తరణ పార్కింగ్ సమస్యను తీవ్రం చేస్తోంది. ఫలితంగా రోగులు, గర్భిణులు అత్యవసర సేవల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్నాడు రోడ్డులోని ప్రసూతి వైద్యశాల మాతాశిశు సంరక్షణ విభాగాన్ని లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించిన తర్వాత రోగులు, గర్భిణుల తాకిడి పెరిగింది. గతంలో రెండు ఆసుపత్రులు వేరువేరు చోట్ల ఉండటంతో సమస్యలు పెద్దగా ఎదురుకాలేదు. ఇప్పుడు మొత్తం ఒకే చోట ఉండటంతో కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాల ఆవరణ వాహనాల పార్కింగ్తో నిండిపోతోంది. అంబులెన్స్లు నిలపటానికి స్థలం ఉండటం లేదు. దీంతో వాహనాలను మండుటెండలో నిలుపుతున్నారు. వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్, సిబ్బంది ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం లేకపోవటంతో రహదారులకు మధ్యలో వాహనాలు నిలుపుతున్నారు. ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న 150 పడకల క్రిటికల్ ట్రామాకేర్ ప్రారంభం అయితే రోగుల తాకిడి మరింత పెరగనుంది. అధికారులు ముందుచూపుతో వ్యవహరించక పోతే పార్కింగ్ సమస్య తీవ్రరూపం దాల్చనుంది. వైద్యశాల ప్రాంగణంలో కూటమిలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు గతంలో జనరిక్ దుకాణం ఏర్పాటు చేశాడు. వైద్యశాలలో ఔషధాలు అందుబాటులో లేని కారణంగా జనరిక్ దుకాణం వైపునకు రోగులు మళ్లుతున్నారు. వ్యాపారాభివృద్ధిని చూసిన మరో అధికార పార్టీ నేత తాజాగా ఇంకో జనరిక్ దుకాణాన్ని అనుమతులు రాకముందే ఏర్పాటు చేశాడు. కావాల్సిన స్థలం కంటే ఎక్కువగా తీసుకొని శాశ్వత నిర్మాణం చేపట్టాడు. ఉచితంగా మందులు అందజేసే ప్రభుత్వ వైద్యశాలలో అక్రమంగా మరో మందుల దుకాణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అంబులెన్స్లకు దారేది.. అత్యవసర సేవలకు ప్రాణధారంగా నిలిచే 108 అంబులెన్స్లు ఆసుపత్రికి రావటమే కష్టంగా మారింది. వాహనాలు ఇష్టారాజ్యంగా నిలపటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకం. వాహనాల రద్దీ కారణంగా విలువైన సమయం వృథా అవుతుందని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశం తక్కువగా ఉండటంతో వాహనాలన్నీ ఒకేచోట నిలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్క్ చేసిన వాహనం తీయటం కూడా కష్టతరంగా మారుతోంది. అత్యవసర సమయంలో పేషెంట్లను వైద్యశాలలో చేర్చాలన్నా, వైద్యశాల నుంచి మరోచోటుకు తరలించాలన్నా 108 సిబ్బందికు సవాల్గా మారుతోంది. -
అటవీ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బొల్లాపల్లి: అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం వినుకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి చెందిన టీ శ్రీసాయి, ఎఫ్ఆర్ఓ శంకరయ్యలు తొలుత వినుకొండ పట్టణ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నగర వనాన్ని సందర్శించారు. ఈపూరు మండలం భద్రుపాలెం సమీపంలో ఆ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ పరిశీలించారు. రేమిడిచర్ల బీట్ పరిధిలో ఇటీవల వన్యప్రాణుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 5 సాసర్ ఫిట్స్ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదే బీట్ పరిధిలో పలకల క్వారీని తనిఖీ చేశారు. విజిలెన్స్ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రేంజర్ సి.మాధవరావు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో ఆయుష్ సేవలను బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో యోగ, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో బుధవారం ఆయుష్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ త్వరలోనే ఆయుష్ విభాగంలో మరో ఇద్దరు వైద్యాధికారులు చేరనున్నట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆయుష్ విభాగంతోపాటు ఎయిమ్స్లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు స్పోర్ట్స్ మెడిసిన్ విభాగాన్ని మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు పుష్పాంజలి, దేసు రామమోహన్, రాజశేఖర్ మోహన్, కల్నల్ శశికాంత్, సన్యాల్, ఆర్థిక సలహాదారులు డి.గోవిందరావు, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): హైదరాబాద్ కొంపల్లిలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు గుంటూరు నుంచి 14 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్ జోన్లో పాల్గొనే క్రీడాకారులకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్యలు క్రీడాకారులకు టీ–షర్ట్స్ అందజేశారు. సౌత్ జోన్ పోటీలలో కూడా మెడల్స్ సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుముడింప చేయాలని కోరారు. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు పి.ఆనంద్కుమార్, కె.అరుణ్కుమార్, డి.అభిరామ్, నల్లబోతు త్రిలోక్య (సంజు), నిహాల్, ఆకాష్, చరణ్, జీవీఎస్ ప్రసాద్, టీ నేహా, టి.నిహిత, ఏ.ఆరాధ్య, ఎన్. హవిష్మ్, పి.అమృత, కే.కళ్యాణ్. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ముస్తాబాద్–గన్నవరం సెక్షన్లలో పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్ల్లించినట్లు రైల్వే విజయవాడ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యర్నాకులం –పాట్నా (22643) ఈ నెల 15, 16, 22, 23, 29, 30, జూలై 6, 7 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడపనున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు – గౌహతి (12509) 10, 17, 24, జూలై ఒకటో తేదీ, భవ్నగర్ టెర్నినస్ – కాకినాడ పోర్టు (12756) రైలు 13, 20, 27, జూలై 4 తేదీల్లో దారి మళ్లించారు. -
భూసమీకరణ వివరాలు సీఆర్డీఏకు అందించండి
నరసరావుపేట: అమరావతి మండలంలో ల్యాండ్ ఫూలింగ్ (భూసమీకరణ)కు అంగీకరించిన రైతుల వివరాలతోపాటు, దేవదాయ, రెవెన్యూ శాఖల భూముల రికార్డులను త్వరితగతిన క్రోడీకరించి సీఆర్డీఏకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ల్యాండ్ ఫూలింగ్, భూముల వివరాలపై జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు సకాలంలో త్వరగా పరిహారం అందించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశమని స్పష్టం చేశారు. ఇందుకోసం వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి సులభంగా, వేగంగా జరగాలని సూచించారు. అమరావతి మండల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. ఈ పరిధిలో ఉన్న దేవదాయ భూములు, రిజిస్టర్డు, అన్ రిజిస్టర్డు కాని భూములు, జరీబ్ భూములు, చెరువులు, కాలువ పోరంబోకు భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి, స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలన్నారు. 16న చిలకలూరిపేటలో జాబ్మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు చిలకలూరిపేటలోని మునిసిపల్ ఆఫీస్ రోడ్, అర్బన్ పోలీస్స్టేషన్ పక్కన ఉన్న ప్రత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించే మెగా జాబ్మేళాను జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కోరారు. జాబ్మేళా వాల్పోస్టర్ను తన కార్యాలయంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావుతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. తమ్మాజీరావు మాట్లాడుతూ జాబ్మేళాలో జోయలుకాస్, బుక్ ఎక్స్పోర్ట్, హెటిరో డ్రగ్స్, టీం కంప్యూటర్స్, డీమార్ట్, బిగ్ సి, మెడ్ ప్లస్, టెక్ సొల్యూషన్, అక్రో సాఫ్ట్ సొల్యూషన్, ఇసుజు మోటార్స్, జస్ట్ డయల్, టాటా కాపిటల్, ఫ్యూచర్ ఐటి సొల్యూషన్, రిలయన్న్స్ జియో, అఫెక్స్ సొల్యూషన్, ప్రీమియర్ ఎనర్జేస్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. ఇతర వివరాలకు కిరణ్–7842747682, అంజిరెడ్డి–7779858789, రమ్య–7702921219, అనుష–9848793357లను సంప్రదించాలని కోరారు. అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వేమవరపు రామాంజనేయులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రోస్టిక్ హ్యాండ్ ప్రాజెక్ట్ వాల్పోస్టర్ను రెడ్క్రాస్ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
పల్నాడు
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి రూరల్: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఏడాది మాదిరిగానే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతపై రవాణా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండు వారాలుగా ఆయా విద్యాసంస్థల బస్సులకు పూర్తిస్థాయి తనిఖీలు చేస్తున్నారు. తక్షణం సామర్థ్య పరీక్షలు చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్సీ) తప్పనిసరిగా పొందాలని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు ఇప్పటికే సూచించారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవడానికి గత నెల 15వ తేదీతోనే గడువు ముగిసింది. అయినప్పటికీ చాలా విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 7 -
పాఠశాలలను సిద్ధం చేయండి
నరసరావుపేట ఈస్ట్: 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా పల్నాడు జిల్లా పరిధిలోని పాఠశాలలను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాం ప్రసాద్ తెలిపారు. డీఈఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 1560 ప్రభుత్వ, 454 ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వివరించారు. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు చేరుకున్నాయని, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను గురువారం నాటికి పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రూ.15 కోట్లతో కేజీబీవీ, మోడల్ స్కూల్స్, మౌళిక సదుపాయాలు లేని పాఠశాలల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వంద రోజుల్లో ఏసీఆర్ కార్యక్రమంలో భాగంగా 60 పాఠశాలల్లో 218 తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గత ఏడాది 1వ తరగతిలో 12,000 మంది విద్యార్థులు చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను ఇప్పటికే 10,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ప్రతి తరగతిలో ప్రవేశాలను పెంచేలా అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు వివరించారు. జిల్లా పరిధిలో 484 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించామన్నారు. ఆయా పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు రూ.27 కోట్లు నిధులు విడుదల కానున్నట్టు తెలిపారు. దీంతోపాటు 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించేందుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో సదుపాయాలను పరిశీలించి పాఠశాలలు తెరిచే నాటికి వసతి గృహాలను సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు తొలిరోజు నుంచే చర్యలు తీసుకునేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. -
ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
నరసరావుపేట: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక కార్యాలయంలో బుధవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎన్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్ చైర్మన్ 2024లో రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు మరొకరిని నియమించకపోవటం తగన్నారు. వేతన సవరణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, గృహ అద్దెలు వంటి జీవన వ్యయాలు విపరీతంగా పెరిగినా వాటికి అనుగుణంగా మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించకపోవటం వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇతర పనులతోపాటు రెగ్యులర్ బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తీవ్ర పనిభారం పడుతూ మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఈహెచ్ఎస్ సమర్థంగా అమలు కావడం లేదని, అనేక వైద్యశాలలు వాటిని అమలు చేయకపోవటంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులతో పొందాల్సి వస్తోందన్నారు. పీఆర్సీ, ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని తీర్మానం చేశారు. వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని, వేతన సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థంగా అమలు చేసి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. జనరల్ సెక్రటరీ జి.తిరుపతిరావు, వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, జిల్లా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సురేంద్ర, జిల్లా జేఏసీ మహిళా కార్యదర్శి దివిషా బేగం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ నాయకులు ఆంజనేయులు, బాబా సాహెబ్ పాల్గొన్నారు. -
ముఖం చూపితే రూ. 300
పిడుగురాళ్ల రూరల్: తప్పుడు మస్టర్లతో మాయ... పని చేయకుండా చేసినట్లు బిల్లులు, కొలతలలో వ్యత్యాసాలు, పలు అక్రమాలకు పాల్పడుతూ ఉపాధి హామీ పథకంలో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. పని చేసారో లేదో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఎక్కడా పని చేసిన దాఖలాలు లేవు. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, అధికారులు చేసే దందా అంతా ఇంతా కాదు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి, గ్రామ స్థాయి సిబ్బంది చేతివాటంతో ఉపాధి హామీ పథకం నీరుగారిపోతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంది. ఫొటో దిగితే ఒక పనైపోతుంది.... ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ సంవత్సరం ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి తీసుకొచ్చారు. కానీ కింది స్థాయి అధికారుల అక్రమాలకు హద్దు లేకుండా పోతోంది. కేవలం ఫొటో దిగితే రూ. 300 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రెండవ ఫొటోకు ఉపాధి హామీ పథకానికి వచ్చిన సభ్యులందరూ రావాలి. దీనిని తూతూ మంత్రంగా ముగించేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. పని కావాలంటే రూ.200 ఇవ్వాల్సిందే... అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని ఉపాధి హామీ పథకం చట్టం చెబుతోంది. కానీ పిడుగురాళ్ల మండలంలో దీనికి విరుద్ధంగా పరిస్థితి ఉంది. అవసరమైన వారికి పని కల్పించకుండా రూ. 200 ఇచ్చిన వారికి మాత్రమే పని కల్పిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చేతివాటం చూపిస్తూ గ్రామస్థాయిలో రూ.వేలల్లో జేబులు నింపుకొంటున్నారు. పని కావాల్సిన ఉపాధి హామీ కూలీలకు ఉపాధి లేకుండాపోతోంది. మండలంలోని కామేపల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లు రూ. 200 ఇవ్వాలని కూలీలకు హుకుం జారీ చేస్తున్నారు. అధికారుల మౌనముద్ర ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంటే కొంత మంది గ్రామాలలోని అధికారులు జేబులు నింపుకొంటున్నారు. రూ.కోట్లకు పడగలెత్తిన వారికి, ఉపాధి పని అవసరం లేని వారికి కూడా పని కల్పిస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. అలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు ముడుపులు తీసుకొని ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా అంటే ఫొటో క్యాప్చర్ ఉంది కదా అంటూ... దానిని సైతం ఫొటో దిగు... రూ. 300 వందలు పట్టు అనే చందంగా మార్చేశారు. -
కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
నెహ్రూనగర్: కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సంకటి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి వద్ద ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 2017 డిసెంబర్లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు 100 నియోజకవర్గాల్లో కాపు భవనాలు, హాస్టళ్లు, కల్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చి కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్న్కు ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. కాపు విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కాపు మహిళా సాధికారత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.15,000, 5 సంవత్సరాలకు రూ.75,000 వరకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. 2019లో కాపులను బీసీల్లో చేర్చి 9వ షెడ్యూల్లో పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పూర్తిగా పరిశీలించి కాపులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. కాపునాడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, వ్యతిరేకం కాదని, రిజర్వేషన్, రాజ్యాధికార సాధన లక్ష్యంగా పోరాడే సంస్థ అని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కు కాపు నాడు వినతి -
భద్రతా నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు
లక్ష్మీపురం: భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ డివిజనల్ సేఫ్టీ అధికారి బి.విజయకీర్తి హెచ్చరించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ పిలుపు మేరకు గుంటూరు రైల్వే డీఆర్ఎం సుధేష్ఠ సేన్ పర్యవేక్షణలో ఈనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాలు బుధవారంతో ముగిశాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణ, రహదారి వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా అధికారులు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది రక్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా పట్టాభిపురం, ఇన్నర్ రింగ్ రోడ్, పెదకపలకలూరు, మంగళగిరి ప్రాంతాల్లోని రైల్వే గేట్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే భద్రతా బృందాలు లెవెల్ క్రాసింగ్ల సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేడంతోపాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డివిజన్ అధికారులు, ఆర్పిఎఫ్ సిబ్బంది, పాల్గొన్నారు. సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ బి.విజయ కీర్తి -
● డ్రైవర్కు తీవ్ర గాయాలు ● చికిత్స పొందుతూ మృతి
బెల్లంకొండ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్న సంఘటన మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వైన్స్ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజుపాలెంకు చెందిన ఇరువురు యువకులు బైక్ వచ్చి మద్యం సేవిస్తున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఒకరికొకరు నెట్టుకున్నారు. గణేష్ అనే యువకుడిని మరో యువకుడు బీర్బాటిల్తో మెడపై దాడిచేశాడు. ఘటనలో గణేష్కు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే 108 సహాయంతో ఇరువురిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై స్థానిక ఎస్సై గోపిని వివరణ కోరగా ఘటన స్థలంలో విచారించామని, యువకుల బంధువులు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. మంగళగిరి టౌన్: ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలోకి జారిపడడంతో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసముంటున్న శరత్బాబు (50) ట్రాక్టర్ డ్రైవర్గా మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో మెగా కంపెనీ కింద గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ట్రాక్టర్ ఇంజిన్తో డీవాటరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నీళ్లు ఉన్న గుంత అంచున ట్రాక్టర్ పెట్టి నీటి పైపును వేసి డీ వాటరింగ్ చేస్తున్నాడు. ట్రాక్టర్ను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుంత అంచున ఉండడంతో ప్రమావశాత్తూ పక్కనే ఉన్న 20 అడుగుల లోతున్న గుంతలో జారిపడిపోయింది. డ్రైవర్ సీట్లో ఉన్న శరత్బాబు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన శరత్బాబును మెగా కంపెనీ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శరత్బాబు మృతిచెందాడు. ఘటనపై మృతుడి కుమారుడు వంశీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులు రారు..సమస్యలు తీరవు
యడ్లపాడు: వందేళ్ల భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’ పథకం (రీసర్వే)పై అనేక అవాస్తవ ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నా.. కేవలం పథకాల పేర్లు, నినాదాలు మాత్రమే మారాయి తప్ప సామాన్యుడి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ ఎన్నికల ముందునుంచే పాలకులు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావేదిక, కలెక్టర్ల ఆధ్వర్యంలోని రెవెన్యూ క్లినిక్లు, ఎమ్మెల్యేల ప్రజా దర్బార్లు.. ఇలా ఊరూరా సభలు నిరంతరాయంగా జరుగుతున్నా, అక్కడ అందుతున్న అర్జీల్లో మూడోంతులకు పైగా శాశ్వత పరిష్కారం దొరకడం లేదన్నది బహిరంగ రహస్యం. సామాన్యుడి రెవెన్యూ కష్టాలు తీర్చి, వివాద రహిత గ్రామాలు నిర్మిస్తామన్న పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో ప్రజల్లో నిరాశ అలుముకుంది. కంటితుడుపు చర్యలేనా? తాజాగా కూటమి ప్రభుత్వం దేశంలోనే వినూత్నమని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రారంభించిన ‘వన్మంత్..వన్ విలేజ్..ఫోర్విజిట్’ కార్యక్రమం ఆరంభంలోనే అపశ్రుతి పలికింది. మొదటి గురువారం వినతులు, రెండో వారం క్షేత్ర విచారణ, మూడో వారం పరిష్కారం, నాలుగో వారం ముగింపు అంటూ పెట్టిన నిబంధనలు కేవలం కంటితుడుపు చర్యలుగా మిగిలిపోయాయి. మ్యుటేషన్లు, సరిహద్దు వివాదాలు, భూ ఆక్రమణలపై ప్రజలు ఆశగా ఇచ్చిన వినతులు అధికారుల గైర్హాజరీతో బుట్టదాఖలయ్యాయి. విద్యార్థుల సర్టిఫికెట్ల మంజూరు, భూముల కొలతలు తప్ప మిగిలిన కీలక సమస్యలన్నీ యథాతథంగా ఉండిపోయాయి. ఈ గ్రామసభలకు కీలక శాఖల అధికారులు దాదాపుగా డుమ్మా కొట్టారు. ఇందుకు ప్రజావేదిక, ఓటర్ల జాబితా పరిశీలన, జనాభా లెక్కలు, వాటిపై అవగాహనలు, శిక్షణలు రీసర్వే వంటి మల్టిపుల్ టాస్క్లు, యాప్ల నిర్వహణతో ఇప్పటికే సతమతమవుతున్న అధికారులపై ఈ అదనపు భారం మరింత ఒత్తిడిని పెంచడమే ప్రధాన కారణమని అధికారులు వెల్లడిస్తున్నారు. లాగిన్ ఇవ్వలేదు.. నాల్గో వారమే రద్దు! హడావిడిగా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం, అధికారులకు కనీసం ఆన్లైన్ లాగిన్ సౌకర్యం కల్పించకపోవడం పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. దీనివల్ల ప్రజలు ఇచ్చిన అర్జీలు ఆన్లైన్ కాక.. ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా కార్యాలయాల్లో సైతం ఎలాంటి డేటా లేకపోవడంతో ఇదంతా ఒక గందరగోళ ప్రహసనంగా మారింది. కార్యక్రమం ప్రారంభించిన నాలుగో వారం ప్రజల అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది పోయి, అదేరోజు కార్యక్రమాన్నే పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. దీంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సామాన్యుడి ఆశలు అడుగంటుతున్నాయి. అప్పుడు ‘సక్సెస్’.. ఇప్పుడెండుకు ‘రివర్స్’? ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో తొలిగా ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేసినప్పుడు విజయవంతమైందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దీనిని అమల్లోకి తెచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు జటిలంగా మారడంతో నిబంధనలను మధ్యలోనే మార్చేస్తూ ప్రభుత్వం కాలయాపన వ్యూహానికి తెరతీసింది. మొదట మండలానికి ఒక గ్రామం అన్న పాలకులు, ఆ తర్వాత నియోజకవర్గానికి ఒకటని, తీరా ఇప్పుడు జిల్లా మొత్తానికి కలిపి కేవలం ఒకే ఒక్క గ్రామానికి పరిమితం చేస్తూ లాగిన్ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఒకే ఒక్క గ్రామం ఆన్న్లైన్న్లో కనిపిస్తుండటం పాలకుల తిరోగమన విధానానికి అద్దం పడుతోంది. ఒక్క పల్నాడు జిల్లాలోనే 364 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇలా ఒక్కో గ్రామానికి నెల రోజుల సమయం వెచ్చిస్తూ పోతే.. వచ్చే ఎన్నికల సమయానికి కూడా ఒక నియోజకవర్గం పూర్తికావడం అసాధ్యం. ఇది ప్రజా సమస్యల పరిష్కారం కోసమా లేక కేవలం ప్రచారం కోసమా? అంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. -
ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
ఎస్పీ వకుల్జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని హాలులో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తు, పురోగతి, కేసు ఛేదించిన శాతం, నేరస్తుల అరెస్టులపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టప్రకారం బాధితుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కొందరు పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామాలు, వార్డుల వారీగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బైండోవర్ కేసులు నమోదు చేయాల్నారు. అంతేకాక వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ జి.వి.రమణమూర్తి, ఏటీవీ రవికుమార్, డీఎస్పీలు అళహరిశ్రీనివాస్, సంతూరయ్య పాల్గొన్నారు. డీలర్ల సమావేశంలో జేడీఏ పద్మావతి కొరిటెపాడు: ఏపీ ఏఐఎంఎస్ ద్వారా ఎరువుల విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్ కళ్యాణమండపంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రిటైల్ డీలర్లు ఇకపై ఏపీఏఐఎంఎస్ 2.ఓ పోర్టల్ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ ఆత్మ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమతుల్య ఎరువుల వాడకం ఆవశ్యకతను వివరించారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమికి, పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను డీలర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్. మోహనరావు, వి.రమాకోటేశ్వరి, ఆర్.విజయబాబు, పి.సంధ్యారాణి పాల్గొన్నారు. పుల్లలచెరువు మండలం శతకోడులో ఘటన పుల్లలచెరువు: భూముల క్రయవిక్రయాలు సాగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్(42) అనే వ్యక్తి పొలాలు విక్రయిస్తూ, కొలుగోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా శతకోడు గ్రామానికి చెందిన వరికూటి పోలిరెడ్డితో కలిసి చుట్టపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో శివాలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని రవికుమార్గా గుర్తించారు. గ్రామంలో ఇటీవల కాలంలో పోలిరెడ్డితో కలిసి రవికుమార్ తిరగడం చూశామని గ్రామస్తులు కొందరు చెప్పారు. హత్యకు పురిగొల్పిన కారణాలు తెలియాల్సి ఉంది. -
కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన వాహనం
వాహనదారుడు మృతి అమరావతి: మండల పరిధిలోని నరుకుళ్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ధరణికోట గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ హనీఫ్(39) సోమవారం తాడికొండ మండలం లాం గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం అర్థరాత్రి ద్విచక్రవాహనంపై ధరణికోట బయలుదేరాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న హనీఫ్ నరుకుళ్లపాడు వాగు బ్రిడ్జి వద్ద కుక్క అడ్డుగా రావటంతో అదుపు తప్పి వాహనం చింతచెట్టుకు ఢీకొంది. తీవ్రగాయాలై హనీఫ్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న అమరావతి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మంగళవారం హనీఫ్ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేడు స్పాట్ కౌన్సెలింగ్ గుంటూరు రూరల్: కాచిపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సులకు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి నగరంలోని అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు హిందూ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. మంగళవారం హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మతో కలసి కౌన్సిలింగ్ ప్రతులను ఆవిష్కరించారు. రంగరాజు మాట్లాడుతూ ఫీజులో బీఈ విద్యార్థులకు రాయితీ ఉంటుందన్నారు. కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ మహిళలు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తున్నామన్నారు. సమావేశంలో ఏఐబీఎఫ్ జాతీయ కార్యదర్శి పాండురంగవిఠల్, కొప్పర్తి సీతారమేష్, మాచిరాజు మురళీకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణం, సీతారామయ్య పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లు దగ్ధం ఇంకొల్లు(చినగంజాం): చెత్తకు పెట్టిన నిప్పు అంటుకుని ఓ రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు దగ్ధమై ఆస్తి నష్టం సంభవించిన సంఘటన మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన వెనిగండ్ల చంద్రశేఖర్కు చెందిన వ్యవసాయ పనిముట్లు నూతనంగా నిర్మిస్తున్న వైద్యశాల పక్కన ఉంచాడు. అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేసిన పారిశుధ్య కార్మికుడు తగలబెట్టేందుకు నిప్పు అంటించాడు. తీవ్రమైన గాలి ధాటికి మంటలు చెలరేగి చంద్రశేఖర్కు చెందిన 200 స్ప్రింక్లర్ పైపులు, నీళ్ల ట్యాంకు, 2 ఫుట్ వాల్వ్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం కారణంగా రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పారు. జాతీయస్థాయి పోటీలకు పలువురి ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్ఐ విజయ్కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు. -
చంద్రబాబు మోసకారి
మాచర్ల: సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఎంతో మోసపూరితంగా ఆయన వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసన కార్యక్రమం మాచర్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఐదు మండలాల నుంచి వందల మంది తరలివచ్చారు. కార్యాలయం వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. పార్టీ శ్రేణులతోపాటు రైతులు, యువత, ప్రజలు, మహిళలు.. ఇలా అన్నివర్గాల వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బెలూన్లను పీఆర్కే ఆధ్వర్యంలో ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత పీఆర్కే మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను మోసగించేలా రెండేళ్లుగా పాలన చేస్తున్నారన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఎగ్గొట్టారని మండిపడ్డారు. రైతులకు చేసిన మేలు మచ్చుకై నా కనిపించడం లేదన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛను ఊసే లేదని, రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూడా లేవని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలివేసి హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ ఇప్పటికీ గాలి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రూ. లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రంలోని ప్రజలకు ఒక్క రూపాయి కేటాయించడం లేదన్నారు. చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కుమారుడి కోసం, దత్త పుత్రుడి కోసం ఐటీ కంపెనీలతో ఫేక్ ప్రచారం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ పాలనంతా జగన్ ఫోబియాతోనే చేస్తున్నారన్నారు. నిజాలు మాట్లాడినా, ప్రజలకు మేలు చేయలేదని అడిగినా... అక్రమ కేసులు పెడుతూ అన్ని వర్గాలను పోలీసు స్టేషన్కు పిలిపించి రెడ్బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను నిరసిస్తూ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పోలా శ్రీను, యరబోతుల శ్రీనివాసరావు, బోయ రఘురామిరెడ్డి, కామనబోయిన కోటయ్య, పెద్ద మల్లు స్వామి, నవులూరి భాస్కర్రెడ్డి, పోతురెడ్డి కోటిరెడ్డి, షేక్ మస్తాన్, నవులూరి చెన్నారెడ్డి, కొమ్ము చంద్రశేఖర్రావు, కొంగర సుబ్రహ్మణ్యం, చిలుకూరి చంద్రశేఖర్రెడ్డి, నరసింహరావు, తిప్పారెడ్డి గోపాల్రెడ్డి, డి. వెంకటేశ్వర్లు, కొండా శివలింగరాజు, గొట్టం బ్రహ్మారెడ్డి, మందా సంతోష్, మాచర్ల సుందరరావు, గోలి శ్రీనివాసరావు, షేక్ బాజి, ముస్తఫా, రామాంజనేయరెడ్డి, పిల్లి కొండ, మోరా రామకష్ణారెడ్డి, కేతావత్ బాలునాయక్, మాచర్ల పవన్, పాముల సంపూర్ణమ్మ, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, శివపార్వతి, పులిమెల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
12, 14 తేదీల్లో డాక్టర్ వెంకటప్పయ్య జయంతి వేడుకలు
తెనాలి: పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలను ఈనెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహించనున్నారు. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో జరిగే వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వెంకప్పయ్య కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 10 గంటలకు శాఖాగ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో గల అన్నమయ్య వేదికపై వెలగా–అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఏస్టేట్లోని కుమార్పంప్స్ సత్సంగ్ హాలులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్, మానవత సంస్థ, తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో మొవ్వా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్, ఈఎల్వీ అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్.లావణ్యసుధ, కె.పద్మావతి పాల్గొన్నారు. 14న డాక్టర్ కె.రామ్చంద్కు జీవనసాఫల్య పురస్కారం -
గడువులోగా సర్ పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలో నిర్దేశిత గడువులోగా సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై మంగళవారం క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ, ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో సర్ ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్ఓలు తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. వాటిని 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ అంశంపై బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని వివిధ పార్టీల బూత్ ఏజెంట్ (బీఎల్ఏ)లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్ఓలు తమ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఈ ప్రక్రియ సజావుగా సాగేలా సహకారం తీసుకోవాలన్నారు. జాబితాలో మార్పుచేర్పులు ఉంటే వాటిని ఆన్లైన్లో చేసేటప్పుడు తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. బీఎల్ఓలకు ఏఈఆర్ఓలు సెలవులు మంజూరు చేస్తేనే తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఎలక్షన్ డీటీల వివరాలు కలెక్టర్కు అందజేయాలని సూచించారు. -
వంటింట్లో గ్యాస్ మంట!
కూటమి ప్రభుత్వం ప్రజలపై రోజురోజుకూ పెనుభారం మోపుతోంది. గ్యాస్ బండను సామాన్య కుటుంబాలకు గుదిబండగా మార్చేసింది. పెట్రోల్, డీజిల్ తరహాలోనే గ్యాస్ ధర పెరుగుతూనే ఉంది. గతేడాది సిలిండర్ పై రూ. 50 పెంచిన ప్రభుత్వం మార్చి నెల 7న ఏకంగా రూ. 60 బాదింది. ప్రస్తుతం మరో రూ. 29 పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి పండుగను పురస్కరించుకొని చంద్రబాబు సర్కారు అమల్లోకి తెచ్చిన ఉచిత గ్యాస్ అంతా బోగస్గా మారింది. వేలాది మంది ఎల్పీజీ వినియోగదారులు నేటికీ ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ధర పెంపుతో జిల్లా ప్రజలపై నెలకు ఏకంగా రూ.2.28 కోట్లకుపైగానే అదనపు భారం పడుతోంది. సత్తెనపల్లి: పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ గడిచిన రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వాతలు పెడుతూనే ఉంది. ప్రజల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా విడతలవారీగా పెంచుకుంటూ పోతోంది. దీనికి కొనసాగింపుగా ఈ వారం ఆరంభంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కూటమి ప్రభుత్వం తాజాగా గృహావసరాల వంట గ్యాస్ సిలిండర్ ధరనూ భారీగా పెంచింది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి, పేద ప్రజలకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది. జిల్లాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,019.50 ఉండేది. కూటమి ప్రభుత్వం గత నెలలో సిలిండర్పై ఒకేసారి ఏకంగా రూ. 993.50 ధర పెంచింది. పెరిగిన ధరలతో జిల్లాలో ఆ గ్యాస్ ధర రూ. 3,184 కు చేరింది. ఇక ఈ నెల మొదటి వారంలో మరోసారి వాణిజ్య సిలిండర్ ధర రూ.40 వరకూ పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ. 3,236 కు చేరింది. ఈ ధరల పెంపు చూసి చిరు వ్యాపారుల నుంచి హోటల్ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోయారు. తాజాగా సిలిండర్ మీద రూ. 40 పెంచారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో సిలిండర్పై రూ. 1,051 పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధర చూసి తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసేవారు వాపోతున్నారు. పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్లు ఇక పూర్తిగా బ్లాక్ కానున్నాయి. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 4 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ వంటి వ్యాపార కేంద్రాలు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. వాణిజ్య సిలిండర్ ధర అధికంగా ఉండడంతో 90 శాతం హోటళ్లలో గృహ అవసరాల సిలిండర్లు వినియోగిస్తున్నారు. గృహ అవసరాల సిలిండర్లలోని గ్యాస్ను వాణిజ్య అవసరాల సిలిండర్లోకి డంప్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ లేకుండా హోటళ్లు నడుపుతున్న వారు నేరుగా గృహ అవసరాల గ్యాస్నే వాడుతున్నారు. గ్యాస్ కొరతతో, ధర పెంచడంతో చాలా హోటళ్ల వారు కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. పెను భారం... జిల్లా వ్యాప్తంగా 51 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల వంటింటి గ్యాస్ రూ. 954.50 ఉండేది. తాజాగా రూ. 29 పెంచిన ధర ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో వినియోగదారులు రూ. 983.50 చెల్లించాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ కనెక్షన్లు 6,02,997 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,85,316 కలిపి మొత్తం 7,88,313 కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన వినియోగదారుడు నెలకు కనీసం ఒక సిలిండర్ వాడినా వాటిపై జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. 2,28,61,077 అదనంగా భారం పడుతోంది. అడ్డగోలుగా పెంపు ఎన్నికల హామీల్లో భాగంగా వంట గ్యాస్ ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 24 నెలల్లో మూడుసార్లు ధరలు పెంచేశారు. మొదటి 10 నెలలకు రూ. 50, ఈ ఏడాది మార్చి 7న సిలిండర్పై ఏకంగా రూ. 60, ప్రస్తుతం మరో రూ. 29 పెంచి ధరల వడ్డింపు మొదలెట్టారు. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అర్హత కలిగిన వారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ పథకం ఆదిలోనే అటకెక్కింది. బడ్జెట్ తారుమారు... గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుతో ఆ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై పడుతోంది. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఆహార పదార్థాల ధరలను హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పెంచేశాయి. తిరిగి వచ్చి ఈ భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా తమ నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడంతో ఏం చేయాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామ సమీపంలోమంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన ఇంకొల్లు విజయలక్ష్మి, కులవపద్మ స్కూటీపై సత్తెనపల్లి వస్తుండగా వెనుకగా వస్తున్న ఖాళీ ఇసుక టిప్పర్ ఢీకొంది. దీంతో స్కూటీ అదుపు తప్పి కిందపడిపోగా, స్కూటీ వెనుక కూర్చున్న టి.పద్మ (36) తలరోడ్డుకు తగిలి రక్తగాయమై మృతిచెందింది. స్కూటీ నడుపుతున్న విజయలక్ష్మి హెల్మెట్ ధరించడంతో స్వల్ప గాయాలయ్యాయి. టిప్పర్ను సత్తెనపల్లి రూరల్ పోలీసులు స్టేషన్కు తరలించారు. పద్మ మృతితో భర్త నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహంతో ఇంటి ముందు నిరసన గుంటూరు రూరల్: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్ మెంట్లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందా డు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. -
వేమూరు నియోజకవర్గంలో మట్టి దందా
వేమూరు: వేమూరు నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. చుండూరు మండలం ఆలపాడు గ్రామంలోని చెరువులో మట్టి తవ్వి అక్రమంగా అమ్ముకుంటున్నారు. తెరవెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆలపాడు చెరువులో తవ్విన మట్టిని పెదపూడి, కూచిపూడి, పెరవలిపాలెం, వలివేరు, అమృతలూరు, మూల్పూరు గ్రామాలకు తరలిస్తున్నారు. మట్టి రవాణాను అడ్డుకుంటే బదిలీ వేటు పడుతుందని అధికారులు భయపడుతున్నారు. చుండూరు మండలం పెదగాదెవలర్రు గ్రామంలో కూడా ఇష్టారాజ్యంగా గుంతలు పెట్టి మట్టి తవ్వకాలు చేయడంతో తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అడ్డుకుంది. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తవ్వకాలు నిలిపి వేశారు. అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో చెరువు తవ్వకాల్లో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య విబేధాలు రావడంతో ఒక వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇరువర్గాలకు చెందిన నాయకులను పిలిచి పంచాయితీ చేశారు. దీంతో మోపర్రులో చెరువు మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆలపాడులో జనసేన పార్టీకి చెందిన ఓట్లు అధికంగా ఉండటం వల్ల ఆ పార్టీ నాయకులే అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రతి చెరువు తవ్వకంలో ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. మండల అధికారులు అక్రమ మట్టి తవ్వకాలు నిలిపి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అతివేగం
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి శివారులో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయరావు(42), ఉప్పుతల నర్సింహారావు (38) ఇద్దరు గత కొద్ది రోజులుగా సిమెంట్ పరిశ్రమలో లారీలకు సిమెంట్ ఎగుమతి చేసేందుకు వెళ్తుంటారు. రోజుమాదిరిగా మంగళవారం ద్విచక్ర వాహనంపై వారు సిమెంట్ పరిశ్రమకు బయలుదేరారు. గ్రామం నుంచి దామరచర్ల వైపు లారీ యార్డ్ సమీపానికి రాగానే అదే సమయంలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి– నారాయణపురం గ్రామానికి చెందిన జెక్క వెంకటేష్(25) దామరచర్ల నుంచి గుంటూరుకు బైక్పై రాంగ్రూట్లో వేగంగా వెళ్తూ ఎదురుగా సిమెంట్ పరిశ్రమకు వస్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్లు నడుపుతున్న ధనుంజయరావు, వెంకటేష్లకు తీవ్ర గాయాలుకాగా.. ధనుంజయరావు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్, నర్సింహారావులను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకటేష్ మృతిచెందాడు. నర్సింహారావు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడు బత్తుల ధనుంజయరావుకు కుమారుడు, కుమార్తె, భార్య సైదమ్మ ఉన్నారు. ఉప్పుతల నర్సింహారావుకు ఇద్దరు కుమారులు, భార్య అంజమ్మ ఉన్నారు. మరో మృతుడు జెక్క వెంకటేష్ అవివాహితుడు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారే.. వాడపల్లికి చెందిన ధనుంజయరావు, ఉప్పుతల నర్సింహారావులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. ఇండియా సిమెంట్ (ఆల్ట్రాటెక్) పరిశ్రమలో దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు. జెక్క వెంకటేష్ కుటుంబం సైతం పేద కుటుంబమే. చిన్నప్పుడే తండ్రి జెక్క శ్రీనివాస్రావు ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి వెళ్లడంతో తల్లి పూలమ్మ పెంచి పెద్ద చేసింది. కుమార్తె పెళ్లి చేయగా కొడుకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేందుకు రైల్వే స్టేషన్లో వాటర్ బాటిళ్లు, చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. వెంకటేష్ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
చేబ్రోలు: న్యాయవాద వృత్తిలో విజయాన్ని సాధించాలంటే కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, పరిశోధనతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం అత్యవసరమని విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’ మంగళవారం కూడా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ దేశంలో సమర్థంగా పనిచేస్తోందని, దానిలో భాగస్వాములైన యువ న్యాయవాదులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయమూర్తులుగా ఎదగడం, మరొకటి కార్పొరేట్ రంగంలో న్యాయ నిపుణులుగా సేవలందించడం అని చెప్పారు. న్యాయమూర్తిగా ఎదగడం కష్టసాధ్యమైన మార్గమైనప్పటికీ, విజయవంతమైతే వందలాది మందికి న్యాయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పటికే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్యూ నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్, నల్లూరి మాధవరావు, కె.కుమార్, నర్రా శ్రీనివాసరావు, విశ్రాంత జిల్లా జడ్జి జీవీ క్రిష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు తుమ్మేటి రమేష్, తుమ్మల శ్రీకుమార్, న్యాయవాదులు సీవీఎల్ఎన్ మూర్తి, బైరపునేని నరేష్, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
సీపీఎం జిల్లా కార్యదర్శి డిమాండ్
నరసరావుపేట: పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వామపక్షాల దేశవ్యాప్త పిలుపు మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రాస్తోరోకో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్, మల్లమ్మ సెంటర్ మీదుగా నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. విజయకుమార్ మాట్లాడుతూ... మన రాష్ట్రంలో దొరుకుతున్న గ్యాస్లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, కార్పొరేట్లకు రాయితీలు రద్దు చేసి ప్రజలపై భారం తగ్గించాలన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు ప్రభావం అన్ని వర్గాల ప్రజలు, నిత్యావసర సరుకుల ధరలపై ప్రత్యక్షంగా పడిందని అన్నారు. విభజించు పాలించు అనే తీరులో కేంద్రం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సీపీఎం 1వ, 2వ పట్టణ కార్యదర్శులు షేక్ సిలార్ మసూద్, ఎస్డీ రబ్బాని, నరసరావుపేట మండల కార్యదర్శి డి.శివకుమారి, నాయకులు ఎస్.వెంకటేశ్వరరాజు, టి.పెద్దిరాజు, కె.నాగేశ్వరావు, ఎం.ఆంజనేయులు, కె.ఆంజనేయులు, మస్తాన్వలి, ఖాజావలి, సీపీఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, చిన్న జాన్ సైదా, రైతు సంఘం నాయకుడు నాగేశ్వరరావు, గిరిజన నాయకుడు కోయ శ్రీను, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్.జిలాని మాలిక్ పాల్గొన్నారు. -
సిరాజ్కు జాతీయ స్థాయి పురస్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. స్టీలు బ్రిడ్జి పనులు ప్రారంభం తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి గతంలో స్వల్పంగా ఒరగడంతో ఆ బ్రిడ్జిలో కొంత భాగాన్ని సీఆర్డీఏ అధికారుల సూచనల మేరకు తొలగించారు. ఆ గడ్డర్లను సరిచేసి బకింగ్హామ్ కెనాల్పై అమర్చేందుకు కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం నాలుగు ఐరన్ గడ్డర్లు బిగించాల్సి ఉండగా సాయంత్రం సమయానికి మూడు గడ్డర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మరో గడ్డర్ను అమర్చి దానిపై కాంక్రీట్ వేసేందుకు ప్రత్యేకమైన రేకులు, స్టీలును అమర్చాల్సి ఉంది. 10–15 రోజుల్లో స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. క్రైస్తవ మైనారిటీలపై దాడులను అరికట్టాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ.మెల్కీ సెదేక్, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మతమార్పిడి నిరోధక చట్టాలు, క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హర్షకుమార్. మెల్నీసెదేక్ మాట్లాడుతూ.. దేశంలో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్ బిల్లును ఆమోదించాలన్నారు. -
పురుగు మందుల పరీక్షల్లో నాణ్యతకు పెద్దపీట
అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్ కొరిటెపాడు(గుంటూరు): రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించేందుకు పరీక్ష విధానాలను మరింత పటిష్టం చేయాలని అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు శనగల రామ్మోహన్ సూచించారు. గుంటూరులోని పురుగు మందుల పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వివిధ యంత్రాలపై పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి మాట్లాడుతూ పురుగు మందుల పరీక్షలకు అవసరమైన వివిధ రకాల మూల పదార్థాలను(టెక్నికల్స్) సరఫరా చేయాలని కోరారు. కొత్త జీఎల్సీ ఎక్విప్మెంట్ వచ్చిన వెంటనే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. రామ్మోహన్ మాట్లాడుతూ పురుగు మందుల పరీక్ష కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం పరీక్షించుకోవడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో నూతన అనాలసిస్ చేసే పరికరాలు అందించడం జరుగుతోందన్నారు. ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం వ్యవసాయ అధికారి విశ్వేశ్వరప్ప, ఏఓలు బి.సురేంద్రబాబు, ఏ.శ్రీనివాసులు, ఎన్.ప్రసన్న, బి.భారతి, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్లో షబీనాకు రజతం
తెనాలి: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 2025–26లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా అద్భుత ప్రతిభతో రజత పతకం సాధించింది. చైన్నెలోని హిందుస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) బే రేంజ్ క్యాంపస్లో ఈ నెల జూన్ 3 నుంచి 8 వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న షబీనా ఈ పోటీల్లో 84 కిలోల కేటగిరీలో తలపడి స్క్వాట్ 210 కిలోలు, బెంచ్ ప్రెస్ 110 కిలోలు, డెడ్ లిఫ్ట్ 207.5 కిలోలతో మొత్తం 527.5 కిలోల బరువులను ఎత్తి రజత పతకం గెలుచుకుంది. ప్రముఖ కోచ్ ఎం.అశోక్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన షబీనా, క్రమశిక్షణతో కూడిన కఠిన సాధనతో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధిస్తుండటం విశేషం. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమాన్కు 3000 మామిడిపండ్లతో మంగళవారం అర్చన నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు 3వేల మామడి పండ్లతో అర్చన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారని ఆయన తెలిపారు. గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగమంటే ఉపాధి మార్గం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్, ఎన్సీసీ తదితర శాఖలలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పొన్నూరు: గణితం, ఆంగ్లం సబ్జెక్టులు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని గుంటూరు ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో జి.ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒకటి, రెండు తరగతులు బాగా చదివితే పై తరగతుల్లో విద్యార్థులు రాణిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జీఎఫ్ఎల్ఎన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి. రాజు, కె.విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయురాలు వి.తులసిరాణి, డీఆర్పీలు శ్రీనివాసమూర్తి, కోటేశ్వరరావు, సద్గుణరావు, లక్ష్మీనారాయణ, పద్మజ, కళ్యాణి, రాంబాబు, దీక్ష కోఆర్డినేటర్లు బి.హనుమంత ప్రసాద్, పి.రవికుమార్ సీఆర్ఎంటీలు, పీటీఐలు తదితరులు పాల్గొన్నారు. -
కరుణ మరచి కాసుల కక్కుర్తి
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాకు పెద్దాసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో ప్రైవేటు అంబులెన్స్ల దందా కొనసాగుతోంది. రోజూ వేలాది మంది రోగులు ఇక్కడికి వైద్య సేవల కోసం వస్తుంటారు. వారిలో అధిక శాతం నిరుపేదలే. చికిత్స పొందుతూ రోగి మృతి చెందితే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు గుమికూడి దందాకు తెరలేపుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువుల నిస్సహాయ పరిస్థితులను ఆసరా చేసుకొని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్లే దిక్కు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాప్రస్థానం వంటి వాహనాలు ఉన్నప్పటికీ పల్నాడు జిల్లాకు కేటాయించకపోవటంతో పేదలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఏరియా ఆసుపత్రిని అడ్డాగా చేసుకొని అంబులెన్స్ దందా కొనసాగిస్తున్నారు. దుఃఖంలో ఉన్నా వదిలేదే లేదు.. ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతదేహాలను స్వగ్రామానికి తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు రూ.వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో అయితే రూ.3,500 నుంచి రూ.4,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర గ్రామాలకై తే పరిధిని బట్టి రూ.10,000 వరకు అడుగుతున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల నిస్సహాయతను లక్ష్యంగా చేసుకొని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఇలా డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉచిత సేవలు లేకపోవటంతో గత్యంతరం లేక అడిగిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు. సిబ్బంది పాత్రపై ఆరోపణలు ఈ వ్యవహారం వెనుక ఆసుపత్రి సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి వివరాలు, పరిస్థితి, బంధువుల వివరాల సమాచారం ముందుగానే అంబులెన్స్ నిర్వాహకులకు చేరుతోందని సమాచారం. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన సేవలకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాల్సి ఉంది. అయితే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు, వైద్యశాల సిబ్బంది సలహాల మేరకు నరసరావుపేటలోని పలు ప్రైవేటు వైద్యశాలలకు పేదలు వెళుతున్నారు. దీంతో వారిపై పెను ఆర్థికభారం పడుతోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు కూడా ఈ దందాకు అతీతం కావటం లేదు. ప్రమాదాలు, గుండెపోటు వంటి ఇతర అత్యవసర సమస్యలతో వైద్యశాలకు వచ్చిన వారి చుట్టూ ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది చేరుతున్నారు. ఇక్కడ సరైన వైద్యం అందదని భయపెడుతున్నారు. మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేటు వైద్యశాల్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంత మంది ఇప్పటికే చేరిన రోగులను సైతం ప్రైవేటు ఆసుపత్రుల వైపు మళ్లిస్తున్నారు. రోగుల భయాలను, అవసరాలను వీరు సొమ్ము చేసుకుంటున్నారు. పేషెంట్ను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లడానికి కొంత మొత్తం తీసుకుని, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినందుకు కమీషను దండుకోవటం వారికి నిత్యకృత్యంగా మారింది. క్షతగాత్రులను అర్హత లేని వైద్యశాలలకు తరలించి ప్రాణాలమీదకు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో గణపవరం యువకుడు మృతి
నాదెండ్ల: డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాద్ వెళ్ళిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో గణపవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గణపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ పురాణం బాలాజీశర్మ, శ్రీదేవి (అంగన్వాడీ టీచర్) దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు సాయిసుబ్రహ్మణ్యేశ్వర శర్మ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు పురాణం లక్ష్మీనాగేశ్వర సాయిమోహన్ (23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో సోదరుడి వద్ద ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. గ్రామానికి చెందిన యువకుడు బాలమురళీకృష్ణ వీరితో పాటూ ఉంటూ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 8న అర్ధరాత్రి సమయంలో టిఫిన్ చేసేందుకు లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్, బాలమురళీకృష్ణ ఇరువురూ కూకట్పల్లి సెంటర్కు వెళ్లి తిరిగి రూమ్కు వస్తుండగా టిప్పర్ వాహనం ఢీకొంది. దీంతో సంఘటనాస్థలంలోనే లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలమురళీకృష్ణ గాయాలపాలయ్యాడు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామమైన గణపవరం తరలించారు. ఉద్యోగాన్వేషణకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దీంతో శాంతినగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో ఘటన -
దగా డీఎస్సీగా మార్చారు
నరసరావుపేట: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పోస్టులను అమ్ముకొని దగా డీఎస్సీగా మార్చిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు మండిపడ్డారు. పార్టీ అధీష్టానం పిలుపు మేరకు సోమవారం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను ప్రవేశద్వారం వద్ద పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది అడ్డుకొని కేవలం కొంతమందినే లోపలికి పంపారు. పీజీఆర్ఎస్లో దగా డీఎస్సీపై సీబీఐచే విచారణ జరిపించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీబీఐతో విచారణ జరిపించాలి డీఎస్సీపై వచ్చిన వదంతులపై సీబీఐచే విచారణ జరిపించాలని, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ డీఎస్సీలో అవకవతకలు, అభ్యర్థులకు అన్యాయం ఖచ్చితంగా జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటాలో 431పోస్టులను న్యాయంగా భర్తీచేయకుండా తమ వారికి అమ్ముకున్నారన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీఎస్సీ–98 బ్యాచ్కు 4500 మందికి డీఎస్సీ పోస్టులు ఇవ్వటం వలన వారి కుటుంబాలు అంతా చల్లగా ఉన్నాయన్నారు. ఇప్పుడు అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగిందన్నారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలకా జైపాల్ మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షుడు కాలే మాణిక్యాలరావు, రాష్ట్ర సంయుక్త కార్య దర్శి గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా ఉపాధ్యక్షులు నెలటూరి సురేష్, నరసరావుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్, సోషల్మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, కుక్కల పౌలయ్య, రొంపిచర్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండాల వెంకటేష్ పాల్గొ న్నారు. అనంతరం కలెక్టర్ ముందు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలకు రిజర్వేషన్ సక్రమంగా అమలుచేయకుండా హారిజంటల్ రిజర్వేషన్ అనే కొత్తపేరుతో ఎస్సీలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. జీఓ నంబరు 47 అనే కొత్త ఉత్తర్వులతో రెండుశాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను మూడు శాతానికి పెంచారన్నారు. నిబంధనలకు విరుద్దంగా మెరిట్కు పాతరేసి ఒక్కో పోస్టును రూ.15లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్ముకోవటంపై ఆడియో, వీడియాలు బయటపడ్డాయన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో ఎటువంటి చలనంలేదన్నారు. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొలిపే ఉద్దేశ్యంతో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించామన్నారు. -
రెండేళ్లలో మొండిచేయి
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా కూటమి నేతలు భారీఎత్తున సంబరాలకు సిద్ధమయ్యారు. నేడు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభలకు నాంది పలుకుతున్నారు. అయితే ఇదే సమయంలో రెండేళ్ల కూటమి పాలనలో ఏం సాధించారని పల్నాడు జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి లేదని, తామొస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఊరువాడ చెప్పుకొచ్చారు. మరి రెండేళ్లలో జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా పూర్తి చేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన సూపర్–6 పథకాలైనా అమలయ్యాయా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో ఏం సాధించారని విజయోత్సవ సభలు చేపడుతున్నారంటూ పల్నాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏడు దశాబ్దాలుగా పల్నాటి ప్రజల కల వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం. గతంలో ఎంతో మంది నేతలు అనుకున్నా ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ, వన్యప్రాణ సంరక్షణ వంటి కీలక అనుమతులను కేంద్రం నుంచి తేవడంలో సఫలీకృతం కాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరికపూడిశెల ప్రాజెక్టు అనుమతులపై ప్రత్యేక దృష్టిపెట్టి కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి కీలక అడుగువేశారు. మొదటి దశ పనులను ప్రారంభించారు. అంతలో ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చంద్రబాబు మొదలు స్థానిక నేతల వరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీలిచ్చారు. అయితే రెండేళ్లైనా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ప్రజలు వాపోతున్నారు. ఇంకా అనుమతులంటూ కాలయాపన చేస్తున్నారు. మరోవైపు జలజీవన్మిషన్, వైఎస్సార్ కరువునివారణ పథకం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు వసంతాలు గడిచినా జేజేఎం పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందించలేకపోతున్నారు. నరసరావుపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు ఇంకా స్థలసేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఎప్పుడో పూర్తికావాల్సిన క్రిటికల్ కేర్ యూనిట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వినుకొండ ట్రామాకేర్ ఏర్పాటు ఎంతో అత్యవసరం దాని ఊసే ప్రస్తుత పాలకులు ఎత్తడం లేదు. సాగర్ కాలువల మరమ్మత్తులు ఇప్పటివరకు చేయలేదు. కీలకమైన జాతీయ రహదారుల పనులు ముందుకుసాగడం లేదు. ముఖ్యంగా నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి భూసేకర నేటికి పూర్తికాలేదు. మాదిపాడు బ్రిడ్జ్ పూర్తి చేయలేదు. అభివృద్ధి పనులను అటకెక్కించారు.. ఇంటికే అందుతున్న సంక్షేమానికి మంగళం పాడారు.. ఎర్రటి ఎండలో పండుటాకులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు.. రైతులు పెట్టుబడి సాయం లేక.. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.. ప్రభుత్వ బడులు మూసేశారు.. పిల్లల్ని ‘ప్రైవేటు’ బాట పట్టించారు. అంతన్నారు.. ఇంతన్నారు.. సూపర్ సిక్స్ అమలులో సూపర్ ప్లాఫ్ అయ్యారు. జిల్లాలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పనీలేదు.. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభించిన వరికపూడిశెల పనులు సైతం పూర్తిచేయలేదు.. పిడుగురాళ్ల మెడికల్ కళాశాల అభివృద్ధి ఊసే లేదు.. రెండేళ్ల కూటమి నేతలు సాధించింది.. కుట్రలు.. కుతంత్రాలు.. ప్రతిపక్ష నేతలకు వేధింపులు.. క్రూరంగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు మాత్రమేనంటూ జనం పెదవి విరుస్తున్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,200, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. 7 -
ఆగస్టులో ప్రత్యేక అదాలత్
గుంటూరు లీగల్: సమాధన్ సమరో–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగష్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ షేక్ సికిందర్ బాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ సుప్రీంకోర్టులోనే నిర్వహిస్తారని, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో పరిశీలన కోసం, అంగీకార పత్రాలను సమర్పించడానికి గడువును 2026 జూలై 31వరకు పొడిగించారని తెలిపారు. లోక్ అదాలత్ ఫారాలు, హెచ్టీటీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీఐ.జీవోవి.ఇన్ సుప్రీంకోర్టు వెబ్ సైట్లోను, జిల్లా కోర్టు వెబ్సైట్లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–2224886లలో సంప్రదించవచ్చునని తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ పీ సెట్–2026 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 499 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 333 మంది హాజరయ్యారని ఏపీ పీ సెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న ఏపీ పీ సెట్ పరీక్షలకు 2858 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2147 మంది హాజరయ్యారు. అలానే 1179 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 813 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, సెటిల్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో ఆదివారం జరిగిన మూడవ ఏపీ స్టేట్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 17 మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా పికిల్ బాల్ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్య, కార్యదర్శి జీఎస్ ప్రసాదులు అభినందించారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులో జరిగే సౌత్ జోన్ పికిల్ బాల్ పోటీల్లో మెడల్ సాధించి జిల్లాకు కీర్తి ప్రతిష్టను సాధించాలని కోరారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఏవిధంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. రోగు లు, ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి కేస్ షీట్లు పరిశీలించి, రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తనిఖీలు చేశారు. గర్భిణులు, చిన్నా రులకు వైద్యసేవలు అందుతున్న తీరును పరిశీలించారు. మార్చురీని సైతం తనిఖీ చేసి మార్చురీలో ఏసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాలు పరిశీలించారు. తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సతీష్కుమార్ ఉన్నారు. -
గంగలకుంటలో వివాహిత హత్య
వెల్దుర్తి: మండలంలోని గంగలకుంటలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లి వీరమ్మ (50) అర్థరాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వీరమ్మను సమీప బంధువులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అర్థరాత్రి వర్షం కురిసిన సమయంలో ఈ సంఘటనకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. కొడుకు కొల్లి అంజి ఫిర్యాదు మేరకు మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజుపాలెం: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై చౌటపాపాయపాలెం బస్టాప్ సమీపంలో సోమవారం జరిగింది. కొండమోడుకు చెందిన పందిటి సాయిదుర్గారెడ్డి(23) సత్తెనపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల నుంచి గుంటూరు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. మృతుడు అవివాహితుడు. ఇటీవల మృతుని తండ్రి పుల్లారెడ్డి అనారోగ్యంతో మృతిచెందడం కొద్దిరోజుల వ్యవధిలోనే కుమారుడి మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిలకలూరిపేట టౌన్ :రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతరోడ్డు ప్రాంతంలో నివాసం ఉండే వీసా సురేష్ (34) కేటగిరింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి పది సంవత్సరాల కిందట మృతిచెందడంతో తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో జాతీయ రహదారి దాటుతున్న సమయంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వెళుతున్న రూరల్ ఎస్సై చెల్లి రమేష్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సురేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని పట్టణంలోని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగై చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం జీజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని సోదరుడు సురేంద్ర ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదు. దుర్గి: మండల పరిధిలోని పోలేపల్లి జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో–లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇరువురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓబులేశునిపల్లి గ్రామానికి చెందిన బొజ్జా కోటేశ్వరరావు (40) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటోను లారీ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆటోలో ఉన్న కారంపూడి మండలం నలమాలపాడు గ్రామానికి చెందిన ఇరువురు మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రధాన రహదారిపై గోతులు పడడంతో ప్రమాదానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అతివేగంగా వస్తున్న లారీ గుంతలను తప్పించే క్రమంలో ఆటోను ఢీకొనడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా గుంతలు రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీలు త్వరితగతన పరిష్కరించేలా చర్యలు
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ అర్జీలకు మొదటి ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి వివాదాలతోపాటు మోసం తదితర సమస్యలపై 77 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భార్యాభర్తల వివాదాలపై 15, ఆర్థిక అంశాలపై 12, భూ వివాదాలపై 12, కుటుంబ వివాదాలపై 6, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఐదు ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదు పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషిచేయాలని తెలిపారు. -
కుట్రలో భాగమే మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అరెస్ట్ కుట్రపూరితంగా జరిగిందని, బ్రహ్మనాయుడు ఒక బాధితుడని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. స్థానిక సాయిబాబా కల్యాణ మండపంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి కొనుగోనులో బ్రహ్మనాయుడు పేరుపై అగ్రమెంట్ లేదు, అసలు బ్రహ్మనాయుడి ప్రమేయమే లేదు, మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తి బ్రహ్మనాయుడు అని శంకరరావు పేర్కొన్నారు. భూ వివాదాన్ని పరిష్కరించమని బ్రహ్మనాయుడే జిల్లా కలెక్టరును కోరిన బాధితుడు మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పచ్చమీడియా విష ప్రచారం చేయడం కుట్రలో భాగమేనన్నారు. అసలు మూడున్నర కోట్లు విలువచేసే భూమి రూ.1500 కోట్లు ఎలా అవుతుందో అర్థం కావడం లేదన్నారు. మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తిపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ బ్రహ్మనాయుడికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. మీడియా ఉందని ఎలాబడితే అలా రాస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. -
అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ సంజన సింహ నరసరావుపేట: అర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులకు చెందిన 183 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 61 అర్జీలు స్వీకరించగా వాటిలో నరసరావుపేట డివిజన్కు చెందినవి 19, సత్తెనపల్లి 28, గురజాల డివిజన్వి 14 ఉన్నాయి. -
జన సైనికుల వీరంగం
బిహార్ కూలీపై దాడి సాక్షి, టాస్క్ఫోర్స్ : మద్యం మత్తులో బిహారు కూలీ పై జనసైనికులు దాడికి దిగిన సంఘటన ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఆరుకు పైగా మద్యం బెల్ట్షాపులు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన పూర్ణ అనే మహిళ చిల్లర దుకాణంతో పాటు బెల్ట్షాపు నిర్వహిస్తున్నారు. జనసైనికులు శిరిగిరి రాకేష్, శిరిగిరి జయంత్లు మద్యం మత్తులో బెల్ట్షాపు దుకాణం వద్దకు వచ్చి క్వార్టర్ పై రూ.60 లు ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారంటూ నిర్వాహకురాలితో వాదనకు దిగారు. మీకు బెల్ట్ షాపు ఎవరిచ్చారంటూ నిలదీశారు. మాకు ముప్పాళ్ళ వాళ్ళు ఇచ్చారు...ఏం చేసుకుంటారో చేసుకోండంటూ నిర్వాహకురాలు అనడంతో నిర్వాహకురాలికి, జనసైనికులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దుకాణంలో సీసీ కెమెరాలో రికార్డు కావటాన్ని గమనించిన జనసైనికుల్లోని ఒకరు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని దుకాణదారురాలితో సీసీ కెమెరా తీసేయ్ అంటూ వాదనకు దిగాడు. గ్రామంలోని రామా లయం నిర్మాణ పనులకు వచ్చిన బిహార్ కు చెందిన కూలీల్లో ఒకరు పూర్ణకు చెందిన దుకాణంలో నిత్యావసర సరుకులు కోసం వెళ్లి జనసైనికులకు, దుకాణం నిర్వాహకురాలి మధ్య జరుగుతున్న వాదనను పక్కన నిలబడి చూస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న జనసైనికుల్లోని ఒకరు నిలబడి ఉన్న కూలీ వివరాలు అడుగుతూ, నీకు ఇక్కడేం పనిరా అంటూ చేయి చేసుకున్నాడు. పక్కనే ఉన్న మరొకరు తన ప్యాంట్ జేబులో ఉన్న స్టిక్ను తీసుకొని కూలీపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. పక్కనే ఉన్న వారు వారిస్తున్నా పట్టించుకోకుండా దాడి చేస్తుండటంతో కూలీ పరారయ్యాడు. అనంతరం దుకాణం పైన దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ సంఘటన అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
డీఈఓపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: మెరిట్కు అన్యాయం చేస్తున్న పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహకు ఏపీ గిరిజన సంఘం, మాల మహానాడు, పీడీఎం, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, బీసీ సంక్షేమ సంఘం, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాలు వినతిపత్రం అందజేశాయి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో (సమగ్ర శిక్ష) ఖాళీగా ఉన్న జీసీడీఓ, ఏఎల్ఎస్సీఓ పోస్టులు డిప్యూటేషన్పై భర్తీకి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్టులు మే ఒకటిన సిద్ధమైనప్పటికీ డీఇఓ నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని అభ్యర్థులకు అదనపు మార్కులు కలపాలనే దుర్బుద్ధితో మెరిట్ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా ఆపేశారన్నారు. పది రోజుల తరువాత డిఇఓ తను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలిపారన్నారు. డీఇఓ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ పారదర్శకంగా జరిగే అవకాశం లేనందున కలెక్టర్ జోక్యం చేసుకుని ఇంటర్వ్యూని పారదర్శకంగా జరిపి మెరిట్ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా మెరిట్కు అన్యాయం జరిగితే తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించారు. పీడీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అర్హులైన మెరిట్ ఉన్న ఉపాధ్యాయులకు ఈ పోస్టులు ఇవ్వాలని అలాకాని పక్షాన డీఈఓను సస్పెండ్ చేసే వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ గతంలో కూడా డీఈఓపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్, గిరిజన సంఘ ఉపాధ్యక్షులు వాంకడోత్ కోటా నాయక్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, బీసీ సంఘం నాయకులు బిళ్లగంటి శ్రీను, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కోటా సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్కు ప్రజాసంఘాల వినతి -
11న ఫుట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందికి గాయాలు నరసరావుపేట టౌన్: ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన సోమవారం పట్టణ శివారులో చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మేరీ సుశీల, రామారావు, సౌరమ్మ, సలోమి, ఆంథోనమ్మ, వేలంగిణి రాణి లతో పాటు మరో ఐదుగురు ఆటోలో రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బంధువులు చనిపోతే చూసేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. నరసరావుపేట శివారు గుంటూరు రోడ్డు ఆర్కే రెస్టారెంట్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. సంఘటనలో పై ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈఎంటీ వెంకట చెన్నయ్య, పైలెట్ సాయిరామ్లు క్షతగాత్రులను ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అర్చకులపై వేధింపుల పట్ల భక్తుల మండిపాటు
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న అర్చకస్వాములపై కూటమి ప్రభుత్వ వేధింపుల పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భక్తులు ఎంతో నమ్మకంతో స్వీకరించే కంకణధారణల నుంచి ఆలయ అర్చకులను తప్పించే కుట్రపై మండిపడుతున్నారు. ఆలయ దినదినాభివృద్ధిలో అర్చకస్వాముల కృషిని వారు గుర్తు చేస్తున్నారు. ఆలయ కమిటీ, ఈవో చర్యల పట్ల తీవ్ర నిరసన వ్యకం అవుతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు పాటించలేదనే నెపంతో ఆలయ అర్చకులపై చర్యలకు ఈవో నలబోతు మాధవిదేవి సిద్ధమవుతుంది. ఈ మేరకు సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. భక్తుల కొంగుబంగారంగా, గ్రామదేవతగా వెలిసిన ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి దేవస్థానం ఐదు దశాబ్దాల్లో జిల్లాలోని ప్రముఖ దేవస్థానంగా మారింది. కోరిన కోర్కెలు తీరుతుండటంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగసాగింది. ఆదాయం పెరగడంతో ఆలయ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ఆలయంలో 40 సంవత్సరాలుగా కొత్తలంక సుధాకరశర్మ కుటుంబ సభ్యులు అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి కుమారుడు కార్తీకేయ శర్మ అర్చకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆలయంలో కంకణధారణపై అర్చక కుటుంబంపై ఆలయ కమిటీ, ఈవో వేధింపులకు పాల్పడటం చర్చనీయంగా మారింది. వివాదాస్పదం కమిటీ చైర్మన్ తీరు ఆలయ కమిటీ చైర్మన్గా బండ్లమూరి చంద్రశేఖర్ వ్యవహార శైలి గతంలోను వివాదాస్పదంగా ఉంది. ఆలయ చైర్మన్గా ఆయన తండ్రి రామయ్య వ్యవహరిస్తున్న సమయంలో అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపై వీరు దాడులకు పాల్పడ్డారు. ఈ కేసులో ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖర్ జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ వ్యవహారానికి కారణం ఆలయ అర్చకులే అని అక్కసు పెంచుకున్న చైర్మన్ ఎలాగైనా వారిని ఆలయం నుంచి బయటకు పంపాలనే కుట్ర చేస్తూ పావులు కదుపుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో చైర్మన్గా ఎంపికై న నాటి నుంచే ఏకపక్షంగా వ్యవహరిస్తూ అర్చకులపై వేధింపులు ప్రారంభించాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు కంకణదారణను అర్చకుల నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. తహసీల్దార్ బెదిరింపులపై భక్తుల మండిపాటు కంకణధారణ వ్యవహారాన్ని వివాదాస్పదంగా మార్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ ఈవో నలబోతు మాధవిదేవి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈఓ భర్త వేణుగోపాల్ ప్రస్తుతం నరసరావుపేట తహసీల్దార్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఆలయంలో అర్చకులకు, ఈవో, కమిటీ సభ్యులకు మధ్య జరుగుతున్న వివాదంలో సంబంధం లేకపోయినా ఆయన తలదూర్చడం వివాదాస్పదంగా మారింది. ఆలయ విధుల్లో ఉన్న అర్చకస్వాములపై బెదిరింపు ధోరణిలో తహసీల్దార్ మాట్లాడటం పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మీరు ఎలా ఇక్కడ పనిచేస్తారో చూస్తా అంటూ అర్చకులపై ఆయన బెదిరింపులకు పాల్పడటం భక్తులకు విస్మయానికి గురిచేసింది. ఆలయ వ్యవహరాల్లో ఎటువంటి సంబందం లేని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడుతారని భక్తులు ప్రశ్నించారు. తహసీల్దార్ బెదిరింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు భక్తులు తెలిపారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఆదివారం ఆలయంలో చోటుచేసుకున్న ఘటనపై ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ, కెఆర్విఎస్ కార్తికేయలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు ఈవో నలబోతు మాధవిదేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. కంకణధారణలో ప్రభుత్వ ఉత్తర్వులను అర్చకుల ధిక్కరించారని పేర్కొన్నారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా దేవదాయ శాఖ కమిషనర్కు సమగ్ర నివేదిక సమర్పించినట్టు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై నకరికల్లు సమీపంలో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. నకరికల్లుకు చెందిన వాకాటి నాగరాజు(18) అతని మిత్రుడు ద్విచక్రవాహనంపై నకరికల్లు నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్నారు. వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ వాకాటి నాగరాజును వేగంగా ఢీకొంది. తీవ్రగాయాలైన నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కౌలు రైతు ఆత్మహత్య
కొల్లూరు: పంట నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరు మండలంలోని దోనేపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దోనేపూడికి చెందిన నిమ్మగడ్డ దుర్గారావు (60) మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రకృతి విపత్తుల కారణంగా ఏర్పడిన పంట నష్టానికి తోడు, పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించకపోవడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులతో సతమతమవుతూనే చేసిన అప్పులు తీర్చి, ఆర్ధికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్ధేశ్యంతో లారీ కొనుగోలు చేసి ఇసుక, ఇటుక, మెటల్ చిప్స్ రవాణా ద్వారా బ్రోకరేజ్ చేస్తూ వచ్చాడు. వ్యవసాయంలో వస్తున్న నష్టాలకు తోడు బ్రోకరేజ్లో సైతం నష్టాలు ఎదురవడంతో అప్పులు అధికమయ్యాయి. కొద్ది రోజులుగా తన భార్య వద్ద బాధను వెళ్లగక్కుతున్నాడు. ఎలాగోల కష్టపడి అప్పులు తీర్చుకుందామని భార్య సర్ధిచెప్పింది. దుర్గారావు ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి కలుపు నివారణ మందును సేవించాడు. ఇది గమనించిన భార్య స్థానికులు, బంధువుల సాయంతో వైద్యశాలకు తరలించింది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందాడు. వైద్యశాల నుంచి కొల్లూరు పోలీసులకు ఆదివారం అందిన మరణ నివేదిక మేరకు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు శవ పంచనామా నిర్వహించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అర్చకులపైనా ఆగడాలు
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆలయ అర్చకులపై కూడా అమలు చేస్తున్నారు. ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే గుడి నుంచి బయటకు వెళ్లాలని అర్చకులకు హుకుం జారీ చేస్తున్నారు. శాస్త్ర విరుద్ధంగా తాము పనిచేయలేమని చెప్పినందుకు కక్ష సాధిస్తున్నారు. వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్న కంకణధారణను రద్దు చేయించారు. ఆలయంతో సంబంధం లేని పూజారులతో ఆదివారం కంకణధారణకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రయత్నించారు. వారిని ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. దీంతో ఆలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న కంకణధారణలో రద్దీ ఎక్కువగా ఉండే ఆదివారాలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లో అర్చక కుటుంబ సభ్యులు పాల్గొంటారు. దీనిపై కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు పాల్గొనకూడదంటూ తేల్చిచెప్పారు. తమ తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని ఎలా వదలుకుంటామంటూ అర్చకులు కంకణధారణను కొనసాగిస్తున్నారు. దీనిపై కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆలయంలో కంకణధాణను రద్దు చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వీవీఎస్కే ప్రసాద్ ఈనెల 2వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. ఇరువర్గాల వాగ్వాదం ఆదివారం ఉదయం ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్లు ప్రైవేటు అర్చకులతో కంకణధారణ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజాదికాలు నిర్వహించాలని అర్చకులను కోరారు. దీనికి అర్చకస్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారికి నివేదనతో పూజాదికాలు నిర్వహించిన అనంతరమే కంకణాలను ఇస్తామని స్పష్టంచేశారు. భక్తుల నమ్మకాలతో వ్యాపారం చేయలేమని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన కంకణాలనే భక్తులకు అందిస్తామని తేల్చిచెప్పారు. కంకణాలకు పూజలు జరిపేందుకు ప్రైవేటు అర్చకుడిని గర్భగుడిలోకి పంపేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించారు. దీనిని ఆలయ అర్చకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్వ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ అర్చకులకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇస్సపాలెం ఆలయ అర్చకులకు టీడీపీ నేతల వేధింపులు తాజాగా కంకణధారణ రద్దు చేయించిన నాయకులు ప్రైవేటు అర్చకులతో నిర్వహించేందుకు కుటిల ప్రయత్నాలు అడ్డుకున్న ఆలయ అర్చకులు... ఆలయంలో ఉద్రిక్తత -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
బాపట్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 7వ తేదీ నుంచి 21 వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానిలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించారు. డీఆర్ఓ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందవచ్చన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, నోడల్ ఆఫీసర్ చంద్ర శేఖర్, డీపీఓ ప్రభాకరరావు, డీఎస్డీఓ శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ జె డి.వేణుగోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, సమాచార శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకట్రమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, బి.సి సంక్షేమ, సాధికారత అధికారిణి శివలీల పాల్గొన్నారు. బాపట్ల డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ -
ఆర్చరీలో చిచ్చర పిడుగు
● విలువిద్యలో సత్తా చాటుతున్న నరసరావుపేట బాలుడు ● చిన్న వయస్సులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ నరసరావుపేట: విలువిద్య (ఆర్చరీ) పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నరసరావుపేటకు చెందిన 13 ఏళ్ల బాలుడు మాలపాటి మారుతీ ఆరుష్రెడ్డి సత్తా చాటుతున్నాడు. గత మే నెల గోవాలో నిర్వహించిన ఒకటో ఆల్ ఇండియా ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో రెండు రజతాలు, మూడు, తొమ్మిదో ర్యాంకులు సాధించాడు. చిన్నానాటి నుంచే విజయాలు... డాక్టర్ మాలపాటి చెంచిరెడ్డి, డాక్టర్ శాంతిశ్రీలకు 2013 మే 23న జన్మించిన ఆరుష్రెడ్డి చిన్న వయస్సులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. ● మూడేళ్ల వయస్సులోనే విజయవాడ ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేరటం ద్వారా విలువిద్యలో అడుగుపెట్టాడు. దేశం, విదేశాల్లో 17 పోటీల్లో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ● 2017 ఆగస్టు 15న రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ నిర్వహించిన అండర్–9 విభాగ పోటీల్లో ప్రథమ స్థానం పొందాడు. ● 2018 మే 20న రికర్వ విభాగంలో 15 మీటర్ల దూరం నుంచి 122 సెం.మీ. లక్ష్యంపై 14 నిమిషాల 40 సెకన్లలో 118 బాణాలు సంధించి అత్యంత పిన్నవయస్కుడిగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎక్కాడు. ● అక్టోబరులో రికర్వ్ బాలుర అండర్–9 మినీ నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్లో కాంస్య పతకం, నవంబరు 2019 చైనా మకావులో నిర్వహించిన వరల్డ్ ఆర్చరీ ఇండోర్ యూత్ పోటీల్లో 12 మీటర్ల దూరంలో 40 సెం.మీ. లక్ష్యంపై జరిగిన అండర్–12 రికర్వ బాలుర విభాగంలో 17వ స్థానం పొందాడు. ● 2022 మే నెలలో ఏపీలో జరిగిన 12వ మినీ, నాలుగో కిడ్స్ అంతర్ జిల్లా రాష్ట్ర స్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రథమ స్థానం పొందాడు. ● ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో ఒలింపిక్ రౌండ్, మిక్స్డ్ టీమ్, 10 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు, 15 మీటర్లు, ర్యాంకింగ్ రౌండ్ విభాగాల్లో రజత పతకాలు సాధించాడు. ● 2024 నవంబరులో గుజరాత్లో నిర్వహించిన 68వ జాతీయ పాఠశాల క్రీడల్లో ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ● గుజరాత్లో జరిగిన 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో కాంస్య పతకం పొందాడు. ● 2025 మార్చిలో గుంటూరులో నిర్వహించిన 14వ ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణపతకం, వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్లో కాంస్య పతకం పొందాడు. మరిన్ని పతకాలే లక్ష్యం ఆరుష్రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్తులో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలనేది తన ఆశయమని చెప్పాడు. ఈ సందర్భంగా ఆరుష్ తాను సాధించిన పతకాలు, షీల్డులను ప్రదర్శించాడు. ఆదివారం స్థానిక డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి వైద్యశాలలో నిర్వహించిన సమావేశంలో ఏపీ ఆర్చరీ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి, ప్రధాన కోచ్ చెరుకూరి సత్యనారాయణ, ఆరుష్ తాత, అమ్మమ్మలు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, డాక్టర్ పమ్మి సరస్వతి తదితరులు చిన్నారిని అభినందించారు. -
నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు
నగరంపాలెం: వాహనాల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని జిల్లా ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై జిల్లా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బీవీ నారాయణ ప్రారంభించారు. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్ వరకు సాగింది. అక్కడి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ సైక్లింగ్ను ప్రోత్సహించాలని అన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ సంకురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని తెలిపారు. ర్యాలీలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, రామకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): రాష్ట్ర స్థాయి సిలంబం సబ్ జూనియర్, సీనియర్ చాంపియన్షిప్ విజేతగా గుంటూరు జిల్లా నిలిచింది. స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ ఆదివారం ప్రారంభించారు. సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ క్రిస్టఫర్ మాట్లాడుతూ పోటీల్లో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారన్నారు. ప్రథమ స్థానంలో గుంటూరు జిల్లా, ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచాయన్నారు. అనంతరం విజేతలకు అఫ్రోజ్ ఖాన్తోపాటు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇ. అశోక్బాబు, క్రిస్టఫర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోచ్లు కాశీనాథ్రెడ్డి, సీహెచ్ శ్రీరామ్, ఎం.శ్రీనివాసరావు, కె.కిరణ్, వెంకటసాయి, నాంచారయ్య, నవీన్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని తన కుటుంబ సభ్యులు నలుగురిని కిందకు దించారు. క్షణాల్లో కారు తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు అదుపుచేశారు. అరగంటపాటు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాతూరు రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
అధిక బరువు శిశువు జననం
మాచవరం: మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధిక బరువుతో శిశువు జన్మించినట్లు వైద్యాధికారి ఎస్.ప్రసాద్ తెలిపారు. మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన డి దివ్యకు 4.6 కిలోల బరువు గల ఆడ శిశువు సాధారణ కాన్పు ద్వారా జన్మించినట్లు తెలిపారు. పీహెచ్సీ సిబ్బంది చాకచక్యంగా వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు అయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరుకు చెందిన సీనియర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ కొమ్మినేని రంజిత్ కుమార్ ది ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్) బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నందు ప్రొఫెషనల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నుంచి ఉత్తర్వులు అందినట్లు రంజిత్ కుమార్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రొఫెషనల్ డైరెక్టర్గా మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. -
కొండవీడులో వెలుగులోకి శిలా శాసనం
యడ్లపాడు: చారిత్రాత్మక కొండవీడు కోటలో మరో శాసనం బయటపడినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తెలిపారు. 42 కొండల సమాహారమైన కొండలలో అతి ఎత్తైన రుద్రపాద శిఖరం సమీపంలో ఈ శాసనం బయటపడిందన్నారు. ముస్లిం రాజుల పాలన కాలంలో ఈ శిఖరాన్ని ఆదం షఫీ బోడు అని పిలిచేవారన్నారు. ఈ శిఖరంపై రెడ్డిరాజులు 14, 15 శతాబ్దాల్లో నిర్మించిన రెండు శివాలయాలు, ఆ తర్వాతి ముస్లిం రాజుల కాలంలో నిర్మించిన దర్గా ఉండటంతో హిందువులతో పాటూ ముస్లింలు కూడా వెళ్లి అక్కడ పూజలు, ప్రార్థనలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో పలు శాసనాలు బయటపడ్డాయన్నారు. తాజాగా బయటపడిన శాసనాన్ని మైసూర్లోని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం పరిశీలనకు పంపగా, ఇది దాన శాసనంగా గుర్తించారు. శాసనంలో వివరాల మేరకు, భట్లకు నాలుగు వృత్తులు, విరుపాక్ష దీక్షితులకు రెండు వృత్తులు ధారబోసినట్లు రాసి ఉంది. శ్రీ కై లాస శివాయ నమః అని రాసి ఉంది. ఈ శాసనాన్ని పర్వతం ఔభళ పంచారామలు రాసినట్లు ఉంది. కొండవీడు చరిత్ర తెలుసుకునేందుకు ఎన్నో శాసనాలు ఉన్నాయని, భవిష్యత్ తరాలకు రెడ్డి రాజుల చరిత్ర తెలుసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు. -
ఆడబిడ్డలకూ వెన్నుపోటే!
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ. 1,500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలామంది ఓటేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినప్పటికీ ఆడబిడ్డ నిధి పథకం అమలుపై నోరు మెదపడం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోగానీ, మంత్రివర్గ భేటీలోగానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ పథకం గురించి చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిసినట్లేనా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండని సీఎం చంద్రబాబు ఇస్తున్న ఉచిత సలహాలపై మహిళా లోకం భగ్గుమంటోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ. 18 వేలు ఆర్థిక సహాయం అందజేయాలి. ఈ పథకం కోసం జిల్లాలోని మహిళలందరూ ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలోని 7,80,538 మంది మహిళలకు నెలకు రూ. 117.08 కోట్లు బకాయి పడింది. రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ. 36 వేలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని వారికి ఇలా మొత్తం రూ. 2,810 కోట్లు అందజేయాల్సి ఉంది. ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతి నెలా రూ. 1500 చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళల జీవనోపాధికి పెద్దపీట వేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత వంటి ముఖ్యమైన పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి అండగా నిలిచింది. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాకే జమ చేసింది. ఇప్పటికే ఒక్కో మహిళకు రూ.36 వేల వరకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి రెండేళ్లలో జిల్లా అతివలకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,810 కోట్లు ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకు టీడీపీ సర్కార్ ఎత్తుగడలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం.. ఇంకెవరైనా అమలు చేయలేదంటే వారి నాలుక మందమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సభలో అన్నారు. తీరా చూస్తే మసిపూసి మారేడు కాయ చేసి ఇచ్చాం అన్నట్లు ఉంది ఆయన ప్రభుత్వం తీరు. కుట్రలో భాగంగా పీ4 పథకంలో ఆడబిడ్డ నిధిని చేర్చి ఇక అన్నీ ఇచ్చేశాం అన్నట్లు కవర్ చేసి చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని మరిచిపోయేలా చేసేందుకు ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కనడంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మహిళలు విమర్శిస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు రుజువైంది. ఎన్నికల ముందు ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లలను కంటే రూ. 30 వేలు, నలుగురు పిల్లలను కంటే రూ. 40 వేలు మహిళలకు ఇస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటన చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచడానికే ఆ తల్లిదండ్రులు నానా యాతన పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను మరువలేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. -
ఎదురెదురుగా రెండు బైకులు ఢీ
బొల్లాపల్లి: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బొల్లాపల్లి మండలం బండ్లమోటు – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో కొండబోయిన నాగేశ్వరరావు (45) మృతి చెందాడు. భార్య గోవిందమ్మ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సరికొండపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. రావులాపురం గ్రామానికి చెందిన గొంగటి హుస్సేన్రెడ్డి ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామం వెళుతున్నాడు. మార్గంమధ్యలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండెబోయిన నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన గోవిందమ్మను చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్ల మోటు ఎస్సై ఎస్డీ సమీర్ బాషా తెలిపారు. భర్త మృతి– భార్యకు తీవ్ర గాయాలు -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీ సొత్తును అపహరించుకుపోయిన ఘటన మంగళగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ కుమారుడు, కోడలితో కలసి నివాసముంటున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు నవీన్ ఓ ప్రభుత్వరంగ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలసి పెనుగంచి ప్రోలులోని ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కుమారుడు నవీన్ కూడా అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన వెండి వస్తువులతో పాటు, రూ.లక్ష నగదు దోచుకు వెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కుమారుడు నవీన్ ఇంటికి వచ్చి, లోపల డోర్కు వేసిన తాళాలు పగలకొట్టి ఉండడంతో గదిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉండడం గమనించాడు. మరో గదిలో గడ్డపలుగు ఉండడంతో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక గోడ దూకి వచ్చి గడ్డపలుగు సాయంతో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడినట్లు భావించి, పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదు మాయం -
రగ్బీ రాష్ట్రస్థాయి చాంపియన్లు శ్రీకాకుళం, తూర్పుగోదావరి
సత్తెనపల్లి: రగ్బీ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల జట్లు నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రగ్బీ రాష్ట్ర స్థాయి అండర్–18 బాల,బాలికల జూనియర్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానాన్ని, నెల్లూరు జిల్లా ద్వితీయ స్థానాన్ని, ప్రకాశం జిల్లా తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా, ద్వితీయ స్థానాన్ని ఆతిధ్య పల్నాడు జిల్లా, తృతీయ స్థానాన్ని గుంటూరు జిల్లా కై వసం చేసుకున్నాయి. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యుడు చదలవాడ అరవిందబాబు హాజరై విజేతలకు రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి బి.రామాంజనేయులుతో కలిసి బహుమతులు అందజేశారు. ఇండియన్ రగ్బీ క్రీడాకారిణి ఎన్ఎస్ అక్షయను సన్మా నించారు. పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.కృష్ణారెడ్డి పి.డానియల్, వివిధ జిల్లాల కోచ్లు, మేనేజర్లు, టెక్నికల్ అధికారులు, పీడీలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అక్రమమే
● బాఽధితులనే నిందితులుగా చేర్చటం అన్యాయం ● మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం చిలకలూరిపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుది అక్రమ అరెస్టు అని, బాధితుడినే నిందితుడిగా చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రెడ్బుక్ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బనాయించిన అక్రమ కేసు విషయమై ఆదివారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్కు వచ్చి ఆమె సంతకం చేశారు. బయటకు వచ్చాక మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎలాంటి వ్యక్తో పల్నాడు ప్రాంత ప్రజలందరికీ బాగా తెలుసని చెప్పారు. వినుకొండ ప్రజలకు ఎంతో మేలు చేసిన నాయకుడిగా మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ నలుగురికి సహాయం చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదని గుర్తు చేశారు. ఫేక్ జీవోలు , వాటికి సంబంధించిన అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారిలో బ్రహ్మనాయుడు అనుచరులు కూడా ఉన్నారని వివరించారు. నిజాలను బయటపెట్టిన వారిపైనే కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ అరెస్టు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు. బ్రహ్మనాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వేధింపులు జరుగుతున్నాయని వివరించారు. బొల్లా నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. -
నేడు కలెక్టరేట్లో ’ప్రజాసమస్యల పరిష్కార వేదిక’
నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టరేట్లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుని ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుందని, నోటీసులు, ఎండార్స్మెంట్లు, వాట్సాప్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటి చిరునామాకు కూడా పంపిస్తారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చునని, గతంలో ఇచ్చిన అర్జీల స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామం సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొనుగుపాడు గ్రామానికి చెందిన గద్దె కోటేశ్వరరావు(55) అడిగొప్పుల వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుండ్లపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నరసరావుపేట రూరల్: ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొనడంతో పలువురు గాయపడిన ఘటన శనివారం రాత్రి వినుకొండ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇల్లా ఉన్నాయి... విజయవాడ నుంచి ఉరవకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినుకొండ రోడ్డులో డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురికి గాయాలయ్యాయి. బస్సు ముందు భాగంతోపాటు కుడివైపున దెబ్బతింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు. యడ్లపాడు: విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన యడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మేడిద అరుణ (45) తన పశువుల పాక వద్ద విద్యుత్ మోటారు ద్వారా నీటిని పట్టుకుంటుండగా విద్యుత్షాక్కు గురైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త దావీదు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్ 5వ లైన్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్ సెంటర్ మెయిన్ రోడ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. -
నరసరావుపేట పట్టణ జనాభా 1.40 లక్షలు
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపల్ పట్టణ జనాభా దాదాపు 1.40 లక్షలుగా తేలింది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1.17 లక్షలు మాత్రమే. గత 15 ఏళ్లలో పెరిగింది కేవలం 25 వేల జనాభా మాత్రమేనని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ 15 ఏళ్లలో పట్టణ జనాభా 1.60 లక్షల వరకు ఉంటుందని ఊహించిన అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. గత నెల నుంచి చేపట్టిన జనాభా గణనలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం సోమవారం ఎనిమిదో తేదీతో ముగియనుంది. వాస్తవానికి ఈ కార్యక్రమం మే 31వ తేదీతో ముగియాలి. మరో వారం పొడిగించారు. మే 31వ తేదీతోనే దాదాపుగా పట్టణంలో ఇళ్ల గణన ముగించారు. అక్కడక్కడ తాళాలు వేసిన ఇళ్లు, ఖాళీగా ఉన్న వాటిని మరోసారి లెక్కిస్తున్నారు. పురపాలకసంఘ పరిధిలోని 38 వార్డులను 365 బ్లాకులుగా విభజించి 190 మంది సచివాలయ ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. పట్టణానికి నాలుగువైపులా ఉన్న ఇసప్పాలెం, లింగంగుంట్ల, యల్లమంద, కేసానుపల్లి, రావిపాడు గ్రామాల పరిధిలోని 4,458 గృహాలతోపాటు పట్టణంలో ఇప్పటికే ఉన్న 28 వేలకుపైగా అసెస్మెంట్లలోని గృహాలను గణించగా ఈ జనాభా లెక్క తేలింది. పురపాలక పరిధిలో భూమి రేటు పెరిగిపోవటంతో భరించలేని చాలామంది పంచాయతీల్లో కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవటం, లేదా రియల్టర్లు కట్టించిన ఇళ్లను కొనుగోలు చేసి అక్కడే ఉండటం చేస్తున్నారు. దీని వలన జనాభా సంఖ్య అనుకున్నంతగా పెరగలేదు. నేటితో ముగియనున్న ఇళ్ల గణన -
ఆర్టీసీ బస్సులో ఆగిన ప్రయాణికుడి గుండె
చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఆదివారం తెనాలి నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాపట్లలో బస్సు ఎక్కాడు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకున్నాడు. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తోంది. టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని పలు మార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. తెలుపు గళ్ల నలుపు చొక్కా, జీన్స్ నిక్కర్ ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారం కట్టుకుని ఉన్నాడు. చిల్లర డబ్బులు, ఈనో ప్యాకెట్ తప్ప మరే గుర్తింపు కార్డులు అతని వద్ద లభించలేదు. అలానే మృతుడి వద్ద రెండు టికెట్లు లభించాయి. గుంటూరు నుంచి చీరాలకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ఒకటి, బాపట్ల నుంచి చీరాలకు తీసుకున్న టికెట్ ఒకటి లభించాయి. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకోవడంతో అతడు బాపట్లకు చెందిన వ్యక్తా, చీరాలకు చెందిన వ్యక్తా అనేది తెలియడంలేదు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు కర్నూలు వాసి మృతి విషయం మీడియా మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో హల్చల్ కాగా ఆదివారం సాయంత్రం వివరాలు లభించాయి. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుడి పేరు కుమ్మరి కిరణ్ (38) కర్నూలులోని ప్రకాష్నగర్ వాసిగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురు వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు -
పల్నాడు
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.నరసరావుపేట రూరల్: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు. -
బబ్బేపల్లిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామంలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అందుకు రెవెన్యూ అధికారులు సహకరించడంతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు గత వారం రోజులుగా జోరందుకున్నాయి. గ్రామ రెవెన్యూ పరిధిలో వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రాన్ని గత ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మించారు. ఆ కేంద్రానికి చుట్టుపక్కల సుమారు 15 అడుగుల లోతులో గత వారం రోజులుగా గ్రామానికి చెందిన ఇద్దరు అధికార టీడీపీ నాయకులు అక్రమంగా గ్రావెల్ తవ్వుతూ యద్దనపూడి తదితర ప్రాంతాలకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇద్దరిలో ఓ నాయకుడు తనకు గ్రావెల్ తవ్వకాల కోసం తహసీల్దార్ మౌఖిక అనుమతులు ఇచ్చారని చెప్పుకోవడం విశేషం. నేనెవరో తెలుసా అంటూ.. విషయం తెలిసిన కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేశ్బాబు ఆదివారం మధ్యాహ్నం గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అక్కడివారిని ప్రశ్నించారు. మొదట ఇది తమ పట్టా భూమి అని అనంతరం తహసీల్దార్ అనుమతులు ఉన్నాయని దబాయించే ప్రయత్నం చేశారు. పట్టా చూపమని రమేశ్బాబు, అడగ్గా వారి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. అంతటితో ఆగక సదరు చోటా నాయకుడు నేనెవరో తెలుసా ఇప్పుడే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నా, మమ్మల్ని అడ్డుకుంటావా అంటూ ఫారెస్ట్ ఆఫీసర్ రమేష్ బాబుతో వివాదానికి దిగాడు. మరో వర్గం నాయకుల ఒత్తిడితో దాడులు అధికార పార్టీలోని ఆధిపత్య పోరులో భాగంగా వీరిద్దరిని వ్యతిరేకించే మరో వర్గం నాయకులు తహసీల్దార్, వీఆర్వో, ఏఆర్ఏలను గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాల్సిందిగా ఆదివారం ఆదేశించడం విశేషం. దీంతో తహసీల్దార్ ఆదేశాలతో ఇరువురు సిబ్బంది గ్రావెల్ తవ్వకాల వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎర్ర చెరువు భూమి అని తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ తమను అక్కడికి పంపినట్లుగా వీఆర్వో తెలిపారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఫారెస్ట్ భూమిలో తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హెచ్చరించారు. తవ్వకాల కోసం ఒక పొక్లెయిన్, సుమారు 20 కి పైగా ట్రాక్టర్లు అక్కడ సిద్ధంగా ఉండటం చూస్తుంటే దీని వెనుక రెవెన్యూ అధికారుల పాత్ర లేకుండా అంత బహిరంగంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహించే ప్రయత్నం జరగదని అర్థమవుతుంది. వారం రోజులుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపి విక్రయించిన స్థానిక టీడీపీ నాయకుడు పల్నాడు జిల్లా గణపవరంలోని ఎంఎల్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ట్రాక్టర్లకు సీరియల్ నంబర్లతో టోకెన్లు ముద్రించి అడ్డగోలుగా వ్యాపారం సాగించాడు. టీడీపీలోని వర్గపోరుతో అధికారుల దాడులు అప్పటివరకు మిన్నకుండిపోయిన యంత్రాంగం -
పల్నాడు
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026గురువులకు ‘టెట్’ టెన్షన్..!తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్ ధర రూ.2,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయం ఎదురుగా రోడ్డులో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి మృతి చెందడంతో శైవాగమ పద్ధతి ప్రకారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకస్వాముల సూచన మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి రాహుకేతుల పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు పెదకాకాని: ఏపీ పీసెట్–2026లో భాగంగా పురుష అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆరు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. నాల్గవ రోజు శనివారం 714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 557 మంది హాజరయ్యారు. ఆదివారం నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్ నెంబరు 30001 నుంచి 30680 వరకూ మొత్తం 680 మంది మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన త్రీమెన్ కమిటీ సారధ్యంలో నెల రోజుల నుంచి స్థానిక అరండల్పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. త్రీమెన్ కమిటీ సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 మంది చిన్నారులు ఈ క్యాంప్లో పాల్గొన్నారన్నారు. అనుభవజ్జులైన కోచ్ల పర్యవేక్షణలో చిన్నారులు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ టీంకు కో ఓనర్ ఓ.సాయికృష్ణ తేజ, హిందూ కళాశాల విద్యా సంస్థల సెక్రటరీ రామకృష్ణమూర్తి, త్రీమెన్ కమిటీ సభ్యులు నాగరాజు, శరత్బాబు, రామకృష్ణ పరమహంస, చిన్నారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 111 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి పి.శామ్యూల్ పర్యవేక్షణలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనాధికారి ఎన్. నిర్మల భారతి, సీహెచ్ శ్రీనివాసరావు, జె.శోభారాణి, రాజారత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.20 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,483 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సత్తెనపల్లి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులు ప్రస్తుత సర్వీస్ కొనసాగించాలన్నా .. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయసులో టెట్ రాసి ఎలా ఉత్తీర్ణత సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా? పరీక్షకు సిద్ధం కావాలా అనే సందిగ్ధంలో పడ్డారు. ఉపాధ్యాయుల భవితకు సుప్రీం తీర్పు ‘పరీక్ష’గా మారింది. దీనికి తోడు ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. లేనిపక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పదవి విరమణకు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి కూడా పదోన్నతులు రావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. మాట తప్పిన తండ్రీ, కొడుకులు... ‘ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరూ ‘టెట్’ నిబంధనలకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం. అవసరమైతే పార్లమెంట్ లో చట్టసవరణ కూడా చేస్తాం’ అని గతంలోనే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు నోరు మెదపకపోవడంతో ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తప్పనిసరి పక్షంలోనే మాకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కొందరు ఉపాధ్యాయులు సూచిస్తుంటే, మరికొందరేమో ‘20,30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం, ఈ వయసులో మాకు ఈ పరీక్షేంటి?’ అని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కష్టమైన పరీక్షే... ఎప్పుడో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ పాస్ కావాలంటే కాస్త కష్టమే. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీలు 90శాతం, బీసీలు 60 శాతం, ఎస్సీలు 50 శాతం మార్కులు సాధించాలి. అయితే టెట్ పేపర్–1 పాస్ కావాలంటే చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఆంగ్లం, పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నీ చదవాలి. పేపర్–2లో కూడా అదే పరిస్థితి. బయో సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్, ఇలా సంబంధం లేని సబ్జెక్టులు పెట్టి పాస్ కావాల్సిందే అంటే ఎలా అని ఉపాధ్యాయులు ఆగ్రహిస్తున్నారు. మాచర్ల రూరల్: చంద్రబాబు కుట్రతోనే, ఆయన కనుసన్నలతో పనిచేసే తెలంగాణ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) హెచ్చరించారు. విను కొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ శనివారం హైదరాబాద్లోని కోర్టు వద్ద పీఆర్కే మాట్లాడారు. తిరుమల, వల్లభ డెయిరీలు లాంటి ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి వేలాది మంది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మచ్చలేని నేత బ్రహ్మనాయుడని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోవటం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి చేతకాక తన పలుకుబడితో అక్రమ కేసులో ఇరికించి ఆయనను జైలుకు పంపించి శునకానందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. రాధాకృష్ణ అనే వ్యక్తి భూములను అమ్మజూపేందుకు బ్రహ్మనాయుడు బంధువు రమేష్ అనే అతనితో అగ్రిమెంటు చేయించుకొని అడ్వాన్సు మాత్రమే తీసుకున్నారని, రిజిస్ట్రేషన్ కూడా జరగకముందే రమేష్ ఇది ప్రభుత్వానికి సంబంధించిన జీఓ ఒరిజినలా, కాదా అని పరిశీలించాలని స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడని, అయితే ఫిర్యాదుదారుల పైనే అక్రమ కేసులు బనాయించి రిజిస్ట్రేషన్ జరగని భూములను కబ్జాగా పేర్కొంటూ కేసు నమోదు చేయటం దారుణమన్నారు. బ్రహ్మనాయుడుకు బంధువైన రమేష్ భూమి కొనుగోలుకు ఆర్థికంగా సహాయం చేసేందుకు డబ్బును బ్రహ్మనాయుడు సర్దుబాటు చేశాడే కానీ ఆయన పేరు మీద ఎక్కడా అగ్రిమెంట్లు జరగలేదని, ఆ నగదును పూర్తిగా వైట్ రూపంలోనే అందించిన విషయాన్ని గుర్తించకపోవటం బాధాకరమన్నారు. ఫిర్యాదు చేసిన వారినే నిందితులుగా చేయటం వెనుక చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని, అధికారులను ఎంతగా ప్రభావితం చేశాడనేది అర్ధమవుతుందని, ఈ విషయం పై న్యాయం పోరాటం చేసి, బ్రహ్మనాయుడును కడిగిన ముత్యంలా బయటకు తీసుకొస్తామన్నారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేస్తే ఆంధ్రా పోలీసులు అత్యుత్సాహంగా ఆయన కోసం ప్రత్యేక గాలింపులు జరపటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వం, అధికారులతో కుమ్మక్కై ఫిర్యాదు దారుడి పైనే కేసు నమోదు చేశారన్నారు. దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే వెలికితీస్తామన్నారు. బ్రహ్మనాయుడికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, న్యాయవాదులున్నారు. ●డీఎస్సీ పోటీ పరీక్షను ఎదుర్కొని ఉద్యోగంలో చేరి 25 నుంచి 35 సంవత్సరాల అనుభవం కలిగిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం సరైనది కాదు. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్లో విద్యాహక్కు చట్టానికి సవరణ చేయాలి. –మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిటెట్లో ఇన్సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులందరిలోనూ టెట్ పరీక్ష అలజడి రేపుతోంది. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. టెట్ అమల్లోకి రాకముందు నియమితులైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. –బంకా వాసుబాబు, పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శినరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నుంచి పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం టన్నుల కొద్దీ అక్రమంగా తరలిపోతుంది. కార్డులో సభ్యుడికి రూ.50లు చొప్పున చేతిలో పెట్టి అందినకాడికి ప్రజా పంపిణీ బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కుతున్నారు. కొంత మంది అక్రమ డీలర్ల వద్ద నుంచి రేషన్ మాఫియా బియ్యాన్ని సేకరిస్తుంది. కార్డు దారుల వద్ద నుంచి కేజీ రూ.10 చొప్పున డీలర్లు కొనుగోలు చేసి అక్రమ బియ్యం వ్యాపారులకు రూ.15కు అమ్ముతున్నారు. వీటిని దళారులు రేషన్ మాఫియాకు రూ.30కు అమ్మి జేబులు నింపుకొంటున్నారు. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల నుంచి అక్రమ రేషన్ బియ్యం టన్నుల కొద్దీ ప్రతి నెల మొదటి వారంలో తరలిపోతుంది. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన పౌరసరఫరాలు, పోలీస్, విజిలెన్స్ శాఖల అధికారులు పట్టించుకోకపోవటం ఆందోళన కలిగిస్తుంది. చెలరేగుతున్న ‘పచ్చ’ మాఫియా రేషన్ బియ్యం మాఫియా పట్టుబడకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటుంది. బ్లాక్ మార్కెట్లో కొన్న బియ్యాన్ని అక్రమార్కులు యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. వాటిని రేషన్ మాఫియా కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యలో చెక్పోస్టుల వద్ద ముట్టచెప్పాల్సిన నెలవారీ మాముళ్లు ఎప్పటికప్పుడు అందుతూనే ఉండటంతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీకు చెందిన నేతలు రేషన్ మాఫియాగా అవతారం ఎత్తి కోట్లు గడిస్తున్నారు. కొందరైతే రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తున్నారు. శనివారం పెట్లూరివారిపాలెం గ్రామం నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యం 6 క్వింటాళ్లను పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. చర్యల నిమిత్తం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పంపిణీ చేసిది రెండు రోజులే.. ప్రజా పంపిణీ బియ్యం ప్రతి నెలా 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు చౌకదుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేయాలి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరుకు వచ్చిన ఒకటి, రెండు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగిలిన సరుకు అంతా బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం కోసం వచ్చిన కార్డు దారులకు కేజీకి రూ.10 చొప్పున కొందరికి ఇస్తుండగా మరి కొందరికి ఈ నెల సరుకు రాలేదని చెప్పి డీలర్లు వెనక్కి పంపుతున్నారు. అధికారుల మౌనం.. మాఫియాకు వరం రేషన్ మాఫియా చెలరేగిపోతున్నా సంబందిత శాఖ అధికారులు స్పందించక పోవటం అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతుంది. కొంత మంది డీలర్లు ఎంఎల్ఎస్ గోదాం నుంచే నేరుగా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కార్డు దారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదు. గత కొన్ని నెలలుగా జిల్లాలో ఎక్కడా రేషన్ షాపులు, అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన దాఖలాలు ఏమి లేవు. అధికార పార్టీకు చెందిన నేతలు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహిస్తుండటంతో మిన్నకుండి పోతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్టును సవరించి తిరిగి విడుదల చేస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. పిడుగురాళ్ల జీజీహెచ్లో కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు నకిలీ అర్హత ధ్రువపత్రాలు పెట్టి ఉద్యోగాలు పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఈనెల 3వ తేదీన ‘నర్సింగ్ ఉద్యోగాల్లో నకి‘లీల’లు’ అనే శీర్షికన, ఈనెల 5న ‘చదివింది ఒకటి– సర్టిఫికెట్ మరొకటి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పలువురు అభ్యర్థులు గుంటూరు ఆర్డీ కార్యాలయం వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫైనల్ మెరిట్ లిస్టు అభ్యంతరాలు తెలిపేందుకు ఆర్డీ అధికారులు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్టులో పలు తప్పిదాలు సాక్షి వెలుగులోకి తీసుకు రావడంతో వాటిని సరిచేసి తిరిగి జాబితా ప్రచురిస్తామని ఆర్డీ డాక్టర్ శోభారాణి శనివారం వెల్లడించారు. స్టాఫ్నర్సు ఉద్యోగానికి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఇద్దరూ అర్హులేనని పేర్కొన్నారు. ఎంఎల్హెచ్సీ, సీహెచ్ఓ, యూపీహెచ్సీలో చేసిన స్టాఫ్నర్సు, ఆరోగ్య మిత్ర, 104, 108 స్టాఫ్, రెసిడెన్షియల్ కాలేజ్ స్టాఫ్కు సర్వీసు మార్కులు ఇస్తున్నామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యంతరాల సర్టిఫికెట్లు మరలా ఉన్నతాధికారులతో స్క్రూట్నీ చేసి డీఎంహెచ్ఓలు, సూపరింటెండెంట్ల నుంచి జన్యునిటీ ఆధారంగా సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని వెల్లడించారు. 9ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ పల్నాడు జిల్లాలో 1289 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 6,47,934 రేషన్ కార్డు దారులు ప్రతి నెలా 8774 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.48లు వరకు ఖర్చు చేస్తుంది. జిల్లాకు కేటాయించిన 8774 టన్నులకు రూ.42.11 కోట్లు వెచ్చిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజా ధనం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజా పంపిణీ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్లకుండా అడ్డుకట్ట వేయలేకపోతుంది. ప్రతి నెలా పల్నాడు జిల్లా నుంచి సుమారు రూ.20 కోట్ల విలువైన రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ బోధించే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6,323 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 3,995 మంది టెట్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉందని విద్యాశాఖ గతంలో గుర్తించింది. అంటే మొత్తం ఉపాధ్యాయుల్లో వీరు 63.18 శాతం మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సి ఉంది. లేని పక్షంలో పదోన్నతులు కోల్పోవడంతో పాటు చివరికి ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, సర్వీసు రికార్డులతో పాటు వారు టెట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు?..ఎన్ని మార్కులు సాధించారు?.. ఈ అంశాలన్నీ సీనియార్టీ జాబితా ప్రత్యేక కాలంలో పొందు పరచాలని విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. టెట్ పాసైన వారి పేర్లు మాత్రమే స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్–2 హెచ్ఎం పదోన్నతుల జాబితాలో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.


