breaking news
Palnadu District News
-
దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: దీపావళి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. బాణసంచా కాల్చే సమయంలో అందరూ ముఖ్యంగా చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణానికి హాని లేకుండా కాలుష్య రహిత టపాసులు పేల్చాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పండగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, ఉద్యోగులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పీజీఆర్ఎస్ రద్దు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్)ను దీపావళి సందర్భంగా రద్దు చేసినట్లు కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ.. నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ను దీపావళి సందర్భంగా ఈ నెల 20వ తేదీ సోమవారం రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. పులిచింతల ప్రాజెక్టు సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 35,723 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,443 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలుగా ఉంది. -
కార్తిక పూజలకు శివాలయం ముస్తాబు
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారి, ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్తికమాస ఏర్పాట్లపై డీసీ మాట్లాడుతూ కార్తిక మాసం సందర్భంగా ఈనెల 22 నుంచి నవంబరు 20 వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం నెలరోజులపాటు ఉదయం మహాన్యాస పూర్వక రుద్ర జప, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు అష్టోత్తర పూజ జరుగుతుందన్నారు. నెల రోజులపాటు నిత్య పరోక్ష అభిషేక పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రూ.వెయ్యి చెల్లించి ఈ పథకంలో పాల్గొనే భక్తులకు కార్తికమాసం అనంతరం స్వామివారి ప్రసాదం వారి చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. ఈ పథకంలో చేరిన భక్తులను కార్తిక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు మినహా ఇతర రోజుల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిమిత్తం పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. కార్తిక మాసం పర్వదినమైన పౌర్ణమి రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్తిక పర్వదినాలలో ప్రత్యేక పూల అలంకారం, విద్యుత్ కాంతులతో ఆలయాన్ని అలంకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
టెయిల్ పాండ్ ప్రాజెక్టు మూడు క్రస్ట్గేట్లు ఎత్తివేత
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ మూడు క్రస్ట్గేట్లు, రెండు యూనిట్ల ద్వారా 29,803 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 3 క్రస్ట్గేట్లు 1.5 మీటర్లు ఎత్తు ఎత్తి 21,258 క్యూసెక్కులు, రెండు యూనిట్లు ద్వారా 8,545 క్యూసెక్కులు మొత్తం 29,803 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు నీరు చేరుకుందని రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలకు గాను 7.080 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 55.68 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఎగువ నున్న నాగార్జునసాగర్ నుంచి 34,185 క్యూసెక్కుల నీరు వస్తుందని పై నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.పులిచింతలకు 29,803 క్యూసెక్కులు విడుదల -
హరిత దీపావళి.. ఆనంద హేళి
యడ్లపాడు: దీపావళి అంటేనే ప్రమిద దివ్వెలు..బాణసంచా వెలుగులు. పండుగలన్నింటిలో దీపావళి సందడి వేరు. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండుగగా..విజయానికీ ప్రతీకగా దీపావళిని ఏటా ఆశ్వీయుజ మాసంలో ఆమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ అంటే అన్ని కష్టాలు మరచి కుటుంబమంతా సంతోషంగా గడిపే సందర్భం. అయితే మితిమీరిన ఉత్సాహంతో మన ఆనందాన్ని తీవ్ర ఆవేదనగా మార్చకూడదు. ఈ పండుగను మరో ఏడాదిపాటు మరవలేని తీపి గుర్తుగా నిర్వహించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల స్ఫూర్తితో నేడు దీపావళి పండుగను ఆనందంగా, ఆహ్లాదంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ● దీపావళి పండుగ సందర్భంగా జరిగే ప్రమాదాలు, కాలుష్యంపై పర్యావరణ నిపుణులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు హరిత దీపావళిని నిర్వహించుకోవాలంటూ ఆదేశించింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా బాణసంచా నిషేధించాలని ఈ ఏడాది సుప్రీంకోర్టు సీజే బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. టపాసులు కాల్చడానికి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, రోజులో ఏవైనా రెండు గంటల పాటు టపాసులు కాల్చుకునేందుకు సడలింపు ఇచ్చింది. టపాసులు ఇళ్ల లోపల కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు మూలల్లో నిలిచిపోయి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ● ఈ నిబంధనల నేపథ్యంలో పర్యావరణ హితమైన ‘గ్రీన్ టపాసులు’ (తక్కువ పొగ, తక్కువ శబ్దం) మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. శబ్దాలు చేసే టపాసుల స్థానంలో ఫ్లవర్ పార్ట్స్, పెన్సిల్స్, భూ చక్రాలు, స్పార్కులర్లు, కాకరొత్తులు, చిచ్చుబుడ్లు వంటి సురక్షితమైనవి మాత్రమే కాల్చుకోవడం మంచిది. మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుద్ధీపాలు వెలిగించడం శుభప్రదం. ముఖ్యంగా నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆక్సిజన్ కూడా అధికంగా వెలువడుతుందని పెద్దలు చెబుతున్నారు. ● టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని, కళ్లకు రక్షణగా కళ్లజోడు, పాదాలకు బూట్లు తప్పనిసరిగా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సగం కాలిన టపాసులను మరోసారి కాల్చాలని ప్రయత్నించి దగ్గరకు వెళ్లవద్దని, అవి ఆకస్మాత్తుగా పేలే ప్రమాదం ఉందని అగ్నిమాపక అధికారులు హెచ్చరిస్తున్నారు. వాటిని వదిలేయడమే ఉత్తమం. పండుగ సరదా శాపంగా మారకుండా ఉండాలంటే, కాలుష్యంతో పాటు ప్రమాదాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. టపాసుల తయారీలో వాడే విషపూరిత రసాయనాలు, లోహాలు గాలి, శబ్ద కాలుష్యాన్ని పెంచుతాయి. అందువల్ల పూర్తిగా విషపూరితమైన వాటిని కాల్చి మన ప్రమాదాన్ని మనమే సృష్టించుకున్నట్లు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఈ దీపావళిని ఆనందంగా, ఆరోగ్యంగా, పర్యావరణహితంగా జరుపుకోవాల్సిన బాధ్యత ఉంది. -
బలం లేకున్నా బరితెగింపు
ఎంపీపీ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంపీటీసీ సభ్యులను బెదిరిస్తున్నారు. కాంట్రాక్టులు ఆశ చూపుతూ, రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఒక్కొక్కరికి ఇస్తామని ప్రలోభాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే ఇరువురు ఎంపీటీసీ సభ్యులకు చెందిన వ్యాపారాలపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసులనూ తొలగిస్తామని చెబుతున్నారు.ముప్పాళ్ళ: ఎంపీపీ పదవిపై అవిశ్వాస తీర్మానం కోరేందుకు కనీసం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉంది. మండలంలో 12 మందికిగాను 11 మంది వైఎస్సార్సీపీ వారే ఉన్నారు. ఒక్క స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. నామమాత్రంగా కూడా టీడీపీ బరిలో నిలిచింది లేదు. అలాంటి సమయంలో ఆరుగురు సభ్యులకు కండువా కప్పి టీడీపీ సభ్యులుగా చెప్పుకొంటున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఎనిమిది మంది సభ్యులు అవసరమైతే, అందులో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ బాధితులే బహిరంగంగా ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేలా అధికారులు నోటీసులు అందించారు. ఎనిమిది మంది సభ్యులు సమావేశం రోజున ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అప్పుడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం అంగీకరిస్తూ సమావేశాన్ని ముగిస్తారు. కండువా మార్చిన ఎంపీటీసీ సభ్యులలో ఒకరిని ఎన్నుకుంటారు. అయితే కండువా మార్చిన వారిలో ఒకరు తనకు ఎంపీపీ పదవి ఇస్తేనే మద్దతు తెలుపుతానని చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ అభ్యర్థికి సీనియర్ నాయకుల అండ ఉందని సమాచారం. ఈ వివాదం నియోజకవర్గ నేత వద్దకు వెళ్లగా అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పినట్లు తెలిసింది. జనసేన అభ్యర్థి కూడా ఎంపీపీ పదవి కోరగా, టీడీపీ నాయకుడు తిరస్కరించినట్లు సమాచారం. -
రెడ్లసత్రానికి రూ.5 లక్షల విరాళం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ శ్రీ యోగి వేమారెడ్డి రెడ్ల సత్రంలో లిఫ్ట్ ఏర్పాటుకు పట్టణానికి చెందిన వెన్నపూస జోసెఫ్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు. సత్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో విరాళం మొత్తాన్ని దాత జోసెఫ్రెడ్డి సత్రం కమిటీ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు పాపిరెడ్డి, ఉపాధ్యక్షడు నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీలు బ్రహ్మరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాంచీస్టేషన్ను సందర్శించిన డివిజనల్ మేనేజరు విజయపురిసౌత్: పర్యాటక శాఖ విజయవాడ డివిజనల్ మేనేజర్ చైతన్య ఆదివారం విజయపురిసౌత్లోని లాంచీ స్టేషన్ను సందర్శించారు. ముందుగా లాంచీలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ లాంచీల్లో సందర్శకుల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో హరిత రిసార్ట్ మేనేజర్ మస్తాన్బాబు, ఎత్తిపోతల మేనేజర్ యల్లాల బ్రహ్మం, వినయతుల్లా, దత్తు, పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 588.40 అడుగులకు చేరింది. ఇది 307.2834 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,302, ఎడమ కాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,292, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 53,412 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 53,412 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మహాదేవిగా పూజలందుకున్న బగళాముఖి చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో బగళాముఖి అమ్మ వారు ఆదివారం మహాదేవి అలంకరణలో పూజలందుకున్నారు. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న బగళాముఖి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూలు, పండ్లు సమర్పించారు. పూజలు చేశారు. సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 81వ అమావాస్య హోమం, విశేష పూజలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి తెలిపారు. పశ్చిమ డెల్డాకు 4,513 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 4,513 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్కి 216 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,526 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 327, పశ్చిమ కాలువకు 118, నిజాంపట్నం కాలువకు 281, కొమ్మూరు కాలువకు 2,800 క్యూసెక్కులు బ్యారేజి నుంచి విడుదల చేశారు. సముద్రంలోనికి 43,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
అ‘పూర్వం’.. ఆత్మీయం!
విజయపురిసౌత్: సుమారు 44 ఏళ్ల క్రితం వారంతా కలిసి చదువుకున్నారు. చదువులమ్మ ఒడిలో ఆడిపాడారు. ఆ తరువాత విడిపోయారు. సుదీర్ఘ జీవన ప్రయాణంలో విభిన్నదారుల్లో సాగి వివిధ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించారు. జీవితం యాంత్రికమైపోయింది. మనసులో ఏదో తెలియని వెలితి అందరిని పట్టి పీడించింది. మూలమేదో గుర్తించారు. ఒక్కసారి చిన్ననాటి స్నేహితులను కలుసుకోగలిగితే చాలు అనుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 25 మంది చిరునామాలను సేకరించారు. వివరాల్లోకి వెళితే.. విజయపురి సౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1980–81 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సికింద్రాబాద్ పార్క్ హోటల్లో కలుసుకొని ఒకే వేదికపై చేరుకున్నారు. ఒక్కసారిగా అందరిలో ఉద్వేగం... అపురూపమైన ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పరస్పర పలకరింపులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫోన్ నెంబర్లు, చిరునామాలు సేకరించుకున్నారు. తమ ఉన్నతికి దోహదపడిన ఆనాటి గురువులను గుర్తు చేసుకున్నారు. అపురూపమైన జ్ఞాపకాలను తమ స్నేహబంధానికి గుర్తుగా గ్రూఫ్ ఫొటోలు దిగారు. తమ తోటి విద్యార్థులు కలిసేందుకు అందరి చిరునామాలు సేకరించి ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆర్గనైజర్, ఎంపీడీఓ బి.నాగరాజును పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన పూర్వ విద్యార్థులు పైడి నాయుడు, ఎస్వీ రమేష్, శ్రీనివాసరెడ్డి, ఐజక్, రంగారెడ్డి, జంగయ్య, ఆయేషాను సత్కరించారు. పూర్వ విద్యార్థులు సౌత్సెంట్రల్ రైల్వే డీసీఎం కె.కమలాకర్బాబు, నల్గొండ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసరావు, మిర్యాలగూడ కేరలి విద్యాసంస్థల అధినేత షేక్ అహమ్మద్, బెంగళూరు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ అబ్ధుల్ రజాక్, ఉపాధ్యాయుడు యు.వెంకటేశ్వరావు, మాలతి, సరళ, లిల్లి, మాస్క్ కుర్మానీ, కనకవల్లి తదితరులు పాల్గొన్నారు. 44 ఏళ్ల తరువాత కలుసుకున్న విజయపురి సౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1980–81 బ్యాచ్ టెన్త్ విద్యార్థులు -
ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
పిడుగురాళ్ల: సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని కళ్లం టౌన్షిప్లో ఉన్న స్కాలర్స్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ పురుషుల సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు. ఎంపికకు జిల్లా నుంచి సుమారుగా 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా ఎంతో మంది అత్యుత్తమ స్థానంలో ఉన్నారన్నారు. గుంటూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.సామంత్రెడ్డి, కోశాధికారి ఆవుల జనార్దన్ నేతృత్వంలో ఎంపిక నిర్వహించారు. కార్యక్రమంలో స్కాలర్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు జి.శ్రీనివాస్రెడ్డి, మూలగొండ్ల జగదీష్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుమారస్వామి, కొత్త సత్యం, లయన్స్ క్లబ్ సభ్యులు గుండా నారాయణ, కొత్త కాశీవిశ్వనాఽథం, డీవీ స్వామి, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్బాల్ జిల్లా జట్టు.. పి.బాలకృష్ణ, బి.రాంబాబు, జె.టైసన్బాబు, బి.అనిల్కుమార్, ఎం.ప్రేమ్కుమార్, వై.గోపి, సాగర్బాబు, హేమంతు, సల్మాన్, శివకోటేశ్వరరావు, నరేంద్ర, యశ్వంత్, జానారెడ్డి, జేమ్స్, అభినవ్, ఎం.మెరిసి, ప్రభాకర్, స్టాండ్బైలుగా గౌతమ్, శ్రీహర్ష, సంజీవ్బాబు, కార్తీక్, పవన్, కిరణ్నాయక్లు ఎంపికయ్యారు. -
లోక రక్షకుడిని స్మరించుకోవాలి
రెంటచింతల: ఏసుక్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలలో లోకరక్షకుడైన ఏసయ్యను క్రైస్తవులందరూ స్మరించుకోవాలని గుంటూరు మేత్రాసన పీఠాధిపతి మహాఘన డా. చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. ఆదివారం కానుకమాత కళావేదిక వద్ద విచారణ గురువులు రెవ. ఫాదర్ వైఎల్ మర్రెడ్డి ఆధ్వర్యంలో క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకల సమష్టి పవిత్ర పూజాబలి సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వస్థత, ఆరాధన, విశ్వాసం పేరిట ఇవి కొనసాగుతున్నాయని వివరించారు. క్రైస్తవుల కోసం ప్రతి ఒక్కరూ తమ పాత్రను గుర్తించి ప్రార్థించాలన్నారు. పల్నాడు పరిధిలోని ఫాదర్లు, కన్యలు, క్రైస్తవ విశ్వాసులు ఈ వేడుకలలో పాలుపంచుకోవడం అభినందనీయం అన్నారు. ముందుగా అమ్మ జపమాల ప్రార్థన, జాతీయ పతాకం, రోమ్ నగరం పతాకం, జూబ్లీ వేడుకల పతాకాలను ఆవిష్కరించారు. తర్వాత దివ్య ప్రసాద ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వేల మంది భక్తులకు మహా అన్నదానం చేపట్టారు. కానుకమాత చర్చి సహాయ గురువులు రెవ. ఫాదర్ ప్రసన్న కుమార్, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. మేత్రాసన పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య -
హేతువాద సాహిత్య పితామహుడు త్రిపురనేని
లక్ష్మీపురం: తెలుగునాట హేతువాద సాహిత్యానికి పునాదులు వేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామిచౌదరి అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీ నరసయ్య అన్నారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరి పురస్కార ప్రదాన సభకు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ రామస్వామి సాహిత్యానికి వారసుడు కోయి కోటేశ్వరరావుకు, రామస్వామి సామాజిక సంస్కరణ ఉద్యమానికి వారసుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు రామస్వామి పురస్కారాలు ఇవ్వడం సముచితమని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతూ వందేళ్ల క్రితం సమాజంలో ఉన్న అసమానతల మీద తిరుగుబాటు సాహిత్యం రచించిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి అని అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తెలుగునాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది రామస్వామి అని అన్నారు. అనంతరం కోయి కోటేశ్వరరావు, ఆలా వెంకటేశ్వర్లులకు త్రిపురనేని రామస్వామి పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. సభలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, డాక్టర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరరీ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్, డాక్టర్ మూకిరి సుధ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య -
పల్నాడు
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఒక్కో దుకాణానికి భారీగా వసూలు... సత్తెనపల్లి: దీపావళి అంటే గుర్తుకు వచ్చేది టపాసులు. కానీ టపాసుల ధరలు తారాజువ్వల్లా ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని అంటుకోక ముందే ధరలు పేలుతున్నాయి. దీంతో సామాన్యులకు పెనుభారంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా ఈ దీపావళికి టపాసుల ధరలు పెరగడానికి కూటమి నేతలే కారణమని ప్రజలు మండిపడుతున్నారు. పర్వదినాన్ని వారు కాసుల వసూళ్ల పండుగ గా మార్చేశారు. టపాసుల దుకాణాలకు నిబంధనలను పక్కాగా పాటించినా తమ చేతులు తడపకుంటే అనుమతులు జారీ చేసేది లేదని కూటమి నేతలు తెగేసి చెబుతున్నారు. దీపావళి సందర్భంగా జిల్లాలో తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు చేతివాటం ప్రదర్శించారు. నేతల తీరు ఇలా ఉంటే దుకాణాల యజమానులు మాత్రం అడిగినంత ఇచ్చి అందినకాడికి దోచుకుందామనే యోచనలో పడ్డారు. జిల్లాలో దీపావళికి తాత్కాలిక ప్రాతిపదికన బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారు. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, జీఎస్టీ విభాగాలు సమన్వయంతో తాత్కాలిక లైసెన్స్ మంజూరు చేయడం ఆనవాయితీ. ఇందుకుగాను వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవడం.. ఆపై అనుమతులు ఇవ్వడం ఏటా సాధారణం. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు అక్రమాలకు తెరతీశారు. సందట్లో సడేమియా అన్నట్లు రూ. లక్షలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు తెగబడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి... బాణసంచా విక్రయాల కోసం పలు విభాగాల అధికారులతో కూడిన కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఇక్కడే అసలు చేతివాటం మొదలవుతోంది. తాత్కాలిక విక్రయిదారులకు డీలర్షిప్ ఉండదు. దీంతో వారికి అడ్వాన్స్ లైసెన్సులు జారీ చేస్తారు. దీని ప్రకారం వారు విక్రయించబోయే సరుకు విలువపై 18 శాతం జీఎస్టీని ముందుగానే చెల్లించాలి. రూ. లక్ష విలువైన సరుకు విక్రయిస్తే రూ. 18 వేలు పన్నుగా చెల్లించాలి. వ్యాపారం ముగిశాక అమ్మిన సరుకు విలువ అంచనా కన్నా ఎక్కువైతే మిగిలిన పన్ను చెల్లించాలి. తక్కువ అయితే అదనంగా కట్టిన డబ్బును అధికారులు తిరిగి వెనక్కు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం కొందరు వాణిజ్య పన్నుల విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. వ్యాపారులతో కుమ్మకై ఎంతసరకై నా అమ్ముకో.. ప్రభుత్వానికి కొద్దిగా పన్ను కట్టి, తమకు కొంత సమర్పిస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సర్కిళ్ల వారీగా వసూళ్లకు సిబ్బందిని నియమించి, వచ్చిన మొత్తాన్ని ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పంచుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. లైసెన్స్ల పేరుతో అడ్డగోలుగా దండుకున్న కూటమి నేతలు కూటమి నేతల దెబ్బకు పండగకు ముందే ‘వసూళ్ల’ మోత మోగిపోతోంది. తాత్కాలిక దుకాణాల అనుమతుల పేరుతో వ్యాపారుల నుంచి వారు వసూళ్లకు తెరలేపారు. అధికారులకు ఇవ్వాలంటూ అందినకాడికి దండుకున్నారు. నిబంధనల పేరుతో వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఫలితంగా వారికి భారీగా ఇవ్వాల్సి వచ్చింది. ఆ లోటు పూడ్చుకునేందుకు వ్యాపారులు సిండికేట్గా మారిపోయారు. టపాసుల ధరలు అమాంతం పెంచి ప్రజల నెత్తి మీద రుద్దేశారు. కూటమి నేతలకు మామూలు ముట్టజెప్పడంతో అధికారులు కూడా నిద్ర నటిస్తున్నారు. టపాసుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచి అమ్మినా అడిగే వారే కనిపించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. నిల్వలపై చర్యలేవి? జిల్లాలో 39 శాశ్వత బాణసంచా కేంద్రాలు, 122 తాత్కాలిక కేంద్రాలు ఉన్నాయి. ఈ విక్రయ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. కూటమి నేతలు, అధికారులు అందిన కాడికి మామూళ్లు దండుకొని దుకాణాల్లో భారీగా నిల్వలు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో బాణసంచా నిల్వలను వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నా మిన్నకుండిపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పరిమితికి మించి నిల్వలు చేసినప్పటికీ హడావుడి చేయడం ... అనంతరం మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. బాణసంచా తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే సదరు వ్యాపారి ప్రభుత్వం నిబంధనల మేరకు లైసెన్స్ నిమిత్తం అగ్నిమాపక శాఖకు రూ. 500 చలానా, రెవెన్యూ శాఖకు రూ. 500 చలానా, జీఎస్టీ విభాగానికి రూ. 5 వేల మేరకు అడ్వాన్సు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఓ దుకాణానికి రూ. 6 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ కూటమి నేతలు ఇక్కడ అంతకు మించి దండుకుంటున్నారు. తాత్కాలిక దుకాణాల లైసెన్స్ మంజూరులో అంతులేని అక్రమాలు జరుగుతున్నాయి. కూటమి నేతలు అడ్డగోలు వ్యవహారానికి తెరతీశారు. ఒక్కో దుకాణానికి రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు దండుకున్నట్లు సమాచారం. జిల్లాలో 122 తాత్కాలిక దుకాణాలకు ఇప్పటికే అధికారులు అనుమతులు ఇచ్చారు. ఒక్కో షాపు నుంచి రూ. 25 వేల చొప్పున లెక్క కట్టినా రూ. 30.50 లక్షలు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో దుకాణానికి రూ. 6 వేల చొప్పున కలిపి మొత్తం రూ.7.32 లక్షల ప్రభుత్వానికి వెళ్లగా .. మిగిలిన సుమారు రూ. 23 లక్షలు కూటమి నేతల జేబులోకి చేరినట్లు ఆరోపణలున్నాయి. మధ్యవర్తుల ద్వారానే లైసెన్సు జారీ అయినట్లు సమాచారం. దీంతో వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు అమాంతంగా పెంచేసి విక్రయిస్తున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రెండు సవర్ల బంగారు ఆభరణాలు మాయం! యడ్లపాడు: మండలంలోని కోట గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంటి యజమాని ఊరు వెళ్లిన సమయంలో దుండగులు చొరబడి సుమారు బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట గ్రామానికి చెందిన షేక్ ఖైరున్నీసా ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం నరసరావుపేటలోని తన కోడలి ఇంటికి వెళ్లింది. రెండురోజుల తర్వాత 18వ తేదీ సాయంత్రం కోట గ్రామానికి తిరిగి రాగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించింది. 12 గ్రాముల బంగారు గొలుసు, 4 గ్రాముల చెవిదుద్దులు, వెండిపట్టీలు, ఇత్తడి సామగ్రి అపహరణకు గురైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేశారు. వెంటనే క్లూస్ టీమ్తో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం 15 మందికి గాయాలు గురజాల: పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 15 మందిని గాయపర్చింది. నగర పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం రోడ్డులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పిచ్చి కుక్క కనిపించిన వారిని కనిపించినట్లు కరుస్తూ వెళ్తుంది. కుక్క దాడిలో 15 మందికి గాయాలు కాగా గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రంకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. నగర పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి కుక్కలను పట్టించి అడవిలో వదిలి వేయాలని కోరుతున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనాథ యాచకుడి అంత్యక్రియలు మాదల(ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామం వద్ద మృతి చెందిన యాచకుడికి పంచాయతీ, పోలీసు సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆలేటి యాదగిరి(46) అనే దివ్యాంగుడు సుమారు 25 సంవత్సరాల క్రితం మాదల గ్రామానికి వచ్చి దేవుడు గుడి, సమీపంలోని పాఠశాలల వద్ద ఉంటూ వారిచ్చే ఆహారం తింటూ జీవనం సాగిస్తుండేవాడు. యాదగిరికి రెండు చేతులు సరిగ్గా ఉండవు. దివ్యాంగుడు కావటంతో స్థానికులు కూడా ఆహారం అందించేవారు. ఈక్రమంలో ఆదివారం సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సత్రం గోడ వద్ద యాదగిరి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు జవంగుల సాంబశివరావు సత్రం లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి యాదగిరి మృతి చెందటంతో సమాచారాన్ని పోలీసులకు అందించారు. పంచాయతీ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో యాదగిరికి అంత్యక్రియలు నిర్వహించారు. చీరాల: తెలుగు సినిమా చరిత్రలో ‘ఘంటసాల ది గ్రేట్’ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ సినిమా డైరెక్టర్ సీహెచ్. రామారావు అన్నారు. చీరాలలోని మోహన్ థియేటర్లో ఆదివారం ప్రదర్శించిన ప్రివ్యూ షో సంగీత అభిమానులను ఆకట్టుకుంది. చీరాలలో డైరెక్టర్ సీహెచ్. రామారావు అభిమానులతో కలిసి సినిమా తిలకించారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒక గాయకుడిపై తీసిన అరుదైన సినిమా‘ ఘంటసాల ది గ్రేట్ ’ అని పేర్కొన్నారు. ఒక తరం సంగీతానికి ప్రాణం పోసిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 12న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోట వెంకటేశ్వరరెడ్డి, గాదె వెంకటరెడ్డి, గాదె హరిహరరావు, పాలెపు కనక మోహనరావు, రాజ్ వినయ్కుమార్, నాగవీరభద్రాచారి, ఏకాంబరేశ్వరబాబు, వీరనారాయణ, హరిహరరావు, రామారావు, రాజ్యలక్ష్మి, సునీత, రంగారావు పాల్గొన్నారు. -
రూ.పది లక్షలిస్తే దుకాణం పదిలం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: కొల్లి శారద మార్కెట్ పాత లీజుదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. మార్కెట్లో 25 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకుంటున్న తమను లీజు గడువు పూర్తయిందంటూ హడావుడి చేసి బయటకు పంపారని కొల్లి శారద హోల్సేల్ కూరగాయాల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు ఇస్తే రెన్యూవల్? ఈ మార్కెట్లో 81 షాపులు ఉన్నాయి. ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున రూ.8.10 కోట్లు ఇస్తే రెన్యూవల్ చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు మధ్యవర్తుల ద్వారా చెప్పారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. అంత స్థోమత లేక అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక్కడికి కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క తాము రైతులను కొల్లి శారద మార్కెట్కు వెళ్లనివ్వడం లేదనడం సమంజసం కాదని వ్యాపారస్తులు వాపోతున్నారు. తాము ఆపితే వారు ఎలా ఆగుతారని.. ఇష్టపూర్వకంగా వస్తున్నారని వ్యాపారాలు చెబుతున్నారు. లీజుకు ముందు చెప్పలేదు.. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న పీవీకే నాయుడు మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న వారిని నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 1999లో అప్పటి నగర కమిషనర్ కృష్ణబాబు అక్కడి నుంచి పంపించేశారు. వారిని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ కొల్లి శారద మార్కెట్కు తరలించారు. మార్కెట్కు వెళ్లే ముందు లీజు గడువు విషయం తమకు చెప్పకపోవడంతో 25 సంవత్సరాలుగా కార్పొరేషన్కు అద్దెలు చెల్లిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో 2013లో జీఓ వచ్చిందని నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా షాపులను ఖాళీ చేయాలని, బహిరంగ వేలం పెట్టాలని చెప్పారు. మరో పక్క ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఇబ్బందులను తట్టుకోలేక బుడంపాడు బైపాస్ వద్ద 4 ఎకరాల స్థలం కొనుగోలు చేశామన్నారు. అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులను కోరినా కుదరదన్నారని చెప్పారు. కనీస వసతులు కూడా కల్పించలేమని తెలిపినట్లు పేర్కొన్నారు. లీజు గడువు పూర్తయిందని హడావుడిగా వేలం పాట పెట్టేశారన్నారు. ఒక్కో షాపు రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షల వరకు పలికిందని చెప్పారు అంత పెట్టి వ్యాపారం చేయలేమని బుడంపాడు బైపాస్ వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లోకి వెళ్లామన్నారు. వ్యాపారం చేయడానికి వీల్లేదని అధికారులు ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు. రూ.లక్షలు కట్టి తాము కొల్లి శారద మార్కెట్లో వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేవని వ్యాపారులు తెలిపారు. తాము ప్రైవేట్ స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో మార్కెట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇంత వరకు స్పందన లేదని చెప్పారు. అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం చేసుకోనివ్వడం లేదని వాపోయారు. -
పులిచింతల ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్గా సూరజ్ గనోరే
జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నరసరావుపేట: జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు కేఎల్ రావుసాగర్ (పులిచింతల ప్రాజెక్ట్) ప్రత్యేక కలెక్టర్గా పూర్తి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ జారీ చేసింది. శివాలయంలో కార్తికమాస ఏర్పాట్లపై సమీక్ష పెదకాకాని: కార్తిక మాసం సందర్భంగా పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కార్తికమాస ఏర్పాట్లపై అర్చక స్వాములు, సిబ్బందితో శనివారం సమీక్ష నిర్వహించారు. భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రెంటచింతల: క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు స్థానిక కానుకమాత చర్చి విచారణ గరువులు రెవ. ఫాదర్ వైఎల్ మర్రెడ్డి అన్నారు. శనివారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కానుకమాత కళావేదిక వద్ద క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకల సందర్భంగా సమిష్టి పవిత్ర పూజాబలికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు మహాఘన డా.చిన్నాబత్తిని భాగ్యయ్య నేతృత్వంలో సమిష్టి పవిత్ర పూజాబలి సమర్పించడం జరుగుతుందన్నారు. పల్నాడు డీనరి పరిధిలో ఉన్న 14 విచారణలకు సంబంధించిన ఫాదర్లు, కన్య సీ్త్రలు, భక్తులు పాల్గొంటారన్నారు. గుంటూరుమెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి 420 హిస్టాలజీ స్లైడ్లు అందజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి స్లైడ్లను మణిపాల్ వైద్య విశ్వవిద్యాలయం నుంచి తెప్పించి, అనాటమీ విభాగానికి అందజేశారు. అనాటమీ విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఈ హిస్టాలజీ స్లైడ్లు ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు, అనాటమీ పీజీ వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాక్టికల్ స్థాయిలో శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకునేలా సదుపాయాలు మెరుగుపరచడం మా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులు డాక్టర్ సుందరాచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ శ్రీధర్, అనాటమీ విభాగం సహా ఆచార్యులు, సహాయక ఆచార్యులు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి: చినరావూరులోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీసోమేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం నందీశ్వరునికి అభిషేకం చేశారు. ముందుగా అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ తదుపరి సోమేశ్వరునికి అభిషేకం, బాలాత్రిపురసుందరి దేవికి కుంకుమ అర్చన చేశారు. అనంతరం నందీశ్వరునికి అభిషేకం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
శుద్ధమైన వాయువు ఆరోగ్యానికి కీలకం
పిడుగురాళ్ల: శుద్ధమైన వాయువు మన ఆరోగ్యానికి అంత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. పట్టణంలోని స్వచ్ఛమైన గాలి అంశంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కృతికా శుక్లా మొక్కలు నాటి ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని, మొక్కలు నాటి, వాతావరణాన్ని హరితవనంగా మార్చాలన్నారు. భవిష్యత్ తరాలు స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే మనం గాలిని కలుషితం చేయకూడదని దీనిని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలన్నారు. ప్రజా సంఘాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని, దీని ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారని అన్నారు. అనంతరం గుంటూరు జిల్లా పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం మాట్లాడుతూ వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు. దీపావళి సందరన్భంగా పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. అనంతరం దీపావళి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏపీపీసీబీ వారిచే రూపొందించబడిన ప్రత్యేక పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దేశ బలోపేతానికి ఎల్ఐసీ కీలకం
కొరిటెపాడు(గుంటూరు): ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభలు శనివారం స్థానిక ఎన్జీఓ కల్యాణ మండపంలో జరిగాయి. జోనల్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల స్వదేశీ నినాదమిచ్చిన కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ఈక్విటీని వంద శాతానికి పెంచాలని నిర్ణయించడం దేశ ప్రయోజనాలకు హానికరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బీమా ఉద్యోగులు సంస్థలను కాపాడుకునేందుకు సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య, ఎల్ఐసీ ఆఫీసర్స్ ప్రధాన కార్యదర్శి కోటేష్ బాబు, డెవలప్మెంట్ అధికారుల కార్యదర్శి సురేష్ బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్కుమార్, మహిళా కన్వీనర్ సీహెచ్ మధుబాల తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
రెంటచింతల: రెంటచింతల పోలీస్స్టేషన్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్ఐకి సూచించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల జరిగే ప్రమాదాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. గ్రామాలలో చిన్న చిన్న విషయాలకే ప్రజలు ఆవేశంతో ఘర్షణ పడుతున్నారన్నారు. ఏ ప్రాంతంలోనైనా గొడవ జరుగుతుందని తెలిసిన వెంటనే పోలీసులు వారిని స్టేషన్కు పిలిపించి మాట్లాడి సర్దుబాటు చేయడంపై కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఐ సీహెచ్ నాగార్జున పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్ గడువు పొడిగింపు
నరసరావుపేట ఈస్ట్: దేశ వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడించినట్టు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్ www.bre.ap.gov.in అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఆన్లైన్ అనంతరం సంబంధిత ప్రింటెడ్ నామినల్ రోల్స్ను ఈనెల 29వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. విద్యాశాఖాధికారి లాగిన్లో దరఖాస్తును ఈనెల 31వ తేదిలోగా ధృవీకరించాల్సి ఉందని తెలిపారు. గడువు పొడగింపునకు ఇదే చివరి అవకాశంగా గుర్తించాలని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ప్రాథమికోన్నత, ఎయిడెడ్, వసతి లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు నమోదులో ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదనీ, పరీక్ష రాసే సమయంలో అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్ష రుసుం ఓసీ, బిసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలని తెలిపారు. వివరాలకు ప్రభుత్వ వెబ్సైట్, డీఈఓ కార్యాలయంలోని డిఎన్ఓ పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని తెలిపారు. -
నవంబర్లో బాల కళాప్రభ ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలనంద కేంద్ర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రుద్ర కళాక్షేత్రం సహకారంతో ‘బాల కళాప్రభ–2025 పేరుతో రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవ, పోటీలను నవంబర్ 8, 9వ తేదీల్లో నిర్వంచనున్నారు. బాలానంద కేంద్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, నడింపల్లి వెంకట గురుదత్లు ఈ మేరకు పేర్కొన్నారు. శనివారం బ్రాడీపేట రెండో లైను లోటస్ ఆద్య పాఠశాలలో కార్యక్రమాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రుద్ర కళాక్షేత్రం నిర్వాహకుడు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక కూచిపూడి నృత్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు నృత్య ప్రభ (సోలో), నృత్యమణి (గ్రూపు) పేరుతో పోటీలు నిర్వహిస్తామన్నారు. శాసీ్త్రయ, జానపద నృత్యాలు, తెలుగు పద్యం, సంస్కృత శ్లోకం, తెలుగులో మాట్లాడదాం, చిత్రలేఖనం, రంగులు వేద్దాం రండి, శాసీ్త్రయ గాత్ర సంగీతం, లలిత గీతాలు, వాద్య సంగీత పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా అంశాల్లో జూనియర్, సీనియర్ విభాగాలుగా పోటీలను నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని వివరించారు. 91826 85890, 89199 81839, 90300 88020, 738215 3390 ఫోను నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లోటస్ ఆద్య పాఠశాల అకడమిక్ డైరెక్టర్ వై.ఉమాదేవి, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతాంధ్ర పండితుడు జన్నాభట్ల మృతి
నరసరావుపేట ఈస్ట్: సంస్కృతాంధ్ర పండితుడు, రంగస్థల నటులు జన్నాభట్ల లక్ష్మీనారాయణ (65) శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జన్నాభట్ల వినుకొండ నుంచి ద్విచక్ర వాహనంపై నరసరావుపేట వస్తుండగా పట్టణం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన జన్నాభట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సంస్కృతం, తెలుగు భాషా పాండిత్యం గల లక్ష్మీనారాయణ పట్టణంలోని పలు కళాశాలల్లో మూడు దశాబ్దాలకు పైగా సంస్కృతాంధ్ర పండితునిగా సేవలు అందించారు. కొంతకాలం నాగార్జున విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యునిగా పనిచేశారు. రంగస్థల నటునిగా వివిధ పాత్రలకు జీవం పోశారు. జన్నాభట్లకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పట్టణంలోని అధ్యాపకులు, కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, రంగస్థల కళాకారులు జన్నాభట్లకు నివాళులర్పించారు. తరిగొప్పుల: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్పై తిరిగి మంచిర్యాలకు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అతడి తల, ఛాతీ భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు. మార్టూరు: మండలంలోని ఇసుకదర్శి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వెంకట రమణయ్య (65) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిందట బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడ ఉదయం నిద్ర లేచేసరికి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం గమనించిన కుమార్తె స్వగ్రామంలో బంధువులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని సాయంత్రం అక్కడకు తరలించారు. అద్దంకి రూరల్: అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురకాయపాలెం పాఠశాలలో శనివారం 356 మంది విద్యార్థినులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 వేల సైకిళ్లు పంపిణీ చేయాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. అనంతరం కొరిశపాడు మండలం మేదరమెట్లలో ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. అనంతరం మేదరమెట్ల–తమ్మవరం బీటీ రహదారిని ప్రారంభించారు. కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డీజిల్ ట్యాంక్ పేలి కంటైనర్ దగ్ధం
యద్దనపూడి: టైరు పేలి కంటైనర్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టటంతో డీజిల్ ట్యాంక్ పగిలి దగ్ధమైన సంఘటన తాతపూడి వద్ద శనివారం చోటు చేసుకుంది. హైవే మొబైల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళగిరి నుంచి చైన్నె పేపర్ లోడుతో వెళుతున్న కంటైనర్ టైరు తాతపూడి వద్దకు రాగానే ఒక్కసారిగా పేలింది. దీంతో అదుపుతప్పిన వాహనం డివైడర్ను ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు రేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరం
వినుకొండ: నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ చేతిలో హత్యకు గురైన కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని కాపు సంఘం నాయకులు కోరారు. వినుకొండ నియోజకవర్గం కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. నిందితులకు కఠినంగా శిక్షపడేలా పూర్తిస్థాయిలో సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రులను కోరనున్నట్లు తెలిపారు. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలన్నారు. లక్ష్మీనాయుడు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, దాడిలో గాయపడిన పవన్, భార్గవ్ల వైద్య ఖర్చులతోపాటు వారిరువురికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారికి ఇంటి స్థలం కేటాయించాలన్నారు. లక్ష్మీనాయుడు పిల్లల చదువుల నిమిత్తం వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో కాపులు పెద్దన్న పాత్ర పోషించి కూటమిని గెలిపించాలని కోరిన పవన్ కల్యాణ్ మాటలు విని కాపులు ఓట్లేస్తే కాపులపై ఇంత దారుణంగా దాడులు జరుగుతుంటే పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో కాపు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు కర్ణా శ్రీనివాసరావు, నాయకులు మల్లిశెట్టి నరేష్, మారాసు వీరేంద్ర, పత్తి మణికంఠ, బండ్ల శ్రీను, ఓబులశెట్టి పిచ్చయ్య, సూరే ప్రసాద్ తిరుమలశెట్టి కొండలు, ఆసా మనోహర్, కందా వెంకటేశ్వర్లు (బాబు), మారాసు కొండలు, తాడి అమర్, నియోజకవర్గ కాపు నాయకులు పాల్గొన్నారు. బాధిత కాపు కుటుంబానికి న్యాయం చేయాలి -
పలు పంటల సాగుతో రైతు పదిలం
యడ్లపాడు: వ్యవసాయంలో అన్నదాత నష్టపోకూడదంటే పాత మూస పద్ధతులు, ఏక పంటపై ఆధారపడటం సరికాదని, పలు పంటల విధానమే రైతుకు పదిలం అని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కె అమలకుమారి పేర్కొన్నారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు సాగు చేసిన పలు రకాల పంటలను సిబ్బందితో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. పలు పంటల సాగు చేస్తున్న రైతులు తిరుపతిరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావుల కంపాక్ట్ బ్లాక్లను పరిశీలించారు. ముఖ్యంగా రైతు వెంకటేశ్వరరావు తన పొలంలో ప్రధాన పంటగా దొండసాగులో, అంతర పంటలుగా బెండ, గోరుచిక్కుడు, పప్పు చిక్కుడు, టమాటా, వంకాయ, సొరకాయ, ఉల్లి, కాకర, పొట్లకాయ, బంతి వంటి పదికి పైగా కూరగాయలు సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. బహుళపంటల సాగు విధానం ద్వారా తాను నెలకు రూ.29,500 స్థిర ఆదాయం పొందుతున్నట్లు రైతు వెంకటేశ్వరరావు డీపీఎంకు తెలిపారు. ప్రకృతి సేద్యంతో పండిన కూరగాయలతో తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండటంలో పాటు సాగు చేసిన నేల కూడా సారవంతంగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం డీపీఎం అమలకుమారి రైతులతో మాట్లాడుతూ పలు పంటలు సాగు చేయడం వలన నేలలో జీవవైవిధ్యం పెరిగి భూసారం మెరుగుపడుతుందని, సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పంటలకు పోషకాలు లభిస్తాయని, తద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని ఆమె వివరించారు. అందుకే భూ మాతకు పలు పంటలు ముద్దు, ఏకపంట వద్దు అంటూ కీలక సూచనలు చేశారు. ప్రకృతి సాగు విధానంతో రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి, ఘన, ద్రవ జీవామృతాలు, పశువులపేడ, మూత్రం, సహజ అవశేషాలను వినియోగించడం ద్వారా రైతులకు సాగు పెట్టుబడి గణనీయంగా తగ్గి, అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అన్నింటికీ మించి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతిగ్రామంలో ప్రకృతి సేద్యం విస్తరించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పలు పంటల సాగు రైతు జీవనాన్ని వెలుగులోకి తెస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఈ విధానంతో ఆదర్శంగాా నిలుస్తున్న రైతుల్ని అభినందించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎం డాక్టర్ కె అమలకుమారి -
స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయాలి
బాపట్ల: ‘పరిశుభ్రత వైపు ఒక అడుగు’ నినాదంతో స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయాలని, ప్రజారోగ్యం, పర్యావరణ స్థిరత్వం దిశగా ప్రతి అడుగూ కృత నిశ్చయంతో వేయాలని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ ఇన్చార్జి డీన్ ఎస్.ఆర్. కోటేశ్వరరావు తెలిపారు. ప్రతి నెలా మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు ఈ సామాజిక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణతో ప్లాస్టిక్ భూతాన్ని భూతలం నుంచి పారదోలాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల దాపురిల్లే భయంకరమైన పరిణామాల గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల విలువైన పశుసంపద బలి కావడం దారుణమని తెలిపారు. దీని వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, యువత అప్రమత్తంగా ఉండి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణను విద్యార్థులు శుభ్రం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎం.రమాదేవి, సి. సంధ్యారాణి, జి.విజయకుమార్, షేక్ అబ్దుల్ సలాం, విద్యార్థులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గటం వల్ల గృహోపకరణాల ధరలు తగ్గాయి
నరసరావుపేట: సూపర్ సేవింగ్స్–సూపర్ జీఎస్టీ వల్ల విద్యుత్ గృహోపకరణాల ఉపకరణాల ధరలు తగ్గాయని, సోలార్ విద్యుత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చే వారికి లాభం కలుగుతుందని విద్యుత్ శాఖ జిల్లా అధికారి డాక్టర్ ప్రత్తిపాటి విజయకుమార్ పేర్కొన్నారు. శనివారం సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్, సోలార్ విద్యుత్ అవగాహన ర్యాలీకి స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో పచ్చ జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ర్యాలీ శివుడు బొమ్మ సెంటర్ మీదుగా ప్రధాన రహదారిలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు, అక్కడి నుంచి పాండురంగస్వామి దేవాలయం మీదుగా కోట సెంటర్ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు కొనసాగింది. విద్యుత్ శాఖ సిబ్బంది ప్లకార్డులు పట్టుకొని దారి పొడవునా కరపత్రాలు పంపిణీ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్.రాంబొట్లు మాట్లాడుతూ విద్యుత్ రంగ సంస్థలో గృహ వినియోగదారులకు అదనపు లోడు ఉంటే 50 శాతం రాయితీ ద్వారా లోడు క్రమబద్ధీకరణ పథకం ఉందని, దీనిని ప్రతి ఒక్క గృహ వినియోగదారుడు వినియోగించుకోవాలని కోరారు. ర్యాలీలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాద్, అసిస్టెంట్ ఇంజినీర్లు రఫీ, సురేంద్రబాబు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు సాంబశివరావు, మౌళి, ప్రసాద్ పాల్గొన్నారు. -
విగ్రహ ప్రతిష్ట సంబరాల్లో టీడీపీ నేతల వీరంగం
సాక్షి టాస్క్ఫోర్స్: నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామంలో గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట సందర్భంగా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. గ్రామంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామస్తులు విరాళాలు సేకరించారు. ప్రతిష్ట అనంతరం అన్నదాన సంతర్పణ సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ నేత తన అనుచరులతో వచ్చి భోజనం చేస్తున్న వారితో ఘర్షణకు దిగాడు. అక్కడ ఉన్న నిర్వాహకులు ప్రతిష్ట సజావుగా జరగాలని ప్రాథేయ పడినప్పుటికీ భోజనం బల్లలను, వంట సామగ్రి పడివేసి గందరగోళం సృష్టించాడు. అంతే కాకుండా గ్రామంలో ఎటువంటి కార్యక్రమం జరిగిన మాకు సుంకం చెల్లించాలని లేకుంటే కార్యక్రమాలు నిర్వహించటానికి వీల్లేదని హెచ్చరించారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో వినుకొండ పట్టణంలో ఉన్న ఐనవోలు పోలీసుస్టేషనుకు చేరుకొని ఎస్ఐ ఎదుట మొరపెట్టుకున్నారు. గ్రామంలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని ఏ పని చేయాలన్నా సుంకం చెల్లించాలని లేకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని ఎస్ఐ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం రాత్రి సమయంలో మహిళలు పోలీసుస్టేషను ఎదుట రెండు గంటల నిరీక్షించారు. స్పందించిన ఎస్ఐ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారిస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు తిరిగి గ్రామానికి వెళ్లారు. -
గూగుల్ డేటా సెంటర్తో ఒరిగేదేం లేదు
నరసరావుపేట ఈస్ట్: విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం శూన్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదం, అమెరికా ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. సదస్సులో శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై ప్రధాని మోదీ చీకటి ఒప్పందాలకు తెరతీస్తున్నారని పేర్కొన్నారు. మోడీ వ్యవహార శైలితో దేశంలో ఆయిల్ సంక్షోభం తలెత్తటంతోపాటు దేశ సార్వభౌమత్వమే ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఐటీ హీరోని నేనే అని ప్రగల్భాలు పలికే సీఎం చంద్రబాబు అమెరికాలో మన విద్యార్థులు పడుతున్న బాధల పట్ల కనీస సానుభూతి ప్రకటించటం లేదని అన్నారు. విదేశీ కంపెనీ గూగుల్కు రూ.22 వేల కోట్లు రాయితీ ఇస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. గూగుల్ మన వద్ద రాయితీ తీసుకొని ప్రపంచమంతా వ్యాపారం చేసుకుంటూ లాభ పడుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్లో రెండు లేదా మూడు వందల మందికి మించి ఉద్యోగాలు రావన్నారు. గూగుల్కు ఇచ్చే రాయితీలతో రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కళాశాలలను నిర్మించవచ్చన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో చేసిన పర్యటనలకు దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశారని, కానీ రాష్ట్రానికి ఒక్క పైసా ప్రయోజనం లేదన్నారు. ప్రధాని మోదీ పర్యటనలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను విస్మరించటం దారుణమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పర్యటన ఆసాంతం పొగడ్తలకే సరిపోయిందన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
కర్లపాలెం: క్రీడాకారులు సమయస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని డీఈవో పురుషోత్తం తెలిపారు. మండలంలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాపట్ల డివిజన్ స్థాయిలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో పురుషోత్తం ముందుగా వాలీబాల్ క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపే ధ్యేయంగా ఆడాలని సూచించారు. నిష్పక్షపాతంగా పోటీలు నిర్వహించాలని వ్యాయామ ఉపాధ్యాయులకు చెప్పారు. పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని డివిజన్ స్థాయి టీమ్కు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం సుగుణ మణి, వ్యాయామ ఉపాధ్యాయురాలు మెర్సీ, ఎంఈవోలు మనోరంజని, విజయశ్రీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మాజీ కార్యదర్శి కరిముల్లా, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతిమ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న 40 టీములు బాపట్ల డివిజన్ పరిధిలోని మొత్తం 12 మండలాల నుంచి అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాలలో మొత్తం 40 టీమ్లు పాల్గొన్నాయి. -
బస్షెల్టర్లో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం కంటెపూడిలోని బస్సు షెల్టర్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం శుక్రవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు సత్తెనపల్లి రూరల్ ట్రైనీ ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి వృద్ధుడి మృతదేహన్ని పరిశీలించారు. సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయసుగల వృద్ధుడు తెల్ల చొక్కా, ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ 9440796231, 9490571949 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
వైఎస్సార్సీపీలో పలువురు జిల్లా వాసులకు పదవులు
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా నరసరావుపేటకు చెందిన గెల్లి బ్రహ్మారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, గురజాలకు చెందిన కలకంధ అంధ్రయ్యను యాక్టివిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులుగా కండ్రకుంట మరియమ్మను నియమించారు. మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏడీ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి నేటికీ అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నా రు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చేనేత రక్షణకు 11 రకా ల రిజర్వేషన్లు అమలు జరపాలని కోరా రు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నా రు. చేనేత కార్మికులకు, సహకార సంఘాల్లో లేనివారికి ఇవ్వాల్సిన ట్రిప్ట్ ఫండ్ రూ.27 కోట్లను కూడా విడుదల చేయాలని కోరారు. గుంటూరురూరల్: నగర శివారు లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కళాశాలల జట్లు ప్రతిభ చాటాయి. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తెనాలి జె.ఎం.జె. డిగ్రీ కళాశాల, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్స్ విభాగం, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు తొలి నాలుగు స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. విజేతలను చైర్మన్ అభినందించారు. -
చలో.. సూర్యలంక !
కార్తిక మాసం అనగానే మనుష్యుల మధ్య ఐకమత్యం, ప్రకృతితో మనిషికి గల అవినాభావ సంబంధాన్ని తెలిపే వన భోజనాలు గుర్తు కొస్తాయి. పచ్చ పచ్చని వనాల్లో సేద తీరడంతో భవిష్యత్పై ఆశలు పుడతాయి. సమష్టి తత్వం బోధ పడుతుంది. దైనందిన జీవితంలో ఆశ, నిరాశలు, ఒత్తిడి, బాధ్యతల బరువుతో సతమతమయ్యే మనిషికి కార్తిక మాసంలో చేసే వన భోజనాలు ఆటవిడుపుగా ఉంటాయి. బాపట్ల: కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి కళ్లూ జిల్లాలోని సూర్యలంక తీరం పైనే ఉంటాయి. ఈ నెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోనే సహజసిద్ధమైన తీరంగా పేరున్న సూర్యలంకకు కార్తిక మాసంలో పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. సముద్ర స్నానాలు చేసి, తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్ భూమిలో ఉన్న జీడిమామిడి తోటలో వన భోజనాలు చేస్తారు. వననర్సరీ చాలా అనువుగా ఉంటుంది. స్నానాలనంతరం పూజలు చేసుకునేందుకు వీలుగా తీరం వెంబడే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. చేరుకునేది ఇలా... బాపట్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లేవారు ముందుగా పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బాపట్ల నుంచి నేరుగా సూర్యలంక వరకు వెళ్తుంటాయి. ఒక్కో మనిషికి రూ.20 చార్జీ ఉంటుంది. సర్వీసులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కార్తిక మాసంలో వచ్చే ప్రతి ఆది, సోమవారాల రోజున బాపట్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గాన వచ్చే వాళ్లకు స్థానిక రైల్వేస్టేషన్ నుంచి నేరుగా సూర్యలంకకు, బస్సు మార్గాన వచ్చే వాళ్లకు బాపట్ల పాత బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం గుంటూరు బస్ స్టేషన్ నుంచి కూడా నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. రిసార్ట్స్లో వసతి సౌకర్యం సహజ సిద్ధమైన సూర్యలంక తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, పర్యాటకులు సేదతీరేందుకు వీలుగా తీరం ఒడ్డున హరితా రిసార్ట్స్ ఉన్నాయి. ఇందులో 25 ఏసీ రూమ్లు, రెండు నాన్ ఏసీ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో aptdc. gov. in అనే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం తీరం వెంబడి రెస్టారెంట్, గ్రూపు యాత్రికుల కోసం క్యాటరింగ్ సౌకర్యం, టూరిస్టు బోటు , తీరం వెంబడే జిమ్ సెంటర్ను కూడా నిర్వహిస్తున్నారు. -
విలువలతో కూడిన నాయకత్వం అవసరం
చేబ్రోలు:విద్య కేవలం జ్ఞాన సంపాదనకే కాకుండా విలువల తో కూడిన నాయకత్వం పెంచుకోవడానికి కూ డా ముఖ్యమని ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సుధాకర్రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘కల్టివేటింగ్ ఎథికల్ బిజినెస్ లీడర్స్’పై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ ఎ. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సంస్థల్లో ఎదురయ్యే నైతిక సమస్యలను ఆచరణాత్మక కోణంలో విశ్లేషించారు. పుదుచ్చేరి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ యార్లగడ్డ శ్రీనివాసులు భారతీయ తత్వశాస్త్ర సంప్రదాయాల ప్రాధాన్యతను నైతిక నాయకత్వ అభివృద్ధితో అనుసంధానించి వివరించారు. ఐఐటీ హైదరాబాద్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం.పి.గణేష్ ఆధునిక అభివృద్ధి తత్త్వాలతోపాటు ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని సమన్వయం చేయడం ఎంత అవసరమో వెల్లడించారు. వంద మందికిపైగా ప్రతినిధులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు పాల్గొన్నారు. -
విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
నరసరావుపేటరూరల్: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 30 నమూనాలను విద్యార్థులు పోటీలో ప్రదర్శనకు ఉంచారు. కాకాని జెడ్పీ హైస్కూల్కు చెందిన వక్కలగడ్డ కాత్యాయనీ ప్రథమ స్థానం, నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్కు చెందిన కోడిరెక్క ఇమ్మానియేల్కు ద్వితీయ స్థానం లభించింది. ఈ రెండు నమూనాలను శనివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్కె సుభాని, సత్తెనపల్లి డీఈవో ఏసుబాబు, పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు ఎం.పార్వతి, జిల్లా సెన్స్ అధికారి ఎస్.రాజశేఖర్, ఉపాధ్యాయులు రఘురాం, చింత శ్రీనివాసరెడ్డి, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: తెనాలిలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు(60) ఈ నెల 14న పట్టణంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తిరుపతిరావు గ్రామంలోని రామాలయం పాలకవర్గంలో కీలకంగా ఉన్నాడు. ఆలయ చెరువుల వేలం పాటల నిర్వహణ బాధ్యత చూసేవాడు. 15 రోజుల క్రితం జ్వరం రావడంతో తిరుపతిరావు తన భార్యతో కలసి తెనాలిలో నివాసం ఉంటున్న కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఈ నెల 14న టిఫిన్ కోసం బైక్పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమీపంలో టిఫిన్ సెంటర్ వద్ద బైక్పై కూర్చున్నాడు. అదే సమయంలో కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన గండికోట వెంకటసుబ్బారావు వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయాడు. తిరుపతిరావుతో నిందితుడికి కొంతకాలంగా విభేదాలున్నాయి. నిందితుడి వ్యక్తిగత విషయాలలోనూ తిరుపతిరావు జోక్యం చేసుకున్న కారణంగా కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడం, గతంలో తన తండ్రి మృతికి కూడా తిరుపతిరావు కారణమయ్యాడని భావించి రెక్కీ నిర్వహించి మరీ హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో మూడు కేసులు, అమృతలూరు పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తిరుపతిరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంచర్లపాలెం రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎస్. సాంబశివరావు, త్రీ టౌన్ ఎస్ఐ కరిముల్లా, రూరల్ ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. ఆధిపత్య పోరు, పాత కక్షలే కారణమని డీఎస్పీ వెల్లడి -
టీడీపీ నాయకురాలి కుటుంబసభ్యులు వైఎస్సార్సీపీలో చేరిక
మంగళగిరి టౌన్: మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి కుటుంబంలోని కొందరు వైఎస్సార్సీపీలో చేరడమే దీనికి కారణం. తొలుత పాత మంగళగిరి సీతారామ కోవెల సెంటర్ నుంచి ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయం వరకు సుమారు వందమందికిపైగా యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జానకీదేవి తోటికోడలు అయిన తమ్మిశెట్టి అనూరాధతోపాటు జితేంద్ర, గౌతమి, బిట్ర శ్వేతలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలు పార్టీ కండువాలు కప్పి, అభినందించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడంతో పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. పార్టీపై, అధినాయకుడిపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మురుగుడు, డీవీఆర్లు సూచించారు. జానకీదేవి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్నారు. మొదటి నుంచి బీజేపీ నేపథ్యం ఉన్న ఆమె 2004లో మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ పోటీ చేసినా ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. -
ప్రైవేటీకరణ చేసి పేదల కడుపు కొట్టొద్దు
రచ్చబండలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాచవరం: వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు, పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందించేందుకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి సమీపంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. మండలంలోని నాగేశ్వరరావు తండా, శ్రీ రుక్మిణి పురం గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని జగన్మోహన్రెడ్డి కల్పిస్తే చంద్రబాబు విధానాల వల్ల రూ.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది పేదలకు సాధ్యమా అని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా అందరూ ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు కోసం సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రజల అండదండలతో పోరాడి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకొని తీరుతామన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలను, విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధితోపాటు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయంపాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మడ్డు ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు శివయాదవ్, మండలం అభివృద్ధి కమిటీ చైర్మన్ దారం లచ్చిరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి చల్లా పిచ్చిరెడ్డి, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు గుర్రం గురవారెడ్డి, జిల్లా కార్యదర్శి జిలుగు నరసింహారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షులు సిద్ధారెడ్డి పుల్లారెడ్డి, గుమ్మ హుస్సేనయ్య, మండల యూత్ కన్వీనర్ ముండ్లపాటి చిన ఆంజనేయులు, మండల నాయకులు అంబటి కోటయ్య, అనిల్కుమార్, వంకాయల రమేష్, మహమ్మద్ జానీ, రాము, బ్రహ్మారెడ్డి, పెరుగు రోశయ్య, గ్రామ సర్పంచులు రామారావు, అనంగి వెంకటేశ్వర్లు, బత్తుల కృష్ణ, బాలాజీనాయక్, బాబురావు నాయక్, ఎంపీటీసీ సభ్యులు శ్రీశైలం నాయక్, గురవయ్య, సోషల్ మీడియా టీం సభ్యులు జక్కుల కొండలు, బాబు, రాజు, చిన్న అంజి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా, శిశు సంక్షేమశాఖ సక్రమంగా పనిచేయాలి
నరసరావుపేట: జిల్లాలోని మహిళా, శిశు సంక్షేమ శాఖను సక్రమంగా పనిచేసేలా చూడాలని, అవసరాన్ని బట్టి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రోజువారి కార్యక్రమాలు సక్రమంగా ప్రభుత్వ నిర్దేశిత ప్రకారం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శాఖాపరమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోజు వారి విధులు ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని, ముఖ్యంగా యుక్త వయస్సు, గర్భిణులు, బాల్యవివాహాలు సమస్యలు జిల్లాలో ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించేందుకు పనిచేయాలన్నారు. పోషణకు దూరమైన పిల్లల్ని గుర్తించి వారి గృహ సందర్శన ద్వారా సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రీ స్కూల్ హాజరు పెంచాలని, జిల్లాలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని జిల్లాలోని సీడీపీఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. జిల్లా సాధికారత అధికారిని ఎం.ఉమాదేవి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓలు కాంతకుమారి, శ్రీలత, శాంతకుమారి, అపరంజి, జ్యోత్స్న, వెంకటరమణ, రాజేశ్వరి, బాల సంక్షేమ సమితి కార్యాలయ సభ్యులు సౌరిరాజు, వన్స్టాప్ సెంటర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఆర్టీసీ సేవలు మెరుగు పర్చాలి జిల్లాలో ఆర్టీసీ సేవలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉన్న పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులపై మహిళలకు ఉచితం అని స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో సౌమ్యంగా ప్రవర్తించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. సమయపాలనతో బస్సులు నడపాలన్నారు. జిల్లాలోని పలు జెడ్పీ పాఠశాలలు, జూనియర్ కళాశాలకు మారిన టైమింగ్స్ ప్రకారం బస్సులు నడపాలన్నారు. బస్టాండ్లలో తాగునీరు, టాయిలెట్లు వసతులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అజితకుమారి, డీఈవో చంద్రకళ, పలు డిపోల మేనేజర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
కలాలకు కళ్లెంపై నిరసన గళం
నరసరావుపేట: రాష్ట్రంలో కలం పట్టుకున్న పాత్రికేయులపై కూటమి ప్రభుత్వం కత్తి వేలాడదీసి బెదిరిస్తుందని, పత్రికా స్వేచ్ఛని హరిస్తుందని జర్నలిస్టు లు, ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులు, వేధింపులకు నిరసనగా శుక్రవారం పల్నాడు జిల్లా ప్రెస్క్లబ్, నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ), యూ ట్యూబర్స్ అసోసియే షన్, ప్రజాసంఘాలు, సోషలిస్టులు, వామపక్ష నాయకులు కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని అంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేలకు అక్రమ కేసులను ఎత్తేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సోషల్ యాక్టివిస్టు, నైతిక విప్లవం పత్రిక మాజీ సంపాదకులు ఈదర గోపీచంద్ మాట్లాడు తూ కూటమి ప్రభుత్వ అక్రమాలపై కథనాలు రాస్తున్న సాక్షి పత్రికపై అక్రమ కేసులు పెట్టి పత్రికా స్వాతంత్య్రాన్ని ప్రమాదంలో పడేసిందన్నారు. అడ్డగోలుగా ప్రజలకు అబద్దాలు చెబుతూ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నాడన్నారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కారణంతో సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి వేధించటం దారుణమని ఏపీడబ్ల్యూజేయూ జిల్లా గౌరవ అధ్యక్షులు నంద్యాల జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి, అక్రమాలను ఏరోజుకారోజు ప్రజలకు తెలియచేస్తున్నందుకే ఆ పత్రికపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటువంటివి కూటమి నేతలు వెంటనే మానుకోవాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు అన్నారు. నిజం రాసే సాక్షి పత్రికపై కేసులు, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు చెబుతున్నా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించటం దారుణమని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి చెప్పారు. సీపీఐ సీనియర్ నాయకుడు ఉప్పలపాటి రంగయ్య మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఆర్.లవకుమార్రెడ్డి, పల్నాడు జిల్లా ప్రెస్క్లబ్, నరసరావుపేట అధ్యక్షులు సీహెచ్.వి.రమణారెడ్డి, ఏపీడబ్ల్యూజేయూ జిల్లా కార్యదర్శి నాగరాజు, సాక్షి టీవీ రిపోర్టర్ సుంకిరెడ్డి, రిపోర్టర్లు పి.కోటిరెడ్డి, జీవీ సాంబశివారెడ్డి, ఆలీ, శివ, పచ్చవ బుజ్జి, అప్పారా వు, షాహీద్, బాదుగున్నల శ్రీనివాసరావు, పున్నారావులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో... ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రమాదంలో పడేలా పాలకుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సత్తెనపల్లిలోని జర్నలిస్టులు ఐక్యంగా శుక్రవారం సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీ.రమణాకాంతరెడ్డికి వినతి పత్రం అందించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నినదించి మీడియాతో మాట్లాటారు. కొంతకాలంగా సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, సాక్షి జర్నలిస్టులను పోలీసులు పదేపదే విచారిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలు సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేయూ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్ సైదా, సాక్షి సత్తెనపల్లి ఆర్సీ ఇన్చార్జి విప్పర్ల శ్రీనివాసరావు, జర్నలిస్టులు మారూరి లింగారెడ్డి, షేక్ జిలాని, షేక్ బాజీ, మునగా వెంకటేశ్వరరావు, అంకాళ్ల నాగరాజు, అడబాల.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. గురజాలలో... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి పత్రికా స్వేచ్ఛ లేకుండా అణగదొక్కాలనే లక్ష్యంతో ఉన్నారని సాక్షి మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎస్ నాగేశ్వరరావు అన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం గురజాలలో శుక్రవారం సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర రిపోర్టర్లపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంతోపాటు వారిని బెదిరింపులకు గురిచేయడంపై అందుకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. విలేకరులపై అక్రమ కేసులు, వారిని భయాందోళనకు గురిచేయడం వంటి వాటిని మానుకోవాలన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అధికారి కె సుజాతకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రిపోర్టర్లు వినుకొండ అజయ్కుమార్, రామారావు, పాపారావు, వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ రహీం, రాజారత్నారెడ్డి, మల్లికార్జునరెడ్డి, కేతిరెడ్డి బాలకృష్ణారెడ్డి తదితరులున్నారు. వినుకొండలో... సాక్షి పత్రిక సంపాదకులు ఆర్.ధనంజయరెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి విలేకరులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వినుకొండ పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేశారు. డిప్యూటీ తహసీల్దార్ మురళికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్లు పాల్గొన్నారు. ప్రజాగొంతుకై కూటమి అక్రమాలను ప్రశ్నిస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్ష కట్టింది. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర సిబ్బందిని నోటీసులు, కేసుల పేరిట వేధించసాగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పత్రికా స్వేచ్ఛను హరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి కక్ష సాధింపు చర్యలపై జర్నలిస్టులు శుక్రవారం కన్నెర్ర చేశారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ నినదించారు. ప్రజల తరఫున మాట్లాడితే వేధిస్తారా అంటూ నిలదీశారు. నిరసన కార్యక్రమాల్లో పాత్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులు, వేధింపులు అపాలని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. -
శునకాల దాడిలో 15 గొర్రెలు మృతి
విలపించిన యజమాని బల్లికురవ: మండంలోని కొప్పరపాడులో కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని బీసీ కాలనీలోని షేక్వలి గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించిన శునకాలు వాటిపై దాడి చేసి చంపేశాయి. సుమారు వంద గొర్రెలను మేపుతూ వలి జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. కుక్కల దాడితో 15 చనిపోగా, గాయపడిన వాటిని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కుక్కకాటుకు గురవడంతో బతకడం కష్టమేనని వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవటంతోపాటు గ్రామంలో కుక్కలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బుర్రి ఆదినారాయణ, మూడావత్ దానానాయక్లు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. కుక్కలు ఏడాదిగా పలువుర్ని కరిచాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. తాను రూ.2 లక్షల వరకు నష్టపోయానని వలి తెలిపారు. -
పెరుగుతున్న డిమాండ్
ఎకరం వరికి వాడే నీటితో 2–3 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేయవచ్చు. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ను అందుకోవచ్చు. ఎకరానికి 3 కిలోల విత్తనం (కేజీ రూ.75) ఆంగ్రూలో లభిస్తుంది, లేదా జిల్లా ఏరువాక కేంద్రం ద్వారా తెప్పించుకోవచ్చు. రైతులకు అవగాహన కల్పించి, విత్తన రాయితీ, ప్రభుత్వ మద్దతు అందిస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. –డాక్టర్ సీవీ చంద్రమోహన్రెడ్డి, చిరుధాన్యాల ప్రధాన శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ
చొరవ చూపించిన మంత్రి నారా లోకేష్ తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరదల కారణంగా వల విసరక మత్స్యకారులకు భుక్తి కరువైంది. దయనీయంగా జీవిస్తున్నారని సాక్షిలో అక్టోబర్ 1వ తేదీన కథనం వెలువడింది. దీనికి స్పందించిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయంతో గురువారం మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగ పుత్రులు వేట లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ సహాయంతో 300 మందికి రెండు వేల రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘ నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. -
వ్యవసాయశాఖ కమిషనర్కు అభినందనలు
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ను గుంటూరు చుట్టుగుంటలోని కార్యాలయంలో ఏపీ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి, అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, మెమెంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి.. ప్రస్తుత పరిస్థితుల్లో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువుల లభ్యత గురించి కమిషనర్కు వివరించారు. రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ జిలానీ సమూన్ తెలిపారు. డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కె.విజయకుమార్, ఉపాధ్యక్షులు చక్కా రవికుమార్, భీమవరపు శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆర్.చలపతిరావు, సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
కోనేరులో దూకి మహిళ ఆత్మహత్య
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన పెద కోనేరులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యచేసుకున్న ఘటన మంగళగిరి నగరంలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... మంగళగిరి నగర పరిధిలోని గండాలయ్యపేటకు చెందిన చలంచలం కామాక్షి (29) తల్లి ధనలక్ష్మితో కలసి జీవిస్తోంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. పలు ఆలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ తల్లీకూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. కామాక్షి కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోందని, మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని తల్లి ధనలక్ష్మి పేర్కొంది. గురువారం మధ్యాహ్నం కోనేరు వద్దకు వెళ్లి ప్రహరీ ఎక్కి కోనేటిలోకి దూకేసింది. సమీపంలో కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజ్ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి కామాక్షి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు తెలిపారు. కోనేరుకు మూడు పక్కలా ఫెన్సింగ్ ఉందని, దక్షిణం వైపు మాత్రం లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దక్షిణం వైపు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
డిసెంబర్ 12 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 8వ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి, ఏపీ రెరా మెంబర్ దామచర్ల శ్రీనివాసరావు, ది గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాసరావు, క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్ గుంటూరు చాప్టర్ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రాపర్టీ షోను డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇందులో నాణ్యమైన అపార్ట్మెంట్లు, స్థలాల వివరాలతో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ, ప్రాపర్టీ షో కన్వీనర్ టి.వినోద్రెడ్డి, గుంటూరు చాప్టర్ చైర్మన్ ఆరుమళ్ల సతీష్రెడ్డి, ప్రెసిడెంట్ మామిడి రాము, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రెజరర్ ఏ.వి. నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
షార్ట్ హ్యాండ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 4న షార్ట్ హ్యాండ్, జనవరి 25,26వ తేదీల్లో టైప్ రైటింగ్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైనట్లు ఆల్ ప్రిన్సిపాల్స్ టెక్నికల్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టీవీఎస్ ప్రకాష్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు సమీపంలోని టైప్ ఇనిస్టిట్యూట్స్లో సంప్రదించాలని ఆయన సూచించారు. గంజాయి స్వాధీనం పెదకాకాని:నగర శివారులోని బసవతారక రామనగర్ సమీపంలో ఇద్దరు గంజాయి తాగు తుండగా టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాము లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎర్ల వెంకటచిన్న, గుంజి మోహన్లుగా గుర్తించా రు. ప్రాథమిక విచారణలో వారికి విక్రమ్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. రైలులో గంజాయి పట్టివేత తెనాలిరూరల్: రైలులో తరలిస్తున్న గంజాయి ని తెనాలి జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ జి.వెంకటాద్రిబాబు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు గురువా రం తెనాలి చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేప ట్టారు. ఎస్–3 బోగీలోని ఓ బ్యాగులో 4.4 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు సమాచారమందించి, ఆయన సమక్షంలో సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి పరారయ్యాడని, కేసు నవెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 19న ‘మట్టి రంగు’ పుస్తకావిష్కరణ బాపట్ల: ప్రముఖ కవయిత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత డా. చిల్లర భవానీదేవి రచించిన ‘మట్టి రంగు’ కవితా సంపుటి పుస్తకావిష్కరణ మహోత్సవం ఈనెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక హోటల్ గౌతం వేదిక హాలులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని బాపట్ల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్సుందర్ తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. రచయిత్రి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి సభాధ్యక్షత వహించనున్నారని, సాహితీ విమర్శకులు డాక్టర్ బీరం సుందరరావు పుస్తక పరి చయాన్ని చేస్తారని, ఆత్మీయ అతిథిగా ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పి.సి. సాయిబాబు పాల్గొననున్నట్లు వివరించారు. కోటంరాజు సత్యనారాయణశర్మ దంపతుల స్మారక సాహి తి పురస్కారాన్ని డాక్టర్ అప్పాజోస్యుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
చిరు ధాన్యాల సాగు పెంపే లక్ష్యం
యడ్లపాడు: పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన చిరుధాన్యాలు(మిల్లెట్స్) దేశ ఆరోగ్య, ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘మిల్లెట్ మిషన్’ పేరిట ప్రత్యేక జీవో తీసుకొచ్చి వీటి సాగుకు ప్రోత్సాహం అందించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఊతం ఇవ్వడం..రాయితీపై యంత్రాలు అందించడం వంటి చర్యలు యువతకు, చిరుధాన్యాల సాగుకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. నేపథ్యంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు, తక్కువ ఖర్చుతో, వర్షాభావాన్ని తట్టుకునే ఏబీవీ–04 (అనంతపురం బాద్ర వైరెటీ) అనే దేశవాళీ సజ్జ రకాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కనుగొంది. ఏబీవీ–04 ప్రత్యేకతలు, సాగు విజయవంతం... ఈ కొత్త రకం సజ్జలో సాధారణ సజ్జల కంటే కాల్షియం, జింక్ వంటి పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉండి, దిగుబడి కూడా 20–25 శాతం అధికంగా వస్తుంది. జిల్లా ఏరువాక వ్యవసాయ పరిశోధన కేంద్రం మండలంలోని జాలాది గ్రామంలో 25 ఎకరాల్లో ఈ రకం ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించింది. జాలాదిలో సజ్జసాగు ప్రయోగం విజయవంతం దిగుబడి ఆశాజనకంగానే.... ఏబీవీ –04 రకాన్ని తొలిసారిగా గ్రామంలో 23 ఎకరాలను సాగు చేశాను. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి అయింది. 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చేలా ఉంది. మార్కెట్లో జాతీయ కనీస ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2750 ఉంది. బహిరంగ మార్కెట్లో రూ.3వేలకు తగ్గనందున పెట్టుబడికి అంతే మొత్తం ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. ఎకరాకు సుమారు రూ.7వేల వరకు అవుతుంది. అదే ముందస్తు పంటగా సజ్జను సాగు చేస్తే కేవలం రూ.2వేలతో దుక్కి పనులు పూర్తవుతాయి. దీంతో రైతుకు రూ.5వేలు ఖర్చు కలిసి వస్తుంది. –మానుకొండ శ్రీనివాసరావు, సజ్జరైతు, జాలాది -
నకిలీ మద్యం కట్టడికి సురక్ష యాప్
నరసరావుపేట టౌన్: నకిలీ మద్యం కట్టడికి ప్రభుత్వం ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ తీసుకొచ్చిందని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా ఈఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ మద్యం కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ సురక్ష పేరుతో రెండు యాప్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒకటి ఎకై ్సజ్ సురక్ష యాప్ కన్జ్యూమర్, రెండోది ఎకై ్సజ్ రక్ష యాప్ రిటైలర్, ఈ యాప్లను ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని మద్యం సీసాపై స్కాన్ చేస్తే సమగ్ర వివరాలు అందులో కనిపిస్తాయన్నారు. దీనివల్ల మద్యం సీసా ఒరిజినల్దో లేక నకిలీదో పసిగట్టవచ్చన్నారు. పల్నాడు జిల్లాలోని 142 లిక్కర్ షాపులు, 32 బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద మద్యం నాణ్యతను యాప్ ద్వారా పరిశీలించామన్నారు. మద్యం బాటిళ్ల మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మద్యం విక్రయించాలన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం సంఘటన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 16 ఎస్హెచ్ఓల పరిధిలో అన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో నకిలీ మద్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఎక్కడా ఏవిధమైన నకిలీ మద్యం కానీ స్టాంపు డ్యూటీ చెల్లించని మద్యం కానీ లభించలేదన్నారు. నకిలీ మద్యం సమాచారం తెలిస్తే స్థానిక ఎకై ్సజ్ శాఖ ఎస్హెచ్ఓకి గాని, 14405 టోల్ ఫ్రీ నంబరుకు కానీ తెలియపరచాలన్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. ఎకై ్సజ్ శాఖ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది బెల్ట్షాప్లు, నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో నాటు సారా నివారణకు పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కల్తీ సారా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఈఎస్ కె మణికంఠ, సీఐ కె.సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్ -
పత్తిలో పూత రాలడాన్ని నివారించాలి
కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె.వీరయ్య చౌదరి ప్రత్తిపాడు: పత్తిలో పూత రాలడాన్ని నివారించే దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి సూచించారు. మండల పరిధిలోని పెదగొట్టిపాడులో గురువారం ఓ పత్తి పొలంలో పొలంబడి నిర్వహించారు. స్థానిక మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణా బేగంతో కలిసి వీరయ్య చౌదరి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధిక తేమ కారణంగా పత్తిలో పూత రాలడంతో పాటు పలు తెగుళ్లు, పురుగులను గమనించారు. నివారణకు తీసుకోవలసిన చర్యలను రైతులకు వివరించారు. పూత రాలడాన్ని నివారించేందుకు ఎకరానికి కేజీ 19–19–19 లేదా 13–0–45 పిచికారీ చేయాలని సూచించారు. పంటలో అక్కడక్కడా పచ్చ దోమ కూడా ఉందని, నివారణకు ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ఎం.ఎల్. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అల్లిక రెక్కల పురుగు వంటి మిత్ర పురుగులను కూడా అధికంగా గమనించామని, ప్రస్తుత పరిస్థితుల్లో పురుగు మందులను ఎక్కువగా వాడనవసరం లేదని సూచించారు. అధిక వర్షాలకు సోకుతున్న ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్, కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్ఏ షణ్ముఖ్, రైతులు పాల్గొన్నారు. -
ముందస్తు పంటగా సజ్జసాగు ఎంతో మేలు...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న, శనగ, జ్యూట్ సాగు చేసే రైతులు ముందస్తు పంటగా సజ్జ వేస్తే అధిక దిగుబడి, ఆదాయం, ఆరోగ్యం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. జిల్లాలో రబీలో 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 25 వేల ఎకరాల్లో శనగ సాగవుతున్నాయి. అలాగే జాలాది గ్రామంలో 25 ఎకరాల్లో ఏబీవీ–04 రకం సజ్జ సాగు చేయగా, పక్షం రోజుల్లో కోతకు రానుంది. ఎకరానికి 14–16 క్వింటాళ్ల దిగుబడి అంచనా. ఈ రకం నల్లరేగడి మెట్ట ప్రాంతాలు సాగుకు అనుకూలం. – డాక్టర్ ఎం. నగేష్. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, పల్నాడు జిల్లా -
ముమ్మాటికీ కూటమి హత్యలే !
గుంటూరు రూరల్: తురకపాలెంలో మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామాన్ని బుధవారం వైఎస్సార్ సీపీ నేతలు సందర్శించారు. అంతుచిక్కని వ్యాధితో అకాల మరణాలకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంకా జ్వరం, శరీరంపై గడ్డలతో బాధపడుతున్న బాధితుల ఇళ్లకు వెళ్లి మనోధైర్యాన్ని కల్పించారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు వైద్యుల బృందం బాధితుల రిపోర్టులు పరిశీలించి వైద్య సలహాలను అందించింది. గ్రామస్తులను పలకరించి వారి సమస్యలు, సంఘటనలు జరిగిన తీరును నాయకులు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం కూటమి ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని, నిర్లక్ష్యాన్ని విడనాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నినాదాలు చేశారు. గ్రామస్తులను సామాజిక బహిష్కరణ చేయడం సబబుకాదని నినాదాలు చేశారు. -
విద్యుత్ విజిలెన్స్ విస్తృత తనిఖీలు
● నరసరావుపేట మండలంలో 4219 సర్వీసులు పరిశీలన ● రూ.5.66లక్షల అపరాధ రుసుము విధింపు నరసరావుపేట: విద్యుత్ పంపిణీ విభాగంలోని డీ–3 సెక్షన్లో 4219 సర్వీసులు తనిఖీ చేసి రూ.5.66లక్షల అపరాధ రుసుం విధించినట్లు విద్యుత్ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం అధికారులు వెల్లడించారు. బుధవారం బరంపేటలోని విద్యుత్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జిల్లా పర్యవేక్షక ఇంజినీరు డాక్టర్ పి.విజయకుమార్ ఆధ్వర్యంలో నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు, చింతలపాలెం, అర్వపల్లి, అల్లూరివారిపాలెం, అచ్చంవారిపాలెం, గోనెపూడి, దొండపాడు, ఇక్కుర్తి, జొన్నలగడ్డ, కాకాని, కేశానుపల్లి, కోటప్పకొండ, కొత్తపాలెం గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేశామని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్ఏ కరీమ్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సీహెచ్ రాంబొట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 53 మంది అధికారులు, 159మంది సిబ్బంది 53 బృందాలుగా ఏర్పడి సర్వీసులను తనిఖీ చేశారన్నారు. మీటరు లేకుండా డైరెక్ట్గా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 24మందిని గుర్తించి వారి వద్ద నుంచి రూ.35వేలు, మీటరు ఉన్నా చౌర్యానికి పాల్పడుతున్న తొమ్మిది మంది వద్ద నుంచి రూ.1.30లక్షలు, అనుమతించిన కేటగిరీ కాకుండా ఇతర కేటగిరీలలో విద్యుత్ వాడుతున్న ఐదుగురికి రూ.47వేలు, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుకుంటున్న 81మందిపై రూ.3.54లక్షలు అపరాధ రుసుం విధించామన్నారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, చౌర్యానికి పాల్పడుతున్న వారి గురించి 94408 12263, 86397 41050 నెంబర్లకు నేరుగా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచటం జరుగుతుందని వెల్లడించారు. ఈ దాడుల్లో ఆపరేషన్ విభాగ డీఈఈ జీఎల్వీ ప్రసాదరావు, విజిలెన్స్ డీఈఈ ఎస్.శ్రీనివాసరావు, కె.రవికుమార్, ఎన్.మల్లికార్జునప్రసాదు, ఆపరేషన్ విభాగ ఏఈ కె.రాంబాబు, విజిలెన్స్ విభాగం ఏఈఈలు కె.కోటేశ్వరావు, ఎం.సతీష్కుమార్, యు.శివశంకర్ పాల్గొన్నారు. -
తల్లి మందలించటంతో బాలిక బలవన్మరణం
సత్తెనపల్లి: తల్లి మందలించటంతో మనస్థాపం చెంది బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం గండ్లూరు గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన బర్లా మంజుల, స్వామిలకు ముగ్గురు సంతానం. కుటుంబ కలహాలతో 13 ఏళ్ల క్రితం వీరు విడిపోవడంతో మంజుల ముగ్గురు పిల్లలతో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ జీవించసాగింది. సుమారు ఏడు సంవత్సరాల క్రితం మియాపూర్ జీహెచ్ఎంసీ ఏరియాలో ఉంటూ పెయింట్ పని చేసుకుంటున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూ రు గ్రామానికి చెందిన వంగిపురపు యేసయ్యతో పరిచయమై వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిగిన ముగ్గురు సంతానంలో కుమారుడు బర్లా దుర్గాప్రసాద్ గొడవల కేసులో చిక్కుకొని మియాపూర్ జువెనల్ హోమ్లో ఉన్నాడు. రెండవ కుమార్తె బర్లా సోనాలి అలియాస్ పింకి(15), మూడవ కుమారుడు బర్ల సాహితీలు తల్లి, మారు తండ్రితో జీవిస్తున్నారు. ఈక్రమంలో ఆమె తన రెండో భర్తతో కలిసి సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి వచ్చి కూతవేటు దూరంలోని గండ్లూరు జగనన్న కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14న కుమార్తె సోనాలి సత్తెనపల్లిలో ఓ కొత్త సినిమాకు తీసుకు వెళ్లమని తల్లి మంజులను కోరడంతో మంజుల సిని మాలు, షికార్లు వద్దంటూ మందలించింది. దీంతో మనస్థాపం చెందిన సోనాలి ఇంట్లో బెడ్రూమ్లోనికి వెళ్లి తలుపులు గడియ పెట్టి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అలిగి పడుకుందనుకున్న కుమార్తె సోనాలిని సుమారు అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో మంజుల తలుపు కొట్టి పిలవగా ఎంతసేపటికీ తీయకపోవడంతో తలుపురంధ్రం నుంచి చూడగా కాళ్లు వేలాడుతుండటంతో రాత్రి పూట పెయింట్ పనికి వెళ్లిన భర్త యేసయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో యేసయ్య, అతని బావమరిది చింతపల్లి సుబ్బారావులు వచ్చి 3:30 గంటల సమయంలో వీడియో తీస్తూ తలుపులు పగలగొట్టి ఉరి వేసుకున్న మృతురాలు సోనాలిని కిందకు దించారు. సంఘటనా స్థలానికి సత్తెనపల్లి టౌన్ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, సత్తెనపల్లిరూరల్ పోలీసులు సందర్శించి మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లలిత సంగీత సరస్వతి
తెనాలి: బాలసరస్వతి స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని బాపట్ల. 1928 ఆగస్టు 28న జన్మించారు. తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారథిరావు. లలిత కళలపై అభిమానం కలిగిన తండ్రి సితార, వీణ వాయించేవారు. గుంటూరులో రత్నా థియేటర్ పేరుతో సినిమాహాలు నిర్మించారు. థియేటరులో ప్రదర్శించే ఏదైనా సినిమాలో సంగీతానికి తగినంత ప్రాధాన్యం లేదని అనిపిస్తే, వెంటనే ఆ సినిమా ప్రదర్శన నిలిపివేసి, అందుబాటులో ఉన్న నాటక సమాజాన్ని పిలిపించి, పద్యనాటకం వేయించారు. అంతటి సంగీతాభిమాని ఆయన. కాలక్రమంలో వ్యాపారం దెబ్బతిని, థియేటర్ మూతపడింది. వారసత్వంగా ... తండ్రి వారసత్వం అన్నట్టుగా బాలసరస్వతికి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. అక్క, అన్నయ్య చక్కగా చదువుకుంటున్నా తండ్రితోపాటు నాటకాలు చూడ టం, వాటిలోని పాటలు గానం చేయటం అలవాటైంది. అప్పట్లో గుంటూరులో హెచ్ఎంవీ (హిజ్ మాస్టర్స్ వాయిస్) గ్రామఫోను కంపెనీ ఆఫీసుండేది. పార్థసారిథిరావుకు పరిచయస్తులు. ఓసారి బాలసరస్వతిని పిలిపించి, ట్రైనింగ్లా పాడమన్నారు. బాగుండటంతో బెంగళూరులో రికార్డు చేశారు. ఆ విధంగా 1934లో ఆరేళ్ల వయసులో సోలో రికార్డు పాడిన ఘనతను బాలసరస్వతి దక్కించుకున్నారు. మైకు అందేంత ఎత్తు లేకపోవటతో సినీనటుడు సత్యం సోదరుడు కామేశ్వరరావు ఎత్తుకోగా, ఆమె ఆ పాట పాడారు. శ్రోతలను ఆకట్టుకునేలా.. అంతకుముందు 1941లో రేణుకావారి ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో బీఎన్ఆర్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘తిన్నెమీద చిన్నోడా’ పాట బాలసరస్వతి తొలి ప్లేబాక్ పాట. సుతిమెత్తగా, చక్కని భావప్రకటనతో, ప్రత్యేకమైన పాడే విధానంతో శ్రోతలను ఆకట్టుకుని మనసు లోతుల్లోకి ప్రవహించే అమృతధారగా పాటను మార్చుకున్న ప్రతిభాశాలి బాలసరస్వతి. ‘స్వప్నసుందరి’లో కథానాయిక కోసం పాడినా, ‘దేవదాసు’లో ద్వితీయ నాయికకు గానం చేసినా ఆమె తనకు తానే సాటిగా నిలిచారు. సినిమాలకు పాడుతూనే ఎస్.రాజేశ్వరరావు, బాలసరస్వతి కలిసి‘ లలిత సంగీతం’ పేరిట, తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త విభాగాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణిలో వీరిద్దరూ పాడే లలిత గీతాలు లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించారు. 1946లో సింహళ చిత్రం ‘లైలా మజ్నూ’కు సంగీతం సమకూర్చారు. తాను సోలోగా పాడిన ప్రైవేటు గీతాలకు స్వయంగా సంగీతబద్దం చేసుకుంటూ వచ్చారు. 1974లో భర్త మరణం, దివాణాలు, వైభవాలు అంతరించటంతో చైన్నె, తర్వాత మైసూరు, బెంగళూరులో ఉంటూ 1995లో హైదరాబాద్లో స్థిరపడ్డారు. భూములు పోయినా నష్టపరిహారం అందలేదు. మైసూరు నుంచి హైదరాబాద్ వస్తే సాంస్కృతిక శాఖలో ఉద్యోగం ఇస్తామన్న ఎన్టీ రామారావు ఆహ్వానంపై ఇక్కడికి వచ్చేసరికి రాకీయాలు మారిపోయాయి. 2015లో గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ బాలసరస్వతిని విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించి రూ.లక్ష నగదు, రజత జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ‘నిండుపున్నమి పండువెన్నెల’ పేరుతో అభినందన సంచికను విడుదల చేశారు. తొలి అడుగులు గుంటూరులోనే.. బాలగాయనిగా ఇక్కడి నుంచే సినీప్రస్థానం గతంలో విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం ఆ సమయంలో అక్కడే ఉన్న సుప్రసిద్ధ దర్శకుడు సి.పుల్లయ్య, తన ‘సతీఅనసూయ–భక్త ధృవ’ సినిమాలో బాలనటిగా తీసుకున్నారు. అందులో గంగ పాత్రలో నటిస్తూ బాలసరస్వతి పాడిన పాట ‘ఏదీ దారి నాకిచట’ ఆ రోజుల్లో పెద్ద హిట్. కోల్కతాలో ఈ షూటింగ్ జరుగుతుండగా, అక్కడే చిత్రీకరిస్తున్న తమిళ చిత్రం ‘భక్తకుచేల’లో రెండు పాత్రలు ఇచ్చారు. మొదటి భాగంలో చిన్న కృష్ణుడు, రెండో భాగంలో కుచేలుని కూతురు పాత్రలో పోషించారు. అందులో పాటలు కూడా తానే పాడారు. తర్వాత ‘బాలయోగిని’ తమిళ సినిమాలో టైటిల్ రోల్ తనదే. అప్పటివరకు సరస్వతిగా ఉన్న ఆమె పేరుకు ముందు ‘బాల’ అని అప్పుడే కలిపారు. తన సినిమాల్లోని పాటలు, బయట కచేరీల్లో పాడుతూ బహుమతులను అందుకుంటూ వచ్చారు. బాలయోగిని సినిమా తర్వాత చైన్నెలో సెటిలయ్యారు. బాలనటిగా ‘తుకారం’ (1937), ‘మహానంద’, ‘తిరునీలంకర్’ (1939) సినిమాల్లో నటించాక, 1940లో ఇందిరా వారి ‘ఇల్లాలు’ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి నటించారు. వరుసగా సినిమాల్లో నటిస్తుండగానే 1944లో తూర్పుగోదావరి జిల్లా కోలంక జమీందారు రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావుతో వివాహమైంది. దీనితో నటనకు స్వస్తిపలికి, పాటలకే పరిమితమయ్యారు. -
రాగి తీగ దొంగలు అరెస్టు
నరసరావుపేట టౌన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాగి తీగెల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.హనుమంతరావు వెల్లడించారు. బుధవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు సుమారు ఒక ఏడాది కాలం నుంచి బొల్లాపల్లి, ఐనవోలు, ఈపూరు, వినుకొండ, రాజుపాలెం, నకరికల్లు, అచ్చంపేట, చిలకలూరిపేట రూరల్ ప్రాంతాలలో సుమారు 20 కేసుల్లో 30 ట్రాన్స్ఫార్మర్ల నుంచి 110 కేజీల కాపర్ వైర్ చోరీ చేశారన్నారు. ఈ మేరకు బొల్లాపల్లి, రేమిడిచర్ల సెక్షన్ ఏపీ సీపీడీసీఎల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కేసును ప్రతిష్టాత్మక తీసుకున్న ఎస్పీ కృష్ణారావు తన ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటంతో నిందితులైన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తన్నీరు నరసింహారావు, బొల్లాపల్లికి చెందిన గోగు నరసింహారావు, వినుకొండ మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన ధూపాటి చిన్న బాలలింగయ్య, నరసరావుపేట పట్టణంలోని యానాది కాలనీకి చెందిన తిరువీధుల శ్రీకాంత్, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామానికి చెందిన మేఘావత్తు శ్రీను నాయక్, నూజెండ్ల మండలం తల్లార్లపల్లి గ్రామానికి చెందిన తాటిపర్తి నాగిరెడ్డిలు దుర్వ్యసనాలకు లోనై చోరీలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిని బుధవారం ఈపూరు మండలం వడ్డంకుంట అడ్డరోడ్డు, బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామాలలో బండ్లమోటు ఎస్ఐ సిబ్బందితో అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో వినుకొండ రూరల్ సీఐ, బండ్లమోటు ఎస్ఐలు పాల్గొన్నారు. ఐదుగురు నిందితుల నుంచి 110 కిలోల రాగి తీగ స్వాధీనం -
అధికారులు స్పందించ లేదు
రెండు నెలల కిందట నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులకు తగ్గింది. తరువాత శరీరంపై గడ్డ వచ్చింది. వెంటనే గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి డ్రస్సింగ్, ఆరు నెలల పాటు పరిశీలనలో ఉండాలని చెప్పారు. గతంలో మా గ్రామానికి బోరు పని చేయకపోవడంతో క్వారీ గుంత నుంచి అందించారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రతి రెండు రోజలకు ఒక సంఘటన జరుగుతూనే ఉంది. నాకు చికిత్సలకే రూ. 5 లక్షలు ఖర్చయింది. – మెట్టు నాగిరెడ్డి, గ్రామస్తుడు -
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధే లక్ష్యం
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లా పరిధిలో పరిశ్రమల ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి, శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ డ్రైవ్లో భాగంగా విస్తృత కార్యక్రమాలు ప్రారంభించినట్లు కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ డ్రైవ్ పోస్టర్ను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 15 నుంచి నవంబర్ 15 వరకు పరిశ్రమల్లో మౌలిక సదుపాయాల ఆధునీకరణ, స్థిరమైన అభివృద్ధి చర్యలు, పరిశ్రమలు – పెట్టుబడుల ప్రోత్సాహ కార్యక్రమాలు, శుభ్రత – పారిశుద్ధ్య డ్రైవ్తో పాటు మొక్కల నాటనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శుభ్రమైన పారిశ్రామిక వాడల స్థాపన, పెట్టుబడిదారుల సహకారం ద్వారా పరిశ్రమల వృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి, పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. బాపట్ల: రైతు బజార్లో రైతులు పంటలు విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్శాఖ ఏడీ కారుమూరి రమేష్బాబు ఆదేశించారు. స్థానిక రైతు బజార్ని బుధవారం తనిఖీ చేశారు. మౌలిక వసతులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆయన వెంట రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఘట్రాజు ఫణీంద్ర ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేం
నా భార్యకు నెల రోజుల కిందట శరీరంపై గడ్డ వచ్చింది. ప్రభుత్వాసుపత్రికి వెళితే పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాం. వేలకు వేలు ఖర్చవుతున్నాయి. జ్వరం రెండు రోజలు తగ్గుతుంది.. మరలా వస్తోంది. డాక్టర్లే ఇది అప్పుడే తగ్గదు టైం పడుతుంది అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేక పోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక పోడంతో మా గ్రామస్తులు చనిపోయారు. – నక్కా నాగేశ్వరరావు గ్రామస్తుడు -
జనార్దనరావు వీడియో వెనుక ప్రభుత్వ పెద్దలు
ఒంగోలు సిటీ: కుటీర పరిశ్రమల్లా నకిలీ మద్యం తయారుచేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా వైఎస్సార్ సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న కుట్రలు పరా కాష్టకు చేరాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్కు ప్రమేయం ఉందంటూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. దానిపై ఎల్లో మీడియా రెచ్చిపోతూ, నిన్న సాయంత్రం నుంచే ట్రోల్స్ చేస్తోందన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా కక్ష సాధింపులకు పాల్పడడం, కేసు నుంచి తాము బయట పడేందుకు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం చంద్రబాబు చేసిన కుట్ర అని దుయ్యబట్టారు. ‘అసలు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అద్దేపల్లి జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? పైగా తన ఫోన్ పోయిందని చెప్పినట్లు ఎల్లో మీడియాలోనే వచ్చింది. అలాగే ఏ కేసులో నిందితుడైనా, ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు ఏదైనా చెప్పాల నుకున్నప్పుడు నిలబడి, చేతులు కట్టుకుని మాట్లాడతారు. కానీ నిన్న జనార్దన్రావు లీక్ చేసిన వీడియోలో ఆయన చైర్లో కూర్చుని ఉన్నాడు. పక్క నుంచి ఎవరో ప్రామ్ట్ చేస్తునట్లుగా ఉంది. పైగా తను ఆఫ్రికా నుంచి వచ్చినప్పటి డ్రెస్తోనే ఉన్నాడు. మరి ఆ వీడియో ఎప్పుడు, ఎవరు, ఎవరి ఫోన్లో రికార్డు చేశారు? ఇదంతా చూస్తుంటే, ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర మాదిరిగా కనిపించ డం లేదా’ అని వరికూటి ప్రశ్నించారు. ఆ వీడియో ను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అన్నది తేలాలన్నారు. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొన్నా రు. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. జనార్దనరావు గత వారం ఆఫ్రికా నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడని, నకిలీ మద్యం తయారీలో పార్టీ, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని, తామే ఆ పని చేశామని చెప్పు కొచ్చాడన్నారు. ఆ రోజే మరి నిజంగా జోగి రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని, రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారుచేసిన విషయాన్ని ఆ వీడియోలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సన్నిహితుడే.. కేసులో ఏ–1 నిందితుడైన జనార్దనరావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడేనని, 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దనరావు అక్కడే ఉన్నాడన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటా రు. జనార్ధనరావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతమన్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా జనార్దనరావుకు రమేష్ సన్నిహితుడన్న వాదన అవాస్తవం. -
నియమాలు పాటిస్తే ప్రతి ఇంట్లో వెలుగులు
అందరి ఇళ్లలో వెలుగులు నింపే పండుగ దీపావళి. పండుగ రోజు సంతోషంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటించకుంటే ఆ ఇంటిలో సంతోషం కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్.శ్రీధర్ కొన్ని సూచలను చేశారు. నరసరావుపేటటౌనన్్: జాగ్రత్తలు పాటించి సంతోషమైన దీపావళి జరుపుకోవాలని పల్నాడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్. శ్రీధర్ అన్నారు. రానున్న దీపావళి పండగను పురస్కరించుకొని హోల్సేల్, తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరవుతున్న నేపథ్యంలో వ్యాపారులు, ప్రజలు పాటించాల్సిన భద్రత చర్యలను జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ‘సాక్షి’తో పంచుకున్నారు. లైసెన్స్ పొందే విధానం.. వ్యాపారి స్టాల్ ఏ ప్రదేశంలో పెడుతున్నారు? అక్కడ ప్రజల నివాసాలు, వ్యాపార సముదాయాలు తదితర విషయాలను సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తాం. ఆ తర్వాత ఆర్డీవో లైసెన్స్ మంజూరు చేస్తారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దుకాణాల ఏర్పాటు కోసం లైసెన్స్లు పొందిన వారు తక్కువ. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి పట్టణాలు ఉన్నాయి. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా సుమారు 130 మంది తాత్కాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం 100 మంది దరఖాస్తు చేశారు. నరసరావుపేట పట్టణంలో గత ఏడాది 40 మంది లైసెన్స్ తీసుకుంటే ఈ ఏడాది 27 మంది మాత్రమే ముందుకొచ్చారు. లైసెనన్స్ పొందిన దుకాణదారులు ఈ నెల 19, 20, 21 తేదీల్లో మాత్రమే మందులు విక్రయించాలి. షాపుల ఏర్పాటులో నిబంధనలు ఇలా... స్టాల్స్ ఏర్పాటు చేసేటప్పుడు తగలబడే స్వభావం లేని మెటీరియల్తో దుకాణాలు నిర్మించుకోవాలి. బహిరంగ ప్రదేశాలలో షాపు ఉండేలా చూసుకోవాలి. షాపుకి, షాపుకి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి. పెట్రోల్ బంకుకు 15 మీటర్ల దూరంలో స్టాల్స్ పెట్టుకోవాలి. స్టాల్స్ ఉన్న ప్రదేశంలో పొగతాగటం నిషేధం. ప్రతి షాపు వద్ద రెండు బక్కెట్లలో నీరు, రెండు బక్కెట్లలో ఇసుక ఉంచుకోవాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. దీపావళి పండుగ ప్రతి ఇంటిలోనూ కొత్త వెలుగులు నింపాలంటే కొద్దిపాటి మెలకువలు పాటించాలి. మన అజాగ్రత్త మరొకరికి బాధగా మారకూడదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వెలుగుల పండగను జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ భద్రత నియమాలను పాటిస్తే దీపావళి పండుగ ప్రతి ఇంట్లో వెలుగు నింపుతుందని డీఎఫ్వో వివరించారు. -
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. టిఫిన్ బండి వద్ద ఉన్న వ్యక్తిపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసి దుండగుడు హతమార్చాడు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్ బుజ్జి (60) గ్రామంలోని తమ సామాజిక వర్గంలో పెద్దగా ఉన్నాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గండికోట దుర్గ తెనాలి చెంచుపేటలోని ఎమ్మెల్యే బజారులో ఉంటోంది. బుజ్జి పది రోజుల క్రితం కుమార్తె వద్దకు వచ్చాడు. బైక్పై టిఫిన్ బండి వద్దకు మంగళవారం ఉదయం వెళ్లాడు దోశలు ఆర్డరిచ్చి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంతలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో తిరుపతిరావుపై దాడి చేసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడని, హత్యానంతరం తన వాహనంపై వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. సాంబశివరావు, ఎస్ఐ కరిముల్లా తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణమేంటి? పాత కక్షలు, ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కోరుతాడిపర్రు గ్రామంలో ఆలయానికి సంబంధించిన నగదు పాట నిర్వహించడం, ఆలయ వ్యవహారాల పర్యవేక్షణ వంటివి బుజ్జి చూస్తుంటాడు. అమృతలూరు సొసైటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆలయ వ్యవహారం ఏళ్లుగా ఒక్కరే చూడాలా అంటూ గ్రామానికే చెందిన అల్లుడు వరుస అయ్యే వ్యక్తి ఇటీవల బుజ్జితో వాగ్వాదానికి దిగాడని, అలాగే తన తండ్రి మృతికి తిరుపతిరావు కారణమంటూ గతంలో ఘర్షణ పడ్డాడని తెలుస్తోంది. అతనే ఈ హత్య చేసి ఉంటాడని అటు గ్రామస్తులు కూడా భావిస్తున్నారు. మరో వైపు తిరుపతిరావు మనవరాలికి ఆమె భర్తకు మధ్య కుటుంబ కలహా లు ఉన్నాయి. మూడు రోజులుగా తెనాలి చెంచుపేటలో ఈ పంచాయితీ వ్యవహారం నడుస్తోంది. కుటుంబ కలహాలకు తిరుపతిరావే కారణమని, అతడిని హతమారిస్తే కలహాలు ఉండవంటూ మనవరాలి భర్త సోమవారం రాత్రి హెచ్చరించాడని చెబుతున్నారు. గ్రామంలో ఆధిపత్య పోరులో అల్లుడి వరుస అయ్యే వ్యక్తి లేదా మనవరాలి భర్త ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిద్దరూ ఒక్కటై హత్య చేసి ఉంటారనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒడిశాలో ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జరిగిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గుంటూరుకు చెందిన ఎస్కే రోషన్ రజత పతకం సాధించాడు. అండర్ 20 యూత్ విభాగంలో 110 మీటర్ల హర్డల్స్లో ఈ పతకాన్ని సాధించాడని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోషన్ను ఏపీ రెరా సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అభినందించారన్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ కూడా బాగు చేయాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తే మరింత మంది రాణిస్తారని ఆకాంక్షించారు. రోషన్ను కోచ్ రామకృష్ణ, కె.రవి, కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, ఎస్కే మన్సూర్ వలి తదితరులు అభినందించారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. అతని వద్ద 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ కథనం మేరకు.. సెప్టెంబర్ నెలలో రైళ్లలో బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగుల చోరీలపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణలు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన మూల్పూరి ఫణేంద్ర కుమార్ను నిందితుడిగా గుర్తించారు. గతంలో రైళ్లు, స్టేషన్లలో ఇతడు నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నిందితుడు మంగళవారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం వీధిలో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.68 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
సాగులో సాంకేతికతపై పట్టు సాధించాలి
రేపల్లె: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటంపై పట్టుసాధించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ సహాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి అన్నారు. సాగులో సాంకేతికత వినియోగంపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో మండలంలోని పేటేరు వ్యవసాయ సహాయ కేంద్రంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్ర పరికరాలు వస్తున్నాయని, వీటితో సమయం, డబ్బులు ఆదా అవుతాయని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.ఏడుకొండలు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే మినీ రైస్ మిల్, అపరాల పంటల విధానాలు, వివిధ రకాల నూనె గింజల నుంచి నూనె తయారు చేసే విధానాలను వివరించారు. డాక్టర్ వాసుదేవ మాట్లాడుతూ సోలార్ డ్రైయర్ పనితీరు, దీని ఉపయోగంతో పాటు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ద్వారా రైతులు పంటకు విలువ జోడించి అధిక ఆదాయం పొందే మార్గాలను సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సందీప్, ఏఓ మహేష్బాబు, వీఏఏ రాయల్బాబు, రైతులు, బాపట్ల పోస్ట్ హార్వెస్టర్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం
చిలకలూరిపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో రచ్చబండ ద్వారా సంతకాల సేకరణ కార్యక్రమానికి సోమవారం రాత్రి శ్రీకారం చుట్టారు. ముందుగా ఆమె సంతకం చేసి ప్రజలతో కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు చేయించారు. రజిని మాట్లాడుతూ రచ్చబండ ద్వారా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడదామని తెలిపారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ గ్రామ స్థాయి వరకు ప్రజాఉద్యమం ప్రారంభించిందని వెల్లడించారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్యకళాశాలల నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఇందుకు విరుద్దంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల నాణ్యమైన వైద్యం, వైద్య విద్య దూరం చేసేలా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టి తనకు ఏ మాత్రం పేదల పట్ల ప్రేమ లేదని చాటు కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాసంఘాలతో కలసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట మండల అధ్యక్షుడు దేవినేని శంకరరావు, ఉపాధ్యక్షుడు కొమ్మనబోయిన హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు షేక్ దరియావలి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, మానుకొండ శేషిరెడ్డి, బొల్లు శ్రీకాంత్, గ్రామ ఉపసర్పంచ్ కొమ్మనబోయిన రామకృష్ణరాజు, శ్రీను, పార్టీ గ్రామ అధ్యక్షుడు బొట్టు సోమయ్య, ఎద్దు అశోక్, చెంచు రాముడు, గోగు ముక్కంటి, అందె శ్రీనివాసరావు, ఆరుమళ్ల నాగేశ్వరరావు, మురికిపూడి కృష్ణ, షేక్ నూర్ అహమ్మద్, యలమంద, మైలా రాజేష్, బండారు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
25న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సభ
తెనాలి: పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో లీటరుకు రూ.8–10 ప్రోత్సాహకధర ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన తెనాలిలో సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి కోరారు. తెనాలిలో మంగళవారం పాడిరైతులతో కలసి మహాసభ ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెనాలి అయితానగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కల్యాణమండపంలో 25న ఉదయం 10 గంటలకు మహాసభ జరుగుతుందని తెలిపారు. గేదెపాలు లీటరుకు రూ.40, ఆవు పాలు రూ.20కు మించి డెయిరీల్లో ధర రావటం లేదన్నారు. పాడి పశువులకు బీమా మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించాలని తెలిపారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని సంఘం జిల్లా నాయకురాలు వేజెండ్ల తబిత కోరారు. తెనాలి శాంతకుమారి, మాన్యం పద్మ, ఎల్లమాటి మేరమ్మ, కె.శకుంతల ఎ.సరోజిని, టి.నిర్మల, సంతోషం, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
జీవన ఎరువులే పంటకు జీవం
యడ్లపాడు: ప్రతి పంటకు జీవం జీవన ఎరువులేనని పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ అన్నారు. జీవన ఎరువుల ప్రాముఖ్యతపై జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా మంగళవారం యడ్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యగోపాల్తో కలసి ఆయన పాల్గొన్నారు. నగేష్ మాట్లాడుతూ జీవన ఎరువుల వినియోగం వల్ల దాదాపుగా 25 శాతం రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఇవి భూసారాన్ని పెంపొందించి, పంటలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని, నాణ్యతతో కూడిన దిగుబడిని సాధించవచ్చని తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యగోపాల్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా తయారయ్యే జీవన ఎరువులు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని వివరించారు. గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పంటకు అందుబాటులోకి తేవడం, భూమిలో అందుబాటులో లేని భాస్వరం, పొటాష్ పోషకాలను మొక్కకు అందుబాటులోకి తేవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో జీవన ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి హేమలతాదేవి, అభ్యుదయ రైతు పోపూరి శివరామకృష్ణ, జగ్గాపురం, యడ్లపాడు గ్రామాల్లోని విద్యార్థినులు పి గాయత్రి, ఎ బేబీవిజయశ్రీ, సీహెచ్ కీర్తిశ్రీనిధి, జ్యోత్న్స, ఎ జోషితశ్రేయ, చాందిని, భాగ్యశ్రీ, ఎం జ్యోత్న్స, డి భువనేశ్వరీ, ఎన్ హర్షిత, కె హర్షిత, ఎండీ హమిద పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి
నరసరావుపేట: ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తు ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించి తద్వారా దేశ ఆర్థిక స్వావలంనలో పాలుపంచుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆత్మ నిర్భర్ భారత్ కోస్తా ఆంధ్ర కన్వీనర్ కోడూరి అశోక్రాజు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ అధ్యక్షతన మంగళవారం నరసరావుపేట సత్తెనపల్లి బస్టాండ్ సెంటర్లోని విజయ్కుమార్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మ నిర్భర్ భారత్ జిల్లా కార్యశాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ అనంతరం ఆత్మనిర్భర్ భారత్ కోసం రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ కేటాయించి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా స్థానిక వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించారని అన్నారు. ప్రస్తుతం నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి అతిత్వరలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ దేశాన్ని జగద్గురువుగా అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నంలో ప్రజలను భాగస్వాములను చేసే విధంగా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షత వహించిన శశికుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో స్వదేశీ ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యం నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్కు ఉందని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆత్మనిర్భర్ కార్యక్రమ జిల్లా కన్వీనర్ శెట్టి హనుమంతరావు సమావేశంలో పాల్గొన్న సభ్యులచే స్వదేశీ వస్తు ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిజ్ఞ చేయించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రరెడ్డి. జిల్లా ఇన్ఛార్జి కొక్కెర శ్రీనివాస్, జిల్లా పదాధికారులు, మండల నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, మండల త్రిసభ్య కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ కన్వీనర్ అశోక్రాజు -
ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాలు సకాలంలో పూర్తిచేయండి
నరసరావుపేట: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయం నుంచి ఎయిడ్స్ నియంత్రణ చర్యలపై జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీటి, ఏఆర్టీ, డీఎస్ఆర్సీ, లింక్ ఏఆర్టీ, టీఐ, ఎన్జీఓఎస్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం పరీక్షలు పెంచాలని, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. హెచ్ఐవీ నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరిని ఏఆర్టీకి లింక్ చేయాలని, ఆయా కేంద్రాల ద్వారా హెచ్ఐవీ ఉన్న వారికి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి పేషెంట్కు ఏఆర్టీ కేంద్రాల ద్వారా పెన్షన్కు దరఖాస్తు చేయాలని, ఆయా కేంద్రాలలో ఎల్ఆఫ్యూ కేసులను కూడా తగ్గించాలని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీబాషా, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ చైతన్య, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కిరణ్, టెక్నికల్ ఎక్స్ఫర్ట్ శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత -
సీపీఆర్పై అవగాహన అవసరం
గుంటూరు ఎడ్యుకేషన్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జేవీ సుధీర్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల, బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ డిగ్రీ మహిళా కళాశాలలో అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ జేవీ సుధీర్కుమార్ మాట్లాడుతూ సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని గుర్తుచేశారు. దేశంలో ఒక్క శాతం మందికి సైతం ఇది తెలియకపోవటం దురదృష్టకరమన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కౌసల్యాదేవి, టీజేపీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి, రెడ్క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, అధ్యాపకులు పద్మజ, రెడ్ క్రాస్ సిబ్బంది పెరుమాళ్లు గౌరీశిరీష పాల్గొన్నారు. -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 152 అర్జీలను జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా అధికారులతో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తి, రీఓపెన్ కాకుండా అర్జీల పరిష్కారతీరు ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు పరిష్కారం కోసం పంపాలని కలెక్టరు సూచించారు. -
మూడేళ్ల నాటి కేసులో వేధింపులు
నరసరావుపేట రూరల్: అక్రమ కేసులతో విద్యార్థినులను క్రోసూరు పోలీసులు వేధిస్తున్నారని ఓ మహిళ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆస్తి, ఆర్థిక తగాదాలు, మోసాలు తదితర సమస్యలపై 117 ఫిర్యాదులు అందాయి. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు క్రోసూరు ఎస్సీ కాంప్లెక్స్లో దుకాణాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను స్థానిక పోలీసులు పాటించడం లేదని క్రోసూరుకు చెందిన సీహెచ్ హానీ గ్లాడెన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మూడుసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా కలెక్టర్ ఆదేశాలను ఎస్ఐ అమలు చేయడం లేదన్నారు. దుకాణంపై వచ్చే ఆదాయమే తనకు జీవనాధారమని తెలిపారు. టీడీపీ నాయకుల అండతోనే తన దుకాణాన్ని ఆక్రమించుకుంటున్నట్టు బాధితురాలు తెలిపారు. అప్పు తీరినా తనఖా కాగితాలు ఇవ్వడం లేదు అప్పు మొత్తం చెల్లించినా ఇంటి తనఖా కాగితాలు ఇవ్వడం లేదని వినుకొండకు చెందిన కంచర్ల కోటేశ్వరమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లారీని కొనుగోలు చేసేందుకు ఎండ్లూరి అరుణ వద్ద రూ.5.75లక్షలు అప్పుగా తీసుకుని ఇంటిని తనఖా పెట్టామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్లో అప్పు మొత్తం చెల్లించి తనఖా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని ఒరిజనల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వమని అడగ్గా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు ఇవ్వకుండా వేధింపులు.. మంజూరైన ముద్ర రుణం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రెంటచింతలకు చెందిన ఎర్రపాటి లక్ష్మీరాజ్యం ఫిర్యాదు చేసారు. తుమ్రకోట యూనియన్ బ్యాంక్లో తనకు రూ.5.60లక్షలు ముద్ర లోన్ మంజూరైందని, ఈ నగదును బి.శ్యామ్రాజు అనే వ్యక్తి కంపెనీ అకౌంట్లో పడినట్టు పేర్కొన్నారు. ఇందులో రూ.3లక్షలు ఇచ్చి మిగిలిన నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నగదు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఆన్లైన్లో మహిళ మోసం చేసింది.. రైస్ బిజినెస్లో పెట్టుబడి పెడితో మూడు నెలల్లో డబుల్ వస్తుందని ఆన్లైన్ మహిళ చెప్పిన మాటలు నమ్మి మోసపోయినట్టు శావల్యాపురం మండలం మతుకుమల్లికి చెందిన ఎర్రగుంట సంపంగిరావు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ మార్కెట్ పరిశీలిస్తుండగా లావణ్య అనే మహిళ పరిచయమైందని, రైస్ బిజినెస్లో మూడు నెలల్లో పెట్టుబడికి డబుల్ వస్తుందని చెబితే రూ.7లక్షలు తన అకౌంట్కు చెల్లించినట్టు తెలిపాడు. రెండు నెలలు ఫోన్ కాంటాక్ట్లో ఉన్న మహిళ తరువాత ఫోన్ స్విఛాఫ్ చేసిందని, తనకు న్యాయం చేయాలని కోరాడు. -
సీజేఐపై దాడికి ఎమ్మార్పీఎస్ నిరసన
నరసరావుపేట: సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్), ఎంఎస్పీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలతో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ప్రదర్శనగా వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ప్రవేశద్వారం ముందే నిలిపివేశారు. దీంతో వారందరూ అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం పదిమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పగా వారు నిరాకరించారు. తామంతా ప్రశాంతంగా కలెక్టర్ కార్యాలయంవరకు వెళ్లి వినతిపత్రం అందజేస్తామని కోరారు. దీనిపై రూరల్ ఎస్ఐ కిషోర్, పట్టణ ఎస్ఐ ఫాతిమాలు పై అధికారుల అనుమతితో వారందరినీ లోపలికి అనుమతించారు. నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దుడ్డు రామకృష్ణ మాదిగ, చిరుగూరి జక్రం, కనుమూరి కోటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కల్తీ మద్యంపై కన్నెర్ర
పల్నాడుమంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నకిలీ మద్యం తయారు చేస్తూ.. దాన్ని ఊరు, వాడా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి మహిళలు రణభేరి మోగించారు. ప్రజల ప్రాణాలంటే లెక్కచేయని పాషాణ ప్రభుత్వపు కూసాలు కదిలేలా పదం పదం కలుపుతూ.. కదం తొక్కారు. జిల్లాలోని చాలా ఊళ్లకు మంచినీటి సరఫరా లేదు గానీ నకిలీ మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నారంటూ గర్జించారు. నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నేతలు ఆధారాలతో సహా పట్టుబడినా.. ప్రభుత్వ పెద్దలు బుకాయించడం.. ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని నిరసన గళం వినిపించారు. కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు సీబీఐ విచారణ జరిపించాలి ఈనాం భూములను బోయలకే కేటాయించాలి పులిచింతల సమాచారం పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 41,082 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 82,027 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. సీహెచ్సీ సందర్శన పొన్నూరు: నిడుబ్రోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల సంరక్షణే ప్రథమ బాధ్యత జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా నరసరావుపేట: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో భోజనం, తాగునీరు, వసతులు, ప్రథమ చికిత్స, పారిశుద్ధ్యం వంటి కనీస వసతుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంరక్షణే ప్రప్రథమ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లపై తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డయేరియా, వివిధ రకాల జ్వరాలు నమోదైతే ఎలా స్పందించాలో తెలుపుతూ మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. కాచి వడగట్టిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. అన్ని వసతి గృహాల్లో మూడు రోజుల్లోగా తాగునీటి పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు. బయటినుంచి ఆహార పదార్థాలను నిషేధించాలన్నారు. వసతి గృహాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సి పల్ కమిషనర్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. వసతి గృహ విద్యార్థులు పదోతరగతి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. డీఈఓ చంద్రకళ, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డీపీఓ నాగేశ్వర్ నాయక్, సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. నేడు నకిలీ మద్యంపై నిరసన నరసరావుపేట: రాష్ట్రంలో వెలుగుచూసిన నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారికి వినతిపత్రం అందజేయటం జరుగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి బయలుదేరి ప్రకాష్నగర్లోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 10గంటలకు పార్టీ కార్యాలయం వద్దకు తరలిరావాలని కోరారు. టెయిల్పాండ్ నుంచి 58,122 క్యూసెక్కులు విడుదల రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 5 క్రస్ట్గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 58,122 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 5 క్రస్ట్గేట్లు రెండు మీటర్లు ఎత్తు ఎత్తి 49,720 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,402 క్యూసెక్కులు మొత్తం 58,122 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి మట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. ఐటీఐ ఐదో విడత అడ్మిషన్లకు దరఖాస్తులు మాచర్ల: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఐదో విడత అడ్మిషన్ల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్, మాచర్ల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.నరేంద్ర సోమవారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో www.iti.ap. gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4గంటలలోపు తమ కళాశాలకు వచ్చి ధ్రువీకరించుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 17న ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలోని ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు. సాక్షి, నరసరావుపేట: ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు కదం తొక్కారు. నియోజకవర్గ కేంద్రాలలో చేపట్టిన నిరసన ర్యాలీలు, ఎకై ్సజ్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేసే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కూటమి ప్రభుత్వం మద్యం విధానాలను తూర్పారబట్టారు. కల్తీ మద్యంపై సిట్ విచారణ కాకుండా సీబీఐ విచారణచేపట్టాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది నారా వారి పాలనలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత విడదల రజిని విమర్శించారు. నకిలీ మద్యంపై వైఎస్సార్ సీపీ రణభేరి కార్యక్రమం సోమవారం చిలకలూరిపేటలో నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి మాజీ మంత్రి ర్యాలీ నిర్వహించారు. అడ్డరోడ్డు సెంటర్ నుంచి చిలకలూరిపేట ఎకై ్సజ్ స్టేషన్కు ప్లకార్డులు చేతబట్టి నకిలీ మద్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఎకై ్సజ్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ నకిలీ మద్యం తయారు చేస్తూ, అక్రమ పద్ధతిలో విక్రయాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ టీడీపీ నాయకులు పట్టుబడినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా, పరిశ్రమ మాదిరిగా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నేతలు రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. గ్రామ గ్రామాన వెలిసిన బెల్టుషాపులతో ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి అధికార పార్టీ నాయకులే వేలం పాటలు నిర్వహించి ఏర్పాటు చేయించటం సిగ్గుచేటన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జరిగేవని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే సిట్ దర్యాప్తు కేవలం నిజాలను సమాధి చేయడానికి, కేసును నీరుగార్చటం కోసమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పెదకూరపాడులో... పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో సోమవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి ఎకై ్సజ్ సీఐ టి.తులసికి వినతిపత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఈదా సాంబిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతుందన్నారు. గురజాలలో.. నకిలీ మద్యం వలన ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోయారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), వైఎస్సార్ సీపీ బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీలు అన్నారు. గురజాల ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమ లాగా నారా వారి నకిలీ మద్యం ఉందన్నారు. నకిలీ మద్యంపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. అలాగే పిడుగురాళ్లలో స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు వినతి పత్రం అందించారు. పార్టీ గురజాల నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కన్వీనర్ షేక్ జైలాబ్ధిన్, పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్కుమార్, చింతా సుబ్బారెడ్డి, దాదినబోయిన ఏడుకొండలు పాల్గొన్నారు. మాచర్లలో... మాచర్లలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ జరిపి కూటమి ప్రభుత్వం మద్యం విధానాలను నాయకులు తూర్పారబట్టారు. అనంతరం పీడబ్ల్యూడీ కాలనీలోనీ ఎకై ్సజ్ స్టేషన్ ముందు ధర్నా, నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జలీల్ మాట్లాడుతూ టీడీపీ నేతలే రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని తయారు చేసి విక్రయించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు సిట్ పేరుతో నాటకాలకు తెరదీశారన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, బీసీ విభాగం నియోజక వర్గ అధ్యక్షుడు బూడిద శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు మాచర్ల సుందరరావులు మాట్లాడారు. గురజాలలో ఎకై ్సజ్ ఎస్ఐకి వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు మాచర్లలో ఎకై ్సజ్ సీఐ వెంకటరమణకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులుక్రోసూరులో ఎకై ్సజ్ సీఐ టి.తులసికి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యంకాలనీలో మౌలిక వసతులు కల్పించండి చిలకలూరిపేటరోడ్డులోని ఎస్ఆర్కేటీ కాలనీకి సమీపంలో గల అస్ఫాఖుల్లాఖాన్ కాలనీలో 15ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. కాలనీలో రోడ్లు, సైడు కాలువలు, వీధిలైట్లు లేవు. కనీసం చెత్త సేకరించే బండికూడా రావట్లేదు. వర్షాలకు మట్టిరోడ్లన్నీ బురదమయంగా మారి నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. నీరు నిల్వుండి దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నాం. కాల నీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి. –కె.అరుణ, అంజమ్మ, ఫాతిమా, మహబూబి, అస్పాఖుల్లాఖాన్ కాలనీ వాసులు చిలకలూరిపేట జమిందారు బోయలకు ఇచ్చిన 2502 ఎకరాల ఈనాం భూములు బోయలకే చెందేలా ఉత్తర్వులు ఇవ్వండి. ఈ ఈనాం భూములను బోయలకు చెందకుండా ఆనాటి కరణాలు అగ్రవర్ణాలకు బినామీలుగా కట్టబెట్టారు. ఇప్పటివరకు 34 అర్జీలు పెట్టినా చర్యలు తీసుకోలేదు. దొంగ రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ రద్దుచేసి, ఎవరికి పనికిరాని ఫారం–8 రైత్వారీ పట్టాలు రద్దుచేసి నిజమైన వారసులను గుర్తించేవరకు ప్రభుత్వ స్వాధీనంలో భూములు ఉంచగలరు. –దగ్గు నరసింహారావు, ఉమ్మడి గుంటూరు బోయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు 7కుటీర పరిశ్రమగా నకిలీ మద్యం సంపద సృష్టించటమంటే కుటీర పరిశ్రమ లాగా నకిలీ మద్యం తయారీ చేయటమేనా చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి ప్రశ్నించారు. నకిలీ మద్యం అరికట్టి, జరిగిన సంఘటనలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ సోమవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు సత్తెనపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పోలీసుల ఆంక్షల నడుమ వైఎస్సార్ సీపీ నాయకుల, మహిళల ర్యాలీ ఎకై ్సజ్ స్టేషన్ వరకు సాగింది. అనంతరం ఎకై ్సజ్ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సుధీర్ భార్గవరెడ్డి అందించి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యం మాఫియా నడుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందన్నారు. మద్యం కుంభకోణంపై నిజాలు రాస్తున్న సాక్షి మీడియాపై కేసులు పెడుతూ, దాడులకు దిగడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో వందలాది కుటుంబాలు నకిలీ మద్యానికి బలైపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ర్యాలీగా నరసరావుపేట రోడ్డు లోని ఎకై ్సజ్ స్టేషన్ వరకు వెళ్లి సీఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేయడంతో పాటు అమాయకుల ప్రాణాలు బలిగొనడం దారుణమన్నారు. ప్రభుత్వం ఒక వైపు నకిలీ మద్యం తయారు చేయిస్తూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాటాలు పంచుకుంటూ.. మరో వైపు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి మద్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మార్చారని విమర్శించారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
జాలలపాలెంలో దళితుల ఇళ్లు కూల్చవద్దు
నరసరావుపేట: వినుకొండ మండలం జాలలపాలెంలోని తమ ఇళ్లు కూల్చవద్దంటూ దళితులు ప్రజాసంఘాల సహకారంతో కలెక్టర్ కృతికా శుక్లాను కోరారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. దీనిపై వారు మాట్లాడుతూ జాలలపాలెంలోని 175 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని కొంతమంది హైకోర్టులో లోకాయుక్తను ఆశ్రయించారన్నారు. ఆ మేరకు హైకోర్టు 2023లో ఉత్తర్వులు ఇవ్వగా నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయితే గత 20 రోజులు నుంచి పంచాయతీ సెక్రటరీ భాగ్యలక్ష్మి, వీఆర్ఓ గోపాలరావులు దళితులు నివేశ స్థలాలు ఏర్పాటుచేసుకున్న 68/2 సర్వేనెంబర్లో గల 58 సెంట్లు భూమి నుంచి వారిని ఖాళీ చేయాలని, ఇళ్లు కూల్చివేస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మూడు తరాలుగా గ్రామ కంఠం భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కట్టించిన ఇళ్లల్లో దళితులు నివాసం ఉండగా, వాటిని ఖాళీ చేయాలని, కూల్చాలనే ఆలోచన అధికారులు మానుకోవాలని కోరారు. ఎవరైతే రికార్డులు ట్యాంపరింగ్కు పాల్పడి గ్రామకంఠం భూమిని వేరేలాగా చూపిన రెవెన్యూ వారిపై చర్యలు తీసుకొని అక్కడ ఉన్న నివాస దారులకు రక్షణ కల్పించి, 175 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని కలెక్టర్ను కోరామన్నారు. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కోట నాయక్, దేశభక్త ప్రజాతంత్ర సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, గ్రామస్తులు పిడతల అంకారావు, మునెయ్య, నారాయణ, కొమ్మతోటి బాలస్వామి పాల్గొన్నారు. అక్రమ లీజును రద్దు చేయండి బెల్లంకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయానికి చెందిన తొమ్మిది సెంట్ల ఖాళీ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు పీఎస్కే మస్తాన్ షరీఫ్ అధికారులతో కుమ్మకై ్క జిల్లా పరిషత్ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లీజు హక్కు లు పొందటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు పీజీఆర్ఎస్లో సోమవారం అర్జీ అందజేశారు. ఆ అక్రమవేలం లీజును రద్దుచేసి తిరిగి బహిరంగంగా నిర్వహించాలని అధికారులను కోరా రు. బెల్లంకొండ మండలం జెడ్పీటీసీ సభ్యుడు గాదె వెంకటరెడ్డి, మండల వైస్ కన్వీనర్ పాకాలపాటి షేక్ మౌలాలి, కో–ఆప్షన్ మెంబర్ కావూరి షేక్ దరియా, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గుర్రాల షేక్ బడా బచ్చా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గడ్డిపర్తి చినబాబురావు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామాంజనేయులు నాయక్ ఉన్నారు. ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలి క్రోసూరు పంచాయతీ పరిధిలోని యర్రబాలెం గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించాలని గ్రామ ప్రత్యేక పంచాయతీ సాధనా కమిటీ సభ్యులు తిమ్మిశెట్టి హనుమంతరావు, సోడిశెట్టి నీలేశ్వరావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో 3 వేల మంది జనాభా, రెండువేల వరకు ఓటర్లు ఉన్నారని అన్నారు. ప్రత్యేక పంచాయతీ కావాలని ప్రజల్లోకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ప్రజలందరూ తమ సంతకాల ద్వారా ఆమోదం తెలియజేస్తున్నారని, ఒకరిద్దరూ అవకాశవాద రా జకీయ నాయకులు మా త్రమే ఆటంకం కలిగిస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. క్రోసూరు పంచాయతీలో యర్రబాలెం గ్రామం కలిసి ఉన్నందున నిధులు కేటాయింపు సరిగా లేదన్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు గ్రామసభ లు ఏర్పాటు చేయమని అడిగినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని, విధులు ఎంత కేటాయిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం వారు జిల్లా పంచాయతీ అధికారిని కలిసి మాట్లాడారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరిన ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు -
ఎస్ఐ మారినప్పుడల్లా వేధింపులు..
మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలో చదువుకుంటున్న అమ్మాయిలను ఇప్పుడు స్టేషన్కు రావాలని పోలీసులు ఫోన్ చేసి వేధిస్తున్నారని క్రోసూరు మండలం యర్రబాలెంకు చెందిన మేకుల రోజానమ్మ జిల్లా ఎస్పీ ఎదుట వాపోయింది. గతంలో పొగాకు పనికి వచ్చేందుకు తన వద్ద పల్లె ప్రతాప్, మేరీలు రూ.లక్ష తీసుకున్నారని, పనికి రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వ మని తాను అడగటం జరిగిందన్నారు. దీంతో గొడవకు దిగిన వారు తనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసారని తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి ఎస్ఐలు మారినప్పుడల్లా కేసుపై మాట్లాడాలని తనను, తన కుమార్తెలను స్టేషన్కు పిలిపిస్తున్నారని వాపోయారు. ఇప్పుడు తన కుమార్తెలు దేవి, భార్గవితో పాటు తన ఆడబిడ్డ కుమార్తెలు దేవిశ్రీప్రియ, ప్రసన్నకుమారిలను కూడా కేసులో అక్రమంగా ఇరికించారని తెలిపారు. -
ఫార్మసీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ సంయుక్తంగా సవరించిన షెడ్యూల్ విడుదల చేశాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో 43 ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈనెల 14 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన.. ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈనెల 25 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్లోనే రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పొందుపర్చారు. -
ఓపెన్ స్కూల్ ప్రవేశాలు గడువు పెంపు
డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియేట్ (దూరవిద్య) కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె.ఎం.ఏ.హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ ఆర్.నరసింహారావు ఉత్తర్వులు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. అపరాధ రుసుం రూ.200 చెల్లించి ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటి వద్ద ఉంటూనే దూరవిద్య విధానంలో 10వ తరగతి, ఇంటర్మీడియేట్ పూర్తిచేసే అవకాశం ఉందని వివరించారు. ప్రవేశాలు పొందిన అభ్యాసకులు సెలవు రోజుల్లో నిర్వహించే క్లాసులు, ప్రాక్టికల్స్కు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. అభ్యాసకుల అడ్రస్కు నేరుగా పుస్తకాలు పంపుతారని పేర్కొన్నారు. రెగ్యులర్ కోర్సు ద్వారా పొందే సర్టిఫికెట్లకు ఎంత విలువ ఉంటుందో ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లకు అంతే విలువ ఉంటుందన్నారు. సదరు సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు సమీపంలోని ఏఐ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. అస్వస్థతకు గురై వృద్ధురాలు మృతి నాదెండ్ల: టూత్ పేస్ట్గా భావించి ఎలుకల నివారణ పేస్ట్ను వినియోగించి వృద్ధురాలు మృత్యువాత పడిన సంఽఘటన సాతులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ జి పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. జెట్టిపాటి పోలేరమ్మ (69) ఈనెల 8న ఉదయం పళ్లు తోముకునేందుకు టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల నివారణ పేస్ట్ను వినియోగించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త, కుమార్తె గతంలో మృతి చెందగా, ప్రస్తుతం ఈమె మనవళ్ల సంరక్షణలో ఉంటుంది. వృద్ధురాలి మనుమడు మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట: స్థానిక పాలపాడు రోడ్డులోని ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాలులో ఆదివారం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఏపీ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా ఉన్నం వేణుగోపాల్, కార్యదర్శిగా అబ్దుల్ కరీం, కోశాధికారిగా ఎన్.అక్షయ్కుమార్, గౌరవ అధ్యక్షులు జీపీ రంగయ్య, గౌరవ సలహాదారుగా జీవీ రఘురాం, ఉప అధ్యక్షులుగా బి.కోటేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యఅతిఽథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాంబాబు, చైర్మన్ కుమార్ మంగళం, ప్రధాన కార్యదర్శి మైనేని లక్ష్మణ్ హాజరై ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాజీ అధ్యక్షులు దాసరి నాగ్శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాసకుమార్, సంయుక్త కార్యదర్శి బొందిలి శ్రీనివాససింగ్ హాజరయ్యారు. -
పట్టపగలు చోరీ
సంతమాగులూరు(అద్దంకి రూరల్): తాళం వేసిన ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బంగారం వెండి, నగదు దొంగిలించిన ఘటన ఆదివారం మండలంలోని కుందుర్రులో జరిగింది. ఎస్ఐ ఎం.పట్టాభి అందించిన వివరాలు... మండలంలోని కందుర్రులో ఎస్కే ఖాశింసైదా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళాలు వేసి పనిమీద బయటకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని వారు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటికి బీరువా తెరిచి రూ.20 వేల నగదు, సవర బంగారం, 35 తులాల వెండి వస్తువులు అపహరించారు. ఇంటికి వచ్చిన ఖాశింసైదా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
సెపక్తక్రా విజేత కృష్ణ
●ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రకాశం, తూర్పు గోదావరి ●క్రీడాకారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేత చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సెపక్తక్రా జూనియర్ బాల, బాలికల పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. స్థానిక మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన పోటీలకు రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన బాల, బాలికల జట్లు అన్ని విభాగాల్లో రాణించి విజేతలుగా నిలిచి ప్రథమ స్థానాలను కై వసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా జట్టు గెలుచుకుంది. అలానే బాలుర విభాగంలో కృష్ణా జిల్లా జట్టు బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా ద్వితీయ స్థానాన్ని ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది. తృతీయ స్థానంలో అనంతపురం జిల్లా జట్టు నిలిచింది. ఈ పోటీలు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆసక్తికరంగా.. ఉత్కంఠ భరితంగా జరిగాయి. బరువైన బాలును ఒక్క కాలితో గాలితో ఎగిరి కొట్టి అవతలి కోర్టులోని పంపాల్సి ఉంది. అయినప్పటికీ క్రీడాకారులు ఎంతో పట్టుదలతో గెలుపుకోసం ఆటపై పట్టు సాధిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటను తిలకించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. విజేతలుగా నిలిచిన క్రీడా జట్లకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెపక్తక్రా జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు, ఏపీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, నరసరావుపేట ఎంఎం కాలేజెస్ చైర్మన్ ఎంఆర్ రామశేషగిరిరావు, సెపక్తక్రా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇస్తర్ల సుభాషిణి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బాపట్ల జిల్లా సెపక్తక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర, జిల్లా అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ కోచ్ వి.వనజ, గజవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కానుక భూములు అన్యాక్రాంతం
యడ్లపాడు: రాజుల పాలనా కాలంలో తమ పూర్వీకులు సర్వీసు ఈనాం (కానుక)గా పొందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని తిరిగి వారి వారసులకు అప్పగించాలని కోరుతూ యడ్లపాడు మండలంలోని బోయ సంక్షేమ సంఘం 19 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. చివరకు సమస్య హైకోర్టుకు చేరింది. చిలకలూరిపేట జమీందారు రాజా మానూరు వెంకట హనుమంతరాయణం పాలన కాలంలో భటులుగా ఉన్న వీరి కుటుంబాల జీవనోభృతికి సర్వీస్ ఈనాం కింద వంకాయలపాడు, కొండవీడు, మైదవోలు, సొలస, యడ్లపాడు, తిమ్మాపురం, జాలాది, కారుచోల వంటి 8 గ్రామాల్లో దాదాపు 2,500 ఎకరాల భూముల్ని ఇచ్చారని, మొదట ఉన్నవ గ్రామంలో నివాసం ఉన్న ఈ బోయలు తర్వాత ప్రస్తుతం 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన నివాసాలు ఏర్పరచుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా బోయలు ఉన్నందున బోయపాలెంగా రూపాంతరం చెందిందని వీరు చెబుతుంటారు. అక్రమాల పర్వం ఎలా మొదలైంది? 1956లో ప్రభుత్వం ‘ఇనాం ఎబాలేషన్ యాక్ట్’ను ప్రవేశపెట్టింది. దీంతో భూముల రికార్డులు సరిదిద్దే రీసెటిల్మెంట్ ప్రక్రియ అప్పటి అధికారులకు వరంగా మారింది. దీంతో హక్కుదారులైన బోయలకు అప్పగించకుండా రికార్డుల్లో బీనామీ పేర్లను చేర్చినట్లు బోయ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా నమోదైన వాటికి ఇంటిపేరు, తండ్రిపేరు, చిరునామా లేకపోవడమే భూ అక్రమాలకు నిదర్శనమని చెబుతున్నారు. ఈనాం భూములకు ప్రధాన ఆధారాలైన ఈనాం బీ రిజిస్టర్, రైత్వారీ పట్టా(ఫారం–8)లో అడంగళ్ 1బీలోని వివరాలు కనిపించకపోవడం గమనార్హమని అంటున్నారు. 19 ఏళ్ల పోరాటం.. తమ భూములు అన్యాక్రాంతమయ్యాయని గుర్తించిన బోయల వంశీయులు సమస్యను 2006లో యడ్లపాడు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లా రు. నాటి నుంచి రెవెన్యూ శాఖకు 34 దరఖాస్తులు సమర్పించినా ఎటువంటి స్పందన లేక 2022లో హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. సంఘం ఆరోపణల్లోని ప్రధాన అంశాలు... ఒకే సర్వే నంబర్లో ఈనాం బీ రిజిస్టర్లో ఒక పేరు, ఫారం–8లో మరో పేరు, క్షేత్రస్థాయిలో మరో పేరు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ అక్రమాలకు పాల్పడిన వారిలో అగ్రవర్ణాల వారే ఎక్కువగా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు 2 శాతం కూడా లేరని బోయ సంక్షేమ సంఘం ఆరోపిస్తోంది. అక్రమంగా భూములు అనుభవిస్తున్న వారి వద్ద చట్టబద్ధమైన రైత్వారీ పట్టాలు లేవు. ఇవన్నీ లేకుండానే వంశపారంపర్యంగా సంక్రమించినట్లు అధికారుల ద్వారా రీసర్వే సమయంలో ఎల్పీ నంబర్లు, పాస్పుస్తకాలు పొందారని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారుల వాదన ఇలా.. ఈనాంగా భటులు భూములు పొందినట్లు, సదరు భూములు వారి స్వాధీనంలో ఉన్నట్లు రికార్డులు ఏవీ అందుబాటులో లేవన్నది అధికారులు వినిపిస్తున్న వాదన. ఇనాం ఎబాలిషన్ యాక్ట్ నుంచి రైతుల పేర్లు మాత్రమే రికార్డుల్లో నమోదై ఉన్నాయని, నాటి నుంచి నేటి వరకు అవి ఎన్నో లావాదేవీలు జరిగి ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.భట వృత్తిదారులకు భూములిచ్చిన జమీందారు భూములను మింగేసిన పెద్దలున్యాయం చేయాలంటూ 19 ఏళ్లుగా బోయల పోరాటం ఈనాం భూములపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించాం. అన్యాక్రాంతమైన భట వృత్తిదారుల భూములను ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. బోయ(భటవృత్తిదారుల)వారసులు, నిజమైన హక్కుదారులకు గుర్తించి వాటిని అప్పగించేందుకు కృషి చేయాలి. – దగ్గు నరసింహారావు, బోయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట: ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం వినుకొండరోడ్డులోని రోటరీక్లబ్ భవనంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు జమ్ముల రాధాకృష్ణ ఏపీ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకొని అభినందనసభ, జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా కేవీ, కార్యదర్శిగా కసుకుర్తి రాజశేఖర్, కోశాధికారిగా రాంబాబు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లకు చెందిన జిల్లా సభ్యులతో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నరసరావుపేట ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మన్నేపల్లి శ్రీనివాసరావు, పడవల వంశీకృష్ణ, కోశాధికారి చిన్ని వెంకటేష్ల ఆధ్వర్యంలో జమ్ముల రాధాకృష్ణను సన్మానించారు. ప్రింటింగ్ రంగంలో రాబోతున్న మార్పులు, అడ్వాన్స్ మిషనర్, క్లస్టర్స్, ఇతర విషయాలపై చర్చించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికి ధన్యవాదాలు తెలియచేశారు. -
కాటేసిన కడలి
చీరాల: వారంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. బీటెక్ చదివేందుకు ఒకే కాలేజీలో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా సముద్ర తీరంలో స్నానం చేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ లోతును అంచనా వేయలేకపోయారు. నిమిషాల వ్యవధిలోనే గల్లంతయ్యారు. స్థానికులు గమనించి నలుగురిని ఒడ్డుకు చేర్చిగా, మిగిలిన ముగ్గురు కడలిలో కలిసిపోయారు. మరో సంఘటనలో సరదాగా సాగరతీరానికి వచ్చిన వారిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. రెండు ఘటనల్లో ఐదుగురు విద్యార్థులు కడలి కెరటాలకు బలి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఎగసిపడిన అలలు అమరావతిలోని విట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల రూరల్ మండలం వాడరేవు సముద్రతీరానికి వచ్చారు. అలల ధాటిని కూడా లెక్కచేయకుండా సముద్రంలో కేరింతలు కొట్టారు. కొద్దిసేపటికి అలలు ఎక్కువగా రావడంతో ఏడుగురు గల్లంతయ్యారు. స్థానిక మైరెన్ పోలీసులు, గజ ఈతగాళ్లు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. అయితే, వీరిలో సాయి మణిదీప్ (జడ్చర్ల), జీవన్ సాత్విక్ (హైదరాబాద్), శ్రీసాకేత్ (హైదరాబాద్)లు సముద్రంలో గల్లంతయ్యారు.కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. అప్పటి వరకు కలిసి ఉన్న స్నేహితులు విగత జీవులుగా మారడంతో స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలను సేకరించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వివాహ వేడుకకు వచ్చి.. వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన మరో ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. శనివారం వివాహ వేడుక జరిగింది. ఆదివారం సరదాగా గడిపేందుకు వాడరేవు తీరానికి కుటుంబంతో వచ్చారు. సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లగా వడ్డె సంఘానికి చెందిన గౌతమ్ (15), షారోన్ (18) గల్లంతయ్యారు. షారోన్ సోదరి వివాహానికి అదే ప్రాంతానికి చెందిన గౌతమ్ మరికొందరు ఆదివారం సముద్రతీరానికి వచ్చారు. అయితే, వీరి మృతదేహాలు ఇంకా తీరానికి రాలేదు. షారోన్ రాజమండ్రిలో బీటెక్ చదువుతుండగా, గౌతమ్ కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గల్లంతైన వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వాడరేవు సముద్రతీరంలో ఐదుగురు యువకులు మృత్యువాత పడడంతో సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఉమామహేశ్వర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన సంఘటనలపై ఆరా తీశారు. అలలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మైరెన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం జరిగిన సంఘటనలో కూడా మైరెన్ పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు కొంతమందిని కాపాడారని చెప్పారు. పర్యాటక ప్రాంతంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విషాదం నింపిన విహారం కన్నీటి సంద్రంగా మారిన తీరం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు గల్లంతు ముగ్గురి మృతదేహాలు లభ్యం జాడలేని మరో ఇద్దరి మృతదేహాలు మృతుల్లో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఒకరు పదో తరగతి విద్యార్థి -
అరవ చాకిరీపై ఆగ్రహం
గురువుల తిరుగుబాటు ● ఫ్యాప్టో ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత ● బోధనేతర కార్యక్రమాల బహిష్కరణకు పిలుపు ● ఫ్యాప్టోలో 12 ఉపాధ్యాయ సంఘాలు భాగస్వామ్యం ● జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయులు బోధనలకు దూరం ● బోధన కాలాన్ని హరించి వేస్తున్న యాప్లపై వ్యతిరేకత సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. తమను బోధనేతర పనుల నుంచి దూరం చేసి, పాఠ్యాంశాల బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ పిలుపుతో ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్లో ఫ్యాప్టో చేపట్టిన మహా ధర్నాలో వేలాదిగా పాల్గొన్న ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వం అప్పగిస్తున్న అనవసరమైన బోధనేతర పనులతో అసలు తమ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. యాప్లతో అవస్థలు విద్యాశాఖ అమలు చేస్తున్న బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులను విద్యార్థులకు పాఠాలను చెప్పనీయకుండా చేస్తున్నాయి. విద్యార్థుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పనులు, మూల్యాంకన విధులు మినహా అనవసరమైన గూగుల్ షీట్స్ పూర్తి చేయడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 వంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టబోమని స్పష్టం చేస్తూ ఫ్యాప్టో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్, డీఈవోలకు మెమోరాండంలు సమర్పించారు. మండల స్థాయిలో ఎంఈవోలకు కూడా ఇచ్చారు. బోధనేతర విధులకు దూరంగా ఉండాలని ఫ్యాప్టో నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం నుంచి నిరసన చేపట్టనున్నారు. ఫ్యాప్టోలో భాగస్వాములైన 12 ఉపాధ్యాయ సంఘాలు బోధనేతర విధులు, అర్థం లేని యాప్లపై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. -
బోధనేతర పనులను విరమించుకోవాలి
ఉపాధ్యాయులపై భారం మోపేలా ఉన్న బోధనేతర పనులను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. గిన్నిస్బుక్ రికార్డుల కోసం ఇప్పటికే యోగాంధ్ర, మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పేరుతో కార్యక్రమాలకు ముందు, తరువాత ఫొటోల అప్లోడ్ చేయించింది. దీనివల్ల బోధన పనిగంటలు వృథా అయ్యాయి. పరీక్షల్లో అసెస్మెంట్ బుక్లెట్ విధానంతో ఉపాధ్యాయులకు పనిభారం పెరుగుతోంది. అందుకే బోధనేతర పనులను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లను బహిష్కరిస్తున్నాం. –ఎస్ఎం సుభాని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సత్తెనపల్లి -
తురకపాలెం ఘటనతో భయాందోళనలు
గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితో పదుల సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటన మరువక ముందే జిల్లాలో ఆ వ్యాధి లక్షణాలు బయటపడటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వం తురకపాలెం మాదిరి అలసత్వం వహించకుండా వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విరివిగా రక్త పరీక్షలు చేసి మెలియాయిడోసిస్ లక్షణాలను గుర్తించాల్సి ఉంది. జ్వరపీడితుల వివరాలు ఇంటింటికి వెళ్లి ఆరా తీసి తగిన చికిత్స అందించాల్సి ఉంది. సుమారు 342 మంది జనాభా ఉన్న గ్రామంలో ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కుటుంబ సభ్యులకు మాత్రమే రక్త నమూనాలను తీసి ల్యాబ్కు పంపినట్టు సమాచారం. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అనుమానితులకు పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు పారిశుద్ధ్యం సరిగా లేకపోతే మెలియాయిడోసిస్ వ్యాఽధి మరింత మందికి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇళ్ల మధ్య, రోడ్లు, కాలువులను శుభ్రం చేయాల్సి ఉంది. -
పాఠాలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి మే, జూన్ నెలల్లో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పిల్లలకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాం. జూన్ నెల ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక బోధనేతర పనులు అప్పగించి ఉపాధ్యాయుల బోధన సమయాన్ని ప్రభుత్వమే వృథా చేస్తుంది. ఇప్పటికై నా ఉపాధ్యాయులను పాఠాలకే పరిమితం చేయాలి, బోధనేతర పనులు, యాప్లను ఫ్యాప్టో పక్షాన బహిష్కరిస్తున్నాం. – మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, సత్తెనపల్లి -
మెలియాయిడోసిస్ కలకలం
సాక్షి, నరసరావుపేట : వెల్దుర్తి మండలం వజ్రాలపాడు పంచాయతీ దావుపల్లితండాలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో పల్నాడు జిల్లాలో కలకలం మొదలైంది. తండాకు చెందిన హర్యా నాయక్ దోమవత్కి తీవ్ర జ్వరం రావడంతో యర్రగుండపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. ఎంతకూ జ్వర లక్షణాలు తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్ సూచనతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్లాడు. నెలరోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటం, జ్వర తీవ్రత తగ్గకపోవడంతో అనుమానం వచ్చి రక్త నమూనాలను ల్యాబ్కు పంపారు. మెలియాయిడోసిస్ లక్షణాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి రవి, ఇతర వైద్య బృందం దావుపల్లితండాలో పర్యటించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గ్రామంలో ఇంకా ఎవరైనా వ్యాఽధి లక్షణాలతో బాధపడుతున్నారేమో ఆరా తీశారు. మట్టి, ధూళితో వ్యాధి ప్రభలే అవకాశాలు ఉండటంతో తండాలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టారు. మెలియాయిడోసిస్ అంటువ్యాధి కాదంటూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్యానాయక్ శనివారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. ఆరోగ్యం నయమవ్వడానికి మూఢనమ్మకంతో తాయత్తు కట్టించుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న వైద్యాఽధికారులు తండాకు చేరుకొని రోగికి అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి గుంటూరు జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెలియాయిడోసిస్ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మారుమూల ప్రాంతాలైన తండాలలో నివసిస్తున్న గిరిజనులకు వైద్య సేవలు అందించడంతోపాటు, వారికి వ్యాధి పట్ల అవగాహన కల్పించి మంచి పౌష్టికాహారం అందిచాల్సి ఉంది.మెలియాయిడోసిస్ ఇదో అరుదైన వ్యాధి. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మొత్తం 28 మంది ప్రాణాలను వ్యాధి బలిగొంది. ఈ వ్యాధి ఇప్పుడు పల్నాడులో ప్రవేశించింది. పొరుగు జిల్లాలో జరిగిన ప్రాణ నష్టం గురించి విన్న పల్నాడు ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం, వైద్యాధికారులు అప్రమత్తమై నివారణకు ముందస్తు చర్యలు తీసుకోకుంటే పెనుప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు.వెల్దుర్తి మండలందావుపల్లితండావాసికి లక్షణాలుమంగళగిరిలోని ఓ ప్రైవేట్ఆసుపత్రిలో చేరికచికిత్స పొందకుండా ఆసుపత్రినుంచి గ్రామానికి చేరుకున్న రోగికౌన్సెలింగ్ ఇచ్చి గుంటూరుజీజీహెచ్కి తరలించిన వైద్యాధికారులుగ్రామంలో మరెవరిలో లక్షణాలులేవంటున్న జిల్లా వైద్యాధికారిగుంటూరు జిల్లా తురకపాలెంలోవరుస మరణాల నేపథ్యంలోభయాందోళనలో స్థానికులుప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసిఅనుమానితులకు పరీక్షలునిర్వహించకపోతే పెను ప్రమాదం -
ఎన్ఓసీ క్లియరెన్స్ కాలపరిమితి తగ్గింపునకు ప్రతిపాదనలు
గుంటూరు రూరల్: ఒక ప్రాంతంలో కొత్త వ్యాపారాన్ని స్థాపించేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని, వాటిలో ఫైర్ ఎన్వోసీ క్లియరెన్స్ కాలపరిమితిని తగ్గించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వి.రమణ చెప్పారు. గుంటూరు నగర శివారులోని గోరంట్ల గ్రామంలోగల నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జోన్–3 జిల్లాల ఫైర్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా డీజీ రమణ, సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ ఆర్ జ్ఞానసుందరం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్, గుంటూరు, డీడీఆర్ఎఫ్వోలు సమస్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కార్యకలాపాలను వివరంగా చర్చించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) ప్రకారం ఫైర్ సేఫ్టీ నామ్స్ సరిదిద్దడానికి అన్ని రకాల నోటీసులు జారీ చేయబడ్డాయని తెలిపారు. యాజమాన్యాలు, ఫామ్స్, స్కూల్స్, కళాశాలలకు నోటీసులు పంపామని, దశల వారీగా తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు డీజీ తెలిపారు. ప్రొవిజనల్ ఎన్వోసీ మూడు రోజుల్లోను, ఆక్యుఫెన్సీ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని, రెన్యువల్ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని అన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ వర్క్స్, ఫండ్స్ కేటాయింపుపై చర్చించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఫైర్ సర్వీసెస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణే యూటీఎఫ్ లక్ష్యం
నరసరావుపేట: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం యూటీఎఫ్ లక్ష్యమని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఏర్పాటు చేసిన మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రారంభ సూచికగా ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని పూర్వ ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి, యూటీఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు ఎ.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ధ్యేయంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వేసవి సెలవుల్లో విస్తృత ప్రచారం చేశామన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారని, అవసరమైతే అదనంగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ అగ్రభాగాన ఉండి పోరాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలలో రెండు డీఏలను తక్షణమే విడుదల చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పీఆర్సీ కమిషన్ నియమించాలని మెమో నెం.57అమలు, 2003 డీఎస్సీ అభ్యర్థులకు ఓపీఎస్ అమలు చేయాలని, బోధనేతర పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో 2021లో ఐదేళ్లు కాలానికి ప్రపంచబ్యాంక్తో ఆంధ్ర సపోర్టింగ్ లెర్నింగ్ ట్రాన్స్పర్మేషన్ ఒప్పందం చేసుకుని రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నారన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం, నాణ్యమైన విద్య అందించడం కాగా లక్ష్యాన్ని నీరుగారుస్తూ ఆన్లైన్లో సమాచారాన్ని పంపించే పాఠశాలలుగా మార్చారన్నారు. విద్యకు బడ్జెట్లో కోత విధించడంతో, విద్యార్థులు, పాఠశాలల సంఖ్య తగ్గి విద్యార్థుల సామర్ాధ్యలు తగ్గాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడి లేకుండా పనిచేయడం కోసం సాల్టు పథకం రద్దు చేయాలని, దీనికై సామాజిక పోరాటం చేయాలన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టిఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ యూటీఎఫ్ మండల శాఖలు బలోపేతం చేయాలని సభ్యత్వం పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. నూతన ఉపాధ్యాయులకు తగు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఎన్ఎంఎంఎస్ పరీక్ష మోడల్ బుక్లెట్ ఆవిష్కరణ ఎనిమిద తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మెటీరియల్ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా ప్రచురించిన బుక్లెట్ను రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ కాసిం పీరా, సహాధ్యక్షులు జెవిడి నాయక్, జిల్లా సహాధ్యక్షురాలు ఎ.బాగేశ్వరిదేవి, కోశాధికారి ఎం.రవిబాబు, జిల్లా కార్యదర్శిలు మండల బాధ్యులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు -
ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలతో దేశవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద పరిరక్షించే బాధ్యత భారతీయులందరిది అని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఆయన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ సభ్యులతో కలసి శనివారం అమరావతిని సందర్శించారు. ఠాగూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాచీన వారసత్వ కట్టడాలను పరిరక్షించటానికి ప్రస్తుతం 241 ఇంటాక్ చాప్టర్లు పనిచేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చారిత్రక ప్రాచీన వారసత్వ సంపదను గుర్తించటానికి రాష్ట్రంలోని సంస్థ సభ్యులు పనిచేయాలన్నారు. లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాలను అమరావతి మ్యూజియంలో ఉంచాలన్నారు. అందుకోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అమరావతి శిల్పాలలో ప్రాచీన నాగరికతలు, అనాటి చారిత్రక పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయన్నారు. అమరావతి అర్కియాలజీ మ్యూజియం, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయంలను సందర్శించారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి, ఇంటాక్ చాప్టర్స్ డివిజన్ డైరెక్టర్ కెప్టెన్ అరవింద్ శుక్లా, ఇంటాక్ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ ఎస్ వి ఎస్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రవి శ్రీనివాస్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, మేకల రవీంద్రబాబు, పురావస్తు శాఖ అధికారి సూర్యప్రకాష్, ఇంటాక్ సభ్యులు వేణుగోపాల్, విజయ్ కుమార్, శ్రీధర్ బాబు, యల్లాప్రగడ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ -
నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఉదయ్చంద్ర శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ‘‘ఎలక్ట్రికల్ ఏఈ మధు నన్ను విధుల్లో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు దుర్భాషలాడాడని.. నా చావుకు మధునే కారణం’’ అని సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో కలకలం రేపింది. స్నేహితులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నాన్ని ఆపేసినట్లు ఉదయ్చంద్ర తెలిపాడు. దీనిపై ఏఈ మధుసూదన్రావును వివరణ కోరగా గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఉదయ్చంద్రపై పశ్చిమ ఎమ్మెల్యే పలు ఆరోపణలు చేశారన్నారు. విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, లైట్లు ఆన్/ఆఫ్ సక్రమంగా చేయడం లేదని, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారన్నారు. కార్పొరేటర్ల ఫోన్లకు స్పందించడం లేదని, ఉదయ్చంద్రను విధుల నుంచి తీసివేయాలని సూచించడంతో కొన్ని రోజులు ఆపామని ఏఈ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయనని చెప్పడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 29, 30వ డివిజన్లలో పనిచేస్తున్న ఉదయ్చంద్రను బుడంపాడు లైట్లు ఆన్/ఆఫ్కు మార్చినట్లు తెలిపారు. ఆ విధులకు కూడా హాజరు కాకపోవడంతో అతన్ని ప్రశ్నించడంతో ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు బెదిరింపులకు దిగాడని మధు వివరించారు. జె.పంగులూరు: వేగంగా వస్తున్న కారు టైరు పగిలి బోల్తా పడిన సంఘటన ముప్పవరం జాతీయ రహదారిపై శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడు నుంచి నెల్లూరు కారు నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ముప్పవరం జాతీయ రహదారి ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో కారు టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎం. బాబురావు, సీహెచ్ అనిల్కుమార్ గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రేణింగవరం ఎస్సై వినోద్బాబు, బీట్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. -
క్రోసూరులో ఇంటిపై పడిన పిడుగు
క్రోసూరు: పిడుగుపాటులో ఇంటి శ్లాబ్ పాక్షికంగా ధ్వంసమైన ఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. క్రోసూరులోని కటకం కల్యాణ మండపం ఎదురు బజారు(కొత్తూరు)లో షేక్ నాగూరు ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంటిపై పిడుగు పడింది. పిడుగు ధాటికి ఇంటి వరండా స్లాబ్ బీటలు వారింది. ఇంటిలోని విద్యుత్మీటర్ కాలిపోయింది. ఫ్రిజ్, ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు పూర్తిగా పాడయ్యాయి. ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభం తీగలు తెగిపడిపోయాయి. అంతేకాకుండా అదే వీధిలోని అనేక మంది ఇళ్లలో విద్యుత్ పరికరాలు, నీళ్ల మోటార్లు, టీవీలు, పాడయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకరావు సందర్శించి బాధితుడిని పరామర్శించారు. వీఆర్వో లేళ్ల బ్రహ్మనాయుడు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. -
సమన్వయంతో ఉత్తమ సేవలు అందించాలి
నరసరావుపేట రూరల్: పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల నేర సమీక్ష సమావేశం శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఎస్పీ కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్స్టేషన్ రిసెప్షన్లో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి ఫిర్యాదుతో వచ్చే ప్రజలతో మర్యాదతో వ్యవహరించి బాధ్యతతో పరిష్కరించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదులను సమయానుకూలంగా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలన్నారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, అవసరమైతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. 60, 90రోజుల్లో దర్యాప్తు పూర్తిచేయాల్సిన కేసులను వేగంగా పూర్తిచేసి, న్యాయస్థానంలో ప్రాథమిక చార్జిషీట్ సమర్పించాలని స్పష్టంచేశారు. మహిళా పోలీసుల సహకారంతో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాత్రి గస్తీ వ్యవస్ధను పటిష్టం చేయాలని ఆదేశించారు. డ్రంక్అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్తోపాటు బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించి వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయ దుకాణాలను పరిశీలించి అనుమతి లేని విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
క్రోసూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు. క్రోసూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆయన పార్టీ నాయకులతో కలసి శనివారం ఆవిష్కరించారు. శంకరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తుందని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు జరిగే కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాల సేకరణ లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, యార్డు మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, బెల్లంకొండ ఎంపీపీ పద్మావెంకటేశ్వరరెడ్డి, అచ్చంపేట మండల అధ్యక్షుడు చిలకా చంద్రయ్య, సీహెచ్ఆర్కే సాయిరెడ్డి, ఎంపీపీ పి.కోటయ్య, జెడ్పీటీసీ షేక్ గఫూర్, గార్లపాటి దాసు, వైస్ ఎంపీపీ విప్పల వెంకట్రామిరెడ్డి, అల్లా, కాల్వపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ క్రోసూరు మండల అధ్యక్షుడు వెలది అప్పారావు, సుంకర శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు అనుముల కోటిరెడ్డి, అమరావతి మండల అధ్యక్షుడు భవిరిసెట్టి హనుమంతరావు, ఖాదర్, యార్డు మాజీ డైరెక్టర్ పాశం శ్రీనివాసరెడ్డి, వేజండ్ల రవి, నర్రా వాసుదేవరాయలు, ముస్తఫా, భిక్షమయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల పోరుబాట
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం జాబ్ చార్టుకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల విధులను అప్పగించటం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటోందని డెమోక్రటిక్ ఏపీసీఎస్డబ్ల్యూఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ బండికల్ల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలిలోని సామ్రాట్ హోటల్లో శనివారం అత్మగౌరవ సభను నిర్వహించారు. సమావేశానికి జేఎసీ రాష్ట్ర చైర్మన్ జి. జోసఫ్ కిశోర్ అధ్యక్షత వహించారు. సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి వారి విధులను కూడా సచివాలయంలోని ఉద్యోగులకు అప్పగించడం వల్ల సతమతమవుతున్నారని తెలిపారు. వలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్లను ఉద్యోగులకు బదలాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఉద్యోగులపై పని భారం పెంచటం వల్ల మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు జేఎసీలుగా చలామణి అవుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రెండు వేల మందిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం దిగిందని, వెంటనే దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పారు. జేఏసీ రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ అప్పికట్ల కిశోర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన జాబ్ చార్టును ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జేఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ ప్రకటించటంతో పాటు హేతుబద్ధంగా పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ట్రెజరర్ దుర్గాప్రసాద్, కన్వీనర్లు జీవన్ సాగర్, మదన్ మోహన్, శంకరరావు, శామ్యూల్, డైమండ్ బాబు, కీర్తి సాగర్ పాల్గొన్నారు. తెనాలిలో కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర జేఎసీ నాయకులు -
పేటలో దంచికొట్టిన వాన
నరసరావుపేట రూరల్/నరసరావుపేట: మండలంలో శుక్రవారం రాత్రి పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు హడలెత్తారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వాన ఉరుములు, పిడుగులతో క్రమంగా పెరిగింది. భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దాదాపు రెండు గంటలపాటు నరసరావుపేట సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి. భారీ వర్షంతో మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదరెడ్డిపాలెం, గోనెపూడి గ్రామాల సమీపంలోని చప్టాల మీద నీరు ప్రవహించింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మెట్ట పంటలకు తీవ్ర నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె దశలో ఉన్న పత్తి పంటకు కూడా నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. అపార్టుమెంట్పై పడిన పిడుగు పెద్దచెరువు నుంచి వల్లప్పచెరువుకు వెళ్లే రోడ్డులోని ఓ అపార్టుమెంట్పై శుక్రవారం రాత్రి పిడుగు పడింది. టెర్రస్పైనున్న పిట్టగోడ కొద్దిభాగం ధ్వంసమైంది. దీని ధాటికి లిప్ట్కు ఉపయోగపడే ఎలక్ట్రికల్ బోర్డు కాలిపోయింది. లిఫ్ట్ ఆగినా అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకుగాను 17 మండలాల్లో వాన కురిసింది. అత్యధికంగా ముప్పాళ్ల మండలంలో 72.6 మి.మీ. పడింది. నరసరావుపేటలో 45, నాదెండ్ల 4.2, చిలకలూరిపేట 16.6, రొంపిచర్ల 4.6, ఈపూరు 3.6, నూజెండ్ల 2.8, నకరికల్లు 20.6, రాజుపాలెం 21.8, సత్తెనపల్లి 54.8, పెదకూరపాడు 7.4, అమరావతి 30.4, క్రోసూరు 20.8, అచ్చంపేట 60.6, బెల్లంకొండ 12.6, మాచవరం 5.4, పిడుగురాళ్లలో 8.6 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
పెద్దాసుపత్రికి సుస్తీ
గుంటూరు మెడికల్: ఉమ్మడి ఏపీలో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్లో సమస్యలు ఏకరవు పెడుతున్నాయి. ఇటీవల డయేరియా బాధితుల వార్డులో వసతులు లేక రోగులు నరకయాతన పడ్డారు. నేడు పెద్దాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. పిల్లల వార్డులో పలు సమస్యలు తిష్ట వేశాయి. ఇటీవల గుంటూరు నగరంలో డయేరియాతో సుమారు 200 మంది వరకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందారు. బాధితుల కోసం ఆస్పత్రి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో వసతులు కరువయ్యాయి. సైలెన్ స్టాండ్స్ సరిపడా లేక కిటికీలకు వేలాడదీశారు. పడకలపై బెడ్ షీట్స్ లేవు. మరుగుదొడ్లలో నీటి సమస్య నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. సమస్యల మధ్యే రోగులు చికిత్స పొందారు. సమస్యలు స్వాగతం నేడు వాంతులు, విరేచనాలతో అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు పిల్లల వైద్య విభాగానికి వచ్చారు. ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతూ, మరో పక్క వార్డులో వసతుల లేమి, సమస్యల మధ్యే చికిత్స పొందుతున్నారు. వార్డు వ్యాధి బాధితులతో కిక్కిరిసి పోయింది. ఏసీలు పనిచేయక చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పడకలపై కనీసం బెడ్షీట్లు కూడా లేవు. మంచాలు సైతం తుప్పు పట్టిపోయాయి. రోగి పడుకుని చికిత్స పొందాలంటేనే భయపడే విధంగా ఉన్నాయి. వార్డుల్లో వైద్య సిబ్బందికి సైతం వసతులు లేక ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లల వార్డులోని బాత్రూమ్కు కనీసం డోర్ కూడా లేకపోవడం దారుణం. తనిఖీలకే అధికారులు పరిమితం ఆస్పత్రి అధికారులు ప్రతిరోజూ తనిఖీల పేరుతో పలు వార్డుల్లో తిరుగుతున్నా ప్రయోజనం లేదు. వార్డుల్లో సమస్యలు అధికారులు కనిపించటం లేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించటం లేదనే ఆరోపణలు సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ‘మీ కోసం మేము’ అనే కార్యక్రమాన్ని ఆస్పత్రి అధికారులు నిర్వహిస్తున్నారు. రోగులను ఒకచోట సమావేశపరిచి సమస్యలు ఉంటే చెప్పాలని, తక్షణమే పరిష్కరిస్తామని భరోసా మాటలు చెబుతున్నారు. అయితే, అవి కార్యరూపం దాల్చడం లేదు. అధికారుల తూతూమంత్రంగా తనిఖీలు చేసి సమస్యలు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి, ప్రశాంతమైన వాతావరణంలో వైద్యసేవలు అందించేలా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు. -
జీవితాంతం వైఎస్సార్సీపీతోనే ఉంటాం
ముప్పాళ్ళ: వైఎస్సార్సీపీ అధినాయకత్వ నిర్ణయమే తమ నిర్ణయమని, ప్రాణం ఉన్నంత వరకు పార్టీతోనే ఉంటామని ఎంపీటీసీ సభ్యులు మలిరెడ్డి అనూష (లంకెలకూరపాడు),గోగుల అంజిబాబు (మాదల), షేక్ బందెల హుస్సేన్బీ (తొండపి)లు చెప్పారు. అమ్ముడుపోవడం.. కొనుక్కోవడం వైఎస్సార్సీపీ నైజం కాదని స్పష్టం చేశారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీసాయిబాబా ఆలయ ఆవరణలో శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డితో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి నాయకులు ఎంపీపీ పదవి కోసం అడ్డదారులు తొక్కుతూ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఎవరి ప్రలోభాలకూ లొంగబోమని, చివరివరకు వైఎస్సార్సీపీతోనే ఉంటామని చెప్పారు. పరాయి బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచి, పదవుల కోసం టీడీపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల నిర్ణయమే తమ నిర్ణయమని తేల్చి చెప్పారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి, ఆయన్ను శాలువాతో సన్మానించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి, ఇందూరి నరసింహా రెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ప్రభాకరరెడ్డి, యనమాల సింగయ్య, అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, కాటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ సభ్యులు -
పల్నాడు
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025జె.పంగులూరు: మండల పరిధి కొండమంజులూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు 365 సైకిళ్లను శనివారం ఉచితంగా అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,106 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 82,090 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అది... ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న ప్రాంతమది.. కానీ రాకపోకలకు ప్రయాణికులు కనీస సౌకర్యాలు కూడా లేక కష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. అమరావతిలో ఎక్కడా బస్ షెలర్లు లేకపోవటంతోపాటుగా ఊరి చివర ఉన్న బస్టాండ్ నిర్వహణలో నిర్లక్ష్యమే వారికి శాపంగా మారింది. ఏడాదిగా వారు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. గతంలో బస్టాండు స్థలంలో చెట్లు ఏడాదికొకసారి కొట్టించేవారు. ప్రస్తుతం అలా కొట్టకపోవటంతో అడవిలాగాకంపచెట్లు బాగా పెరిగాయి. మురుగు నీటి నిల్వతో విషసర్పాలు సమీపంలో ఉన్న ఇళ్లలోకి రావటం పరిపాటిగా మారింది. రోజుల తరబడి తీవ్ర దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగాయి. స్థానికులు రోగాల పాలవుతున్నారు. – నక్కా వెంకట నాగరత్నం, అమరావతిఅమరావతి: అమరావతికి దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు నిత్యం వస్తుంటారు. ముందు చూపుతో సుమారు 50 ఏళ్ల క్రితం అమరావతి బస్టాండుకు సుమారు ఆరు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. గుంటూరు నుంచి క్రోసూరు, అచ్చంపేట మండల కేంద్రాలు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మధ్యలో ఉన్న అమరావతి ఆర్టీసీ డిపో నిర్మాణానికి అనువుగా ఉంటుందని సర్కారు ఈ స్థలం ఇచ్చింది. ఇప్పటి వరకు అందులో కొద్ది స్థలంలో మాత్రమే బస్టాండ్ నిర్మించారు. మిగిలిన స్థలం నిరుపయోగంగా కంప చెట్లతో అడవిని తలపిస్తోంది. వాన పడితే నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ప్రయాణికులతోపాటు పక్కన కాలనీ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో తాగుబోతులు పెరిగారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. ప్రయాణికులకు బస్సుల సమయాలను చెబుతూ, బస్టాండు నిర్వహణను ఒకరు చూస్తున్నారు. మరొకరు దుర్గావిలాస్ సెంటర్లో ఉంటూ విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి బస్సులను క్రమపద్ధతిలో పెట్టించి ప్రయాణికులను పంపుతూ ఆక్యుపెన్సీ రేటు పెంచే పనులు చేస్తున్నారు. బస్టాండ్లో అధ్వానంగా వసతులు బస్టాండ్లో చీకటైతే విద్యుద్దీపాలు తక్కువగా ఉండటంతో రోడ్డుపైకి వచ్చి ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ఆరు ఫ్యాన్లకుగాను సగం పనిచేయడం లేదు. రాత్రివేళ విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి డిపోల బస్ సర్వీసుల డ్రైవర్లు, కండక్టర్లు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఆ గది గోడలు పగుళ్లిచ్చాయి. ఇనుప మంచాలు తుప్పుపట్టి, పరుపులు చిరిగిపోయి ఉన్నాయి. ప్రయాణికులకు తాగునీరు అందించడానికి ఒక్క పంపు మాత్రమే ఉంది. మిగిలినవి పని చేయటం లేదు. వానజల్లు పడితే చాలు బస్టాండులోని ప్రయాణికులు తడిసిపోవాల్సిందే. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం లోపించింది. ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం సుమారు 4 వేల మందికిపైగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. మండల కేంద్రమైన అమరావతిలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు షెల్టర్ కూడా లేదు. అమరేశ్వర ఆలయం నుంచి ఊరి చివర బస్టాండు వరకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నాలుగు సెంటర్లలో బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. గతంలో అమరేశ్వరాలయం వద్ద ఉన్న బస్షెల్టర్ కాలక్రమంలో పోలీస్ ఔట్పోస్టుగా మారింది. మద్దూరు డౌన్ సెంటర్లోని బస్ షెల్టర్ తొలగించారు. అమరావతి పర్యాటక, శైవక్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం వేల సంఖ్యలో వచ్చే వారికి బస్టాండులో కనీస సౌకర్యాలు లేవు. అధికారులు లేక కొన్ని బస్సుల వారు సమయపాలన పాటించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి కనీస వసతులు కల్పించడానికి ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. – దారాప్రసాద్, అమరావతి మండల వైఎస్సార్సీపీ కార్యదర్శిఅమరావతి సెంటర్లో బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్న ప్రయాణికులుకంపచెట్లు పెరగడం వలన మరుగుగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ స్థలం అడ్డాగా మారింది. మద్యం తాగే వారికి అనువుగా ఉంది. పక్కన ఉన్న రోడ్డులో స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నడవాలంటే మందుబాబులకు భయపడాల్సిన దుస్థితి. బస్టాండ్లో తగిన వసతులు కల్పించి, పారిశుద్ధ్యం మెరుగుపరచాలి. – బి.సూరిబాబు, అమరావతి మండల సీపీఎం కార్యదర్శిచిట్టడవిని తలపిస్తున్న ప్రాంగణంలోని పిచ్చి చెట్లుపనిచేయని తాగునీటి కొళాయిలుఅమరావతి బస్టాండు7బస్టాండ్ ఆవరణలో చెట్లు కొట్టించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. కంట్రోలర్ నియామకానికి ప్రతిపాదనలు పంపాం. మరుగుదొడ్లు, తాగునీటి కొళాయిలు, ఫ్యాన్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని కొద్దిరోజులలో సరి చేయిస్తాం. బస్టాండు స్థల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. మిగిలిన సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటాం. – విజయకుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్, సత్తెనపల్లి -
29న జెడ్పీ సర్వసభ్య సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచారం పంపారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో అజెండాలో పొందుపర్చిన అంశాలతోపాటు వివిధ శాఖల ప్రగతిపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు డివిజన్ సహకారశాఖ అధికారి సేనారెడ్డి ఆదేశం కొరిటెపాడు(గుంటూరు): ‘సహకారంలో జీతాల కుంభకోణం’ శీర్షికన ఈ నెల 10వ తేదీన సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై సహకార శాఖ డివిజనల్ అధికారి సేనారెడ్డి స్పందించారు. వివరణాత్మక నివేదిక సమర్పించాలని మండల ఇన్చార్జులను ఆదేశించారు. గుంటూరు డివిజన్లోని మండలాల్లో ఉన్న పీఏసీఎస్లకు కేటాయించిన మండల ఇన్చార్జులు సోమవారం సాయంత్రం 5 గంటలకు సహకార శాఖ డివిజన్ కార్యాలయానికి ఆధారాలతో వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. అలాగే సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ కూడా ఆరా తీసినట్లు సమాచారం. చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలులోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా వాంతులు, విరేచనాలు, జ్వరాల కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చేబ్రోలులోని చెరువులోపాలెంలో శనివారం ఐదుగురికి డయేరియా లక్షణాలు కనిపించటంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నారు. రెండు రోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు జ్వరాలబారిన పడ్డారు. ప్రభుత్వ వైద్యశాలలతోపాటు స్థానిక ఆర్ఎంపీలు, గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలల్లో కూడా వారు చికిత్స పొందుతున్నారు. చెరువులోపాలెంలో ఆహార కలుషితం కారణంగానే వాంతులు, విరేచనాలు బారిన పలువురు పడినట్లు పీహెచ్సీ అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. తాడికొండ: అమరావతిలో నిర్మించిన ఏపీ సీఆర్డీ ఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ శనివారం సందర్శించారు. ప్రాజెక్టు కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ీసీఆర్డీ ఏ కమిషనర్ కన్నబాబు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో సీఆర్డీ ఏ అడిషనల్ కమిషనర్ ఎ. భార్గవ్ తేజ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ వీరరాఘవయ్యరేపల్లె: విద్యార్థి దశ నుంచే ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రేపల్లె బ్రాంచి చైర్మన్ డాక్టర్ వసంతం వీరరాఘవయ్య సూచించారు. ప్రథమ చికిత్స, సీపీఆర్లపై పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గుంటూరు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరరాఘవయ్య మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారు వైద్యశాలకు వెళ్లేలోపు ప్రథమ చికిత్స వల్ల కొంత మేర వైద్యం అందుతుందని, దీనివల్ల రక్షణ లభిస్తుందని తెలిపారు. ఎవరైనా గుండెపోటుకు గురైతే వైద్యశాలకు వెళ్లే ముందు సీపీఆర్ అందిస్తే అతను బతికేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వివిధ సందర్భాల్లో గాయపడిన వ్యక్తులకు అందించే ప్రథమ చికిత్సలు, గుండెపోటు వచ్చిన సమయంలో అందించే సీపీఆర్ని గుంటూరు రెడ్క్రాస్ సొసైటీకి చెందిన డాక్టర్ రసూల్ బృంద సభ్యులు ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీసీ రవిచంద్రకుమార్, కోఆర్డినేటర్ బుజ్జిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో ఆర్కే నారాయణ్ జయంతిని నిర్వహించారు. ఆయన సాహితీ సేవలను విద్యార్థులకు వివరించారు. ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు బాలికా హక్కులు, సమాన అవకాశాలు, శక్తి వికాసంపై వ్యాస రచన, వక్తృత్వం పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శక్తి వికాస్ సెల్ ఇన్చార్జ్ సుభాషిణి, సీడీపీవో సుచిత్ర, సీఆర్ఏఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ హిమబిందు, టి.రాధిక, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రెంటచింతల: స్థానిక పీహెచ్సీ కేంద్రానికి వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.రవి వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్సీ కేంద్రాన్ని ఆయన శుక్రవారం జిల్లా మలేరియా అధికారి రత్నాకర్తో కలసి ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్లో నిర్వహిస్తున్న పరీక్షల గురించి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం జ్వరాల సీజన్ కాబట్టి ల్యాబ్ టెక్నిషియన్లు నిత్యం ఆస్పత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బందికి తగు సలహాలు, సూచనలు అందిస్తూ ఉండాలన్నారు. ప్రస్తుతం పీహెచ్సీ పరిధిలో వస్తున్న జ్వరం కేసుల వివరాలను మెడికల్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాలు(ఓపీ) నమోదు, ఆస్పత్రిలో రోగులకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు, రక్త పరీక్షల వివరాలు, మందులు ఇచ్చే విభాగం పనితీరు, వివిధ రికార్డులు పరిశీలించారు. అనంతరం రెంటచింతల గ్రామంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఫ్రైడే డ్రైడేను పరిశీలించి స్థానిక ఆరోగ్య సిబ్బందికి విష జ్వరాలపై పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఎన్.కోటేశ్వరరావు, మలేరియా సూపర్వైజర్ సీహెచ్ అంకమ్మరావు, ఎంపీహెచ్ఈఓ ఏడీ శర్మ, ఎ.ఆంజనేయులు, హెల్త్ అసిస్టెంట్ షేక్ ఖాసింసా, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టిడ్కో ఇళ్లు పంపిణీకి సిద్ధం
నరసరావుపేట: మున్సిపాలిటీ పరిధిలో 199 టిడ్కో ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కలెక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి శుక్రవారం పురపాలక సంఘ పరిధిలోగల టిడ్కో హౌసింగ్ కాలనీ, వినుకొండరోడ్డులోని జగనన్నకాలనీలను సందర్శించారు. టిడ్కో గృహ సముదాయంలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 23 నాటికి మరిన్ని ఇళ్లను జతచేసి 200కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయనున్నామని చెప్పారు. స్వాధీన పరుచుకున్న ఇళ్లలో ఖచ్చితంగా ఎవరో ఒకరు నివాసం ఉండేలా చూడాలని లబ్ధిదారులను కోరారు. నివాసం లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు కాలనీలు నెలవుగా మారే అవకాశం ఉంటుందన్నారు. కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న మరో 270 ఇళ్లకు సంబంధించి కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాలు మంజూరు కాని 300 మందికి పైగా లబ్ధిదారులకు అన్ని బ్యాంకుల ద్వారా క్యాంపు ఏర్పాటుచేసి రుణాలు మంజూరు చేసి మరీ ఇళ్లు స్వాధీనం చేస్తామన్నారు. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్న ఇళ్లకు 23 నాటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారుల నుంచి కాలనీలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వీధిదీపాలకు సాయంత్రంలోగా మరమ్మతులు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో టిడ్కో కాలనీ తీర్చిదిద్దామని దీనికి కృషిచేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతూ మిగిలిన వారికి కూడా టిడ్కో గృహాలను స్వాధీనం సత్వరమే చేయాలని కోరారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో సమస్యలు పరిష్కరించండి వినుకొండ రోడ్డులోని అర్బన్ హౌసింగ్ లేఅవుట్ (జగనన్న కాలనీ)లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాలనీలో పర్యటించిన ఆమెకు కాలనీ ఏర్పాటు, అందులోని పరిస్థితులను ఎమ్మెల్యే, అధికారులు వివరించారు. రహదారులు బాగాలేవని, మురుగు కాలవల నిర్మాణం చేపట్టాలని, విద్యుత్తు లైన్లను వేయించాలని స్థానికులు కోరారు. ఆ సమస్యలు విన్న కలెక్టర్ తహసీల్దారు, పంచాయతీ అధికారులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, అధికారులు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
న్యాయమైన పరిహారం అందజేస్తేనే భూములు ఇస్తాం
నరసరావుపేట రూరల్: న్యాయమైన పరిహారాన్ని అందజేస్తేనే భూ సేకరణకు సహకరిస్తామని కేసానుపల్లి గ్రామ రైతులు స్పష్టంచేశారు. చీరాల ఓడరేవు–నకరికల్లు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం శుక్రవారం కేసానుపల్లి గ్రామ రైతులతో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమావేశం నిర్వహించారు. సమావేశానికి భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు. జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి రూ.80 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని జేసీ తెలిపారు. జేసీ ప్రతిపాదనకు భూ నిర్వాసితులు అంగీకరించలేదు. గతంలో నిర్వహించిన సమావేశాల్లో ప్రకటించిన విధంగా ఎకరానికి రూ.1.60 కోట్లు పరిహారం చెల్లించాలని కోరారు. గ్రామానికి చెందిన 42 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని, ఇందులో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని వివరించారు. ఆ భూములనే నమ్ముకున్న రైతులు భూసేకరణ ద్వారా జీవనాధారం కోల్పోతారని పేర్కొన్నారు. గతంలో చెప్పిన పరిహారంలో సగం ధరకే ఇప్పుడు భూములు ఇవ్వాలని అధికారులు చెప్పడాన్ని తప్పుపట్టారు. న్యాయమైన పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ రైతులను అధికారులు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామినేని రామారావు, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
బాపట్ల టౌన్: మండలంలోని చెరువుజమ్ములపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్– 14 బాలబాలికల హాకీ టీంను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం. గోపి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. పోటీలకు బాలురు 18, బాలికలు 18 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరంతా ఈనెల తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో జరిగే 69వ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో–2 డి. ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి.కృష్ణారావు, ఉపాధ్యాయులు బి. గంగాధర్, ఎం. సాంబశివరావు, వాణీ సుశీల, ఏ.టి.రాంబాబు పాల్గొన్నారు. -
విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలి
పెదకాకాని: విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి పరిశ్రమలను స్థాపించాలని, వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేపట్టి విజయవంతం కావాలని పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్, ఐఈఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ‘ఆమేయా –2కే25’ ముగింపు వేడుకలకు శుక్రవారం ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకోవడానికి, పరిశ్రమలకు తగ్గట్టు సన్నద్ధం అవటానికి విద్యార్థి దశ కీలకమన్నారు. మొబైల్ యాప్లను వినియోగించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా వాటి తయారీపై దృష్టిసారించాలని సూచించారు. సదస్సులో జిగ్ టెక్, పేపర్ అండ్ పోస్టర్ ప్రజెంటేషన్, ఆర్సీ కార్నేజ్, పిక్టో, క్రిక్ క్విజ్ వంటి సాంకేతిక పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రావెల నవీన్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ టి.శ్రీనివాసరావు, సంధానకర్త వి.కిరణ్ కుమార్, ఐఈఎం విద్యార్థి విభాగ సభ్యులు ఎస్.పవన్ సాయి, సీహెచ్ విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు కారంచేడు విద్యార్థులు
కారంచేడు: త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కారంచేడు విద్యార్థులు ఎంపికయ్యారు. ఒంగోలులో ఈ నెల 7న నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలకు కారంచేడు యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 60 కేజీల బాలికల విభాగంలో భవ్యశ్రీ , బాలుర విభాగంలో బి. సుదీప్కుమార్ ఎంపికయ్యారు. 55 కేజీల విభాగంలో కె. దుర్గ ఎంపికై నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులను శుక్రవారం చీరాల డిప్యూటీ ఈఓ కె. గంగాధర్ అభినందించారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి గ్రామానికి, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పాఠశాల పీడీ షేక్ మస్తాని, ప్రధానోపాధ్యాయురాలు ఎం. సామ్రాజ్యాన్ని అభినందించారు. -
స్వయం సహాయక సంఘాలకు రూ.5.07 కోట్లు కేటాయింపు
నరసరావుపేట రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో పల్నాడు జిల్లాకు రూ.5.07 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటాయించారని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పేర్కొన్నారు. శుక్రవారం కోటప్పకొండ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం గ్రామనిధి అనే పోర్టల్ ప్రారంభించిందని, దీని ద్వారా జిల్లాలోని 26 మండలాలకు మండలానికి రూ.19.50 లక్షల చొప్పున మంజూరు చేశారన్నారు. గ్రామ సంఘాలలోని స్వయం సహాయక సంఘాల వారు అవసరం మేరకు దానిని గ్రామనిధి పోర్టల్లో అప్లోడు చేసుకోవాలని తెలియజేశారు. జిల్లా సమాఖ్య ప్రతినిధులు అందరూ కలిసి స్వయం సహాయక సంఘాలకు గ్రామ సంఘం అసిస్టెంట్లుగా మహిళలు మాత్రమే కొనసాగాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సంఘం అసిస్టెంట్గా మహిళలు ఉంటే ఏవిధమైన సమాచారమైన చెప్పకోవటానికి అభ్యంతరాలు ఉండవని జిల్లా సమాఖ్య ప్రతినిధులు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి తెలియచేశారు. ఏపీడీ రాజా ప్రతాప్, డీపీఎంలు మల్లీశ్వరి, శ్రీనివాస్, డేవిడ్ పాల్గొన్నారు. -
వృద్ధురాలి మృతదేహానికి రీపోస్టుమార్టం
క్రోసూరు: నెల రోజుల కిందట మృతి చెందిన వృద్ధురాలు చిలకా ఆరోగ్యమ్మ(96) మృతదేహానికి శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ వి.వి.నాగరాజు తెలిపిన వివరాల మేరకు మృతురాలు నరసరావుపేటలో నివసిస్తూ అక్కడే నెల కిందట మృతి చెందింది. అయితే ఆమెను క్రోసూరు క్రైస్తవ సమాధుల్లో పూడ్చిపెట్టటం జరిగింది. ఆమె భర్త చాలా కాలం కిందట మృతి చెందాడు. ఆమె మృతి పట్ల అనుమానం వ్యక్తపరుస్తూ ఆమె కోడలు రూతమ్మ నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి ఎస్ఐ సీహెచ్ కిషోర్ రీ పోస్టుమార్టంకు ఏర్పాటు చేయగా తహసీల్దార్ పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో బ్రహ్మనాయుడు, సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
కల్తీ మద్యంపై సీబీఐచే విచారణ చేయించాలి
నరసరావుపేట: రాష్ట్రంలో వెలుగుచూసిన అక్రమ కల్తీ మద్యం, మరణాలపై వెంటనే సీబీఐతో విచారణ చేయించి దోషులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. కల్తీ మద్యం రాకెట్ ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే జరగదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నారా వారీ అక్రమ మద్యం ప్రజలకు తాగునీరు కంటే చాలా సులభంగా లభ్యమౌతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా 70 వేల బెల్టుషాపులు నడిపిస్తున్నారన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మూడు మెషీన్లతో నెలకు 45లక్షల బాటిళ్ల కల్తీ సారా తయారుచేయించి వివిధ బ్రాండ్ల లేబుళ్లు అంటించి మద్యం, బెల్టుషాపులకు సరఫరా చేశారన్నారు. సుమారుగా రూ.4,800 కోట్లు మద్యం ప్రియుల నుంచి కొల్లగొట్టారన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారుచేసేందుకు ఇన్ని వేల లీటర్ల స్పిరిట్ ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఒక హాస్పిటల్లో స్పిరిట్ వాడాలంటే డ్రగ్ లైసెన్స్ తీసుకొని వాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే ఇంత భారీగా స్పిరిట్ లభ్యం కాదని, ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారనేది తేలాల్సిన అవసరం ఉందన్నారు. దీని వెనుక రాష్ట్ర పెద్దలే ఉన్నారు కాబట్టి వారు చేయించే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని అన్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి వైఎస్సార్ సీపీ కోవర్టు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో టీడీపీ మీడియా పనిచేస్తుందన్నారు. ఇంత ఘోరమైన స్కామ్ వారు చేస్తూ ఎటువంటి స్కామ్కు ఆస్కారంలేని గత ప్రభుత్వ మద్యం విధానంపై తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ నాయకులను జైళ్లపాలు చేశారన్నారు. ఎన్నికలకు ముందు మద్యం తాగేవారి కడుపుపై కొట్టారని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అన్నారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నందునే వారు మాట్లాడటం లేదని, సీబీఐచే విచారణ చేయించి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి -
ఓవర్ హెడ్ ట్యాంకుపై రాజకీయ నీడలు
నరసరావుపేట: ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో చొరవ చూపాల్సిన కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసం వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పట్టణంలో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు, డిస్ట్రిబ్యూషన్ పైపులైను వినియోగంలోకి తీసుకురాకుండా వదిలేశారు. దీంతో సుమారు పది నుంచి 15వేల మంది ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన ఓవర్ హెడ్ ట్యాంకును వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రారంభించి తామే ఏర్పాటు చేశామంటూ ఓట్లు కొల్లగొట్టేందుకు కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత పథకం(అటల్ మిషన్ ఫర్ రెజోనేవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద నరసరావుపేట పురపాలక సంఘానికి గత ప్రభుత్వంలో రూ.5 కోట్లు కేటాయించింది. వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టగా మిగిలిన సుమారు రూ.కోటి నిధులతో శ్రీనివాసనగర్, ఇస్లాంపేట, కోటప్పకొండరోడ్డుతోపాటు రవీంద్రనగర్, ఆ మార్గంలోని పలు ఏరియాలలో నివాసం ఉండే వారికి తాగునీరు అందజేసేందుకు మార్కెట్ యార్డులో ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2023లో శంకుస్థాపన చేశారు. ఇప్పుడా ఆ రాయి కన్పించకుండా చేయటం గమనార్హం. యల్లమంద పంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని పురపాలక సంఘంలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంతో అనేక నివాస ప్రాంతాలకు ఈ తాగునీరు అందాల్సి వుంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయింది. దీని నుంచి నీరు అందజేసేందుకు చేపట్టిన డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి వుంది. గతేడాది కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్నెల్లుపాటు పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఏడాది జనవరిలో సుమారు రూ.44 లక్షల ఖర్చుతో డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 10 నెలలు కావొస్తున్నా ఆ పనులు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే వెంకటరెడ్డికాలనీలో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నుంచి ఆయా ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. దీని వలన సక్రమంగా నీరు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది నూతనంగా ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటుచేసుకున్నా నీరు సక్రమంగా అందట్లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి పైపులైను నిర్మాణం పూర్తిచేసి నీటిని పంపిణీ చేయాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లుగా తెలియవచ్చింది. తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా నీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. పైపులైను నిర్మాణం కోసం వినియోగించే హెచ్డీ పైపులకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అవి రాష్ట్రంలో శ్రీకాళహస్తిలోని ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. అవి రాగానే పైపులైను నిర్మాణం చేసి నూతన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు కుళాయిలు మంజూరుచేసి తాగునీరు అందజేస్తాం. –డి.రవికుమార్, మున్సిపల్ ఇంజినీరు -
రెండో సారి విచారణకు హాజరైన పీఆర్కే, పీవీఆర్
మాచర్ల బోదిలవీడు సమీపంలో ఐదు నెలల కిందట జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో విచారణకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు శుక్రవారం రెండోసారి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ మాచర్ల రూరల్ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రూరల్ సర్కిల్ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. శుక్రవారం ఉదయం10.30 నుంచి రాత్రి 7గంటల వరకు గురజాల డీఎస్పీ జగదీష్, రూరల్ సీఐ నఫీజ్ బాషాతోపాటు ఇతర అధికారులు వారిని విచారించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2గంటల వరకు భోజనం విరామమిచ్చారు. అనంతరం విచారణ కొనసాగించారు. రూరల్ పోలీసుస్టేషన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్కు వెళ్లే రోడ్డు నుంచి పీఆర్కే ఇంటి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆ మార్గంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను అనుమతించలేదు. అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన ఇరువురిని టీడీపీ అంతర్గత పోరుతో హత్య జరగగా తనపైన, తన సోదరుడుపైన అక్రమంగా కేసు నమోదు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విచారణకు వెళ్లి వచ్చిన అనంతరం శుక్రవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పొంది ఉన్న తాము కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి విచారణకు హాజరైనట్లు వెల్లడించారు. ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. పోలీసుల విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అక్రమ కేసులు పెట్టేందుకు ఈవిధంగా చేస్తున్నారన్నారు. -
కోటి సంతకాల ఉద్యమం
మాచర్ల: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద రోగులు, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కళాశాలలను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొస్తే అందులో 10 కళాశాలలు అమ్ముకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. జగన్ పిలుపు మేరకు శనివారం నుంచి నవంబర్ 24వ తేదీ వరకు దశల వారీగా వివిధ కార్యక్రమాలు చేపడతామని, కోటి సంతకాలు సేకరించనున్నామని తెలిపారు. శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్లను పీఆర్కే పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ, సంతకాల సేకరణ జరుగుతుందన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులతో కలిసి భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలు అందజేయటం జరుగుతుందన్నారు. వాటిని గవర్నర్కు జగన్మోహన్రెడ్డి అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, రాష్ట్ర, జిల్లా యువజన నాయకులు డి శ్రీనివాసరెడ్డి, నవులూరి చెన్నారెడ్డి, జిల్లా మహిళా విభాగం నాయకురాలు అనంతరావమ్మ, జిల్లా బిసి యువజన విభాగం నాయకులు పిల్లి కొండలు, జెడ్పీటీసీ పెద్ద మల్లుస్వామి, ఓరుగంటి చిన్నా, దేవళ్ల సాంబశివరావు, కొత్తపల్లి పున్నారెడ్డి, కౌన్సిలర్ మందా సంతోష్, దేవళ్ల సాంబశివరావు, పిన్నెల్లి హనిమిరెడ్డి, కందుకూరి మధు, యేరువ ప్రతాపరెడ్డి, తాళ్లపల్లి ఈశ్వరయ్య, వెంకట్రామయ్య, మోరా రామకృష్ణారెడ్డి, బొంగురు, అగ్గి రాముడు, కంభంపాటి అమర్, మద్దికర శ్రీనివాసరెడ్డి, చల్లా కాశయ్య, చల్లా మోహన్, దేవళ్ల యోగయ్య, గుంజ నాగ అంజి, ధనలక్ష్మి, తిరుమలకొండ దుర్గారావు, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో.... సత్తెనపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి పాల్గొని వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, అచ్యుత శివప్రసాదు, మౌలాలి, రాయపాటి పురుషోత్తం, ఇందూరి నరసింహారెడ్డి, సతీష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో పోస్టర్ ఆవిష్కరిస్తున్న సమన్వయకర్త గజ్జల సుధీర్భార్గవరెడ్డి, పార్టీ నాయకులుపార్టీ కార్యాలయంలో వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు నరసరావుపేట:ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే యోచనపై పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవా రం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం వాల్పోస్టర్ను నా యకులు, కార్యకర్తలతో కలసి ఆవిష్కరించారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ లో నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాలు చేయాల్సిన అవసరం ఉందన్నా రు. డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారు లు, రైతులు, విద్యార్థులు, యువజనుల ను భాగస్వామ్యం చేయాలన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సంయుక్త కార్యదర్శులు పాలపర్తి వెంకటేశ్వరావు, కనకా పుల్లారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, డ్వాక్రా విభాగ జిల్లా కార్యదర్శి హెల్డా ప్లోరెన్స్, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, న్యాయవాదులు వై.సీతారామిరెడ్డి, బ్లెసీనా, జీనేపల్లి హనుమంతరావు, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఉప్పతోళ్ల వేణుమాధవ్, జిల్లా ఎస్సీ విభాగం కార్యదర్శి కందుల ఎజ్రా, పట్టణ వర్కింగ్ అధ్యక్షులు నిడమానూరి సురేంద్ర, అచ్చి శివకోటి, జిల్లా కోశాధికారి అన్నా మోహన్, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, పట్టణ మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సిలార్బాషా, ఎస్సీ విభాగం పట్టణ కార్యదర్శి పౌలయ్య, పచ్చవ రవీంద్రబాబు, ఖాదర్బాషా, ఫణీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● మాజీ మంత్రి విడదల రజిని ● కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరణ
చిలకలూరిపేట:రచ్చబండ ద్వారా ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాసంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమ కార్యక్రమం పోస్టర్ ను పార్టీ నాయకులతో కలసి శుక్రవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని కోరుతూ వైఎస్సా ర్ సీపీ 45 రోజులపాటు గ్రామ స్థాయి వరకు ప్రజా ఉద్యమం ప్రారంభించిందని తెలిపారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్యకళాశాలల నిర్మాణం చేపట్టారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య దూరం చేసేలా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలా ల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహారావు, మంగు ఏడుకొండలు, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఏకాబరపు సునీత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
● పావులు కదుపుతున్న తమ్ముళ్లు ● ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదింపులు ● పార్టీ మారేదిలేదని తేల్చి చెప్పిన ఎంపీటీసీ సభ్యులు పెదకాకాని: ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలకు ఫోన్లు చేసి నయానా, భయానా చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీలు మారి పరువు పోగొట్టుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు ఎంపీటీసీ సభ్యులు స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడిని ఎన్నుకొని నాలుగేళ్లు పూర్తయ్యింది. నాలుగేళ్ల వరకూ ఎంపీపీ కుర్చీపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారు. గత నెల సెప్టెంబరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెదకాకాని మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, ఒక హామ్లెట్ విలేజ్ ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆధారంగా మండలంలో 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు టీడీపీ చెందిన ఎంపీటీసీలు గెలుపొందారు. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న వైఎస్సార్ సీపీ నుంచి అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావును ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ్ముళ్లు రాయబారాలు నడుపుతున్నప్పటికీ పార్టీ మారడానికి, ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి వారి మద్దతుతో విజయం సాధించి పదవీకాలం పది నెలలు ముందు తాము పార్టీ మారడానికి, చేతులెత్తడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ మారిన వారిని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ కూడా సాగుతోంది. -
కార్యాలయం దాటని పాస్పుస్తకాలు
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గానికి చేందిన రైతు సుబ్బారావు ఇటీవల రైతు సేవా కేంద్రానికి ఎరువుల కోసం వెళ్లారు. ఆయనకు రీసర్వే జరిగిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే యారియా ఇస్తామని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. ప్రస్తుతం రైతులకు పంట రుణాలు ఎంతో అవసరం. బ్యాంక్కు వెళ్లితే పాస్పుస్తకాలు లేకపోవడంతో రుణాలు ఇవ్వలేదు. తహసీల్దార్ కార్యాలయాలకు ఈ పుస్తకాలు వచ్చి రెండు నెలలు గడిచినా గడప మాత్రం దాటలేదు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేస్తారని చెబుతుండటంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. 97,027 పుస్తకాలు ఇవ్వాలి... పల్నాడు జిల్లాలో మొత్తం 97,037 కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు రాజముద్రతో తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి. నర్సరావుపేట రెవెన్యూ డివిజన్లోని 10 మండలాల్లో 83,201, సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్లోని 4 మండలాల్లో 9,465, గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 4,361 పాస్పుస్తకాలు రైతులకు అందాల్సి ఉంది. అన్నింటికీ కీలకం... రుణమాఫీ, రైతు బంధు, అన్నదాతా సుఖీభవ, పంట రుణాలు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతు బీమా, విత్తనాలు, ఎరువుల రాయితీలు, యంత్ర పరికరాలు, పాడిపశువులు, ఉద్యాన పంటలకు ఉపయోగించే సామగ్రిపై రాయితీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రామాణికం. రిజిస్టేషన్ పక్రియ ముగిసిన తర్వాత పుస్తకాలు రాకపోవడంతో ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పథకాల కింద లబ్ధిని రైతులు కోల్పోవాల్సి వచ్చింది. సకాలంలో పుస్తకాలు పంపినీ చేయకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మా ఆత్మగౌరవాన్ని కాపాడండి...
పిడుగురాళ్ల: తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని సచివాలయ ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని వాపోతున్నారు. వీటితోపాటు తమ ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలంటీర్లను తొలగించటంతో ఆ విధుల భారాన్ని తమపై మోపారన్నారు. జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇప్పటికీ ఏ శాఖలో పని చేస్తున్నామో అర్థం కావటం లేదు. రేషలైజేషన్ ప్రక్రియతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళలకు గౌరవం లేకుండాపోతోంది. శానిటరీ సెక్షన్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటలకు రోడ్లపై విధులు కేటాయిస్తున్నారు. కార్యాలయాల్లో వసతులు కూడా లేవు. – దీప్తి, మహిళా పోలీస్ -
నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపుమేరకు శుక్రవారం నుంచి విద్యార్థులకు పాఠాలు మాత్రమే చెబుతామని, బోధనేతర పనులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు గురువారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారి జె.ఎస్.ఎన్. ప్రసాద్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ.. మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనాసమయం హరించుకుపోతోందన్నారు. ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గిపోయేలా ఈ కార్యక్రమాలు పెరిగాయన్నారు. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అందుకే 10వ తేదీ నుంచి బోధనకే పరిమితం కానున్నామని, నాణ్యమైన విద్యను అందించాలని ఫ్యాప్టో నిర్ణయించిందన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపట్టనున్నారని చెప్పారు. మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ చూస్తామన్నారు. మిగతా బోధనేతర పనులను నిలిపి వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు కట్ట నరసింహారావు. ఎన్.ఐజాక్, దాసరి మరియదాసు, కృష్ణ కిషోర్, మంటి సాంబశివరావు, జాన్సైదా ఫైజుల్లా, సీహెచ్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి బోధనేతర పనులను బహిష్కరించనున్నట్టు ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.మోహనరావు తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించిన ఉపాధ్యాయుల పోరుబాటలో తీనుకున్న నిర్ణయం మేరకు వీటిని బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళకు వినతిపత్రం అందజేవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్రవారం నుంచి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మినహా ఇతర బోధనేతర పనులకు సంబంధించి యాప్లను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. యాప్ల భారంతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతూ, బోధనపై దృష్టి పెట్టలేక పోతున్నారని తెలిపారు. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు ఉస్మాన్, చంద్రజిత్యాదవ్, కె.శ్రీనివాసరెడ్డి, టి.వెంకటేశ్వర్లు, ఈ.ఏమండీ, పి.వి.భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. క్రోసూరు: రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు శుక్రవారం నుంచి బోధనేతర పనులు బహిష్కంచనున్నట్లు మండలంలోని ఫ్యాప్టో సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి ఎం.గణేష్కు వినతిపత్రం అందచేశారు. వినతి అందచేసిన వారిలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.ఫ్యాప్టో నిర్ణయం -
నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపు
శావల్యాపురం: మండలంలోని వేల్పూరు గ్రామంలో సూరాబత్తుని హనుమంతరావు (58) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అంగీకారంతో పెదకాకాని శంకర కంటి వైద్యశాలకు నేత్రదానం చేసినట్లు జిల్లా జనవిజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ సండ్రపాటి చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతరావు కార్నియాను ఇద్దరు అంధులకు అమర్చి కంటిచూపు వచ్చేలా చేస్తారన్నారు. మరణాంతరం ఎవరైనా పది గంటలలోపు నేత్రాలను దానం చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో శంకర వైద్య నిపుణులు, కుటుంబ సభ్యులు సూరాబత్తుని హైమావతి, కోటేశ్వరరావు, బొల్లా రామకృష్ణ, ఏడుకొండలు, రాములు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: పగలు పల్సర్ బైక్పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్, టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ ఆర్.ఉమేష్ నేతృత్వంలో కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్ బైక్, ఒక టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షకు కలెక్టర్ హాజరు
నరసరావుపేట: ఏపీ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, రోగ నిర్ధారణ సేవలు, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ ప్రగతి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న వాహనాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించిన సమీక్షలో 22ఏ కింద ఉన్న భూముల కేటాయింపు, హక్కుల గుర్తింపు, పత్రాల పరిశీలన, భూ వివాదాల పరిష్కారం అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
పెదకూరపాడు వద్ద రైలు ప్రమాదం
పెదకూరపాడు:పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. బోగీలు దెబ్బతిన్నాయి. బోగీల్లో ఇర్కుపోయిన ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడే చర్యలు చేపట్టారు. అత్యాధునిక పరికరాలతో బోగీలను కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటు పడినట్లే..మాక్ డ్రిల్లో భాగంగా గురువారం నిర్వహించారు. రైలు ప్రమాదాల సమయంలో ప్రయాణికులను సురక్షితంగా కాపాడి, ప్రాణ నష్టాన్ని నివారించే విషయంపై గుంటూరు రైల్వే డివిజన్లోని ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, రైల్వే బ్రేక్ డౌన్, స్టేట్ గవర్నమెంట్, ఫైర్, స్టేట్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆధ్వర్యంలో గురువారం పెదకూరపాడు రైల్వేస్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠ సేన్, సీనియర్ డివిజన్ సేఫ్టీ అధికారి విజయకీర్తి, మెకానికల్ చీఫ్ ఇంజినీర్ రవికిరణ్, ఫైర్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు, సీనియర్ డివిజన్ సిగ్నెల్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ రత్నాకర్, సేఫ్టీ చీఫ్ అధికారి కిషోర్, సీఆర్ఎస్ఈ కమల్కాంత్ పర్యవేక్షించారు. మాక్ డ్రిల్లో భాగంగా రెండు రైల్వే కోచ్లు పట్టాలు తప్పి ప్రమాదానికి గురికాగా అందులోని ప్రయాణికులు రక్తపు గాయాల మధ్య ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఉండేలా నెలకొల్పారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బోగీలలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించేందు కు అత్యాధునిక టూల్స్ ఉపయోగించారు. బోగీల కిటికీలు, రూఫ్లు కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన టెంట్లలో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.సిబ్బందిని సంసిద్ధం చేసే నిరంతర చర్య డీఆర్ఎం సుథేష్ఠ సేన్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా సిబ్బందిని సంసిద్ధత చేసే నిరంతర చర్య మాక్ డ్రిల్ అన్నారు. మాక్ డ్రిల్ ద్వారా రియల్ టైమ్లో సిబ్బంది పనితీరు ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రాణ నష్టం నివారించే లక్ష్యంగా ఇటువంటి మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతాయన్నారు. సిబ్బంది సమన్వయాన్ని మెరుగుపరుస్తుదన్నారు. –డీఆర్ఎం సుథేష్ఠ సేన్ -
మానసిక కల్లోలం.. అందుబాటులో ఔషధం
సత్తెనపల్లి: జిల్లాలో 20 ఏళ్ల క్రితం ఒకరిద్దరు మాత్రమే మానసిక వ్యాధి చికిత్స నిపుణులు ఉండే వారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలో ఇరువురు ఉంటే ప్రైవేట్గా సుమారు 10 మందికిపైగా సైకియాట్రిస్టులు ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి రోజూ 20 నుంచి 25 మంది రోగులు వస్తున్నారు. అందులో 15 మంది కొత్తవారు ఉంటున్నారు. ఇక ప్రైవేటు వైద్యుల వద్దకు సైతం సగటున రోజూ 10 నుంచి 20 మంది వరకు చికిత్స కోసం వెళ్తున్నారు. సమాజంలో తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫియా, మానియా, డిప్రెషన్ అతిగా మద్యపానం, మత్తు పదార్థాలు సేవించడం) వారు 3 శాతం, ఇతర మానసిక వ్యాధులు ఉన్నవారు 5 నుంచి 10 శాతం వరకు ఉంటారని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు గుర్తించి వెంటనే మానసిక వైద్యులను సంప్రదిస్తే రోగికి కౌన్సెలింగ్, మందుల ద్వారా నయం చేయవచ్చని వారు సూచిస్తున్నారు. మానసిక వ్యాధి లక్షణాలు.. ఆందోళన, భయం, గుండెదడ, అధిక చెమట, కాళ్లు, చేతులు వణకడం, అనవసర ఆలోచనలు, చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయడం, విచారం, పనిలో ఉత్సాహం లేకపోవడం, ఆకలి, నిద్ర లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పు, తనలో తానే నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, ఇతరులను అనుమానించడం, అతి ఆనందం, అతి కోపం, ముసలితనంలో వచ్చే సమస్యలు, కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్ర విసర్జన చేయడం, భయంకర కలవరింతలు, నిగ్రహశక్తి కోల్పోవడం వంటివి ప్రధాన లక్షణాలు. మానసిక వ్యాధులకు కారణాలు ... మానసిక ఒత్తిడి వల్లే అనారోగ్యం.... మానసిక ఒత్తిడి వల్ల కడుపులో గ్యాస్ (వాయువు), ఆవేశాకావేశాల వల్లే అధిక రక్తపోటు, అతిబద్ధకం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం, స్వార్థం, మొండితనం వల్ల డయాబెటిస్ (మధుమేహం), అతి విచారం వల్ల ఆస్తమా, ప్రశాంతత లోపించడం వల్లే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయని ఇటీవల వైద్యులు గుర్తించారు. శరీరంలో వచ్చే సర్వరోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్లతోపాటు అధిక శాతం జీవనశైలి సంబంధమైనవేనని తెలుస్తోంది. కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరోగ్యానికి , వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. కంటికి సరిపడా ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో కలిసి కొంత సమయాన్ని గడపాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు మందులు ఉన్నాయి. – డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసిక వ్యాధి నిపుణుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు -
తరగతి గది నుంచి పొలం వద్దకు..
యడ్లపాడు: పట్టణాల పరిధి దాటి, పల్లె బాట పట్టిన ఆ యువ సైన్యం... పుస్తకాల్లో చదివిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో నేర్చుకుంటోంది. వారే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బాపట్ల కళాశాల బీఎస్సీ అగ్రికల్చరల్ నాలుగో సంవత్సరం విద్యార్థులు. రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్(రావే) ప్రోగ్రాంలో భాగంగా వీరు మండల కేంద్రమైన యడ్లపాడు, జగ్గాపురం, చాగంటివారిపాలెం, పమిడిపాడు, నార్నెపాడు గ్రామాలకు సెప్టెంబర్ 17న 31 మంది వచ్చారు. వీరిని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ వ్యవసాయ విస్తరణ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఉష, జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నగేష్, విస్తరణ అధికారి డాక్టర్ సత్యగోపాల్ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక అభ్యుదయ రైతులు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలక మండలి విశ్రాంత సభ్యులు పోపూరి శివరామకృష్ణ, జాగర్లమూడి రామారావులతోపాటు మరో పది మంది శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాల్లోని జ్ఞానాన్ని క్షేత్రస్థాయి వాస్తవాలతో వారు సరిచూసుకుంటున్నారు. రైతులే గురువులుగా, వారి జీవితానుభవాలనే పాఠాలుగా మలుచుకుంటున్నారు. నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులను స్థానిక రైతులకు వివరిస్తూ, వారిలో వ్యవసాయంపై మరింత అవగాహన కల్పిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులను, భూసారం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను స్వయంగా తెలుసుకుంటున్నారు. పంట సాగుపై సందేహాలను నివృత్తి చేస్తూ, నేర్పుతూ–నేర్చుకుంటూ తమ వ్యవసాయ జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. తమ మూడేళ్ల కళాశాల జీవితం.. అలాగే మూడు నెలల గ్రామ వాసం వెరసి రేపటి వ్యవసాయ రంగానికి పటిష్టమైన పునాది కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక విధానాలపై రైతుల అనాసక్తి, పెట్టుబడి భారం పెరగడం, కౌలు వ్యవస్థతో సవాళ్లు, సాగుపై యువత అనాసక్తి చూపడం, రసాయనాల వినియోగం పెరగడం, సేంద్రియ పద్ధతులపై అపోహలు, రైతులకు ఆర్థిక భరోసా, సాంకేతిక శిక్షణ వంటి అంశాలపై వారు దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో ‘రావే’ విద్యార్థుల అనుభవాత్మక శిక్షణ -
● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా
ముప్పాళ్ల: ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై టీడీపీ నాయకులు గురి పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు పదకొండు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ ఒక్కచోట కూడా గెలిచిన దాఖలాలు లేవు. మాదల ఎంపీటీసీ సభ్యుడు మృతి చెందగా ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ, పదవి ఆశ చూపుతూ ఆరుగురు ఎంపీటీసీలను టీడీపీ వైపునకు లాక్కున్నారు. ఎంపీపీతో కలిపి నలుగురు ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీని వీడేందుకు ఇష్ట పడకపోవటంతో వారిపైన, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను దెబ్బకొట్టేలా అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్తగా తెరపైకి అవిశ్వాసం డ్రామా కొత్తగా ఎంపీపీపై అవిశ్వాస డ్రామాను టీడీపీ నాయకులు తెర లేపారు. చాగంటివారిపాలెంకు చెందిన ఎంపీపీ మారూరి పద్మపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సమావేశం నిర్వహించాలంటూ సత్తెనపల్లి ఆర్డీఓను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. ఎనిమిది మంది సభ్యులు ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాస తీర్మానం కోరుతూ వినతిపత్రం అందించాల్సి ఉంటుంది. కేవలం ఐదుగురు సభ్యులతో సంతకాలు చేయించి అవిశ్వాస తీర్మానం అంటూ డ్రామా చేస్తున్నారు. ఈ విషయం పై వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. –మలిరెడ్డి అనూష, లంకెలకూరపాడు ఎంపీటీసీ సోషల్మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓకు ఇచ్చిన పేపర్లలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వైఎస్సార్ సీపీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్లకు రేడియేషన్ థెరపీ, కిమో థెరపీ, ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు -
ముందస్తు పరీక్షలే బెస్ట్!
గుంటూరు మెడికల్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. మెమోగ్రామ్ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. మెమోగ్రామ్ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు ... జీజీహెచ్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెప్టెంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు. రొమ్ము కాన్సర్పై మహిళలకు అవగాహన అవసరం ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము కాన్సర్ బాధితులే అక్టోబరు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం సర్వత్రా ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రతి ఏడాది రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని బారిన పడకుండా ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిసున్న ప్రత్యేక కథనం. తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు
నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
రేపు రాష్ట్రస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్: దివంగత స్విమ్మర్ కానాల అంజినీ శ్రీక్రాంత్రెడ్డి స్మారకార్ధం ఈనెల 10న 8వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు నిర్వహిస్తామని మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్ది రమణారావు తెలిపారు. బుధవారం స్థానిక అరండల్పేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 జిల్లాల నుంచి మాస్టర్స్ స్విమ్మర్లు పాల్గొంటారన్నారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరిహరనాథ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలను గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం ఈతకొనలనులో ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్లను పెద్ది రమణారావుతోపాటు, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జె.లక్ష్మీనారాయణరెడ్డి, ఎం.సత్యనారాయణలు ఆవిష్కరించారు. -
గ్రామాభివృద్ధికి ‘ఉపాధి’ నిధులు వినియోగించండి
బొల్లాపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. బుధవారం మండల కేంద్రం బొల్లాపల్లిని సందర్శించి, ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. బొల్లాపల్లిలోని రామాలయం వద్ద ప్రజా సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. మండల ప్రజలు పలు సమస్యలపై కలెక్టరుకు అర్జీలు అందజేశారు. తొలుత గ్రామానికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి పొలంలో నీటికుంట, ఉద్యాన పంటలో భాగంగా సాగుచేసిన కొబ్బరి తోట, గ్రామంలో ఇంకుడు గుంతలు, చెరువు, ప్రభుత్వ కార్యాలయాలు వద్ద నేటి సంరక్షణకు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపాధి నిధులను సద్వినియోగపరచుకోవాలని ఆదేశించారు. వెల్దుర్తి, బొల్లాపల్లి, ఈ రెండు మండలాల్లో భూగర్భ జలాలు నీటిమట్టం తక్కువగా ఉన్న నీటి సంరక్షణకు, భూగర్భ జలాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిల్వకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గ్రామంలోని చెరువు అభివృద్ధి ద్వారా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా లబ్ధి చేకూరుతుందని, చెరువు అభివృద్ధి పరచి నీళ్లు వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో సైడు కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల ప్రాధాన్యత, అగ్రహార రీ సర్వ్ కు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నరసరావుపేట ఇన్చార్జి ఆర్డీవో రమణ కాంత్ రెడ్డి, డీపీఓ నాగేశ్వరరావు నాయక్, మైనర్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ రావు, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి రామ్ బాలాజీ రెడ్డి డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ చంద్రశేఖర్ మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా -
విచారణకు పిలిచి.. వాయిదా వేశారు
మాచర్ల: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదివీడు గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) సోదరులపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీఆర్కే సోదరులకు అనుకూలంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో రెండోసారి విచారణకు రావాలని పీఆర్కే సోదరులకు నోటీసులు ఇచ్చి బుధవారం విచారణకు పిలిచారు. ఉదయం 10 గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్లు, ఈనెల 10వ తేదీన విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. సత్తెనపల్లి: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండడంతో పట్టణ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి నుంచి పరస రబ్బాని, షేక్ సుభాని, షేక్ ఇర్ఫాన్, గుంటూరు ప్రసాద్, తులసీకృష్ణలు టాటా ఏస్ వాహనంలో 720 కిలోల రేషన్ బియ్యాన్ని లోడ్ చేసుకొని వెళుతుండగా అందిన సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ పవన్కుమార్ సిబ్బందితో మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని గార్లపాడు సెంటర్లో దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పౌరసరఫరాల గోదాములో రెవెన్యూ అధికారులకు అప్పగించారు. టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేసి పట్టుబడిన ఐదుగురిని బుధవారం కోర్టులో హాజరపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తెనాలిరూరల్: అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ బుర్రిపాలెం రోడ్డులోని పాలాద్రి కాల్వ సమీపంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో వన్టౌన్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి సుమారు 60 బస్తాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కారెంపూడి: మండలంలో విచ్చల విడిగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ తరలింపుకు కారెంపూడి పోలీసులు మంగళవారం రాత్రి బ్రేక్ వేశారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 90 గోతాలలో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వాసు బుధవారం విలేకర్లకు వెల్లడించారు. ఒక్కో తెల్ల గోతాంలో సుమారు 40 కిలోల దాకా రేషన్ బియ్యం ఉన్నాయని ఎస్సై పేర్కొన్నారు. ముందుస్తుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఈ సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులకు తెలిపామని వివరించారు. -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం
నర్సరావుపేట: టీడీపీలో వర్గపోరు బహిర్గతమైంది. ఇసుకలో వాటాలు కుదరక దాడులు చేసుకున్నట్లు సమాచారం. అచ్చంపేట మండలంలోని కోనూరుకు చెందిన టీడీపీ నాయకుడు శాఖమూరి శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయానికి పని నిమిత్తం కారులో వచ్చారు. తిరిగి వెళుతుండగా చిగురుపాడు దాటిన తరువాత కొందరు మాస్క్లు ధరించి అడ్డంగా నిలబడి ఆపారు. కిందకు దింపి కర్రలతో, ఇనుపరాడ్లతో తీవ్రంగా గాయపరచినట్లు సమాచారం. అయితే ఎవరు కొట్టారు.. ఎందుకు కొట్టారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. శాఖమూరి శ్రీనివాసరావును బంధువులు అదే కారులో గుంటూకు తీసుకెళ్లి, అక్కడే అనుమానితులపై కేసు పెట్టి, ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసరావుకు కుడికాలుకు తీవ్రంగా గాయమై, శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. కొందరు కోనూరు గ్రామస్తులు, సమీప బంధువులు తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో కోనూరులో ఇసుక ర్యాంపులు నిర్వహణలో శాఖమూరి శ్రీనివాసరావు నిర్వాహకులను బెదిరించినట్లు సమాచారం. వాటా ఇవ్వాలని పట్టు పార్టీ అధికారంలోకి రావడం కోసం తీవ్రంగా కష్టపడ్డానని, తనకు వాటా ఇవ్వాలని, లేకపోతే ఇసుక ర్యాంపును నడపనీయనని శ్రీనివాసరావు కరాఖండిగా చెప్పాడు. అయినా ఇవ్వకపోవడంతో ర్యాంపు నిర్వహకులపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. నదికి అడ్డంగా వేసిన రోడ్లను తీయించే వరకు పిటీషన్లపై పిటీషన్లు పెట్టాడు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి ఇసుక ర్యాంపును మూసి వేశారు. దానివల్ల కొద్దిరోజులు మాత్రమే ఇసుక రవాణాను ఆపగలిగిన శ్రీనివాసరావు తిరిగి ర్యాంపు మొదలుకావడంతో కార్యకలాపాలకు మరింత పదును పెట్టాడు. తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యే స్థాయి కంటే ఇంకా పెద్ద పోస్టులో ఉన్న వారిని ఆశ్రయించి తిరిగి ఇసుక ర్యాంపును నిలిపి వేయించాడు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులకు, శ్రీనివాసరావుకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. టీడీపీ అగ్రనాయకులు కొందరు శ్రీనివాసరావును బుజ్జగించే ప్రయత్నం చేసి, కొంతమొత్తం ముట్టచెప్పేందుకు ప్రలోభపెట్టినా వినలేదు. తాను కోరిన విధంగా వాటా కావాలంటూ భీష్మించుకుని కూర్చువడమే దాడికి కారణంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి కోనూరు ఇసుక రీచ్ నుంచి రవాణా జరగకపోయినా, ముందస్తులో భాగంగానే తహసీల్దారును కలిసేందుకు వచ్చిన శ్రీనివాసరావుపై దాడి జరగడం వెనుక టీడిపీ వారే కుట్రకు పాల్పడినట్లు ప్రజలు భావిస్తున్నారు. -
మెడి‘కిల్’ను ఉపసంహరించుకోవాలి
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య కళాశాలలను పబ్లిక్, పైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఉపసంహరించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్య వ్యవస్థ కొనసాగాలని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. -
విద్యార్థిని చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా గుళ్లపల్లి ఎన్ఆర్ఐ కళాళాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పాల్ గాంధీని వైస్ ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టగా ఆస్పత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు... గుళ్లపల్లి శివాలయం కాలనీకి చెందిన విద్యార్థి చల్లా పాల్ గాంధీకి, యశ్వంత్ అనే విద్యార్థితో ఈ నెల 7న క్లాస్రూమ్ బెంచ్పై కూర్చునే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయ్ తరగతి గదికి వచ్చి విద్యార్థులను అడగ్గా పాల్గాంధీ యశ్వంత్ను కొట్టాడని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైస్ ప్రిన్సిపల్ పాల్గాంధీపై తన మోచేతితో వీపుమీద గుద్దుతుండగా దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టాడు. చేతి వేళ్లు విరగడంతో తొలుత రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్, ఎక్సరే తీయగా కుడి చేతి వేలి ఎముక విరిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు.విద్యార్థి పాల్ గాంధీ (ఫైల్)వైస్ ప్రిన్సిపాల్ కొట్టడంతో వాచిన చేయి -
ఏఎన్యూ వీసీగా సత్యనారాయణ రాజు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా ఆచార్య సామంతపూడి వెంకట సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ నజీర్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య సత్యనారాయణరాజు ఇప్పటి వరకూ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటోమాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఏఎన్యూలో గత కొంతకాలంగా ఇన్చార్జి వీసీగా ఆచార్య కె. గంగాధరరావు విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణరాజు అగ్రికల్చర్ బీఎస్సీని మహారాష్ట్రలోని డాక్టర్ పుంజాబ్రావు క్రిషి విద్యాపీఠ్ నుంచి 1983లో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును హిమాచల్ప్రదేశ్లోని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ పారెస్ట్రీ నుంచి 1986 లోనూ, అగ్రికల్చర్ ఎంటోమాలజీలో పీహెచ్డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1990లో పొందారు. బోధన రంగంలో 28, పరిశోధనా రంగంలో 32 సంవత్సరాల అనుభవం గడించారు. రైతులు అనుబంధ అంశాల్లో 28 సంవత్సరాలకు పైగా పాలు పంచుకున్నారు. -
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి బీవీఎం సాయికుమార్ పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ‘ధీమ్–5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’పై రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు, అధ్వాన వాతావరణం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
వాల్మీకి రామాయణం మానవాళికి అనుసరణీయం
నరసరావుపేట: మహాకవి వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో రచించిన రామాయణం మానవాళికి అనుసరణీయమైన చాలా గొప్ప కావ్యమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి అందరివాడని, వాల్మీకి జయంతి ఏ ఒక్క వర్గానికి చెందినదో కాదని, అందరూ నిర్వహించుకోవాల్సిన పండుగని అన్నారు. వాల్మీకి బోయ సోదరులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్ఓ ఏకా మురళి, రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం డైరెక్టర్ గంగాధర్, డీబీసీడబ్లు ఈఓ సంతోష్ కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి రామకృష్ణ, ఆధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా -
దుష్ప్రచారంతోనే ఓటమి
● పచ్చ మీడియాతో కావాలనే విష ప్రచారం చేశారు ● అలవికాని హామీలు ఇచ్చి మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి ● సంపద సృష్టి కేవలం కూటమి నేతలు, కార్యకర్తలకే ● మనం అభివృద్ధి చేస్తే వారు ప్రైవేటీకరణ చేస్తున్నారు ● రానున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలే పాలిస్తారు ● వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా విస్త్రృత స్థాయి సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వై.వీ. సుబ్బారెడ్డి ● హాజరైన జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: కూటమి నేతలు, పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారమే గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమికి ప్రధాన కారణమని వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వై.వీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో వైఎస్సార్ సీపీ ప్రజలకు ఎంతో మేలు చేసిందని, అయితే వాటిని మరుగునపెట్టి కావాలనే కూటమి నేతలు విషప్రచారం చేశారన్నారు. మరోవైపు మూడు పార్టీలు కలసి వచ్చి అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా మోసం చేస్తున్నారన్నాని ధ్వజమెత్తారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు తాను, తన పార్టీ వారికి మాత్రమే సంపద చేరుతోందన్నారు. మనం మెడికల్ కళాశాలలు, పోర్టులు, ఆసుపత్రులు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి దోచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని, ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు చేయించాలన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలను, రచ్చబండలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. రానున్న ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలే నడిపిస్తారన్నారు. కేసులకు భయపడాల్సిన పనిలేదన్నారు. పార్టీ అండగా నిలుస్తుందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కమిటీలు ఎంతో కీలకమని, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నారు. నవంబర్ 20 నాటికి అన్ని కమిటీలు పూర్తి కావాలన్నారు. నకిలీ మద్యం, బెల్టుషాపులతో కూటమి నేతలు ప్రజల ప్రాణాలను తీస్తున్నారన్నారు. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, ఎస్ఇసీ మెంబర్లు ఈదా సాంబిరెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు యెనుముల మురళీధర్రెడ్డి, పడాల శివారెడ్డి, రేపాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎన్కే ఆంజనేయులు, పాలపర్తి వెంకటేశ్వరావు, కనకా పుల్లారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సీనియర్ నాయకులు గజ్జెల నాగభూషణరెడ్డి, దేవేళ్ల రేవతి, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, యువత, విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, అంగన్వాడీ విభాగ కన్వీనర్ హెల్డా ప్లోరెన్స్, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ అరాచకం, దౌర్జన్యాలకు నిరసనగా ప్రజలు బయటకు రావాలి. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలి. రాష్ట్రానికి జగనే దిక్సూచీ అని, కూటమి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని, జగన్ వెంట ప్రతి ఒక్కరూ నడవాలి. జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కటాన్ని విమర్శించిన చంద్రబాబు మొన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయటంలో తాను కూడా బటన్ నొక్కాడు. అయితే వారిని మోసం చేశాడు. సుమారు 15 లక్షల మంది ఆటోవాలాలు, కాబ్, లారీ డ్రైవర్లు ఉంటే 18 నిబంధనలు పెట్టి 2.96లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. –పూనూరి గౌతమ్రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పోలీసు శాఖను పర్సనల్ డిపార్టుమెంట్గా తయారుచేసి వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారు. జిల్లా మొత్తం కార్యకర్తలు ఉత్సాహంగా ఉండటంపై కూటమి నాయకులు భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవటం గ్యారెంటీ అని, అప్పుడు వారికి జగన్ 2.0 పాలన చూపిస్తాం. పోలీసులను చూసి భయపడే స్టేజ్ దాటిపోయిందని, ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయి. –డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త -
ఉపాధిలో అక్రమాలకు ఈకేవైసీతో చెక్
● మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్లో వివరాలు నమోదు ● ఈకేవైసీ చేయించుకోని వేతనదారులకు పని నిల్ ● జిల్లాలో ఉపాధి వేతనదారులు 6.05 లక్షలు పనుల్లో పారదర్శకత కోసమే... జిల్లాలో జాబ్ కార్డుదారులు: 3.51 లక్షలు ఉపాధి పనులకు వచ్చే కూలీలు: 6.05 లక్షలు యాక్టీవ్ జాబ్ కార్డుదారులు: 2.75 లక్షలు పనులకు వచ్చే యాక్టీవ్ కూలీలు: 4.71 లక్షలు ఈ ఏడాది పనులకు వచ్చిన కుటుంబాలు: 1.93 లక్షలు ఈ ఏడాది పనులకు వచ్చిన కూలీలు: 3.25 లక్షలు -
ఆదర్శనీయుడు వాల్మీకి మహర్షి
నరసరావుపేట రూరల్: మహాకావ్యం రామాయణాన్ని అందించిన మహాకవి వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ, మానవతా విలువలు ప్రతిబింబించే విధంగా మహాకావ్యం రామాయణాన్ని రచించి సమాజానికి అందించారని తెలిపారు. ఉన్నతమైన ఆదర్శ భావాలను భోదించే మధురకావ్యంగా రామాయణాన్ని రచించి యుగాలు దాటినా నేటికీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వాల్మీకి మహర్షి ప్రబోధించిన ఆశయాలను, ఆలోచనలను గుర్తుచేసుకుంటూ సన్మార్గంలో నడవటమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అని తెలిపారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(ఏఆర్) వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరసగా రెండో రోజు కొనసాగింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్లతో ఏడీబీ– వాటర్– అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో(సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ(డైరెక్టర్), సంజయ్ జోషి(ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్(సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) సమావేశమయ్యారు. అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పురపాలక– పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు– వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఐఏఎస్లను కలిశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐఏఎస్ను ఆయన చాంబర్లో ఏడీబీ బృందం కలిసినట్లు సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులలో పురోగతి, ఏడీబీ అందజేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు.జీవ ఉత్ప్రేరకాల తయారీపై అవగాహన.. బ్రెజిల్ బృంద సభ్యులకు శిక్షణకొల్లిపర: ప్రకృతి వ్యవసాయం విధానాలు, జీవ ఉత్ప్రేరకాల తయారీపై బ్రెజిల్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం కోసం 25 మంది బ్రెజిల్ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అత్తోట, దావులూరిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఆఫీసర్ లక్ష్మనాయక్, బృందం సభ్యులకు బయో ఇన్పుట్ల తయారీ, ఘన జీవామృతం తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఏడాదిపాటు పంటలతో భూమిని కప్పి ఉంచడంతో పాటు ఏ గ్రేడ్, ఏ ఫ్లస్ గ్రేడ్, ఏ ఫ్లస్ ప్లస్ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్ వంటి మోడల్స్ అనుసరించడం వలన కలిగే అనేక రకాల ప్రయోజనాలను బృంద సభ్యులకు అవగాహన కల్పించారు. దేశీ ఆవు, ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆవు పేడ, మూత్రంలో అధికంగా లభించే సూక్ష్మ జీవులు, భూమి సారాన్ని పెంచి పంటల ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పారు. బృందం సభ్యులను ఆవు దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యక్షంగా పేడ, మూత్రం సూక్ష్మజీవుల ప్రాధాన్యంపై వివరించారు. అనంతరం స్వయంగా బృందం సభ్యులు బీజామృతం, ద్రవ, జీవామృతం, విత్తన గుళికల తయారీపై తర్ఫీదు ఇచ్చారు. దావులూరిపాలెంలో న్యూట్రి గార్డెన్, ఫుడ్ బాస్కెట్, ఆరోగ్యం, పోషకాహార కార్యకలాపాల లబ్ధిదారులను కలసి నిర్వహణ, ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు జాకీర్ హుస్సేన్, కృష్ణారావు, వాణిశ్రీ పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్ నమోదు గడువు 15 వరకు పొడిగింపు
నరసరావుపేట ఈస్ట్: దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ మంగళవారం తెలిపారు. అలాగే పరీక్ష రుసుము చెల్లించేందుకు ఈనెల 16వ తేదీ వరకు గడువు పొడించినట్టు పేర్కొన్నారు. ఈమేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్ www. bse. ap. gov. in లో అందుబాటులో ఉందని స్పష్టం చేసారు. ఆన్లైన్ అనంతరం సంబంధిత ప్రింటెడ్ నామినల్ రోల్స్ను ఈనెల 18వ తేదీ లోగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ప్రాథమికోన్నత, ఎయిడెడ్, వసతి లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అలాగే దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు నమోదులో ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదనీ, పరీక్ష రాసే సమయంలో అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలని తెలిపారు. వివరాలకు ప్రభుత్వ వెబ్సైట్, డీఈఓ కార్యాలయంలోని డీఎన్ఓ పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫిరంగిపురం:కారు, ద్విచక్రవాహనాలుఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొనుగుపాడుకు చెందిన రత్నసాగర్(33) భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గుంటూరు వెళ్లారు. గుంటూరు–కర్నూలు రాష్ట్ర రహదారిలో ఇంటికి తిరిగివస్తుండగా వేములూరిపాడు వద్ద గుంటూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇన్నోవా రోడ్డుకు మరోవైపు వెళ్లింది. రత్నసాగర్తో పాటు భార్య, పిల్లలు గాయపడ్డారు. వీరితో పాటు అటువైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహన చోదకుడు గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో తరలిస్తుండగా రత్నసాగర్, గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్దీకరించారు. -
ప్రమాదకరంగా బీబీసీ కెనాల్ డ్రాప్
● ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారు పది మంది ● డ్రాప్ వద్ద రక్షణ చర్యలు శూన్యం ● పట్టించుకోని కెనాల్స్ అధికారులు నకరికల్లు: బెల్లంకొండ బ్రాంచి కెనాల్పై త్రిపురాపురం వద్ద ఉన్న డ్రాప్ ప్రమాదకరంగా మారింది. డ్రాప్ వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ఈత కొట్టేందుకు, వాహనాలు శుభ్రం చేసుకునేందుకు వచ్చే వారు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. డ్రాప్కు ఇరువైపులా కట్ట బలహీనంగా ఉంటుంది. స్థానిక యువకులు ఈత కొట్టేందుకు, ట్రాక్టర్లు, ఆటోలు శుభ్రం చేసుకునేందుకు వస్తుంటారు. అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారి కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లు, క్లీనర్ స్నానాలు చేసేందుకు దిగుతుంటారు. డ్రాప్ సమీపంలో లోతు ఎక్కువగా ఉండడం, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం, కట్ట మట్టి జారుతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం గాని కట్ట బలహీనంగా ఉన్నచోట జారకుండా చూడడం, ప్రమాదాలు సంభవిస్తున్న చోట ఎవరూ దిగకుండా చూడడం వంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. అధికారులు ఇప్పటికై నా స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు
మంగళగిరిటౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ.48,45,565 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.2,94,429 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి.వి.అమర్నాఽథ్ పర్యవేక్షించారు. ఏఎన్యూ(పెదకాకాని):ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. 13 మందికి 11 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో పేపరుకు రూ.1,860 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. బీటెక్ నప్లిమెంటరీ ఫలితాలు.. వర్సిటీ పరిధిలో బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ నప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ శివప్రసాదరావు విడుదల చేశారు. 132 మందికి 87మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఒక పేపరుకు రూ.2070 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి శివారు ఎన్నాదేవి వద్ద గల 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మంగళవారం సందర్శించా రు. 400 కేవీ సబ్స్టేషన్ అలియనేషన్లో భాగంగా ట్రాన్స్కోకు కేటాయించేందుకు ప్రతిపాదించిన 14.92 ఎకరాల స్థలాన్ని ఆయన క్షేత్రస్థాయి తనిఖీ చేశారు. ఆయనతోపాటు సత్తెనపల్లి ఆర్డీవో జీవీ రమణాకాంతరెడ్డి, తహసీల్దారు కేఎస్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. గుంటూరురూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఆదికవి వాల్మీకి జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం జాయింట్ రిజిస్ట్రార్ ఎం. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని):ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నోటీసులు అందినట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురు, దూరవిద్యలో పనిచేస్తున్న ఇద్దరు అకడమిక్ కౌన్సెలర్లకు సెప్టెంబరు 29న ఈ మెయిల్ ద్వారా వర్సిటీ అధికారులు సమాచారం అందించారు. కొద్ది నెలల క్రితం 60 ఏళ్లు పూర్తయిన వారిని తొలగిస్తూ వర్సిటీ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సెప్టెంబరు 30 వరకు విధుల్లో కొనసాగారు. తాజాగా సెప్టెంబరు 29న వర్సిటీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇదే కేటగిరిలో సుమారు 11 మంది ఉండగా వారిలో ఆరుగురికి మాత్రమే నోటీసులు అందాయి. -
ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక
చిలకలూరిపేట: చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం అండర్–19 బాలురు, బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం కృపాదానం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్యలు ప్రారంభించిన ఈ క్రీడా పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావు పర్యవేక్షించారు. ఎంపికై న బాలురు జట్టు: నాగశరత్, అస్రామ్, ఎండి అబ్దుల్ సమీర్, కె.జయరామ్, యశ్వంత్, యు హేమంత్రెడ్డి, జె అంకమ్మరావు, త్రినాథ్, ఎస్ వెంకటరాజేష్, ఎల్.లాకేష్, సీహెచ్ అక్ష, కె.వంశీకృష్ణ. బాలికల జట్టు: ఇ.ప్రశాంతి, శ్రీ చందన, జి.అనిత, జి.మనీష, నేత్ర, పి.పావని, పి.హారిక, బి.శ్రీవల్లి, బి.రష్మి, కె.శ్రావ్య, జి.గౌతమి, పి.జ్యోతి చంద్రిక, పి.అమృతవర్షిణి. ఎంపికై న క్రీడాకారులను ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావులతో పాటు పీఈటీలు, ఇతర పెద్దలు అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
యడ్లపాడు: అనుమానస్పదంగా ఓ యువకుడు ఆనవాళ్లు గుర్తుపట్టని విధంగా మృతి చెంది రోడ్డు పక్కన పడి ఉన్న ఘటన మండలంలో కలకలం రేగింది. మండలంలోని బోయపాలెం – సంగంగోపాలపురం గ్రామాల మధ్య మార్గంలో మంగళవారం ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసులు మొదట హత్యగా అనుమానించిన పోలీసులు ఘటనా స్థలి పరిశీలిన అనంతరం రోడ్డు ప్రమాదంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయపాలెం నుంచి చెంఘీజ్ఖాన్పేట వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఓ యువకుడు ముఖం ఛిద్రమై మృత్యువాత పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న యడ్లపాడు పోలీసులు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం దారుణంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందునే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని, తల పూర్తిగా నుజ్జునుజ్జుయి, ఆనవాళ్లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. మృతుడికి సుమారు 30 – 35 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెల్లని మేనిఛాయ కలిగి ఉన్నాడు. పసుపు రంగు టీషర్టు, నీలం రంగు షార్టు ధరించి ఉన్నాడు. ముఖ్యంగా, అతని ఎడమ కాలికి నల్లదారం కట్టి ఉండటాన్ని గుర్తించారు. బహుశా ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు మండలం పరిధిలోని అన్నివలస కూలీలు పనిచేసే నూలుమిల్లు, క్వారీలు, కంపెనీల్లో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవాగారంలో భద్రపరిచినట్లు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలిసినవారు యడ్లపాడు పోలీస్స్టేషన్న్లో సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగుచూడాల్సి ఉంది. -
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చేనేత వస్త్రాలు కొనిపించాలి
సత్తెనపల్లి: చేనేత రంగాన్ని పరిరక్షించాలనే చిత్తశుద్ధి పాలకులకు ఉంటే దేశంలో ప్రతి ఒక్కరితో ఒక జత చేనేత దుస్తులు కొనిపించేటట్లు ప్రభుత్వాలు ప్రచారం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి ధూళ్ళిపాళ్ల రమాదేవి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం రెండవ రోజు సభలకు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టా శివ దుర్గారావు, నందం చంద్రకళ, కామార్తి రాజులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ చేనేత కుటుంబాలలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక భవన నిర్మాణ కార్మికుల గాను, ఇతర వృత్తులలో పని చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి కనీసం నిరుద్యోగ భృతి అయిన ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత వృత్తిలో పనిచేస్తున్న మహిళలకు వచ్చే రూ. 100 ఆదాయంతో ఎలా బతకగలరని ఆమె ప్రశ్నించారు. నేడు రాష్ట్రంలో చేనేత కుటుంబాలు చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాయన్నారు. చేనేత రంగాన్ని పరిరక్షించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే చేనేత 11 రకాల రిజర్వేషన్లను ఉల్లంఘించిన యజమానులపై చర్యలు తీసుకొని, రిజర్వేషన్లు అమలు జరిపించేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేనేత కార్మికులంతా మంత్రి లోకేష్ను కలసి రిజర్వేషన్లు అమలు జరిపించాలని కోరగా రిజర్వేషన్లు అమలు జరపటం ఎవరివల్లా కాదని మంత్రి లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించామని ప్రచారం చేసుకో వటానికి కర్నూలు జిల్లా రాబోతున్నారని, ఆ సందర్భంగా చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మికులంతా కోరాలన్నారు. రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. చేనేత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గంజి మురళి మాట్లాడుతూ చేనేత కార్మికుల పట్ల రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై మహాసభలో పాల్గొన్న ప్రతినిధులు చర్చించి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించి 18 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
‘సజ్జ’తో భూసారం.. అదనపు ఆదాయం
యడ్లపాడు: పొలంలో శనగ పంట వేయడానికి ముందు ఖాళీగా ఉంచే సమయాన్ని వినియోగించుకుంటూ సజ్జ పంట సాగు చేయడం రైతులకు అదనపు ఆదాయంతో పాటు భూసార వృద్ధికి దోహదపడుతుందని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. పల్నాడు ఏరువాక కేంద్రం నిర్వహించిన క్షేత్ర దినోత్సవం, రైతు సదస్సు కార్యక్రమాలు మండలంలోని జాలాది గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో సజ్జసాగు చేస్తున్న రైతు మానుకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ సజ్జపంట సాగు ఎంతో ఆశాజనకంగా ఉందని, ఎకరానికి దాదాపు 15 – 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, తద్వారా నికరంగా రూ. 25 వేల ఆదాయం పొందవచ్చని సదస్సులో రైతులకు వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఏబీవీ 04 రకం సజ్జ అధిక దిగుబడులు ఇచ్చే అవకాశం ఉందని జాలాది రైతులు నిరూపించారని తెలిపారు. విస్తరణ విభాగం రాష్ట్ర సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ, నూతన వంగడాల సాగు ద్వారా వ్యవసాయాన్ని వాణిజ్యం దిశగా తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు. సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వీఎస్ దుర్గాప్రసాద్, చిరుధాన్యాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీవీ చంద్రమోహన్రెడ్డి, ఏరువాక కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నగేష్, శాస్త్రవేత్త పీవీ సత్యగోపాల్, నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు, ప్రకృతిసాగు విభాగం పీడీ డాక్టర్ కె.అమలకుమారి, అభ్యుదయ రైతులు దర్లు శంకరరావు, నిమ్మల శంకరరావు, పోపూరి శివరామకృష్ణ, గంటా రమేష్, జాగర్లమూడి రామారావు, ముద్ర పున్నారావు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కులగణన చేపట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లక్ష్మీపురం: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఏ తరహాలో కులగణన చేశారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా చేసేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాయలంలోని మల్లయ్య లింగం భవన్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనగణనలో కులగణన తక్షణమే చేపట్టాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరుతూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనగణనలో కులగణన చేయడమే కాకుండా త్వరలో జరుగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన చేపట్టాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులగణన జరిగితే బీసీలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు కులగణన కోసం క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీసీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సీపీఐ నాయకులు జంగాల అజయ్కుమార్, ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల పరప్రసాద్, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఖాజావలి ప్రసంగించారు. -
పులిచింతలకు 32,741 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 3 క్రస్ట్గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 32,741 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 2 క్రస్ట్గేట్లు 1.5 మీటర్లు, మరో క్రస్ట్గేటు 2 మీటర్లు ఎత్తు ఎత్తి 24,116 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,625 క్యూసెక్కులు మొత్తం 32,741 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.080 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 55.91 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం 33,211 క్యూసెక్కులు వస్తుందని వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఖతార్ దేశంలోని దోహాలో రిజిస్టర్డ్ నర్సుల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ జీఎన్ఎం నర్సింగ్ పూర్తిచేసి రెండు సంవత్సరాల అనుభవం కలిగి 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 13వ తేదీన విజయవాడ రమేష్ హాస్పటల్ రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని ఓఎంసీఏసీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు రోజుకు 12గంటలు, వారానికి 6 రోజులు పనిదినాలు, ఏడాదికి 20 రోజులు సెలవులు ఉంటాయన్నారు. నెలకు సుమారు రూ1.2లక్షలు వేతనం లభిస్తుందని తెలిపారు. అభ్యర్థులు 2 సంవత్సరాల ఒప్పంద కాలానికి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 9988853335, 8712655686, 8790118349 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.