Palnadu District News
-
చిన్నారుల సృజనకు పదను..
గురజాల: పల్నాడు విద్యార్థులు కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోశారు. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తరగతి గదుల్లో బట్టిచదువులు స్వస్తి చెప్పి సృజనకు పదను పెడుతున్నారు. అందుకు నిపుణుల సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించేందుకు చిన్నారులు సిద్ధమయ్యారు. రహదారి ప్రమాదాలు, దొంగతనాల నివారణ దృష్టి పెట్టారు. సరికొత్త ప్రాజెక్టును ఆవిష్కరించారు.. గురజాలకు చెందిన మట్టపల్లి మన్హితా రియా,కూరపాటి ఆశ్వని కిర్తీ,మేకల సాయి చరణ్, మేకల అరవింద్, బండి ఆశ్మీత. రోబోటిక్ నిపుణులు ఎస్ఆర్ఎంయూ డైరెక్టర్ దాసరి నరేంద్ర కుమార్ సహకారంతో ముందుకు సాగారు. చిన్నారుల లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరి వారవుతున్న జీవితాలను చూసి చలించిపోయారు. దీంతో ఆ చిన్నారుల మనస్సులో ప్రమాదాలు నివారించాలనే ఆలోచన తట్టింది. సెన్సార్ టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. రూపొందించేందుకు నెల రోజుల వ్యవధి కాగా రూ.5వేలు ఖర్చు చేసినట్లు చిన్నారులు చెబుతున్నారు. పనిచేసే విధానం.. వాహనం స్టార్ట్ చేయడానికి ముందుగానే హెల్మెట్ ధరించాలి. వాహనదారుడు వాహనం ఎక్కాగానే హెల్మెట్ ధరించాడా లేదా అని గుర్తు చేస్తుంది. హెల్మెట్లో ఏర్పాటు చేసిన సెన్సార్ వ్యవస్థ బైక్కు అనుసంధానమై ఉంటుంది. హెల్మెట్ ధరించకపోతే వాహనం ముందుకు సాగదు. స్మార్ట్ హెల్మెట్లో మైక్రో కంట్రోలర్, బ్లూటూత్ మాడ్యూల్, ఫ్రెషర్ సెన్సార్, వంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. హెల్మెట్లోని ప్రెషర్ సెన్సార్ హెల్మెట్ ధరించినప్పుడు సిగ్నల్ను బైక్కు వస్తుంది. ఈ సిగ్నల్ వచ్చిన తరువాతనే వాహనం స్టార్ట్ అవుతుంది. ఈ చిన్నారులు ప్రవేశపెట్టిన తీరు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. యాంటీ ధెప్ట్ అలారం.. స్మార్ట్ హెల్మెట్, బైక్ ధెప్ట్ అలారం పరికరాలు వాహనం యజమానికి సెక్యూరిటీని పెంచే కొత్త మార్గాన్ని అందిస్తున్నాయి. ఈ హెల్మెట్, బైక్ ట్రాకింగ్ సిస్టమ్తో అనుసంధానమై ఉంటుంది. ఎవరైనా బైక్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగుతోంది. వాహనం ఎక్కడున్నా తమ బైక్ సురక్షితంగా ఉందా లేదా అని తెలియచేస్తుంది. వాహన చోదకుడికి అలసటగా ఉన్నా.. వాహనం అదుపు తప్పుతున్న వెంటనే సమాచారం ఇస్తుంది. కొంత భాగంలో హెల్మెట్ కూడా డేటా యాక్సెస్ ఇవ్వడం ద్వారా యజమానికి వెంటనే సమాచారం వస్తుంది. ప్రమాదాల నివారణకు వినూత్న ఆలోచన సెన్సార్ టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్ -
ప్రకృతి వనరులను కాపాడుకోవాలి
గుంటూరు వెస్ట్: ప్రకృతి పంచిన అరుదైన వనరులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని కన్జర్వేటివ్ రిజర్వ్గానూ, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువును చిత్తడి నేలగానూ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు పంపామన్నారు. వీటిని గ్రామ సభల ద్వారానూ సంబంధిత శాఖాధికారుల ద్వారా ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో డీపీఓ సాయి కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నజీమా బేగం, అధికారులు పాల్గొన్నారు. జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్కు వచ్చాడు. హైడాటిడ్ సిస్ట్ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్కుమార్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శ్యాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు, నర్సింగ్ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అభినందించారు. పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ తెనాలి రూరల్: లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరాటంకంగా అమలు చేస్తూ దళిత, మైనార్టీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన సీఐలు, ఇతర పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అందే శ్యాం డిమాండ్ చేశారు. తెనాలి ఐతానగర్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఐతానగర్ దళితులు క్రిమినల్, గంజాయి కేసుల్లో ఉన్నందున పోలీసులు బహిరంగంగా ట్రీట్మెంట్ ఇవ్వడం సరైందేనని అధికార పార్టీ పత్రికల ద్వారా, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
పొగాకు.. ఆరోగ్యానికి చేటు
● నేడు నో టుబాకో డే ● బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ● పొగాకు వినియోగంతో అనేక నష్టాలు గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం మొదలుపెట్టే ధూమపానం చివరకు ప్రాణాలనే హరిస్తుంది. సిగరెట్, బీడీ, చుట్ట తాగే అలవాటు వ్యసనంలా మారి మనిషిని బానిసను చేసుకుంటుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో 40 శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానంతో కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా మే 31వ తేదీన నో టుబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. జిల్లాలో బాధితులు అధికమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 35 శాతం మంది యువత ధూమపానం చేస్తున్నారు. వివిధ రోగాలతో 30 – 39 ఏళ్ల వయస్సు వారిలో చనిపోతున్న ప్రతి ఐదుగిరిలో ఒకరు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లేనని తేలింది. గుంటూరు జీజీహెచ్లో ప్రతి నెలా 1,200 మంది పురుషులు, 2 వేల మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్లతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 శాతం మంది కేవలం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందించేందుకు 15 ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. వీటిల్లో రోజూ 400 మంది వరకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. చట్టం ఏం చెబుతోందంటే.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, బస్ స్టేషన్లు, జనసంచారం ఉండే మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ధూమపానం చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, గుడులకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మటం చట్టరీత్యా నేరం. 18 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు చట్టరీత్యా విక్రయించకూడదు. చట్టాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధూమపానం చేసేందుకు అనుమతించాలి. పొగాకు వినియోగంతో క్యాన్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారిలో 40 శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్కు గురవుతున్నవారే. పొగతాగటం, పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, పాన్పరాగ్ వంటి వాటిని వినియోగించటం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స తీసుకుని త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవచ్చు. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు ధూమపానంతో గుండెజబ్బులు పొగతాగే వారిలో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో 400 రకాల విషపదార్థాలు ఉంటాయి. కార్బన్ మోనాకై ్సడ్ వల్ల గుండెపోటు, టార్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. నపుంసకత్వం, పక్షవాతం పొగరాయుళ్లను వదలవు. పొగతాగే వారికి చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా పొగాకు ప్రభావం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారిలో 70 శాతం మంది ధూమపానం చేసేవారే. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ జీజీహెచ్లో ఉచిత కౌన్సెలింగ్ గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో పొగాకు ఉత్పత్తుల అలవాటు మానేయాలనుకునే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, ఔషధాలు ఇస్తున్నారు. 2019 నుంచి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది 1,263 మందికి చికిత్స అందించడం ద్వారా కొంత మంది స్మోకింగ్ అలవాటు మానేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఛాతీ ముందు భాగంలో, భుజానికి, తొడకు.. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేని చోట నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటిస్తారు. ఈ ప్యాచ్ అంటించి కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రతి నెలా పది మందికి పైగా పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానివేస్తున్నట్లు గుర్తించామని సెంటర్ ఇన్చార్జి డాక్టర్ వడ్డాది వెంకట కిరణ్ తెలిపారు. -
ఎమ్మెల్సీ కార్యాలయంలో కారు చోరీ చేసిన దొంగ అరెస్టు
వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ లక్ష్మీపురం: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో కారు చోరీ చేసి పరారైన ఘటనలో వ్యక్తిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నట్టు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 28వ తేదీన కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన పనకనపల్లి రాంప్రసాద్ రెడ్డి 2009–2014 వరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్లో ఓలా క్యాబ్, అలాగే మరి కొన్ని చోట్ల డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. ఆర్థిక పరిస్ధితులు అనుకూలంగా లేని కారణంగా మరలా తిరిగి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వద్ద పనిచేసేందుకు ఈనెల 28వ తేదీన గుంటూరు విద్యానగర్లోని రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ సాంబశివరావు వద్దకు వచ్చి పని కావాలని అడిగాడు. ప్రస్తుతం పనిలేదని ఆయన చెప్పాడు. కొద్ది రోజుల తరువాత చూద్దాం అని చెప్పడంతో కడప నుంచి వచ్చానని, రెండు రోజుల ఇక్కడే ఉండి వెళ్తానని చెప్పాడు. గతంలో ఉన్న పరిచయాల వల్ల ఆఫీస్ వద్దనే ఉన్నాడు. అయితే అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ డ్రైవర్గా పని చేసే సంతవరపు నాగార్జున ఏపీ 07జెడ్ 2137 నంబర్ గల కారును కార్యాలయం వద్ద పార్కింగ్ ప్రదేశంలో పెట్టి తాళాలు కార్యాలయంలో పెట్టి వాచ్మెన్కు చెప్పి వెళ్లిపోయాడు. తరువాత రాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాద్ ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును, వాచ్మన్ సెల్ఫోన్ను చోరీ చేసి పరారైయ్యాడు. దీంతో కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో చోరీ చేసిను కారులో ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును ఆపి పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు రాంప్రసాద్రెడ్డిని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. స్టేషన్లో విచారించగా హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న ప్రియురాలిని కలసి, కారు తిరిగి ఇచ్చేద్దామని వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు అంగీకరించాడు. దీంతో చోరీ చేసిన రాంప్రసాద్రెడ్డిని అరెస్ట్ చేశారు. చాకచక్యంగా పట్టుకున్న పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది ఆంజనేయులు, ప్రసాదరావు, శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ అభినందించారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో అవినీతిపై విచారణ
వినుకొండ: అంగన్వాడీ ఈపూరు ప్రాజెక్టు అధికారి అరుణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో అనధికార వసూలుపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ప్రతినెలా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు మామూళ్లు ఇవ్వాలని, ఈనెల 31వ తేదీ రానున్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలని సోషల్మీడియాలో ఓ కార్యకర్త పోస్టు పెట్టడంతో వివాదం నెలకొంది. బొల్లాపల్లి, ఈపూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలను వ్యక్తిగతంగా విచారణ చేసి వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నివేదికను జిల్లాకలెక్టరు కు నివేదించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను నిబంధనల ప్రకారం నడపాలని సూచించారు. ఎక్కడయినా సమస్యలు ఉంటే తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ఈపూరులో విచారణ చేపట్టిన పీడీ జిల్లా కలెక్టరుకు నివేదించనున్న వైనం -
బాలలకు విచ్చలవిడిగా మద్యం సరఫరా
నరసరావుపేట టౌన్: ఉజ్వలంగా వెలగాల్సిన విద్యార్థుల జీవితాలు కూటమి ప్రభుత్వ ధనదాహం, అధికారుల మామూళ్ల మత్తులో చిత్తవుతున్నాయి. వైన్ షాపు నిర్వాహకులు కక్కుర్తితో టీనేజ్ కూడా దాటని పిల్లలతో బహిరంగంగా మద్యం తాగిస్తున్నారు. పర్మిట్ రూములకు అనుమతులు లేకపోయినా.. ఏకంగా కుర్చీలు, బల్లలు వేసి పిల్లలకు మద్యం సరఫరా చేస్తూ వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జీవితాలతో చెలగాటం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి తీసుకెళ్లింది. వారికి టార్గెట్లు ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు తెరతీసింది. ఈ క్రమంలో వైన్స్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకుండానే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. వేళాపాళా లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఆదాయమే పరమావధి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలను సర్కారే నిర్వహించేది. ఆ క్రమంలో ప్రజలను మద్యానికి దూరం చేసేందుకు ప్రయత్నం చేసింది. తద్వారా యువత మద్యం జోలికి వెళ్లకుండా కట్టడి చేయగలిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చివరకు మైనర్లకు కూడా మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని ఓ వైన్ షాపులో అనుమతులు లేకుండానే పర్మిట్ రూము ఏర్పాటు చేశారు. ఇక్కడ 18 ఏళ్లు కూడా నిండని బాలలు మద్యం తాగుతూ కనిపించారు. మైనర్లకు మద్యం విక్రయించరాదనే నిబంధనలను నిర్వాహకులు తుంగలో తొక్కారు. వీటిపై ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు యథేచ్ఛగా పర్మిట్ రూముల ఏర్పాటు మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్న వైనం మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు -
కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించిన ప్రజలు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ అన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని వాటిని కూడా కూడా నెరవేర్చారని, దీనిని ప్రజలు గుర్తించారని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం 15 ఎకరాలలో ఉందని, కొత్త ఇంటిని రూ.కోట్లతో నిర్మిస్తున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలలో ఇల్ల్లు కడుతున్నారని ప్రశ్నించారు. చేతిలో మీడియా ఉందని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని హితవు పలికారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయి హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొని తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలంతా మోసపోయారన్నారు. మంగళగిరి, గుంటూరు తూర్పు, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు -
సేవల్లో ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’
తెనాలి: పవిత్రమైన వైద్యవృత్తిలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే వృత్తిజీవితంలో సంతృప్తినే కాదు... ఏకంగా రాష్ట్ర, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శుక్రవారం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును స్వీకరించిన వలివేటి శుభావతి ఇందుకు చక్కని నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకై క మహిళ కూడా శుభావతినే. ఏఎన్ఎం విధుల్లో వైద్యవృత్తి ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో నిర్వహిస్తూనే ఉన్నత కోర్సులు చేస్తూ, వరుస పదోన్నతులతో మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్ హోదాకు ఎదిగారు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకున్నారు. తెనాలి రూరల్ మండల గ్రామం సంగంజాగర్లమూడి శుభావతి స్వస్థలం. తల్లిదండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం. తొలుత ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల పీహెచ్సీ పరిధిలోని చందవరం సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా శుభావతి వృత్తిజీవితం ఆరంభమైంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే పీజీ కోర్సులు చేస్తూ వచ్చారు. 13 ఏళ్ల సర్వీసులో మూడు పీజీలు చేశారు. ఫలితంగా పదోన్నతిపై ఇదే జిల్లాలోని నకిరేకల్లో హెల్త్ ఎడ్యుకేటర్గా నియమితులయ్యారు. అక్కడ 12 ఏళ్లపాటు పనిచేశారు. కర్నూలులోని రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)కు మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ గత జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. పేద రోగులకు సేవలు వైద్యరంగంలో తన 39 ఏళ్ల సర్వీసులో శుభావతి పేద ప్రజలు, అవసరమైన వారికి తగిన సేవలను అందిస్తూ వచ్చారు. తన సమర్థత, నిబద్ధతను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వర్తించారు. అనేక అవార్డులను అందుకున్నారు. నకిరేకల్లో ఉండగా, హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాజెక్టుపై శుభావతిని నాటి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శిక్షణకని ఢిల్లీ పంపారు. అదే ప్రాజెక్టుపై జిల్లాలోని ఆర్ఎంపీ/పీఎంపీలతో సహా ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు శుభావతి అవగాహన కల్పించారు. ఆ కృషికి గుర్తింపుగానే అప్పటి రాష్ట్రమంత్రి కొణిజేటి రోశయ్య నుంచి అవార్డును అందుకున్నానని శుభావతి చెప్పారు. ఎక్కడ పనిచేసినా తోటి సిబ్బంది, ప్రజలు ఎంతో ప్రేమను చూపటం తనకు గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. ‘ఎంతో కష్టపడి పనిచేశాను. అందరి మన్ననలు పొందాను. డబ్బు కోసం ఆశపడలేదు. స్వచ్ఛందంగా బాధ్యతలను నిర్వర్తించాను. జాతీయ అవార్డు లభించిందంటే వృత్తి జీవితం మొత్తానికి అందిన గౌరవంగా భావిస్తున్నాను’ అని శుభావతి చెప్పారు. రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న వలివేటి శుభావతి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పురస్కారం పొందిన ఏకై క మహిళఎన్నో అవార్డులు.. రివార్డులు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ఆహ్వానంపై బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు, బాలికా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలపై శుభావతి ప్రత్యేక ప్రసంగాలు చేశారు. గుంటూరు జిల్లాలో బాల్య వివాహాల నిరోధంపై రిసోర్స్ పర్సన్గానూ వ్యవహరించారు. దీనిపై పలు పాటలు రాసి, స్వయంగా గానం చేశారు. అప్పట్లో నెల్లూరు కలెక్టర్ల నుంచి అవార్డులను అందుకున్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ సూచనపై ఓటరు అవగాహనపై పాట రాశారు. చైన్నెలో సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్తో స్వరకల్పన చేయించారు. ఈ సందర్భంగా నాటి కలెక్టర్ రేఖారాణి ప్రశంసాపత్రం అందించారు. రక్తహీనతపై అవగాహన కోసం పాట రాశారు. శ్రీకాకుళంలో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ చేసిన సేవలకుగాను అవార్డులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్, న్యూట్రిషన్పై శుభావతి రాసిన పాట పేరు పొందింది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లోనూ ఏఎన్ఎంల పుస్తకంలో తొలి పేజీలోనే ఆ పాటను ముద్రింపజేశారు. ఏపీ కల్చరల్ అవేర్నెస్ రాష్ట్రస్థాయి ఉత్తమ పౌరురాలి అవార్డు, శ్రీకాకుళంలో ఆంధ్రరత్న అవార్డు వంటివెన్నో తనకు అలంకారాలుగా మారాయి. భర్త ప్రైవేటు ఉద్యోగి, కుమారుడు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. రిటైరయ్యాక గుంటూరులోనే ఆమె స్థిరపడ్డారు. -
అక్రమాలకు పాల్పడితేక్రిమినల్ కేసులు
– డీలర్లకు జిల్లా పౌర సరఫరాల అధికారి హెచ్చరిక నరసరావుపేట టౌన్: చౌక దుకాణ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. నారదముని శుక్రవారం హెచ్చరించారు. జూన్ 1వ తేదీ నుంచి చౌక దుకాణాల వద్ద కార్డుదారులకు నిత్యావసరాల సరకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8–మధ్యాహ్నం 12, సాయంత్రం 4 – రాత్రి 8 గంటల వరకు చౌక దుకాణాలు తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పరమైన స్టాక్ బోర్డ్, కార్డుదారులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరకుల వివరాలను డీలర్ అందుబాటులో ఉంచాలన్నారు. చౌక దుకాణ పరిధిలోని వృద్ధులు, దివ్యాంగులకు ఆయా డీలర్లు ఇంటి వద్దకే వెళ్లి సరకులు అందించాలని పేర్కొన్నారు. నియమ నిబంధనలు, నిర్దేశించిన సమయాలను తప్పక పాటించాలన్నారు. పంపిణీ సమయంలో సంబంధిత సీఎస్డీటీ ఆయా చౌక దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలిస్తారన్నారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్ నవోదయ కోసం స్థల పరిశీలన బల్లికురవ: కేంద్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విద్యాలయం ఏర్పాటుకు 25 ఎకరాల భూమి కావాల్సి ఉంది. బల్లికురవ తహసీల్దార్ రవినాయక్ వల్లాపల్లి గ్రామంలోని పేరంటాళ్ల తల్లి ఆలయం సమీపంలో, గుంటుపల్లి గ్రామంలోని సచివాలయం సమీపంలో భూములను పరిశీలించారు. జిల్లా అధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ వివరించారు. కోన నీరజకు టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు బాపట్ల: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా, దర్శకురాలుగా పనిచేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుమార్తె కోన నీరజకి ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం హైదరాబాదులో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆమె అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో వెలుగొందడంతో పాటు పుస్తక రచయితగా, దర్శకురాలుగా ఆమె శక్తివంతమైన మహిళగా రూపుదిద్దుకుంటున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ కొనియాడింది. ఈ సందర్భంగా కోన రఘుపతి తన కుమార్తెకు శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ అవార్డు అందుకోవడం బాపట్ల ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ యోగా సెంటర్లో సాధన చేశారు. యోగా ఆవశ్యకతను వీసీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి.సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి. వెంకటేశ్వర్లు, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె.మల్లికార్జున, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్యతేజోమూర్తి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి రైల్వే గేటు మూసివేత ఫిరంగిపురం: ఫిరంగిపురం – సత్తెనపల్లి మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి జూన్ 3వ తేదీ వరకు గేటు మూసి వేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహన దారులు వినియోగించుకోవాలన్నారు. -
కూటమి కోత
పేదల పింఛన్లకూ ఏడాది పాలనలో పింఛనుదారులకు అష్టకష్టాలు సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హత కలిగిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని మేని ఫెస్టోలో పెట్టి ఎన్నికల ప్రచారంలో నేతలు వాగ్దానాలు చేశారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదైనా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు సర్కార్ పింఛన్ ఇస్తుందని ఆశపడిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలను నిండా మోసం చేశారు. బాబు మోసాలపై గత అనుభవాలు తెలిసినా సూపర్–6 పథకాల పేరిట అరచేతిలో వైకుంఠం చూపడంతో ఓటేసిన ప్రజలకు మరోసారి వెన్నుపోటు తప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్కు అర్హత కల్పించి ఉంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికిగాను ఒక్కొక్కరికి రూ.48 వేల వంతున ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అంది ఉండేది. కూటమి ప్రభుత్వం తీరుతో జిల్లాలో సుమారు 2 లక్షల మందికిపైగా అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని అమలు చేయకపోవడంతో జిల్లాలో అర్హులైన వారు ఏడాదికి సుమారు రూ.960 కోట్ల మేరకు లబ్ధి పొందలేకపోయారు. ఏడాదిలో 11,893 పింఛన్ల కోత కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటికి మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి అనుకూలంగా ఓటేయని వారందరినీ లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పింఛనుదారులకు సైతం నోటీసులు పంపి, అర్హత నిరూపించుకోవాలని చెబుతోంది. లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీ వెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా సామాజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఎవరో ఓ టీడీపీ నేత తమ పరిధిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల లిస్ట్ అందజేస్తే వారందరికీ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసు అందుకున్న ఒంటరి మహిళలు కూడా తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పొంది ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొంటున్నారు. దివ్యాంగులైతే మరోసారి వైద్యుల నుంచి సర్టిఫికెట్ తీసుకొని సమర్పించాలని అడుగుతున్నారు. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా నోటీసులు ఇవ్వడం పట్ల ప్రజలు, ప్రజా సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గతేడాది జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జూన్కు సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన 2,82,126 మంది లబ్ధిదారులకే జూలై నెలకు పింఛన్ మంజూరైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 2,70,233కు చేరింది. గత ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 11,893 తగ్గింది. ప్రభుత్వ చర్యల వల్ల అర్హులైన తమకు పింఛన్లు అందలేదని బాధితులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్కటీ ఇవ్వకపోగా ఉన్న వాటిలోనూ కోత ఆశగా ఎదురుచూస్తున్న లక్షలమంది అర్హులు ఏడాది పాలనలో జిల్లా వ్యాప్తంగా 11,893 మందికి పింఛన్లు రద్దు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికొదిలేసిన వైనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు మరోసారి చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి మోసపోయిన పేదలు పల్నాడు జిల్లాలో గతేడాది జూలై నుంచి తగ్గుతూ వస్తున్న పింఛన్ల సంఖ్య వివరాలు నా భర్త వృద్ధాప్య పింఛన్ తీసుకునేవారు. అనారోగ్య కారణాల వల్ల మరణించారు. నాకు పింఛన్ ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, ఎవరైనా మరణిస్తే ఇస్తామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. భర్త చనిపోయారని, ఆ స్థానంలోనైనా నాకు ఇవ్వమంటే పట్టించుకునేవారే లేరు. 65 ఏళ్ల వయసులో పింఛన్ వస్తే ఆసరాగా ఉంటుంది. ఇప్పటికే బతుకు భారమైంది. – పెరికల చెన్నమ్మ, మూసాపురం, పెదకూరపాడు మండలం ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. అర్హులైన వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే అక్కసుతో అర్హులైన పేదల పింఛన్లను కూడా తొలగిస్తున్నారు. ఒక్క శావల్యాపురం మండల పరిధిలోనే ఇలా వందల సంఖ్యలో పింఛన్లు అన్యాయంగా తొలగించారు. – బోడేపూడి కొండలు, శావల్యాపురం, వినుకొండ నియోజకవర్గం -
బిల్లుల్లోనూ పచ్చపాతం
నెహ్రూనగర్: జనవరి 10వ తేదీన గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటించే ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు షో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ.35 లక్షలు వెచ్చించి తెప్పించారు. ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నేటికీ నగరపాలక సంస్థ అధికారుల వద్ద లెక్క లేదు. అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొక్కలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. దీనిపై సాక్షిలో ఏప్రిల్ 13వ తేదీన ‘ఎండిన మొక్కలు..తేలని లెక్కలు’ పేరిట కథనం ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. దీంతో ఎక్కడ ఈ బిల్లు ఆపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడు ఏడీహెచ్గా పనిచేసిన శ్రీనివాస్ను సరెండర్ చేసి మరీ సదరు బిల్లు రూ.35 లక్షలు ప్రాసెస్ చేసినట్లు సమాచారం. ఖర్చుల బిల్లు వస్తే ఒట్టు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ రోజు పోలింగ్, తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బ్యారికేడింగ్, డిపార్ట్మెంట్ సిబ్బందికి సంబంధించిన భోజనాలు, టీ, కాఫీలు, స్నాక్స్, ఇతర స్టేషనరీ వంటి పనులు కాంట్రాక్టర్లు సుమారు 1.50 కోట్ల వర్కులు ఇంజినీరింగ్ అధికారుల హాహీతో చేపట్టారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బిల్లులను అధికారులు ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వడ్డీలకు తీసుకొచ్చి... కొంతమంది కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో స్థలాలు, ఇళ్లు తనాఖాలు పెట్టి పనులు చేశారు. ఆ వర్కులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ పడుతోంది. మరికొంత మంది కాంట్రాక్టర్లు బయట వ్యక్తుల వద్ద నుంచి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వలన తాము అప్పుల్లో కూరుకుపోతున్నామని బహిరంగంగానే వాపోతున్నారు. ఏదో విధంగా బిల్లు ప్రాసెస్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను వేడుకుంటున్నారు. సిఫార్సులు.. పర్సంటేజీలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో చేసిన వర్కుల బిల్లులు ప్రాసెస్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన వర్కులకు మాత్రమే బిల్లులు ప్రాసెస్ అవుతున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైపా వడ్డీలు కట్టుకోలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతకొంత ముట్టజెప్పి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు కూడా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక అధికారులు అడిగినంత ఇచ్చుకుని ప్రాసెస్ చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు. బిల్లుల ప్రాసెసింగ్లో మున్సిపల్ అధికారుల తీరిది తమ అనుకునే వారికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత అవసరం లేదనుకున్న వారికై తే నెలల తరబడి పెండింగ్ ఇటీవల సీఎం పర్యటనకు రూ.35 లక్షల విలువైన మొక్కలు ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో కూడా తెలియని దుస్థితి రూ.35 లక్షల బిల్లు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి ఇంకా పెండింగ్లోనే ఏడాది క్రితం ఎన్నికల ఖర్చు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమ అనుకునే కాంట్రాక్టర్ల బిల్లు ప్రాసెస్ చేయడంలో చూపుతున్న ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మిగతా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మొండి చేయి చూపుతున్నారనేది జగమెరిగిన సత్యం. గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంత మందికి బిల్లులు చెల్లింపులు జరపకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు పర్సంటేజ్ రూపంలో ముడుపులు సమర్పించుకుంటే ఎప్పటి బిల్లు అయినా ప్రాసెస్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే చెల్లింపులు ఎవరైనా కాంట్రాక్టర్ అత్యవసరం అని అడిగితే సదరు బిల్లుల చెల్లింపులు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తున్నాం. – నమ్రత్కుమార్, అకౌంటెంట్ -
ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: లాసెట్ అభ్యర్థులకు ఉచిత మోడల్ లాసెట్ ఎంతగానో ఉపయోగకరమని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రొసిక్యూషన్ ఎండీ.బర్కత్ అలీ అన్నారు. ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ను గురువారం నగరంపాలెంలోని ఆయన కార్యాలయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ పల్లపు కృష్ణ, బి.కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, స్పాట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఎ.శేషగిరిరావులు ఆవిష్కరించారు. శేషగిరిరావు మాట్లాడుతూ ఈ పరీక్షను జూన్ ఒకటిన గుంటూరు శ్యామలానగర్ ఒకటో వీధిలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహిస్తామని అన్నారు. ఉదయం పది గంటలకు పరీక్ష మొదలువుతుందని, మరిన్ని వివరాలకు 8297483785 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కొండవీటి శ్రీనివాసరావు, కె.వీరభాస్కర్, న్యాయవాదులు కె.నారాయణ చిన్న, జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. హత్య కేసులో రిమాండ్ బల్లికురవ: మండలంలోని కొమ్మినేనివారి పాలెంలో గత ఏడాది అక్టోబర్ 4న జరిగిన హత్య కేసులో నిందితుడు పి. నారాయణ రెడ్డికి అద్దంకి కోర్టు న్యాయమూర్తి బుధవారం 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వై. నాగరాజు తెలిపారు. -
ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
శావల్యాపురం: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ సిద్దా రామలింగామూర్తి అన్నారు. గురువారం మండలంలోని బొందిలిపాలెం, వేల్పూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనులు చేస్తున్న ప్రదేశాల్లో మాత్రమే మస్టర్ నమోదు చేయాలన్నారు. గోకులం షెడ్లు బిల్లులు ఈనెలాఖరులోగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, ఏపీవో కె.రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్లు చల్లగుండ్ల రాజా, మారుతీ తదితరులు ఉన్నారు. డ్వామా పీడీ సిద్దా రామలింగమూర్తి -
జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి
లక్ష్మీపురం: వస్తు సేవల పన్నుతో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో ప్రీ జీఎస్టీ డే వేడుక నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జీఎస్టీతో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని అభినందించారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటన్స్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ ఆడిట్లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు. నేషనల్ కనూ్స్య్మర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రాణ రక్షణ కోసం వాడే మందులపై జీఎస్టీని తక్షణమే తీసివేయాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్నును కూడా రద్దు చేయాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి సమీక్ష చేయాలన్నారు. ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే ఉండాలని సూచించారు. పలువురు పరిశ్రమ ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు. కమిషనర్ సుజిత్ మల్లిక్ను ట్రేడ్ వర్గాలు సన్మానించాయి. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్, వి.వెంకటేశ్వరరావు, మనోజ్కుమార్, మరియదాసు, రాయలు, ఆనందరావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు ఎ.ఆంజనేయులు పాల్గొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ -
పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం
తెనాలి: ఆంధ్యా ప్యారిస్ తెనాలిలోని బుర్రిపాలెంరోడ్డులో తొమ్మిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఓంకారాశ్రమం ఇప్పుడు పవిత్ర పూజాక్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా స్వార్థపరుల కారణంగా కునారిల్లుతూ వచ్చిన ఆశ్రమమిది. ఆశ్రమ స్థలాన్ని పవిత్ర సందర్శనీయ స్థలంగా చేయాలని గత ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఫలితంగానే ఇప్పుడు ఆశ్రమ స్థలంలో పరివార దేవతా, శిఖర, ధ్వజస్తంభ, శ్రీశరభ సాళ్వేశ్వరస్వామి, శ్రీపార్వతీ సమేత శ్రీఓంకారేశ్వరస్వామి వార్ల ఆలయం నిర్మించారు. ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుంచి ఆరంభించారు. తెనాలి బుర్రిపాలెంరోడ్డులోని ఓంకారాశ్రమం 1932లో ఏర్పాటైంది. కాకుమాను శ్రీరాములు అనే ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆశ్రమాన్ని స్థాపించారు. సాధువులు ధ్యానం చేసుకునేందుకు, వారి పోషణ కోసమనే భావనతో ఏర్పాటైన ఆశ్రమానికి అప్పట్లో శ్రీవ్యాస ఆశ్రమ నిర్వాహకుడు మలయాళస్వామి శంకుస్థాపన చేశారు. ఆశ్రమం తరపున పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య కోసమని దాతలు 12.83 ఎకరాల మాగాణి భూమిని సమకూర్చారు. దాతల లక్ష్యం నిర్విఘ్నంగా నెరవేరింది. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరిగాయి. అప్పట్లో ఆశ్రమానికి స్వామీజీలు ట్రస్టీలుగా ఉండేవారు. 1947–1963 మధ్య ఆశ్రమానికి గల మాగాణి భూమిని విక్రయించారు. ఆ డబ్బుతో గంగానమ్మపేటలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలో రెండు ఇళ్లు, చెంచుపేటలోని గోడౌన్ కొనుగోలు చేశారు. ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మలయాళస్వామి మరణంతో ఆశ్రమ ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మొదలయ్యాయి. 1980 వరకు పరంపరగా సాగాయి. అనంతరం ట్రస్టీలు ఏర్పాటైనా 1996లో ఆశ్రమ నిర్వహణ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పట్నుంచి అభివృద్ధి శూన్యమైంది. పైగా 1983లో ఆశ్రమంలో గల ధ్యానమందిరాన్ని కూల్చారు. 1998లో ఆశ్రమ స్థలంలోని 80 సెంట్ల స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు లీజుకిచ్చారు. కోర్టు వివాదంతో ప్రైవేటు విద్యాసంస్థకు లీజు ఆగిపోయింది. లాడ్జికి అద్దెకు ఇచ్చిన భవనం శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలోని భవనాన్ని గతంలో కొంతకాలం లాడ్జికి అద్దెకిచ్చారు. కొన్ని నెలలు రిక్రియేషన్ క్లబ్ కూడా నడిచింది. దేవదాయశాఖ చర్యలతో ఏడాదికి రూ.5.23 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఆశ్రమానికి 2022లో అవుతు శ్రీనివాసరెడ్డి ఈవోగా వచ్చారు. వేలం ఆదాయం పెరిగేలా చూశారు. అప్పట్నుంచి ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఆశ్రమ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. 1.40 ఎకరాల ఆశ్రమం స్థలం ముందుభాగంలో ఆలయం నిర్మాణానికి 2023 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. దేవదాయశాఖ రూ.26.66 లక్షలు, ఆశ్రమ నిధులు రూ.13.34 లక్షలు, దాతల సహకారంతో నిర్మాణం పూర్తయింది. రేపు ప్రతిష్టా మహోత్సవం ఈనెల 31వ తేదీన ఉదయం 8.19 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. గురువారం వేదస్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి, సంప్రదాయ పూజలను ఆరంభించారు. రెండురోజుల పూజల అనంతరం 31న యంత్రబింబ, ధ్వజ ప్రతిష్టలు, కళాన్యాసము, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవదాయశాఖ డీసీ కె.బసవ శ్రీనివాసరావు పాల్గొంటారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆశ్రమంలో ఓంకారేశ్వరస్వామి ఆలయం ఆరంభమైన ప్రతిష్టా మహోత్సవాలు -
తప్పిపోయిన చిన్నారి
మంగళగిరి టౌన్ ః ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన ఓ చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి అజయ్నగర్కు చెందిన తేజస్విని అనే పాప ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న సీఐ వినోద్ కుమార్ కంటపడింది. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అజయ్నగర్ అని, తండ్రి పేరు విజయ్ అని చెప్పడంతో ఆ చిన్నారిని తీసుకుని అజయ్నగర్లోని పాప నివాసానికి వెళ్లి తేజస్విని తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా ఇంటికి రావడంతో సిఐ వినోద్కుమార్కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగింత -
బ్లాక్లో ఎరువులు కొనుగోలు
నేను 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దుక్కుల్లో వేసేందుకు యూరియా, డీఏపీ అవసరం కాగా దుకాణాల్లో కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్లో బస్తాకు రూ.100 అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆర్ఎస్కేలకు నామమాత్రంగా ఎరువులు వస్తున్నాయి. అక్కడ అందరికీ అందలేదు. రాష్ట్ర సర్కారు రైతులను ఆదుకోవాలి. విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలి. గిట్టుబాటు ధరలు కల్పించడం ద్వారా అన్నదాతలకు కాస్త ఊరట లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – ఇగుటూరి కోటిరెడ్డి, రైతు, దొండపాడు, నరసరావుపేట మండలం -
అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 29 నుంచి జూన్ 5వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచ్ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఈ బెంచ్ ద్వారా సివిల్ కేసులు (పార్టిషన్ సూట్స్, మనీ మేటర్స్, పర్మినెంట్ ఇంజక్షన్ సూట్స్, స్పెసిఫిక్ పెర్ఫార్మన్స్), రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎకై ్సజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎల్ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు, పోలీస్, స్టేక్ హోల్డర్లు ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలని సూచించారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సుంకర శ్రీనివాసరావు, మాధురి దంపతులు రూ.50,116, సుంకర చెంచయ్య, బాయమ్మల స్మారకార్థం గోశాలలో గోవుల సంరక్షణకు రూ.50,116 ఏఈవో తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. దాతలను ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు ఎం.గోపిబాబు, తదితరులు పాల్గొన్నారు. 33 వాహనాలపై కేసులు నరసరావుపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖ అధికారులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. పట్టణం నుంచి రావిపాడు, వినుకొండ, గుంటూరుకు వెళ్లే రోడ్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న 33 ఆటోరిక్షా వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేశారు. వాటిలో ఏడింటిని సీజ్ చేశారు. సుమారు రూ.2.20 లక్షల అపరాధ రుసుం విధించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్.శివనాగేశ్వరరావు, ఎస్ఐ కిషోర్ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీలు కొనసాగుతాయన్నారు. నిలిచిన వర్షపు నీరు మంగళగిరి టౌన్: మంగళగిరిలో గురువారం అకాల వర్షం కురిసింది. నగరంలోని వీధులు జలమయమయ్యాయి. దేవస్థానం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్చ్ వద్ద ర్యాంప్ వేయడంతో వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్డు కంటే ర్యాంప్ ఎత్తుగా ఉండడంతో వర్షపు నీరు కాలువలోకి వెళ్లకపోవడంతో అక్కడే ఆగింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా సమీపంలోని దుకాణాల్లోకి చేరడంతో అవస్థలు తప్పలేదు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సినిమా థియేటర్లలో తనిఖీ చీరాల: సినిమా థియేటర్లలో ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు గురువారం రాత్రి తహసీల్దార్ కె.గోపీకృష్ణతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులును పరిశీలించారు. ఆహార పదార్థాల రేట్లను తెలుసుకున్నారు. థియేటర్లకు అనుమతులు, ఫుడ్కు ఎక్కువ ధర వసూలు, నిర్ణీత పరిమాణంలో ఉన్నాయా?, టికెట్ల ధరలు, టాయిలెట్స్ నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లలో పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. -
అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం
సత్తెనపల్లి: ‘‘ మీరేమీ ఇబ్బంది పడవద్దు, భయపడ వద్దు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉన్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం..’’ అంటూ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, నరసరావుపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో వారు గురువారం పర్యటించారు. ఏడాది క్రితం టీడీపీ, జనసేన నేతల దాడులు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ళ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రీయాశీలక నాయకుడు కొర్లకుంట శివ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని కలిగించారు. మృతుడు తండ్రి, పాకాలపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జూన్ 3న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పిస్తారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు.ఈ క్రమంలో రూట్ మ్యాప్ను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్ చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్ మీరాన్, సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, ఎంజే ఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి(సత్తెనపల్లి టౌన్), వేపూరి శ్రీనివాసరావు (రాజుపాలెం), భవనం రాఘవరెడ్డి (నకరికల్లు), నక్కా శ్రీను(ముప్పాళ్ళ), వైఎస్సార్ సీపీ నాయకులు బండి కోటినాగిరెడ్డి, ఏకుల మత్తయ్య, పల్లె గాబ్రియేలు, కోట ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, నేతల బృందం రెంటపాళ్ళ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ జూన్ 3న రెంటపాళ్ళకు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో రూట్మ్యాప్ పరిశీలన -
రైతులకు వరుస కష్టాలు
కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అన్నదాతలకు చుక్కలు చూపించింది. విత్తనాలు అందక, సకాలంలో ఎరువులు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి విత్తనాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షంలోనే అన్నదాతలను క్యూలైన్లో నిలబెట్టి వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఎరువుల సరఫరా నామమాత్రంగా సాగింది. కృత్రిమ కొరత కారణంగా అధిక ధర చెల్లించాల్సి రావడం రైతులకు భారంగా మారింది.నరసరావుపేట రూరల్: నాణ్యమైన విత్తనాల నుంచి ఎరువులను రైతులకు సకాలంలో అందించే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. వీటిని నిర్వహిస్తే జగన్కు పేరు వస్తుందని ఆర్బీకేలను నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన కొనసాగింది. వ్యవసాయ రంగంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులతో పాటు విత్తనాలు అందజేశారు. ఐదేళ్ల పాటు జిల్లాలో ఎక్కడా ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ శాఖ పనిచేసింది.విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులుకూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఎన్నికల ముందు అలివి కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరాలో పూర్తిగా విఫలమయింది. గత ఏడాది ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్ జలశాయం నీటితో పూర్తిగా నిండింది. అదునులో వర్షాలు రావడంతో రైతులు వరి సాగుపై దృష్టిసారించారు. వరి విత్తనాలు సరఫరాపై ప్రభుత్వం ముందస్తుగా సిద్ధంగా లేకపోవడంతో కొరత ఏర్పడింది. ప్రధానంగా జేజీఎల్–384 రకం విత్తనాలు కోసం రైతుల నుంచి డిమాండ్ అధికంగా వచ్చింది. ఈ రకం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఒక దశలో ప్రభుత్వ అధికారులు రైతులను క్యూలలో నిలబెట్టి విత్తనాలు పంపిణీ చేయాల్సి వచ్చింది. భారీ వర్షంలో క్యూలలో నిలబడి రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అన్నదాతలకు చూపించింది.ఎరువుల కొరతవర్షాలు రావడం భూమి పదునెక్కడంతో వరి, పత్తి, మిరప పంటలను రైతులు గత ఏడాది సకాలంలో ప్రారంభించారు. విత్తనాలు కోసం అగచాట్లు పడిన రైతులకు ఎరువులను కూడా ప్రభుత్వం సకాలంలో అందించలేకపోయింది. పంటలు సాగు దశలో ఉన్న అక్టోబర్ నెలలో ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు ఎరువులు కొనుగోలు చేశారు. యూరియా, డీఏపీ బస్తాకు రూ.100 చొప్పున అధిక రేటుకు వ్యాపారులు విక్రయించారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేసిన ఎరువులను టీడీపీ నాయకులు ఇళ్లలో ఉంచి తమ సొంత క్యాడర్కు సరఫరా చేసుకున్నారు. జిల్లాకు 3,42,735 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే గత ఏడాది అక్టోబర్ నెల వరకు జిల్లాకు కేవలం 1,32,119 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే కంపెనీలు సరఫరా చేసాయి.అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీఅన్నదాతల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ డిసెంబర్ 13న వైఎస్సార్సీపీ పోరుబాటను నిర్వహించింది. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు పోరుబాటలో పాల్గొని రైతుల పడుతున్న ఇబ్బందులపై జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమయిందని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. పత్తి, మిరప పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. -
తోడికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం
తెనాలి రూరల్: అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోడికోడళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలుముకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే తోడికోడళ్ల బంధం మరణంలోనూ వీడలేదు. పట్టణానికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిలు తోడికోడళ్లు. ఝాన్సీరాణి కుమారుడు నాగార్జున, ఆడపడుచు పార్వతితో కలిసి వీరు ముగ్గురు గురువారం అరుణాచలానికి కారులో పయనమయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని ఒంగోలు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యకుమారి, సరస్వతికుమారి కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యకుమారి తన భర్త నరసింహారావుతో కలిసి ఇక్కడి కవిరాజపార్కు రోడ్డులో అక్షర గీత విద్యానికేతన్ను స్థాపించారు. సరస్వతికుమారి భర్త వెంకటేశ్వరరావు ఆర్మీలో పని చేసి రిటైరై తెనాలిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఝాన్సీరాణి భర్త నాగేశ్వరరావు గాంధీచౌక్లో పారగాన్ వాచ్ కంపెనీ నిర్వహించేవారు. ముగ్గురు అన్నదమ్ములు గతంలోనే మృతి చెందారు. ఆప్యాయంగా ఉండే తోడి కోడళ్లు అరుణాచలం దర్శనం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆడపడుచు పార్వతిని వెంటబెట్టుకుని ఝాన్సీరాణి కుమారుడు నాగార్జునతో కలిసి తమకు తెలిసిన వారి కారు తీసుకుని బయలుదేరారు. రోడ్డుప్రమాదం రూపంలో వీరి కుటుంబాలను మృత్యువు కబళించింది. సూర్యకుమారికి ఇద్దరు కుమారులు ఉండగా. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. సరస్వతికుమారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవిరాజపార్కు రోడ్డులో నివసిస్తున్నారు.ఝాన్సీరాణి పెద్దకుమారుడు గతంలో మృతి చెందగా, ప్రస్తుతం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద సాయి పథం అపార్ట్మెంట్లో చిన్న కుమారుడు నాగార్జున కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. ముగ్గురు తోడి కోడళ్లు మృతి చెందారన్న వార్త తెలియడంతో తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. వీరి కుటుంబాలను పలువురు ప్రముఖులు పరామర్శించారు. బాపట్ల జిల్లాలో కారు ప్రమాదం ముగ్గురు మృత్యువాత -
బీచ్ కబడ్డీ పురుషుల రాష్ట్ర జట్టుకు శిక్షణ
చెరుకుపల్లి: జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో నిర్వహించనున్న 12వ జాతీయ బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు శిక్షణ ఇస్తున్నట్టు ఏపీ కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సుబ్బరాజు తెలిపారు. జట్టుకు మండలంలోని పొన్నపల్లి గ్రామంలో శిక్షణ శిబిరాన్ని బుధవారం సుబ్బరాజు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ వరకు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన కుంచల శ్రీనివాసరెడ్డి స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు చెప్పారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించన్ను పోటీలకు పురుషుల జట్టుకు పర్యవేక్షకులుగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వైఎస్సార్ ప్రసాద్, రాధాకృష్ణమూర్తి వ్యవహరిస్తారని తెలిపారు. శిబిరానికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు అయ్యారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్న వివరించారు. -
ఎన్టీఆర్కు ఘననివాళి
నరసరావుపేట: తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు చల్లి ఘన నివాళులర్పించారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ వెల్ఫేర్ ఆర్ఐ గోపినాథ్, ఎస్బీ సీఐ శరత్ బాబు, సీసీ ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్ పాల్గొన్నారు. నివాళులర్పించిన జేసీ.. నరసరావుపేట: మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించుకోవడం వారికి ఇచ్చే గొప్ప గౌరవమని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. జేసీ సూరజ్ గనోరే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. డీఆర్ఓ ఏకా మురళి, డిప్యూటి కలెక్టర్ కుమార్, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సభ్యుల పేరుతో రూ.4 లక్షల రుణం పొందిన ఆర్పీ లబోదిబోమంటున్న సభ్యులు అద్దంకి రూరల్: గ్రూపు సభ్యులకు తెలియకుండా వారి పేరుతో ఆర్పీ.. ఓ బ్యాంకులో రూ. 4 లక్షల రుణం పొందిన సంఘటన ఫిబ్రవరి 2వ తేదీ జరగ్గా అసల్యంగా వెలుగులోకి వచ్చింది. మెప్మా అధికారి శ్రీలత తెలిపిన వివరాల మేరకు.. అద్దంకి మెప్మా కార్యాలయంలో వెంకటేశ్వర మహిళా సమాఖ్య గ్రూపులో ఆర్పీగా పనిచేస్తున్న మల్లాది గాయత్రి ఆదర్శ పొదుపు గ్రూపు సభ్యులకు తెలియకుండా సీసీఎల్ రుణం రూ. 4 లక్షల బ్యాంకు నుంచి తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రూపు సభ్యులు మెప్మా అధికారికి తెలిపారు. ఆమె అప్పటి నుంచి ఆఫీస్కు రాకపోవటంతో ఎందుకు రావటం లేదని మెప్మా అధికారి విచారించగా 4 నెలల నుంచి ఆచూకీ లేదని తెలిసింది. బ్యాంకు వద్దకు వెళ్లి గ్రూపులో వివరాలను సేకరించగా గత నాలుగు నెలల నుంచి రుణం కట్టటం లేదని సీసీఎల్ లోను రూ. 4 లక్షలు, గ్రూపులోను రూ. 3 లక్షలు మొత్తం రూ. 7 లక్షలు రుణం ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆర్పీ గాయత్రిని ఆమె కూమారుడు ద్వారా ఆఫీస్కు పిలిపించి బుధవారం విచారించగా తాను తీసుకున్న రుణం రూ.4 లక్షల వడ్డీతో సహా చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన్నట్లు మెప్మా అధికారి తెలిపారు. -
నాటకరంగ అభివృద్ధికి పరిషత్ల కృషి ఎనలేనిది
నాదెండ్ల: తెలుగు నాటక రంగాభివృద్ధికి కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సినీ, సీరియల్ నటుడు, పుచ్చలపల్లి సుందరయ్య కళాపరిషత్ అధ్యక్షుడు ముత్తవరపు సురేష్బాబు చెప్పారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు గురువారం ఐదో రోజు కొనసాగాయి. సభాధ్యక్షుడిగా బండారుపల్లి సత్యనారాయణ వ్యవహరించగా, ముఖ్యఅతిథులుగా రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, వరగాని కళాపరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు, లింగారావుపాలెం కొండవీడు కళాపరిషత్ అధ్యక్షుడు కట్టా శ్రీహరిరావు, కట్రపాడు ఉషోదయ కళానికేతన్ అధ్యక్షుడు చెరుకూరి సాంబశివరావు పాల్గొన్నారు. ముత్తవరపు మాట్లాడుతూ తెలుగు నాటక రంగాన్ని నిలబెట్టేందుకు జూన్ మాసంలో జాతీయస్థాయిలో సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం కన్నాంబ అవార్డు గ్రహీత ఎస్.అమృతవర్షిణి, ముత్తవరపు సురేష్, అరుణకుమారి దంపతులను కళాపరిషత్ సభ్యులు, అతిథులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో పాండురంగారావు, నాగమల్లి, రామారావు, పెద్దబ్బాయి, పరిషత్ నిర్వాహకుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్వారి ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్వారి ‘ఎవరు’ కట్రపాడు ఉషోదయ కళానికేతన్వారి ‘కిడ్నాప్’ నాటకాలు పేరక్షకులను అలరించాయి. సినీ, సీరియల్ నటుడు ముత్తవరపు సురేష్బాబు నేటితో ముగియనున్న జాతీయస్థాయి నాటికల పోటీలు -
జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా విజయలక్ష్మి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా కుమ్మమూరు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చేశారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1991లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1992లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కృష్ణకిషోర్ వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఒకటిన జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): జిల్లా క్రికెట్ సంఘం త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంటలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు యు.మహతి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19 యువకులు జట్టుకు ఉదయం 8 గంటలకు, అండర్–19 యువతులకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1,2006 తర్వాత జన్మించినవారై ఉండాలి. అండర్–15 బాలికలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అండర్–23 ఉమెన్స్కు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. వీరు నవంబర్ 1,2001 తర్వాత జన్మించినవారై ఉండాలి. పోటీలకు హాజరయ్యే క్రికెటర్లు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ కలిగి ఉండాలి. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ను తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు మహతి శంకర్ను 98491 50249 నంబరులో సంప్రదించాలన్నారు. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష గుంటూరు లీగల్: అత్యాచార యత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 86 సంవత్సరాల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన పాలపర్తి మంజు అనే 21 సంవత్సరాల యువకుడిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ మేరకు తీర్పు వచ్చింది. నిందితుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా పల్లపు కృష్ణ వాదనలు వినిపించారు. 11 నెలలుగా అందని జీతాలు ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గుంటూరు వెస్ట్: స్థానిక బీఆర్ స్టేడియంలో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు అందడం లేదని ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ అంతంత మాత్రపు జీతాలతో నెట్టుకొచ్చే చిరుద్యోగులకు నెలవారీ జీతాలు అందకపోతే చాలా ఇబ్బందులు పడతారన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నారని తెలిపారు. తక్షణం ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ, వై.నాగేశ్వరరావు, కోటా సాహెబ్, పెదరత్తయ్య, జాన్ పాల్గొన్నారు. -
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
ప్రత్తిపాడు: ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐటీఐ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన మన్నవ జేమ్స్, ఏసుకుమారిలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మన్నవ స్టాలిన్ (17) గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్లపాడులోని ఎంజీఎస్ కళాశాలలో ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు స్టాలిన్ను గారాబంగా పెంచుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ 27వ తేదీ రాత్రి ఏసుకుమారి పనిపై బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి స్టాలిన్ ఇంటి వరండాలోని సీలింగ్ ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి స్టాలిన్ను కిందకు దింపి తండ్రికి సమాచారం అందించారు. అపస్మారక స్థితిలోనికి వెళ్లిన స్టాలిన్ను తీసుకుని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే స్టాలిన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జేమ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. నాగేంద్ర తెలిపారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కేశవకుమార్ సాహిత్యంలో ధిక్కార స్వరం
కవితా సంపుటాల ఆవిష్కరణలో వక్తలు తెనాలి: గత మూడున్నర దశాబ్దాల తెలుగు కవిత్వంలో కేశవకుమార్ది ముఖ్యమైన గొంతుక అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విప్లవాత్మక భావజాలం ద్వారా ప్రేరణ పొందిన కవి అని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ప్రొఫెసర్ బి.తిరుపతిరావు ప్రశంసించారు. ఆయన కవిత్వం సామాజిక– రాజకీయ విమర్శ, తాత్విక అన్వేషణల శక్తిమంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర ప్రొఫెసర్, తెనాలి సమీపంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కేశవకుమార్ రచించిన కవితలతో తీసుకొచ్చిన రెండు కవితా సంపుటాలను బుధవారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ‘భిన్నస్వరాలు’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేశవకుమార్ కవితా సంపుటి ‘ఆదిమ పౌరుడు’ను బి.తిరుపతిరావు, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూనిరాగం’ సంపుటిని ప్రముఖ కవి సీతారాం ఆవిష్కరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అమృతలూరులో పుట్టి, దళిత ఉద్యమాలు, దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను చూస్తూ పెరిగిన క్రమంలో కేశవకుమార్ వాటిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఆయన భావాలన్నీ అంబేడ్కర్ ఆలోచనల చుట్టూ తిరుగుతుంటాయన్నారు. రాడికల్గా సమీక్షించటం, విమర్శించటం ఆయన రచనల్లో గోచరిస్తుందని చెప్పారు. విస్తృతంగా రాస్తున్న కవితలు, వ్యాసాల్లో వ్యంగ్యాన్ని జోడించి విమర్శనాత్మకంగా రాయటం కేశవకుమార్ శైలి అన్నారు. సమకాలీన విషయాలపై తక్షణం స్పందించి రాయటం ఆయన ప్రత్యేకతగా చెప్పారు. కవి సీతారాం మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ప్రతిఘటన, నిరసన ఉద్యమాల్లో కేశవకుమార్ ముందుండి గొంతెత్తారని చెప్పారు. అంబేడ్కర్, పూలే భావధారలో తనను తాను రూపుదిద్దుకున్న కేశవకుమార్ రచనలు, తెలుగునాట దళితవాద సాహిత్యానికి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తాయని చెప్పారు. ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి తన ప్రసంగంలో విప్లవ సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కేశవకుమార్ కవితా సంపుటాల్లో దళిత, బహుజన సాహిత్యంలో వచ్చిన ధోరణులు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కేశవకుమార్ కవిత్వంలో నిరసన, ధిక్కారం, వ్యంగ్యం ప్రదర్శిస్తూ సమాజానికి అనేక ప్రశ్నలు సంధించారని చెప్పారు. సభలో శిఖా–ఆకాష్, నూకతోటి రవికుమార్, ఎన్జే విద్యాసాగర్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, తంగిరాల సోని మాట్లాడారు. కేశవకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్నస్వరాలు బాధ్యులు జుగాష్విలి, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట పైరుతో ప్రయోజనాలు
తెనాలి టౌన్: ఖరీఫ్ సాగుకు ముందు పచ్చిరొట్ట పైరు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ రాష్ట్ర సంచాలకులు ఎస్.ఢిల్లీరావు రైతులకు సూచించారు. రూరల్ మండలం ఎరుకలపూడి గ్రామంలో రైతు ముళ్ళపూడి రంగయ్య ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రాన్ని బుధవారం ఎస్.ఢిల్లీరావు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ 7, 8 సంవత్సరాలుగా పరిశోధించి 32 రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని వేసుకోవడం వలన సేంద్రియ కర్బనం పెరుగుతుందని తెలిపారు. ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చని వివరించారు. జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం వలన కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని అన్నారు. భూమి గుల్లబారి ఆరోగ్యంగా ఉంటుందని, సూక్ష్మపోషకాలు త్వర గా లభ్యమవుతాయని అన్నారు. ప్రతి రైతును చైతన్యపరచి పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోనేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, ఏడీఏ ఎన్.ఉషారాణి, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు -
రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది
చిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్లమీదకు వస్తే రాష్ట్రం స్తంభించి పోతుందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు చెప్పారు. బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్ష బుధవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రైతాంగ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బర్లీ పొగాకు కలపకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ సిగరెట్లు తయారు కావన్నారు. సువాసన కోసం బర్లీ పొగాకును విదేశాలు సిగరెట్లలో ఉపయోగిస్తాయని తెలిపారు. పొగాకు కంపెనీలు కుట్రపూరితంగా ఏకమై ధరలను పతనం చేసేందుకు బర్లీ పొగాకు కొనుగోళ్లను నిలిపివేశారని ఆరోపించారు. మంత్రి సమక్షంలో జరిపిన చర్చలకు విలువ లేదా? రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ససమస్యను తీసుకువెళితే చర్చలతో సరిపెడుతున్నారని, రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి అచ్చెనాయుడు సమక్షంలో జరిగిన చర్చలకు విలువలేకుండా పోయిందని వెల్లడించారు. పొగాకు కంపెనీలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా అచేతనంగా ఉండటం ఏ మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల బాధలు వింటే భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది బర్లీ పొగాకు మంచి ధరలు లభించటంతో రైతులు బర్లీ పొగాకును ఎక్కువగా సాగు చేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్తించిన పొగాకు కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకును కొనుగోలు చేయకుండా వ్యవహారాన్ని సాగదీసి తక్కువ ధరకు రైతుల వద్ద కొని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కోట్లు గడించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గత ఏడాది బర్లీ పొగాకు క్వింటా రూ. 18వేల వరకు కొన్నారని, ఈ ఏడాది కనీసం క్వింటాకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడెల్లా కొనుగోళ్లు చేస్తాం అనడం తప్పించి, అడుగు ముందుకు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించేందుకు రైతులు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు తాళ్లూరి బాబురావు, దాసరి వరహాలు, పేలూరి రామారావు, షేక్ సుభాని, ఇంటూరి భవాని వెంకటేష్, దోమల మరియదాసు, రెడ్డమ్మ నరిసిరెడ్డి, షేక్ నసీరుద్దీన్, మాడ శివ ప్రసన్నబాబు, జొన్నల రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం రాధాకృష్ణ, లోక్ సత్తా మాదాసు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన దీక్ష -
యోగాతో ఆరోగ్యం.. ఉల్లాసం
నరసరావుపేట రూరల్: యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమలో భాగంగా ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో బుధవారం యోగా శిక్షణా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి మురళీతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ యోగా వలన ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. దీంతో పాటు కొన్ని శారీరక రుగ్మతలు దూరం అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగా సాధనను అలవర్చుకొని ఆయుష్షును పెంచుకోవాలని సూచించారు. పవిత్రమైన కోటప్పకొండపై యోగా శిక్షణను ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే కోటప్పకొండలో యోగాంధ్ర -
వైభవంగా పోలేరమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట
ఈపూరు(శావల్యాపురం)/వినుకొండ : ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామంలో గ్రామస్తులు రూ.25లక్షల వ్యయంతో నిర్మించిన పోతురాజు – పోలేరమ్మ తల్లి దేవాలయం విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి వేదపండితులు వేదమంత్రాలతో గణపతి పూజ, పుణ్యాహావాచనం, మండపారాధన, ప్రధాన హోమాలు, యంత్ర ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, విగ్రహా ప్రతిష్ట, మహా కుంభాభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గోనుగుంట్ల లీలావతి, తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 5,598 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి
గుంటూరు లీగల్: లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగనున్న లోక్ అదాలత్పై కంపెనీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. అందరూ సహకరించాలని సూచించారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, గుంటూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి జి. చక్రపాణి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్ బాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, పోక్సో కోర్ట్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ అధ్యక్షుడు వై.సూర్య నారాయణ పాల్గొన్నారు. -
జీజీహెచ్లో కరోనా వైద్య సేవలు
గుంటూరు మెడికల్: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు కరోనాతో బాధపడుతుండటంతో గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 15 పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో బీ క్లాస్ రూములో కూడా బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అత్యవసర విభాగం వల్ల నూతనంగా నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూ గదిని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఇప్పటికే కరోనా అనుమానంతో వచ్చిన ఐదుగురికి వైద్య పరీక్షలు చేశామని, రిపోర్టు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. జీజీహెచ్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఓపీని ప్రారంభించామన్నారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్స్, సీక్యాప్ మిషన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి కరోనా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్య సేవలకు సిద్ధంగా ఉండండి రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎక్కువ మంది చికిత్స పొందేలా చూడాలన్నారు. ఈ – హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలన్నారు. సమావేశానికి హాజరు కాని జీజీహెచ్ వైద్యులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతోపాటు పలు వైద్య విభాగాధిపతులు, ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
తిరగబడ్డ గ్రామస్తులు
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025అచ్చంపేట: ‘‘ప్రభుత్వం ట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక తోలుకునేందుకు అనుమతించింది.. వాటిని ఆపడానికి మీరెవ్వరు..? ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మీరు అతిక్రమిస్తారా.. అలాగైతే మీ లారీలనుకూడా మేం పోనివ్వమంటూ కోనూరు గ్రామస్తులు రహదారిపై రాళ్లు, టైర్లు అడ్డుగా బెట్టి టీడీపీ నేతలకు చెందిన లారీలను స్తంభింపజేశారు.’’ కోనూరు కృష్ణానదిలో నది లోపలవరకు రోడ్డు వేసి పెద్ద పెద్దయంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో ఇసుక ర్యాంప్ను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులు మాత్రమే ఆపగలిగిన అధికారులు అడ్డదార్లను పూర్తిగా నిలిపి వేయలేకపోయారు. మళ్లీ గత వారం రోజులుగా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. మా దారి అడ్డదారి.. అయితే అడ్డదారుల్లో పెద్ద పెద్ద టిప్పర్లతో అడ్డదిడ్డంగా ఇసుకను తరలిస్తున్న టీడీపీ నేతలు స్థానికులు ట్రాక్టర్ల ద్వారా చేస్తున్న తరలింపును అడ్డుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవచ్చంటూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చెబుతుండగా స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతుండడం విడ్డూరం. గ్రామంలో సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్ల ద్వారా గ్రామస్తులు ఇసుక రవాణా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలోనూ ఎక్కువగా టీడీపీ వారే ఉండటం గమనార్హం. వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాలు కురిస్తే ఇసుక నిల్వ చేసుకునే అవకాశం లేనందున ఇసుకను డంపింగ్ చేసుకునేందుకు అనుమతులిచ్చారంటూ టీడీపీ నాయకులు గతంలో నదిలో అడ్డంగా వేసిన రోడ్లపైనుంచి యంత్రాల సహాయంతో నది ఒడ్డున ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. ఈ ముసుగులోనే కొన్ని లారీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేమంటే రాజధాని నిర్మాణానికి తరలిస్తున్నామని చెబుతున్నారు. అడ్డుతగిలితే కేసులంటూ హుకుం అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు గ్రామస్తులను దారికి అడ్డుతగితే కేసులు మోపుతామని, దారికి అడ్డుపడే హక్కులేదంటూ హెచ్చరించారు. నదికి అడ్డుగా రోడ్డు వేసే హక్కు ఉందా అంటూ గ్రామస్తులు ప్రశ్నించగా, ఇదంతా మాకు తెలియదని, ఎమ్మెల్యేతో మాట్లాడి అనుమతి తెచ్చుకోండి.. అప్పుడు మీ ట్రాక్టర్లకు అనుమతిస్తామని సీఐ హుకుం జారీ చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ట్రాక్టర్లకు అనుమతిచ్చినప్పుడు ఇంకా ఎమ్మెల్యే అనుమతులేంటి అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులకు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులకు కొంత వాగ్వివాదం జరిగింది. అయితే గ్రామస్తులు ఎంత ఆందోళనలకు దిగినా చివరకు ఏమీ సాధించలేకపోయారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకునే హక్కును పొందలేకపోయారు. భారీ ఇసుక లోడ్ లారీలు మాత్రం నదిలో వేసిన అడ్డదారిలో యథేచ్ఛగా తరలి వెళుతూనే ఉన్నాయి. కోనూరులో దారికి అడ్డంగా గ్రామస్తులు రాళ్లు, టైర్లు పెట్టడంతో నిలిచిపోయిన ఇసుక లారీలున్యూస్రీల్ అచ్చంపేట మండలం కోనూరు ఇసుక ర్యాంపు మూసేసిన అధికారులు భారీ వాహనాలతో చాటుగా ఇసుక తరలించేస్తున్న పచ్చనేతలు ట్రాక్టర్ల ద్వారా తరలింపును అడ్డుకుంటున్న అక్రమార్కులు దీనికి ప్రతిగా ఇసుక లారీలను అడ్డుకున్న కోనూరు గ్రామస్తులు ట్రాక్టర్లను ఆపితే ఊరుకోమంటూ గ్రామస్తులు ఆందోళన టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ గ్రామంలో ఇప్పటికి వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరగ్గా, ఎప్పుడైతే లారీలతో రవాణా మొదలుపెట్టారో అప్పటి నుంచి నదిలోకి ట్రాక్టర్లను అనుమతించడం నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు తిరగబడ్డారు. లోడ్ చేసిన లారీలను పోనివ్వకుండా గ్రామనడిబొడ్డులో పెద్ద పెద్ద రాళ్లు, టైర్లు పెట్టి నిలిపి వేశారు. ట్రాక్టర్లను అనుమతించే వరకు లారీలను కూడా వెళ్లనివ్వమంటూ భీష్మించుకుని కూర్చుని ఆందోళన చేపట్టారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను స్టేషన్కు పిలిపించారు. కొంతమంది గ్రామస్తులు అచ్చంపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి రజత కవచం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి బుధవారం దాతలు రజత కవచం సమ ర్పించారు. మండల పరిధిలోని ధరణికోటకు చెందిన కామని వీరయ్య, సామ్రాజ్యం దంపతులు సుమారు రెండుకిలోల 395 గ్రాముల బరువుతో రూ.3లక్షల విలువైన రజత కవచానికి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ఈఓ రేఖకు అప్పగించారు. అనంతరం అర్చకులద్వారా సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కవచాన్ని అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమపూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు నేడు జెడ్పీ గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు కౌన్సెలింగ్ గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తూ గ్రేడ్–2 హెచ్ఎం ఉద్యోగోన్నతుల కోసం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు గురువారం ఉదయం 8 గంటలకు జెడ్పీ కార్యాలయ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో హాజరు కావాలని సూచించారు. శివాలయంలో అవినీతిపై విచారణ మంగళగిరి : మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో జరిగిన అవినీతిపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవస్థాన అభివృద్ధికి దాతలు అందించిన నగదును రికార్డులలో నమోదు చేయకపోవడంతో అభివృద్ధి పనులలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు బుధవారం ఆలయానికి చేరుకుని ఈవో కార్యాలయంలో పలు ఫైళ్ళును స్వాధీనం చేసుకున్నారు. పునఃప్రారంభమైన సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధృవ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. ఆర్థో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ జరుగుతుందని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. 31న అయ్యప్ప స్వామి దేవస్థాన వార్షికోత్సవం చిలకలూరిపేట: ఓగేరు వాగుకు దక్షిణాన ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవం ఈ నెల 31వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం దేవస్థాన వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కమిటీ సభ్యులు తవ్వా నాగమల్లేశ్వరరావు, సత్యనారాయణ, భవిరిశెట్టి మణి పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కింద పడి బాలిక దుర్మరణం
బెల్లంకొండ: ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి చెందిన ఘటన మండలంలోని న్యూ చిట్యాల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో న్యూ చిట్యాలకు చెందిన అడావత్ సంధ్య భాయి (13) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాలకు చెందిన సంధ్య భాయి మంచినీళ్ల కోసం బంధువుల బైక్పై బెల్లంకొండలోని వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్తుంది. కాగా కొండ సమీపంలోకి రాగానే బెల్లంకొండ నుంచి మన్నెసుల్తాన్పాలెం వైపు వెళ్తున్న మరో బైక్ వీరిని ఢీకొంది. ఈ క్రమంలో సంధ్య భాయి బైక్ పై నుంచి రోడ్డు మీద పడిపోయింది. ఈ క్రమంలో వారి వెనకగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ సంధ్య భాయిని తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
● 19 నుంచి జరిగిన అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 39,693 మంది విద్యార్థులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే... ● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 21,590 మందికిగాను 20,765 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు. ● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 9,214 మందికిగాను 8,944 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగాను 1,802 మంది విద్యార్థులు హాజరయ్యారు. ● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు. -
కర్రసాములో గుంటూరు జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను చిన్నారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్ శిక్షణలో చిన్నారులు ఈ విజయం సాధించారని తెలిపారు. -
పిన్నెల్లి సోదరులపై కేసులు దుర్మార్గం
పిడుగురాళ్ల: పథకం ప్రకారమే గుండ్లపాడు హత్య కేసుల్లో సంబంధం లేకపోయినప్పటికీ పిన్నెల్లి సోదరులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రయ్య హత్యతో వైఎస్సార్ సీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఈ హత్యలు టీడీపీ ఆధిపత్య పోరు వలనే జరిగిందని గుర్తు చేశారు. అయినా కేవలం పిన్నెల్లి సోదరులే టార్గెట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ -
సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా సహకార అధికారి వెంకటరమణ నరసరావుపేట: సహకార సంఘాల సమగ్రాభివృద్ధికి కమిటీ సభ్యులు, సీఈఓలు తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులకు సామర్ధ్య నిర్మాణం – సుపరిపాలనపై ఏపీ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీడీసీసీ బ్యాంకులో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ సహకార సంఘాల కమిటీ సభ్యులు, సీఈఓలు సహకార సంఘాలు అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని అన్నారు. విజయవాడ సహకార శిక్షణా కేంద్ర వైస్ ప్రిన్సిపాల్ వేదాంతరెడ్డి మాట్లాడుతూ సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, సరైన పాలనకు మార్గనిర్దేశం చేయడం కమిటీ సభ్యుల ముఖ్యవిధి అన్నారు. జిల్లాలో అన్ని సహకార సంఘాలను ఈ–పీఏసీఎస్గా మార్చి సభ్యులకు డిజిటల్ సేవలు అందిస్తున్నామని, దీనివల్ల సంఘాల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారు. కంప్యూటీకరణ మూలంగా సంఘాల ఆడిట్ సులభం అవుతుందని అన్నారు. శిక్షణలో సహకార సంఘాల పర్సన్ ఇన్ చార్జీలు, సంఘాల సీఇఓలు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం
తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్ హబ్ తుళ్ళూరులో పెయింటింగ్ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 30 మంది, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు. -
లక్ష టన్నుల సేకరణ తర్వాతనే బయటకు
నరసరావుపేట: జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ల ద్వారా లక్ష టన్నుల సేకరణ అనంతరమే బయటకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎనిమిదో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 60వేల టన్నుల ఇసుక మల్లాది, కోనూరు స్టాక్ యార్డులలో అందుబాటులో ఉందన్నారు. రీచ్ల నుంచి స్టాకు పాయింట్ల వరకు ఇసుక రవాణాకు టన్నుకు చెల్లించే పైకంపై సత్వరమే నిర్ధారణ చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా మైన్స్ గనుల శాఖాధికారి నాగినిని ఆదేశించారు. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల వద్ద స్టాక్ యార్డుల ఏర్పాటుకు స్థల సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలాన్నారు. తంగెడ, పొందుగల, విజయపురి సౌత్ వద్ద ఉన్న ఇసుక పాయింట్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద రాత్రిపూట వాచ్మెన్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రమాకాంత్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల మృతదేహాలను దహనం చేయటం చట్ట వ్యతిరేకం
వినుకొండ: ఈ నెల 21న చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా దహనం చేయడం చట్టవ్యతిరేకమని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. మావోయిస్టుల మృతదేహాలను రక్తసంబంధీకులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా చట్టవిరుద్ధంగా వారిని దహనం చేశామని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వైవీ, జి.రామకృష్ణ, చిన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాధారణం కంటే అధిక వర్షపాతం మేలో సాధారణ వర్షపాతం 1237.3 మి.మీ కురిసింది 2703.8మి.మీ నరసరావుపేట: జిల్లాలో మే నెల మండు వేసవిలో ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని మించి వర్షం కురిసింది. జిల్లాలో ఈ నెల 1237.3 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సివుండగా మరో నాలుగురోజులు మిగిలి ఉండగానే 2703.8 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 28 మండలాల్లో ఈనెలలో కురిసిన వర్షపాత వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మాచర్లలో 102.4మి.మీటర్లు, వెల్దుర్తిలో 57.0, దుర్గిలో 78,2, రెంటచింతలలో 75,6, గురజాల 82,0, దాచేపలి 51.8, కారంపూడి89.8, పిడుగురాళ్ల 83,6, మాచవరం 46.4, బెల్లంకొండ 119.6, అచ్చంపేట 82.6, క్రోసూరు 68.0, అమరావతి 199.6, పెదకూరపాడు 105.6, సత్తెనపల్లి 146.2, రాజుపాలెం 110.4, నకరికల్లు 34.0, బొల్లాపల్లి 65.4, వినుకొండ 87.0, నూజెండ్ల 71.2, శావల్యాపురం 77.6, ఈపూరు 63.4, రొంపిచర్ల 50.2, నరసరావుపేట 135.4, ముప్పాళ్ల 118.4, నాదెండ్ల 132.6, చిలకలూరిపేట 200.4, యడ్లపాడు 169.4 మి.మీ వర్షం పడింది. ఒక్కో మండలానికి సరాసరిన 96.4 మి.మీటర్ల వర్షం కురిసింది. రెండు లారీలు ఢీ ఒకరికి గాయాలు మేదరమెట్ల: ముందు వెళ్తున్న లారీ రివర్స్లో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం తెల్లవారు జామున మేదరమెట్ల కొండ సమీపంలో జాతీయరహదారిపై చోటు చేసుకుంది. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ మేదరమెట్ల కొండ సమీపానికి రాగానే ముందు వెళుతున్న లారీ రివర్స్లో వెనక్కు వస్తోంది. దీన్ని గమనించని కంటైనర్ డ్రైవర్ లారీ వెనుకభాగాన్ని బలంగా ఢీ కొన్నాడు. దీంతో కంటైనర్ డ్రైవర్ దీప్కుమార్కు గాయాలు కాగా 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్కు తరలిచారు. కంటైనర్ ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
రెడ్బుక్ రాజ్యాంగం మేరకే అక్రమ కేసులు
మాచర్ల: నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా పనిచేసి రెండు దశాబ్దాలుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావు, ఎస్సీ సెల్ కారంపూడి మండల అధ్యక్షుడు దరివేములు కిరణ్లు అన్నారు. మంగళవారం మాచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెట్టిందన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. అక్రమ కేసులు నమోదు చేయడం హేయం గుల్లపాడు గ్రామంలో ఏ ఒక్క విషయానికి పీఆర్కే వెళ్లడం లేదన్నారు. ఆయన సోదరుడు నియోజకవర్గంలోనే లేడన్నారు. వీరివురి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అక్రమ కేసులు పెట్టిస్తుందన్నారు. ఇప్పటికే పీఆర్కేపై 13 కేసులు అక్రమంగా నమోదు చేయించారన్నారు. ఆ గ్రామానికి, పార్టీకి సంబంధం లేని ఘటనను ఆధారంగా చేసుకుని 302 హత్య కేసు నమోదు చేయడం హేయమైన ఘటన అన్నారు. పీఆర్కేకు ఏడాదిలోనే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సహించలేక, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును పీఆర్కే సోదరులపై నమోదు చేయించారన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పీఆర్కేను ఏం చేయలేవన్నారు. పార్టీ జిల్లా ఎస్సీ విభాగం కార్యవర్గ సభ్యులు మామిడి శేఖర్, మాచర్ల నియోజకవర్గ నాయకులు ఎ.రమేష్, రాజేష్, కె.మధు, తదితరులు పాల్గొన్నారు. -
దురాచారాల నిర్మూలనలో పరిషత్ల కృషి ఎనలేనిది
నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్లను కళాపరిషత్ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి జ్యోతిరాజ్ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. నేటి ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘కిడ్నాప్’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.కొనసాగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు -
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్క్యాష్మెంట్కు సంబంధించిన ఆర్డర్ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
పల్నాడు
పాలవాగు పూడిక తీత రాయపూడి(తాడికొండ): రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాయపూడి గ్రామంలోని పాలవాగు పూడికతీత పనులు ప్రారంభించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 512.60 అడుగు ల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువ కు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఈవీఎం గోడౌన్ పరిశీలన ఫిరంగిపురం: రేపూడి మార్కెట్ యార్డులోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను మంగళవారం ఆర్డీవో కె.శ్రీనివాసరావు పరిశీలించా రు. తహసీల్దార్ జె.ప్రసాదరావు పాల్గొన్నారు. బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 20257 -
జేఎన్టీయూఎన్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన
నరసరావుపేట రూరల్: నరసరావుపేటలోని కాకాని జేఎన్టీయూఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. జేఎన్టీయూకే కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యూవల్ విషయంలో అనుసరిస్తున్న విధానానికి నిరసనగా మంగళవారం కళాశాలలోని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు ఛాంబర్ను ముట్టడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు రివ్యూల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. అదే విధంగా బ్రేక్ పిరియడ్ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల్లో లేని విదంగా కాంట్రాక్ట్ అద్యాపకులను ఇబ్బందులకు గురిచేసే విధంగా జేఎన్టీయూకే అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ అద్యక్షుడు పి.మణికంఠ మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ను కలిసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా వారి నుంచి సానుకూల స్పందన లభించందన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా కొంతమంది యూనివర్సిటీ అధికారుల చర్యలు ఉన్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు హరికృష్ణ, ఆదినారాయణ నాయక్, మన్మదరెడ్డి, సాయి, రాధ, అనిత తదితరులు పాల్గొన్నారు. రివ్యూల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వర్సిటీ అధికారులు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమకు ఇప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అధ్యాపకుల ఆగ్రహం ప్రిన్సిపాల్ చాంబర్ను ముట్టడించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు -
● సమీక్షలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● యోగా స్ట్రీట్లో యోగా చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది
యోగా ఔత్సాహిక రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయండి నరసరావుపేట: జిల్లాలో యోగాంధ్ర యాప్ ద్వారా యోగా ఔత్సాహిక రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం యోగాంధ్రపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎనిమిది లక్షల మందిని యోగా ఔత్సాహికులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ లక్ష మంది నమోదు పూర్తయిందన్నారు. వీరితోపాటూ 4,800 వరకూ మాస్టర్ ట్రైనర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రేపు ఉదయం 8.00 గంటలలోగా గ్రామ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించి విజేతల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ స్థాయిలో విజేతలకు జూన్ రెండు నుంచి మండల స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. యోగా స్ట్రీట్గా కలెక్టర్ క్యాంపు కార్యాలయ రోడ్డు యోగాంధ్ర మాసోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం రోడ్డుకు యోగా స్ట్రీట్ గా నామకరణం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకూ ప్రతి రోజూ ఉదయం వివిధ శాఖల ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్ నందు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం ఉదయం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సామూహిక యోగా నిర్వహించడం జరిగిందన్నారు. -
ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన
గ్రేడ్–2 హెచ్ఎంగుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధ్యాయులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం గ్రేడ్–2 హెచ్ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్, రోస్టర్ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్ హెచ్ఎం పోస్టులకు... గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్–8, కార్పొరేషన్–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. -
నేడూ పొగాకు రైతుల నిరసన
చిలకలూరిపేట: నల్లబర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ చిలకలూరిపేటలోని ఐటీసీ కంపెనీ వద్ద పొగాకు రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. క్వింటా ధర రూ.15వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకును కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలని కోరారు. దీక్షకు రైతులు, రైతు సంఘాల నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నేడు కోటప్పకొండలో యోగాంధ్ర నరసరావుపేట: కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద యోగాంధ్ర కార్యక్రమం బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. విజయకీలాద్రిపై సుదర్శన హోమం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : బక్రీదు పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ కె.సీతారామిరెడ్డి హెచ్చరించారు. జూన్ 7న జరిగే బక్రీదు పండుగ సందర్భంగా గేదెలు, ఇతర పశువులను అధిక సంఖ్యలో వాహనాల్లో తరలించి వధకు పాల్పడితే వారిపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడంతోపాటు, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో పశువులను తరలించే వారు ఎంవీఐ యాక్ట్ 1989, రూల్ 253 ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అనంతరం తరలించాలని సూచించారు. శని జయంతి పూజలు మంగళగిరి టౌన్: శ్రీశనైశ్చర స్వామి జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో మంగళవారం శనిజయంతి పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి తైలాభిషేకం, అర్చనలు, జపాలు, పూజలు నిర్వహించి పురోహితులకు నువ్వులు దానాలు ఇచ్చారు. దేవస్థానంలోని మల్లేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ తగు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఎంపీహెచ్ఏలకు బదిలీ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ కేడర్కు చెందిన 172 మందికి డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి మలేరియా, డెంగీ, చికున్ గున్యా ప్రబలి ఉన్న పలు ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో డీఎంహెచ్ఓతోపాటు, పరిపాలన అధికారి లక్ష్మీకుమారి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, భక్తవత్సలం, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్, రహీం పాల్గొన్నారు. -
కొండవీడుకోటలో ఉద్రిక్తత
● సందర్శకులు, స్ట్రైకర్ల మధ్య వాగ్వాదం ● గ్రామస్తులు సందర్శకుల కారు అడ్డగించి దాడి ● విచారణ ప్రారంభించిన పోలీసులు యడ్లపాడు: పర్యాటక కొండవీడుకోట ప్రాంతంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని సాయినగర్కు చెందిన లక్ష్మీప్రియ, భర్త ముని కోటేశ్వరరావు, కుమార్తె, మేనల్లుడు సోమవారం సాయంత్రం సందర్శనకు రాగా, కొండవద్ద ఉన్న స్ట్రైకర్ల (ఔట్సోర్సింగ్)తో వాగ్వాదం జరిగింది. స్ట్రైకర్ల సమాచారంతో గ్రామస్తులు సందర్శకుల కారును ఆపి దాడిచేసి, కారు అద్దాన్ని ధ్వంసం చేశారంటూ ఘటన స్థలం నుంచి బాధితులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణతో కలిసి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. కొత్తపాలెం ఘాట్రోడ్డుకు చేరుకొని అటవీశాఖ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందితోపాటు గ్రామస్తులను కలిశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న స్ట్రైకర్లు, అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలతో మాట్లాడి ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకున్నారు. సమగ్ర విచారణ అనంతరం కేసులు నమోదు సోమవారం రాత్రి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ తర్వాత కేసు నమోదు చేయనున్నట్లు సీఐ సుబ్బానాయుడు చెప్పారు. కొండవీడుకోటకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఘాట్రోడ్డుపై విధుల్లో ఉన్న స్ట్రైకర్లు యూనిఫారమ్, గుర్తింపు కార్డులు లేకుండా విధులు నిర్వహించడమే ప్రధానంగా సందర్శకుల్లో అపోహలు కలగడానికి దారితీసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. స్ట్రైకర్లు సహనం పాటించకపోవడం, గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే స్థానికులు కారును అడ్డగించి దాడికి పాల్పడినట్లు తెలిసిందని వివరించారు. సోమవారం రాత్రి యడ్లపాడు పోలీసులకు ఘటన సమాచారం అందగానే కానిస్టేబుల్ కొత్తపాలెం గ్రామానికి చేరుకునేలోపు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సందర్శకుల కారు నంబర్ ఆధారంగా వారి ఫోన్ నెంబర్లను సేకరించి, వ్యక్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు బాధితుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. సమగ్ర సమాచారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ బి సుబ్బానాయుడు స్పష్టం చేశారు. ఇకపై చర్యలు తప్పవు కొండవీడు ప్రాంతానికి వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని సీఐ చెప్పారు. స్టైకర్లు స్థానికులమనే భావన వీడి విధి నిర్వహణను బాధ్యతగా నిర్వహించాలని, సందర్శకుల పట్ల బాధ్యతగా ప్రవర్తించకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పోలీసుల మొబైల్ నంబర్లను కొండవీడుకోట సందర్శకులకు కనిపించేలా పలుచోట్ల రాయించాలని ఎస్ఐను ఆదేశించామన్నారు. స్ట్రైకర్లు వారంరోజుల్లోగా యూనిఫాం, ఐడీకార్డులను సమకూర్చుకోవాలని, అవసరమైతే అటవీశాఖ అధికారులతో చర్చించనున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటన తిరిగి పునరావృతం కాకుండా పైచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రశ్నించినందుకే దాడి చేశారు : లక్ష్మీప్రియ కొండవీడు సందర్శనకు వెళ్లి స్ట్రైకర్లు, కొత్తపాలెం గ్రామస్తుల దాడిలో గాయపడిన బాధితురాలు దాసరి లక్ష్మీప్రియ మంగళవారం ఫోన్లో మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్లో పనిచేశా, ప్రస్తుతం గుంటూరు సాయినగర్లో ఉంటూ బాలికలకు ఆత్మసంరక్షణపై అవగాహన తరగతులు బోధిస్తున్నట్లు తెలిపారు. కొండపై ఉన్న క్రీడాపార్కులో ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేశాం, కొందరు యువకులు వచ్చి అడ్డుకున్నారు, మీరెవరంటూ ప్రశ్నించాం...వారిలో ఒకరు రూ.32 లక్షలు ప్రభుత్వానికి చెల్లించి లీజుకు తీసుకున్నామన్నాడు. ఐడీ, యూనిఫాంగాని ఎందుకు లేవని ప్రశ్నించినందుకు రెచ్చిపోయారు. ఆ తర్వాత కొండ కింద ఘాట్రోడ్డు చెక్పోస్టు వద్ద ఈ విషయంపై ఫిర్యాదు ఇవ్వాలని వస్తే అటవీశాఖ, పోలీసు అధికారులు లేరని చెప్పారు. అంతా యువకులే ఉన్నారు, మా కారును వెంటాడుతూ బైకుల పైన ఉన్న యువకులు వచ్చారు. అక్కడ కూడా వాగ్వాదం జరిగింది. వారు మా పాపపై చేయి వేయడంతో దూషించిన మాట వాస్తవమే. అయితే ఊరు దాటి వెళ్లలేవంటూ కారులో వెళ్లే మమ్మల్ని గ్రామంలో చెత్తవాహనాలు, బైక్లు అడ్డుగా పెట్టి దాడి చేయించారని తెలిపారు. కారు అద్దాలు ధ్వంసం చేసి కిందకు లాక్కెళ్లి మా కుటుంబ సభ్యులందరి చేతుల్ని వెనక్కి విరిచి క్షమాపణలు చెప్పించారు. పవన్ అభిమానులమని చెబితే, మాకు అంతకంటే ఎక్కువ ఉంది ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకోమంటూ దాడిచేశారని వాపోయింది. ఆ సమయంలో ఇద్దరు పోలీసులు వచ్చారని, వారు చూసీచూడనట్లు వ్యవహరించారని తెలిపింది. యడ్లపాడు ఎస్ఐకి ఫోన్చేసినా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మా తప్పు ఉంటే మమ్మల్ని పోలీసులకు అప్పగించాలి గానీ దాడి చేయడం ఏమిటని ప్రశ్నించింది. రాష్ట్రంలో వీరమహిళలకు అన్యా యం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా...అందుకే ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని మంగళవారం సచివాలయంలో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీప్రియ చెప్పారు. -
జంట హత్యలపై కట్టు కథలు
సాక్షి, టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో జరిగిన జంట హత్యలపై ప్రభుత్వం, పోలీసులు కట్టు కథ అల్లారు. కేసు ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అందుకు బలం చేకూరుస్తున్నాయి. టీడీపీలో ఆధిపత్య పోరుతో జరిగిన హత్యలను ఎలాగైనా వైఎస్సార్ సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై నెట్టాలన్న దురుద్దేశంతో పెట్టిన అక్రమ కేసుగా స్పష్టమవుతోంది. హత్యలపై మృతుల అల్లుడు, టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో హత్యకు గల కారణం గ్రామ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతోనే జరిగిందని తన తొలి మాటల్లోనే తెలిపాడు. మృతుడు జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్యను హతమారిస్తే టీడీపీలో నాకు ఎదురు ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో ఓ కట్టుకథకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హత్యలో పాల్గొన్న నిందితులు జెవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజులు హత్య చేసిన అనంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును చూసి కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజంగా కారులో కత్తులే ఉంటే బండరాళ్లతో ఎందుకు మోది చంపుతారు, కత్తులే వాడే వారు కదా అనే ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. పోతూ పోతూ ‘‘ నా కొ..రా వచ్చేది మా వైఎస్సార్ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం, మాతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలు చెబితేనే మేము చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు.’’ అంటూ కత్తులు చూపి బెదిరిస్తూ పోయారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరు లు కుట్ర పన్ని ఉంటే ఎవరైనా ఇలా చెబుతారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను కేసులో అక్రమంగా చేర్చడానికి ప్రభుత్వం, పోలీసుల కుట్రగా అర్థమవుతోంది. మరోవైపు హత్య జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడైన తోట ఆంజనేయులు మీడియాతో మాట్లాడిన వీడియోలో మేము రావడం చూసి పారిపోయారని చెప్పాడు తప్ప నిలబడి బెదిరించారని ఎక్కడా చెప్పలేదు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి ఒత్తిడితో మరుసటి రోజు ఫిర్యాదు చేసే సమయానికి ఇలా మాట మార్చాడని అర్థమవుతోంది. నిందితులు పోతూపోతూ అన్నారని చెబుతున్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ అని పసుపు పచ్చ రంగులో స్టిక్కర్ ఉన్న టీడీపీ నేత తోట వెంక్రటామయ్య కారు దొరికింది. ఆధిపత్య పోరు కారణంగానే హత్యలు జరిగినట్లు ఎస్పీ ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షి హత్యలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలే అని స్పష్టం చేశాడు. ఇన్ని ప్రాథమిక ఆధారాలున్నా రాజకీయ కక్షతోనే పిన్నెలి సోదరులపై కేసు నమోదు చేసినట్టు అర్థమవుతోంది. ఎస్పీపై ఆగ్రహం పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావుపై పలు రకాలుగా ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అని ప్రాథమిక విచారణ తర్వాత ఎస్పీ తెలిపారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలో ఎస్పీపై వ్యతిరేక కథనాలు రాయించి బెదిరించే ధోరణిని ఎమ్మెల్యే జూలకంటి అవలంబించాడు. వైఎస్సార్ సీపీ నేతలపై తాను చెప్పినట్టు కేసులు నమోదు చేయకపోవడం వల్లే హత్యలు జరిగాయంటూ ఆరోపించారు. ఎస్పీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియాలో లీక్లు ఇచ్చి బెదిరించి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుస్తోంది. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అంటూ తేల్చిన పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎవరి ఒత్తిడితో మాట మార్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూలకంటి అసమర్థతే కారణం మా వెంట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడంటూ హంతకుల బెదిరింపు మేము రావడం చూసి హంతకులు పారిపోయారంటూ చెప్పిన ప్రత్యక్ష సాక్షి మరుసటి రోజు మాట మార్చి తప్పుడు ఫిర్యాదు టీడీపీలో ఆధిపత్య పోరుతోనే జెవిశెట్టి సోదరుల హత్య అంటూ ఎఫ్ఐఆర్లో ప్రస్తావన జెవిశెట్టి వెంకటేశ్వర్లకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఎమ్మెల్యే జూలకంటి తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన వ్యక్తికి రెండు కాళ్లు విరగొట్టినా పట్టించుకోని ఎమ్మెల్యే దీంతో హత్య చేసేందుకు సిద్ధపడిన తోట వెంకట్రామయ్య ఇరువర్గాల మధ్య రాజీ చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటూ తెలుగు తమ్ముళ్ల ఆరోపణ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పిన్నెల్లి సోదరులపై కుట్ర గుండ్లపాడు టీడీపీ నాయకుల హత్యకు కారణం స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అసమర్థతే కారణమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. గత కొంత కాలంగా గుండ్లపాడు తెలుగుదేశం పార్టీలో తారస్థాయికి చేరిన వర్గపోరును జూలకంటి పరిష్కరించి ఉంటే దశాబ్దకాలంగా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు హత్యకు గురయ్యేవారు కాదంటున్నారు. మరీ ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గుండ్లపాడులో ఉన్న జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య వర్గానికి, తోట వెంకట్రామయ్య వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు నెలలుగా అది మరింత ముదిరి ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకొనే వరకు దారి తీసింది. అందులో భాగంగా గత నెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీనుపై హత్యకు గురైన జెవిశెట్టి మొద్దయ్య వర్గీయులు దాడి చేసి రెండు కాళ్లు విరిగగొట్టారు. అయినా మొద్దయ్యను ఎమ్మెల్యే ఏమనకపోవడం, పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నాడన్న బాధ తోట వెంకట్రామయ్య వర్గంలో బలంగా నాటుకుపోయింది. మరోవైపు తాను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే లిఫ్ట్ చేయడం లేదని, మొద్దయ్య మాటకే విలువిస్తున్నాడని వెంకట్రామయ్య ఒకరిద్దరు టీడీపీ స్థానిక నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. -
డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం దక్కాయని అవర్ స్టేట్.. అవర్ లీడర్ సభ్యుడు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ పర్యటనలో ఉన్న కిరణ్కుమార్ రెడ్డి సోమవారం డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజల్లో విశ్వసనీయత, ఆదరాభిమానాలు పొందారని అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు వారి కుటుంబాలు, పిల్లల అభివృద్ధిని తన ఆనందంగా భావించి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆశించారని అన్నారు. యుఎస్ఏలోని అవర్ స్టేట్ – అవర్ లీడర్ సభ్యుడు శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేసేందుకు కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు ఎన్నో ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొన్నారని తెలిపారు. సంతమాగులూరు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, అరెస్టుల పర్వం మినహా ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఆలోచన లేకుండా పోయిందన్నారు. ఈసందర్భంగా అవర్ స్టేట్ – అవర్ లీడర్, ఇంటలెక్చువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గ్రూపునకు చెందిన 700కు పైగా సభ్యులు రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రమణారెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, ప్రసాద్ భీమవరపు, సాంబిరెడ్డి, పాల్ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ● పోలీసు పీజీఆర్ఎస్కు 75 ఫిర్యాదులు నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి ప్రజల నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం, చోరీలు తదితర సమస్యలకు సంబంధించిన 75 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యను శ్రద్ధగా విని, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. పొలాన్ని ఆక్రమించారు కోనూరు ఇసుక రీచ్లో అక్రమంగా ఇసుక తోడుతుంటే నేను ఆర్డీఓ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశాను. ఈ పనిచేశానని ఎమ్మెల్యే అనుచరులు నాపై కక్ష కట్టి, నా మూడెకరాల పొలాన్ని ట్రాక్టర్తో దున్నారు. కౌలు రైతులను బెదిరిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. –శాఖమూరి శ్రీనివాసరావు, కోనూరు, అచ్చంపేట -
పిన్నెల్లి సోదరులపై హత్య కేసు మోపడం దారుణం
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివనాగేశ్వరరావు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులపై హత్యా కేసు మోపడం దారుణమని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇరువురు టీడీపీ కార్యకర్తలైన జెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావులను ఈ నెల 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోని బోదేలవీడు – మండాది గ్రామాల మధ్య జరిగిన హత్యలు టీడీపీలోని రెండు వర్గాల ఆదిపత్య పోరులో భాగంగా జరిగాయని, ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమంగా, అన్యాయంగా హత్యానేరం మోపడం దారుణమైన విషయమన్నారు. ఈ కేసుకు పిన్నెల్లి సోదరులకు ఏ విధమైన సంబంధం లేదని, తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలకు గతం నుంచే ఆదిపత్య్హ పోరు ఉందని ఒక వర్గంపై మరొక వర్గం గతం నుంచే గొడవలు పడేవారని గ్రామస్తులు చెబుతున్నా పోలీసు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. హామీల అమలుపై దృష్టి మరల్చేందుకే.. రాష్ట్రంలోని 175 నియోకవర్గాలల్లోని వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించడమే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమని విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో తల్లికి వందనం ఇస్తానని, రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తానని, మహిళలకు 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తానని, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని, ఇంటింటికి సూపర్ సిక్స్ పేరు చెప్పి మాయమాటలతో అధికారంలోనికి వచ్చిన కూటమి నేడు ఆ హామీలు ఒక్కటైనా అమలు చేయకుండా, ప్రజల దృష్టి మరల్చేందుకే ఇటువంటి డ్రామాలు ఆడుతోందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు చేసే అక్రమాలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని వాటికి త్వరలోనే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. -
‘సాతి’పై అవగాహన కార్యక్రమం
గుంటూరు లీగల్: హైకోర్ట్ ఆదేశాల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్టేక్ హోల్డర్స్కు ‘సాతి’ (సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సిస్ త్రూ ట్రాకింగ్, హాలిస్టిక్ ఇంక్లూషన్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొని సాతి డిస్ట్రిక్ట్ కమిటీ విధి, విధానాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదే శాల మేరకు, ఆధార్ నమోదు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలతో అనుసంధానం ద్వారా అనాథ పిల్లలను గుర్తించి, వారికి సహాయం చేయడానికి సాతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క బిడ్డ గుర్తింపు లేకుండా, వారి హక్కులు, అర్హతలకు దూరంగా ఉండకుండా చూసుకోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. వీధి బాలలు, అనాథలు, రక్షించబడిన పిల్లలు వంటి 18 సంవత్సరాల లోపు నిరాశ్రయులైన పిల్లలందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం, వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలో సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్ పర్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి యూఐడీఏఐ ప్రతినిధి, ప్రతి తాలూకా తహసీల్దార్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఆరోగ్య అధికారి, సివిల్ సర్జన్, జిల్లా శిశు అభివృద్ధిశాఖ అధికారి, జువైనెల్ యూనిట్ నుంచి పోలీస్ అధికారి, అనాధ శరణాలయాలు, బాలల సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఐదుగురు, ప్యానల్ లాయర్లు నలుగురు, పారా లీగల్ వలంటీర్లు నలుగురు సభ్యులుగా ఉంటారన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
● తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజీ 1995–97 బ్యాచ్ ఇంటర్ పూర్వ విద్యార్థుల సమావేశం ● 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు గుంటూరు మెడికల్: తెనాలి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో 1995–97 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో వివిధ వృత్తుల్లో, హోదాల్లో స్థిరపడిన మిత్రులంతా 28 సంవత్సరాల అపూర్వ వేడుకలకు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ కుటుంబ సభ్యులతో హాజరై కాలేజీ రోజుల్లో చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాల్లో విహరించారు. సీఐలు రాంబాబు, రమేష్, ఎస్ఐ రాజారావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఆనంద్, బాబూరావు, కోటి, సుబ్బు, సీఆర్పీఎఫ్కు చెందిన అనిల్, పలువురు వైద్య సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. -
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ భాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. జూన్ నెల నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు. అన్నింటా మోసం.. విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో వేసుకున్న తర్వాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తమను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలు అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి. పరిశీలన తప్పనిసరి.. ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు(బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి. పొలంలో విత్తనాలు వేసుకున్న తర్వాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు సమయంలో రశీదు తప్పనిసరి నకిలీలను గుర్తిస్తే.. పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, డీఏఓ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. ధ్రువీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకువస్తారు. పోలీసులు, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. –నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు. -
కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్లతో కీటక జనిత వ్యాధుల నివారణపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మెజర్స్ అమలు చేయాలన్నారు. అడల్డ్ మస్కిటో మెజర్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధులను గణనీయంగా తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజునాయక్, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్రబాబు, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శేషగిరిరాజు, శ్రీమన్నారాయణ, శిగణేష్ పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అచ్చంపేట: వుండలంలోని గింజుపల్లి వద్ద కృష్ణానదిలో ఈతకెళ్లిన వ్యక్తి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపల పడవల ద్వారా ఈతగాళ్ల సహాయంతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 9.30 సమయంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నకరికల్లు మండలం చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపర్తి సైదారావు(43) మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మతల్లి దేవాలయం వద్ద మొక్కుబడులు తీర్చుకుని సమీపంలోని గింజుపల్లి వద్ద కృష్ణానదిలో తన స్నేహితులతో కలసి ఈతకొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. అచ్చంపేట సీఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యక్తి అనుమానాస్పద మృతి క్రోసూరు: మండలంలోని విప్పర్ల, ఊటుకూరు గ్రామాల ప్రధాన రహదారిపై ఒంటిపై తీవ్ర గాయాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది ఉండడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, క్రోసూరు ఎస్ఐ పి.రవిబాబులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. మృతుడు క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన కుంభా సాంబశివరావు(35)గా గుర్తించారు. తన ద్విచక్రవాహనం పక్కన ఒంటిపై తీవ్ర గాయాలతో చొక్కా లేకుండా పడి ఉండటాన్ని గమనించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్టీం, డ్వాగ్ స్క్వాడ్ను తెప్పించారు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన వాడు. క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన అనంతమ్మను వివాహం చేసుకుని సుమారు 10 సంవత్సరాల నుంచి అనంతవరంలోనే ఉంటున్నట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
విద్యుత్ లైను పనులు అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోండి
బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామంలో 50 సుగాలీ కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్ పనులు అడ్డుకుంటున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారు ఇప్పటివరకు సింగిల్ ఫేస్తో లోఓల్టేజ్ కారణంగా ఇబ్బందిపడుతుండగా త్రీ ఫేస్ సౌకర్యం కలిగించేందుకు పనులు చేపట్టారు. లైను వేయకుండా స్థానిక రామావత్ రామునాయక్, విద్యుత్ లైన్మెన్ రామావత్ బాలాజీ నాయక్, పోస్టుమాస్టర్ తవ్వా నాయక్ అడ్డుకుంటున్నారన్నారు. అవసరమైతే ప్రాణాలైనా తీస్తామని వారు బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోండి. – ప్రజాసంఘాల నాయకులు -
తారస్థాయికి చేరిన కూటమి కుట్రలు
సాక్షి, నరసరావుపేట: ప్రజల కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తారస్థాయికి చేరాయని మాజీ మంత్రి విడదల రజిని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం ఆమె స్పందించారు. గుండ్లపాడులో జరిగిన డబుల్ మర్డర్ పూర్తిగా టీడీపీలో ఆధిపత్యపోరుతో జరిగిందని ప్రత్యక్షసాక్షులు, పోలీసులు చెబుతున్నా ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు నమోదు చేసిందన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో చంపడానికి ఉపయోగించిన జేబీఆర్ పేరుతో టీడీపీ నేత కారు దొరికినా ఇంకా వైఎస్సార్సీపీపై నెపం వేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గతంలో తోట చంద్రయ్య హత్య విషయంలోనూ ఇలానే శవరాజకీయాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే పిన్నెల్లిపై అనేక అక్రమ కేసులతో వేధించారని మరోసారి ఆయనపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇంత బరితెగించి గతంలో ఏన్నడూ అక్రమ కేసులు పెట్టిన దాఖలాలు లేవన్నారు. పోలీసులు సైతం ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి అక్రమ కేసులు నమోదు ఆ శాఖకు మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ విషమ సంస్కృతిని కూటమి ప్రభుత్వం విడనాడాలని లేకపోతే భవిష్యత్తులో వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అండగా నిలిచి వారిని కాపాడుకుంటామన్నారు. ఏమాత్రం సంబంధంలేని కేసుల్లో వైఎస్సార్సీపీ నేతలను ఇరికిస్తున్నారు గుండ్లపాడు హత్యలు పూర్తిగా టీడీపీ వర్గపోరుతోనే జరిగాయి కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు మాజీ మంత్రి విడదల రజిని -
పిన్నెల్లి సోదరులపై హత్య కేసు ఉపసంహరించాలి
నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో హత్యకు గురైన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కేసులో పిన్నెల్లి సోదరులపై బనాయించిన అక్రమ కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు కోటేశ్వరరావులను టీడీపీలోని ప్రత్యర్థులు జెవిశెట్టి శ్రీనివాసరావు, తోట వెంకటరామయ్యలు హత్య చేశారని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారన్నారు. ఆ గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయని ఎస్పీ ఒక వీడియోను మీడియాకు రిలీజ్ చేశారన్నారు. తోట చంద్రయ్య హత్యతో ఈ హత్యకు ఎటువంటి సంబంధంలేదని కూడా ఎస్పీ చెప్పడం జరిగిందన్నారు. ఈ నేరానికి సంబంధించిన ఐదుగురు నిందితులను కూడా అరెస్ట్ కూడా చేశారన్నారు. ఆ విధంగా జరిగిన హత్యలపై ఎస్పీ చెప్పిన తర్వాత కూడా నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులుగా, ప్రభుత్వ విప్గా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన, ఒక ఏడాది కాలంగా ఊళ్లోలేని, ఎక్కడున్నాడో కూడా తెలియని అతని తమ్ముడు వెంకటరామిరెడ్డిపై కేసు బనాయించడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. చనిపోయిన వారు, చంపిన వారు ఇద్దరు టీడీపీ వారేనని అందరూ చెప్పుకుంటున్నారన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు ధోరణితోనే ఇటువంటి చర్యలు చేపడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గురజాల సబ్ డివిజన్లో రెండు నెలల నుంచి డీఎస్పీ లేడని, ఎందుకు పోస్టింగ్ వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఎస్పీ, ఇన్చార్జి డీఎస్పీ అక్కడ సమస్యలు విని మీకు ఏమైనా సమస్యలు ఉంటే జెవిశెట్టి వెంకటేశ్వర్లుకు చెప్పమని కూడా చెప్పారన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని ఉద్దేశంతో ఎస్పీ, డీఎస్పీ, ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి చెప్పినప్పటికీ ఈ హత్యలు జరిగాయంటే దీనికి పోలీసుల బాధ్యతలేదా అని ప్రశ్నించారు. ఒక గ్రామంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటే టీడీపీ నాయకుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారని ప్రశ్నించారు. ఈ హత్యను అరెస్టు చేసి న ఆ ఐదుగురు నిందితులే చేశారని ప్రత్యక్ష సాక్షి మృతుల బావమరిది స్వయంగా చెప్పాడని అన్నా రు. దీనిపై హైకోర్టు కూడా వెళ్తామని తెలియజేస్తూ, తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 171 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఆర్ఓ ఏకా మురళి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుడి సమస్య తెలుసుకున్న కలెక్టర్ బొల్లాపల్లికి చెందిన ఎం.సుధాకర్ అనే దివ్యాంగుడు పింఛన్ కోసం వీల్ఛైర్లో వచ్చాడు. కలెక్టర్ స్వయంగా అతని వద్దకు వెళ్లి సమస్య అడిగి తెలుసుకొని సెర్ఫ్ సీవోతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల నుంచి 171 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, అధికారులు -
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
అద్దంకి: పొగాకు రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పొదిలి వస్తున్నారని చెప్పా రు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నల్ల బర్లీ సాగు చేసిన రైతు పరిస్థితి జీవన్మరణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు దిగుబడులు పడిపోవడం, మరో వైపు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. అందుకే పొగాకు రైతుల తరఫున పోరాటం చేసేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు జగన్ పొదిలి రానున్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నాయకులు, అక్కడ హడావుడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కానీ తమ నేత అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. చేతనైతే రైతులకు సాయం చేసే విధంగా ఉండాలే తప్ప వారికి మేలు జరిగే పనిని అడ్డుకోవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పి తీరు తారన్నారు. తమ పార్టీ తరఫున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ పులికం కోటిరెడ్డి, ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కె.అంకారావు ఉన్నారు. -
విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నరసరావుపేట: వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు విద్యుత్ బకాయిలను వసూలు చేసి సంస్థ ప్రగతికి తోడ్పడాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారెడ్డి కోరారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల పర్యవేక్షణలో భాగంగా సోమవారం పల్నాడు సర్కిల్ని సందర్శించారు. జొన్నలగడ్డలోని సర్కిల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. పలు విషయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే విద్యుత్ జేఏసీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలు తీర్చాలని, నూతనంగా ఏర్పడిన సర్కిల్లో శాశ్వత ఉద్యోగులను నియమించాలని కోరారు. పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్.రాంబట్లు, ఆర్ బంగారయ్య, అధికారులు పాల్గొన్నారు.అధికారులతో సమీక్ష చేసిన సీపీడీసీఎల్ చైర్మన్, ఎండీ పుల్లారెడ్డి -
విద్యాశాఖ బదిలీలలు
గుంటూరుఎడ్యుకేషన్: బదిలీలకు తెరలేచిందనే ఆనందం ఉపాధ్యాయుల్లో ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే బదిలీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో కోరుకున్న పాఠశాలకు వెళ్లడం గగనమవుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతున్నామంటూనే మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో విధించిన నిబంధనలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నా రు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగియనుంది. ఇందుకు సంబంధించి జీఓ 22 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. పుట్టుకతో శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ద్వారా వారు కోరుకున్న పాఠశాలకు వెళ్లే సదుపాయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శారీరక వైకల్యం 70 శాతం లోపు ఉంటే ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు, 70 శాతానికి పైగా ఉంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో సంబంధిత ఉపాధ్యాయులు వారు పని చేస్తున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లవచ్చు. గత 25 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని మార్చివేసి ఎస్జీటీలకు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లకు 50 శాతం సీలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కక్షపూరితంగానే..! శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఒకే పాఠశాలలు ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్–2 హెచ్ఎం, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. ● ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకరు లేక ఇద్దరు ఎస్జీటీలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాంగ్ స్టాండింగ్ విధానంలో బదిలీపై వెళ్లేందుకు పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం లేదు. ముగ్గురి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉంటేనే సదరు పాఠశాలలను కోరుకోవాలని లేకుంటే మరో పాఠశాలకు వెళ్లాలంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం, సీలింగ్ పరిధికి మించిన పాఠశాలలను బ్లాక్ చేసింది. ● పుట్టుకతో అంధత్వం, వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో తాము పని చేస్తున్న పాఠశాలల్లోనే బదిలీ కాకుండా ఉండటంతో పాటు కోరుకున్న చోటకు బదిలీపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ● శారీరక వైకల్యంతోపాటు దీర్ఘకాలిక జబ్బులు, కేన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు హైస్కూళ్లలో సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. అంధ, వినికిడి లోపం, నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు విధించారు. ప్రతి మండలంలో 15 వరకు ఖాళీలు ఉండగా, వాటిలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే కోరుకునే విధంగా ఉంచి, మిగిలిన వాటిని బ్లాక్ చేశారు. ● దూరప్రాంతాల్లో మగ్గుతూ వైద్య సదుపాయాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతున్న టీచర్లకు మొండిచెయ్యి చూపారు. భర్త చనిపోయిన మహిళా ఉపాధ్యాయులకు విడాకులు తీసుకున్న ఉపాధ్యాయినులకు సైతం నిరాశే ఎదురవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం అన్యాయానికి గురవుతున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆర్థికంగా భారం లేని బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలతో జరిపిన చర్చలకు, మార్గదర్శకాలకు పొంతన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బదిలీలకు అవకాశం ఇచ్చి.. కఠిన నిబంధనలతో మోకాలొడ్డి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం కరవు 25 ఏళ్లుగా అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీపై ఆంక్షలు ఉపాధ్యాయ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాఖలైన దరఖాస్తులు 6,870 లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉమ్మడి జిల్లాలో 6,870 దరఖాస్తులు ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగియనుండగా, సోమవారం నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,870 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు దరఖాస్తు చేశారు. వీరిలో లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉన్నారు. మానవత్వం లేకుండా మార్గదర్శకాలు బదిలీల మార్గదర్శకాల్లో విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించారు. పీహెచ్ కేటగిరీ తోపాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ పాఠశాలల్లో ఖాళీలను బ్లాక్ చేశారు. శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీడబ్ల్యూడీ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందిన వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సినదిపోయి ఈ విధంగా కఠిన నిబంధనలు విధించడం దుర్మార్గం. – కె.బసవలింగారావు, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్వైకల్యంతో పుట్టడం మా తప్పా ? నేను గుంటూరు రూరల్ ఓబులనాయుడుపాలెంలోని ఎంపీయూపీఎస్లో పని చేస్తున్నాను. 70 శాతానికి పైగా శారీరక వైకల్యానికి గురైన నేను బదిలీల్లో గుంటూరుకు సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. ఉపాధ్యాయ బదిలీల చట్టంలో లేని విధంగా జీఓలో అనేక కఠిన నిబంధనలు విధించారు. శారీరక వైకల్యంతో జన్మించడం నా తప్పిదమా ? మానవత్వాన్ని చూపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఈ విధంగా నిబంధలు విధించి పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు. – పి.నాగశివన్నారాయణ, ఎస్జీటీ, గుంటూరు -
ముగిసిన ప్రసన్నాంజనేయుడి జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంతి, కల్యాణ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామికి విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామికి సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభించారు. అనంతరం లక్ష మల్లె పూలతో విశేష పూజలను నిర్వహించారు. చివరి రోజు భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికి పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. రాత్రి రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ అంకమ్మ తల్లి కళా నాట్యమండలి వారి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఆలయంలో హుండీని లెక్కించగా జనవరి నుంచి ఈ నెల 25 వరకూ హుండీ ద్వారా రూ. 3,28,366 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తలిపారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చివరి రోజు లక్ష మల్లెలతో స్వామికి అభిషేకం -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
మరో మహిళకు తీవ్ర గాయాలు మాచవరం: ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పిల్లుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లుట్ల గ్రామానికి చెందిన కాండ్రకుంట ఐశ్వర్య (33), కామినేటి సుజాతలతో పాటు మరి కొంత మహిళలు పొలం పనుల నిమిత్తం రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో నర్రా బాలు పిడుగురాళ్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా కాండ్రకుంట ఐశ్వర్య (33) మృతి చెందింది. తీవ్ర గాయాలైన సుజాతను పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రోశయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతు పోలీసుల ముమ్మర గాలింపు అచ్చంపేట: కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని గింజుపల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా, నకరికల్లు మండలం, చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపరి సైదారావు(43) మరికొంత మందితో ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మ తల్లి దేవాలయానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుని, కానుకలు సమర్పించి అక్కడే భోజనాలు వండుకుని తిన్నారు. సుమారు మూడు గంటల సమయంలో సమీపంలోని గింజపల్లి వద్ద కృష్ణానదిలో సరదాగా ఈత కొట్టేందుకు మరో 10మందితో దిగాడు. సైదారావు నది లోతుల్లోకి వెళ్లిపోగా దగ్గరలో ఉన్నవారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సహాయంతో చేపల పడవల ద్వారా ఆదివారం రాత్రి 7గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. మృతుడు కూలి పనే వృత్తిగా జీవిస్తుంటాడు. సైదారావుకు భార్య, బీటెక్ చదివే కుమారైలు ఇద్దరు ఉన్నారు. సంపులో పడి బాలుడి మృతి లక్ష్మీపురం: సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గుంటూరు కొత్తకాలనీకి చెందిన ఒడిశా వాసుల కుమారుడు రాఘవకుమార్ (5) ఆడుకుంటూ ఓ సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. నీటి కోసం తవ్విన సంపుకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులుకు బాలుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలలో గాలింపు ప్రారంభించారు. తీరా సంపులో పరిశీలించగా రాఘవకుమార్ అందులో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులు చేయబోమని, పోస్ట్మార్టం అవసరం లేదని చెప్పి బాలుడి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎంఏ హైస్కూలు క్రీడా మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేశారు. ప్రతిభభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయకుమార్, కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, సమ్మర్ క్యాంప్ ఇన్చార్జి బి.ప్రేమయ్య, కోచ్ ప్రసన్నకుమార్ తెలిపారు. బాలురకు సంబంధించి అండర్–13, అండర్–15లలో 22 మంది చొప్పున ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. సీనియర్ క్రీడాకారుడు ఎన్. నరేష్, రమ్మికుమార్, ఎన్.బాలశౌరి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు
చిలకలూరిపేట: కన్నుల పండువగా సంప్రదాయ నృత్యాలు, వీనుల విందుగా సుమధుర సంగీత కీర్తనలు, నాట్య కళాకారుల ఉత్సాహపూరిత ప్ర దర్శనల మధ్య కళా నిలయం 40వ జాతీయ స్థా యి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు సూర్య, చంద్ర విభాగాల్లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి ,చక్కటి హావభావాలతో నాట్యకళ ప్రదర్శించి, నటరాజ వారసులమని నిరూపించారు. కీర్తన, మూషిక వాహన, గణపతి కౌతం, వినాయక కౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతార శబ్దం,జనుత శబ్దం,కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహ వైభవం, హిమగిరి తనయ, అలవేల్ మంగ వంటి కీర్తనలకు లయబద్ధంగా నర్తించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేసి వారి ప్రశంసలను అందుకున్నారు. ఒకవైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యకళ బోధించిన నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు. నేటి కార్యక్రమాలు సూర్య, చంద్ర విభాగాల్లో జానపద నృత్య పోటీలతో పాటు శాసీ్త్రయ జంట నాట్యాలు, అశాసీ్త్రయం జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, అశాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్యనాటికల పోటీలు సోమవారం నిర్వహిస్తారు. వీటితో పాటు నాట్యాచార్యులకు సన్మానాలు ఉంటాయి. రెండో రోజు ఆకట్టుకున్న నాటికలు నాదెండ్ల: మండలంలోని సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయ నాటికల పోటీలు ఆదివారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శన నిలిచిపోయింది. ఆదివారం తొలిగా ప్రదర్శించారు. అనంతరం కొలకలూరి శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘జనరల్ బోగీలు’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘దొందూ దొందే’ నాటిక ప్రదర్శించారు. రచనా దర్శకత్వం డేవిడ్రాజు వహించారు. ఏలూరు హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సారీ రాంగ్ నంబర్’ నాటికకు రచయితగా చింతల మల్లేశ్వరరావు, దర్శకుడిగా మహమ్మద్ ఖాజావలి వ్యవహరించారు. సామాజిక రుగ్మతలు, సందేశాలను నాటికలు ప్రస్ఫుటించాయి. జ్యోతి ప్రజ్వలన బండారుపల్లి మస్తాన్రావు, సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు చేయగా, సభాధ్యక్షత గరికపాటి వెంకట రామారావు వహించారు. నేటి ప్రదర్శనలు : బాపట్ల సహృదయ ద్రోణాదుల వారి ‘వర్క్ఫ్రం హోమ్’, సాతులూరు వజ్జా రామనాథం ఆర్ట్స్ ‘రారాజు సుయోధన’, వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ‘ఏకాకి’ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రెండో రోజు కొనసాగిన కళానిలయం జాతీయ స్థాయి పోటీలు -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ‘కారుమూరు’
వేమూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటన జారీ చేసింది. చుండూరు మండలంలోని కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డి డిబేట్స్ విశ్లేషకులుగా, పార్టీలోనూ అనేక పదవులు చేపట్టారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. నియోజకవర్గంలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కారుమూరు వెంకట రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ప్రోత్సాహంతో తనకు పదవి లభించిందని తెలిపారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి వేటపాలెం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ పరిధి విఘ్నేశ్వర కాలనీ దగ్గర ఇసుక క్వారీలో ఆదివారం చోటు చేసుకుంది. కొత్తపేటలోని మూడు రోడ్లు దగ్గలో నివాసం ఉండే పిగిలి వాసు (38) తన ట్రాక్టర్తో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాడు. ట్రాక్టర్ను క్వారీ వద్ద నిలిపి ఇసుక లోడ్ చేసుకునే సమయంలో కిందికి దిగాడు. ట్రాక్టర్ ఓ కుప్ప నుంచి ముందుకు దొర్లుకుంటూ పోతుండటంతో వాసు ట్రాక్టర్పైకి ఎక్కి దానిని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవ శాత్తు జారి ట్రాక్టర్ టైరు కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆది దంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో ఆదివారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో కీలకమైన రూ.25 వేల వస్త్రాలంకరణ సేవలో ఆదివారం ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి, తొలి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంంటలకు ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో 18 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అభిషేకాల్లోనూ ఉభయదాతలను అనుమతించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో చండీహోమం నిర్వహించారు. 51 మంది ఉభయదాతలు తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మూర్తి వద్ద లక్ష కుంకుమార్చన నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. ఇక ప్రతి ఆదివారం నిర్వహించే సూర్యోపాసన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. -
తిరునాళ్లలో మైక్ అనుమతికి నిరాకరణ
చెరుకుపల్లి: పొన్నపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కార్మూరమ్మ తిరునాళ్లకు మైక్ అనుమతి ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని పొన్నపల్లి గ్రామంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 95 శాతం మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. పది రోజులు క్రితం మైక్ అనుమతి కోసం గ్రామ పెద్దలు మీ–సేవ ద్వారా చలానా తీశారు. స్థానిక ఎస్ఐ అనిల్కుమార్ను నాలుగు రోజులుగా పొన్నపల్లి గ్రామస్తులు సంప్రదిస్తూనే ఉన్నారు. గ్రామంలో గొడవలు జరుగుతాయనే సమాచారం ఉందని, అందుకే మైక్ పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. దీంతో ఆదివారం వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్బాబును, ఎస్ఐ అనిల్ కుమార్ను దీనిపై సంప్రదించినా అనుమతికి ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్ తదితరులు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని వారు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారని, కూటమి నేతల ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి తిరునాళ్ల సంతోషంగా జరుపుకోవటానికి మైక్ అనుమతి ఇవ్వాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రేపల్లె డీఎస్పీ అవల శ్రీనివాసరావు వచ్చి డాక్టర్ ఈవూరి గణేష్తో చర్చించారు. దీంతో మైక్ పర్మిషన్ వచ్చింది. దీనిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరుకూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్లు అమ్మవారిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకటరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. వెఎస్సార్సీపీకి గ్రామస్తులు అనుకూలమని పక్షపాతం రేపల్లె రూరల్ పోలీసుల అత్యుత్సాహం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆగ్రహం ఎట్టకేలకు డీఎస్పీ ఆదేశాలతో మైక్ అనుమతి -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి వారితో ఆసనాలను వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం కూడా శిక్షణ కొనసాగింది. ఆన్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఇందులో యోగా గురువులు, టీఓటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న కోటప్పకొండ, జూన్ 5న నాగార్జునసాగర్, 11న కొండవీడు కోట, 18న అమరావతి వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్ ఐదున యోగా ప్రదర్శనను నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందినవారితో బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు. పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం ఉదయం నరసరావుపేటలోని కలెక్టర్ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఐదున రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొనసాగుతున్న శిక్షణ -
కళల తెనాలికి ఆభరణం కాటూరి శిల్పకళ
తెనాలి: వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను కొనసాగిస్తూ ఆరు, ఏడు తరాల్లో ఆ కళకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్న శిల్పకళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు కళల తెనాలికి గర్వకారణమని పలువురు వక్తలు అభినందించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ మానవత తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లైబ్రరీ హాలులో జరిగింది. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. రాష్ట్రప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు గ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షను ఈ వేదికపై సత్కరించారు. తెనాలిలో తొలిసారిగా శిల్పకళపై నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ, తండ్రీకొడుకుల శిల్పకళానైపుణ్యానికి నిదర్శనమని డాక్టర్ రామ్చంద్ అన్నారు. శిల్పకళలో తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శిల్పకారులను సత్కరించడం మానవత విధిగా భావించినట్టు తెలిపారు. సత్కారగ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తండ్రీకొడుకులు ముగ్గురికీ ఒకే వేదికపై అభినందన గౌరవం మరచిపోలేనిదని చెప్పారు. తండ్రి కోటేశ్వరరావు నుంచి వచ్చిన శిల్పకళను గురువు అంచే రాధాకృష్ణమూర్తి శిక్షణలో మెరుగుపరచుకున్నట్టు చెప్పారు. బీఎఫ్ఏలో పీజీ చేసిన రవిచంద్ర ఇనుప వ్యర్థాలకు శిల్పకళా సోయగాలు కల్పిస్తుంటే, శ్రీహర్ష త్రీడీ, ఏఐ టెక్నాలజీని జోడిస్తూ కళాత్మక ఉట్టిపడేలా చేస్తుండటం తమ అదృష్టమన్నారు. సభకు ముందు ‘ఆపరేషన్ సిందూర’ స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ప్రదర్శించిన ‘తల్లికి వందనం’ సాంస్కృతిక కార్యక్రమం ప్రశంసలను అందుకుంది. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి.వెంకట్, డీవీ సోమయ్యశాస్త్రి, కూరపాటి కల్యాణి, మొవ్వా సత్యనారాయణ పాల్గొన్నారు. సత్కార సభలో ప్రముఖుల అభినందన -
యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రజలందరి భాగస్వామ్యం పెద్దఎత్తున కావాలని జిల్లా కలెక్టరు పి.అరుణ్బాబు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో యోగాంధ్ర పోటీలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల వారీగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో యోగా స్ట్రీట్ ఏర్పాటుచేసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా నిర్వహించాలని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగాలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్, వెబ్సైట్ ద్వారా నమోదు కావాలని ఆయన కోరారు. సమీపాన ఉన్న గ్రామ, వార్డుల ప్రాంతాలలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాల వద్ద కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. ఇంటర్నేషనల్ యోగాలో పాల్గొనేందుకు లింకు ద్వారా నమోదు కావాలని ఆయన సూచించారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులో సోమవారం ఉదయం 6.30గంటలకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. కలెక్టరు అరుణ్ బాబు క్యూఆర్ కోడ్, వెబ్సైట్ లింక్ ద్వారా నమోదు -
హిందువులం.. ధర్మ బంధువులం !
నరసరావుపేట ఈస్ట్: ‘హిందువులం.. ధర్మ బంధువులం’ నినాదంతో భారత జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి తెలిపారు. హిందూ చైతన్య భారతి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం, ధర్మం కోసం నేను సైతం.. అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. పహల్గామ్ ఘటనలో ఉగ్రవాద మూకలు హిందువులను మతం పేరుతో హతమార్చారని, భారతీయ మహిళ బొట్టు తుడిపేసిన ముష్కరులకు తగిన గుణపాఠం నేర్పామని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకుంటూ ధర్మాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. పల్నాడు రోడ్డులోని ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం, శివుని బొమ్మ, మల్లమ్మ సెంటర్, 60అడుగుల రోడ్డు, రైల్యే అండర్ బ్రిడ్జి మీదుగా తిరిగి కళాశాలకు చేరింది. టాప్లెస్ వాహనంపై శ్రీ శివస్వామి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, హిందూ చైతన్య భారతి ప్రతినిధులు కె.రామకృష్ణ, ఈ.ఎం.స్వామి, ఏబీవీపీ రాష్ట్ర కోశాధికారి కోడూరి సాంబశివరావు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు, వినాయక చవితి పందిళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి పట్టణంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర -
అమ్మసన్నిధి.. భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, పెద్ద సంఖ్యలో వివాహాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తులు రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో క్యూలు కిటకిటలాడుతూ కనిపించాయి. మహా మండపం రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఘాట్రోడ్డు పైకి కార్లను అనుమతించలేదు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం 11.40 నుంచి 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. వీఐపీ దర్శనాలు నిలిపివేత భక్తుల రద్దీ ఉండే సమయాల్లో వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యలో ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలివేశారు. ప్రముఖులు, అధికారుల పేరిట వచ్చిన వారికి ఈవో ఆదేశాలను వివరించారు. మధ్యాహ్నం 1.30 గంట తర్వాత వీఐపీ దర్శనాలకు అనుమతించారు. టికెట్టు ఉంటేనే అంతరాలయ దర్శనం రూ. 500 టికెట్టు ఉన్న వారికి మాత్రమే అంతరాలయంలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం ఈవో శీనానాయక్ పలుమార్లు టికెట్ల స్కానింగ్, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి వచ్చిన వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సమయం కేటాయింపు దిశగా ఈవో చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద సేద తీరగా ఈవో శీనానాయక్ వారిని కలిసి మాట్లాడారు. -
మరణ మృదంగం
ఖాకీల వైఫల్యంతో పల్నాడులోసాక్షి, నరసరావుపేట: పల్నాడులో అత్యంత సమస్యాత్మక గ్రామమైన గుండ్లపాడులో జంట హత్యలు పోలీసుల వైఫల్యంతో జరిగాయనే అభిప్రాయం గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతోంది. వెల్దుర్తి మండలం బొదిలవీడు సమీపంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అదే పార్టీకి చెందిన ప్రత్యర్థులు పాశవికంగా చంపేశారు. వాస్తవానికి గత కొంత కాలంగా గుండ్లపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మరోసారి ఆ గ్రామంలోని వర్గాల మధ్య వేడి రాజుకుంది. అప్పటి నుంచి వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు పికెట్ కొనసాగించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో 2022 తోట చంద్రయ్య హత్య తరువాత ఆ గ్రామంలో జంట హత్యలు జరిగాయి. ఈనెల 21న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పల్లెనిద్ర పేరిట కార్యకరమం నిర్వహించి ప్రశాతంగా ఉండాలని హెచ్చరించినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుత హత్యలతో ఏర్పడిన వేడి ఎన్ని రోజులు ఉంటుందో.. ఎంత సమస్యాత్మకమవుతోందన్న భయం గ్రామస్తుల్ని వెంటాడుతోంది. ఫ్లెక్సీల గొడవలో పోలీసుల నిర్తిప్తత మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని గత నెలలో టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను అనే కార్యకర్త మృతుడు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉంటున్న బజారులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. తమ బజారులో వేరే వర్గం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాపు కాసి ఉప్పుతోళ్ల శ్రీనుపై పాశవికంగా దాడి చేసి రెండు కాళ్లు విరగొట్టారు. ఆ కక్షతో పక్కా పథకం ప్రకారం జెవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావు కాపుకాసి తోట వెంకట్రామయ్య కారుతో గుద్ది పాశవికంగా హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విఽభేదాలతో జరిగిన మారణకాండ అని స్పష్టమైంది. అయితే, ఫ్లెక్సీల గొడవ జరిగినప్పుడు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొని ఉంటే హత్యా రాజకీయాలకు టీడీపీ కార్యకర్తలు వెళ్లే పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇరువర్గాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కావడంతో రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వదిలివేశారు. ఇంత జరుగుతుంటే జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగం ఏం చేస్తోందన్న ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రత్యర్థుల కదలికలు, వారిపై అక్రమ కేసులకు ఎస్బీ వ్యవస్థ నిమగ్నమైందనే అపవాదుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ కార్యకర్తలు డబుల్ మర్డర్లు చేసే వరకు వెళ్లారు. పోలీసుల నిర్లక్ష్యంతో గుండ్లపాడులో జంట హత్యలు అత్యంత సమస్యాత్మక గ్రామమని తెలిసి జాగ్రత్త పడని పోలీసు శాఖ ఫ్లెక్సీల గొడవలో ఇద్దరు టీడీపీ వారే కావడంతో కఠిన చర్యలు తీసుకోని పోలీసులు అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే దురాగతాలు జరిగేవి కావంటున్న స్థానికులు గురజాల సబ్ డివిజన్లో డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే హత్యలకు కారణం రెండు నెలలుగా డీఎస్పీ పోస్టు ఖాళీరాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక పోలీసు సబ్ డివిజన్లలో గురజాల ఒకటి. రెండు నెలలుగా డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. అప్పటివరకు డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమంగా నిర్బంధించి వేధించడానికి పూర్తిగా సహకరించలేదన్న కారణంతో వీఆర్కు పంపారు. దీంతో అప్పటి నుంచి డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం తీవ్ర ఆలస్యం చేయడం కూడా ఈ హత్యలకు దారితీసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంచార్జిగా సత్తెనపల్లి డీఎస్పీ హనమంతరావు ఉన్నప్పటికి పూర్తిస్థాయిలో డివిజన్పై దృష్టి పెట్టలేకపోయారు. మరోవైపు ఈ సబ్ డివిజన్లో ముఖ్యంగా హత్య జరిగిన వెల్దుర్తి పోలీసుస్టేషన్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. డీఎస్పీ పోస్టు భర్తీ చేయకపోవడం, సిబ్బంది కొరత విషయంపై ‘సాక్షి’ ఈనెల 16న ఓ కథనం కూడా ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగే అవకాశాలు తగ్గేవని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్
మంగళగిరి: మంగళాద్రిలో గల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి వచ్చిన కమిషనర్ దంపతులకు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలి కారు. దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశ్వీరచనాలు అంద జేశారు. ముగిసిన హనుమాన్ దీక్షలు నగరంపాలెం: స్థానిక మారుతీనగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా హనుమాన్ మండల వ్రత దీక్షలు ఆదివారంతో ముగిశాయి. హనుమత్ హవనం, మన్యుసూక్త హోమం, గణపతి హోమం నిర్వహించారు. దీక్షాధారులు ఇరుముడులు ధరించి ఆలయ ప్రదక్షిణలు అనంతరం మాల విరమణ చేశారు. సాయంకాలపు కార్యక్రమాల్లో భాగంగా మాస శివరాత్రి గంగా గౌరీ సమేత శంకరునికి ప్రదోషకాల అభిషే కం, కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కొరపాటి రామారావు, ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, జిల్లా దేవాలయ పరిరక్షణ సమితి కార్యదర్శి నరేంద్రగౌతమ్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం తెనాలి: పట్టణ నాజరుపేటలో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠం శ్రీసదనం శ్రీపరశివానంద భారతీస్వామి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కె.చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షణలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గేట్ మేన్పై సస్పెన్షన్ వేటు నాదెండ్ల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతులూరు రైల్వే గేట్మేన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 23న ఉదయం 5 గంటల సమయంలో గుంటూరు నుంచి హుబ్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది. సాతులూరు సమీపంలో మూడు రైల్వే గేట్లుండగా, 290–291 చందవరం–బుక్కాపురం రోడ్డు వద్ద గేట్లు వేశారు. 289 కనపర్రు రోడ్డు వద్ద వేయకపోవడంతో గూడ్స్ రైలు 15 నిమిషాలు నిలిచిపోయింది. గేట్మేన్ నిర్లక్ష్యంపై లోకో పైలట్ గుంటూరు స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గేట్మేన్ ఆర్. కోటేశ్వరరావును రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీని విచారణకు నియమించారు. తిరుపతమ్మ ఆలయంలో రద్దీ పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలు, పరిసరాలు కిక్కిరిశాయి. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగింది. కొందరు భక్తులు మునేరు అవతల మామిడి తోటల్లో సందడి చేస్తూ వంటలు చేసుకుని భోజనాలు చేశారు. -
మార్చురీలో మగ్గుతున్న మృతదేహాలు
నరసరావుపేట టౌన్: ఆర్థిక ఇబ్బందులో లేక కుటుంబ సమస్యలో తెలియదు గానీ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రోడ్డుపై వేచిఉన్న మరో వ్యక్తిని మృత్యువు రూపంలో ఆర్టీసీ బస్సు కబళించింది. మృతుల వివరాలు గుర్తించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో మూడు రోజులుగా వారి మృతదేహాలు వైద్యశాల శవాగారంలో మగ్గిపోతున్నాయి. వివరాల్లో కెళితే.. గుర్తు తెలియని వ్యక్తులు రైలు కింద పడి బలవన్మరణం చెందిన కేసుల్లో పురోగతి లభించడం లేదు. మూడు రోజుల కిందట నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి చేతిమీద నాన్న అనే పచ్చబొట్టును పోలీసులు గుర్తించారు. దాంతో పాటు మృతుడు ధరించిన దుస్తుల ఆధారంగా ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నరసరావుపేట రైల్వే స్టేషన్లో శుక్రవారం కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి అందరూ చూస్తుండగానే బలవన్మరణం చెందాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆనవాళ్ల కోసం రైల్వే పోలీసులు గత మూడు రోజులుగా గాలిస్తున్నా ఎటువంటి ఫలితం దక్కలేదు. రైల్వే పోలీస్ స్టేషన్లో సరిపడా సిబ్బంది, అవసరమైన సాంకేతికత పరికరాలు లేకపోవడంతో మృతుల గుర్తింపులో జాప్యం చోటు చేసుకుంటోందని పోలీసులు చెప్పుకొస్తున్నారు. బస్సు ప్రమాద మృతుడిని కూడా గుర్తించలేదు గత గురువారం గుంటూరు రోడ్డులో బస్సు కోసం వేచిఉన్న గుర్తు తెలియని వ్యకిని గంటూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దారిలోనే మృత్యువాత పడ్డాడు. నరసరావుపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఆనవాళ్లు తెలియక పోవడంతో గత నాలుగు రోజులుగా మృతదేహాన్ని వైద్యశాల మార్చురీలోనే ఉంచారు. ప్రమాద సంఘటనలకు సంబంధించి పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ బంధువులెవ్వరూ ముందుకు రాలేదు. రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు మృతి ముగ్గురి మృతదేహాలు గుర్తింపులో పోలీసుల నిర్లక్ష్యం సిబ్బంది లేరని సాకులు పోలీసులకు తలనొప్పి రైలు కిందపడి మృతి చెందిన ఇద్దరిని గుర్తిస్తేనే వారి ఆత్మహత్యలకు గల కారణాలు తెలుస్తాయి. దీంతో పోలీసులు సంఘటనా స్థలంలో తీసిన ఫొటోలను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. అన్ని చోట్ల నుంచి వారి గురించి ఆరా తీస్తున్నారు. మృతుల వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభ్యం కాకపోవటంతో ఆత్మహత్య కేసులు పోలీసులకు తలనొప్పిగా మారింది. రోజుల తరబడి మృతులను గుర్తించక పోవడంతో వారి మృతదేహాలు మార్చురీలో మగ్గిపోతున్నాయి. భద్రపరిచేందుకు అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో మరో రోజు చూసి ఖననం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
ఉచిత న్యాయ సహాయం పొందండి
నరసరావుపేటటౌన్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు మండల న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్యశ్రీ అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురయితే జాతీయ న్యాయసేవాధికార సంస్థ ప్రవేశ పెట్టిన హెల్ప్లైన్ నెం. 15100కు ఫిర్యాదు చేయాలన్నారు. అదే విధంగా జాతీయ మహిళా హెల్ప్లైన్ 7827170170 నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. లైంగిక వేధింపుల చట్టం గురించి అవగాహన కల్పించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 31న జెడ్పీస్థాయీ సంఘ సమావేశాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 31న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, అభివృద్ధి పనులకు సంబంధించిన 1, 2, 4, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్నాయి. వ్యవసాయంపై 3వ స్థాయి సంఘం జెడ్పీ వైస్ చైర్మన్ శొంటిరెడ్డి నర్సిరెడ్డి, సీ్త్ర–శిశు సంక్షేమంపై 5వ స్థాయీ సంఘం తెనాలి జెడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి, సాంఘిక సంక్షేమంపై 6వ స్థాయీ సంఘం జెడ్పీ వైస్ చైర్పర్సన్ బత్తుల అనురాధ అధ్యక్షతన జరగనున్నాయి. స్థాయీ సంఘ సమావేశాలకు ఆయా సంఘాల సభ్యులతో పాటు మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని సీఈవో జ్యోతిబసు సూచించారు. యోగాంధ్రపై విస్తృత ప్రచారం నరసరావుపేట: యోగాంధ్రలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధికారులకు సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జూన్ 21 వరకు యోగా ప్రాముఖ్యతను విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులకు, ఆయా రంగాల్లోని వారికి వివిధ పోటీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో యోగా శిక్షకులను గుర్తించి అభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో యోగా అభ్యాసకులకు ప్రజలను నమోదుచేసేందుకు కృషిచేయాలన్నారు. ప్రతిరోజూ నరసరావుపేటతో పాటు మున్సిపాల్టీలు, మండలస్థాయిలో యోగా ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. డీఆర్ఓ ఏకా మురళి పాల్గొన్నారు. పిల్లలకు ఎంఆర్ వ్యాక్సిన్ వేయించండి డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి నరసరావుపేట: జిల్లాలో పిల్లలకు ఆటలమ్మ, రూబెల్లా వ్యాధులు సంక్రమించకుండా ఎంఆర్ వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి కోరారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలో మీజిల్స్ రుబెల్లా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మూడు విడతలుగా ప్రత్యేక ఎంఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 31వరకు, జూన్ 23 నుంచి 28వరకు, జూలై నెలలో 21 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ మొదటి డోసు తొమ్మది నుంచి 12 నెలల మధ్య, రెండో డోసు 16 నెలల నుంచి 24 నెలల మధ్య వేయాలని పిల్లలకు వేయించాలని కోరారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎంఆర్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసులు వేయించుకోని పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తారన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2025రాజధాని అమరావతిలో చెరువు భూమికి రెక్కలు వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక డెప్యూటీ కలెక్టర్ ఈ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేయించారు. తమ వారి పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించేసు కున్నారు. ఫ్రీ హోల్డ్ విషయంలో గానీ, రిజిస్ట్రేషన్లు చేయించే విషయంలో గానీ నిబంధనలు పాటించలేదు. ప్రభుత్వం ఈ భూములపై నిషేధం విధించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. న్యూస్రీల్ -
అందెల సవ్వడి అలరించగా..
చిలకలూరిపేట: అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలకు లయబద్ధమైన నృత్యరీతులు.. నటరాజ వారసుల అభినయాలు.. కళామతల్లి ముద్దు బిడ్డల మువ్వల సవ్వడుల నడుమ కళానిలయం 40వ జాతీయ స్థాయి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలు పండుగ వాతావరణంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు చిలకలూరిపేట పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణమండపం వేదికగా నిలిచింది. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ నటరాజపూజ, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు పగలు, రాత్రి కొనసాగే ఈ పోటీలలో తొలిరోజు పోటీల్లో భాగంగా సూర్య విభాగంలో 13 సంవత్సరాల లోపు, 14 పైబడిన వారికి రెండు విభాగాలుగా కూచిపూడి నృత్యపోటీలు నిర్వహించారు. శాసీ్త్రయ జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయం కాని జంట నాట్యాలు, శాసీ్త్రయం కాని బృంద నాట్యాలు ప్రదర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముద్దుగారే యశోద, తరంగం, థిల్లానా, అన్నమయ్య కీర్తన, భామాకలాపం, మహిశాసుర మర్థిని వంటి అంశాలను కళాకారులు ప్రదర్శించారు. కళలను ప్రోత్సహించాలి.. పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన నాట్యాచార్యులు దేవరకొండ వెంకట నాగసాయి ముందుమాటలు పలుకుతూ కళలను ప్రోత్సహించండి, కళాకారులను ఆశీర్వదించండి అంటూ కోరారు. కళామతల్లి సేవకు కళానిలయం వ్యవస్థాపకుడు ప్రగడ రాజమోహనరావు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దశావతారం ప్రదర్శిస్తున్న హైదరాబాద్కు చెందిన పి.ఇఫ్తికారెడ్డి ప్రారంభమైన కళానిలయం జాతీయస్థాయి సంగీత నాట్య పోటీలు తొలిరోజు కూచిపూడి నృత్యాల ప్రదర్శన నేటి ప్రదర్శనలు.. కళానిలయం పోటీలలో భాగంగా బుధవారం 13 సంవత్సరాల లోపు చంద్రకేటగిరి ‘బి’ గ్రూపు కూచిపూడి నృత్యాలు, 13 సంవత్సరాల లోపు సూర్య కేటగిరి ‘బి’ గ్రూపు భరతనాట్యం పోటీలు, చంద్ర కేటగిరి ‘బి’ గ్రూపు 13 సంవత్సరాల లోపు భరతనాట్యం పోటీలు, చంద్ర కేటగిరి ‘ఏ’ గ్రూపు 14 సంవత్సరాలు పై బడిన వారికి కూచిపూడి నృత్యాల పోటీలు నిర్వహించనున్నారు. సినీ మధురగీతాలు, శాసీ్త్రయ జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు పోటీలు ఉంటాయి. -
‘ఫ్రీ’గా పట్టేసి.. చెరువు భూమి కాజేసి..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, లేమల్లె గ్రామ శివారు అయిన కర్లపూడి గ్రామంలో సర్వే నెంబర్ 290లోని సుమారు 15 ఎకరాల చెరువు పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమంది పేదలకు గతంలో అసైన్ చేయగా, మరికొంత భూమిని ఇంకొందరు స్వాధీనంలో ఉంచుకున్నారు. కొంత మందికే పట్టాలు ఉన్నాయి. మిగిలిన వారిలో మరికొందరికి పాత తేదీలు వేసి నకిలీ పట్టాలు సృష్టించారు. పాత తేదీలతో పక్కాగా నకిలీలు.. ఈ భూమి గుంటూరు నుంచి అమరావతి మెయిన్ రోడ్డు పక్కనే కర్లపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉంటుంది. రాజధాని రావడంతో ఈ భూముల ధరలు కూడా పెరిగాయి. దీనిపై కన్నేసిన ఒక డెప్యూటీ కలెక్టర్ పల్నాడు జిల్లాలో పోస్టింగ్లో ఉన్న సమయంలో చక్రం తిప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్రీ హోల్డ్ చేయించారు. అసైన్ భూములకు ఫ్రీ హోల్డ్ చేయాలంటే జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీ (డీఎల్ఆర్సీ)లో ఆమోదం పొందాలి. ఇవేమీ లేకుండానే తహసీల్దార్, ఆర్డీవో రిమార్కులతో ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇచ్చిన ఆదేశాలలో కూడా చెరువు పోరంబోకును ఎందుకు ఫ్రీ హోల్డ్ చేస్తున్నారనే అంశాన్ని కూడా పొందుపరచలేదు. దీనికి సంబంధించిన నోట్ ఫైల్ కూడా లేదని చెబుతున్నారు. ఈ భూమిలో 19 మంది హక్కుదారులు ఉన్నట్లు చూపించారు. వీరిలో కొందరు రైతుల వద్ద పట్టాలు ఉన్నాయి. మరికొందరి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో గతంలో రెవెన్యూ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన కొంతమంది అధికారులతో సంతకాలు పెట్టించి పాత స్టాంప్ పేపర్లపై సదరు సర్వే నెంబర్లోని రైతులకు పూర్వకాలంలోనే పట్టాలు వచ్చినట్లుగా నకిలీవి సృష్టించారని సమాచారం. వీటి ఆధారంగా సర్వేనెంబర్ 290లోని 15 ఎకరాలకు పూర్వకాలంలోనే పట్టాలు మంజూరు అయినట్లుగా రికార్డ్ తయారు చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఫ్రీ హోల్డ్ జీవో ప్రకారం ఆదేశాలు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు ప్రణాళిక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 7వ తేదీన ఫ్రీ హోల్డ్ అయిన భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై రాష్ట్ర స్థాయిలో కమిటీని సర్కారు నియమించింది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా, ఆ పార్టీ కోసం ఎంతో చేశానని చెప్పే సదరు డెప్యూటీ కలెక్టర్ తన పలుకుబడిని ఉపయోగించారు. ఆగస్టు 19వ తేదీన ఆ భూములకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం విశేషం. అసలు లబ్ధిదారులకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి ఒక సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ సంస్థలో సదరు డెప్యూటీ కలెక్టర్కు వాటాలు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈ భూమిలో వెంచర్లు వేసి రూ.కోట్లు సంపాదించేందుకు సీఆర్డీఏ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకుండానే ఫ్రీ హోల్డ్ అమరావతిలో చెరువు భూమికి రెక్కలు చక్రం తిప్పిన డెప్యూటీ కలెక్టర్ డీఎల్ఆర్సీ మీటింగ్ జరగకుండానే ఆదేశాలు ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత రిజిస్ట్రేషన్లు రూ.కోట్ల విలువైన 15 ఎకరాలు బినామీ పేర్లతో హస్తగతం -
వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ మండల అధ్యక్షులను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సత్తెనపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులుగా సహారా మౌలాలి, సత్తెనపల్లికి రాయపాటి పురుషోత్తమరావు, ముప్పాళ్లకు నక్కా శ్రీనివాసరావు, రాజుపాలెంకు వేపూరి శ్రీను, నకరికల్లుకు భవనం రాఘవరెడ్డి నియమితులయ్యారు. ● గురజాల నియోజకవర్గంలో గురజాల నగర పంచాయతీ అధ్యక్షులుగా కుక్కముడి అన్నారావు, గురజాల అధ్యక్షులుగా కొమ్మినేని వెంకటేశ్వర్లు, మాచవరం అధ్యక్షులుగా మద్దు ప్రసాదు, పిడుగురాళ్ల రూరల్ మండల అధ్యక్షులుగా చింతా వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ● రాష్ట్ర విభాగాల కమిటీల్లో పల్నాడు జిల్లా నాయకులకు చోటు నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చిలకలూరిపేటకు చెందిన పాలూరి అంజిరెడ్డిని ఐటీ వింగ్ రాష్ట్ర జోనల్ ప్రెసిడెంట్గా, గురజాలకు చెందిన కర్రా చిన కోటేశ్వరరావును స్టేట్ బూత్ కమిటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా, పెదకూరపాడుకు చెందిన బచ్చు హనుమంత వెంకట సుబ్బారావును స్టేట్ పబ్లిసిటీ వింగ్ సంయుక్త కార్యదర్శిగా నియమించారు. నాటికల పోటీలు ప్రారంభం నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. పశువుల ఆసుపత్రి సమీపంలో భారతీయ కళావేదిక వద్ద పోటీలు జరగనున్నట్లు పరిషత్ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీలను జీబీఆర్ హ్యాచరీస్ చైర్మన్ గడ్డం బుచ్చారావు, ఈదర పెద్దబ్బాయి ప్రారంభించారు. తొలిరోజు విశాఖపట్నం కళాభినయ బృందం ఆధ్వర్యంలో ‘ఓ కాశీవాస రావయ్య’ నాటిక ప్రదర్శించారు. రచయితగా పీటీ మాధవ్, దర్శకుడిగా శ్రీకవి ప్రసాద్ వ్యవహరించారు. గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శించారు. రచయితగా ఆకురాతి భాస్కర్చంద్ర, దర్శకుడిగా నడింపల్లి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. సామాజిక దృక్పథానికి అద్దం పట్టేలా రెండు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరిషత్ పర్యవేక్షకులుగా జరుగుల రామారావు వ్యవహరించారు. -
నేడు సీనియర్ స్విమ్మర్ల జిల్లా జట్ల ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఈత కొలనులో ఈనెల 25వ తేదీ ఆదివారం జిల్లా సీనియర్ స్విమ్మింగ్, వాటర్ పోలో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి శనివారం తెలిపారు. స్విమ్మింగ్ పోటీలో పాల్గొనే క్రీడాకారులు 2010 సంవత్సరం, అంతకు ముందు జన్మించిన వారై ఉండాలన్నారు. అలాగే వాటర్ పోలో పోటీలో పాల్గొనేవారు 2008 సంవత్సరానికి ముందు పుట్టిన వారై ఉండాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు జూన్ ఒకటో తేదిన జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ చాంపియన్షిప్ పోటీలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. వివరాలకు 8296374963 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. నరసరావుపేటలో భారీ వర్షం నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవుతుండగా, అడపా దడపా వర్షాలు కురుస్తుండటం, శుక్రవారం మెండుగా వర్షం పడటంతో మరో రెండురోజులు చల్లగా ఉండే అవకాశం ఉంది. ఈ వర్షానికి ఎక్కడా ఆర్థిక, ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారంలేదు. -
ఎస్సీ, ఎస్టీలప్రత్యేక పీజీఆర్ఎస్
ప్రతినెలా పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి జిల్లాలోని అన్నీ మండలాలు, గ్రామాల్లో ప్రతినెలా చివరి రోజున పౌరహక్కుల దినోత్సవం నిర్వహించేలా తహసీల్దార్లను ఆదేశించండి. అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి. – చింతిరాల మీరయ్య మాదిగ, కుక్కమూడి ప్రసాదు, ఎమ్మార్పీఎస్, డీబీఎస్ఎస్ఎన్ నేతలు నరసరావుపేట: కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షత వహించి 32 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన బాధితులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. డీఆర్ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నా పిల్లలు పొలం అమ్మకుండా చూడండి నాకు 93ఏళ్లు, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశా. వారందరికీ పిల్లలు ఉన్నారు. అయితే నాకు రెండెకరాల పొలం ఉంటే దానిని నా భార్యపేరుపై పెట్టా. ఆ పొలం నా కష్టార్జితం. నేను చిన్నకుమారుడి వద్ద ఉంటా. అయితే నా పొలం అమ్మాలని నా కుమారులు చూస్తున్నారు. నేను దానికి ఒప్పుకోవడం లేదు. ఆ పొలం మొత్తం నా మనవళ్లకు దక్కాలి. వారు ఇబ్బందులు పడకూడదు. పొలం అమ్మటానికి నేను ఒప్పుకోను. పొలం అమ్మకుండా నా పిల్లలను హెచ్చరించండి. – బండారు అంకాళ్లు, దేచవరం, నకరికల్లు మండలం 32 అర్జీలు స్వీకరించిన జేసీ సూరజ్ -
నేర నియంత్రణే ప్రథమ కర్తవ్యం
నరసరావుపేట: శాంతిభద్రతల పరిరక్షణ. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణే ప్రథమ కర్తవ్యంగా జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన నేరసమీక్షలో పీజీఆర్ఎస్, పోస్కో, గ్రేవ్, ప్రాపర్టీ, చీటింగ్, 174 సీఆర్పీసీ, మిస్సింగ్ కేసులు, గంజాయి, నాటుసారా కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీస్స్టేషన్లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని, బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి, సిబ్బంది ఉండేటట్లుగా చూసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 112 ఎమర్జెన్సీ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాల్ వచ్చిన సమయం, సంఘటన స్థలానికి చేరుకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలపై నిఘా వుంచి వాటిని ఎప్పటికప్పుడు అరికట్టాలని, ఆ ప్రదేశాలలో కార్డన్ అండ్ సెర్చ్లు, దాడులు నిర్వహించాలన్నారు. ఈ నెలలో ఈపూరు, ముప్పాళ్ళ, చిలకలూరిపేట రూరల్, నరసరావుపేట వన్టౌన్లోని ఐదు కేసులలో కోర్టు శిక్ష విధించడం ఆనందంగా ఉందన్నారు. ఏపీపీ, పీపీలకు అభినందనలు ఈసందర్భంగా నరసరావుపేట వన్టౌన్లో తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్లపందికి జీవిత ఖైదు, మరణ శిక్షతో పాటు పలు స్టేషన్లలోని కేసులకు జీవిత ఖైదు, శిక్షలు వేయించడానికి కృషిచేసిన ఏపీపీ దేశిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ సిరాజుద్దీన్, సీనీయర్ ఏపీపీ లాల్సింగ్ లక్ష్మీరాం నాయక్లను సన్మానించి మెమొంటోతో సత్కరించారు. అలాగే ప్రతిభ కనబరిచిన కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు, క్రైం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేర సమీక్షలో పోలీసు అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ ఏపీపీ, పీపీలకు సన్మానం -
దేశంలో నరహంతక పాలన
లక్ష్మీపురం: దేశంలో బీజేపీ నరహంతక పాలన కొనసాగిస్తోందని, మతాల మధ్య చిచ్చు పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళా రూపాల శిక్షణ శిబిరం శనివారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు అన్నీ అప్పగిస్తోందన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులతోపాటు ఆదివాసీలను దారుణంగా హతమార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు వస్తామని చెప్పినప్పటికీ కేంద్రం వారిని చంపే కార్యక్రమం చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్ను కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సరికొత్త నాటకానికి ప్రధాని నరేంద్ర మోదీ తెర తీశారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భయపడి మోదీ పాక్పై యుద్ధాన్ని ఆపేశారని తెలిపారు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతామన్నారు. మహాసభలకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, మావోయిస్టులను హతమార్చుతున్న కేంద్రం విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా బొమ్ము
తాడేపల్లి రూరల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రచార విభాగానికి నూతన ఉపాధ్యక్షులను నియమించారు. పార్టీ ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాజ గ్రామానికి చెందిన బొమ్ము వెంకటేశ్వరరెడ్డి (తాతిరెడ్డి)ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచి నియమించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
దిగొచ్చిన అధికారులు
నరసరావుపేట: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 66వ రోజుకు చేరింది. ఆప్కాస్లో ఉన్నప్పటికీ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం, సగం రోజులకే ఇవ్వడాన్ని ప్రశ్నించినందుకు విధులకు హాజరు కావొద్దన్న అధికారుల తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివరకు పలు విధాలుగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట పటిమకు ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు శనివారం సీఐటీయూ నాయకులతో చర్చలు నిర్వహించారు. కమిషనర్ చాంబర్లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, మండల కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్తో చర్చించారు. కార్మికులను కొనసాగించి మెరుగైన వేతనాలు ఇస్తామని కమిషనర్ ఎం.జస్వంతరావు హామీ ఇచ్చారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా జరిగాయని, సమ్మె కాలానికి కూడా సగం వేతనాలు ఇవ్వాలని, వేతనాల చెల్లింపులు ఆప్కాస్ ద్వారా చేయాలని డిమాండ్ చేశామన్నారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో కొత్తగా కార్మికులను తీసుకోవాలన్న ప్రతిపాదనకు సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పోరాటాల ద్వారానే హక్కులు, డిమాండ్లను సాధించుకోవాలని పేర్కొన్నారు. 66వ రోజుకు మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె సీఐటీయూ నాయకులతో మున్సిపల్ కమిషనర్ చర్చలు నేటి నుంచి విధుల్లోకి కార్మికులు -
ప్రసన్నాంజనేయునికి విశేష పూజలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేక పూజ చేశారు. అనంతరం 1,008 అరటి పండ్లతో విశేష పూజలను నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. మండల దేవదాయ శాఖ ఈవో అవుడూరి వెంకటేశ్వరరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రికి గుంటూరు శ్రీ స్రవంతి సంగీత కళాశాల వారి శ్రీరామాంజనే యుధ్ధం, శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటికలను ప్రదర్శించారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 1,008 అరటిపండ్లతో అభిషేక కార్యక్రమం -
27వ రోజుకు చేరిన సీహెచ్ఓల సమ్మె
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): వైద్య ఆరోగ్య శాఖ ఎన్హెచ్ఎంలో ఆరేళ్లుగా సీహెచ్ఓలుగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్నామని, రెండేళ్లుగా మా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ పల్లపాటి లింగరాజు, జిల్లా ఉపాధక్షరాలు జి.వనజ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద డీఎంఅండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్ఓలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 27వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కలిపించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23శాతం వేతన సవరణ చేయాలన్నారు. అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షరాలు టీ ప్రవళిక, జిల్లా నాయకురాలు జోత్స్న మాట్లాడుతూ ఇన్ని రోజులుగా తీవ్రమైన ఎండలలో కూడా నిరవధిక సమ్మె చేస్తున్న సీహెచ్ఓలను పట్టించుకోకుండా, జీతాలు వేయకుండా, ఇన్సెంటివ్లు వేయకుండా తీవ్ర మనోవేదనకు కూటమి ప్రభుత్వ అధికారులను గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షరాలు జి.వనజ, జిల్లా నాయకులు సంధ్య, దీక్షిత, రవితేజ, జీవనజ్యోతి, కె లక్ష్మి, రత్నకుమారి, క్వీన్, స్వప్న, కె.లక్ష్మి, శివ నాగేంద్రమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. స్పందించని కూటమి ప్రభుత్వం -
దుగ్గిరాలలో 58.6 మి.మీ. వర్షపాతం
– సగటున 25.3 మి.మీ. వర్షపాతం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 58.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పొన్నూరు మండలంలో 8.6 మి.మీ. పడింది. సగటున 25.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 24వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 166.8 మి.మీ. పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 52.2, తుళ్ళూరు 40.6, మేడికొండూరు 38.4, ప్రత్తిపాడు 35.2, కాకుమాను 30.2, కొల్లిపర 27.4, తాడికొండ 26.8, మంగళగిరి 23.6, తాడేపల్లి 21.6, ఫిరంగిపురం 19.8, వట్టిచెరుకూరు 19, పెదకాకాని 17.2, గుంటూరు తూర్పు 14.2, గుంటూరు పశ్చిమ 12.2, తెనాలి మండలంలో 9.8 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య నరసరావుపేటటౌన్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ శనివారం తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్ వద్ద కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు క్రింద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు పింక్ కలర్ చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రైల్వే ఎస్ఐ కోరారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నాదెండ్ల: కారు, బైకు ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై జి. పుల్లారావు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై గొరిజవోలు గ్రామ పరిధిలోని నుదురుపాడు పైవంతెన వద్ద ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన తరిమెళ్ళ బోయేసు (30) తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నాడు. నుదురుపాడు పైవంతెన సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. బోయేసు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తులకు ఆహ్వానం ● గ్రామ సచివాలయంలోనే చేసుకునే అవకాశం ● రెండు రోజుల్లోనే పొందేలా చర్యలు ● కార్డు ద్వారా పలు ప్రయోజనాలు
యడ్లపాడు: కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ప్రత్యేకంగా ‘సీనియర్ సిటిజన్ కార్డు’లను జారీ చేయాలని నిర్ణయించింది. వీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. ఈ సేవకోసం దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభం. ఆధార్, వయసును నిర్ధారించే గుర్తింపు పత్రం, బ్లడ్గ్రూప్ వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు రూ. 40 చెల్లిస్తే రెండు రోజుల్లోనే కార్డును అందజేస్తారు. అయితే ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇవి ప్రయోజనాలు ఈ కార్డుతో వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు రకాల ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో 25శాతం రాయితీ, ప్రత్యేక సీట్లు, రైల్వే స్టేషన్లలో కౌంటర్ల వద్ద ప్రాధాన్యత, వరుసలో నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదు. బ్యాంకుల్లో ఫిక్సడ్ డిపాజిట్లపై అఽధిక వడ్డీ, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం, పాస్పోర్ట్ ఫీజులో తగ్గింపు వంటి లాభాలు ఉన్నాయి. ఆయుష్మాన్ భార త్కార్డ్, వయో వందన హెల్త్ కార్డు పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కేటాయింపులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రాయితీపై ఆరోగ్య సేవలు లభించనున్నాయి. ఇంకా దేవాలయాలలో ప్రాధాన్యత దర్శనం పొందడానికి ఈ కార్డు దోహదం కానుంది. 25వేల మందికి జారీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఈ ఏడాది మార్చి వరకు ఆఫ్లైన్లో 26,575 దరఖాస్తులను సీనియర్ సిటిజన్స్ సమర్పించారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రక్రియను ఆన్లైన్ చేయడంతో 1438 మంది నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆయా అర్జీలను పరిశీలించి 25వేల మందికి పైగా కార్డులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులంతా సద్వినియోగం చేసుకోవాలి గుంటూరు, పల్నాడు జిల్లాలో సుమారు 9 లక్షల మంది 60 ఏళ్లు దాటిన వారు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇప్పటి వరకు దరఖాస్తు వారిలో అర్హులైన వారందరికీ సీనియర్ సిటిజన్ కార్డులను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నాం. ఎన్టీఆర్ పెన్షనర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లతో పాటు వృద్ధులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీహెచ్. సువార్త, ఏడీ, వయో వృద్ధుల సంక్షేమ శాఖ -
కళల పండుగకు వేళాయె !
● నేటి నుంచి 40వ జాతీయ సంగీత, నాట్య, కళారూపాల పోటీలు ● కళా నిలయం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహణ ● వేదికగా వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపం చిలకలూరిపేట: కళా రంగంలో చిలకలూరిపేట కీర్తిని దేశ నలుమూలలా వ్యాప్తి చేసిన ఘనత స్థానిక కళా నిలయం సంస్థకు చెందుతుంది. కళలను ప్రోత్సహించండి – కళాకారులను ఆశీర్వదించండి అంటూ సంస్థను కళా నిలయం అధ్యక్షుడు ప్రగడ రాజమోహనరావు ప్రారంభించారు. కళాభిమానులైన దాతల సహకారంతో ఏటా సంగీత, నాట్య, కళారూపాల పోటీలు నిర్వహిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా కళలను బతికిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తున్న ఘనత రాజమోహనరావుకే దక్కుతుంది. కళలంటే ఆయనకు ప్రాణం..కళాకారులంటే అభిమానం. అందుకే 1984లో కళా నిలయాన్ని స్థాపించి కళామ తల్లికి సేవలందిస్తున్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నా, ఆర్ధిక పరిస్థితులు సహకరించకున్నా, దాతలే హితులై అందిస్తున్న సహకారంతో నృత్య, సంగీత, కళా రూపాల పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీలు శనివారం నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు నిర్విరామంగా పగలు, రాత్రి మూడు రోజులపాటు కొనసాగుతాయి. సంప్రదాయ కళలకు ఊతం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపం ఈ పోటీలకు వేదిక కానుంది. పాశ్చాత్య నృత్య, సంగీత హోరులో ఆదరణ కోల్పోతున్న భారతీయ సంప్రదాయ కళలకు ఊతమిచ్చేందుకు ప్రస్తుత తరుణంలో కళా నిలయం వేదికగా నిలుస్తోంది. ఉత్సవంలో పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయలను తమ అద్భుత కళారూపాల ద్వారా భావితరాలకు అందించే ప్రయత్నం చేయడం విశేషం. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, నృత్య నాటికల పోటీలతో పాటు జానపద, సినీ గేయాల పోటీలను కళానిలయం వేదికగా నిర్వహించడం విశేషం. కళాకారులతో కళకళలాడనున్న వేదిక కళా నిలయం 40వ జాతీయ నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది పైగా కళాకారులు తరలిరానున్నారు. సూర్య, చంద్ర విభాగాల పేరిట రెండు గ్రూపులుగా పోటీలను నిర్వహిస్తారు. కూచిపూడి, భరతనాట్యంతో పాటు శాసీ్త్రయ బృంద నాట్యాలు, సినీ మధుర గీతాలు, యుగళ గీతాలు, నృత్య నాటికలు, శాసీ్త్రయం కాని బృంద నాట్యాలు, నృత్య నాటికల పోటీలు ఉంటాయి. -
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి వెల్దుర్తి: క్రీడా స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. శిరిగిరిపాడులోని వీరాంజనేయస్వామి తిరునాళ్ల పురస్కరించుకొని గ్రామ పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన పురుషులు, మహిళా వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు శుక్రవారం ఆయన బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో లక్ష్యాలు ఏర్పరచుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఫైనల్ విజేతలుగా నిలిచిన ఎస్ఆర్ఎం పురుషుల జట్టుకు రూ.లక్ష , మెడల్స్, ట్రోఫీలను అందించారు. ఎస్ఆర్ఎం మహిళా విభాగం జట్టుకు రూ.లక్ష , ట్రోఫీ అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన ఐఓబీ పురుషుల జట్టు, సదరన్ రైల్వే మహిళా జట్టుకు రూ.75 వేలు, మెడల్స్, ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో వెల్దుర్తి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. బదిలీల దరఖాస్తులో జాగ్రత్తలు అవసరం నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. ఉపాధ్యాయుల బదిలీలపై శుక్రవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసే సమయంలో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకరావాలని తెలిపారు. ప్రభుత్వం దాదాపు 770 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయటం మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచటంలోనూ, విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంచటంలోనూ యూటీఎఫ్ కార్యకర్తలు ముందుండాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు ప్రభుత్వ ఉత్తర్వులు, దరఖాస్తు పూరించే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.మోహనరావు, గౌరవాధ్యక్షుడు షేక్ ఖాసీం పీరా, సహాధ్యక్షురాలు ఏ.భాగేశ్వరిదేవి పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
సర్వర్ పని చేయదు.. కూటమి కనికరించదు
కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఊరిస్తూ వచ్చిన కొత్త రేషన్కార్డుల మంజూరు, కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చినా ప్రజలకు చిక్కులు తప్పడం లేదు. దరఖాస్తు ప్రక్రియ తీవ్ర జాప్యంతో ఇబ్బందులెదుర్కొంటున్నారు. పౌరసరఫరాల శాఖ సర్వర్ మొరాయింపుతో గంటల కొద్దీ సచివాలయాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. కొత్త జంటలకు చిక్కులే... సమస్యలివే... ● రేషన్కార్డులో తప్పుగా నమోదైన కుటుంబ సభ్యుల సంబంధాలను సరి చేసుకోవాలన్నా, కార్డులోంచి తొలగించాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వలేదు. ● మార్పులు చేర్పులకు 15 సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే అవకాశమిచ్చారు. 15 ఏళ్లకు మించిన పిల్లలను ఏదైనా కారణాలతో ఇప్పటివరకు లేనివారిని చేర్చేందుకు అవకాశం లేకుండాపోయింది. ● వివాహం చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిని కార్డులోంచి తొలగించేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. కేవలం చనిపోయిన, ఇక్కడే పెళ్లి చేసుకొని వేరే కార్డులోకి బదిలీ చేస్తేమాత్రమే పేర్లు తొలగించే అవకాశముంది. ● కార్డులో ఆధార్ మ్యాపింగ్ తప్పుగా అయితే దాన్ని సరిచేసుకునేందుకు ఆప్షన్ లేదు. సింగిల్ రేషన్ కార్డు దరఖాస్తుకు కేవలం 40–50 ఏళ్ల వయసున్నవారికే అవకాశం ఇచ్చారు. 50 ఏళ్లపైబడిన వారికి కుదరడం లేదు. సాక్షి, నరసరావుపేట : రేషన్ దరఖాస్తు ఆన్లైన్లో పూర్తి చేయాలంటే కనీసం రెండు మూడు గంటల పడుతోంది. తరువాత బయోమెట్రిక్ చేయించాలంటే సర్వర్ కోసం వేచి ఉండాల్సిందే. సాయంత్రం 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య సర్వర్ పని చేస్తోందని ఆ సమయంలో రావాలని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు చెబుతున్నారు. దీంతో చేసేదేమి లేక ఆ సమయంలో పడిగాపులు కాచి వేలిముద్రలు వేస్తున్నారు. ఆ రెండు గంటల సమయంలో కూడా మహా అయితే నాలుగైదు దరఖాస్తులే పూర్తి అవుతున్నాయి. రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండగా పదిలోపే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతోంది. దీంతో ఒక్కో దరఖాస్తుదారుడు రెండు మూడు రోజులు పనిమానుకొని సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. చిన్నారులను కార్డులో చేర్చడానికి వెళ్లిన తల్లుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. చంటి బిడ్డలతో గంటల కొద్దీ వేచి ఉండటం ఇబ్బందిగా మారుతోంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో చిక్కులు... హౌస్ హోల్డ్ డేటా ఎనేబుల్ చేయకపోవడంతో సమస్యలు అధికంగా వస్తున్నాయి. హౌస్హోల్డ్ సర్వేలో వివరాలను తొలగించడం, సవరించడం కుదరకపోవడంతో లబ్ధిదారులకు విపరీతమైన సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వేలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తేనే ఈ సమస్య కొలిక్కివచ్చే అవకాశముంది. గతంలో జారీ చేసిన ఒకే తెల్లరేషన్ కార్డుపై రెండు రైస్కార్డులు ఉంటున్నాయి. ఈ రెండు కార్డులలోని సభ్యులంతా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ కార్డులలో దేనిలోనైనా ఒక సభ్యుడిని చేర్చాలన్నా, తీసేయాలన్నా సాంకేతికంగా ఇబ్బంది అవుతోంది. సభ్యులంతా సచివాలయానికి వచ్చి వేలిముద్రలు వేయాలని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఎక్కడెక్కడో ఉన్న రెండు కార్డులలోని సభ్యులంతా సచివాలయానికి పరుగులు తీయాల్సి వస్తోంది. పోనీ వెంటనే పని జరిగిపోతుందా అంటే అదిలేదు. సర్వర్ మొరాంపుతో ఎప్పుడు ఓపెన్ అయితే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఇది ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా పడుతోంది. దీంతో వారంతా ఉద్యోగాలు, పనులకు సెలవుపెట్టి వేచి చూడాల్సి వస్తోంది. కొత్తగా పెళ్లి అయిన జంటలో ఒకర్ని కార్డులో చేర్చే సమయంలో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. వివాహ ధ్రువపత్రాలు, పెళ్లికార్డులు, పెళ్లి ఫొటోలు అప్లోడ్ చేస్తేనే కొత్త సభ్యుడి చేర్పు దరఖాస్తు పూర్తి అవుతుందని లేదంటే అప్లోడ్ కావడం లేదని ఈ నెల 7వ తేదీ నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని చెబుతున్నప్పటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయకపోవడంతో సాంకేతికంగా ఇబ్బంది అవుతోంది. గత రెండు వారాలుగా రిజిస్ట్రేషన్ లేని జంటలు రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ కార్డు దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్న సర్వర్ దరఖాస్తుకు రెండు, మూడు రోజులు పని మానుకోవాల్సిందే ఒక సభ్యుడిని చేర్చాలని వెళితే కుటుంబం మొత్తం రావాల్సిందే అంటున్న సచివాలయ సిబ్బంది సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య బయోమెట్రిక్కి అవకాశం చంటి బిడ్డలతో తల్లులు వేచి చూడాల్సిన దుస్థితి వాట్సాప్లో దరఖాస్తులకు అవకాశం అంటూ ప్రచారం వాట్సాప్ గవర్నెన్స్లో కనిపించని ఆప్షన్ ప్రభుత్వ సేవలన్నీ సెల్ఫోన్లో పొందవచ్చని గొప్పలు చెప్పి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉపయోగపడటంలేదు. మే 15వ తేదీ నుంచి కార్డుదారులు 98823 00009 నెంబర్తో పనిచేసే వాట్సప్ గవర్నెన్స్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటనలు చేసింది. తీరా చూస్తే ఇప్పటికి వాట్సాప్ గవర్నెన్స్లో రేషన్ కార్డుల దరఖాస్తు, సభ్యుల చేర్పు వంటి ఆప్షన్లు కనిపించడం లేదు. -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానంకు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామ వాస్తవ్యుడు పానుగంటి జయ నటరాజ్కుమార్, లక్ష్మీదివ్య దంపతుల కుమారుడు షత్విక్ జయదేవ్ పేరున రూ.1,00,001 విరాళంగా శుక్రవారం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందించారు. దాతలు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. నేడు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నరసరావుపేట: ప్రతి నెలా నాలుగో శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ స్థలాల అద్దె వ్యవహారంపై సమావేశం నరసరావుపేట: సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ళలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను 15 ఏళ్లపాటు చట్టపరమైన వ్యాపారం చేసుకునేందుకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో శుక్రవారం ఆర్టీసీ డిపోలోని ప్రజా జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నెల్లూరు జోనల్ కార్యాలయం ద్వారా టెండర్లు పిలవనున్నారని పీటీడీ జిల్లా అధికారి ఎం.మధు పేర్కొన్నారు. ఇవ్వబోయే స్థలాలను గురించి పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. వైభవంగా ఆంజనేయుని రథోత్సవం వేమూరు: మండలంలోని జంపని గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తుల హనుమ నామస్మరణ, మేళతాళాల మధ్య వేడుక సాగింది. కోలాటం, భజనల నడుము రథోత్సవం జరిగింది. భక్తులు షేక్ అబ్దుల్ కలాం ఆజాద్ దంపతులు వార్షిక పూజాకర్తలుగా వ్యవహరించారు. పెరుమాళ్లు వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ళ రామయ్య నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో గొంది శివరామ కృష్ణ ప్రసాద్, మన్నే శివ వెంకటేశ్వరరావులు ప్రసాద పంపిణీ చేశారు. ఆంజనేయ భక్త బృందం, సీతారామాంజనేయ భజన సమాజం, ఆంజనేయ యువజన భక్త సమాజం, వీరాంజనేయ కోలాట భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. నేడు సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సు పట్నంబజారు: సరస్వతి పుష్కరాలు పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు–2 డిపో నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం ఎం.రవికాంత్ శనివారం తెలిపారు. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఈ నెల 24న గుంటూరు–2 డిపో నుంచి బస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యాత్ర మొత్తం మూడు రోజులు ఉంటుందని, 24వ తేదీ రాత్రి 10 గంటలకు బయల్దేరి, రెండో రోజు కాళేశ్వరం చేరుతుందన్నారు. అక్కడ పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత రామప్ప దేవాలయం, వరంగల్ భద్రకాళి దేవాలయం, వెయ్యి స్థంభాల గుడి దర్శించడం జరుగుతుందన్నారు. మూడో రోజున కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించి, అనంతరం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకుని గుంటూరు తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. ఈ సర్వీసుకు సంబంధించి ఆన్లైన్లో 96163 నంబరు ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రయాణికుడికి రూ.2,420 టికెటు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర ఖర్చులు సొంతంగా చూసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 73828 97459, 73828 96403 ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఎగసి పడుతున్న అలలు
నిలిచిన వేట గత నెల రోజులుగా వేట నిషేధం కావటం, మరో వారంలో ఎత్తివేసేందుకు అవకాశం ఉండగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పటికీ అనుమతి రాలేదు. వేట మినహా మిగిలిన ఉపాధి అవకాశాలు కూడా లేకపోవటంతో సముద్రానికి దగ్గరగా ఉన్న రామ్నగర్ పెద్దకాలువలో మత్స్యకారులు చేపలు పడుతూ పొట్ట నింపుకొంటున్నారు. బాపట్ల: వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా మూడు రోజులుగా సముద్రతీరం నిర్మానుష్యంగా మారింది. మరోపక్కన అలలు ఎగసి పడుతున్నాయి. ఆకాశం మేఘావృతం కావటంతోపాటు సాయంత్రానికి చిమ్మచీకట్లు కమ్ముకొంటున్నాయి. ఈదురుగాలులు ఎక్కువగా రావటంతోపాటు రాకాసి అలలు ఎగిసి పడుతుండటంతో తీరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. తీరం ఇంత నిర్మానుష్యంగా మారటం ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కరువుభత్యం అంతంత మాత్రమే సముద్రం వేట నిషేధం సందర్భంగా 45 రోజులపాటు ప్రభుత్వం కరువుభత్యం ఇస్తోంది. బాపట్ల జిల్లాలో 5 వేల మందికిపైగానే మత్స్యకారులు ఉన్నప్పటికీ సగం మందికి కూడా అందలేదు. ఈ ఏడాది కూడా ఆకలి కేకలు తప్పటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారులలో అలజడి వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా సూర్యలంకకు పర్యాటకులు సంఖ్య తగ్గిపోవటంతో తీరంలోని చిరు వ్యాపారులు కనీసం బోణీలు కూడా లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం రోజుకు 50 మంది పర్యాటకులు కూడా రాకపోవటంతో ఆవేదన చెందుతున్నారు. నిర్మానుష్యంగా మారిన సముద్ర తీరం వేట లేక అల్లాడుతున్న మత్స్యకారులు -
మద్యం దుకాణాలు సమయపాలన పాటించాల్సిందే
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు తప్పనిసరిగా సమయపాలన పాటించాల్సిందేనని ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని మద్యం షాపులు రాత్రి 10 గంటలకు కచ్చితంగా మూసేయాల్సిందేనన్నారు. 10 గంటలకు వైన్ షాపులను మూసేలా ఎకై ్సజ్ సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు. పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని, ఎవరైనా పర్మిట్ రూముల్లో మద్యం తాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా రాత్రి 11 గంటల వరకు లిక్కర్ సరఫరా, ఆ తరువాత గంట వరకు ఫుడ్ సరఫరాకు అనుమతి ఉందని చెప్పారు. అనంతరం తప్పనిసరిగా మూసివేయాల్సిందేనన్నారు. సమయ పాలనపై ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు నిత్యం పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు. వీరిపై ఎకై ్సజ్ సూపరింటెండెంట్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించే షాపుల లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,900 కేసులు నమోదు చేసి 1,201 మందిని అరెస్టు చేశామన్నారు. ఇందులో మద్యం 2,297 లీటర్లు, బీరు 119 లీటర్లు, నాటు సారా 444 లీటర్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయి 2.89 గ్రాములు, కొకై న్ 8.5 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి మొత్తం 21 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవి కుమార్రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు పాల్గొన్నారు. వైన్ షాపులు రాత్రి 10 గంటలకు మూసేలా ఎకై ్సజ్ సిబ్బంది పర్యవేక్షణ అనధికార పర్మిట్ రూమ్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ -
పవర్ లిఫ్టింగ్లో క్రీడా రత్నం
తెనాలి: గ్రామాల్లోనూ ఆ సౌకర్యాలు ఏర్పాటైతే అక్కడ నుంచి కూడా క్రీడారత్నాలు వెలుగులోకి వస్తాయి. పట్టణ యువతతో పోటీపడి విజయాలు సాధిస్తారు. ఇటీవల ఆసియా క్లాసిక్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, యూనివర్శిటీ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్–2025లో మొత్తం 8 పతకాలను సాధించిన పవర్లిఫ్టర్ నాగం జ్ఞానదివ్య ఇందుకో నిదర్శనం. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో జరిగిన ఆసియా క్లాసిక్ పవర్లిఫ్టింగ్లో రెండు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలను కై వసం చేసుకున్న జ్ఞానదివ్య, యూనివర్శిటీ క్లాసిక్ పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. ఆసియా సెకండ్ బెస్ట్ లిఫ్టర్ అవార్డును స్వీకరించింది. 2021లో పవర్లిఫ్టింగ్లో సాధన ఆరంభించిన జ్ఞానదివ్య రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వరుసగా పాల్గొంటూ అవలీలగా పతకాలను సాధిస్తోంది. కామన్వెల్త్. వరల్డ్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్లోనూ పాల్గొని విజయాలను అందుకుంటున్న జ్ఞానదివ్య గ్రామీణ ప్రాంత క్రీడారత్నం. ప్రస్తుతం కేఎల్ యూనివర్శిటీలో బీసీఏ సెకండియర్ పూర్తిచేసింది. కాకతాళీయంగా సాధన తెనాలి రూరల్ మండలం గ్రామం కఠెవరం ఆమె సొంతూరు. సుధారాణి, వెంకటేశ్వరావు తల్లిదండ్రులు. పవర్లిఫ్టింగ్లో సాధన కాకతాళీయంగా జరిగింది. ఇంటర్మీడియెట్ చదువుతుండగా గ్రామంలో మాతృశ్రీ అకాడెమీ ఏర్పాటైంది. వాస్తవానికి కఠెవరం గ్రామం ఒకప్పుడు అథ్లెటిక్స్కు కేంద్రం, ఇక్కడ్నుంచి తయారైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తలపడ్డారు. గ్రామం నుంచి వెయిట్లిఫ్టర్లను తయారు చేయాలనే సంకల్పంతో ఇక్కడ అకాడమీ ఏర్పాటైంది. క్రీడాభిలాష కలిగిన వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో జ్ఞానదివ్య అకాడమీలో చేరింది. వెంకటేశ్వరరావు, వలి, సుధాకర్, రామిరెడ్డి, వీరారెడ్డి శిక్షణతో వెయిట్లిఫ్టింగ్ శిక్షణ ఆరంభించింది. కొద్దిరోజుల తర్వాత పవర్లిఫ్టింగ్కు మారింది. నందివెలుగు జడ్పీ హైస్కూలు పీఈటీ కొల్లిపర నాగశిరీష శిక్షణలో క్రమం తప్పక సాధన చేస్తూ, 2021 ఆఖర్నుంచి పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. సబ్జూనియర్స్లో 84 పైగా కిలోల కేటగిరీలో తలపడుతున్న జ్ఞానదివ్య, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్ర, జాతీయస్థాయిలో మూడేసి స్వర్ణాలు, దక్షిణభారత పోటీల్లో రజత పతకాన్ని గెలిచింది. ఏ పోటీలో తలపడినా పతకం మాత్రం ఖాయమంటున్నట్లుగా జ్ఞానదివ్య సత్తా చాటుతోంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్న నాగం జ్ఞానదివ్య సొంతూరు కఠెవరంలో సాధన ప్రభుత్వ పాఠశాల పీఈటీచే శిక్షణ కామన్వెల్త్ పోటీల్లోనూ ఆరు పతకాలు -
ఎండీయూ ఆపరేటర్ల ధర్నా
నరసరావుపేట: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం, ఇతర నిత్యావసరాలను అందిస్తున్న ఎండీయూ వ్యవస్థను భేషరతుగా కొనసాగించాలని ఏపీ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఆపరేటర్లు, హెల్పర్లు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఽతమ వాహనాలతో ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ సూరజ్ గనోరేకు అందజేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి రాగానే 18,500 మందిని, తమతో పాటు మరికొందరిని జాబ్ నుంచి తీసేసే పనిలో ప్రభుత్వం ఉండటం శోచనీయమన్నారు. విజయవాడ వరదల్లో చేసిన సేవలను సీఎం చంద్రబాబు కూడా మెచ్చుకున్నారన్నారు. అటువంటి వ్యవస్థను ఏవిధంగా తీసేస్తారని ప్రశ్నించారు. 2027 వరకు తమకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉందన్నారు. దానిని గౌరవించి, దీనిపై అధ్వయనం చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న ఎండీయూ వ్యవస్థను తొలగించటం చాలా బాధాకరమన్నారు. తమకు న్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. ధర్నాలో జిల్లాలోని హెల్పర్లు, ఆపరేటర్లు పాల్గొన్నారు. వాహనాలను భేషరతుగా కొనసాగించాలని డిమాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆపరేటర్లు, హెల్పర్లు -
ప్రజాయుద్ధ నేతగా సజ్జా నాగేశ్వరరావు
చీరాల: మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ నారాయణపూర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట. జాండ్రపేటలో సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. బాల గంగాధరరావు, సుబ్బరావమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి బాలగంగాధరరావు ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా పలు ప్రాంతాలలో పనిచేశారు. రెండవ సంతానంగా నాగేశ్వరరావు జాండ్రపేట హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి గుంటూరు జిల్లా నల్లపాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో చదివారు. 17 ఏళ్ల వయస్సులోనే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యంలోకి జీవితకాలం కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. సోదరి వివాహానికి పెరోల్పై విడుదలైన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా ఉద్యమంలో ‘ఏసన్న’గా పేరు... గుంటూరు జిల్లాలో జరిగిన ఉద్యమంలో నాగేశ్వరరావుకు ఏసన్నగా పేరుంది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రజా యుద్ధ సైనికుడిగా నల్లమల, ఆంధ్ర ఒడిశా బోర్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ రైతాంగ, దళిత, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు. టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. విస్తరించిన విప్లవోద్యమ అవసరాలలో భాగంగా ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ మిలటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నారాయణపూర్ ఎదురు కాల్పుల్లో సజ్జా నాగేశ్వరరావు మరణించారని మీడియాలో రావడంతో ఆయన సోదరుడు సజ్జా శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు. తమ్ముడి మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం కోరారు. ఈ మేరకు రెవెన్యూ, చీరాల ఒన్టౌన్ పోలీసులను సంప్రదించి మృతి చెందింది తమ సోదరుడేనని సమాచారం అందించారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో సజ్జా మృతి 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం -
యోగాపై అవగాహన పెంపునకు చర్యలు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల వీడియో సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల 21వ తేదీ వరకు జరుగనున్న యోగాంధ్ర క్యాంపెయిన్ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి మండల, డివిజనల్ స్థాయి కేంద్రాల్లోనూ యోగా మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి మండల, గ్రామ, డివిజనల్ స్థాయిలో ట్రైనర్ల ద్వారా యోగా సాధన వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. గ్రామ, మండలాల్లో వంద నుంచి 150 మంది యోగా చేసేందుకు వీలున్న విద్యాసంస్థలు, గోదాములు, గుర్తించాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శుల ద్వారా యోగా సాధనకు పేర్లు నమోదు చేయించాలన్నారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక బృందాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి కల్చరల్ టీం ఈ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి
● ప్రత్యేక అలంకరణలో ప్రసన్నాంజనేయస్వామి ● తరలివచ్చిన భక్తులు చిలకలూరిపేట: హనుమత్ జయంతిని గురువారం భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు చేరుకుని పూజలు చేశారు. చికలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పట్టణంలోని పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంతోపాటు పెద్దకోట సెంటర్, పోలిరెడ్డిపాలెం, మారెళ్లవారివీధి తదితర చోట్ల ఉన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామి వారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో ప్రసన్నాంజనేయస్వామి -
యోగా కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్, ఎస్పీ
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బంగ్లా నుంచి పల్నాడు బస్టాండ్ రోడ్డు మధ్యలో ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నెలరోజులపాటు యోగా చేసేందుకు అనువైన స్థలం ఎంపికకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి గురువారం పరిశీలించారు. యోగ నిర్వహించే సమయంలో వాహనాల రాకపోకలను వేరే దారికి మళ్లించాలని కలెక్టర్ సూచించారు. యోగాలో పాల్గొనే వారికి అసౌకర్యం కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంద్ర కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. అన్న క్యాంటీన్ తనిఖీ అదే మార్గంలో ఉన్న అన్న క్యాంటీన్ను కలెక్టర్, ఎస్పీలు తనిఖీ చేశారు. క్యాంటీన్లో ఏర్పాటుచేసిన భోజన సదుపాయాలను రుచి చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహారం తీసుకుంటున్న పలువురు ప్రజలను పలకరించి క్యాంటీన్ వసతులు, ఆహారం నాణ్యత గురించి తెలుసుకున్నారు. రోజుకి ఎంత మందికి టిఫిన్, భోజనానికి అందిస్తున్న వివరాలు సేకరించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, ఆర్డీఓ కె.మధులత, మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. -
నంబాల ఎన్కౌంటర్ నాటకమే
ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ సత్తెనపల్లి: మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారనేది నాటకమేనని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంబాల కేశవరావు మృతి చెందారనే వార్తను తాము నమ్మడం లేదన్నారు. ఎన్కౌంటర్ జరిగిన తరువాత రోజుల తరబడి మృతదేహాలను మార్చురీలో పెట్టుకుని, అవి కుళ్లిపోయిన తరువాత ప్రధాన నాయకుడు చనిపోయాడని అంటున్నారని పేర్కొన్నారు. కానీ అవి ఆదివాసీలు, మిలీషియా సభ్యుల మృతదేహాలని వార్తలు వస్తున్నాయన్నారు. నంబాల చనిపోయారని చెబితే కేడర్ నిరాశ, నిస్పృహలతో ఉంటారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని భావిస్తున్నామన్నారు. ఇలా ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. -
సమావేశాలతో మమ అనిపించారు
పట్నంబజారు: గుంటూరు నగరంలో అర్ధరాత్రి పూట మద్యం విక్రయాలపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘నిశీధిలోనూ అదే నిషా’ కథనానికి అధికారులు స్పందించారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలపై చర్చించారు. అయితే ఇప్పటి వరకు అర్ధరాత్రి పూట మద్యం అమ్మకాలు చేపట్టిన దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాలక్షేపంగా సమావేశం నిర్వహించి, జాగ్రత్త పడాలంటూ అధికారులే సూచనలు చేశారని విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా సాక్ష్యాధారాలతో ‘సాక్షి’తో కథనం ప్రచురితమైనప్పటికీ అధికారులు నోటి మాటలతోనే సరిపెట్టారు. అర్ధరాత్రి వేళ అమ్మకాలు జరిగినా బార్ అండ్ రెస్టారెంట్లపై కనీస నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు పోలీసులు సైతం సమావేశం ఏర్పాటు చేసి యాక్షన్ తీసుకుంటామని ‘యాక్షన్’ చేశారు తప్ప, ఎటువంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారుగానీ, ఏడాది కాలంలో ఏ ఒక్కరోజూ ఇది అమలు కాలేదు. గతంలో సైతం బహిరంగ మద్యపానం, ఎమ్మార్పీ ధరలు, అర్ధరాత్రి అమ్మకాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపడతామని చెప్పారేగానీ, చేతల్లో మాత్రం ఆ విషయం చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉందని, అధికారులకు అన్ని విధాలా సహాయంగానే ఉంటున్నామని, ప్రతినెలా మామూళ్లు చెల్లిస్తున్నామని, చూసీచూడనట్లు పోవాలని ఎకై ్సజ్, పోలీసు అధికారులతో వ్యాపారులు విన్నవించినట్లు సమాచారం. కొద్దిరోజులు పేరుకు తాము తనిఖీలు నిర్వహిస్తామని, ఆ సమయంలో కొద్దిరోజులపాటు నియమాలు పాటించాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి మద్యం అమ్మకాలపై చర్యలు శూన్యం -
ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... దరఖాస్తు ప్రక్రియతో ఎన్నో అంశాలు ముడి పడి ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులు గతంలో టీఐఎస్లో స్వయంగా అప్లోడ్ చేసిన సమాచారమే ఆన్లైన్ పోర్టల్లో ఉంటుందని, దానిలో ఎటువంటి మార్పు ఉండబోదని చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తులో ప్రత్యేక పాయింట్లు, రేషనలైజేషన్, ప్రిఫరెన్షియల్ పాయింట్లు ఇతర వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు సబ్మిట్ చేసే ముందుగా పరిశీలన చేసుకోవాలని, దరఖాస్తు ప్రింటవుట్ రెండు కాపీలను డీడీవోకు సమర్పించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమైన తరువాత అదనంగా గంట బోధించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల చట్టం, ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపు, పాఠశాలల స్ట్రక్చర్ వెనుక యూటీఎఫ్ పోరాటం ఉందని తెలిపారు. సదస్సులో సంఘ నాయకులు జి.వెంకటేశ్వర్లు, సీహెచ్ ఆదినారాయణ, కె. సాంబశివరావు, బి. రంగారావు, ఎం.గోవిందు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, ఎం. చిన్నయ్య, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు దక్కినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి చెప్పారు. సాంబశివపేటలోని కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... 82 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల నాక్ నుంచి తాజాగా నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థినులకు ఆధునిక, సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. కాలానుగుణంగా ఉద్యోగం, ఉపాధి కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్వయంప్రతిపత్తి హోదా కలిగిన కళాశాల తాజాగా పొందిన నాక్ ఏ గ్రేడ్ గుర్తింపుతో మరో పదేళ్లపాటు స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళుతుందని చెప్పారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులకు తీసిపోని విధంగా వాటికి సమాంతరంగా బీఎస్సీలో డేటాసైన్స్, ఏఐ, బయోకెమిస్ట్రీ వంటి ఆధునిక కోర్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి. మధుసూదనరావు, అధ్యాపకులు ఎం. సంతోషికుమారి, కె. అపర్ణ సీతారామ్, కె. సుబ్బరత్నమ్మ, జి.శేషు పాల్గొన్నారు. -
నా భర్తకి ఏమైనా జరిగితే మాకు దిక్కెవరు?
నేను, నా కుమారుడు హరికృష్ణ టిప్పర్లకు డ్రైవర్లుగా పనిచేసుకుంటూ తెలంగాణలో ఉంటున్నాం. పండక్కి ఇంటికి వస్తే పోలీసులు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏ కారణం లేకుండా నా బిడ్డని పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని తప్పుడు కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు రాజ్యాంగం అమలు చేయకుండా టీడీపీ నాయకులు చెప్పిందే చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అంతమొందించాలని చూస్తున్నారు. –ఉప్పుతోళ్ల యల్లయ్య, హరికృష్ణ తండ్రి నా భర్త హరికృష్ణ ఏ తప్పు చేశాడని పోలీస్స్టేషన్కి తీసుకువచ్చారు. టీడీపీ నాయకుడు జానీబాషా చెప్పడని నా భర్తని తెచ్చామని పోలీసులు మాతో అన్నారు. జానీబాషా కారులోనే నా భర్తని తెచ్చారు. నాకు ముగ్గురు పిల్లలు. నాకు తల్లిదండ్రులు కూడా లేరు. నా భర్తకు పోలీసులు, టీడీపీ నాయకుల వలన ఏమైనా జరిగితే నేను, నా పిల్లలు విషం తాగి చచ్చిపోతాం. నా భర్త నోట్లో గుడ్డలు పెట్టి పోలీసులు కొట్టారు. –ఉప్పుతోళ్ల భార్గవి, హరికృష్ణ భార్య దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు -
పట్టపగలే రూ.6.25 లక్షలు చోరీ
సుద్దపల్లి (చేబ్రోలు): చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో పట్టపగలే ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు భారీగా నగదు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీనుకు చెందిన ఇంటిలో మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టారు. అందులోని రూ.6.25 లక్షల నగదును చోరీ చేశారు. వీటితో పాటు బంగారు వస్తువులు కూడా చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇంటిలో వివాహ వేడుక జరిగింది. వడ్లమూడిలో జరిగే శుభకార్యానికి అందరూ వెళ్లటంతో గమనించిన దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై డి. వెంకట కృష్ణ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నేడు ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయులకు వైద్య శిబిరంగుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు, ఉద్యోగోన్నతులకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా పాయింట్లు పొందగోరు ఉపాధ్యాయులకు శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరీ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరానికి గత నెల 24, 25, 26వ తేదీల్లో నిర్వహించిన వైద్య శిబిరానికి హాజరై, సర్టిఫికెట్ పొందిన ఉపాధ్యాయులు హాజరు కానవసరం లేదని తెలిపారు. గత నెలలో నిర్వహించిన వైద్య శిబిరం తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి, ఎముకల క్షయ వ్యాధి, న్యూరో సర్జరీ, కేన్సర్ తదితర వ్యాధులకు గురైన వారితో పాటు ప్రస్తుతం హేతుబద్ధీకరణకు గురవుతున్న ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు. -
నడవలేని స్థితిలో హరికృష్ణ
వైఎస్సార్ సీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల హరికృష్ణని దాచేపల్లి పోలీస్స్టేషన్లోని సీఐ క్వార్టర్లో ఉంచారు. హరికృష్ణపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు తెలుస్తోంది. తంగెడ నుంచి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్కి చేరుకోగా నడవలేని స్థితిలో సీఐ క్వార్టర్లో పడి ఉన్న కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు కుటుంబసభ్యులు స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. క్వార్టర్లో ఉన్న తమ కుమారుడిని చూపించాలని అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలతోపాటుగా హరికృష్ణ తల్లిదండ్రులు కోరారు. దీనికి పోలీసులు అంగీకరించలేదు. క్వార్టర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు
వైభవంగా హనుమజ్జయంతి బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో గురువారం రెండో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణలను ఆలయ అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామి వారికి పొంగళ్లను చేసి, నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారికి విశేష ఆకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని మాలదారులకు గురుస్వామి వెంకట నరసింహాచార్యులు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చలా సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైఖానస శాస్త్రానుసారంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండో రోజు ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా పదివేలకు మందికి పైగా భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నట్లు మండల దేవదాయ శాఖ ఈవో అవుడూరి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన లక్ష్మణ్ రెడ్డి స్వామి బృందం భజన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమాలకు పదివేల మందికిపైగా భక్తుల రాక శోభాయమానంగా సాగుతున్న జయంతి ఉత్సవాలు వేడుకలకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి హాజరు శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నరసరావుపేట: హనుమజ్జయంతి పర్వదినం సందర్భంగా గురువారం వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, పార్లమెంట్ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు రామిరెడ్డిపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజారుల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారితోపాటు పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రెటరీ పడాల చక్రారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు పల్లెర్ల మల్లికార్జునరెడ్డి, నాయకులు కంజుల రామకోటిరెడ్డి, పొలిమేర వెంకటరెడ్డి, అచ్చి శివకోటి, సాంబిరెడ్డి, కాకుమాను మంగపతిరెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా భద్రతా విభాగం పోలీసుల మాక్ డ్రిల్
తాడికొండ: తుళ్ళూరు మండలంలో భద్రతా పోలీసు విభాగం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో డీఎస్డబ్ల్యూ ఆర్ఐ సురేష్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో భాగంగా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది తమవద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు తనిఖీలు నిర్వహించారు. కచ్చితత్వాన్ని పరీక్షించి జాగిలాల పనితీరును అంచనా వేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డులో ఓ చోట పేలుడు పదార్థం గోప్యంగా పెట్టారు. బాంబు డిస్పోజల్ విభాగానికి చెందిన జాగిలం దాన్ని కనిపెట్టింది. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ.. వీవీఐపీలు ప్రయాణించే సీడ్ యాక్సిస్ రోడ్డులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుల వివరాలను సేకరిస్తున్నామని, భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుళ్ళూరు సీఐ కొంకా శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ విభాగం శ్రీహరి, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ సురేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పీజీ వైద్యులకు పరిశోధనలపై దృష్టి ముఖ్యం
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్. వెంకటసుందరాచారిగుంటూరు మెడికల్: పీజీ వైద్య విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాలతోపాటు పరిశోధనలపై దృష్టి సారించడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో పీజీ వైద్య విద్యార్థుల కోసం రెండురోజుల పరిశోధన శిక్షణ శిబిరం గురువారం మొదలైంది. తొలి ఏడాది పీజీ వైద్య విద్యార్థులకు ‘రీసెర్చ్ మెథడాలజీ – థీసిస్ ప్రిపరేషన్’పై కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. వివిధ వైద్య విభాగాల నుంచి 180 మందికిపైగా పీజీ వైద్యులు పాల్గొన్నారు. వర్క్షాప్ను ప్రారంభించిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ మాట్లాడుతూ, పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, గుణాత్మక థీసిస్ రూపొందించేందుకు వర్క్షాప్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్య అతిథిగా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు విద్యార్థులకు పరిశోధన పట్ల అవగాహనను పెంచడమే కాకుండా, మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయన్నారు. గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జయంతి, డాక్టర్ పి.అనిల్, పలువురు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరగతులు నిర్వహించి, పీజీ విద్యార్థుల థీసిస్ ప్రోటోకాల్ను వివరించారు. -
చట్టం ముందు నిలబెడతాం...
బీసీ వర్గానికి చెందిన హరికృష్ణను టీడపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాచేపల్లి సీఐ భాస్కర్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఉద్రిక్తతలు నెలకొనేలా చేస్తున్నాడు. సీఐ తీరుపై కోర్టులో న్యాయపోరాటం చేసి చట్టం ముందు నిలబెడతాం. హరికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తాం. –కాసు మహేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల -
పల్నాడు
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది. కొనసాగుతున్న సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పున:పరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కొనసాగింది.సుఖీభవ లబ్ధిదారుల నమోదు నూజెండ్ల: నూజెండ్ల రైతుసేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివర కు 13,175 మంది వివరాలు నమోదు చేశారు.సాక్షి, టాస్క్ఫోర్స్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లఘిస్తున్నారు. కూటమి నేతల వద్ద మెప్పు కోసం పోలీసులమన్న భావనను పక్కన పెట్టి విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. వరుస వెంబడి జరుగుతున్న అక్రమ అరెస్ట్లతో రాష్ట్రం అట్టుడుకిపోతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలను ప్రశ్నిస్తే గొంతులను నులిమేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసేందుకు కొందరు పోలీసులు చేస్తున్న అత్యుత్సాహం ఆ వ్యవస్థపై ప్రజలకు గౌరవం లేకుండా చేస్తోంది. దాచేపల్లి పోలీసుల తీరు రోజురోజుకు వివాదస్పదమౌతున్నది. ప్రధానంగా దాచేపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్న పి.భాస్కర్ రెడ్బుక్ కోసమే ఉద్యోగం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భాస్కర్ ఎంతోమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి అధికార పార్టీ నేతల దగ్గర మార్కులు కొట్టేందుకు చట్టాన్ని సైతం తుంగలో తొక్కుతున్నాడు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసిన ఘనుడు దాచేపల్లి సీఐ. అక్రమ అరెస్ట్లపై ప్రశ్నించే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను పోలీస్స్టేషన్లోకి రాకుండా అడ్డుకున్న ఈ బేడీల భాస్కర్ అగడాలపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. బీసీ యువకుడిపై ప్రతాపం టీడీపీ అధికారంలోకి రావడంతో తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల యల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తుండటంతో తెలంగాణ వెళ్లి డ్రైవర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జరిగే పండుగకు వచ్చిన బీసీ యువకుడు హరికృష్ణపై టీడీపీ నేత షేక్ జానీబాషా తన అనునయుడితో చెప్పించిన కట్టుకథతో పోలీసులు గురువారం కేసు కట్టారని హరికృష్ణ కుటుంబసభ్యులు వాపోతున్నారు. పోలీసు వాహనంలో కాకుండా టీడీపీ నేత కారులో వచ్చి తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. దాని ఆధారంగానే హరికృష్ణను చిత్రహింసలకు గురిచేశారని వాపోతున్నారు. ఎన్నికల రోజున జరిగిన గొడవలో హరికృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆ గొడవకు సంబంధించి టీడీపీ వారికి రూ.40లక్షలు చెల్లించాలని సీఐ భాస్కర్ నేరుగా పంచాయితీ చేశాడు. టీడీపీ నేత జానీబాషా రూ.40లక్షలు ఇస్తేనే కేసులు రాజీకి వస్తామని ఒత్తిడి చేశారు. ఈ కేసులో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలను ప్రతి రోజూ స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టారు. సీఐ తీరుతో వైఎస్సార్ సీపీ నేతలు విసుగు చెంది కోర్టుని ఆశ్రయించారు. కోర్టు సైతం సీఐ భాస్కర్ తీరుని తప్పుపట్టింది. తంగెడకి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు దేవళ్ల వీరాస్వామి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డితో పాటుగా మరికొందరిపై రకరకాలుగా కేసులతో సీఐ వేధించాడని వారు వాపోతున్నారు. 9న్యూస్రీల్ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా అక్రమ కేసులు, వేధింపులు ఇప్పటికే సీఐ తీరుపై కోర్టును ఆశ్రయించిన బాధితులు టీడీపీ నేతల ఆదేశాలతో బీసీ యువకుడు హరికృష్ణపై అక్రమ కేసు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో నడవలేని స్థితిలో ఉన్న కుమారుడిని చూసి చలించిన తల్లిదండ్రులు సీఐ భాస్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
మరింత రెచ్చిపోతున్నాడు...
దాచేపల్లి సీఐ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పోలీసుస్టేషన్కు బేడీలు వేసి అప్రతిష్టపాలైనా ప్రభుత్వం సీఐపై చర్యలు తీసుకోకపోవడం వల్ల మరింత రెచ్చిపోతున్నాడు. సీఐపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్ సీపీ తరపున రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎస్పీ ఆదేశాలతోనే కొట్టానని చెబుతున్నాడు, కాకపోతే సీఐపై చర్యలు తీసుకోవాలి. –డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి -
సాగర్ కుడి కాలువకు తాగునీటి విడుదల
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు గురువారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అదేశాలతో కుడి కాలువ 2, 3వ గేట్లు ద్వారా 5,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం 4 టీఎంసీలను రోజుకు 5,500 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులు సూచించారు. రెంటచింతలలో భారీ వర్షం రెంటచింతల: మండలంలోని పలు గ్రామాలలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. 56.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రెండు, మూడు రోజులుగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టాయి. రాత్రి 9 గంటల సమయంలో అకాలంగా ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. మండుతున్న ఎండలతో మండల ప్రజలు అల్లాడుతున్న సమయంలో గురువారం కొంత వరకు చల్లబడింది. 5న ‘చలో విజయవాడ’ కార్యక్రమం మంగళగిరి: జూన్ 5వ తేదీన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. జూన్ 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘానికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, మంగళగిరి తాలూకా యూనిట్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి మాధవరావు, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటి సంరక్షించాలి కాజ (మంగళగిరి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని కాజలో గురువారం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెప్మా డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు సభ్యులు తొలుత కనీసం ఒక్క మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడంపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మహిళలకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, మెప్మా పి.డి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజే విద్యామిత్ర కిట్లు అందిస్తాం ప్రత్తిపాడు: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందించడం జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఐ. పద్మావతి అన్నారు. ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మండల స్థాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్ను గురువారం ఏపీసీ పరిశీలించారు. క్వాలిటీ వాల్తోపాటు బ్యాగుల నాణ్యతను పరిశీలించారు. స్టాక్ పాయింట్కు చేరిన పుస్తకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించడం జరుగుతుందన్నారు. వెంట ఎంఈవో–2 జి. లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమి నేతల దౌర్జన్యాలను సహించేది లేదు
వినుకొండ: రాష్ట్రంలో రోజురోజుకీ కూటమి నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఇటీవల కూటమి నాయకులు చేసిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మోపూరి నర్సారెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను బొల్లా గురువారం పరామర్శించారు. అనంతరం బొల్లా మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల అరాచకాలు చంద్రబాబునాయుడు, లోకేష్ డైరెక్షన్లో పెచ్చుమీరిపోతున్నాయని అన్నారు. సామాన్య కార్యకర్తలపైన, చిన్నచిన్న నాయకులపై దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఒక వైపు పోలీస్ యంత్రాంగం నాయకులు చెప్పినట్లుగానే కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నర్సారెడ్డిపై మాస్కులు ధరించి పది మంది దాడి చేసి నడుమును విరిగేటట్లు కొడితే నర్సారెడ్డి నరసయ్యపై దాడి చేసినట్లు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నోరు మెదపకుండా అక్రమాలకు పాల్పడిన వారికి అండగా నిలబడటాన్ని ప్రశ్నించారు. వేల్పూరు గ్రామంలో పొగాకు కష్టాలు, వరి గూళ్లు, వరి గడ్డి వాములు బహిరంగంగా దహనం చేస్తుంటే పట్టించుకునే వారు లేరని, కనీసం కేసులు కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వినుకొండలో నిర్వహించిన మహానాడుకు వ్యాపారస్తుల నుంచి చందాలు వసూలు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం హయాంలో ఏ వ్యాపారిని బెదిరించలేదని, ఇబ్బంది పెట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారని అన్నారు. వినుకొండలో వంద పడకల ఆసుపత్రికి ఐదెకరాల స్థలం కేటాయించామని, ముస్లిం మైనార్టీ కళాశాల, షాదీఖానాకు మరో ఐదెకరాలు కేటాయించామని, అభివృద్ధి పనులను పక్కన పెట్టి కూరగాయల మార్కెట్, రైతు బజారు, గ్రంథాలయం వంటి నిర్మాణాలను పట్టించుకోకుండా స్థానిక నాయకులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. మీ అరాచకాలను ప్రజలు చూస్తున్నారని, గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. ఆయన వెంట పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా కూటమి నాయకుల దాడిలో గాయపడిన నర్సారెడ్డికి పరామర్శ -
జర్నలిస్టులపై దాడులు గర్హనీయం
చిలకలూరిపేట: జర్నలిస్టులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్వర్దన్పై కారెంపూడిలో టీడీపీ వర్గీయులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభంగా పరిగణించే మీడియా స్వేచ్ఛపై దాడులు జరగడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులు వ్యక్తిగత అభిప్రాయంతో పనిచేయరని, వారు ఏ పార్టీకి అనుకూలం, లేదా వ్యతిరేకం కాదని వెల్లడించారు. కేవలం నిజాలు మాత్రమే వెలికితీసే పనిని జర్నలిస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేయకుంటే జర్నలిస్టులు వారి గురించి తప్పుగా రాయాల్సిన అవసరం ఉండదని, తప్పు చేసిన వారే దాడులకు పాల్పడటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. ప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ జిలాని, చిలకలూరిపేట ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అన్నలదాసు శేషగిరి, షేక్ అబ్దుల్ సత్తార్, సభ్యులు షేక్ అల్లాబక్షు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్వలి, షేక్ కరిముల్లా, దార్ల బుజ్జిబాబు, మలాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భక్తవత్సలరావు -
పొట్టకూటి కోసం వచ్చి అనంత లోకాలకు..
సత్తెనపల్లి: పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని గడియారస్తంభం వద్ద బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు (48), బి.జోసెఫ్ అలియాస్ శ్రీనివాసరావు ఇరువురు కూలి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో దామచర్లకు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో గడియార స్తంభం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉప్పుతల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా జోసెఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చి ప్రమాదవ శాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కారు ఢీకొని కూలీ మృతి.. మరొక వ్యక్తికి తీవ్రగాయాలు -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు గద్దె చలమయ్య, ఆయన సతీమణి ఐద్వా రాష్ట్ర నాయకురాలు గద్దె ఉమశ్రీ కారులో బుధవారం గుంటూరు వెళ్లి తిరిగి సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో సత్తెనపల్లి నుంచి ఆటోలో పరుచూరి రాధా, పరుచూరి ఉషశ్రీ, శ్యాం సాయి, ఆటో డ్రైవర్ బలుసు పాటి సాంబశివరావులు గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో మండలంలోని కంటెపూడి రిథమ్ హోటల్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొనడంతో ఆటో పూర్తిగా రోడ్డు పక్కన కంపలోకి పల్టీకొట్టింది. కారు ముందు భాగం ధ్వసంమైంది. కారులోని ఇరువురికి, ఆటోలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్దె చలమయ్య, ఉమాశ్రీలను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా మిగిలిన నలుగురిని గుంటూరు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
గుంటూరు వెస్ట్: తుది ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసుకోవడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.ఎన్.శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహించే ఈ సమావేశంలో స్వీకరించే సూచనలు, సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాలసీలకు సంబంధించిన అంశాలపై వారికే ఫిర్యాదులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. కొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోపు ఓటరు, ఆధార్ కార్డుల అనుసంధానం చేయించాలని తెలిపారు. పోలింగ్ బూత్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోలు క్లయిమ్స్ వెరిఫికేషన్కు వెళ్లేటప్పుడు వారితోపాటు బీఎల్ఏలను కూడా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పై సమస్యలపై స్పందించిన ఇన్చార్జి కలెక్టర్.. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి ఏ నిర్ణయమైనా ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా 2026 జనవరి 5న రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ -
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో బుధవారం జరిగిన నియోజకవర్గస్థాయి మహానాడులో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఇబ్బంది లేకుండా రేషను పంపిణీ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మనోహర్ తెనాలి: రాష్ట్రప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరకుల పంపిణీ నిలిపివేతకు తీసుకున్న నిర్ణయం సున్నితమైనందున లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రేషను పంపిణీ నిర్వహించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం సాయంత్రం తెనాలి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ సంబంధిత చౌకధరల దుకాణాల వద్దే జరుగుతుందని చెప్పారు. అరవై అయిదేళ్లు పైబడిన కార్డుదారులు, అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు మాత్రం ఇంటి వద్దే సరకులు పంపిణీ చేస్తారని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగా కొంత వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ముగ్గురికి గాయాలు నాదెండ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు, గణపవరం పరిధిలో జాతీయ రహదారిపై భారత్గ్యాస్ గోడౌన్ వద్ద గణపవరం నుంచి ప్రయాణికులతో చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కారసాల సుబ్బారావు, నాగజ్యోతి, ఆటోడ్రైవర్ పల్లపు వెంకటేశ్వర్లు గాయాలపాలయ్యారు. నాగజ్యోతిని గుంటూరు జీజీహెచ్కు తరలించగా, మిగతా ఇద్దరు క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయ జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి రామనామ సంకీర్తనతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను ఆలయ పండితులు బొర్రా వెంకట అనంతచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రసన్నాంజనేయుని మాలధారులు వారి ఇళ్ల వద్ద నుంచి భజన కార్యక్రమాలతో గ్రామోత్సవాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని ఆలయం వద్దకు వచ్చి ఇరుముడులు కట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వరరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
బాపట్ల టౌన్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 69వ సమావేశంలో 2014 సెప్టెంబర్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. దీన్ని 177 దేశాలు ఆమోదించాయని తెలిపారు. 2015 నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన వైజాగ్లో ఐదు లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ధైర్యం వస్తుందని చెప్పారు. జిల్లాలోని 17 లక్షల మందికి యోగాంధ్ర చేరే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగా ఒకటిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి -
యోగా మన దేశ అపూర్వ సంపద
గుంటూరు వెస్ట్: వేల సంవత్సరాల క్రితం రుషుల కృషి ఫలితంగా యోగా అనే అపూర్వ సంపద మన దేశానికి దక్కిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. యోగా మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాపై విస్తృత అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర థీమ్తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను, ఉపయోగాలను వివరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రంగోలి, ర్యాలీ, మారథాన్, పరుగు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యోగా సాధన నిర్వహించనున్న ప్రాంతాల్లో ట్రైనర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి శోభాయాత్ర
తెనాలి: హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక షరాఫ్బజార్లోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమజ్జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నందున బుధవారం పట్టణంలో స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి, పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమజ్జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు విశేష పూజలు, హోమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కల్యాణం, 31న శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం ఉంటాయన్నారు. జూన్ ఒకటో తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనూరాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్రప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
వీరాంజనేయునికి మామిడి ఫలార్చన
తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయ స్వామికి ఈ నెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. భక్తులు తమ శక్తిని అనుసరించి ప్రదక్షిణములు చేస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్వామి వారికి మామిడి ఫలార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. కిల్కారి కాల్ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలి గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని బుధవారం ఆర్మ్ సెంట్రల్ బృందం విజిట్ చేసింది. ఈ సందర్భంగా కిల్కారి కార్యక్రమం అమలు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. పనితీరును అభినందించింది. అనంతరం సంగం జాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించారు. ఆరోగ్యకేంద్రం స్థాయిలో కిల్కారి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తల పని తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలతో ముచ్చటించారు. కిల్కారి కాల్ సర్వీస్ను కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రవేశం పెట్టినట్లు వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని, 01244451660 అనే నంబర్ నుంచి కాల్ రావడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, ఇన్చార్జి డీపీహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజు, డీసీఎం సురేష్ పాల్గొన్నారు. 17 మండలాల్లో తేలికపాటి వర్షం కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 8 మిల్లీ మీటర్లు నమోదుకాగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 0.8 మి.మీ. కురిసింది. సగటు వర్షపాతం 4.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 21వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ. కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. చేబ్రోలు మండలంలో 7.8, ప్రత్తిపాడు 6.6, గుంటూరు పశ్చిమ 6.2, కొల్లిపర 6.2, ఫిరంగిపురం 5.6, కాకుమాను 5.4, పెదనందిపాడు 5.4, తాడేపల్లి 5.4, మంగళగిరి 5.2, తెనాలి 4.4, దుగ్గిరాల 2.8, పెదకాకాని 2.2, గుంటూరు తూర్పు 2, మేడికొండూరు 1.8, తుళ్ళూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. -
అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు
దుర్గి: శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. అమ్మవారికి హుండీ కానుకల ద్వారా రూ. 31,30,423లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి సైదమ్మ తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన లెక్కింపులో పేటసన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణ అధికారి శివనాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణం మాచర్ల: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణం జరిపారు. అమ్మవారి జన్మదినమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, బి.రఘురామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాధ, రమణారెడ్డి, కమిటీ నిర్వాహకులు కె.బ్రహ్మారావు, కె.గురవయ్య, పిచ్చయ్యల ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. భక్తులకు తీర్ధప్రసాదం అందించారు. డీఆర్ఎం కార్యాలయంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం కార్యాలయ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్ఎం సుధేష్ఠసేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారన్నారు. అహింస, శాంతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ప్రతిజ్ఞ చేశామన్నారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం పెదకాకాని: పెదకాకాని గ్రామానికి చెందిన గరికపాటి వరుణ్దేవ్ పెదకాకాని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116లను అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ బుధవారం తెలిపారు. గరికపాటి లక్ష్మీకాంతం మరియు వుయ్యూరు మాసమ్మ జ్ఞాపకార్థం గరికపాటి వరుణ్ దేవ్ పై నగదుతో పాటు వెండి బిందె, వెండి గిన్నెలు విరాళంగా అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. ఎండీయూ వాహనదారులను కాపాడండి గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సిబ్బంది రోడ్డున పడ్డామని ఎండీయూ వాహనాల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొని ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీకి తప్ప దేనికీ పనికిరావని తెలిపారు. తమ ఉపాధి చూపించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.తిరుపతి రామారావు, కోశాధికారి కె.డానీ, నాయకులు పాల్గొన్నారు. -
మల్లాదిలో నేడు హనుమజ్జయంతి
అమరావతి: మండల పరిధిలోని మల్లాది ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమత్ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త భవిరిశెట్టి హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అర్చకుడు పరుచూరి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 40 అడుగుల అభయాంజనేయస్వామి వారికి విశ్వక్సేన ఆరాధన అనంతరం పంచామృత స్నపన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ధ్యానాంజనేయస్వామివారికి పంచామృత స్నపన, సహస్రనామాలతో తమలపాకులతో ఆకుపూజలు నిర్వహించి విశేషాలంకారంతో భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ చేస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో.. పుణ్యక్షేత్రమైన అమరావతిలో హనుమత్ జయంతి సందర్భంగా పవిత్ర కృష్ణానదీ తీరాన వెలిసిన అభయాంజనేయస్వామి ఆలయంలో, మెయిన్రోడ్లోని కోదండ రామాలయంలోని అభయాంజనేయునికి ప్రత్యేక పూజలతో వాసవీ మహిళామండలి సభ్యులచే 108 సార్లు హనుమాన్చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఽఅర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు తెలిపారు. -
ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటాక 2.39 నిమిషాలకు కూడా మద్యం విక్రయిస్తున్నారు. బార్కు ఉన్న ప్రధాన షట్టర్కు చిన్న షెట్టర్ను అమర్చి మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మరో బార్ అండ్ రెస్టారెంట్లో ఏ క్షణాన కావాలన్నా మద్యం దొరుకుతుందన్న విషయం బహిరంగ రహస్యం. అర్ధరాత్రి దాటాక 2.53 నిమిషాలకు కూడా, పక్కన ఉన్న సన్న సందులో నుంచి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. బార్కు పక్కనే ఉండే మరొక బార్లో ‘మోడ్రన్’గా ఒక వాచ్మెన్ను పెట్టి 3.05 నిమిషాలకు కూడా విక్రయాలు జరుపుతున్నారు. అదే కొద్దిగా దూరంలో ఓల్డ్క్లబ్ రోడ్డు మూలన ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అసలు టైంతో పనే లేదు. ఎప్పుడు కావాలన్నా ఇంటికి వచ్చి వెళ్లినట్టే ఉంది పరిస్థితి. పట్నంబజారు(గుంటూరు తూర్పు): అర్ధరాత్రి సమయాల్లో సైతం షెట్టర్ కొడితే చాలు తలుపులు నిస్సంకోచంగా తెరుచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా సాగుతున్నా... అనధికారిక పర్మిట్ రూమ్లు ఏర్పాటు అవుతున్నా.. పట్టించుకునే నాథుడు కాదు కదా.. కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గుంటూరు నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మొత్తం 37 వైన్స్ దుకాణాలు, 64 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అన్నిచోట్లా కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం విక్రయాలు 24/7గా మారాయి. మద్యం మత్తులో గొడవలు దీంతోపాటు గుంటూరు అరండల్పేట ఒకటో లైనులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కూడా మందుబాబులకు 24 గంటలూ సేవలను అందిస్తోంది. వెస్ట్ పరిధిలోని జేకేసీ కళాశాల రోడ్డులో ఉన్న పెద్ద బార్ అండ్ రెస్టారెంట్వారు కస్టమర్లను బార్ వెనుక గార్డెన్లో కూర్చొబెట్టి మరీ తాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మణిపురం ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న బార్లో సైతం మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితోపాటు ఈ ప్రాంతంలో అనేక వివాదాలు చెలరేగి అర్ధరాత్రి పూట దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. నందివెలుగు రోడ్డులోని ఉన్న రెండు బార్ల పరిస్థితి ఇక చెప్పా ల్సిన పనే లేదు. మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లు.. అనే చందంగా ముందుకు సాగుతున్నాయి. వైన్స్ దుకాణాలలో కంటే బార్లలో క్వార్టర్కు రూ.60 అధికంగా తీసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాల్లో రూ.100కుపైగానే అధికంగా తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా అధికారులు అర్ధరాత్రి వేళ బార్లు, వైన్స్ల్లో మద్యం అమ్మకాలు బహిరంగ రహస్యమే అన్నట్లు పరిస్థితి మారింది. ఈ విషయం పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు తెలిసినప్పటీకీ తమకేమీ పట్టని చందంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మద్యం షాపులకు సంబంధించి కొంత మంది కూటమి నేతలు సిండికేట్గా ఏర్పడి వైన్స్ దుకాణాల వారి నుంచి రూ.12 వేలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల వద్ద రూ.15వేలు చొప్పున వసూలు చేసి ఆయా పోలీసుస్టేషన్ అధికారులు, ఎకై ్సజ్ సిబ్బందికి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో ఆయా స్టేషన్ల మఫ్టీ పార్టీ కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్లో కొత్తగా అనధికారిక పర్మిట్ రూమ్కు రిబ్బన్ కట్ చేశారు. కొద్ది కాలం క్రితం వరకు పక్కనే ఉన్న బడ్డీకొట్లలో యథేచ్ఛగా తాగేవారు. ఇప్పుడు బహిరంగ మద్యపానం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నేరుగా గోడ పగులకొట్టి మరీ పర్మిట్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ పక్కనే ఆంధ్రా ముస్లిం కళాశాల ఉంది. అదే క్రమంలో బైపాస్ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ మేరీస్, పలు కళాశాలల విద్యార్థినులు ఇటుగానే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నిర్వాహకులు పక్కనే ఉన్న ఫుట్పాత్కు తెరలను అడ్డుకట్టి మరీ తాగించేస్తున్నారు. పట్టపగలు మధ్యాహ్నం 2.34 నిమిషాల సమయంలో సైతం మందుబాబులు ఇక్కడి రోడ్డుపై యథేచ్ఛగా తాగేస్తున్నారు. దీంతోపాటు వెనుక భాగంలో, వైన్స్ ఉన్న డాబా పైభాగంలో అడ్డూ అదుపు లేకుండా పర్మిట్ రూములు పెట్టారు. ఈ క్రమంలోనే నందివెలుగు రోడ్డులో అనేక వివాదాల మధ్యన ఏర్పాటు చేసిన వైన్స్ కూడా పర్మిట్ రూమ్కు శంకుస్థాపన చేశారని స్థానికులు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ లోపల అనధికార పర్మిట్ రూమ్ ఓ బార్ అండ్ రెస్టారెంట్లో క్వార్టర్ మద్యానికి ఫోన్పేలో పంపిన నగదు రశీదు బహిరంగ మద్యపానంపై చర్యలు బహిరంగ మద్యపానం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రోన్లు, పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా చర్యలు చేపడుతున్నాం. బహిరంగంగా మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయటంతోపాటు కోర్టుకు హాజరు పరుస్తున్నాం. పూర్తిస్థాయిలో కట్టడిపై దృష్టి సారిస్తాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్ డివిజన్ న్యూస్రీల్మద్యం మత్తులో చిత్తు 24/7 మద్యం అమ్మకాలు కాసుల కక్కుర్తిలో పాలకులు వంత పాడుతున్న అధికారులు గోడలు పగులగొట్టి...సమయపాలన పాటించకుంటే చర్యలు బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ దుకాణాలు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాలి. లేకుంటే తనిఖీలు నిర్వహించి, తగిన చర్యలు చేపడతాం. – అరుణకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
యోగాతో ఆరోగ్యం.. ఆనందం
నరసరావుపేట: ప్రపంచానికి మనదేశం అందించిన గొప్ప విద్య యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పిలుపునిచ్చారు. రోజుకు 30 నిముషాలు యోగాకు కేటాయించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. జూన్ 21న నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నెలరోజుల యోగాంధ్ర మాసోత్సవం బుధవారం సాయంత్రం స్థానిక డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో వందలాది మందితో యోగా చేయడం ద్వారా జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి నెలరోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 30 రోజుల పాటు యోగా సాధన చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారుతుందనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. భావోద్వేగాలు అదుపులో.. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా సాధన ద్వారా మానసిక బలహీనతలు, ఉద్వేగాలు, ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవచ్చన్నారు. యోగా సాధకులలో ఆత్మహత్యలు, అత్యాశతో అక్రమాలు చేయడం, దుర్బుద్ధితో వ్యవహరించడం కనిపించదన్నారు. యోగాంధ్ర వంటి సామూహిక యోగా కార్యక్రమం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి యోగాసనాలు వేయడంపై శిక్షణ ఇచ్చిన ప్రముఖ యోగా ప్రచారకులు కూనంశెట్టి వెంకట జనార్ధన్, యోగా బోధకులు ఆనంద రాముడు, డైట్ అధ్యాపకుడుఅజయ్ కుమార్లను శాలువాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు సత్కరించి అభినందించారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు జిల్లాలో యోగాంధ్ర లాంఛనంగా ప్రారంభం -
మళ్లీ ప‘రేషన్’
కుయ్ కుయ్ అంటూ ఇంటి వద్దకు వచ్చి రేషన్ సరుకులు అందించే ఎండీయూ వాహనాల సైరన్ ఇక మూగబోయింది. అమ్మా.. మీ ఇంటికి రేషన్ వచ్చింది.. రండి అని ఆప్యాయంగా పిలిచే ఆపరేటర్లను ప్రభుత్వం ఇంటికి పంపుతోంది. ఇకపై సంచులు పట్టుకొని రేషన్ దుకాణాల చుట్టూ తిరగండంటూ కూటమి ప్రభుత్వం ప్రజలకు తిప్పలు తీసుకొచ్చింది. నరసరావుపేట టౌన్ : పేదల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరుస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల సేవలకు ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై రేషన్ కార్డుదారులు పనులు మానుకుని, తమ ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కల్పించారు. దీంతో పాటు పేదల బియ్యం నల్ల బజారుకు యథేచ్ఛగా తరలి వెళ్లనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు రేషన్ డీలర్షిప్లను హస్తగతం చేసుకున్నారు. ఇప్పటికే ఎండీయూ వాహనాల ద్వారా కొంత మందికి పంపిణీ చేసి మిగిలినవి అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఎండీయూ వాహనాలు తొలగించి పంపిణీ వ్యవస్థ పూర్తిగా డీలర్ల చేతికి అప్పగిస్తుండడంతో పేదల బియ్యం పక్కదారి పట్టడం ఖాయమనే చెప్పవచ్చు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వాహనాలు తొలగించి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదేళ్లపాటు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగింది. ఇప్పుడు ఈ వ్యవస్థను నిలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నింది. ఎండీయూ వాహనాలను నిలిపి వేస్తే పల్నాడు జిల్లాలో 1289 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా 402 ఎండీయూ వాహనాల ద్వారా సుమారు 6,34,893 మంది రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఇకనుంచి కార్డు దారులకు తిప్పలు తప్పవనే అనుకోవాలి. 2027 వరకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ.. రేషన్ దుకాణాల వద్ద పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రతినెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాహనం ఏ వీధికి వస్తుందో ముందుగానే తెలియజేయడంతో లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి రేషన్ సరుకులు తీసుకునేవారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉండేది. గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు 2027 జనవరి వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వాహనాలను తొలగించింది. ఎండీయూ వాహనాలకు మంగళం రేషన్ సరుకులు డీలర్లతో పంపిణీ ఇంటింటి రేషన్ పంపిణీని నిలిపిన కూటమి ప్రభుత్వం ఆందోళనలో కార్డుదారులు, ఎండీయూ వాహనదారులు -
బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావుచిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు అన్నారు. బర్లీ పొగాకు ధరకు సంబంధించి ఈనెల 27న ఐటీసీ కంపెనీ ముందు నిర్వహించనున్న కౌలు రైతుల దీక్షపై పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన భవన్లో మంగళవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు కొనుగోలు సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బర్లీ పొగాకును కేంద్ర ప్రభుత్వం పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలలో సిగరెట్ల తయారీలో ఘాటు వాసన కోసం నల్ల బర్లీ పొగాకు ఉపయోగిస్తారని చెప్పారు. అయితే పొగాకు కంపెనీలు సిండికేట్గా ఏర్పడి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బర్లీ పొగాకును తక్కువ ధరకు కొంటూ రైతులను నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్థానిక రైతులు ఉత్తర భారత రైతు ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ పొగాకు కొనుగోలులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఐటీసీ కంపెనీతోపాటు అన్ని కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావస్తున్నా నేటి వరకు రైతుల వద్ద పొగాకును కంపెనీలు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. వ్యవసాయశాఖ వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు బర్లీ పొగాకును సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రితోపాటు వ్యవసాయ మంత్రి సైతం కంపెనీల చేత పొగాకు కొనిపిస్తామని ఇచ్చిన హామీ కేవలం మాటలకే పరిమితమైందని అన్నారు. ఇప్పటికై నా గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సీఐటీయూ మండల కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, వ్యవసాయ కార్మి క సంఘం అధ్యక్షుడు సాతులూరి లూధర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, పలు సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు. -
క్రీడలతో దేహదారుఢ్యం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్దుర్తి: క్రీడల వలన దేహదారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని శిరిగిరిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మారుమూల ప్రాంతమైన శిరిగిరిపాడు గ్రామంలో జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించటం సంతోషకరమన్నారు. గ్రామానికి చెందిన కళ్లం హర్షవర్థన్రెడ్డి (ఐఆర్ఎస్), కళ్లం రామాంజనేయరెడ్డిల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళల, పురుషుల వాలీబాల్ పోటీలు జరుపుకోవటం ఆనందదాయకమన్నారు. మారుమూల ప్రాంతంలో సైతం జాతీయ స్థాయిలో పోటీలు ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన అంధుల క్రికెట్లో అజయ్కుమార్రెడ్డి జాతీయ స్థాయిలో రాణించగా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో నీలంరాజు బంగారు పతకాన్ని సాధించటం నియోజకవర్గానికే గర్వకారణమన్నారు. నీలంరాజుకు వెయిట్ లిఫ్టింగ్ పరికరాల కోసం రూ 1.61 లక్షలు అందించటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ప్రతి హైస్కూల్కు రూ.30వేలను మంజూరు చేసిందన్నారు. మాచర్లలో క్రీడా వికాసం పథకానికి రూ.2 కోట్ల నిధులను మంజూరు చేయటం జరిగిందన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడల చైర్మన్ రవినాయుడు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారునాయక్, నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు. కలుషిత ఆహారం తిన్న 20 మందికి అస్వస్థత ఈపూరు (శావల్యాపురం): పల్నాడు జిల్లా ఈపూరు మండలం పెదకొండాయపాలెం గ్రామంలో కలుషిత ఆహారం తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల కిందట గ్రామంలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యంలో ఏర్పాటు చేసిన వంటలు తిన్న వీరంతా వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల సమాచారం మేరకు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్, డీఎంహెచ్ఓ డి.రవికుమార్, తహసీల్దార్ నళిని, ఎంపీడీఓ ప్రభాకరరావులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించి బాధితులతో మాట్లాడి సత్వరమే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ప్రశాంత్కుమార్, రాజశేఖర్ వైద్య ఆరోగ్య సిబ్బంది 70 కుటుంబాలను సర్వే చేసి విరేచనాలతో బాధపడేవారిని గుర్తించి వైద్యసేవలు అందించారు. అందరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. -
సాక్షి టీవీ జిల్లా ప్రతినిధిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
నరసరావుపేట: సాక్షి మీడియా గుంటూరు జిల్లా ప్రతినిఽధి అశోక్వర్ధన్పై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలు యూనియన్ల జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్ వర్ధన్పై కారెంపూడిలో టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ప్రెస్క్లబ్, వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, యూట్యూబర్ అసోసియేషన్లకు చెందిన జర్నలిస్టుల ప్రతినిధులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల యూనియన్ల ప్రతినిధులు బి.ప్రసాదు, నంద్యాల జగన్మోహన్రెడ్డి, సీహెచ్.వి.రమణారెడ్డి, అనీల్కుమార్, కె.నాగమణి మాట్లాడారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా అక్కడ జరుగుతున్న సంఘటనలను ప్రపంచానికి తెలియచేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధిపై టీడీపీ గుండాలు దాడిచేయటం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. వెంటనే దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదికాదని పేర్కొన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసుకోవాలే కాని ఉద్యోగ నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడులు మంచిది కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలుగచేసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ లవకుమార్రెడ్డి, పి.కోటిరెడ్డి, జి.సాంబశివారెడ్డి, గురజాల రిపోర్టర్ మల్లికార్జునరెడ్డి, సాక్షి మీడియా రిపోర్టర్ సుంకిరెడ్డి, నాగరాజు, షేక్ షాహిద్, షేక్ జిలాని, స్వామి, చలమయ్య, రాముడు పలువురు యూట్యూబర్లు పాల్గొన్నారు. -
ఐసెట్లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరుఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354మందివిద్యార్థుల్లో 338మంది ఉత్తీర్ణత సాధిం చారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు. కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు ఐసెట్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ఆమె తండ్రి నాగేశ్వరరావు గతంలో వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం ఆర్కెస్ట్రా గ్రూప్లో తబలా వాయిద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ఇద్దకు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి స్రవంతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతోంది. రెండో కుమార్తె మాధుర్య 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. ఎస్సెస్సీ పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్కు దరఖాస్తు చేసి, ఎటువంటి కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు కై వసం చేసుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు -
బ్యాంకర్లు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలి
నరసరావుపేట: బ్యాంకర్లు ఉదారంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరుచేయాలని పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు బ్యాంక్ అధికారులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించి డీసీసీ(డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటి), డీఎల్ఆర్సీ (డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ)పై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. పీఎంజేజేవై, పీఎం జనధన్ యోజన వంటి పథకాలలో ఎన్ని యాక్టివ్గా ఉన్నాయనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ త్రైమాసికానికి జిల్లాలోని 310 బ్యాంకులలో సుమారుగా మార్చి చివరి నాటికి రూ.41,995.38 కోట్లు వ్యాపారం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజరు రాంప్రసాద్ వివరించారు. ప్రధానమంత్రి జనధన్ యోజన కింద 5,31,755 మందికి రూపే కార్డులు మంజూరు చేశామన్నారు. వార్షిక క్రెడిట్ ప్లాన్ క్రింద రూ.22910.84 కోట్ల ఇవ్వడం జరిగిందన్నారు. షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ కింద 8,30,687 మందికి రూ.10,683.56 కోట్లు ఇచ్చామని చెప్పారు. కౌలు రైతులు 3388 మందికి రూ.23.89కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఉన్నత చదువులకై 2024–25లో 1478 అకౌంట్దారులకు రూ.71.49కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ టి.మాధురి తొలుత సమావేశం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్ త్రైమాసిక నివేదికను వివరించారు. ఆర్బీఐ అధికారి అభిషేక్రాజ్, నాబార్డు డీడీఎంసీ శరత్బాబు, వివిధ బ్యాంకుల కో–ఆర్డినేటర్లు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు 50 శాతం తగ్గించాలి నరసరావుపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం, మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2023–2024లో జిల్లాలో వరుసగా 576, 612 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 2025లో ఏప్రిల్ నాటికి 263 ప్రమాదాలు జరిగాయన్నారు. 2024లో రోడ్డు ప్రమాదాలలో 380 మంది మృతిచెందగా, 2025లో నాలుగు నెలల కాలంలో 152 మరణాలు సంభవించాయన్నారు. జిల్లాలోని 34 బ్లాక్ స్పాట్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాల సరళిని మెరుగ్గా అంచనా వేయడంలో తోడ్పడుతున్నాయన్నారు. డ్రైవింగ్ శిక్షణకు అనుమతి మంజూరుచేస్తూ రోడ్డుసేఫ్టీ నిర్వాహకులు దుర్గాపద్మజకు సర్టిఫికెట్ అందజేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అమ్మకాలను నిరోధించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, రోడ్లు, భవనాలశాఖ ఎస్ఈ రాజానాయక్, జిల్లారవాణా అధికారి సంజీవ్ కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ రవి, డీఈవో చంద్రకళ పాల్గొన్నారు. ఎంపీ లావు, కలెక్టర్ అరుణ్బాబు -
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠం మార్గంలో నూతనంగా నిర్మించిన సువర్ణ భారతి మహాద్వారాన్ని మంగళవారం శ్రీశృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ మహాస్వామి ప్రారంభించారు. అనంతరం శంకరమఠంలోని శ్రీశంకర చంద్రమౌళీశ్వరస్వామి, శ్రీశారదాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాద్వారం నిర్మాణానికి సహకరించిన వేదాంతం సీతారామ అవధాని, కపలవాయి విజయకుమార్లకు ఆశీస్సులు అందజేశారు. స్వామివారి రాకతో శంకరమఠంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా బృందాలు కోలాటాలు, భక్తి గీతాలాపనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. దేవాలయాల్లో పోలీసుల తనిఖీలు నరసరావుపేట: భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం భక్తుల భద్రత కాంక్షిస్తూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్ లోకల్ పోలీసులు ఉదయం నుంచి నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ దేవాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. వాటిలో ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వివరాలు, భద్రత, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటి పని తీరు గురించి పూర్తిగా తనిఖీచేసి ఆలయ యాజమాన్యంకు తగిన సూచనలు చేశారు. అనుమానితులు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిద్రకు వచ్చే వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా అనుమానితులు ఉంటే అట్టి సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్కు తెలియపర్చాలని కోరారు. అనధికారికంగా ఏమైనా వాహనాలు, వస్తువులు ఉంటే వెంటనే తమకు తెలియపర్చాలని సూచించారు. శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహు తి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. మహంకాళీ దేవస్థానంలో చండీ హోమం దుగ్గిరాల:దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో ఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళ వా రం చండీహోమం నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. -
క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దాం
● వజ్రోత్సవ జూబిలీ ముగింపు వేడుకలలో విశ్రాంత బిషప్ గాలిబాలి ● 8 జిల్లాలనుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు ● తరలి వచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా తేరు ఊరేగింపుఅచ్చంపేట: ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందాలని, ఏసు క్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న జూబిలి వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాసీ్త్రలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. వైభవంగా తేరు ప్రదక్షిణ విశాఖపట్నం అగ్రిపీఠాధిపతులు ఉడముల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవిందుజోజి, ఏలురు పీఠాధిపతి పొలిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన కోఆజ్యుటర్ పీఠాధిపతులు పిల్లి అంథోనిదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలాధికారి విజయపాలేరెడ్డిలతో పాటు అనేమంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి అంతోనిరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యరీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాలనుంచి క్రైస్తవులు తండోప తండాలుగా తరలి వచ్చారు. రాత్రి 10 గంటలకు నిర్వహించిన తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో తేరు (రథం)పై బాలఏసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి, గ్రామాలనుంచి తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
రక్తదానానికి ఉద్యోగులు సహకరించాలి
నరసరావుపేట: ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి కనీసం 50 మంది రక్తదానం చేయాలని, దీనికి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ కోరారు. రెడ్క్రాస్ జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మార్గదర్శకత్వంలో మంగళవారం కలెక్టరేట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా హాజరైన జేసీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి చేసే సర్జరీలలో రక్తం అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. ప్రస్తుతం వేసవిలో రక్తం కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. దానిలో భాగంగానే మొదటి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి మాట్లాడుతూ రెడ్క్రాస్ అభ్యర్థన మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, మండలాల వారీగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఒక సర్క్యులర్ విడుదల చేశామని తెలిపారు. మొత్తం 43 మంది రక్తదానం చేయగా వారందరికీ డీఆర్ఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ, కేఎంఎన్వీ శ్రీనివాసగుప్తా, బత్తుల మురళి, డాక్టర్ రహమతుల్లా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిప్యూటీ కలెక్టర్ కేఆర్సీసీ కుమార్, అడ్మిన్ ఆఫీసర్ ఎం.లీలాసంజీవకుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రసూన, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ పాల్గొన్నారు. కలెక్టరేట్లో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం -
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పార్టీ కమిటీని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నాయుడు సాంబశివరావు(పెదకూరపాడు), పచ్చవ రవీంద్రబాబు (నరసరావుపేట), కూకుట్ల శ్రీనివాసరావు (సత్తెనపల్లి), తుర్లపాటి చౌదరయ్య (వినుకొండ), వీరంరెడ్డి అమరారెడ్డి (గురజాల), తాడి వెంకటేశ్వరరెడ్డి (మాచర్ల)ను నియమించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కొమరాల రమేష్ (పెదకూరపాడు), సాతులూరి సుజాతాపాల్ (నరసరావుపేట), మర్రి సుబ్బారెడ్డి (సత్తెనపల్లి), గిలుగు వెంకటనర్సింహారెడ్డి (గురజాల), పోతిరెడ్డి కోటిరెడ్డి (మాచర్ల) నియమితులయ్యారు. కోశాధికారిగా నరసరావుపేటకు చెందిన అన్నా చంద్రమోహన్ను నియమించారు. సెక్రటరీ ఆర్గనైజర్లుగా షేక్ సుభాని, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (పెదకూరపాడు), షేక్ మహమద్ గౌస్, పల్లపు అంజయ్య (నరసరావుపేట), గంటా ఏసుబాబు, కోవూరి నరసయ్య(సత్తెనపల్లి), పీపాల సాయిబాబు, తలారి ఆంజనేయులు (వినుకొండ), పసుపులేటి నరసింహారావు, లంజెపల్లి అంకారావు(గురజాల), ఏరువ ప్రతాపరెడ్డి, వెలిదండి గోపాలరావు(మాచర్ల) నియమితులయ్యారు. సెక్రటరీ యాక్టివిస్టులుగా గాదే వెంకటేశ్వరరెడ్డి, సందెపోగు పున్నారావు(పెదకూరపాడు), గొర్రెపాటి అచ్యుతరావు, గెల్లి చినకోటిరెడ్డి (నరసరావుపేట), షేక్ మహబూబ్ కమాల్బాష, జొన్నలగడ్డ ఆనంద్(సత్తెనపల్లి), ముండ్రు జీవప్రసాదు, చీరపురెడ్డి రామకృష్ణారెడ్డి (వినుకొండ), షేక్ దస్తగిరి, కొమెర వెంకటేశ్వర్లు(గురజాల), మంది పెదముల్లుస్వామి, మున్నా మురళి (మాచర్ల), అపీషియల్ స్పోక్పర్శన్లుగా ఏకుల అన్నపాములు (పెదకూరపాడు), రాపోలు శ్రీనివాసరావు (నరసరావుపేట), దార్ల ఏడుకొండలు (సత్తెనపల్లి), మండవ నాగభూషణ ప్రసాదు (వినుకొండ), చింతా వెంకటరామారావు(గురజాల) నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకం నరసరావుపేట: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన ఇరువురిని పల్నాడు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మద్దం శ్రీనివాసరావును గ్రీవెన్స్సెల్కు, ఇండూరి నరసింహారెడ్డిని బూత్ కమిటీ వింగ్కు అధ్యక్షులుగా నియమించారు.