breaking news
Palnadu District News
-
హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు పోటీలు
●న్యూకేటగిరీలో ప్రథమస్థానం కై వసం చేసుకున్న ఇర్లపాడు ఎడ్లు ●ఆరు పళ్ల విభాగంలో పెదకాకాని ఎడ్లకు ప్రథమస్థానం నాదెండ్ల: మండల కేంద్రమైన నాదెండ్లలో కొలువైయున్న నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో ఎడ్ల యజమానులను ఉత్సాహపరిచారు. మంగళవారం రాత్రి ఆరు పళ్ల విభాగంలో పోటీలు పూర్తయ్యాయి. మొత్తం ఎనిమిది జతలు పాల్గొనగా గుంటూరు జిల్లా, పెదకాకాని ఆలా రాజేష్ యాదవ్, ఖాదర్ మస్తాన్కు చెందిన ఏఆర్వై అండ్ ఎంకేఎం బుల్స్ 3,500 అడుగుల దూరాన్ని లాగి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ప్రత్తిపాడు పమిడి అంజయ్యచౌదరి ఎడ్ల జత 3,396 అడుగుల దూరంలాగి రెండో స్థానం, నరసరావుపేట మండలం రావిపాడు వై మనోజ్చౌదరి ఎడ్ల జత 3250 అడుగుల దూరం లాగి మూడోస్థానం, పత్తిపాడు పమిడి అంజయ్యకు చెందిన మరో ఎడ్ల జత 2,754 అడుగుల దూరం లాగి నాలుగోస్థానం, బాపట్ల జిల్లా దరవాడికొత్తపాలెం మంచాల రమాదేవి ఎడ్ల జత 2750 అడుగుల దూరం లాగి ఐదోస్థానం, కాకుమాను మండలం కొండబాలవారిపాలెం పెద్ది రవీంద్రబాబు ఎడ్ల జత 1988 అడుగుల దూరం లాగి ఆరోస్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు, షీల్డులు అందించారు. న్యూకేటగిరి విభాగంలో... బుధవారం ఉదయం న్యూకేటగిరి విభాగంలో హోరాహోరీగా జరిగిన పోటీల్లో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ సర్పంచ్ మంగు రమాదేవి, ఏడుకొండలు ఎడ్ల జత 4,783 అడుగుల దూరం లాగి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో 14 ఎడ్ల జతలు పాల్గొనగా, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ ఎడ్ల జత 4,507 అడుగుల దూరం లాగి రెండో స్థానం, కృష్ణాజిల్లా, ఘంటసాలకు చెందిన ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ ఎడ్ల జత 4,231 అడుగుల దూరం లాగి మూడోస్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్లను అందించారు. బుధవారం సాయంత్రం వరకూ న్యూకేటగిరీలో జరిగిన పోటీల్లో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు మండు ఏడుకొండలు ఎడ్ల జత ప్రథమస్థానంలో నిలవటంతో అభిమానులు కేరింతలతో సందడి చేశారు. గురువారంతో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో, చివరిరోజు శుక్రవారం జాక్పాట్ విభాగంలో పోటీలతో ముగియనున్నాయి. -
అంబులెన్స్కు స్వచ్ఛందంగా దారిచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
గుంటూరు రూరల్: సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వం కలిగిన వారు వైఎస్సార్ సీపీ శ్రేణులని బుధవారం మరో సారి నిరూపించారు. విషయమేమిటంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు నగరంలోకి రానుండగా.. స్వాగతం పలికేందుకు ఏటుకూరు బైపాస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అశేష జనసందోహం ఎదురు చూస్తున్నారు.. ఈక్రమంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి వెళ్లేందుకు అంబులన్స్ రావడంతో అంతా అడ్డుతొలగి.. స్వచ్ఛందంగా దారిచ్చారు. అంతేకాకుండా.. దారిపొడవునా యువకులు ద్విచక్ర వాహనాలపై వెళుతూ రోడ్డుపై ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు అంబులెన్స్ వస్తుంది... పక్కకు తొలగండి అంటూ అంబులెన్స్కు దారిచ్చి పంపారు. -
మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
●ప్రతి ఒక్కరూ సందర్శించి అవగాహన పెంచుకోవాలి ●ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 30 సంవత్సరాల తరువాత ఏర్పాటు చేసిన మెడికల్ ఎగ్జిబిషన్ను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి శరీర అవయవాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఏర్పడడంతోపాటు, అనారోగ్యం బారిన పడకుండా ఎలా ఉండాలో కూడా తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలోకి పిల్లలు వచ్చేందుకు ఎగ్జిబిషన్ ప్రేరణ ఇస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా వీక్షించాలన్నారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ వైద్య విభాగంలో స్పెసిమెన్స్ ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్ను వీక్షించడం ద్వారా పలు విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఇతర బోధనా సిబ్బందిని మంత్రి అభినందించారు. జింకానా దేశానికే ఆదర్శం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో మాతృ సంస్థ అభివృద్ధికి సేవలు చేస్తున్నారని, జింకానా దేశానికే ఆదర్శమని మంత్రి సత్యకుమార్ చెప్పారు. పూర్వ విద్యార్థులు అంకిత భావంతో కళాశాలకు చేస్తున్న సేవ ఎంతో విలువైనదని, అలాంటి గుంటూరు వైద్య కళాశాల ఏపీకే గర్వకారణమన్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలి ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్యాన్సర్ బారిన పడి ప్రతి రోజూ మరణిస్తున్నారని, క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేలా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు చేస్తున్న సేవల గురించి మీడియాకు వివరించారు. గుంటూరు జీజీహెచ్లో నాట్కో ట్రస్టు సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తొలుత మంత్రి ఎగ్జిబిషన్ను గంటకుపైగా తిలకించారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వి. సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి, పలు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజ లు, అధికారుల సహకారంతో హింసను రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. సాల్మన్ హత్య బాధాకరం గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగతమైన వివాదాల వలనే సంఘటన జరిగినట్లుగా నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇది ప్రేరేపితమైన సంఘటన కాదని, కేవలం యాధృచ్ఛికమైందన్నారు. తాడికొండ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాలు బుధవారం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద స్థల పరిశీలన చేసి పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్టిజీఎస్ అధికారులు ప్రకార్ జైన్, గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ పాల్గొన్నారు. గుంటూరు లీగల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై గురువారం స్పెషల్ మొబైల్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు తీసుకున్న చర్యలపై న్యాయవాదులు, లీగల్ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. బాపట్లటౌన్: భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మండలంలోని ఈస్ట్ బాపట్లలో బుధవారం భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. జేడీఏ ఎం.విజయనిర్మల మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దానికి తగినట్లుగా ఎరువులను వినియోగించుకోవాలన్నారు. విచక్షణా రహితంగా ఎరువులు వాడటం వలన పొలంలో శత్రు పురుగులతోపాటు మిత్రపురుగులు చనిపోయి పైరుకు నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ, రైతు సాధికార సంస్థ సిబ్బందికి మట్టినమూనాల సేకరణపై శిక్షణ, అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అత్తర్ హుస్సేన్, ఏడీపీఎం జక్కుల మోహన్, ఏఓ కె.శారద, వీఏఏ టి.గోపికృష్ణ, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
మచ్చే కదా అని వదిలేస్తే ముప్పే..!
సత్తెనపల్లి: శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తెల్ల రాగి మచ్చలు ఉంటే జాగ్రత్త .. ఎందుకంటే ఆ మచ్చలతోనే ప్రమాదం పొంచి ఉంది. శరీరంపై ఎక్కడ మచ్చలు ఉన్నా మొహమాటం పడకుండా వైద్య సిబ్బందికి చూపించాలి. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వైద్యులకు తెలియజేయాలని చెబుతున్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగంగా ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వేలో భాగంగా అనుమానిత మచ్చలు, తెలుపు, రాగి మచ్చలతోపాటు పొడలు శరీరంపై ఉంటే నిర్భయంగా ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి తెలియచేయాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలోని 28 మండలాల పరిధిలో 530 గ్రామ పంచాయతీలు, 13 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 26 అర్బన్ హెల్త్ సెంటర్లు పరిధిలో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. గత నెల 30న జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ జిల్లా అధికారిణి డాక్టర్ యు.మాధవీలతలు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. దీంతో ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆరు నెలలకు ఒకసారి చేస్తున్న సర్వేలో 2025 ఏప్రిల్ ఒకటి నుంచి 2026 జనవరి ఆఖరి వరకు జిల్లాలో 62 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 పీబీ (పాసివ్ బ్యాసిలరీ) కేసులు కాక 45 ఎంబీ(మల్టీబ్యాసిలరీ) కేసులు ఉన్నాయి. ఇవి కాక జిల్లాలో 77 కుష్ఠువ్యాధి కేసులు ఉండడంతో వారికి ఎండీటీ కోర్సుతో మందులు ఇచ్చి వైద్య సేవలు అందించడంతో కుష్ఠువ్యాధి నుంచి కోలుకొని యథాస్థితికి తీసుకు వచ్చారు. వ్యాధి లక్షణాలు ఇవే... ● కాళ్లు, చేతులపై స్పర్శ జ్ఞానం లోపించడం ● ముఖంపై చర్మం నూనె రాసినట్లు నిగనిగలాడుతుంది ● ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం ● చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం ● చేతుల నుంచి వస్తువులు జారిపోవడం ● వేళ్లు వంకర్లు తిరగడం, చర్మం పాలిపోవడం, రాగి రంగులోని స్పర్శ లేని మచ్చలు ● కుష్ఠు వ్యాధికి సంబంధించిన మచ్చలపై చెమట పట్టకపోవడం, కనుబొమ్మలు లేదా వెంట్రుకలు రాలిపోవడం చికిత్స ఇలా ... బహుళ ఔషధ చికిత్స (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా కుష్ఠువ్యాధి పూర్తిగా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రారంభ దశలో గుర్తించి సక్రమంగా చికిత్స చేయించుకుంటే కుష్ఠువ్యాధితో పాటు అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు. 6 నుంచి 12 నెలల పాటు ఎండీటీ మందులతో చికిత్స తీసుకుంటే కుష్ఠు పూర్తిగా నయం అవుతుంది. మందులతో చికిత్స తీసుకుంటే కుష్ఠువ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సర్వేలో వివరాలు నమోదు చేస్తూ.. సర్వేలో భాగంగా శరీరంపై మచ్చలు, అధిక మోతాదులో పొడలు ఉంటే సిబ్బంది వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వ్యక్తిని పరిశీలించి కుష్ఠువ్యాధి అవునో కాదో నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కుష్ఠువ్యాధిగా తెలితే సంబంధిత వ్యక్తి పేరు నమోదు చేసుకొని చికిత్స ప్రారంభిస్తారు. కుష్ఠువ్యాధి మైక్రో బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ప్రతి ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఏఎన్ఎం, సూపర్వైజర్, ఆశా కార్యకర్తలు ఈ నెల 13 వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయనున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు, స్వయం సహాయక సంఘాలకు, మురికివాడల్లో ప్రజలకు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సర్వే చేయడానికి వస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి ప్రజలు సహకరించాలి. కుష్ఠువ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత భయపడాల్సిన పనిలేదు. ఎండీటీ మందు వాడితే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. శరీరంలో తెలుపు, రాగి మచ్చలను గుర్తించి అనుమానిత వ్యక్తుల పేర్లు నమోదు చేసి వైద్యాధికారులు దృష్టికి తీసుకువెళ్లి వారికి ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నాం. –డాక్టర్ యు.మాధవీలత, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణాధికారిణి, పల్నాడు ఇంటింటా కుష్ఠువ్యాధి నిర్ధారణ సర్వే స్పర్శ లేని మచ్చలతో ప్రమాదం మచ్చలుంటే చూపించాలంటున్న వైద్యులు ఈ నెల 13 వరకు కొనసాగనున్న సర్వే -
రూ. కోటితో ఉడాయించిన ఆర్పీ
నరసరావుపేట టౌన్: డ్వాక్రా మహిళల డబ్బులతో ఉడాయించిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు రోడ్డెక్కారు. బుధవారం సత్తెనపల్లి స్టేడియం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు బాధిత మహిళలు మాట్లాడుతూ చంద్రబాబునాయిడు కాలనీలో ఆర్పీగా పనిచేస్తున్న చల్లా కోటేశ్వరి 30 గ్రూప్ల వద్ద సుమారు రూ. కోటి వరకు సేకరించి బ్యాంక్లో జమ చేయలేదన్నారు. ఏడాదిగా ఇలా చేస్తున్నా విషయం రెండు నెలల క్రితం తమకు తెలిసి ఆమెను అడిగేందుకు వెళ్లగా ఆర్పీ ఇంటికి తాళం వేసి ఉందన్నారు. డ్వాక్రా రుణాలకు సంబందించి డబ్బులు చెల్లించాలని బ్యాంక్ల నుంచి నోటీసులు అందాయన్నారు. బ్యాంక్ ప్రతినిధులు ఇళ్ల వద్దకు వచ్చి డబ్బులు జమచేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, మెప్మా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. నెల అవుతున్నా ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. దీంతో తామంతా రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నా చేయటంతో రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవటంతోపాటు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. -
ప్రతిష్టాత్మకంగా కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరునాళ్ల ఏర్పాట్లపై మూడవ సమీక్షా సమావేశం మంగళవారం కోటప్పకొండలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఆనంతో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, దేవదాయ శాఖ కమిషనర్ రాంచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఎఫ్ఓ కృష్ణప్రియలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గత ఏడాది స్వామి వారిని లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని, ఈ ఏడాది ఈ సంఖ్య 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వలన దర్శనానికి వచ్చే మహిళల సంఖ్య అధికంగా ఉంటుందని, అంచనాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగ హోదాలో ఈ ఏర్పాట్లకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఆన్లైన్లో వీఐపీ టికెట్ అమ్మకాలు దేవదాయ శాఖ కమిషనర్ రాంచంద్రమోహన్ మాట్లాడుతూ.. తిరునాళ్ల రోజు స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీ భక్తుల కోసం ఈ ఏడాది నుంచి టికెట్ విధానం తీసుకువస్తున్నట్టు తెలిపారు. ధరను రూ.300గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 10 వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి రోజు 1500 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు. టికెట్ తీసుకున్న యాత్రికులు సూచించిన టైమ్స్లాట్లో దర్శనానికి రావాల్సి ఉంటుందని సూచించారు. ఉచిత దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాప్రతినిధుల సిఫార్స్ లెటర్ల మేరకు ఆలయ ఆవరణలో తిరునాళ్ల రోజు వీఐపీ టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. భక్తులను చేరవేసేందుకు 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. 95 బస్సులు కింద నుంచి కొండమీదకు నడపుతున్నట్టు వివరించారు. -
మహాదత్తునికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలో శ్రీ దత్తపీఠంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజలు బుధవారంతో ముగిశాయి. ఉదయాన్నే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో మహాదత్తహవనం చేసి పూర్ణాహుతి నిర్వహించి భక్తుల గోత్రాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను శ్రీదత్తపీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 2025 మార్చి 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 3వ తేదీ వరకు లెక్కింపు చేశారు. 11 నెలలకుగాను రూ.4,70,918 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవదాయ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, తెనాలి దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించే కొండవీడు ఫెస్ట్ ద్వారా కొండవీడు వైభవాన్ని తిలకించేందుకు ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియా ద్వారా తన సందేశాన్ని రిలీజ్ చేశారు. తెలుగుజాతి ఘనచరిత్ర, వీరత్వానికి ప్రతీక కొండవీడు కోట అన్నారు. చరిత్ర, వైభవాన్ని నేటితరానికి పరిచయం చేస్తూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హలీరైడ్, బోటింగ్, శాండ్ ఆర్ట్, లేజర్షో, క్రాకర్స్షో, హార్స్ రైడింగ్తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. గాయకులు గీతామాధురి, సమీరా భరద్వాజ్, జబర్దస్ట్ కళాకారులు అలరించనున్నారని తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. పలు పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి చూసి ఆనందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్జేసీ చంద్రశేఖర ఆజాద్ బుధవారం ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్తో కలిసి పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, పాలు సరఫరా పాయింట్లను పరిశీలించారు. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు సాధారణ దర్శనాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, వీఐపీలు స్వామి వారి దర్శనానికి వచ్చిన సమయంలో తగు ఏర్పాటు చేయాలని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్కు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆర్జేసీ సూచించారు. -
నేతలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులుసాక్షి ప్రతినిధి, గుంటూరు: అడుగడుగునా అంతులేని అభిమానం... ఎక్కడికక్కడ కట్టడికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించినా ఆగని జనసందోహం... ఇవీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో కనిపించిన దృశ్యాలు. అధికార పార్టీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం పరిశీలించి, కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగుడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెడ్బుక్ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. వైఎస్ జగన్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆయన్ను చూసేందుకు పోటెత్తారు. తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్లోని రాంబాబు ఇంటికి ఆయన చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. తరలివచ్చిన అభిమానులు కుంచనపల్లి క్రాస్రోడ్స్, కాజ టోల్గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. అంబటి ఇంటికి చేరే సరికి సాయంత్రం 4.35 గంటలు అయ్యింది. మరోవైపు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటివరకూ ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జనసందోహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకుల మధ్య కూడా జగన్ పర్యటన విజయవంతం అయ్యింది. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద పెట్టి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలివచ్చారు. గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. పల్నాడు జిల్లా నుంచి ఎవ్వరూ రాకుండా దిగ్బంధించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరీ అడ్డంకులు సృష్టించారు. బందోబస్తు హడావుడి ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు రూరల్ మండలం బొంతపాడు వై జంక్షన్ వద్ద డీఎస్పీలు భానూదయ, అరవింద్తోపాటు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, రోప్ పార్టీలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. డ్రోన్ కెమెరాలతో పర్యటనపై డేగ కన్ను వేశారు. శనివారం రాత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ మూకలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్ను వైఎస్ జగన్ పరామర్శించారు. అంబటి ఇంటికి వెళుతున్న దారిలో ఏటుకూరు బైపాస్లోగల ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ కార్యాలయం వద్ద టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన అశోక్, పూర్తిగా ధ్వంసమైన కారును జగనన్న తన వాహనం నుంచి అభిమానుల మధ్యనే పరిశీలించారు. ఎట్టకేలకు... ఉదయం 10 గంటల నుంచి అంబటి నివాసం దగ్గరకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులను పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. సిద్ధార్థనగర్కు వెళ్లే అన్ని రహదారులను మూసి వేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేశారు. గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి నివాసానికి వచ్చేందుకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. ముఖ్య నేతలు హాజరు కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, విడదల రజిని, పేరి నాని, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, సింఽహాద్రి రమేష్, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురేష్, సమన్వయకర్తలు షేక్ నూరిఫాతిమా, వనమా బాలవజ్రబాబు (డైమండ్బాబు), దొంతిరెడ్డి వేమారెడ్డి, అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్బాబు, బలసాని కిరణ్, ఈవూరు గణేష్, డాక్టర్ సుధీర్రెడ్డి, అవినాష్, నాయకులు పోతుల మహేష్, షేక్ గులాం రసూల్, నిమ్మకాయల రాజనారాయణ, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న జగనన్నఅంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో పాల్గొనేందుకు సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన 37 మంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక వాహనంలో గుంటూరు బయలుదేరారు. సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుంటూరు సమీపంలోకి చేరుకోగానే హైవేపై జన సంద్రం పోటెత్తింది. జననేతను చూసేందుకు అభిమానులు మండే ఎండను సైతం లెక్కచేయక బారులు తీరారు. అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో హైవేతోపాటు ఏటుకూరు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో మెయిన్ హైవేపై నుండి సర్వీసు రోడ్డులోనికి జగన్ కాన్వాయ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించింది. కాన్వాయ్ కనిపించగానే జననేతను చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు హైవేపైకి పరుగులు పెట్టారు. చేతులు ఊపుతూ, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో జగన్ కారుపై నుండే ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని, భయపడవద్దని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘మాజీ మంత్రి అంబటి కాపు కులంలో ఒక టైగర్. విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టడం తగదు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలన్నింటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీ సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని’’ హెచ్చరించారు. -
నిలిచిన మీటర్ రీడింగ్
సత్తెనపల్లి: మూడు రోజులుగా విద్యుత్ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామం విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లులు తీయడం ఆలస్యమైతే .. విద్యుత్ వినియోగంలో స్లాబ్ పెరిగి పోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో ఆర్థికంగా అతలాకుతులం అవుతుంటే .. మరింతగా బిల్లులు పెరిగితే ఎలాగనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా 7,48,449 గృహ, వాణిజ్య సర్వీసులు, 594 వరకు హెచ్టీ సర్వీసులు ఉన్నాయి. నెలకు ఎల్టీ సర్వీసులకు 309.6 మిలియన్ యూనిట్ల, హెచ్టీ సర్వీసులకు 179.17 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. ప్రతి నెల ఎల్టీ సర్వీసుల నుంచి రూ. 51.12 కోట్లు, హెచ్టీ సర్వీసుల నుంచి రూ. 87.72 కోట్లు బిల్లులు విద్యుత్ శాఖకు వినియోగదారులు చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 246 మంది విద్యుత్ మీటర్ రీడర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 11వ తేదీ లోపు మీటరు రీడింగ్ తీస్తారు. ఒక మీటర్కు రీడింగ్ తీసినందుకుగాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్ పట్టణ ప్రాంతాల్లో రూ. 6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్ చేయటంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ. 0.75 పైసలు పెంచారు. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, రీడింగ్ పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహమింపులు పోగా .. విద్యుత్ మీటర్ రీడర్ కు చేతికి ఒక్కో మీటర్కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్క మీటర్ రీడర్ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్ తీస్తారు. దీన్నిబట్టి చూస్తే వారి ఆదాయం ప్రతినెలా కేవలం రూ. 7 వేల నుంచి రూ. 10 వేల లోపే ఉంటుంది. ప్రాంతాన్ని, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో సంస్థలో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు సిబ్బందికి ఉపాధి దక్కదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకిచిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం వాటిని అమర్చేందుకు వేగంగా అడుగులు వేయడంపై రైతుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండి పడుతోంది. వినియోగదారులు విద్యుత్ రీచార్జీపై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. విద్యుత్తు లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి రంగంలో సంక్షోభం నెలకొంటోంది. సాఫీగా సాగే వ్యవస్థలను సైతం గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే అనేక వ్యవస్థల నిర్వీర్యానికి ఆజ్యం పోసిన సర్కారు తాజాగా విద్యుత్ స్పాట్ బిల్లింగ్పై పడింది. విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపక పోవడంతో వారు సమ్మె బాట పట్టారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్న సమయంలో మీటర్ రీడర్లు ఆందోళన చెందారు. దీంతో స్పందించిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలోనే ఉపాధి కల్పిస్తామని భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేసింది. -
గొలుసు దొంగల విజృంభణ
నరసరావుపేట టౌనన్: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో చోటు చేసుకున్న గొలుసు చోరీ కేసుల్లో పురోగతి లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరులు చెలరేగిపోతున్నారు. నరసరావుపేటలో అసలు పోలీసింగ్ ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇవిగో నిదర్శనాలు.. బయటకు రావాలంటే బెంబేలు.. పట్టణంలో ఓ వైపు గొలుసు దొంగతనాలు, మరో వైపు ద్విచక్రవాహన చోరీలు పెరిగి పోవటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తులో ఇద్దరు యువకులు బైకులపై వచ్చి బంగారు గొలుసులు లాక్కెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహన దొంగతనాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలకు రక్షణ కరువైందని యజమానులు వాపోతున్నారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. జిల్లా కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నా చోరులు కనీసం లెక్క చేసే పరిస్థితులు కనిపించడం లేదు. చంద్రబాబు పాలనలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ నుంచి.. బజారుకు వెళ్తున్న గృహిణి వరకు... ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. పోలీసులకు బహిరంగ సవాల్ విసురుతున్నారు. -
జీఎస్టీ సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
పన్ను ఎగవేతలు అరికట్టండి నరసరావుపేట: జిల్లాలో పన్ను ఎగవేతలను అరికట్టాలని, చట్టప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రతి రూపాయి వసూలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జీఎస్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు పన్ను వసూళ్ల విషయంలో పన్నుల శాఖకు సహకరించాలన్నారు. శాఖల వారీగా వ్యాపారాలలో ఉన్న సంస్థల వివరాలు పన్నుల శాఖకు ఇవ్వాలన్నారు. ఆయా సంస్థలు సక్రమంగా పన్నులు చెల్లించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలం వ్యాపారంలో కొనసాగ గలవని స్పష్టం చేయాలన్నారు. గుంటూరు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్ పాత్రో, డిప్యూటీ కమిషనర్ జి.మురళీకృష్ణ, ఎల్డీఎం రామ్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మెగా జాబ్మేళా సద్వినియోగం చేసుకోండి సత్తెనపల్లిలోని మెయిన్రోడ్డులో గల డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల ఆరున నిర్వహించే మెగా జాబ్మేళాను విజయవంతం చేయాలని ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి తమ్మాజీరావు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం జాబ్మేళాకు చెందిన వాల్పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా, పరిసర ప్రాంత యువతీయువకులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిలో సుమారు 30కి పైగా బహుళ జాతి కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. నెల జీతం విద్యార్హతను బట్టి సుమారు రూ.13 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంటుందన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ చదివి 18–35ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగులు ఉదయం 9– సాయంత్రం 4 గంటల మధ్య నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. -
అనధికార లే అవుట్లు ధ్వంసం చేసిన సీఆర్డీఏ
అమరావతి: మండలపరిధిలోని కర్లపూడి, లేమల్లె, ఎండ్రాయి, నరుకుళ్ళపాడు, అమరావతి, ధరణికోట, పెదమద్దూరు, వైకుంఠపురం, నెమలికల్లు గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను ఏపీ సీఆర్డీఏ ఆధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. సీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగం అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 22 ఎకరాలలోని 15 అనధికార లే అవుట్లను ధ్వంసం చేశారు సీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ గుంటూరు జోనల్ జాయింట్ డైరెక్టర్ మహాలక్ష్మి దొర, జోనల్ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ పావని, వార్డ్ ప్లానింగ్ – రెగ్యులేషన్ సెక్రటరీ రవీంద్రలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జాయింట్ డైరెక్టర్ మహాలక్ష్మి దొర మాట్లాడుతూ మండలంలోని కర్లపూడిలోని సర్వే నెంబర్లు 292 295, 297, 299, 325, 332 సర్వేనెంబర్లలో ఎండ్రాయిలో 89,198, నరుకుళ్లపాడులో 123, ధరణికోటలో 346,99, అమరావతిలో 64, 65,151, పెదమద్దూరులో 77, వైకుంఠపురంలో 264, నెమలికల్లులో 122 సర్వేనెంబర్ల భూముల్లో ఏర్పాటవుతున్న అనధికార లేఅవుట్లను ధ్వంసం చేశామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
బడ్జెట్లో చేనేత కార్మికులకు మొండిచెయ్యి
సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగ కార్మికులకు మొండిచేయి చూపిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఫణిదం చేనేత సహకార సంఘం బిల్డింగ్ సమీపంలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి మాత్రం కేవలం రూ.200 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని బీజేపీ నేతలు పార్లమెంటులో మాట్లాడారన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల కాలంలో రూ. 5,093.56 కోట్లు మాత్రమే కేటాయించి చేనేతను మరణశయ్యపైకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ లూమ్ను ప్రోత్సహిస్తూ చేనేతను దెబ్బతీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన పావలా వడ్డీ, యారన్ సబ్సిడీ, రిబేట్ కింద ఇవ్వవలసిన రూ. 23 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.200 యూనిట్లు ఉచిత కరెంటు, చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ. 25 వేలు స్కీం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరిగే చలో మంగళగిరి మహాగర్జనలో చేనేత కార్మికులు, చేనేత శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చలో మంగళగిరి మహాగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎ.వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి.ప్రభాకర్ రావు, వి.చిన్నదిబ్బయ్య, మోపర్తి బాబు రాజు, జి.యేసు రత్నం, బిట్రా పానకాలు, గడ్డం సుస్సులోవ్, కట్ట రమాదేవిలు పాల్గొన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ -
అంగన్వాడీలకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం
సత్తెనపల్లి: 2026–27 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీలకు వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోను బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం సత్తెనపల్లిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ ఈనెల 12న అంగన్వాడీ కేంద్రాలు మూసేసి ప్రాజెక్ట్, మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ నిరసనలు జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చిందన్నారు. 2026–27 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్తో సహా దాదాపు ఒక కోటి మంది స్కీం వర్కర్ల దుస్థితి, హక్కులపై మాట్లాడకపోవడాన్ని కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఐసీడీఎస్, ఇతర స్కీమ్ వర్కర్లకు ప్రాథమిక సేవల పథకాలలో మౌలిక సదుపాయాలు, సేవలు నాణ్యత పై బడ్జెట్ మౌనంగా ఉందన్నారు. కేటాయింపుల్లో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. ప్రాజెక్టు గౌరవాధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాల ద్వారా కార్మికులకు కనీస వేతనాలు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు కేవలం రూ. 2,700, అంగన్వాడీ సహాయకులకు నెలకు రూ.1,350 వేతనంగా చెల్లిస్తుంద న్నారు. 2018 నుండి సామాన్య ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సేవలను అందించే ఈ గ్రాస్ రూట్ స్థాయి కార్మికుల వేతనంలో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎం.హరిపోతురాజు మాట్లాడారు. ముందుగా బడ్జెట్ ప్రతులు దగ్ధం చేసిన అనంతరం సీడీపీఓ టి.శ్రీలతకు వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి అహల్య, సెక్టార్ లీడర్లు ప్రభావతి, ముంతాజ్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఉన్నారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36.4577 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కాసరగడ్డ వీరేంద్ర, రమాదేవి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళ వారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.4,800, మోడల్ ధర రూ.4,300 వరకు పలికింది. 7 -
కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి ఊతం
ఆల్ ఇండియా టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ నగరంపాలెం: జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అనుమతుల్లేని సభలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. మార్కెట్ కమిటీ పూర్తిస్థాయి నియామకం కొరిటెపాడు: గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్గా బిట్రగుంట మల్లికలను నియమిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.వి.రాజమౌళి మంగళవారం సాయంత్రం జీవో విడుదల చేశారు. సభ్యులుగా కొనకళ్ల వెంకటసత్యనారాయణ, ముదావత్ మంగాబాయి, కె.విజయలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్, మేళం సైదయ్య, షేక్ ఖాదర్బాయి, బత్తుల జాన్సైదా, దర్శనపు విజయమ్మ, చంద్రగిరి బాబు, ఇమ్మడి వెంకటలక్ష్మి, డి.భాగ్యారావు, ఎన్. వంశీకృష్ణ, కె.శ్రావణకుమారిలను నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. నగరంపాలెం: జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగం కేసులో మరొకర్ని అరెస్ట్ చేశామని గుంటూరు సీసీఎస్ డీఎస్పీ బీవీ.మధుసూదనరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసు వివరాలను సీసీఎస్ డీఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగంపై గతేడాది నవంబర్ 28న డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి కె.శీనారెడ్డి ఫిర్యాదుతో నల్లపాడు పీఎస్లో కేసు నమోదైందని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు ఏ–8 అయిన బాపట్ల టౌన్ పటేల్నగర్ రెండో వీధిలో ఉంటున్న పీటా వెంకటేశ్వరావు కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఈనెల రెండో తేదీన అతన్ని గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమీపాన అరెస్ట్ చేశామన్నారు. గతంలో వెంకటేశ్వరరావు నల్లపాడు జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గంలో సభ్యుడిగా నామినేట్ చేశారని తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించారని అన్నారు. పరారీలో ఉన్న కొందర్ని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. -
దత్తపీఠంలో మహాసుదర్శన హోమం
ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని శ్రీ దత్తపీఠంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అనఘాదేవి, శ్రీ దత్తాత్రేయ స్వామిని విశేషంగా అలంకరించి అష్టోత్తర, సహస్ర నామ పూజలు చేశారు. యాగశాలలో రుత్వికులచే మహా సుదర్శన హోమం నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలను శ్రీదత్త పీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు. తెనాలి టౌన్: శ్రీపంచముఖ ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పుష్పాలతో విశేష అర్చనలను వైభవంగా జరిపించారు. స్థానిక షరాఫ్ బజారులోని సువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్ప ఉత్సవం కనులపండువగా నిర్వహించారు. స్వామి వారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సభ్యులు పాల్గొని శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుష్పాలంకరణతో ఉన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్.వి.కిరణ్కుమార్లు పర్యవేక్షించారు. నగరంపాలెం: తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే లక్ష్యంతో భారత్ రంగ మహోత్సవ్ –అంతర్జాతీయ నాటక ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు వేదిక (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అధ్యక్షుడు ముత్తవరపు సురేష్బాబు తెలిపారు. మంగళవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో బ్రోచర్ విడుదల చేశారు. తెలుగు నాటక కళా పరిషత్ల సమ్మేళనం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఢిల్లీ) సహకారంతో ఈ ఉత్సవాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 6, 7, 8, 9, 10 తేదీల్లో మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటక ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం మంగళవారం 542.30 అడుగులకు చేరింది. ఇది 193.1535 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 27,866, ఎస్ ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 46,241 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 46,241 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
జీజీహెచ్లో ఉచితంగా వైద్య సేవలు
గుంటూరు జీజీహెచ్లోని నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్ను అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించాం. రోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ వైద్య సేవలు, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నాట్కో ట్రస్టు, ప్రభుత్వ భాగస్వామ్యంలో సుమారు రూ. 45 కోట్లతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 125 పడకలతో ఈ సెంటర్ నిర్మించాం. మరో రూ.18 కోట్లతో 125 పడకల క్యాన్సర్ సెంటర్ను నిర్మిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ఆపరేషన్లు, మందులూ ఉచితం. –నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
వైభవం.. సాయిబాబా మందిర వార్షికోత్సవం
మంగళగిరి టౌన్: దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి గాంచిన మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో వున్న భగవాన్ శ్రీ సత్యషిరిడీసాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం బాబాకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ ఆధ్వర్యంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. పలువురు ప్రముఖులు వార్షికోత్సవానికి హాజరై బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిన్నారులకు, పెద్దలకు వినోదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, హ్యాండ్ల్యూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రధాన కార్యదర్శి సిసోడియా, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు, రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహనరావు, ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా కోమటి జయరాం, రిటైర్డ్ డీజీపీ మాలకొండయ్య, గంగాధర్ నాదెళ్ళ, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పంతల సురేష్, ఎన్ఆర్ఐలు యలమంచిలి జగదీష్బాబు, కావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ధన్యవాదాలు తెలిపారు. -
ముందే గుర్తిస్తే.. మెరుగైన వైద్యం
గుంటూరు మెడికల్ పూర్వం రాచపుండుగా పిలిచే క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం తప్పదనే వారు. క్యాన్సర్ సోకగానే వ్యాధికి మందు లేదనే భయాందోళనలతో అనేక మంది చనిపోయేవారు. నేడు ఆధునిక వైద్యం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించే అత్యాధునిక నిర్ధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా కట్టడి చేసే వ్యాక్సిన్లు సైతం మార్కెట్లోకి వచ్చాయి. యువ క్రికెటర్ యువరాజ్సింగ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. వ్యాధి పట్ల అవగాహన కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదిగే గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పొగాకు ఉత్పత్తుల కారణంగా 40 నుండి 45 శాతం, కాలుష్యం వల్ల 8 నుంచి 10 శాతం, మద్యం వల్ల మూడు శాతం క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్ద రోజూ దాదాపు 10 నుంచి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. సంవత్సరం ఓపీ రోగులు ఆపరేషన్లు 2021 11,719 168 2022 13,105 417 2023 14,648 753 2024 16,359 823 2025 19,598 1,131 -
అందుబాటులో ఆధునిక వైద్యం
క్యాన్సర్ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జెనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా వ్యాధిని చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తెలుస్తుంది. ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. బీఆర్సీఏ–1, 2 పరీక్షల ద్వారా కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతరులకు వస్తుందా రాదా అని నిర్ధారించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్సుల ద్వారా అనేక రకాల క్యాన్సర్లకు ఉచిత వైద్య సేవలు లభిస్తున్నాయి. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
ప్రథమస్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లా గిత్తలు రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176 వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా జరిగాయి. సీనియర్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనను చూడటానికి అనేక ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హూజూరునగర్కు చెందిన ఏఎస్పీ సుంకు సురేందర్ రెడ్డి ఎడ్లు 2,656.8 అడుగులు దూరంలాగి ప్రథమ బహుమతి రూ.2.70 లక్షల విలువైన రాయల్ ఇన్ఫీల్డ్(బుల్లెట్)ను కై వశం చేసుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,637.10 అడుగుల దూరంలాగి 2వ బహుమతి రూ. 1.40 లక్షల విలువైన యూనికార్న్ బైక్ను దక్కించుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ ఎడ్లు 2,519 అడుగులు దూరంలాగి 3వ బహుమతి కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరంకు చెందిన కాసనేని రాజాచౌదరి, వల్లభనేని మోహన్రావు ఎడ్లు 2,511.2 అడుగుల దూరంలాగి లాగి 4వ బహుమతి, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 2,502.4 అడుగులు దూరంలాగి 5 వ బహుమతి, నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు గ్రామానికి చెందిన బీరం సుబ్రమణ్యేశ్వరరెడ్డి, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన బాపతి కొండారెడ్డి కంబైన్డ్ డెడ్లు 2,342 అడుగుల దూరంలాగి 6 వ బహుమతి, వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,141.4 అడుగుల దూరంలాగి 7 వ బహుమతి, నంద్యాల జిల్లా పెద్దకోట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి ఎడ్లు 2,110.4 అడుగులతో 8 వ బహుమతి, నంద్యాల జిల్లా టి.హుసేనాపురం గ్రామానికి చెందిన ఎం. రామచంద్రారెడ్డి ఎడ్లు 2,042 అడుగులు దూరంలాగి 9 వ బహుమతి, కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామా నికి చెందిన అక్కినేని ముకుల్ సత్య చౌదరి ఎడ్లు 1,815 అడుగులు లాగి 10వ బహుమతి రూ. 14 వేలను గెలుచుకున్నాయి. ● అదేవిధంగా 11, 12, 13, 14, 15 జతలకు పోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ విభాగంలో 15 జతలు పాల్గొనగా నిర్వహించిన బలప్రదర్శనలో మొత్తం 8 విభాగాలలో 123 జతల ఎడ్లు పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, గొంటు సుమంత్రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బి. రామకృష్ణ, ఎం. రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, జె. రాజేష్రెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, దుర్గి శ్రీనివాసరావు వ్యవహరించారు. -
అప్రమత్తంగా ఉండాలి
ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండాలి. క్యాన్సర్ రాకుండా తాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారం తీసుకునేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. క్యాన్సర్ కణాలతో సలాడ్లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. పీచు పదార్థం ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు శారీరక వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా, పొగాకు నమలటం లాంటి దురలవాట్లకు దూరండా ఉండాలి. – డాక్టర్ కందుల రామ్, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు. -
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ
వినుకొండ: వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తూ పదోన్నతిపై ఆర్ఓగా వినుకొండలోనే విధులు నిర్వహిస్తు దర్శి అదనపు మున్సిపల్ కమిషనర్గా వ్యవహిస్తూ.. మహేష్ ఇటీవల అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయ్యారు. దీనిపై ఏసీబీ అధికారుల విచారణ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్తోపాటు మున్సిపల్ మేనేజర్లను ఆర్ఐ మహేష్కు సంబంధించి సర్వీసు వివరాలు తెలుసుకున్నారు. ఏసీబీ అధికారుల రాకతో మున్సిపల్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఏఎన్యూ(పెదకాకాని): రెగ్యులర్ బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో 2025లో జరిగిన బీఈడీ మూడో సెమిస్టర్కు 6534 మంది హాజరు కాగా వారిలో 5650 మంది ఉత్తీర్ణులయ్యారు. 86.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఈనెల 12వ తేదీలోగా రీవాల్యేషన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీవాల్యేషన్ దరఖాస్తులను పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 13వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రీవాల్యేషన్ ఫీజు రూ.1860 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు రూ.2190 గా నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలన్నారు. -
పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం
చీరాల: పంట కాలువలో మహిళ మృతదేహం సోమవారం చీరాలలో కలకలం రేగింది. పంట కాలువలో మహిళ మృతదేహం లభించడంతో స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. చీరాల మండలం ఈపూరుపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో తోటవారిపాలెం 216 హైవే పక్కన కాలువలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు వయస్సు 25–30 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మరణించి రెండు, మూడు రోజులు అయి ఉంటుందని, మృతురాలికి సంబంధించిన ఆధారాలేమీ లభించలేదన్నారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ ఎండీ మొయిన్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య, ఆత్మహత్య అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
రూ.కోటి అంచనా వ్యయంతో కొండవీడు ఉత్సవాలు
ఉత్సవాలపై సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: కోటి రూపాయల అంచనాతో కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలపై అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.75 లక్షలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన చిలకలూరిపేట పట్టణంలో 2కె రన్ ద్వారా ఉత్సవాలకు సంబంధించిన తొలి అంకానికి అడుగు వేయనున్నామన్నారు. దాదాపు 10 వేల మంది విద్యార్థులకు 7, 8 తేదీల్లో కొండపై వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. హెలీరైడ్, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నారు. హెలీరైడ్కి ఒక వ్యక్తికి రూ.3,500 ధర నిర్ణయించారు. ఉత్సవాల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి 110 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ను జాయింట్ కలెక్టర్ సంజన సింహతో కలిసి సందర్శించి కొందరి వద్ద నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్య విన్నారు. అనంతరం జేసీ సంజన సంహ, మూడు డివిజన్ల ఆర్డీఓలు రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం అర్జీలు 110 కాగా అందులో రెవెన్యూ క్లినిక్ ద్వారా 39 అర్జీలు ఉండగా వాటిలో గురజాల 13, సత్తెనపల్లి 9, నరసరావుపేట డివిజన్వి 17 ఉన్నాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా, సకాలంలో పరిష్కరించాలన్నారు. ఆయాశాఖల పరిధిలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని, అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలన్నారు. అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన మేడా రాములమ్మకు 2.5సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేసి కలెక్టరేట్లో ఆమె చేతికి పట్టా అందజేశారు. పింఛన్లు కావాలంటూ అర్జీలు అందజేసేందుకు వచ్చిన వారి వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి అర్జీ స్వీకరించి వారి సమస్య విన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డీఆర్డీఏ పేడీ ఝాన్సీరాణిలతో వారి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మా నాన్నకు మేము ముగ్గురం పిల్లలం. నా బాగోగులు నిమిత్తం గ్రామంలో మూడు ప్రదేశాల్లో ఉన్న 1.26 ఎకరాల వ్యవసాయ భూమి నా పేరున రిజిస్టర్ చేశారు. ఇంకా 66 సెంట్ల భూమి, మూడు సెంట్లలో ఉన్న ఇంటిని నా అన్న అనుభవిస్తున్నాడు. మా తండ్రి బాగోగులు చూడట్లేదంటూ నా తండ్రిని కొట్టి నాకు రాసిచ్చిన భూమి రిజిస్ట్రేషన్ను ఆర్డీఓచే రద్దు చేయించాడు. భూమిని ఆన్లైన్లో తండ్రి పేరుపై నమోదు చేయించి ఆ భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మా నాన్నను చూసేందుకు నాకెంటువంటి అభ్యంతరం లేదు. రద్దుచేసిన రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించి ఆ భూమిపై నాకు హక్కులు కల్పించండి. – అన్నదాసు నాగలక్ష్మి, బృగుబండ, సత్తెనపల్లి మండలం గ్రామంలో మా తాత ఆరు సెంట్ల పోరంబోకు స్థలం ఆక్రమించగా నా తండ్రి దానిలో దాబా కట్టాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం. నా సోదరుడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని తన పేరుపై రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ రద్దుచేసి నాకు భాగం కల్పించండి. – సయ్యద్ అబ్దుల్ సలామ్, దొడ్లేరు, క్రోసూరు మండలం ముఠా కూలీగా పనిచేసే నేను ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నా. నాకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పింఛన్ మంజూరు చేయండి. – వడియాల శివయ్య, సాతులూరు, నాదెండ్ల మండలం -
16,163 వ్యవసాయ క్షేత్రాల్లో భూసార పరీక్షలు
నరసరావుపేట రూరల్: జాతీయ సహాజ వ్యవసాయ మిషన్ కార్యక్రమంలో జిల్లాలోని 16,163 వ్యవసాయ క్షేత్రాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి భూసార పరీక్షలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం సోమవారం బృందావనం మీటింగ్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగ్గారావు మాట్లాడుతూ భూసార పరీక్షల ద్వారా రైతులు తమ భూములకు అనువైన పంటలు, భూమిలో సేంద్రీయ కర్భనస్థాయి సమాచారం లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి భూసార పరీక్షలకు అవసరమైన మట్టి నమూనాలను సేకరిస్తారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలో కర్భన శాతం ఎలా పెరుగుతుందో రైతులకు తెలుస్తుందన్నారు. కర్భన శాతం పెరగడం వలన పంటల్లో చీడపీడల ఉధృతి తగ్గి, భూమి ఉత్పాదక శక్తి పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రీసోర్స్ పర్సన్ మధుమోహన్, అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. కొల్లూరు: మద్యం తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొల్లూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా ఆవులవారిపాలేనికి చెందిన సనక రామకృష్ణ(40) కుటుంబం కొన్నేళ్ల క్రితం కొల్లూరు బోస్నగర్ సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద స్థిర పడింది. ఇటుకరాయి లోడింగ్ వంటి కూలి పనులు చేస్తున్న రామకృష్ణకు మద్యపానం అలవాటుంది. ఆదివారం కొల్లూరు లాక్ సెంటర్ ప్రాంతంలో మద్యం తాగి వినాయకుడి ఆలయం పక్క వీధిలోని సిమెంట్ రోడ్డుపై మత్తులో పడుకున్నాడు. గమనించిన స్థానికులు పక్కనే ఉన్న అరుగుపై పడుకోపెట్టారు. సోమవారం ఉదయం అతడిని లేపాలని ప్రయత్నించగా పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మృతుడి తల్లి, భార్య మృతదేహాన్ని ట్రాలీ ఆటోలో తమ గృహానికి తరలించారు. ఇటీవల ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వలసకూలీ మద్యం తాగి అపస్మారక స్థితిలో వంతెన పై నుంచి పడి మృతి చెందడం, తాజాగా సనక రామకృష్ణ మృతితో మందుబాబులలో ఆందోళన నెలకొంది. -
గోనుగుంట్ల నోరు అదుపులో పెట్టుకో!
సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీకి చెందిన దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ గోరా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై గోనుగుంట్ల కోటేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడిన మాటలు అత్యంత హేయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తూ నోటీసులు ఇచ్చినప్పుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు ఎవరి చెంచాగిరి చేస్తున్నాడని ప్రశ్నించారు. 21 రకాల వైకల్యాల ఉపకరణ తయారీ కేంద్రాలు మూసివేసిన చంద్రబాబుని నిలదీసే సత్తా, దమ్ము లేక వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులపై నోరు పారేసుకోవడం గోనుగుంట్లకే చెల్లిందన్నారు. టీడీపీ నేతలకు చెంచాగిరి చేసే గోనుగుంట్ల అంబటిపై విమర్శలు చేయడం హాస్యాస్పద మన్నారు. మరోసారి నోరుజారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దివ్యాంగులే నీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల
రెంటచింతల: పునీతురాలైన కన్యమరియ తన కుమారుడైన ప్రభువైన ఏసుక్రీస్తును సమస్త మానవాళి రక్షణ నిమిత్తం లోకానికి ఇచ్చిందని నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు, అభిషిక్త గురువులు మహా ఘన డాక్టర్ కరణం దమన్ కుమార్ అన్నారు. రెంటచింతలలోని ప్రఖ్యాత కానుకమాత చర్చిలో సోమవారం కానుకమాత చర్చి 176వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్థానిక విచారణ గురువులు రెవ.ఫాదర్ ఏరువ లూర్ధుమర్రెడ్డి నేతృత్వంలో రెవ.ఫాదర్ ఏరువ బాల శౌర్రెడ్డి, రెవ.ఫాదర్ కాసు జోజిరెడ్డిలతో కలిసి కానుకమాత చర్చి 176వ వార్షిక తిరునాళ్ల మహోత్సవ సమష్టి దివ్య బలిపూజలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలో నెలకొన్న అశాంతి తొలిగి పోవాలంటే క్రీస్తు ప్రభువు సూక్తులను ఆచరిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. ప్రభువును ప్రేమించే విషయంలో, ఇతరులకు సేవ చేసే విషయంలో పల్నాటి పౌరుషం చూపాలన్నారు. ఇరుగు పొరుగు వారిని దయాహృదయంతో ఆదుకోవాలన్నారు. దివ్యాపూజాబలి సమర్పించిన నల్గొండ మేత్రాసన పీఠాధిపతి మహా ఘన డాక్టర్ కరణం దమన్కుమార్ -
పల్నాడు
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అంగన్వాడీ కేంద్రాలపై టీడీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3400, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 54.90 టీఎంసీలు.7సత్తెనపల్లి: మాతా శిశు సంరక్షణే లక్ష్యంగా నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు చంద్రబాబు సర్కార్లో డీలా పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లల పౌష్టికాహారాన్ని కేటాయించాల్సిన నిధుల పెంపు విషయంలో చర్యలు తీసుకోక పోవడంతో వీటి ఆశయం నెరవేరడం లేదు. బాల్యం నుంచే చిన్నారులకు చదువు వైపు ఆసక్తి కలిగించేందుకు బాల్యంలో సరైన పోషకాహారం అందించేందుకు ఉద్దేశించి ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ పాలనలో పోషకాహారం భారంగా మారింది. టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. నిధులు పెంచకపోవడంతో... అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కార్యకర్తలకు భారంగా మారింది. నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టు చంద్రబాబు సర్కార్ నిధులు కేటాయించలేదు. రోజువారీ మెనూ ఇలా... సోమవారం – దోసకాయ పప్పు మంగళ – టమాటా పప్పు బుధ – ఆకుకూర పప్పు గురు – కూరగాయలతో సాంబారు శుక్ర – బీరకాయ లేదా సొరకాయ పప్పు శని – వెజిటబుల్ బాత్ రైస్ జిల్లా సమాచారం జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు : 09 అంగన్వాడీ కేంద్రాల సంఖ్య : 2,031 గర్భిణులు : 8,987 బాలింతలు : 10,073 ఆరేళ్లలోపు చిన్నారులు : 1,02,039 -
ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ (ఏపీయూఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం గుంటూరు పట్టాభిపురం హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర మహిళా కన్వీనర్ పమిడి పద్మ మాట్లాడుతూ 1982లో ఆవిర్భవించిన ఏపీయూఎస్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి మన్నవ సురేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, బాలచంద్రారెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి వైఆర్కే ప్రసాద్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షడు వీరబాబు పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానులు లెక్కించారు. రూ.18, 83,646 ఆదాయం వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టరు సి.హెచ్. వెంకట శ్రీనివాసులు, దేవాలయ ధర్మకర్త డి.రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి కె.సునీల్ కుమార్ తెలిపారు. నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ళ అత్యంత వైభవంగా సాగింది. లక్ష మంది పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా. ఈ మేరకు సోమవారం దేవదాయశాఖ, ధర్మకర్త, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ ద్వారా వచ్చిన విరాళాలు, కొబ్బరికాయ వేలం ద్వారా వచ్చిన రాబడిని లెక్కించారు. హుండీ ద్వారా 5 లక్షల 64 వేల రూపాయలు, కొబ్బరి చిప్పలు తలనీలాల వేలంపాట ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు ఆదాయం లభించినట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మంజూష, ఈవో శివనాగిరెడ్డి, సుధాకర్రెడ్డి, నెమలిరెడ్డి, లక్ష్మయ్య, సుబ్బారెడ్డి, ఎ.వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్తంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 542.80 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ఎస్ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 18,375 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. -
అంతర్ జిల్లాల గేదెల దొంగలు అరెస్ట్
బెల్లంకొండ: వివిధ జిల్లాల్లో గేదెలను దొంగతనం చేసి, విక్రయిస్తున్న దొంగల ముఠాను గుర్తించి అరెస్టు చేసినట్లు పెదకూరపాడు సీఐ పి.సురేష్ తెలిపారు. సోమవారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అద్దంకి, రావులపాలెం, ఫిరంగిపురం, బెల్లంకొండ ప్రాంతాలలో గేదెలను దొంగతనం చేసే పిడుగురాళ్లకు చెందిన కుంచపు దుర్గాప్రసాద్, కోనంకికి చెందిన పెద్దిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, బండారు వెంకట్రావుతో పాటు మరో ఇద్దరిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు వివిధ ప్రాంతాలలో గేదెలను దొంగతనం చేసి ఈనెల ఒకటిన విక్రయించేందుకు టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద స్థానిక ఎస్ఐ పి.గోపి గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. కుంచపు దుర్గాప్రసాద్ గతంలో పశువుల దొంగతనం, ఇళ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి 25 కేసుల్లో అరెస్టయి బెయిల్ పై తిరుగుతూ, మళ్లీ గేదెల దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద సుమారుగా రూ.3.50 లక్షల విలువ గల తొమ్మిది గేదెలను, ఏపీ39 వీబీ5004 నంబర్ గల వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. వీరిపై పలు కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. సీఐ వెంట బెల్లంకొండ ఎస్ఐ గోపి, సిబ్బంది వెంకటరావు, మల్లికార్జునరావు, షణ్ముఖరావు, ఎల్.వెంకటేశ్వరరావు, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరావు, కోటి ఉన్నారు. -
పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ మేరకు బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఆయన ఆలకించారు. సంబంధిత సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మొబైల్ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్స్టేషన్ అధికారి పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కరించాక బాధితులకు తెలియజేయాలని చెప్పారు. ఫిర్యాదిదారుల అనుమతుల్లేకుండా ఏ ఫిర్యాదు ఆన్లైన్లో మూసివేయద్దని సూచించారు. 170 ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్)లు ఫిర్యాదులు స్వీకరించారు. గుంటూరులో 1960లో శాంతి ఆర్ట్స్ పేరుతో ప్రింటింగ్ యూనిట్ను మా తండ్రి పీఎం జైన్ ప్రారంభించారు. వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించాం. 1987లో రెడ్డిపాలెంలో సొంత ఫ్యాక్టరీ నెలకొల్పాం. అనేక ఉత్తమ జాతీయ, అంతర్జాతీయ అవార్డులను స్వీకరించాం. కొన్ని పరిస్థితుల దృష్ట్యా విక్రయించాం. అయితే యాజమాని మళ్లీ మాకే అద్దెకిచ్చారు. 2017 వరకు అక్కడే వ్యాపారం నిర్విర్తించాం. ఆ తర్వాత ఓబులునాయుడుపాలెంకు వెళ్లాం. దీంతో రెడ్డిపాలెంలోని గౌడెన్ను వేరే వారికి అద్దెకిచ్చారు. అయితే వారు మా సంస్థ పేరుతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. న్యాయం చేయగలరు. – విక్రమ్ జైన్, అరండల్పేట సుమారు 14 ఏళ్ల క్రితం మా పెద్దమ్మాయికి పెళ్లయింది. ఏడాది లోపు అనారోగ్యంతో అల్లుడు మృతిచెందాడు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే గతేడాది ప్రైవేటు ఉద్యోగం నిమిత్తం నా కుమార్తె ఊరెళ్లింది. దీంతో మనవడు నా వద్దనే ఉంటున్నాడు. ఉద్యోగం నిమిత్తం వెళ్లిపోయిన కుమార్తె ఊర్లోనే ఉంటుందని తెలిసి, మనవడితో కలిసి అక్కడికెళ్లాం. అయితే ఆమె ఓ పెద్దాయన్ని పెళ్లి చేసుకుందని గుర్తించాం. ప్రస్తుతం మనవడు పెదనందిపాడులో చదుతున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల నా మనవడు వాళ్ల అమ్మ వద్దకెళ్లినా పట్టించుకోలేదు. ప్రతి రోజు తల్లి కావాలని అడుగుతున్నాడు. వాడిని ఏమని సముదాయించను.. పోలీసులు జోక్యం చేసుకుని, నా మనవడు తల్లితో కలిసి ఉండేలా ఏర్పాటు చేయగలరు. – వృద్ధురాలు, వరగాని, పెదనందిపాడు -
అర్ధాకలి చదువులు
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారం కరువైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్, అదనపు తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకుని, సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో చదువుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 32,276 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు పయనం పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే వస్తున్న విద్యార్థులు సాయంత్రం వరకు చదువులో నిమగ్నమై ఉంటున్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో నిర్భంధంగా అమలు చేస్తోంది. -
గ్రామస్థాయి నుంచి రైతులు ఉద్యమించాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం తొలగిపోవాలంటే రైతులు గ్రామస్థాయి నుంచి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిలభారత కిసాన్ సభ ఫైనాన్స్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం రాత్రి ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు అధ్యక్షతన ‘కార్పొరేట్ వ్యవసాయం – రైతాంగం పై ప్రభావం’ అనే అంశంపై జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏ పంట వెయ్యాలో రైతులకు కార్పొరేట్లే దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంట పండించడం వల్ల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇందుకు గుంటూరులో గత రెండేళ్ల కాలంలో మిర్చి ధరల హెచ్చుతగ్గులే నిదర్శనం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు రావాలన్నారు. ‘కేంద్ర బహుళ సహకార చట్టం – రైతాంగం పై ప్రభావం’ అనే అంశంపై రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకుడు వై. కేశవరావు, ‘వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి –సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకత’ అనే అంశంపై ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్ తదితరులు ప్రసంగించారు. ఏఐకేఎస్ ఫైనాన్స్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ -
ప్రతిభావంతులు సమాజాభివృద్ధికి తోడ్పడాలి
కొరిటెపాడు(గుంటూరు):దాతల సహకారంతో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నాక సమాజాభివృద్ధికి తమవంతు తోడ్పా టు అందించాలని తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం గుంటూరు నగరం ఆర్.అగ్రహారంలోని రామనామ క్షేత్రం ప్రాంగణంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం రామచంద్ర ప్రభు, ట్రస్టు సభ్యుల చేతుల మీదుగా జరిగింది. 270 మంది విద్యార్థులకు రూ.12,12,500 చెక్కుల రూపంలో ఉపకార వేతనాలను అందజేశారు. రామచంద్ర ప్రభు మాట్లాడుతూ 1995–96లో ఇద్దరు విద్యార్థులతో మొదలుపెట్టి నేటికి సుమారు 40 వేల మంది విద్యార్థులకు రూ.23 కోట్లు ఉపకార వేతనాలుగా ట్రస్టు ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు. దీనికి మేజర్ కాంట్రిబ్యూషన్ తులసి సీడ్స్ సమకూరుస్తుందని, దీంతోపాటు నగరంలోని కొంతమంది సమాజ హితం కోరే పెద్దలు ఈ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టులో సభ్యులుగా చేరి సహాయసహకారాలు అందిస్తున్నా రని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు తులసి రామచంద్ర ప్రభును సత్కరించారు. కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, ట్రస్ట్ సభ్యులు నారదాసు శ్రీహరిరావు, తిమ్మిశెట్టి నారాయణరావు, పసుపులేటి రమణయ్య, అంకిరెడ్డి సాంబశివరావు, నారదాసు కోటేశ్వరరావు, పుచ్చకాయల ఆనంద్, కనదం నరేంద్రనాథ్, దళవాయి సుబ్రమణ్యం, మిరియాల శ్రీనివాస్ పాల్గొన్నారు. తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు 270 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ -
నేటి నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు
నాదెండ్ల: నాదెండ్లలోని నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి ఈనెల 6వ తేది వరకూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రెండు పళ్ల విభాగం, 3న ఉదయం నా లుగు పళ్ల విభాగం, సాయంత్రం ఆరు పళ్ల విభాగం, 4న ఉదయం న్యూకేటగిరి, సాయంత్రం నుండి 5వ తేదీ వరకూ జూనియర్స్ విభాగంలో, 6న సీనియర్స్ విభాగంలో జరగనున్నాయి. అనౌన్సర్లుగా గూడా శ్రీనివాసరావు, తంగేడు హు స్సేన్ వ్యవహరించనున్నారు. ఏడు విభాగాల్లో రూ.12.12 లక్షల నగదు బహుమతితోపాటూ షీల్డ్లను విజేతలకు అందించనున్నారు. వివరాలకు 9399925522, 9989618760, 949285 6290 నంబర్ల నందు సంప్రదించాలని కోరారు.ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్ నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కాగా, జనరల్ విద్యార్థుల ప్రాక్టికల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 79 పరీక్ష కేంద్రాలలో ఆదివారం ఉదయం 2,535 మంది ఒకేషనల్, జనరల్ విద్యార్థులకు గాను 2,421మంది హాజరు కాగా 114మంది గైర్హాజరైనట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. మధ్యాహ్నం 1,852 మందికి గాను 1,765మంది హాజరయ్యాని, మరో 87మంది గైర్హాజరు కాగా ఒకరు సప్లీ పరీక్షకు హాజరైనట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వాటిని బోర్డుకు అనుసంధానం చేయటంతో పరీక్షల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్ ఏపీటీఎఫ్ నేతలు గుంటూరుఎడ్యుకేషన్: పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపర్చిందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్ ఓప్రకటనలో తెలిపారు. పెరుగు తున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలతో ఆదాయపు పన్ను పరిధి పెంచుతారని ఆశించిన మధ్యతరగతి, వేతన జీవులకు ఈ బడ్జెట్ పెద్ద షాక్ ఇచ్చిందన్నారు. పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పు చేయకపోవడం, స్టాండర్డ్ డిడక్షన్ను పెంచకపోవడం వలన వేతన జీవులపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘ ఊసే లేకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. విద్యారంగానికి బడ్జెట్లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వడం మినహా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిధులు కరువయ్యాయని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ కలిగిందని ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు విమర్శించారు. గంజాయి దాడులను ప్రభుత్వాలు కట్టడి చేయాలి తాడేపల్లిరూరల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజా యి దాడులు ఎక్కువయ్యాయని.. ఇద్దరు ముఖ్యమంత్రులు గంజాయిని నివారించి అమాయక ప్రజలు, ఉద్యోగులపై దాడులు జరగకుండా కా పాడాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలో ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య స్మగ్లర్ల దాడిలో మరణించిందని తెలిపారు. సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినట్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పెంచలయ్యను గంజాయి స్మగ్లర్ దాడి చేసి హత్య గురికాగా ప్రభుత్వం పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు కనీసం పరామర్శించలేదన్నారు. -
పచ్చ మూకల విధ్వంసం
వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి ఇంటిపై, కార్యాలయంపై వేలాదిగా వచ్చిన టీడీపీ మూకలు పక్కా వ్యూహంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, మహిళలపై కూడా వారు దాడి చేశారు. దీంతో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. – లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)అంబటి ఇంటిపై , కార్యాలయంపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నా. టీడీపీ గూండాలు మమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడి చేయడంతో కింద పడిపోయాం. అక్కడే ఉన్న తోటి పార్టీ శ్రేణుల సహాయంతో వారి బారి నుంచి బయట పడ్డాం. ఇంతటి రాక్షసంగా వ్యవహరిస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించడం చాలా బాధగా ఉంది. – భాగ్యలక్ష్మి, త్రివేణి అంబటి ఇంటి వద్దకు పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నాను. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో, ఇనుప రాడ్లతో టీడీపీ గూండాలు అంబటి కార్యాలయంలోకి చొరబడ్డారు. అడ్డుగా ఉన్న నాపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. వారి నుంచి తప్పించుకుని రాత్రి 11.45 గంటల వరకు అంబటి రాంబాబు కార్యాలయంలో తలదాచుకున్నాను. నేను పల్నాడు జిల్లా నుంచి వచ్చి గుంటూరు పట్టాభిపురంలో నివాసం ఉంటున్నాను. – గుంజి శివ, పల్నాడు జిల్లా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని నాతోపాటు మా నాన్న, ప్రస్తుత వైఎస్సార్ సీపీ కో ఆప్షన్ సభ్యుడు పూనూరి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మెటి శ్రీను, మరికొంత మందితో వెళ్లాం. అక్కడ ఉన్న టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. నాపై చేతులతో, కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు జీజీహెచ్కు తరలించారు. – పూనూరి చంద్ర ప్రకాష్ -
కరుణ చూపే కానుకమాత
రెంటచింతల: ప్రేమను వర్షించే ఆధ్యాత్మిక కేంద్రం కానుకమాత దేవాలయం. ఆలయంలో అడుగు పెట్టగానే చలువరాయి చల్లదనమే కాదు...కానుకమాత కరుణా కటాక్షాల వీక్షణాలు కూడా ప్రసరిస్తాయి. క్రీస్తు శిలువ వేసే సమయంలో పడిన పాట్లను గుర్తుచేసే 14 స్థలాలు ఇక్కడ భక్తులలో ప్రేమ, శాంతి, కరుణ, సహనం నింపుతాయి. రాష్ట్రంలోనే దాదాపు 5వేల మంది భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునే సౌకర్యం ఉన్న అతిపెద్ద చలువరాతి క్రీస్తు దేవాలయం 1982 సంవత్సరంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇంతపెద్ద ఆలయం కేవలం రెండు ఫిల్లర్ల ఆధారంగా నిర్మించడం మరో విశేషం. ఈ దేవాలయాన్ని 2025 సంవత్సరంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఎంతో అద్భుతంగా విచారణ గురవులు గ్రామ సంఘస్తుల సహకారంతో పున:నిర్మాణం చేపట్టారు. కనుల పండువగా తిరునాళ్లు రెంటచింతల గ్రామంలో పలు సామాజిక వర్గాలకు చెందిన సుమారు 1200కి పైగా కుటుంబాలు క్రైస్తవ్యాన్ని విశ్వసిస్తున్నాయి. ఆలయంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఆధ్యాత్మిక భావన తొణికసలాడుతూ ఉంటుంది. ఫాదర్ జోసఫ్ గ్రాండ్ నుంచి ఫాదర్ ఏరువ లూర్ధు మర్రెడ్డి వరకు 19 మంది విచారణ గురువులు ఇక్కడ క్రీస్తు బోధనలు చేస్తూ సేవలను అందిస్తున్నారు. ప్రతి ఏటా కానుకమాత దేవాలయంలో జనవరి 24న జెండా ప్రతిష్టతో ప్రారంభమై ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయి. ఫిబ్రవరి 2న కానుకమాత తిరునాళ్ల మహోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న గ్రామానికి చెందిన వారితోపాటు వారి బంధుమిత్రులు ఈ తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొంటారు. నేటి కార్యక్రమాలు మంగళవారం ఉదయం 5 గంటలకు విచారణ గురువులు ఏరువ లూర్ధు మర్రెడ్డి, సహాయ గురువులు ప్రసన్నకుమార్ మొదటి దివ్యపూజాబలి, ఉదయం 9.30 గంటలకు నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు, అభిషిక్త గురువులు మహా ఘన డాక్టర్ కరణం దమన్కుమార్చే పండుగ పవిత్ర సమష్టి మహోత్సవ దివ్యపూజాబలి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి అన్నీ మతస్తులవారు కానుక మాత, యేసుక్రీస్తు దీవెనలు పొంది కొవ్వొత్తులు సమర్పించి తమ జీవితాలలోను కొత్త వెలుగును నింపాలని మనసారా ప్రార్థిస్తారు. కోలాట ప్రదర్శన ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి... కానుకమాత చర్చి తిరునాళ్ల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విచారణ గురువులు రె.ఫాదర్ ఏరువ లూర్ధు మర్రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుంచి క్రైస్తవ గురువులు, మఠకన్యలు ఆదివారం సాయంత్రానికి ఇక్కడకు చేరుకుంటారు. నేడు కానుకమాత దేవాలయ తిరునాళ్ల రాష్ట్రంలోనే అతి పెద్ద చర్చి -
అంబటి రాంబాబుకు ప్రాణహాని
పిడుగురాళ్ల: కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రాణ హాని ఉందని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. ఆదివారం విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఆయన మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పూర్తిగా విఫలమైందని, ఇవి కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి, అక్రమ అరెస్టు దుర్మార్గమన్నారు. ఆనాడు ప్రశ్నించినందుకు విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహన్రంగాని చంపించింది చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. ఒకరి నాయకుల ఫ్లెక్సీలు మరోక నాయకులు వేసే సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వేరే పార్టీ వాళ్ల ఫ్లెక్సీలు హేళన చేస్తూ వేయటం చంద్రబాబునాయుడు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. దీని మీద అంబటి రాంబాబు ప్రశ్నిస్తే చంపటానికి వెళ్లారని, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్రెడ్డిని అయ్యన్నపాత్రుడు, పట్టాభి, చివరికి చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎన్ని బూతులు మాట్లాడలేదు, ఇప్పుడు ఏదో సత్యహరిచంద్రుల్లా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్రెడ్డి గురించి మాట్లాడ లేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిని సోనియాగాంధితో కలిసి జైలులో పెట్టించింది చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం చివరికి మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోతుందన్నారు. అంబటి రాంబాబుకి బయట రక్షణ లేదని, ఇప్పుడు అరెస్టు చేసి జైలుకి తీసుకెళ్లారని, జైల్లో కూడా రక్షణ ఉంటుందో లేదో అని ఆందోళనగా ఉందన్నారు. రాజకీయాల్లో నేతలు ఒకరిపై ఒకరు బూతులు, అనుచిత వ్యాఖ్యలు చేయ డం సరికాదని, చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లే కారణమని పేర్కొన్నారు. ప్రజల దృష్టి ని మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి దాడులు చేస్తున్నారని, దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయబోతుందని తెలిపారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
కోటప్పకొండలో భక్తుల రద్దీ
నరసరావుపేట రూరల్: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షణలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
చంద్రబాబు పాలనతో రాష్ట్రం రావణకాష్టం
నరసరావుపేట: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రావణకాష్టంలా తయారైందని, ఆటవిక రాజ్యం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండించారు. తిరుపతి–తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతోందన్నారు. గుంటూరులో అంబటిపై దాడి పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యమే అన్నారు. మనం పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. పార్టీ పిలుపు మేరకు తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారానికి సంబంధించి దేవాలయంలో పూజ ముగించుకొని వస్తుండగా కారుపై టీడీపీ నాయకులు దాడి చేసి రెచ్చగొట్టేలా మాట్లాడటంతో అంబటి భావోద్వేగానికి లోనై కొన్ని మాటలు మాట్లాడారని పేర్కొన్నారు. చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పారన్నారు. అయినప్పటికీ టీడీపీ నాయకులు పలు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి కర్రలు, ఇనుపరాడ్లతో ఆయన ఇంటిపై దాడికి పాల్పడటం హేయమన్నారు. ఇల్లు, కారును కూడా తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారని తెలిపారు. ఇంట్లోని మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇంటిపై దాడి చేసి దారుణానికి వడిగట్టారని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని బాధ్యతయుతమైన పదవిలో ఉండి కూడా ఉద్రిక్తతలు పెంచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. అంబటి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వారికి ఏదైనా జరిగితే టీడీపీ, లోకేష్ బాధ్యత వహించాలని డాక్టర్ గోపిరెడ్డి హెచ్చరించారు. వినుకొండ, చిలకలూరిపేట ప్రాంతాల్లో కూడా బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజినిపై ఇటువంటి దాడులు జరిగాయని చెప్పారు. పార్టీ యావత్తు అంబటి రాంబాబుకు సంఘీభావంగా నిలబడుతుందని తెలియజేశారు. ఈ దాడిలో స్థానిక ఎమ్మెల్యే, ఆయన భర్త కూడా స్వయంగా పాల్గొనడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ట్యాంకర్ను ఢీకొన్న లారీ
యడ్లపాడు: అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మండలంలోని తిమ్మాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే సెంట్రల్ డివైడర్ మొక్కలకు నీరు పోస్తున్న మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి విజయవాడ వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ, తిమ్మాపురం 16వ నంబర్ జాతీయరహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే అదుపు తప్పింది. ఆ సమయంలో రహదారి డివైడర్పై ఉన్న మొక్కలకు హైవే సిబ్బంది ట్యాంకర్తో నీరు పోస్తున్నారు. వేగం నియంత్రణ కాక ట్యాంకర్ను లారీ వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మొక్కలకు నీరు పోస్తున్న హైవే ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికురాలు బాసర నాగమ్మ(36)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ట్యాంకర్ను ఢీకొన్న అనంతరం లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని పసిగట్టిన లారీలోని ఇద్దరు కిందకు దూకారు. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలో లారీలోని డ్రైవింగ్ సీట్లోనే ఉన్న తమిళనాడుకు చెందిన డ్రైవర్ కేబిన్లో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కేబినన్లో చిక్కుకున్న డ్రైవర్ను చాకచక్యంగా వెలికితీశారు. డ్రైవర్ కాలికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నాగమ్మ మృతదేహాన్ని చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలు ఏడాది కిందట కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం తాలూకా బాటికేరెక్క గౌట్ గ్రామ నుంచి కుటుంబంతో వలస వచ్చి హైవే క్యాంపులో ఉంటూ రోజువారీ కూలీలుగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హైవే పనులు చేస్తున్న మహిళా కూలీ మృతి మృతురాలు కర్ణాటక వాసి -
నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి
పెదకూరపాడు: మూగజీవాలకు మేత కోసం వెళ్లి....నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బలుసుపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పెదకూరపాడు ఎస్ఐ గిరిబాబు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బలుసుపాడు గ్రామంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో గేదెలకు మేత కోసం వెళ్లి నీటి కుంటలో పడి ఎస్సీ కాలనీకి చెందిన గంజిమాల బాబురావు (62) మృతి చెందాడు. గ్రామ శివారులో మేత కోస్తుండగా నీటి కుంటలో పడ్డాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా నీటి కుంటలో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సహాయంతో బాబురావు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. బాబురావు మనవడు గంజి మాల విజయబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గిరిబాబు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. శవ పంచనామా నిర్వహించి అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో ఏడు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో ఆవిర్భవించిన ఏఐ – జాక్టో ఆధ్వర్యంలో ఈనెల 5న చేపడుతున్న మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,04,125 ఉండగా, మన రాష్ట్రంలో 12,912 ఏకోపాధ్యాయ పాఠశాలలతో దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. బోధన కోసమే నియమించబడిన ఉపాధ్యాయులతో బోధనేతర కార్యక్రమాల భారం పెంచటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకుమాను జోజప్ప, ఎం.శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యాంబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
అదనపు భారం తగ్గించుకునేందుకు తిప్పలు
సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలపై బాదుడు కొనసాగుతూనే ఉంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా భూముల విలువ పెంపునకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చార్జీలను రెండోసారి భారీగా సర్కార్ పెంచింది. పట్టణాలు, పట్టణ శివారు ప్రాంతాలే కాదు .. గ్రామాల్లోనూ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అదనపు భారం ఉంది. పెంచిన చార్జీలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు కసరత్తు చేశారు. జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విలువ స్థిరాస్తి ఉన్న ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 30 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది రూ. 382 కోట్లు ఈ కార్యాలయాల నుంచి ఆదాయం సమకూరింది. ఈ ఏడాదికి రూ.510 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని మరింత పెంచేలా తాజా మార్పులు ఉన్నాయి. మరోవైపు అదనపు భారం తగ్గించుకునేందుకు క్రయవిక్రయదారులు గడువు పెంపునకు ముందు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావడంతో కిటకిటలాడాయి. నిత్యం 200– 300 వరకు రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా జరిగేవి. గడువుకు రెండు రోజుల ముందు శుక్రవారం దాదాపు రెట్టింపు సంఖ్యలో జరిగాయి. గతంలో కొనుగోలు చేసుకుని అగ్రిమెంట్ల మీద ఉన్న వారు వీరిలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చార్జీల పెంపునకు ముందు రోజు రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట -
హోరాహోరీగా ఒంగోలు ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. జూనియర్ విభాగంలో నిర్వహించిన 20 నిమిషాల ప్రదర్శనలో అనంతపురం జిల్లా క్రాయపేటకు చెందిన ఎద్దుల రవీంద్రారెడ్డి ఎడ్ల జత 2,908.08 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి కై వసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన బుర్రముక్కు కౌసల్యారెడ్డి ఎడ్ల జత 2,573.07 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి దక్కించుకున్నాయి. బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 2,450 అడుగుల దూరంలాగి 3వ బహుమతి కై వసం చేసుకున్నాయి. పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామానికి చెందిన యర్రసాని సుబ్బ య్య ఎడ్ల జత 2,428.11 అడుగుల దూరంలాగి 4వ బహుమతి, గుంటూరు జిల్లా కొండపాటూరుకు చెందిన పోతిన లక్షిత్చౌదరి ఎడ్ల జత 2,230.02 అడుగుల దూరం లాగి 5వ బహుమతి, కృష్ణా జిల్లా నాదెండ్లవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల సురేష్బాబు ఎడ్ల జత 2,141.07 అడుగులు దూరంలాగి 6వ బహుమతి దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన బుర్రముక్కు కౌసల్యారెడ్డి ఎడ్ల జత 1,908.5 అడుగుల దూరం లాగి 7వ బహుమతి, పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన నీలం త్రివేణి నాయుడు ఎడ్ల జత 1,544.8 అడుగులు దూరంలాగి 8వ బహుమతి దక్కించుకున్నాయి. కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్కు చెందిన విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు ఎడ్ల జత 1,506 అడుగులు దూరంలాగి 9వ బహుమతి గెలుచుకున్నాయి. బలప్రదర్శనలో మొత్తం 11 జతలు పాల్గొనగా మిగిలిన 2 జతలకు కూడా ప్రోత్సహక బహుమతులు అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, గొంటు సుమంత్రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, డి.రామకృష్ణ, జడ్డు రాజేష్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, ఎం.చిన్నశౌర్రెడ్డి, కె.జోసఫ్రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ.ఇన్నారెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు. ప్రథమ స్థానం కై వసం చేసుకున్న అనంతపురం జిల్లా ఎడ్ల జత -
నృసింహుని తెప్పోత్సవం
కనుల పండువగా తాడేపల్లి రూరల్ : మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం ఆదివారం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున లక్ష్మీ నరసింహస్వామి వారిని సీతానగరంలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉత్సవ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి యున్న కనకదుర్గ ఆలయం నుంచి నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నృసింహస్వామి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా అలంకరించిన పంటు వాహనంలో స్వామివారిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక భద్రతా చర్యల మధ్య ఇ.వో. సునీల్కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
లలితాంబకు కుంకుమ పూజలు
మాచర్ల: స్థానిక సాయిబాబా ఆలయలోని లలితాంబ అమ్మవారి 9వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. మహిళలు కుంకుమ పూజలు జరిపారు. పొన్నూరు: అఖిల విశ్వ గాయత్రీ పరివార్ పొన్నూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాక్షి భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం 24 కుండముల గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గాయత్రీ మహా యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల గాయత్రి పరివార్ సంఘ ప్రధాన్ డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఆధ్యాత్మికతను కులమతాలకతీతంగా విశ్వవ్యాప్తి చేయడమే గాయత్రి పరివార్ ముఖ్య లక్ష్యమని చెప్పారు. గాయత్రి మహామంత్రం జపిస్తే గాయత్రీ మాత అనుగ్రహాన్ని పొందవచ్చని చెప్పారు. పరివార్ సభ్యులు దమ్మాల వెంకటేశ్వర్లు, పులిపాటి శ్రీనివాసరావు, పులిపాటి భవాని శంకర్, నారాకోడూరు గాయత్రి పీఠం నిర్వాహకులు చుండూరు వెంకట చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. చేబ్రోలు: చారిత్రక ప్రసిద్ధి చెందిన చేబ్రోలులోని భూ నీలా సమేత ఆదికేశవ స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి పున్నమి గరుడ సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం శ్రీధర్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. మాఘపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడ సేవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదికేశవ స్వామికి ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక పట్టాభిపురం సత్యనారాయణస్వామి ఆలయ 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రమాసమేత సత్యనారాయణ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మూల విరాట్కు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరగ్గా, ఆంజనేయస్వామికి మన్య సూక్తంతో అభిషేకం, సిందూరార్చన చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై రమా సమేత సత్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు రథోత్సవం పురవీధుల్లో నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, నామ సంకీర్తన బృందాలు, దేవత వేషధారణలో కళాకారులు, విద్యుత్ దీప కాంతుల నడుమ నగరోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామికి ఊంజల్ సేవ చేపట్టారు. ప్రముఖ సంగీత విధ్వంసరాలు శ్రోతాస్విని (బెంగళూరు) నిర్వహించిన స్వరార్చన అలరించింది. ఆలయ కమిటీ చైర్మన్ చావలి గణపతి, ఉత్సవ కమిటీ కన్వీనర్ రాయపాటి సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. -
పిడుగురాళ్లలో ఖాకీచకం!
పిడుగురాళ్ల రూరల్: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మాబును పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో మాబు తన టైర్ల దుకాణంలో ఉండగా పిడుగురాళ్ల పట్టణ ఎస్ఐ మోహన్ తన సిబ్బందితో కలిసి మఫ్టీలో వచ్చి మాబును స్టేషన్కు రావాలని పిలవగా ఎందుకు రావాలని.. తనపై ఎవరు, ఏం కేసు పెట్టారని, వారెంట్ చూపించాలని కోరాడు. తమ మా వెంట వస్తే పద్ధతిగా ఉంటుందని చెప్పి పోలీసులు మాబుని లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎంతసేపటికీ మాబు రాకపోవటంతో పోలీసులు అందరు చూస్తుండగానే మాబుపై దాడికి దిగారు. వెంటనే మాబు వాళ్ల అన్న షేక్ నన్నె సైదా మా తమ్ముడిని ఎందుకు తీసుకొని వెళ్తు న్నారని పోలీసులను ప్రశ్నించగా నిన్ను కూడా లోపల వేస్తాం, అప్పుడు తెలుస్తుంది.. ఎందుకు తీసుకొని వెళ్తున్నామో అని అన్నదమ్ములను బలవంతంగా అక్కడే ఉన్న సీఐ కారులోకి ఎక్కించారు. బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి మాబు, మాబు వాళ్ల అన్న నన్నె సైదాను పోలీసులు తీసుకొని వెళ్లారు. వెంటనే మాబు తమ్ముడు జానీ సీఐకి ఫోన్ చేసి మా అన్నలను ఎందుకు అరెస్టు చేశారని ఫోన్లో వివరాలు అడగ్గా.. మీ అన్నయ్యలను అక్కడే దించామని వివరాలు చెప్పకుండా ఫోన్ పెట్టాశాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు ‘సాక్షి’ సీఐ, ఎస్ఐలకు ఫోన్ చేయగా.. స్పందించలేదు. హైకోర్టులో హెబియస్కార్పస్ పిటిషన్.. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాబు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తమ పార్టీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మాబు, అతని సోదరుడు నన్నె సైదాలను పోలీసులు మఫ్టీలో వచ్చి కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్లారని, వారు ఏమయ్యారో తెలియజేయాలని హైకోర్టులో హెబియస్కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు. -
ప్రశ్నిస్తే చంపేస్తారా?
టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే చంపేస్తారా? టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ విచారణలో వెల్లడిస్తే టీడీపీ నాయకుల తీరు దారుణం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తే ఇంత దారుణంగా దాడులు చేస్తారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా? అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గతంలో వంగవీటి మోహన రంగను ఏ విధంగా పొట్టన పెట్టుకుందో... ఆ విధంగా అంబటి రాంబాబును చేయాలనే ఆలోచనతో ఉంది. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – కాసు మహేష్ రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే -
తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్గా శ్రీనివాస్
తెనాలి: తెనాలి ఇన్ఛార్జి సబ్కలెక్టర్గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ బాధ్య తలు చేపట్టారు. తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహ పదోన్నతిపై బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఆమె పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతు చేపట్టారు. దీనితో ఇన్ఛార్జి సబ్కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. క్వారీ తిరునాళ్లపై సమీక్ష స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం క్వారీలో గల శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్స్థాయి కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డివిజనులోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ ఈవో హాజరయ్యారు. ఇన్చార్జి సబ్కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే తిరునాళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. మరోసారి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్తో కో–ఆర్డినేషన్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. -
అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరావతి: అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్ శనివారం దర్శించుకున్నారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీ అమ్మవారికి జస్టిస్ గీతామిట్టల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వేంచేసియున్న సుభద్ర బలభద్ర సహిత జగన్నాథస్వామి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం శ్రీరాధాకృష్ణుల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కారెంపూడి: కారెంపూడి పీహెచ్సీని అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మాధవీలత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని రికార్డులు తనిఖీ చేశారు. రోజువారీ ఓపీ వారికి అందుతున్న వైద్య సేవల గురించి పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ జి. రమ్య, డాక్టర్ కె. లక్ష్మీమౌనికలను అడిగి తెలుసుకున్నారు. స్పర్శ కార్యక్రమం కింద కుష్ఠువ్యాధి లేని సమాజాన్ని చూసేందుకు సంబంధిత శాఖ ఉద్యోగులు అందరూ కృషి చేయాలని కోరారు. సీహెచ్ఎ మల్లయ్య, ఉద్యోగులతో అడిషినల్ డీఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. బాపట్ల: బాపట్ల జిల్లా గనులు–భూగర్భ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గా జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా గనులు–భూగర్భ విభాగం కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్గా పనిచేస్తున్న ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన శనివారం బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం
నరసరావుపేట టౌన్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు ప్రకారం.. ప్రకాష్నగర్కు చెందిన డి.మల్లికార్జునరావు(35) మార్కెట్ సెంటర్ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ రాజమోహనరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈమెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 15వ వర్థంతి సభలో వక్తల నివాళి నూతక్కి(తెనాలి): ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు అన్నపురెడ్డి శివరామరెడ్డి 15వ వర్ధంతి సభను శనివారం మంగళగిరి మండలం నూతక్కిలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. శివరామరెడ్డి నటనను, దర్శక ప్రతిభను కొనియాడుతూ వక్తలు నివాళులర్పించారు. నటుడు జొన్నల పేరిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కూర్మారెడ్డి, వల్లూరి శివప్రసాద్, ప్రజానాట్యమండలి గాయకుడు జగన్ తదితరులు మాట్లాడారు. -
చంద్రబాబువి నీచ రాజకీయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు కేరాఫ్గా నిలుస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు దాడికి యత్నించడమే కాకుండా ఆయన నివాసంపై దాడికి దిగడం దుర్మార్గం. దీనిని ఖండిస్తున్నాం. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తోంది. సీబీఐ నివేదిక చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం మంచి పద్ధతి కాదు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినప్పటికీ పదేపదే దుష్ప్రచారం చేయడం, ఎల్లో మీడియాతో ప్రచారం చేయించడం దారుణం సార్వత్రిక ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు ఎందుకు దాడికి యత్నించాయి? ఈ దాడి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుస్తోంది. ప్రత్యర్థులపై బురదచల్లడం చంద్రబాబు మానుకొని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలి. మాజీ మంత్రి అంబటి నివాసంపై దాడి ప్రభుత్వం చేసిన దాడిగా భావిస్తున్నాం. – డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త -
పల్నాడు
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3500, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 36.7317 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: ఇసప్పాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి రామయ్య, జయశ్రీ దంపతులు రూ.1,11,116 విరాళంగా అందజేశారు. -
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
సబ్ జూనియర్ విభాగంలో గుంటూరు ఎడ్లకు ప్రథమస్థానం రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరిగాయి. సబ్ జూనియర్ విభాగంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎద్దులు 3,606 అడుగుల దూరంలాగి ప్రథమ బహుమతి రూ. 90 వేలను కై వశం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 3,300 అడుగుల దూరంలాగి రెండవ బహుమతి రూ. 70 వేలు, తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా మండల కేంద్రమైన పెదకొత్తపల్లికు చెందిన వి.శ్రావన్కుమార్, చంద్రకళ ఎడ్లు 3,080.8 అడుగుల దూరం లాగి 3 వ బహుమతి రూ. 50 వేలు, వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్, పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన యామిని మోహన్ శ్రీ కంబైన్డ్ ఎడ్లు 3,057.2 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ. 35 వేలు, హైదరాబాద్కు చెందిన డి.రోహన్బాబు ఎడ్లు 3,008.9 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బొడపాటి రామకృష్ణ, జడ్డు రాజేష్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా సురపనేని రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు వ్యవహరించారు. -
తిరుమల ప్రసాదానికి బాబు చేసింది ఘోర అపచారం
గుంటూరు రూరల్: తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అబద్ధం చెబితే దానిని నిజం చేసేందుకు పవన్కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతన ధర్మం పేరుతో మరిన్ని అబద్దాలను పలికాడని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మండలంలోని గోరంట్ల గ్రామంలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై చంద్రబాబు, పవన్కల్యాణ్లు చేసిన అబద్దపు ప్రచారానికి పాప పరిహారంగా బాబుకు బుద్ధి రావాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైందన్నారు. సీబీఐ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని తేలిందన్నారు. లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి అబద్దపు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు నేడు సీబీఐ విచారణ తరువాత నోరు మెదపటంలేదన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భక్తులు హిందువుల మనోభావాలను దెబ్బతీశామని గుర్తించి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ, మరలా అబద్దపు ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికై నా వేంకటేశ్వరస్వామి పవన్కల్యాణ్కు, చంద్రబాబుకు బుద్ది ప్రసాదించాలని కోరారు. దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబి, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు పరీక్షలు చేసి చంద్రబాబు ఆరోపించిన ఎటువంటి కొవ్వు గానీ, గొడ్డు కొవ్వుకానీ, పంది కొవ్వుకానీ తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని నివేదికను ఇచ్చాయన్నారు. దీంతో తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు మరో డ్రామా అబద్దాల డ్రామా మొదలుపెట్టాడన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. -
జిల్లా మత్స్యశాఖ అధికారిగా ప్రసాద్
నరసరావుపేట: మత్స్యశాఖ పల్నాడు జిల్లా అధికారిగా బి.ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ రామశంకరనాయక్ ఉప జిల్లా అధికారిగా ఉన్న ప్రసాద్కు జిల్లా పూర్తి బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లుగా జిల్లా అధికారిగా పనిచేస్తున్న సంజీవరావును కోర్టు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన విషయం విధితమే. నియమ నిబంధనలు పాటించకుండా విధులు నిర్వహించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జిల్లా అధికారి సంజీవరావుతోపాటు ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి భాగ్యలత, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కూడా సస్పెండ్ అయినట్లు జిల్లా అధికారి ప్రసాదు వెల్లడించారు. -
రైతులే స్వయంగా సాగు వివరాలు నమోదు చేయాలి
పెదకాకాని: రైతులు వారి మొబైల్ ఫోన్ ద్వారా సాగు వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ అన్నారు. పెదకాకాని మండలం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఏపీ ఎయిమ్స్ (ఏపిఎఐఎంఎస్) అనే యాప్ని రైతులు వారి మొబైల్ ఫోన్లో స్వయంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ పనిచేసే విధానాన్ని రైతులకు వివరించారు. యాప్లో ఇంకా ఏమేమి జోడిస్తే బాగుంటుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు పండించిన పంటను తనంతట తానే నమోదు చేసుకునే విధానాన్ని బోయపాటి రమేష్ ద్వారా చేయించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి కలుపు మందుల పిచికారి గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పురుగుమందుల ద్వారా కాకుండా మనుషుల ద్వారా కలుపును తీయిస్తే అయ్యే ఖర్చు, పురుగుమందుల ద్వారా కలుపు నివారణకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకున్నారు. సబ్సిడీపై ఆయిల్ ఇంజన్లు, పైపులు ఇప్పించాలని రైతులు కోరారు. అనంతరం వెనిగండ్ల గ్రామాన్ని సందర్శించి జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా మట్టి నమూనాలను సేకరించటం, ఆన్లైన్ అప్లోడ్ చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామ రైతు పులగం రామిరెడ్డితోపాటు పలువురు రైతులు ఆయిల్ ఇంజిన్లు, పైపులు, నల్ల పట్టాలు, సిర్పాలిన్ పట్టాలు సబ్సిడీపై అందించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఐ.నాగేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ మోహన్రావు, ఏఓ కె రమణకుమార్ పాల్గొన్నారు. -
దర్శి కమిషనర్ గృహాలపై ఏసీబీ దాడులు
● ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు గుర్తింపు ● 729 గ్రాములు బంగారం, 9 కిలోల వెండి స్వాధీనం నరసరావుపేట: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో ప్రకాశం జిల్లా దర్శి ధర్డ్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ యడల మహేశ్వరరావు నివాస గృహాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు...ఈ దాడుల్లో అతను ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లుగా గుర్తించామన్నారు. దర్శిలోని అతని కార్యాలయం, నరసరావుపేట, సత్తెనపల్లిలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులకు సంబంధించి తొమ్మిది ఇళ్ల స్థలాలు, రెండు నివాస గృహాలు, 89 సెంట్ల వ్యవసాయ భూమిని గుర్తించారు. చరాస్తులకు సంబంధించి రూ.2.60 లక్షల నగదు, రూ.55వేల బ్యాంకు బాలెన్స్, 729 గ్రాముల బంగారు ఆభరణాలు, 9.275 కేజీల వెండి, ఒక కారు, మూడు మోటారు సైకిళ్లు, విలువైన గృహోపకరణాలు ఉన్నాయి. తన అక్రమ ఆస్తులను భార్య, కుమారుడు, తల్లి పేరిట కొనుగోలు చేశాడు. ● సత్తెనపల్లిరోడ్డులోని సాయినగర్లో గల రామా డ్రీమ్ హోమ్స్ అపార్టుమెంట్ 101 ప్లాట్లో మహేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటుంది. దాడి సమయంలో మహేశ్వరరావు ఇంటిలో లేరు. ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. సుమారు 10మంది సభ్యులు గల ఏసీబీ బృందం ఇంటి మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ● దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడి కోడలు వ్యవహరిస్తూ ఇక్కడే నివాసం ఉంటుండగా ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిపై ఏసీబీ దాడి జరగటం గమనార్హం.. ● మహేశ్వరరావు 1998లో కారుణ్య నియామకంపై బిల్లు కలెక్టర్గా సత్తెనపల్లిలో పనిచేశారు. 2014–19 మధ్యకాలంలో నరసరావుపేట పురపాలక సంఘంలో ఆర్ఐగా పనిచేస్తూ ఆర్ఓగా పదోన్నతి పొందారు. సత్తెనపల్లి, వినుకొండ పురపాలక సంఘాల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. రెవెన్యూ ఆఫీసర్గా వినుకొండలో పనిచేస్తూ పదోన్నతిపై దర్శి మున్సిపాల్టీకి ఇన్చార్జి కమిషనర్గా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. -
క్షీణించిన శాంతిభద్రతలు
తిరుమల లడ్డూ విషయమై టీడీపీ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలడంతో డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు తెర లేపారు. అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి ఉదాహరణ అంబటి ఇంటిపై దాడే. పోలీసులు దగ్గర ఉండి దాడులను ప్రోత్సహించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు. కొన్ని గంటలపాటు గుంటూరులో అశాంతిని నెలకొల్పారు. దాడులను పూర్తిగా ఖండిస్తున్నా. వెంటనే అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పోలీసులు అండతో ఇలాంటి హింసలకు పాల్పడటం సరికాదు. రాంబాబుకు ప్రాణహాని ఉంది. ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్సార్సీపీ ఆయనకు అండగా నిలుస్తుంది. – నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే -
స్నేహితురాలి పథకం ప్రకారమే దోపిడీ
పిడుగురాళ్ల: స్నేహితురాలే దోపిడీకి పథకం రచించి అమలు చేసినట్లు తేలిందని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించామని తెలిపారు. దాచేపల్లి నుంచి వీరాపురం గ్రామానికి కూలి పనుల నిమిత్తం వెళ్తున్న సీతమ్మను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి బంగారు గెలుసుతోపాటు ఆమె పక్కనే స్నేహితురాలు కొల్లి శిరీష ఫోన్ను లాక్కుని వెళ్లిపోయారు. సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో శిరీషను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. తనతోపాటు పొలానికి వచ్చే సీతమ్మ మెడలో బంగారు గొలుసు చూసి దోపిడీకి పథకం రచింంచింది. అందులోభాగంగా తెల్లవారుజామున ఐదు గంటలకు సీతమ్మను తన వెంట పొలానికి తీసుకొని వెళ్లింది. స్నేహితుడు వినుకొండ సురేష్, వినుకొండ అశోక్ల సహకారంతో సీతమ్మ నోరుమూసి బంగారు గెలుసు దోచుకెళేల్లా పథకం అమలు చేసింది. అనుమానం రాకుండా శిరీషకు చెందిన్ సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐలు మోహన్, శివనాగరాజు, సిబ్బంది సమావేశంలో ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. వివరాలు.. సత్తెనపల్లి మండలం కంటేపూడి సమీపంలోని కళాశాలలో చిత్తూరు జిల్లా ఎన్జీ గూడెంకు చెందిన వి.భరణి (19) బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. తన స్నేహితుడు దాచేపల్లికి చెందిన దాసరి గణేష్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని కొమెరపూడి వైపు వెళుతుండగా అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. భరణి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గణేష్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పదిలో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
వినుకొండ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు, అత్యున్నత ర్యాంకులు లక్ష్యంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో పీవీజే రామారావు పాల్గొని మాట్లాడుతూ పరీక్షలకు మిగిలి ఉన్న 45 రోజుల సమయాన్ని విద్యార్థులు అత్యంత కీలకంగా భావించాలని సూచించారు. లక్ష్యంతో, సరైన ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈవో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవోలు జఫ్రుల్లా, కె.పార్వతి, జి.చిన్నపరెడ్డి, ఎం.సాంబశివరావు, ఎన్. రవిచంద్ర, ఎ.లలిత కుమారి, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీఈవో రామారావు -
‘ఉపాధి’లో కాసుల పంట
నకరికల్లు:తప్పుల మీద తప్పులుచేస్తున్నారు... స్పృహలో ఉండి చేస్తున్నారా.. లేక ఎవరూ కనిపెట్టలేరని చేస్తున్నారా... ఉపాధి లక్ష్యాన్ని నీరు గారుస్తున్నారంటూ డ్వామా పీడీ ఎం.సిద్ద లింగమూర్తి ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. నకరికల్లులోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రూ.7.28 కోట్ల విలువైన ఉపాధి పనులపై నెలరోజులపాటు సామాజిక తనిఖీ చేపట్టి గుర్తించి అంశాలపై ప్రజావేదిక నిర్వహించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలివే.. సామాజిక తనిఖీ బృందాలు తన తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కుంకలగుంటలో ఎర్రనల్ల చెరువులో ఒకే వర్క్ ఐడీతో పనిచేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఆరు వర్క్ ఐడీలు సృష్టించి సుమారు రూ.27 లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనుల్లో క్షేత్రస్థాయి లో పనులు జరిగిన ఆనవాళ్లు లేకుండానే బిల్లు ల చెల్లింపులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. లేని పనులకు ఎంబుక్లు కొలతలు నమోదు చేయడంపై టెక్నికల్, ఇంజినీరింగ్ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండా చెల్లింపులు చేసినట్లు బహిర్గతమైంది. కొలతల్లో భారీ తేడాలు, చేయని పనులు చేసి నట్లు సృష్టించడం, పనిదినాల కన్నా తక్కువ లేదా ఎక్కువరోజులకు చెల్లింపులు, ఒకేరకమైన సంతకాలతో చెల్లింపులు, ఉద్యోగుల పేరి ట కూలి చెల్లింపులు, రైతుల సంతకాలు లేకుండా, చేపట్టిన పనులకు ఫొటోలు కూడా లేకుండా పంటకాలువ పనులకు బిల్లులు, ఊళ్లలో లేకుండా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి పేరిట బిల్లుల చెల్లింపులు చేపట్టడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు.ప్రధానంగా మట్టిరోడ్ల నిర్మాణంలో వందల మీటర్ల మేర తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా తే డాలు, నిధులు స్వాహా, దుర్వినియోగంపై రికవరీ, విచారణ, శాఖాపరమైన కఠినచర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఓఎమ్మెల్యేకు చెందిన కళాశాలలో పనిచేస్తున్న వ్యక్తిపేరుతో కూడా ఉపాధికూలీ చెల్లింపులు చేసినట్లు తేల్చడం, మరో పాఠశాలలో ఉపా ధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి పేరు తో కూడా చెల్లింపులు జరిగినట్లు తేల్చారు. కొన్నిపనుల కు మస్టర్లు మాయమైనట్లు తేలింది. డిస్ట్రిక్స్ విజిలెన్స్ అధికారి హీరాలాల్, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి విజయకుమారి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రభాకర్, ఎస్ఆర్పి తులసీనాయక్, ఏపీడీ పి.వి.నారాయణ పాల్గొన్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.7.28 కోట్ల మేర పనులపై ప్రజావేదిక నిర్వహిస్తుంటే వేదిక ముందు కుర్చీలు ప్రజలు లేక వెలవెలబోయాయి. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు లేక నకరికల్లులోని ప్రజావేదిక నీరుగారింది. ఉపాధిహామీ సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. -
వైఎస్సార్సీపీలో పలువురు నాయకుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టూడెంట్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మాచర్లకు చెందిన పొట్టిపోగు రూత్బాబు, ఐటీ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గురజాలకు చెందిన బొడ్డపాటి రాజశేఖరరెడ్డి, మహిళా విభాగ జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా గురజాలకు చెందిన వజ్రాల భ్రమరాంబ, సత్తెనపల్లి నియోజకవర్గ వాలంటీర్ల వింగ్ అధ్యక్షులుగా సత్తెనపల్లికి చెందిన యడలపురపు శ్రీనాథ్ నియమితులయ్యారు. రైలు కిందపడి పెయింటర్ ఆత్మహత్య సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం భీమవరం రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని సంఘం బజార్కు చెందిన పెయింటర్ గైక్వాడ గోపీనాథ్ (29) మద్యం తాగుతుంటాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లింది. మద్యం మానేసినప్పటికీ తిరిగి రావడం లేదని, మానసిక పరిస్థితి బాగాలేక పోవటంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వెళ్తూ అత్త మృతి సత్తెనపల్లి: అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వస్తూ అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం బృగుబండ నుంచి పాకాలపాడు శివారు మార్గంలో శుక్రవారం జరిగింది. వివరాలు... క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన సిద్దిల మరియమ్మ అలియాస్ మేరమ్మ (50)కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. కుమార్తెను సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. పెద్దకర్మకు సంబంధించిన సరుకులు కొనుగోలు చేసేందుకు శుక్రవారం తన వరుసకు చెల్లి, మరిది అయిన ఇరువురితో కలిసి మరియమ్మ ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తోంది. అదే సమయంలో మట్టి ట్రాక్టర్ పాకాలపాడు శివారు వద్ద ఢీకొంది. మరియమ్మ తలపై నుంచి ట్రాక్టరు టైర్ వెళ్లడంతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల కుప్ప!
సత్తెనపల్లి: జిల్లాలో 28 మండలాలు ఉండగా 520 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో కేవలం దాచేపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, మాచవరం మండలాలు మాత్రమే పన్ను వసూళ్లలో ముందు వరుసలో ఉన్నట్లు ఈ నెల 29 నాటి గణాంకాలు చెబుతున్నాయి. బొల్లాపల్లి, అచ్చంపేట, ఈపూరు మండలాలు పన్ను వసూలులో చివరి వరుసలో ఉన్నాయి. ఈ మండలాల్లో ఆశించిన మేర వసూళ్లు కనిపించడం లేదు. ఏటా రూ. కోట్లల్లో వసూలు చేయాల్సిన పన్నులే పంచాయతీలకు దన్నుగా నిలుస్తాయి. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగిస్తున్నారు. ఏటా ఆర్థిక వనరులను పెంచుకోవడం వాటి ద్వారా పంచాయతీల అభివృద్ధికి పాలక మండళ్లు శ్రద్ధ చూపించడం లేదు. దీనికి తోడు వసూలు చేయాల్సిన ఇంటి పన్నుల విషయంలో అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీనివల్ల పంచాయతీల్లో పనులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు పన్నుల వసూళ్లకు టార్గెట్లు ఇస్తున్నా వాటి ఫలితాలు మాత్రం ఉండడం లేదని తాజా అప్పుల లెక్క చెబుతోంది. వసూళ్లలో దాచేపల్లి అగ్రస్థానం .. బొల్లాపల్లి చివరి స్థానం .... పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాల చెల్లింపు, నీటి సరఫరా నిర్వహణ, బోర్ల నిర్వహణ ఇలాంటి పనులకు పంచాయతీకి వసూలయ్యే సాధారణ నిధుల తోనే చేపట్టాల్సి ఉంటుంది. దీనికి పన్నులు సకాలంలో వసూలు కావాలి. లేదంటే నిధుల కోసం కటకట లాడాల్సిందే. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా వాటిని దేని కోసం వెచ్చించాలో ప్రభుత్వమే సూచిస్తుంది. కాబట్టి ఆ పనులే చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో నిధుల కొరత తీరాలంటే పన్ను ల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.డివిజన్ అసెస్మెంట్లు ఏరియర్స్ లక్షల్లో కరెంట్ లక్షల్లో మొత్తం లక్షల్లో గురజాల 1,22,952 రూ. 209.36 రూ. 561.87 రూ. 771.23 నరసరావుపేట 1,41,482 రూ. 323.39 రూ. 601.66 రూ. 925.05 సత్తెనపల్లి 1,33984 రూ. 456.54 రూ. 604.55 రూ.1061.69 మొత్తం 3,98,418 రూ. 989.29 రూ.1768.08 రూ.2757.37 -
పల్నాడు
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 36.8230 టీఎంసీలు. అమ్మవారికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):పొన్నెకల్లుకు చెందిన ఎనకొల్లు శివాజీ కుటుంబం విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి నిత్యాన్నదానాని కి రూ.1,11,111 విరాళాన్ని అందజేశారునిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3200, గరిష్ట ధర రూ.3800, మోడల్ ధర రూ.3400 వరకు పలికింది. 7 -
కొండవీడు ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
యడ్లపాడు: ప్రజల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చెప్పారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు విషయంపై శుక్రవారం చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయి సందర్శన చేశారు. కోటలోని చారిత్రక కట్టడాలు, చెరువులు, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం కొండవీడు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు రాకపోకలు సాగించే మార్గాలను తనిఖీ చేశారు. రద్దీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సందర్శకుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ కొండవీడు ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పల్నాడు జిల్లా పోలీస్శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఉత్సవాల పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనాల రద్దీ పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రించి, పార్కింగ్ ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన మలుపులు, లోతైన చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ, పర్యాటక తదితర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోటను సందర్శించిన పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు -
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కె.శ్యాంబాబు నరసరావుపేట టౌన్ : జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కె.శ్యామ్బాబు తెలిపారు. మార్చి 14న నిర్వహించే అదాలత్ను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక న్యాయాధికారులతో కోర్టు హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సివిల్ వివాదాలు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, ఫైనాన్స్ రికవరీ కేసులు, చెక్కు బౌన్న్స్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే దిశగా కృషి చేయాలన్నారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేశారు. వీలైనంత ఎక్కువ మంది కక్షిదారులకు లబ్ధి చేకూర్చేలా చొరవ చూపాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా కాకుండా ఉభయ పక్షాల అంగీకారంతో వివాదాలను సామరస్యంగా ముగించుకోవడానికి ఈ లోక్ అదాలత్ ఒక చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయాధికారులు కె. మధుస్వామి, ఆశీర్వాదం పాల్, ఏ.సలోమి తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తెనాలిటౌన్: పట్టణ షరాఫ్బజార్లోని శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 28వ తేదీ ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్కుమార్లు మాట్లాడుతూ ఉత్సవాల్లో 31వ తేదీ రాత్రి సువర్చలా హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం చక్రస్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ, తదితర కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణ మహోత్సవం దాచేపల్లి: లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం జరిగింది. స్థానిక చాపలగడ్డ బజారులో జరిగిన అమ్మవారి కల్యాణ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అభిషేకాలు చేసి అమ్మవారి గీతాలను మాలధారులు అలపించారు. అమ్మవారి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు భక్తులు, మాలధారులకు అందించారు. కార్యక్రమంలో అమ్మవారి మాలధారణ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సైదులు, గురుస్వామి బ్రహ్మయ్య, మౌలాలీ, గోపి తదితరులు పాల్గొన్నారు. రేపు స్వామివారి తెప్పోత్సవం మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థనంలో ఆదివారం స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు స్వామివారి దేవస్థానం నుంచి బయలు దేరి సీతానగరం ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకుని, శ్రీ స్వామి వారి అమ్మవార్ల తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
13 వాహనాలు స్వాధీనం నకరికల్లు : వాహన దొంగలను అరెస్ట్ చేసి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కె.సతీష్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నకరికల్లులోని సినిమాహాలు వీఽధిలో ద్విచక్రవాహనం చోరీ జరిగిందని వచ్చిన ఫిర్యా దు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. దర్యాప్తులో ఇద్దరు మైనర్లతో పాటు నరసరావుపేటకు చెందిన ఉద య్, గోపిలను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుంచి 13 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. పేకాట స్థావరంపై దాడి 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పిడుగురాళ్ల: పేకాట ఆడుతున్న స్థావరంపై పిడుగురాళ్ల పట్టణ పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్గేట్ సమీపంలో ఉన్న హోటల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పిడుగురాళ్ల పట్టణ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు పేకాట రాయుళ్లు వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. దీంతో పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్లు ఒక్కసారిగా దాడులు నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,40,190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హోటల్ కేంద్రంగా నిర్వాహకులే పేకాట ఆడిస్తున్నట్లు కొంత మేరకు సమాచారం ఉందని, ప్రస్తుతం హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఎన్యూ లైబ్రరీకి వేటూరి పుస్తకాలు బహూకరణ ఏఎన్యూ(పెదకాకాని): సినీ సినీయేతర సాహిత్య రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్య పుస్తకాలను ఆయన కుమారులు శనివారం వర్సిటీలోని గ్రంథాలయానికి బహూకరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన వేటూరి సుందర రామమూర్తి రచించిన సాహిత్య పుస్తకాలు దొరకునా ఇటువంటి సేవ, మానసవీణ మధుగీతం, నవమి నాటి వెన్నెల, ఎడారిలో కోయిల, ఝుమ్మంది నాదం, ఎరక్కపోయి వచ్చాను వంటి పుస్తకాలను వేటూరి కుమారులు వేటూరి రవి ప్రకాష్, వేటూరి చంద్రశేఖరరావులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీకి స్వయంగా విచ్చేసి బహూకరించారు. గ్రంథాలయ అధికారి ప్రొఫెసర్ కోడెల వెంకట్రావు నేటి యువతకు ఈ సాహిత్య పుస్తకాలు, సాహిత్య పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. -
దిగజారుడు రాజకీయం చంద్రబాబుకే సాధ్యం
పిడుగురాళ్ల: దేశంలోనే దిగజారుడు రాజకీయం చేయటం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని, సాక్షాత్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలతో తప్పుడు ఫ్లెక్సీలను వేసి ఆ విషయాన్ని నిరూపించుకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని పోలీస్స్టేషన్ సెంటర్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లో దిగజారుడుతనం చూస్తున్నాంగానీ, ఇంతటి చిల్లర రాజకీయం దేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు తాను అన్ని విధాలుగా విఫలం అయ్యానని తెలుసుకుని సాక్షాత్తూ ఆ దేవదేవుడు వెంకన్న స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగారని మండిపడ్డారు. ఇంతకంటే దిగజారుడు ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి అన్నారు, చెప్పరాని పదాలతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా పద్ధతి మారలేదన్నారు. మాట మార్చిన కూటమి నేతలు ఇప్పుడు కొత్తగా ఇది కాదని, కెమికల్స్ ఉన్నాయని... ఏది పడితే అది మాట్లాడటం కూటమి నేతల దిగజారుడు రాజకీయానికి అద్దం పట్టిందన్నారు. ఏ పార్టీ నాయకులైనా ఆ పార్టీ అధిష్టానం, వారు నిర్వహించిన అభివృద్ధి గురించి బ్యానర్లు వేసుకుంటారని గుర్తుచేశారు. గత 20 నెలలుగా చేసిందేమీ లేక చివరికి లడ్డూలో ఏదో కలిసిందని తప్పుడు ప్రచారంతో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచార ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ ఎవరు వేశారో తమకు తెలియదని పోలీసులు చెబుతున్నారన్నారు. ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తమ పార్టీ కార్యకర్తలే వాటిని తొలగించారని తెలిపారు. బాధ్యులపై తమ ప్రభుత్వం రాగానే నాన్బెయిల్బుల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ఏం చేశారో ఫ్లెక్సీలలో వేయాలని, లడ్డూ చూపించి ఫ్లెక్సీలను వేసుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఇలాంటి వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెద్దకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి, గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగటం దారుణం వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
పిచ్చికుక్క స్వైరవిహారం
పిడుగురాళ్ల: పిచ్చి కుక్క స్వైర విహారంతో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని చింతల శృతి అనే చిన్నారి స్థానిక హైస్కూల్ సమీపంలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి ముఖంపై గాయపరిచింది. మరో చిన్నారిని వీపుపై గాయం చేసింది. ఇద్దరు చిన్నారులకే కాకుండా అటుగా వెళ్లే ఇద్దరు మహిళలతోపాటు ఎస్సీ కాలనీకి చెందిన వంగపూరి హారిక మెడ బాగాన, వీపు బాగాన గాయపరిచింది. వీరితోపాటు బీసీ కాలనీకి చెందిన మరో ఇద్దరిపై దాడి చేసి కలవర పరిచింది. మొత్తం ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఆరుగురికి గాయాలు -
టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
నరసరావుపేట: తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు అబద్ధమని దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో నిరూపతమైన దృష్ట్యా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు భక్తులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్లానలిస్టు చిట్టా విజయభాస్కరరెడ్డితో కలసి మాట్లాడారు. ● శనివారం బరంపేటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పార్టీ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయ కొట్టి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు వేసిన నిందను పూర్తిగా తొలగించమని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తామని పేర్కొన్నారు. -
మహిళ ముక్కు కోసిన ఇద్దరు అరెస్టు
పిడుగురాళ్ల: కోడి కత్తితో మహిళ ముక్కు కోసి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని లెనిన్ నగర్లో ఈ నెల 22వ తేదీన మహిళ ముక్కు కోసి పరారైన వ్యక్తులను పట్టణ ఎస్ఐ శివనాగరాజు తన సిబ్బందితో పట్టుకున్నారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన కంపా వెంకట్రావుకు చెరుకూరి మరియమ్మతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల మనస్పర్థలు ఏర్పడి నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నారు. మరియమ్మను చంపేందుకు బంధువైన కంపా నగేష్తో కలిసి వెంకట్రావు కోడికత్తి తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. మరియమ్మను నగేష్ రెండు చేతులు వెనక్కి పట్టుకోగా గొంతుపై కత్తితో కోసేందుకు వెంకట్రావు ప్రయత్నించాడు. తోపులాటలో మరియమ్మ ముక్కు తెగింది. దీంతో వారు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ శివనాగరాజు, మోహన్, సిబ్బంది ఉన్నారు. -
ఒడిశా కార్మికుడి బలవన్మరణం
నాదెండ్ల: ఒడిశా కార్మికుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఒడిశాకు చెందిన కార్మికుడు రణబిడఅరుణ్ (36) నాలుగు నెలలుగా స్థానిక ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 28న తనకు ఆరోగ్యం బాగాలేదని, మీరు ఇక్కడకు వచ్చి తనను తీసుకెళ్ళాలని ఫోన్లో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేరోజు తాను ఒడిశాకు వెళ్తున్నట్లు కంపెనీ అధికారులకు తెలియపరిచి బయటకు వచ్చాడు. గురువారం అర్ధరాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న పాత గోల్డెన్ టుబాకో కంపెనీలోకి వెళ్లి ఐరన్రాడ్కు వైరుతో ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున 5.30 గంటలకు కంపెనీ వాచ్మెన్ నాగరాజు విద్యుత్ లైట్లు ఆపేందుకు వెళ్ళగా మృతదేహాన్ని చూసి కంపెనీ యాజమాన్యానికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిస్క్ తీసుకోం..!
పురిటి నొప్పులతో నిండు శూలాలు విలవిలలాడుతుంటే భయపడొద్దని ధైర్యం చెప్పాల్సిన వైద్యుల చేయి.. నో రిస్క్ అంటూ వెనక్కు లాగుతోంది. అమ్మా.. ఊరుకో డాక్టర్ దగ్గరకొచ్చామని నిండు గర్భిణికి ధైర్యం చెప్పేలోగా.. మా వల్ల కాదు.. పెద్దాస్పత్రికి వెళ్లండంటూ ప్రభుత్వాస్పత్రి గెంటేస్తోంది. వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణులకు శాపంగా మారుతోంది. కేవలం నెలల కాలంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలలో పడిపోయిన డెలివరీల సంఖ్య ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపాన్ని కళ్లకు కడుతోంది. డెలివరీల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. అయితే అందులో వైద్యుల నిర్లక్ష్యం ఉంటే సహించేది లేదు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేస్తున్న కేసులపై దృష్టి పెడతా. గర్భిణులకు అందించే వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సురేష్ కుమార్, సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాల, నరసరావుపేట నరసరావుపేట టౌన్: నవమాసాలు మోసి బిడ్డను కని ఆనందించాల్సిన గర్భిణులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు పురిటినొప్పితో ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న గర్భిణులకు గడపలోనే వైద్యసేవల నిరాకరణ జరుగుతోంది. ప్రధానంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఏరియా వైద్యశాలలో గర్భిణుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇక మారుమూల ప్రాంతాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన ఏరియా వైద్యశాలకు పల్నాడు జిల్లాలోని ప్రజలతో పాటు బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి వైద్యసేవల కోసం గర్భిణులు వస్తుంటారు. ప్రతిరోజు సుమారు 100 వరకు ఓపీ నమోదు అవుతుండగా.. నెలకు 300 పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆనుభవజ్ఞులైన వైద్యులు, నాణ్యమైన వైద్యం అందుతాయన్న నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి పేదలు వస్తుంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం ఓపీ, ప్రసవాల సంఖ్య సగానికి పడిపోయింది. ఓపీ 60 వరకు నమోదు అవుతుండగా, నెలకు డెలివరీలు 140 వరకు గత రెండు నెలలుగా జరుగుతుండటం వైద్యసేవల్లో లోపాన్ని చాటుతుంది. రిస్క్ చేయని వైద్యులు.. ఒకప్పుడు వైద్యశాలకు వచ్చిన హైరిస్క్ గర్భిణి కేసులను చాలెంజ్గా తీసుకొని తమ అనుభవంతో వైద్యులు, సిబ్బంది శ్రమించి ప్రసవాలు చేసేవారు. అయితే ప్రస్తుతం హైరిస్క్ కేసుల జోలికి వెళ్లటం లేదు. డెలివరీలలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తర్వాత నరసరావుపేట ఏరియా వైద్యశాల రెండు లేక మూడవ స్థానంలో ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న ఏరియా వైద్యశాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా మారింది. సిఫార్సుతో ప్రాణ నష్టం.. మాచర్లకు చెందిన గర్భిణి పురిటి నొప్పులతో ఈ నెల 17న 108లో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు వచ్చింది. బిడ్డ అడ్డం తిరిగి ఉండటాన్ని గమనించిన ఇక్కడి వైద్యులు ప్రథమ చికిత్స కూడా అందించకుండా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. అక్కడ శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. అనంతరం బాలింత మృతి చెందింది. నరసరావుపేటలో సకాలంలో వైద్యం అంది ఉంటే ఆమె మృతి చెంది ఉండేది కాదని మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీవీపీ జాయింట్ కమిషనర్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. సగానికి పడిపోయిన ప్రసవాల సంఖ్య నరసరావుపేట ఏరియా వైద్యశాలలో బాలింత మృతితో వైద్యుల్లో భయం ఏర్పడింది. హైరిస్క్ కేసుల జోలికి వెళ్లేందుకు వైద్యులు ధైర్యం చేయటం లేదు. వచ్చిన కేసులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు సిఫార్స్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రసవం కోసం 2 నెలల క్రితం మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటుకు చెందిన సాగరమ్మ వచ్చి బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మృతి చెందింది. గర్భిణికి రక్తం ఎక్కించే విషయంలో ఒక గ్రూప్నకు బదులు మరో గ్రూప్ ఎక్కించటంతో ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారాన్ని రూ.5 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేశారు. -
పచ్చ మార్క్ పోస్టింగులు
గుంటూరు ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖాధికారుల పోస్టులను భర్తీ చేయడంలో టీడీపీ సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి పాఠశాలలకు శాపంగా మారింది. రెగ్యులర్ ఎంఈవో పోస్టుల్లో సీనియార్టీ ప్రాతిపదికన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ)పై నియమించాల్సి ఉండగా, విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎంఈవోలపై పని భారాన్ని తగ్గిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి మండలానికి కొత్తగా ఎంఈవో–2 పోస్టును మంజూరు చేశారు. ఈ విధంగా ఎంఈవోల విధులను విభజించి, బండెడు చాకిరీ నుంచి వారికి ఉపశమనం కలిగించారు.గుంటూరు జోన్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 147 మండలాల్లో ఎంఈవో–1, 2 పోస్టుల్లో పని చేస్తున్న వారు ఎవరి బాధ్యతలు వారు నిర్వరిస్తున్నారు. అయితే ఉద్యోగ విరమణతో ఖాళీగా మారిన ఎంఈవో పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయకపోవడంతో ఆయా ఖాళీల్లో హైస్కూల్ హెచ్ఎంలను ఎఫ్ఏసీలుగా నియమించడం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఎంఈవో–1లుగా నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన సమయంలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఎంఈవోలుగా వేర్వేరు మండలాలకు వెళ్లిపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1లుగా నియమించడంతో ఆయా పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులు కరువయ్యారు. రాజకీయ సిఫార్సులతో గుంటూరులోని విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం ద్వారా కొనసాగుతున్న ఈ వ్యవహారం ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టదాయకంగా మారింది. గుంటూరు జోన్ పరిధిలోని 147 ఎంఈవో–1 పోస్టుల్లో రెగ్యులర్ ఎంఈవోలు 30 మంది ఉండగా, మిగిలిన వారిలో హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి వివిధ మండలాలకు ఎంఈవో–1లుగా వెళ్లిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు తమ మాతృ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదు. వేతన బిల్లుల డ్రాయింగ్తో పాటు పాఠశాలల పర్యవేక్షణ విధులను నిర్వర్తిస్తున్న ఎంఈవోలు వారంలో రెండు, మూడు రోజులు తమ సొంత పాఠశాలలకు వెళ్లి, కనీసం టెన్త్ విద్యార్థులకై నా విద్యాబోధన చేసేందుకు అవకాశమున్నా, విద్యార్థులను గాలికొదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. గెజిటెడ్గా ఉన్న ఎంఈవో పోస్టుల్లో నిబంధనల ప్రకారం అదే కేడర్కు చెందిన హెచ్ఎంలను నియమించాల్సి ఉండగా, టీడీపీ సర్కారు పాలనలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎంఈవో–1, 2 పోస్టుల భర్తీలో సీనియార్టీకి పాతర వేశారు. ఎంఈవో–1 పోస్టుల్లో ప్రభుత్వ, ఎంఈవో–2 పోస్టుల్లో జెడ్పీ యాజమాన్యంలోని హెచ్ఎంలు కొనసాగుతున్నారు. అయితే టీడీపీ సర్కారు పాలనలో సీనియార్టీకి పాతర వేసి హెచ్ఎంల కంటే జూనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1లుగా నియమించిన కారణంగా తమ కన్నా తక్కువ కేడర్లో ఉన్న వారితో కలసి విధులను సమానంగా పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల జీత, భత్యాల బిల్లుల డ్రాయింగ్ అధికారులుగా ఉన్న ఎంఈవో–1లు పాఠశాలల పర్యవేక్షణ సైతం వారి చేతుల్లో ఉంది. దీంతో గెజిటెడ్ అధికారులుగా ఉన్న హెచ్ఎంల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎంఈవోలతో సమాన కేడర్ కలిగిన హెచ్ఎంలను ఎంఈవోలుగా నియమించాల్సిన పరిస్థితులకు భిన్నంగా స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించడంతో విద్యాబోధన కుంటుపడింది. ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఎంలనే నియమించాలిప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులనే ఎంఈవో–1 పోస్టుల్లో నియమించాలి. గెజిటెడ్ అధికారులుగా నిర్వర్తించాల్సిన విధులను స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడం సరికాదు. ప్రభుత్వ హైస్కూళ్ల హెచ్ఎంలను ఎంఈవోలుగా నియమించి, స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతులు కల్పించాలి. -– కె.మాల్యాద్రిరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుపాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఇబ్బందులుహైస్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎంఈవో–2 పోస్టుల్లో సీనియర్ హెచ్ఎంలు ఉండటం, వారి కంటే జూనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1 పోస్టుల్లో నియమించడం వల్ల గందరగోళం నెలకొంది. హెచ్ఎం కేడర్లో ఉన్న వారినే ఎంఈవో పోస్టుల్లో నియమించాలి. – కె.బసవ లింగారావు, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు -
రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల విజేత వేటపాలెం
పిడుగురాళ్ల: మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి 70వ తిరునాళ్లను పురస్కరించుకొని గురువారం రెండు పళ్ల విభాగం ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ ఎడ్ల బలప్రదర్శనలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరిషాచౌదరి, శివకృష్ణ చౌదరికి చెందిన ఎడ్లు 3800 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. మోర్జంపాడుకు చెందిన తొగట వీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మొదటి బహుమతి అందించారు. మాచవరం మండలం మల్లవోలు గ్రామానికి చెందిన గంటా రమ్యానాయుడుకు చెందిన ఎడ్లు 3593 అడుగులు లాగగా.. చిలకలూరిపేట మండలం కావూరి లింగంగుట్ల గ్రామానికి చెందిన మౌలా త్రివేణి నాయుడుకి చెందిన ఎడ్లు 3305 అడుగులు దూరం లాగాయి. ఈ రెండీటికి కలిపి ద్వితీయ బహుమతిని కేటాయించారు. వీరికి రూ. 20 వేల నగదును నీలం శ్రీనివాసరావు, బడిగుంచ్చల వెంకట నర్సయ్య, కొరముట్ల వెంకట నర్సయ్య, కొలిశెట్టి శ్రీనివాసరావులు అందించారు. అలాగే చిలకలూరిపేట మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన గుత్తా వెంకాయమ్మలకు చెందిన ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి మూడవ స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. వీరికి గాను రూ.15 వేల నగదును బడిగుచ్చల వెంకటేశ్వర్లు అందించారు. తాటికొండ మండలం ముక్కాముళ్ల గ్రామానికి చెందిన కొర్ర వెంకయ్య ఎడ్ల జత 2800 అడుగుల దూరం లాగి నాల్గొ స్థానంలో కై వసం చేసుకున్నాయి. రూ. 10 వేలను జోకా అమరలింగేశ్వరరావు, నరేష్లు అందించారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన నల్లూరి నరసింహారావుకి చెందిన ఎడ్ల జత 2270 అడుగుల దూరం లాగి 5వ స్థానం సాధించాయి. వీరికి గాను రూ.8 వేలను బొమ్మళ్ల నాగరాజు, నవీన్లు అందించారు. అదేవిధంగా ఏడోస్థానం వరకు నిలిచిన ఎడ్లకు బహుమతులు లభించాయి. ఎడ్ల ప్రదర్శన తిలకించేందుకు రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
మట్టిలో మాణిక్యం సుకేష్
పెదకాకాని: తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం. తోడబుట్టిన వాడు పెయింటర్. ఉన్నత ఆశయం, పట్టుదల, నిరంతర కృషితో 43 రోజుల కిందట కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. ట్రైనింగ్లో ఉండగానే ఈనెల 28న ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో ఉత్తీర్ణత డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం సాధించాడు. పెదకాకాని మండలం తంగెళ్లమూడికి చెందిన బద్దెపూడి సుకేష్. గ్రామంలోనే మొట్టమొదట గ్రూపు–2 ఉద్యోగం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. రెండు నెలల వ్యవధిలో రెండు ఉద్యోగాలు.. మండలంలోని తంగెళ్లమూడి గ్రామానికి చెందిన బద్దెపూడి మోషే, సునీత దంపతులకు ఇద్దరు సంతానం. మోషే వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా తల్లి సునీత స్థానిక నర్సరీలో కూలి పనులకు వెళుతుంది. వారిలో పెద్దవాడు పెయింటర్గా పనిచేస్తున్నాడు. రెండవ సంతానం సుకేష్ బీఎస్సీ పూర్తి చేసి కాకినాడలో మూడేళ్ల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. 2025 డిసెంబరు 16వ తేదీన కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ తీసుకుని 21వ తేదీన ట్రైనింగ్ నిమిత్తం తిరుపతి వెళ్లాడు. ఈనెల 28వ తేదీన విడుదలైన గ్రూపు–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వరించింది. తంగెళ్ళమూడి గ్రామంలోనే మొట్ట మొదటిసారిగా సుకేష్ గ్రూపు 2 ఉద్యోగం రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రజలు ఆనందంలో ఉన్నారు. ఈ సందర్భంగా సుకేష్ మాట్లాడుతూ ఈ విజయం తన తల్లిదండ్రులు, అన్నయ్య, మామయ్యలకు అంకితమన్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్గా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. -
నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు కూలీ మృతి
పిడుగురాళ్ల: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు కూలీ అకురాజుపల్లి మేజర్ కాలువ దోనెలో ఇరుక్కొని మృతి చెందాడు. వివరాల ప్రకారం...మాచవరం మండలం కొత్త గణేశునిపాడు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తమ పంట పొలాలకు నీళ్లను మళ్లించుకునేందుకు బ్రాహ్మణపల్లి వద్ద గల అకురాజుపల్లి మేజర్ కాలువ వద్దకు వెళ్లారు. మేజర్ కాలువలో నీళ్లను కొత్తగణేశునిపాడు గ్రామానికి మరల్చే ప్రయత్నంలో ఆకురాజుపల్లి మేజర్కాలువ, కొత్త గణేశునిపాడు గ్రామ కాలువకు మధ్యలో ఉన్న దోనెలో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు కొత్తగణేశునిపాడు గ్రామానికి చెందిన రైతు కూలీ మల్లెల ధనుంజయరావు (43) వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంత సేపటికి రావటం లేదని చూడగా, దోనె లోపల ధనుంజయరావు మృతి చెంది కనిపించాడు. వెంటనే రైతులు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావుకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు
నరసరావుపేట టౌన్: ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో మధులత హెచ్చరించారు. ప్రభల నిర్వాహకులతో గురువారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ వద్ద ప్రభలు ఏర్పాటు చేసే నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి ప్రభ దగ్గర అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలో కోటప్పకొండ వద్దకు చేరుకోవాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభల నిర్వాహకులను బైండోవర్ చేస్తామన్నారు. ఏ ప్రభ వద్దనైనా సరే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఆయా ప్రభ నిర్వాహకులను బాధ్యులను చేస్తామన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రభలపై నృత్యాలు చేసుకోవాలన్నారు. ప్రభలపై కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా పాటలు పాడటం నిషేధమన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట తహసీల్దార్లు వేణుగోపాల్, హుస్సేన్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఆర్డీవో మధులత -
ఏఆర్ విధులే అత్యంత కీలకం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం నిర్వర్తించే విధులు అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో జిల్లా ఏఆర్ వార్షిక మోబిలైజేషన్ (శిక్షణ) నిర్వహించారు. అనంతరం పోలీస్ కవాతు మైదానంలో పరేడ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వీవీఐపీ, వీఐపీల నివాసాలు, ముఖ్య ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ, వీఐపీల వద్ద వ్యక్తిగత భద్రత విధులు నిర్వర్తించే వారి ప్రవర్తన శైలి, విధుల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. పర్యటనల వేళల్లో భద్రతా తనిఖీలపై అప్రమత్తత అవసరమని అన్నారు. క్రమశిక్షణతోపాటు శారీరక ధృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ రెండు వారాలపాటు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాస్థాయిలో శాంతి, భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శ్రీనివాసరావు, రామకృష్ణారెడ్డి, సురేష్, ఆర్ఎ్స్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ (ఎల్/ఓ) ఏటీవీ.రవికుమార్ అన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా గురువారం పోలీస్ కవాతు మైదానంలో బందోబస్త్ సిబ్బందికి జిల్లా ఏఎస్పీ బ్రీఫింగ్ చేశారు. ఆయన మాట్లాడుతూ వీవీఐపీ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ మార్గాల్లోకి ఇతర వాహనాలు ప్రవేశించకుండా చూడాలని చెప్పారు. పోలీస్ అధికార, సిబ్బంది అనుసరించాల్సిన బందోబస్త్పై వివరించారు. అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే బీడీ బృందంతో తనిఖీలు చేయించాలని సూచించారు. తూర్పు డీఎస్పీ అజీజ్ మాట్లాడుతూ వీవీఐపీల రాకపోకల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. కొత్తపేట పీఎస్ సీఐ వీరయ్య, ఎస్ఐ డి.రమేష్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
పోటాపోటీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు పోటీపోటీగా జరిగాయి. ఆరు పళ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరు రామకోటయ్య గిత్తలు 4,532.8 అడుగుల దూరంలాగి ప్రథమ బహుమతి రూ.70 వేలను కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీకావ్య, శ్రీ మధు ఎద్దులు 4,519.7 అడుగుల దూరంలాగి రెండవ బహుమతి రూ. 50 వేలను దక్కించుకున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఒంగోలు మూర్తి రెడ్డి గిత్తలు 4,500 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ. 40 వేలు గెలుచుకున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఒంగోలు మూర్తి రెడ్డి ఎడ్లు 4,244.1 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ. 30 వేలు, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన అక్కినేని శాన్వి చౌదరి, బాపట్ల జిల్లా మండల కేంద్రమైన వేటపాలెంకు చెందిన దేవరవల్లి జాన్వికారెడ్డి, అన్వితా రెడ్డిల కంబైన్డ్ గిత్తలు 3,999.10 అడుగుల దూరంలాగి 5వ బహుమతి రూ. 20 వేలను గెలుచుకున్నాయి. ఇలా తొమ్మిదోస్థానం వరకు ఎడ్లు బహుమతులు గెలుచుకున్నాయి. ఈ బలప్రదర్శనలో మొత్తం 14 జతలు పాల్గొనగా మిగిలిన 5 జతలకు కూడా రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులుగా అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, బొడపాటి రామకృష్ణ, మూలి రాజారెడ్డి, ఎం. చిన్నశౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ. ఇన్నారెడ్డి, జడ్డు రాజేష్రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా సురపనేని రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావులు వ్యవహరించారు. -
భీష్మ ఏకాదశి లక్ష తులసి దళార్చన
సత్తెనపల్లి: స్థానిక వడ్డవల్లి రామాలయం, వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో 21వ వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా మాతృమూర్తులు, లక్ష్మీనారాయణ సమాజం వారిచే విష్ణు సహస్రనామ పారాయణంతోపాటు లక్ష తులసి దళార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. శుక్రవారం విశేష నవ కలశ స్నపన (అభిషేకం) జరుగుతుందని, భక్తులు అభిషేక ద్రవ్యాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ల ఏర్పాట్లను రూరల్ సీఐ బి.బ్రహ్మయ్య గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 1వ తేదీన రవ్వవరం గ్రామ సమీపంలో కొండ గురునాథస్వామి తిరునాళ్ల జరగనుంది. దీనికి పల్నాడు జిల్లాతోపాటు ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. గత ఏడాది మూడు ప్రభలు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది ఎనిమిదికి పైగా ప్రభలు నిర్మిస్తున్నారు. వేముల, కమ్మవారిపాలెం, గాంధీనగర్, శేషవారిపాలెం తదితర గ్రామాల నుంచి ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. తిరునాళ్ల ముందు రోజు మెట్ల పూజలో మహిళలు పొంగళ్లు పొంగించుకుంటారు. సోమవారం ఎడ్ల పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభల నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన అందుకూరి శేషా చలపతి, మేనక మీనాక్షి దంపతులు, వారి కుమార్తె ప్రీతి మానస, కుమారుడు భార్గవ రామశాస్త్రిలు రూ.3 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో గురువారం ఈవో నలబోతు మాధవీదేవిని కలిసి ఈ విరాళం అందించారు. రేపల్లె: ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలోని 36 కేంద్రాలలో ఫిబ్రవరి 1, 2 తేదీలలో టైపు రైటింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్ల ఏపీ టైప్రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు చెప్పారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల మంది వరకు హాజరవుతున్నట్లు చెప్పారు. రేపల్లె కేంద్రంలో ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న పరీక్షలకు 45 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను, అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా షార్ట్ హ్యాండ్ పరీక్షలు ఈ నెల 30, 31 తేదీలలో ఏడు కేంద్రాలలో నిర్వహించనున్నట్లు వివరించారు. -
లారీ ఢీకొని బాలుడు మృతి
దాచేపల్లి: లారీ ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో అతివేగంతో వస్తున్న లారీ ఢీకొట్టటంతో గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రూవ్వ మహేష్(7) దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. గోపి, నందిని దంపతులకు కుమార్తె అంజలి, కుమారుడు మహేష్ సంతానం. తెలంగాణలోని అడవిదేవులపల్లిలో నివాసం ఉంటున్న గోపి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమార్తె, కుమారుడిని తల్లిదండ్రుల స్వగ్రామమైన దైదలో ఉంచి చదివిస్తోంది. ఈ క్రమంలో నారాయణపురంలోని ఓ లాడ్జిలో పనిచేస్తూ నందిని దాచేపల్లిలో ఉంటోంది. మహేష్కి జ్వరం వస్తుండటంతో అమ్మమ్మ పురం భూలక్ష్మి దాచేపల్లిలో ఉంటున్న కుమార్తె వద్దకు తీసుకువచ్చింది. హస్పిటల్లో చికిత్స అనంతరం తల్లి, అమ్మమ్మలతో కలిసి లాడ్జి వద్దకు మహేష్ వచ్చాడు. ఈక్రమంలో తెలిసిన వ్యక్తి మహేష్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బస్టాండ్ సెంటర్ వద్దకు వచ్చాడు. మహేష్ నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో మహేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని ఆపేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న నందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటివరకు తనతో ఉన్న కుమారుడు మృత్యువాతపడటంతో బోరున విలపించింది. మృతిచెందిన కుమారుడిని ఒడిలోకి తీసుకుని నందిని ఏడుస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. మహేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కిసాన్ సభ ఎగ్జిబిషన్ను జయప్రదం చేయండి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ లక్ష్మీపురం: అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా నేటి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మి దేవి ప్రారంభిస్తారని తెలిపారు, అనంతరం వికసిత్ భారత్ 2047 అనే అంశంపై ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, మాజీ ఎంపీ మధు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రిటైర్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, ఆర్.వీర రాఘవయ్య తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అనంతరం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రజా కళాకారుడు వంగపండు దుష్యంత్ వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే వేమన సాంఘిక నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాడరేవు తీరంలో మృతదేహం లభ్యం చీరాల: వాడరేవు సముద్రతీరంలో బుధవారం ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు ఈపూరుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరుపాలెం ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మీడియా గ్రూపుల్లో పోస్టు చేయడంతో వృద్ధుడి వివరాలు లభించాయి. మృతుడు గ్రంధి గణపతిరావు (70) రామకృష్ణాపురం పంచాయతీ కొత్తపాలెం వాసిగా గుర్తించారు. -
పల్నాడు
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 545.90 అడుగులకు చేరింది. ఇది 200.8378 టీఎంసీలకు సమానం.7జగ్గయ్యపేట: స్థానిక రంగుల మండపం నుంచి పెనుగంచిప్రోలుకు పయనమైన గోపయ్య సమేత తిరుపతమ్మ వారు, సహదేవతలు తిరుగు పయనమయ్యారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.0503 టీఎంసీలు. -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగు పళ్ల సైజ్ విభాగంలో బుధవారం జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన కొప్పుల గోవర్ధన్రెడ్డి, ప్రవలీష్రెడ్డిల గిత్తలు 4,391.6 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 60 వేలను కై వసం చేసుకున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడు గ్రామానికి చెందిన కంబైన్డ్ ఎడ్లు 4,379.3 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 40 వేలను దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామా నికి చెందిన వెంకటగిరి హేమలతనాయుడు గిత్తలు 4,208.9 అడుగుల దూరం లాగి 3 వ బహుమతి రూ. 35 వేలను, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన గిత్తలు 4,066 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.25 వేలను, వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన కె. వెంకట హేమలతారెడ్డి గిత్తలు 3,964 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 18 వేలను గెలుచుకున్నాయి. ఇలా 9వ స్థానం వరకు నగదు బహుమతులు గెలుచుకున్నాయి. బలప్రదర్శనలో మొత్తం 12 జతలు పాల్గొనగా మిగిలిన 3 జతలకు కూడా రూ. 4 వేల చొప్పున ప్రోత్సహక బహుమతులు అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, బొడపాటి రామకృష్ణ, మూలి రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ. ఇన్నారెడ్డి, జడ్డు రాజేష్రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలు రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు. ప్రథమస్థానం సాధించిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతి అందజేస్తున్న దృశ్యం ప్రథమ బహుమతి కై వసం చేసుకున్న మేళ్లచెరువు ఎడ్ల జత నాలుగు పళ్ల విభాగంలో మేళ్లచెరువు ఎడ్లకు ప్రథమస్థానం -
7 నుంచి కొండవీడు ఫెస్ట్
● తుది ప్రణాళిక ఖరారు ● కోటను సందర్శించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే యడ్లపాడు: కొండవీడు కోట గొప్ప పర్యాటక కేంద్రంగా, అలాగే భావితరాలకు ఈ ప్రాంత చరిత్ర తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో కొండవీడు ఫెస్ట్ – 2026 నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి బుధవారం కొండవీడుకోటను సందర్శించారు. ఉత్సవాల నిర్వహణపై శాఖలవారీగా చేపట్టాల్సిన విధులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలు కొండపైనే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఆయా కార్యక్రమాలను వారు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సందర్శకులు తమ వాహనాలను కొండ దిగువన ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో నిలిపి, అక్కడి నుంచి ఘాట్రోడ్డుపైగా ఏర్పాటు చేసిన 10 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాలరీత్యా ఇతర వాహనాలకు కొండపైకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు జాతీయ స్థాయి పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కొండవీడు కోట పూర్వవైభవాన్ని చాటి చెప్పేలా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ‘కొండవీడు హెరిటేజ్ ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రకటించారు. తొలిరోజు ప్రత్యేక అతిథిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు మరో ఇద్దరు మంత్రులు పాల్గొంటారన్నారు. ఉత్సవాల ముందు ఫిబ్రవరి 5న ప్రచార కార్యక్రమం, కొండవీడు చరిత్ర తెలిపే ప్రత్యేక గీతం ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఉత్సవాల అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వేసవి ముగిసే వరకు కొండపై పర్యాటకుల కోసం నైట్ క్యాంపెయిన్, భోజన వసతులు అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు. రూ.220 కోట్లతో చౌడవరం నుంచి కోటకు 5 కి.మీ. టన్నెల్ నిర్మాణాన్ని 2026కల్లా పూర్తి చేసేలా చర్యలు, అలాగే కోటపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం, దర్గా, మసీదులకు పురావస్తుశాఖ అనుమతులతో మరమ్మతులు చేపడతామని తెలిపారు. వీటితో పాటు జంతు ప్రదర్శనశాల, సఫారి రైడింగ్ ఏర్పాటు చేసేదిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా జనవరి 18–23 వరకు జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు, ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో కొండవీడు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జీవీ సంతోష్, డీఎఫ్వో కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, టూరిజం శాఖ మేనేజర్ నాయుడమ్మ, పలు శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటి, సొసైటీ చైర్మన్ సుబ్బారావు, సర్పంచ్లు మానం సాంబయ్య, ఎంపీటీసీ మద్దూరి శ్రీనివాసరెడ్డి, మండలస్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మూడోసారి జరిగే కొండవీడు ఉత్సవాలు గతానికి భిన్నంగా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ... ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 7 గంటలకు యోగా ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఆహ్లాదకర వాతావరణంలో యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టి, 10 గంటలకు అధికారికంగా కొండవీడు ఫెస్ట్ ప్రారంభిస్తామని తెలిపారు. కొండపై ఉత్సవాల్లో భాగంగా బోటింగ్, ట్రెక్కింగ్, రాప్లింగ్, రాక్ క్లైంబింగ్, ఆర్చరీ, హార్స్ రైడింగ్, హెలికాప్టర్ రైడింగ్ వంటి అడ్వంచర్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాండ్ అండ్ ఆర్ట్, ఫ్లవర్, లేజర్, క్రాకర్స్ షో, సినీగాయని గీతామాధురితో సంగీత విభావరి, వెస్ట్రన్స్ డాన్స్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జబర్దస్త్ కళాకారులు, ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రముఖ కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. కొండ దిగువన ఎమ్యూజ్మెంట్ పార్కు, వెహికల్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు, ఇందులో జాయింట్ వీల్, ఎగ్జిబిషన్ వంటివి ఉంటాయి. కొండవీడు సమీప పాఠశాలల విద్యార్థులకు గానం, నృత్యం, అభినయం విభాగాల్లో పోటీలు నిర్వహించి వారి ప్రతిభను ప్రోత్సహించనున్నారు. ముందుగా కొండదిగువన ఉన్న గులాబీతోటను కలెక్టర్ సందర్శించారు. -
మందా సాల్మన్ది రాజకీయ హత్యే
పిడుగురాళ్ల: మందా సాల్మన్ది రాజకీయ హత్యనేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మందా సాల్మన్ కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ, నాయకులు పరామర్శించారు. హత్య వివరాలు, సంఘటనకు సంబంధించిన వాస్తవాలు, కుటుంబ సభ్యులను అడిగి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం సాల్మన్ కుటుంబాన్ని ఆర్థికంగా అదుకోవాలని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వోద్యోగం ఇచ్చి, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. హత్య జరుగుతుందని ముందుగా తెలిసినా నిర్లక్ష్యంగా వహించిన సంబంధిత సీఐ, ఎస్ఐలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని సహాయ, సహకారాలు అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరగే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. కలెక్టర్, ఎస్పీని కలిసిన నేతలు.. సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావులను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బంగా సంజయ్ మాదిగ కలిశారు. సాల్మన్ హత్య అనంతరం కొందరు వారి ఇంటిపైకి రాళ్లు విసురుతూ, దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందివుడుగుల టీఎం రమేష్ మాదిగ, ఎమ్మార్పీస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంగి సుధాకర్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిద్దయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా శ్రీనివాసులు, కోనసీమ జిల్లా సోషల్ మీడియా కన్వినర్ శీలి దశరధ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ -
‘ఉపాధి’ పనుల్లో అవినీతిపై జనాగ్రహం
నకరికల్లు: ఉపాధి హామీ పథకంలో చేయకుండా చేసినట్లు రికార్డులు సృష్టించి లక్షలాది రూపాయలు బిల్లులు చేసుకున్నారని పలువురు ఉపాధి కూలీలు ఆరోపించారు. గతేడాది పనులపై సామాజిక తనిఖీ అనంతరం బుధవారం నకరికల్లులో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలతో ఉపాధి కూలీలు విస్తుపోయారు. ఏడాది కాలంలో 267 పనులకు వేతనాల రూపంలో రూ.61,60 లక్షలు, మెటీరియల్ రూపంలో రూ.51.92 లక్షలు మొత్తం రూ.1.13 కోట్లు ఖర్చు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పూర్తి కాని ఇళ్లకు.. ప్రధానంగా పూర్తికాని ఇళ్లకు 90 రోజుల పనిదినాలు చూపుతూ బినామీ మస్టర్లతో 165 మంది పేరిట బిల్లుల మంజూరు చేసినట్లు, క్షేత్రస్థాయిలో చేపట్టని పనులకు రికార్డుల్లో నమోదు చేసి బిల్లులు మంజూరు చేసినట్లు, కాలువల్లో పూడికతీత పేరిట సంబంధిత ఫొటోలు కూడా లేకుండా రూ.40 లక్షల బిల్లులు మంజూరు చేసినట్లు వెల్లడి కావడంతో ఉపాధికూలీలు మండిపడ్డారు. విదేశాల్లో ఉంటున్న విద్యార్థుల పేరిట.. ఫిలిఫైన్ దేశంలో, ఇతర రాష్ట్రంలో మెడిసిన్ విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థులు, కిరాణా దుకాణదారులు, ఇతర జిల్లాల్లో ఉన్నవారి పేరిట, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారికి పని కల్పించినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డీఆర్పీ రవి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు నమోదు చేసుకొని ప్రజావేదికలో వెల్లడిస్తామన్నారు. ఈ నేపఽథ్యంలో ఈనెల 30న జరగునున్న ప్రజావేదిక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా జిల్లా అధికారులు ఇప్పటికే నకరికల్లు మండలంలో జరిగిన ఉపాధి పనుల తీరుపై ప్రత్యేక నిఘాతో నిధుల గోల్మాల్కు పాల్పడిన వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రామసభలో పీడీఓ కొమ్మవరపు అప్పారావు, సర్పంచి పరసా అంజమ్మ, ఏపీఓ ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు తిరుమలశెట్టి వెంకట్రావు పాల్గొన్నారు. -
మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అన్నిశాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంతరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక అమరేశ్వరాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి ఏర్పాట్ల సమన్వయ కమీటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్నానఘాట్ల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి తగినంత సిబ్బందిని నియమించాలన్నారు. విద్యుత్ శాఖాధికారులు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను చేయాలన్నారు. అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని ఆయన ఎకై ్సజ్శాఖాధికారులను ఆదేశించారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా అధికారులంతా సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలపరంగా పూర్తిస్థాయి ప్రణాళికలను అనుసరించి వారి అవసరాలను కూడా వచ్చే సమావేశంలో వివరించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ డానియేల్, సీఐ అచ్చియ్య, ఆలయ ఈవో రేఖ, డీడీవో రాజగోపాల్, ఎంపీడీవో పార్వతిలతోపాటు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కరుణామయురాలు తల్లి లూర్దుమాత
రెంటచింతల: కరుణామయురాలు తల్లి లూర్దుమాత అని దాచేపల్లి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ బాల శౌర్రెడ్డి అన్నారు. స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా బుధవారం లూర్దుమాత మందిరంలో నిర్వహించిన నవదిన ప్రార్థనలలో సమష్టి దివ్యపూజాబలిని సమర్పించి, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. లూర్దు మాత దేవుని తల్లిగా కొనియాడబడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ ప్రార్థన చేసిన వారు ఆ తల్లి ఆశీస్సులు కోసం తప్పకుండా పొందుతారన్నారు. కానుకమాత చర్చి సహాయక గురువులు రెవ. ఫాదర్ ప్రసన్నకుమార్, కన్యసీ్త్రలు, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన వేడుకలు బుధవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పండితులు రాజశ్యామల హోమం చేశారు. పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: పట్టణానికి చెందిన విద్యార్ధి జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికై య్యాడు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ మహమ్మద్ నజీర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనభర్చి జాతీయ స్ధాయి అండర్–19 షటిల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికై య్యాడు. ఈనెల 30వ తేదీ నుంచి ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో పోటీలు జరుగునున్నాయి. పోటీలో పాల్గొనేందుకు నజీర్ బయలుదేరి వెళ్లాడు. గతంలో రెండుసార్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో నజీర్ పాల్గొన్నాడు. అండర్–14,అండర్–17 విభాగాలలో జాతీయస్థాయిలో ఆడాడు. బాడ్మింటన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–19 పోటీలలో రాష్ట్ర జట్టుకు నజీర్ ప్రాతినద్యం వహించాడు. సోలార్ మోడల్ విలేజ్గా అత్తలూరు అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్గా పల్నాడు కలెక్టర్ ఎంపిక చేసినందున బుధవా రం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ఇంజినీర్ పి.రవి కిరణ్ సోలార్ విద్యుత్ వల్ల ఉపయోగాలు, లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, సోలార్ విద్యుత్ ప్యానెల్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవా ల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పీఆర్టీయూ(డెమోక్రటిక్) జిల్లా అధ్యక్షుడిగా జ్ఞానేశ్వరరావు
సత్తెనపల్లి: డెమోక్రటిక్ పీఆర్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా జువ్వా జ్ఞానేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక అంజీ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను అధ్యక్షత వహించారు. గౌరవ అధ్యక్షుడిగా నర్రా సుధాకరరావు, ప్రధాన కార్యదర్శిగా చొప్పర కమలాకరరావు, ఆర్థిక కార్యదర్శిగా దేవిరెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు బుల్లా రామారావు, జిల్లా కార్యదర్శిగా యు.సుబ్బారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వి.మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా బంకా వాసుబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బెల్లంకొండ నాగసాయి ప్రసాద్, లాకు పిచ్చయ్య ఎంపికయ్యారు. జిల్లా శాఖ మహిళా కార్యదర్శులుగా ఎస్.నాగమణి, కె.శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో హిందీ పండిట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో రెండు గ్రేడ్–2 హిందీ పండిట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిపై భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా బుధవారం ఓప్రకటనలో తెలిపారు. అరండల్పేట 10వ లైనులోని రెసిడెన్షియల్ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీనివాసరావుపేటలోని శ్రీరవీంద్రనాద్ ఠాగూర్ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కాంట్రాక్టు పద్దతిపై మూడేళ్లు పని చేసేందుకు హిందీ పండిట్ శిక్షణతో పాటు టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు సంబంధిత పాఠశాలల కరస్పాండెంట్లకు వ్యక్తిగతంగా, లేదా సీఎస్ఈ.ఏపీ.ఇన్/ఎయిడెడ్రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు జీవోఎంఎస్ 58 ప్రకారం ఏకీకృత జాబితాను డీఈఓ పోర్టల్లో ప్రచురించి, నియామక పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటల నుంచి అవబృధ స్నానం, చక్రతీర్థం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, ఋత్విక్ సమ్మానం, వేదాశీర్వాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. -
● చీరాల ఆర్వోబీ కింద మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ● కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ● మృతుడు స్వర్ణ వాసిగా గుర్తింపు
మెడికల్ వ్యాపారికి జైలు నరసరావుపేట టౌన్: పట్టణానికి చెందిన ప్రముఖ మెడికల్ వ్యాపారి కూనిశెట్టి శ్రీనివాసులుకు చెల్లని చెక్కు కేసులో 6 నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పట్టణానికి చెందిన తూనుగుంట్ల సుబ్బారావు వద్ద వాసవీ మెడికల్ వ్యాపారి కూనిశెట్టి శ్రీనివాసులు 2019 సంవత్సరంలో రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లింపులో భాగంగా చెక్కు అందజేశాడు. ఖాతాలో నగదు లేకపోవటంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించారు. ఫిర్యాదు దారుడికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. అందుబాటులో ఎండీటీ మందులు నరసరావుపేట: కుష్ఠువ్యాధిని ఎండీటీ (బహుళ ఔషధ చికిత్స) మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని, ఈ మందులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తారని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్పై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది వివక్షత అంతం చేయటం, గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందన్నారు. వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి చికిత్స అందజేస్తే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చన్నారు. యువకుడి హత్య! చీరాల: చీరాల్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆర్వోబీ కింద రైలు పట్టాల మధ్య రక్తమడుగులో ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాంపై కత్తి పోట్లు, తీవ్ర గాయాలు ఉండటంతో దారుణంగా కొట్టి హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మృతిపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మృతుడి వివరాలు లభించాయి. మృతుడు కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండె త్రినాఽథ్(17)గా గుర్తించారు. మృతుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. దీంతో మృతుడి బంధువులు చీరాల వచ్చి గుర్తించారు. అనంతరం మృతుడు వినియోగించిన బైక్ ఘటనా స్థలానికి దగ్గరలో కనుగొన్నారు. మంగళవారం రాత్రి పనికి వెళుతున్నానని చెప్పి బైక్పై చీరాల వచ్చాడు. అయితే రాత్రి ఇంటికి వెళ్లలేదు. ఉదయం చీరాల ఆర్వోబీ కింద శవమై కనిపించాడు. మృతి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తలపై, శరీరంపై ఉన్న గాయాలను బట్టి దుండగులు రైల్వే వంతెన దగ్గకు తీసుకువచ్చి రాళ్ళతో కొట్టి చంపి పడవేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై ఒన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం
పిడుగురాళ్ల: శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి వారి కల్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న స్వామి వారి దేవాలయంలో ఈ వేడుక నిర్వహించారు. రథోత్సవం, తిరునాళ్ల మహోత్సవం ఘనంగా చేశారు. పిడుగురాళ్ల పట్టణానికి ఇదే పెద్ద పండుగ. కులమతాలకు అతీతంగా స్వామవారి తిరునాళ్లకు భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మహా అన్నదానం చేశారు. మధ్యాహ్న సమయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. యువకులు భారీ సంఖ్యలో హాజరై జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ రథం లాగుతూ ముందుకు సాగారు. పోలీస్ స్టేషన్ నుంచి ఐలాండ్ సెంటర్ మీదుగా అడితీల సెంటర్ వరకు రథం నడిపించారు. తిరిగి అక్కడి నుంచి నేరుగా ఆలయానికి తీసుకొచ్చారు. తిరునాళ్ల వాతావరణం సందడిగా కనిపించింది. పలువురు దంపతులు పీఠలపై కూర్చొని స్వామి వారి కల్యాణాన్ని చేయించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు -
ప్రజలపై మరింత భారం
భూముల విలువ పెంపు పేరిట అదనపు రాబడికి చంద్రబాబు సర్కార్ సన్నాహాలుచంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రియల్ వ్యాపారం ఢమాల్ అంటూ పడిపోయింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ప్రజలపై రెండోసారి భారం మోపేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం రియల్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షలు, రూ.కోట్లు విలువ చేసే ప్లాట్లు, భూములను కొనుగోలు చేసేవారు లేక అప్పులకు వడ్డీలు పెరిగి అవస్థలు పడుతున్నారు. కొంత ధర తగ్గించి నష్టాలకై నా వాటిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నా కొనేవారే లేరు. ప్రస్తుతం అరకొరగా రియల్ వ్యాపారం చేస్తున్న వారికి పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు అదనపు భారం కానున్నాయి. సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజలపై బాదుడే బాదుడు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నెత్తిన భారం మోపిన సర్కారు... ఇప్పుడు భూముల ధరలు మరోసారి పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ కమిషనర్ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలను సవరించనున్నారు. దీనిపై ప్రజలు తమ సలహాలు, అభ్యంతరాలు తెలపాలని జిల్లా యంత్రాంగం కోరింది. సవరణలు ఇలా... ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల సవరణ ప్రక్రియను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చేపడతారు. సదరు భూముల విలువలను రెవెన్యూ, మున్సిపల్ పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్చించి నిర్ణయిస్తారు. సవరించిన విలువలకు రివిజన్ కమిటీ ఆమోదముద్ర వేస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా .. ఈ నెల 25వ తేదీ నుంచి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రతిపాదిత ధరల వివరాలు పొందుపరిచారు. వీటిపై ఈ నెల 29వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించడం, డేటా ఎంట్రీ పూర్తి చేసి, చెక్ లిస్ట్ జనరేషన్, ఫారం ఒకటి – 1, 4 పరిశీలన, 30న అభ్యంతరాల పరిష్కారం, 31న మార్కెట్ విలువల సవరణ కమిటీల ద్వారా తుది అనుమతులు, ఫిబ్రవరి 1వ తేదీన పెరిగిన విలువ అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసింది. నివాస స్థలాలపై సైతం... కమర్షియల్ స్థలాలు కాకుండా నివాస స్థలాలపై సైతం భారం మోపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీని వలన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి తోడు ఆర్సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, సెల్లార్, సినిమా హాళ్లు, పూరిల్లు, తదితర నిర్మాణాల విలువలను సైతం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం చదరపు అడుగుకు 10 నుంచి 30 శాతం వరకు వాటి మార్కెట్ విలువ పెంచనున్నారు. ఫలితంగా సామాన్యులు సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడనుంది. 10 నుంచి 30 శాతం వరకు పెంపు... జిల్లాలో భూముల విలువ పెంపుపై ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. సగటున 10 నుంచి 30 శాతం వరకూ పెంపుదల చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుకూలంగా జిల్లాలో భూముల ధరలు పెంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. భారీగా పెరగనున్న భూముల ధరలు సంక్షోభంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేటి వరకు సలహాలు, సూచనలకు అవకాశం ఫిబ్రవరి నుంచి పెంచిన ధరలు అమలు గెజిట్ విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం 10 నుంచి 30 శాతం పెంచేందుకు అవకాశం ప్రాంతాన్ని బట్టి మారనున్న ధరలు చంద్రబాబు 18 నెలల పాలనలో రెండోసారి పెంపు జిల్లాలో క్రయవిక్ర యాలకు సంబంధించి తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు ప్రస్తుత భూముల రిజిస్ట్రేషన్లకు భూమి ధరలో 7.5 శాతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు భూమి ధర రూ. లక్ష ఉంటే 7.5 శాతం రిజిస్ట్రేషన్ అంటే రూ. 7,500 చెల్లించాలి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20 శాతం భూమి ధర పెరుగుతుంది. అంటే మార్కెట్ ధర రూ. 1.20 లక్షలు అవుతుంది. దీనికి 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ. 9 వేలు చెల్లించాలి. అదనంగా మరో రూ.1,500 రిజిస్ట్రేషన్ చార్జీ భారం ప్రజలపై పడనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సవరణ కోసం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ ఆమోదంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోని నోటీసు బోర్డు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లో వివరాలు పొందుపరిచారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతాం. –బి.అశోక్కుమార్, సబ్ రిజిస్ట్రార్, సత్తెనపల్లి -
కృష్ణానదిలో రసాయనాలు కలవలేదు
దాచేపల్లి: కృష్ణానదిలో రసాయనాలు, విష పదార్థాలు కలవలేదని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారిణి షేక్ నజీరాబేగం పేర్కొన్నారు. మండలంలోని తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణానదిలోని నీళ్లను బుధవారం పరిశీలన చేశారు. నదిలో రసాయనాలు, విష పదార్థాలు కలవటం వలన నీళ్లు రంగుమారాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో నజీరాబేగం నదిలోని నీటిని పరిశీలన చేసి నీటి నమూనాలు సేకరించారు. ఈ సందర్భం మీడియాతో మాట్లాడారు.. కృష్ణానదిలో నీటి నమూనాలు సేకరించి గత 20 రోజుల క్రితం జోనల్ ల్యాబ్రేటరీ, హైదరాబాద్ ల్యాబ్లకు పంపించామని, ల్యాబ్లలో పరీక్షలు చేసిన తరువాత నీటిలో రసాయనాలు, విష పదార్ధాలు కలవలేదని తేలిందని చెప్పారు. నదిలో గుర్రపు డెక్క, నాచు ఎక్కువగా పెరగటం వలన సహజసిద్ధంగా నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారినట్లుగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారన్నారు. ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగునీరు ఎక్కువగా నదిలో కలవటం వలన కూడా నీళ్లు రంగుమారతాయని, గ్రామ పంచాయతీగా ఉన్న తంగెడలో ఎక్కువమొత్తంలో మురుగు వచ్చే అవకాశం లేదన్నారు. తంగెడకు సమీపంలోని వాడపల్లి వద్ద మూసినది నుంచి ఎక్కువగా మురికినీరు వస్తుందనే అంశంపై పరిశీలన చేస్తున్నామన్నారు. కృష్ణానదిలోని నీటిని ఫిల్టర్ చేసిన తరువాతనే ఉపయోగించాలని ఆమె సూచించారు. మరోసారి కృష్ణానదిలో నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కి పంపించి పరీక్షలు చేయిస్తామని, ప్రజలు ఆందోళన చెందకుండా సురక్షితమైన పద్ధతుల్లో నీటిని వినియోగించాలని రీజనల్ అధికారిణి నజీరాబేగం చెప్పారు. ఈ పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి గుండ్రెడ్డి కోటేశ్వరరావు, షేక్ హస్సన్ అహ్మాద్, జానపాటి సీతారామశర్మ తదితరులున్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి షేక్ నజీరాబేగం -
జిల్లాలో 22 బార్లకు రీనోటిఫికేషన్
● ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తుల స్వీకరణ ● 5న లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు నరసరావుపేట టౌన్: జిల్లాలో 22 బార్ అండ్ రెస్టారెంట్లకు రీ–నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 22 బార్ల భర్తీకి రీ–నోటిఫికేషన్ జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. వీటిలో నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 7, చిలకలూరిపేట మున్సిపాలిటీలో 5, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 4, మాచర్లలో 3, వినుకొండలో 3 ఉన్నట్లు తెలిపారు. నేటి నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుందన్నారు. దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000 మొత్తం రూ.5,10,000 నాన్ రిఫండబుల్ అని తెలిపారు. ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే ఆ దుకాణానికి లాటరీ పద్దతిన టెండర్ పిలవటం జరుగుతుందన్నారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి కేటాయించటం జరుతుతుందని తెలిపారు. సమావేశంలో సీఐ సోమయ్య పాల్గొన్నారు. -
మోతడక చలపతిలో ‘ఉద్ఘోష్ –2026’
తాడికొండ: మోతడక చలపతిలో ఫిబ్రవరి 20–21 తేదీలలో ఉద్ఘోష్– 2026 పేరిట సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఈ మేరకు కళాశాలలో ఉద్ఘోష్ – 2026 బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ సంబరంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాసరావు, డీన్ ఆఫ్ అడ్మిషన్స్, ఆపరేషన్స్ డాక్టర్ కె.కిరణ్ కుమార్, డీన్లు డాక్టర్ పి.బాల మురళీకృష్ణ, డీన్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ వీవీ సుబ్బారావు, కన్వీనర్లు డాక్టర్ పి.రత్నబాబు, జి.రామచంద్రరావు వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హౌసింగ్ లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలోని హౌసింగ్ లేఅవుట్స్లో నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి హౌసింగ్ లేఅవుట్స్, పీఎంఎవై ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్లో ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటుకు సంబంధిత అధికారులు వెంటనే ప్రతిపాదనలు అందించాలన్నారు. గతంలో వివిధ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వినియోగించిన నిధుల వివరాలను అందించాలన్నారు. లే అవుట్స్ వారీగా లబ్ధిదారులకు కేటాయించినవి, కేటాయించిన వాటిలో నిర్మాణాలు ప్రారంభించినవి, పూర్తి అయినవి, కేటాయించకుండా ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలను మ్యాప్లతో సహా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆప్షన్–3లో నిర్మించిన ఇళ్లలో స్టేజ్, క్వాలిటీ డివియేషనన్స్ను కాంట్రాక్టర్లతో వెంటనే సరిచేసేలా హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఖాజావలి, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్డీవో కె.శ్రీనివాసులు, తెనాలి కమిషనర్ జెఆర్ అప్పలనాయుడు అధికారులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన రసవత్తరంగా జరిగాయి. రెండు పళ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరిల గిత్తలు 4,082.10 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 50 వేలను కై వశం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన చాగంటి శ్రీనివాస చౌదరి, ప్రకాశం జిల్లా నాగుల్పుడు మండలం ఉప్పుగుడూరు గ్రామానికి చెందిన బెల్లం రిత్వీక్ చౌదరి, యువాన్ చౌదరి కంబైన్డ్ గిత్తలు 3,880.2 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ.35 వేలను దక్కించుకున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ గిత్తలు 3,603.1 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ. 30 వేలను కై వశం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడదీవికి చెందిన ఉమ్మారెడ్డి ప్రభుకుమారి, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన నుసుముల రామకృష్ణామాచారి కంబైన్డ్ గిత్తలు 3,361.5 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.25 వేలను దక్కించుకున్నాయి. తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన శివరామకృష్ణ గిత్తలు 3,258.2 అడుగుల దూరం లాగి 5వ బహుమతి రూ. 17 వేలను గెలుచుకున్నాయి. ఇలా పదవ స్థానం వరకు బహుమతులు పంపిణీ చేశారు. బలప్రదర్శనలో మొత్తం 15 జతలు పాల్గొనగా మిగిలిన 5 జతలకు కూడ రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులుగా అందజేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఎ.ఇన్నారెడ్డి, వై.జోజిరెడ్డి, జి.సుమంత్రెడ్డి, బి.రామకృష్ణ, ఎం.రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, కె.జోసఫ్రెడ్డి, జి. కస్పారెడ్డి, వి.కోటిరెడ్డి, ఓ.ఇన్నారెడ్డి, జె.రాజేష్రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, ఎం.రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, శ్రీనివాసరావులు వ్యవహరించారు. రెండు పళ్ల విభాగంలో ప్రథమస్థానంలో నిలిచిన బాపట్ల జిల్లా ఎడ్లు -
దళితులపై దమనకాండ దారుణం
మాచర్ల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక దళితులపై దాడులు, దౌర్జన్యాలు, గ్రామ బహిష్కరణలు ఎక్కువైపోయాయని, ఆఖరికి వారిని హత్యలు కూడా చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సి సెల్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావులు అన్నారు. మంగళవారం మాచర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉంటున్న దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగికదాడులు ఎక్కువయ్యాయన్నారు. మొదటి నుంచి దళితులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే భావనతోనే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగంతో వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఈక్రమంలో ఆదోనిలో గోవిందమ్మ, అద్దంకిలో చింతల శ్రీను, పిన్నెల్లిలో మందా సాల్మన్లపై దాడులు జరిపారన్నారు. వారిలో సాల్మన్ను హతమార్చారన్నారు. నంద్యాల ప్రాంతంలో దళిత మహిళ పై లైంగికదాడి చేశారన్నారు. అనేక గ్రామాల్లో సాంఘిక బహిష్కరణ చేస్తూ దళితులను చిన్నచూపు చూస్తూ భారత రాజ్యాంగం కాదని తమ సొంత రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేసి దళితులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేయటం దారుణమన్నారు. – రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎస్సీ అయివుండి కూడా దళితుల పై జరుగుతున్న దాడులు అరికట్టలేకపోవటం బాధాకరమన్నారు. దళితుల పై దాడులు అరికట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని, జిల్లాలో జరిగిస్తున్న దమన కాండను ఆపివేయాలన్నారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మందా సంతోష్, వేల్పుల గురవయ్య, ఎస్సి సెల్ నేత కందుకూరి మధు, జిల్లా నాయకులు కొమ్ము బొంగురు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పవన్, కోటా రాజేష్ తదితరులున్నారు. -
కుష్ఠువ్యాధి నిర్మూలనకు సహకరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల నరసరావుపేట: జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమానికి చెందిన బ్రోచర్ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ పక్షోత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కాలనీలు, విద్యాలయాలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లెప్రసీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి, డెప్యూటీ జిల్లా కుష్ఠు, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : గుంటూరు జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేసిన టీవీ విజయలక్ష్మీని నెల రోజుల కిందట సెర్ప్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ఆమెను ఏలూరు డీఆర్డీఏ పీడీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తాడేపల్లి పోలీసులకు మంగళవారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్ఐ అపర్ణ కృష్ణానది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని, ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి శరీరంపై నలుపు నిలువు చారలు కలిగిన చొక్కా, సిమెంట్ కలర్ ఫ్యాంటు ఉందని, చేతికి దారాలు ఉన్నాయని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు. గుంటూరు ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) చేపట్టిన పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులో పోరాట కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిటీ ఏర్పాటుతోపాటు సీపీఎస్కు ప్రత్యామ్నాయంగా రోడ్మ్యాప్ ప్రకటించి, రూ.34 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదన్నారు. అందుకే దశల వారీ ఉద్యమానికి ఎస్టీయూ పిలుపు ఇచ్చిందన్నారు. ఈనెల 30న మండల స్థాయిలో తహసీల్దార్లకు మెమొరాండం సమర్పించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్టీయూ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఈ నెల 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 నుంచి వ్యవసాయ ప్రదర్శన, వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై జాతీయ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. నాలుగు రోజులు పాటు 14 అంశాలపై సదస్సులు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై దశలవారీ ఆందోళన
ఎస్టీయూ నాయకులు నరసరావుపేట ఈస్ట్: ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ తెలిపారు. మూడు దశల ఆందోళన కార్యక్రమం కరపత్రాన్ని మంగళవారం సాయంత్రం సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. సీపీఎస్ రద్దు రోడ్మ్యాప్, రూ.34వేల కోట్లు బకాయిలు చెల్లింపులు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీ ఆందోళనలో భాగంగా ఈనెల 30న మండల కేంద్రాలలో వినతిపత్రాల సమర్పణ, ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఫిబ్రవరి 25న ఛలో విజయవాడ రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. దశల వారీ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు కోలా యేసయ్య, జిల్లా ఆర్ధిక కార్యదర్శి షేక్ సుభానీ, కార్యదర్శి ఈ.రామకోటయ్య పాల్గొన్నారు. -
మేజర్ కాలువలో పడి లస్కర్ మృతి
రొంపిచర్ల: మేజర్ కాలువలో పడి లస్కర్ మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని మాచవరం మేజర్ వద్ద చోటుచేసుకుంది. సంతగుడిపాడు గ్రామానికి చెందిన ఎనుముల శ్రీనివాసరెడి (55) ఎన్ఎస్పీ కెనాల్స్లో లస్కర్గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా మాచవరం మేజర్ కాలువపై డ్రాప్ వద్ద సాగునీటిని లెవల్స్ పరిశీలిస్తున్నాడు. ఇంతలో తూలుడు వచ్చి కాలువలో పడిపోయాడు. నీటిలో మునిగిన శ్రీనివాసరెడ్డి బయటకు రాలేకపోయాడు. అక్కడే సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంటనే శ్రీనివాసరెడ్డిని కాలువ నుంచి బయటకు తీసి నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తున్న మహిళలకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన మహిళలపై నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వలుముల రమణ, గాలం గిరిజలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. సత్యవతి తీర్పు చెప్పారు. రూ.వెయ్యి కట్టని పక్షంలో 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కేసులో ప్రాసిక్యూషన్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వై.సీహెచ్.అశోకవాణి వాదనలు వినిపించారు. లక్ష్మీపురం: గుంటూరు, అమరావతి రోడ్లోని జంపని టవర్స్లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు కలిసి సార్వత్రిక సమ్మె నోటీసు మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక ఒక్కరోజు సమ్మెలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు, మినీ టీచర్లు, పాల్గొంటున్నారని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శారమ్మ, రమాదేవి, కె.సుబ్బారావమ్మ, జ్యోతి గంగాదేవి తదితరులు ఉన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: వివిధ మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్బాషాను డీఈవో కార్యాలయంలో కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో కార్యాలయాల్లో ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు అప్డేట్ కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. క్లోజర్లు, బకాయిలు, మెడికల్ బిల్లులను చేయాల్సి ఉన్నా సిబ్బంది లేక చేయడం లేదని, సంబంధిత బిల్లులను ఉపాధ్యాయులతో చేయించుకోవాలని చెబుతున్నారని అన్నారు. కొల్లిపర, తుళ్లూరు మండలాల్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. డీఈవోని కలసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.కేదార్నాధ్, కాలేషావలి ఉన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
వారానికి ఐదురోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ నరసరావుపేట: వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యూనియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ), యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్బీయు), నరసరావుపేట లోకల్ బ్రాంచెస్కు చెందిన బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అరండల్పేటలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ నరసరావుపేట రీజనల్ సెక్రటరీ పీఎంయూ రామకృష్ణ మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయ న్నారు. వారంలో ఐదురోజుల పనిదినాలు అమలు చేయటానికి ప్రభుత్వ అనుమతి కోరుతున్నామన్నారు. ప్రస్తుతం రెండు, నాలుగు శనివారాల్లోనే సెలవులు అమలౌతున్నాయన్నారు. మిగిలిన శనివారాలను సైతం సెలవులుగా ప్రకటించాలని కోరగా స్పందన లేకపోవటంతో 2025 మార్చి 24, 25 రెండురోజుల పాటు సమ్మెకు పిలుపుఇవ్వటం జరిగిందన్నారు. ప్రభుత్వం కోరిన మీదట సమ్మె వాయిదా వేశామన్నారు. ఫైనాన్షియల్ రంగంలో అన్నీ సంస్థలు వారానికి కేవలం ఐదురోజులే పనిదినాలుగా అమలు చేస్తున్నందున యూఎఫ్బీయు మళ్లీ సమ్మెకు పిలుపు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఐబీఓసీ రీజనల్ సెక్రటరీ రాముడు, నరసరావుపేట రీజియన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ బి.చిన్నపరెడ్డి, ఎన్సీబీసీ రీజినల్ సెక్రట రీ బి.కుమార్నాయక్, సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, నకరికల్లు, కారుమంచి, బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట, మండలా ప్రభు త్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రతి నెలా మొదటి గురువారం ‘గ్రామ ఆరోగ్య దర్శిని’
నరసరావుపేట: జిల్లాలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సామాజిక భాగస్వామ్యంతో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా మొదటి గురువారం ‘గ్రామ ఆరోగ్య దర్శిని’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్లో కార్యక్రమ రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో ప్రజారోగ్యం, పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక భాగస్వామ్య ఆరోగ్య నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మొదటి ‘గ్రామ ఆరోగ్య దర్శిని’ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణ గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలో గ్రామ ఆరోగ్య దర్శిని కమిటీలు ఏర్పాటు చేస్తారన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్, పేరెంట్స్ కమిటీ ప్రతినిథి, డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామంలో ఉన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి నెల రోజుల కాలంలో అమలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. -
కల్యాణ వేంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ
చిలకలూరిపేట: పట్టణంలోని పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి హనుమంత వాహన సేవ గ్రామోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అగ్నిధ్యానం, నిత్యహోమం, బలిహరణ, మహాశాంతి హోమం వంటి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై 9వ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో హయగ్రీవ హోమం, హనుమద్వామన సేవ ఘనంగా జరిగాయని, స్వామి వారు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారని తెలిపారు. సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు అశ్వవాహన సేవ నిర్వహించామ ని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదా లు స్వీకరించారని వెంకటాచార్యులు తెలిపా రు. 2న బుద్ధునితో నా ప్రయాణం నాటిక ప్రదర్శన రేపల్లె:పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం ప్రదర్శించనున్న బుద్ధినితో నా ప్రయాణం, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ దృశ్య రూపకాన్ని ప్రతిఒక్కరూ తిలకించాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దారం సాంబశివరావు, ది ఆది ఆంధ్ర నవ బుద్ధిస్ట్ సొసైటీ కార్యదర్శి దోవా రమేష్ రాంజీలు కోరారు. వీటికి సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. రేపల్లె ప్రాంతానికి చెందిన బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్ సహకారంతో మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సౌజన్యంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ దృశ్య రూపకాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడు ఆలూరి బిక్షాలు, నాయకులు బేతపూడి భాస్కరరావు, కూచిపూడి రవీంద్ర, కనపర్తి రవికిరణ్, బేతపూడి వెంకటేశ్వరరావు, రెబ్బా కోదండరాం, చెరుకూరి లక్ష్మణరావు, కర్రా బాబురావు, నలుకుర్తి శశి కుమార్, నీలా రాజ్ కుమార్, చందోలు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు తాడేపల్లి రూరల్: ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఓ కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు ప్రకటించడంతో తోటి కళాకారులు మంగళవారం అతడిని అభినందించారు. ఉండవల్లికి చెందిన దర్శకుడు గాదె నాగభూషణం రూపొందించిన జీవనధార లఘు చిత్రంలో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు లభించింది. ఈనెల 31వ తేదీన హైదరాబాద్లో ఈ అవార్డును అందుకోవాలని సూచిస్తూ లేఖ అందడంతో ఉండవల్లిలో కళాకారుల్లో నూతన ఉత్తేజం పెరిగింది. ఈ సందర్భంగా గాదె నాగభూషణం మాట్లాడుతూ త్రినేత్ర ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో జీవనధార అనే లఘు చిత్రాన్ని రూపొందించామని అందులో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు రావడం చాలా ఆనందించదగ్గ విషయమని, రోటరీక్లబ్ కళాచైతన్యం అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలలో ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు. -
అక్రమ కేసులతో నిర్బంధం
నెల్లూరు రూరల్: అక్రమ కేసులతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడ్ని జైల్లో నిర్బంధించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపురెడ్డి శేఖర్రెడ్డి, బ్రహ్మనాయుడు మంగళవారం ములాఖత్ అయ్యా రు. ఆయన మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు, రైతులు ఆరాధించే వ్యక్తి పిన్నెల్లి అని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి అని చెప్పారు. రెడ్బుక్లో భాగంగా వీరిని అక్రమ కేసు లో జైలుకు పంపారని ఆరోపించారు. మాచర్లలో ఇటీవల రెండు హత్యలు జరిగాయని, వారు గానీ బయట ఉంటే ఆ కేసులను సైతం వీరిపై మోపే వారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కక్షగట్టి తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. అరాచకాలు తప్ప.. అభివృద్ధి ఏదీ..? టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో అరాచకాలు అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని, సంబంధం లేని కేసులో పిన్నెల్లి సోదరులను జైలుకు పంపారని వెంకటరెడ్డి ఆరోపించారు. టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడి ఒకర్నొకరు చంపుకొంటే ఆ హత్యను పిన్నెల్లి సోదరులకు ఆపాదించారని చెప్పారు. సంబంధం లేని కేసులో 48 రోజులుగా జైల్లో గడుపుతున్నారని తెలిపారు. అనంతరం అశోక్బాబు మాట్లాడారు. ఎలాంటి సంబంధం లేని కేసుల్లో పిన్నెల్లి సోదరులను ఇరికించడం దారుణమన్నారు. ఇలా చేస్తే రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటాననే ఆ పార్టీ శ్రేణులే ఆలోచిస్తున్నారని చెప్పారు. -
భవతీ బిక్షాం దేహీ
అప్పుల్లో జెడ్పీ గుంటూరుఎడ్యుకేషన్:ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ అప్పుల్లో కూరుకుపోతోంది. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా పనులకు అనుమతులు ఇచ్చేస్తున్న కారణంగా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి అంగీకారం లే కుండా చైర్పర్సన్ ఏకపక్షంగా ఇస్తున్న అనుమతు లతో జెడ్పీ ఖజానా దివాళాకు చేరువైంది. జెడ్పీ ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను రాజకీయ ప్రయోజనాలు, సొంత అవసరాలకు వాడుకోవడంతో జెడ్పీ పరిస్థితి దారుణంగా మారుతోంది. బడ్జెట్ కేటాయింపులకు మించి మంజూరు చేస్తున్న కారణంగా బిల్లులు చెల్లించే సమయంలో నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం సొంతంగా ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమవుతున్న జెడ్పీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలోనూ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. పాలకురాలి వ్యవహారశైలి కారణంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలను పక్కనపెట్టి సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పాలకుల వైఖరి కారణంగా జెడ్పీని ప్రతిష్ట మసకబారుతోంది. ఫలితంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు పను లు చేయలేక, ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నా రు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్, జనరల్ బాడీ సమావేశాలకు హాజరై అజెండా ఆమోదానికి పరిమితమవుతున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక రాజ్యాంగం కల్పించిన హక్కులను అస్త్రంగా వాడుకుంటున్నారు. తమ మండలాల్లో తమను సంప్రదించకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధ్యానం ఇస్తూ చైర్పర్సన్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు సమావేశాలను అడ్డుకుంటున్నారు. నిధుల లభ్యత, పనుల కేటాయింపుల్లో పొంతన శూన్యం జెడ్పీలో నిధుల లభ్యత, కేటాయించిన పనులకు పొంతన ఉండటం లేదు. 15వ ఆర్థిక సంఘం సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి జెడ్పీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19.51 కోట్లు కేటాయించింది. అయితే సీపీడబ్ల్యూఎస్ టైడ్, అన్టైడ్ కింద రూ.34.12 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా వచ్చే నిధులకు, మంజూరు చేసిన పనులకు పొంతన లేకపోవడం జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8.84 కోట్లు కాగా, రూ.14.61 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. దీంతో సంబంధిత పనులకు చెల్లింపులు జరపడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే జెడ్పీ సాధారణ నిధుల్లో సైతం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధుల లభ్యత కేవలం రూ.2.90 కోట్లుగా ఉండగా, రూ.11.27 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. జెడ్పీ నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి మరింత ఆందోళనకరంగా ఉంది. జెడ్పీకి స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి న తరువాత కేవలం రూ.40 లక్షలు విదిల్చారు. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతో పా టు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సై తం పనులు కేటాయించేశారు. టీడీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీటీసీలతో చర్చించకుండా చైర్పర్సన్ ముందస్తుగా అనుమతులు ఇచ్చేయడంతో జెడ్పీలో ఆర్థిక ప్రణాళిక దిగజారింది. -
పల్నాడు
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.1406 టీఎంసీలు. ఎస్పీకి డైరీ అందజేత నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు మంగళవారం పోలీస్ అసోసియేషన్ డైరీ (2026)ని జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు.నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.3,800, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. 7 -
ఏ ఏ గ్రామాల నుంచి ఎంతమంది
వ్యవసాయ పనులు లేకపోవడంతో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలలో పొగాకు బేరన్లలో పనులకు పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం నుంచి కోపూరు రాజు, నీసు నాగయ్య, గేరా పెద్దోడు, కట్ట సౌరీలు, దారా లాజరు ముఠాల ద్వారా సుమారు 100 మంది పనులకు వలస వెళ్లారు. కాశిపాడు గ్రామం నుంచి 25 కుటుంబాలు, లగడపాడు గ్రామం నుంచి 60 మంది, పొడపాడు, కనిగండ్ల, 75 తాళ్లూరు, ఖమ్మంపాడు, బలుసుపాడు గ్రామాల నుంచి కూడా పలువురు వలస బాట పట్టారు. అమరావతి మండలం జూపూడి గ్రామంలోని 300 మందికి పైగా కూలీలు వలస వెళ్లారు. దొడ్లేరు, మునగోడు, పెద్దపాలెం పలు గ్రామాలు నుంచి పెద్ద సంఖ్యలో వ్యవసాయ కూలీలు పనులు కోసం తరలి వెళ్లారు. -
పొట్ట చేతపట్టుకుని..!
పెదకూరపాడు : చేతినిండా పని లేదు..... పూట గడవడం లేదు... పిల్లలను సాకడం ఎలా.....నెల నెలా తీసుకున్న అప్పులు కట్టేది ఎలా.. బతుకు బండిని నడిపించేది ఎలా... దూరమైనా పని దొరికిన కాడకే పోదామంటూ పల్లె జనం వలస బాట పట్టారు. రాజధాని ప్రాంతంగా చెప్పుకునే పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామాలలోని ప్రజలు వ్యవసాయ పనులు లేక పొట్టకూటి కోసం కోనసీమ వైపు పరుగులు పెడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్లు, వందల సంఖ్యలో కుటుంబాలు వలస వెళుతున్నాయి... ఫలితంగా పల్లెలు బోసి పోతున్నాయి. పలు గ్రామాల్లో ఏ ఇల్లు చూసినా తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా దర్శనమిస్తున్నారు. ఉపాధి లేకపోవటం, ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు లేకపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముంచేసిన పత్తి పంట... పెదకూరపాడు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వాణిజ్య పంటలైన పత్తి, మిరప ఎక్కువ సాగు చేస్తుంటారు. ఆరు నెలలు మాత్రమే ఖరీఫ్ పంటలు సాగు చేస్తుంటారు. ఎక్కువగా వ్యవసాయ పనులు జులై నుంచి మార్చి వరకు ఉంటాయి. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేసిన పత్తి దిగుబడులు లేక నవంబర్ నెలలోనే రైతులు దున్నేశారు. మిరప పంట ఫిబ్రవరి నెలాఖరు నుంచి దిగుబడులు వస్తాయి. ఈ ప్రాంత వ్యవసాయ కూలీలు నవంబర్ నెల నుంచి వ్యవసాయ పనులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే వలస బాట పట్టారు. ఉపాధి పనులు కొందరికే... నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి పనులు జరుగుతున్నా కొందరికి మాత్రమే ఉపాధి సిబ్బంది పనులు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే పిలిచి పనులిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంగా గొప్పలు చెప్పుకుంటున్న పెదకూరపాడు నియోజకవర్గంలో వ్యవసాయ కూలీలకు, సన్న, చిన్న కారు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేదా ఉపాధి భృతి ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. పాటిబండ్ల గ్రామంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధి -
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేట టౌన్: మార్చి 14న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో జిల్లా న్యాయమూర్తులు వై.నాగరాజు, సీహెచ్వీఎన్ శ్రీనివాసరావు, వి. శరత్బాబు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి జియావుద్దీన్లు మంగళవారం 13వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఇరుపక్షాల వారిని కోర్టుకు రప్పించినట్లయితే న్యాయాధికారులు చట్టపరంగా అన్ని అంశాలను వారికి వివరించి కేసు రాజీమార్గం ద్వారా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తారన్నారు. సివిల్ కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు తమ క్లైంట్లకు తగు సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు. అనంతరం నరసరావుపేట సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల పరిష్కారానికి సంబంధించి పోలీస్ అధికారులు లేవనెత్తిన సాంకేతికపరమైన పలు అంశాలను న్యాయాధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో న్యాయధికారులు కె.మధుస్వామి, ఎన్. వణ్య, రెడ్డిపోగు ఆశీర్వాదం పాల్, ఆవుల సలోమి, ఏపీపీ నల్లమోతు కల్పన, డీఎస్పీ ఎం హనుమంతరావు, సీఐలు ఫిరోజ్, ఎం.వి.సుబ్బారావు, లోకనాథం, ఎస్సైలు, న్యాయవాదులు, వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సమీక్షించిన న్యాయమూర్తులు -
ప్రశాంతంగా ప్రారంభమైన ఒకేషనల్ ప్రాక్టికల్స్
తొలిరోజు 186 మంది గైర్హాజరు నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో 1,334 మంది విద్యార్థులకుగాను 1,148 మంది హాజరు కాగా మరో 186 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం 734 మందికి గాను 606 మంది హాజరు కాగా 128 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం 600 మందికి గాను 542 మంది విద్యార్థులు హాజరు కాగా, మరో 58 మంది గైర్హాజరయ్యారు. సతైనపల్లిలోని వేద ఒకేషనల్ జూనియర్ కళాశాల, డాక్టర్ సీఎస్జీఎల్ఎం కళాశాల పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకురాలు సౌజన్య సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి మాచర్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించి పకడ్భందీగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. -
భక్రిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య హవనం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరపరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చన, పంచామృతస్నపన, నీరాజన మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య హవనం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్థానిక పుష్కరణిలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక పల్లకీలో స్వామివారిని ద్వాదశ ప్రదక్షిణలు జరిపించారు. అంతకుముందు రోజు ఆదివారం రాత్రి శమీవృక్ష పూజ నిర్వహించి, మయూర వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, తహసీల్దార్ ఎం. హరనాథ్ టెంకాయలు కొట్టి ప్రారంభించారు. డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో చల్లపల్లి సీఐ ఈశ్వరావు, ఎస్ఐ గౌతమ్కుమార్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివసూర్యనారాయణ, జనరల్ సెక్రెటరీ మోతుకూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ గూడూరి అశోక్కుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ఐజీ మిఠాయిలు అందించారు. కార్యక్రమంలో కార్యాలయపు మేనేజర్ హిమంత్రావు, సీఐ (ఎల్/ఓ) వినోద్కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి: తెనాలి రూరల్ మండలం నంది వెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల వెంకట నాగపవన్ కుమార్ ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అవార్డును అందుకున్నారు. నందివెలుగు గ్రామ అభివృద్ధికి చేసిన కృషికిగాను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. పురస్కార స్వీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న నాగపవన్కుమార్, సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలలో అవార్డు స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతా నగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం హంసవాహన సేవ, పెరుమాళ్ల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం త్రిదండి చిన్నజీయర్స్వామి, అహోబిల రామానుజ జీయర్స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గరుడ వాహనంపై విజయ కీలాద్రి గిరి పరిక్రమణను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిడుగురాళ్ల: మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహాస్వామి 70వ కల్యాణ మహోత్సవం, తిరునాళ్ల కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి స్వామి వారికి పంచామృతాభిషేకాలు చేశారు. ప్రత్యేక అలంకరణను ఆలయ అధ్యక్షుడు హంసావత్తు రామునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం ఉదయం స్వామిని ఉగ్రనరసింహునిగా అలకరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్త బృందంచే పౌలు సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
కక్షతోనే జోగి రమేష్పై అక్రమ కేసు
మాజీ మంత్రులు రాంబాబు, రజిని ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి జోగి రమేష్ మీద సీఎం చంద్రబాబు కక్ష తీర్చుకోవడానికి అన్యాయంగా కేసులో ఇరికించారని, అయితే దీని వల్ల జోగి రమేష్కి క్రేజ్ పెరిగిందే కాని ఎక్కడా తగ్గలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బెయిల్పై బయటకు వచ్చిన జోగి రమేష్, ఆయన సోదరుడు రామును మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని సోమవారం వేరువేరుగా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించారు. జోగి రమేష్తో పాటు ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ, కుమారుడు రాజీవ్ తదితరులకు ధైర్యం చెప్పి యోగక్షేమాలు తెలుకున్నారు. భయపడే ప్రసక్తే లేదు.. అంబటి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష పూరితంగా కేసులు పెడితే పార్టీ బలహీన పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ నాయకులు భయపడకుండా పట్టుదలతో వైఎస్సార్ సీపీని బలపేతం చేస్తామని తెలిపారు. హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్లిన ఆయన సతీమణిపై కూడా కేసు పెట్టడం దారుణమన్నారు. అధికార మదం చూపిస్తే భవిష్యత్తులో వారికి సరైన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వ పతనం కనిపిస్తోందన్నారు. కార్యకర్తలు రెడ్బుక్ను సైతం లెక్కచేయడం లేదని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగరవేస్తుందన్నారు. లోకేష్ సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నారని, టీడీపీ పతనానికి అతనే నాంది పలుకుతున్నారని జోస్యం చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తెలిపిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయటానికి హిందూ మతాన్ని చంద్రబాబు అడ్డు పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. అమరావతిలో జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్న ఎన్టీఆర్ విగ్రహం ప్రజాధనంతో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అర్హత లేదన్నారు. మరింత బలంగా పోరాడతాం.. విడదల రజిని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ నాయకులను కేసుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. బీసీ నాయకుడైన రమేష్ను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపినప్పటికీ, గతం కంటే బలంగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేస్తారని చెప్పారు. 20 నెలల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంపైనా రాని వ్యతిరేకత చంద్రబాబు సర్కారుపై వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలకలూరుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
దేవుని సహవాసమే శాంతి మార్గం
పెదకాకాని: దేవుని సహవాసమే శాంతి మార్గమని బైబిల్ మిషన్ అధ్యక్షుడు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె. శామ్యేల్ కిరణ్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మహోత్సవాల ప్రాంగణంలో ఫాదర్ ఎం దేవదాసుకు దేవుడు బయలపరిచిన 88వ బైబిల్ మిషన్ మహోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. జె. శామ్యేల్ కిరణ్ వాక్యోపదేశం చేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను ధార్మిక జీవన మార్గంలో ప్రోత్సహించాలన్నారు. మారు మనసే స్వస్థతకు మొదటి మెట్టు అని, ఏసు నామంలో సంపూర్ణ స్వస్థత లభిస్తుందని బోధించారు. దేవుని చిత్తానుసారంగా ప్రయాణిస్తూ విధేయత, విశ్వాసం, సేవాభావంతో ముందుకు సాగితేనే క్రైస్తవ సమాజం బలంగా నిలబడుతుందని బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి. జాన్ దేవదాసు అన్నారు. దైవ నిర్ణయం ప్రకారం ప్రతి విశ్వాసి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగితేనే జీవితం సార్థకం అవుతుందని రెవరెండ్ బి. ప్రసాద్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంగీత బృందం ప్రత్యేక గీతాలు ఆలపించింది. పెరిగిన భక్తుల తాకిడి బైబిల్ మిషన్ మహోత్సవాలకు హాజరైన భక్తులు పెదకాకాని స్వస్తిశాలకు తరలి వెళ్లడంతో అక్కడ తాకిడి పెరిగింది. భక్తిశ్రద్ధలతో స్వస్తిశాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. మహోత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరు పెదకాకాని తోటకు వెళ్లడం, దేవునికి ప్రార్థించుట తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. బైబిల్ మిషన్ మహోత్సవాలకు సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, కర్ణాటక చెందిన ఐపీఎస్ అధికారిణి సంగీత, ఐఎఫ్ఎస్ అధికారిని రాధ, ఐఆర్ఎస్ అధికారి వినయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వారికి నిర్వాహకులు ఆశీర్వాద వచనాలు అందజేశారు. మహోత్సవాలు మంగళవారం మధ్యాహ్నంతో ముగియనున్నాయి. తెల్లవారుజామున ధ్యానం, ఉదయం 9 – సాయంత్రం 4 గంటల వరకు క్రైస్తవ కీర్తనల ఆలాపన, దైవ సందేశాలు, మహోత్సవాల కన్వీనర్ నివేదిక సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
పల్నాడుమంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026ప్రశంసాపత్రాల ప్రదానంగణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 547.30 అడుగులకు చేరింది. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 7,601 క్యూసెక్కులు వదిలారు. సాక్షి, నరసరావుపేట: జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు గణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులకు జోహార్లు... పెద్దల స్ఫూర్తితో జిల్లాలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం నరసరావుపేట రూరల్ మండలం లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించటానికి కృషి చేసిన సమరయోధుల సేవలను కొనియాడారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నుంచి రెవెన్యూ క్లినిక్లు ప్రతి సోమవారం నిర్వస్తున్నట్లు వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా 9 వేల ఎకరాలు సేకరించున్నామని కలెక్టర్ తెలిపారు. రాజుపాలెం నుంచి అమరావతి వరకు 45 కిలోమీటర్లు మేర రెండు లైన్ల రహదారి అభివృద్ధి పరిచేందుకు రూ.143 కోట్ల నాబార్డు నిధులతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. జిల్లాలో ప్రధాన మంత్రి నగరవనం స్కీం ద్వారా కోటప్పకొండ, వినుకొండ, మాచర్ల, దేవరంపాడు అటవీ ప్రాంతంలో యోగశాల, పిల్లల పార్కులు ఏర్పాటు చేశామన్నారు. సమరయోధుల వారసులకు సన్మానం నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ వేదికగా సోమవారం గణతంత్ర దినోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. తొలుత జిల్లా డాక్టర్ కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజన సింహతో కలిసి పోలీసు, ఎన్సీసీ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తొలుత వారు ఆహ్వానితులకు అభివాదం తెలిపారు. ప్రత్యేక వాహనంలో పరేడ్గ్రౌండ్ కలయ తిరిగారు. జిల్లా నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పుల్లరి హనుమంతును స్మరించుకున్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు సయ్యద్ జీనత్ బేగం, ఎం.వీరమ్మ (వీరమాత), పి.సావిత్రిరెడ్డి, డి.రామకృష్ణారెడ్డిలను కలెక్టర్ సన్మానించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, డ్వామా, ఏపీఎస్ఆర్టీసీ, గ్రామీణాభివృద్ధి, విద్య, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, గృహనిర్మాణ సంస్థ, వైద్యారోగ్యం, సాంఘిక సంక్షేమం, అటవీ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. డీఆర్డీఏ, ఉద్యాన, పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖల శకటాలు తొలి మూడు స్థానాలు పొందాయి. దేశభక్తి గీతాలకు పాఠశాలల విద్యార్థులు నృత్యాలు చేశారు. 7ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు, స్టాళ్లు, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 203 ఉద్యోగులు, ఎన్జీఓ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. చివరిగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఐసీడీఎస్, గ్రామీణ నీటి సరఫరా, ఎల్డీఎం, ప్రకృతి వ్యవసాయం, అటవీ శాఖ, రహదారి భద్రత, అగ్నిమాపకం, మత్స్య, విద్యుత్, పశు సంవర్థక శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ప్రకృతి వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖల స్టాళ్లు తొలి మూడు బహుమతులు దక్కించుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి నరసరావుపేట గిరిజన సంక్షేమ బాలిక వసతి గృహం, వినుకొండ గీతాంజలి ఉన్నత పాఠశాల విద్యార్థులు సంయుక్తంగా ప్రథమ బహుమతి పొందారు. స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్, శంకర భారతీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల సంయుక్తంగా ద్వితీయ బహుమతి, స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీలు సంయుక్తంగా తృతీయ బహుమతులు పొందాయి. జాతీయ గీతంతో వేడుకలకు ముగింపు పలికారు. -
యువకుడి అవయవాల దానంతో ఆరుగురికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాల దానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ కుమారుడైన ఇంజినీరింగ్ విద్యార్థి పెరుగు అమర్ బాబు(22) నిడుముక్కల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలిలో చికిత్స కోసం చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు బంధువులు తీసుకొచ్చారు. అమర్బాబు చికిత్స పొందుతూ సోమవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. జీవన్దాన్ కో ఆర్డినేటర్లు అవగాహన కల్పించడంతో అవయవాల దానానికి బాధిత కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయవాలను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ప్రత్యేక గ్రీన్ చానల్ ద్వారా ‘గుండె’ను తిరుపతికి తరలించారు. కళ్లను తాడిగడప ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్కు తరలించారు. లివర్, కిడ్నీలు గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లోనే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి అమర్చి నూతన జీవితాలను ప్రసాదించారు. అమర్ బాబు తల్లి కోటేశ్వరమ్మను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పరామర్శించారు. హాస్పిటల్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత, ఏపీ బిజినెస్ హెడ్, ట్రాన్స్ప్లాంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యలవర్తి కార్తిక్చౌదరి, జీవన్దాన్ కో ఆర్డినేటర్లు కొడాలి అనూష, అఖిలేష్ చింతమనేని తదితరులు కూడా కోటేశ్వరమ్మను అభినందించారు. -
కళాకారుడు రవికుమార్కు జాతీయ పురస్కారం
సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన రంగస్థల, పౌరాణిక కళాకారుడు బెజగం రవికుమార్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక గ్రేటర్ వరంగల్లో ఈనెల 25న నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో సత్తెనపల్లికి చెందిన బెజగం కుమార్ 2015 నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కళాపరిషత్ల్లో విభిన్న, వైవిద్య పౌరాణిక పాత్రలలో ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను రంజింప జేసి నందుకుగాను ఈ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. జాతీయ పురస్కారం అందుకుంన్న రవికుమార్ను సత్తెనపల్లిలోని వివిధ కళా సంస్థల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. -
ఉత్తమ సేవకు పురస్కారాలు
షేక్ మహబూబ్ సుభాని, ఉప విద్యాశాఖాధికారి, నరసరావుపేట ఆర్.వెంకటేశ్వరరావు, గ్రేడ్–2 ఈఓ, నరసరావుపేట ఎం.సురేష్బాబు, ఏఎంవీఐ, నరసరావుపేట వడ్డెర్ల అభివృద్ధికి చేయూతనివ్వండి సత్తెనపల్లి: వడ్డెర్ల అభివృద్ధికి చేయూతనివ్వాలని వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లి వడ్డెర కాలనీలో సోమవారం ఆయన పర్యటించి వడ్డెర్ల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను స్థానిక వడ్డెరలను కలిసి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటికీ 90 మంది వడ్డెర్లు బేల్దారి పని చేసుకుంటూ, రిక్షాలు తొక్కుకుంటూ దీన స్థితిలో కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ లోన్లు, రాయితీలు తెలియడం లేదని, ఎలా తెచ్చుకోవాలని తనను నేటికీ అడుగుతున్నారన్నారు. ఇప్పటికీ రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో వడ్డెర్లు కొనసాగుతున్నారంటే ఈ ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఓట్లు కలిగిన వడ్డెర్లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప వారి విద్యకు గాని, సామాజిక అభివృద్ధికి గాని, ఆర్థిక అభివృద్ధికి గానీ ప్రభుత్వాలు తోడ్పాటు ఇవ్వడం లేదని వాపోయారు. వడ్డెర్లలో చాలామందికి పెన్షన్లు కూడా అందడం లేదన్నారు. వడ్డెర్లు తమ పిల్లలను బాగా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా మేడికొండూరు కోపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సంజీవరావు, వడ్డెర సంఘ నాయకులు ఒంటి పులి వీరరాజు, పసుపులేటి బాలయ్య, బురుసు అంకేశ్వరరావు, ప్రసాద్, శ్రీకాంత్, శ్రీను పాల్గొన్నారు. బాలికపై లైంగిక దాడి నిందితుడిపై పోక్సో కేసు నమోదు వినుకొండ: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వినుకొండ సీఐ ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన షేక్ బాజీతో సహజీవనం చేస్తుంది. తల్లిలేని సమయంలో ఆమె కుమార్తైపె బాజీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనేపథ్యంలో మహిళ బంధువులు బాజీపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ కృతికశుక్లా సేవా పురస్కారాలు అందజేశారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, డీఎఫ్ఓ కృష్ణప్రియలు పాల్గొన్నారు. – నరసరావుపేట రూరల్ వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు నరసరావుపేట రూరల్: 77వ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పిడుగురాళ్ల: స్కూటీని లారీ ఢీకొనటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణ సమీపంలోని కొండమోడు జంక్షన్ వద్ద సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... రెంటాల గ్రామానికి చెందిన ఫరీద్(60) తన బంధువైన సుందరయ్య కాలనీకి చెందిన మహిళను స్కూటీపై ఎక్కించుకొని వస్తుండగా కొండమోడు జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా ఐచర్ లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫరీద్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి దగ్గరి బంధువైన మహిళకు తలకు గాయం కావటంతో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలోచికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన
కారెంపూడి: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిల అక్రమ అరెస్టులను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు కారెంపూడిలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులంతా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వియ్ వాంట్ జస్టిస్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, వియ్ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర రైతు విభాగం అదనపు కార్యదర్శి కొమ్మిరెడ్డి నల్ల గురవారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిన అల్లయ్య, మండల యూత్ అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీటీసీ షేక్ షఫీ, వివిధ హోదాల నాయకులు షేక్ ఆరీఫ్, షేక్ మొహమ్మద్, కిల్లా రత్నకుమారి, జాన్పాల్ నాయక్, జిలానీ, మస్తాన్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డివిజన్, సిటీ యూనిట్ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని అమరావతి, నూజెండ్ల తహసీల్దార్లు డేనియల్, జి.రమేష్కుమార్, డెప్యూటీ తహసీల్దార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో ముందుగా ఎటువంటి ప్రకటనలు, పబ్లికేషన్లు, ఓటరు జాబితా ప్రకటించకుండానే ఎన్నికలు నిర్వహించినట్లుగా సూచిస్తూ జిల్లా ఎన్నికలు వచ్చే పిభ్రవరి రెండో తేదీన నిర్వహిస్తామని ఏపీఆర్ఎస్ఎ పల్నాడు వాట్స్ప్ గ్రూపులో కొందరు పోస్టు చేశారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఓటరు జాబితాలను పబ్లికేషన్ చేశామని పేర్కొన్నారన్నారు. కాని ఆ జాబితా ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్, కలెక్టరేట్ ఆఫీసుల్లో పొందుపర్చలేదన్నారు. జిల్లా ఎన్నికల గురించి ఎటువంటి పత్రికా ప్రకటన ముందుస్తుగా ఇవ్వలేదన్నారు. గతంలో జరిగిన ఎన్నికలు సక్రమంగా జరగనందున ఆ ఎన్నికలు రద్దుచేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఓటరు జాబితా ప్రకటించి బైలాస్ మేరకు ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి: గణతంత్ర వేడుకలలో భాగంగా ఢిల్లీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి యువనర్తకి ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్యకు అరుదైన అవకాశం లభించింది. రిపబ్లిక్ పెరేడ్లో అన్ని రాష్ట్ర సంప్రదాయ నృత్యవిభాగంగా తెలుగురాష్ట్రాల నుండి పాల్గొన్నవారిలో తేజస్వి ప్రఖ్య ఒకరు వందేమాతరం గీతంకు చేసిన బృందనాట్యంలో పాల్గొన్నారు. దూరదర్శన్ ’బి’ గ్రేడ్తో పాటు కూచిపూడి నృత్యం ఎంఏ చేసిన ప్రఖ్య, ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటూ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఆచా ర్య పసుమర్తి రామలింగశాస్త్రి వద్ద కూచిపూడిలో ‘నట్టువాంగం‘లోననూ శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం పీహెచ్డీకి ఎన్ఈటీ, దూరదర్శన్ బీహై ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. -
నేడు పెదకూరపాడు జెడ్పీ హైస్కూల్ 80వ వార్షికోత్సవం
పెదకూరపాడు: పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 80 వసంతాల వేడుకకు సిద్ధమైంది. మంగళవారం పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలంటూ విద్యార్థులు పూర్వ విద్యార్థుల, తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. 1946 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే దర్శి లక్ష్మయ్య దాతృత్వం, సహకారంతో పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చి నిత్య నూతనంగా శోభిల్లుతుంది. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది దేశరక్షణ, రాజకీయ, వ్యాపార, వైద్య, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. హాజరుకానున్న ప్రముఖులు .. పాఠశాల 80 వసంతాల వేడుకలకు ఇక్కడ విద్యను అభ్యసించి అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. మాజీ ఎకై ్సజ్ శాఖ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అతోటి మురళి ముకుంద్, ప్రాఫిట్ షూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివ కోటేశ్వరరావు తోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. హాజరై.. ఆశీర్వదించండి పాఠశాల 80 వసంతాల వేడుకకు విద్యార్థులు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, గతంలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు అందరూ హాజరై విద్యార్థులను ఆశీర్వదించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకాని వెంకటరమణ కోరారు. దాతల సహకారంతో ప్రతిభావంతులైన పదో తరగతి విద్యార్థులకు సన్మానం, గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హాజరుకానున్న పాఠశాల పూర్వ విద్యార్థులు, రాజకీయ నేతలు -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురష్కరించుకుని సోమవారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరిగా జరిగాయి. టచ్ పండ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన శావల గోపికృష్ణ, నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన ముక్కపాటి లింగయ్య చౌదరి కంబైన్డ్ గిత్తలు 4,200 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 40 వేలను కై వశం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన కాసుల ఆంజనేయులు గిత్తలు 4,122.10 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ.30 వేలను, ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన గొర్ల శివన్నారాయణకు చెందిన గిత్తలు 4,108.4 అడుగుల దూరం లాగి 3వ బహుమతి రూ.25 వేలను, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన డా. కాకాని వెంకట సురేంద్ర గిత్తలు 4,081.10 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.20 వేలను, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన పులగం త్రిషగ్నా రెడ్డి, జెసితారెడ్డిలకు చెందిన గిత్తలు 3,970.2 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 16 వేలను గెలుచుకున్నాయి. ఇలా పదవస్థానం వరకు బహుమతులు ఇచ్చారు. మిగిలిన 17 జతలకు కూడ రూ. 4 వేల చొప్పున ప్రోత్సహక బహుమతులుగా అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, జి.సుమంత్రెడ్డి, బి.రామకృష్ణ, ఎం.రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి, కె.జోసఫ్రెడ్డి, జి.కస్పారెడ్డి, వి.కోటిరెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు. -
నీట్ ఎస్ఎస్లో సాతులూరు వైద్యుడి ప్రతిభ
నాదెండ్ల: జాతీయస్ధాయిలో నిర్వహించిన నీట్ సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన డాక్టర్ నార్నె సాయివెంకటేష్ 400వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నార్నె రామచంద్రయ్య, అపర్ణతులసి దంపతులకు ఇరువురు కుమారులుకాగా, పెద్ద కుమారుడు సాయివెంకటేష్ కజకిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి అనంతరం గన్నవరం సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎండీ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన నీట్ సూపర్స్పెషాలిటీ వైద్య ప్రవేశపరీక్షలో ర్యాంకు సాధించి పలువురి మన్ననలు పొందారు. ఈయన సోదరుడు నాగతరుణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నరసరావుపేట: స్థానిక మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 1979–80లో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఐఎంఏ హాల్లో ఆదివారం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత కలిసిన ఆ మిత్రులు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. నాడు పాఠశాలలో చదువుకున్న, ఆడుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మురిసిపోయారు. ప్రస్తుతం తాము ఏం చేస్తున్నారో చెబుతూ కుటుంబ సభ్యుల వివరాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆత్మీయ సమావేశాన్ని పూర్వవిద్యార్థులు నిర్మాప్రసాద్, భూసా సాంబశివరావు, బేతపూడి రాధ, కాకుమాను శ్రీనివాసరావు, చల్లా నాగరాజు నిర్వహించారు. ఏటా సమావేశం ఏర్పాటు చేసుకుందామని తీర్మానించుకుని, ఆత్మీయ వీడ్కోలు పలికారు. దక్షిణ భారత సైన్స్ పోటీలో జిల్లాకు ద్వితీయ స్థానం నరసరావుపేట ఈస్ట్: దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన– 2026లో పల్నాడుజిల్లా సత్తా చాటినట్టు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్.రాజశేఖర్ ఆదివారం తెలిపారు. హైదరబాద్లో ఈ నెల 19 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించిన ప్రదర్శనలో ఆరు రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులు రాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన నకరికల్లు మండలం కండ్లగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు గవిని శ్రీనివాసరావు రూపొందించిన విద్యుదయస్కాంతత్వం ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి లభించిందని తెలిపారు. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో కఠినంగా భావించే విద్యుదయస్కాంతత్వం పాఠ్యాంశాన్ని సులభంగా అర్థమయ్యేలా 16 నమూనాలను శ్రీనివాసరావు రూపొందించారు. టెస్టర్, బల్బుల అనుసంధానం, సమాంతర సంధానం, అయస్కాంత బలరేఖలు, ఫారడే ప్రయోగం తదితర నమూనాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. శ్రీనివాసరావును జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సైన్స్ అధికారి రాజశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. -
జగనన్నని అభిమానిస్తే చంపేస్తారా?
వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానించి అండగా ఉన్నారని దళితులను కూటమి ప్రభుత్వం హత్యలు చేయిస్తుంది. జగన్ని అభిమానిస్తే చంపేస్తారా..జగన్కి అండగా ఉంటే చంపేస్తామని సంకేతాలను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది. ఈ రోజు మందా సాల్మన్ని చంపి ఆనందంగా ఉండవచ్చు..కానీ రేపు ఖచ్చితంగా ప్రతీకారాలు ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకొవాలి. ప్రతికారం తీర్చుకోలేనంత దద్దమ్మలు దళితులు కాదని, ఓటు అనే ఆయుధం ద్వారా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారు. సాల్మన్ హత్యని వైఎస్సార్ సీపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – జూపూడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ -
ప్రభుత్వానికి ఎస్సీల బలం చూపిస్తాం..
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలను దోపిడీ, దుర్మార్గాల వైపు నడిపిస్తున్నాడు. శాంతిభద్రతలను కాపాడటం చేతకాని పోలీసులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేకానీ అమాయకులైన దళితులను టీడీపీ కక్షలకు బలిపెట్టడం మంచిదికాదు. కూటమి ప్రభుత్వానికి ఎస్సీల బలం చూపిస్తాం. భయపడటానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. వైఎస్ జగన్ నాయకత్వలో అక్రమాలపై తిరుగుబాటు చేస్తాం. ఊరు బాగుంటే చాలు, ఇదే చివరి హత్య కావాలని చెప్పిన సాల్మన్ బిడ్డల పెద్ద మనసుని అభినందిస్తున్నా. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి -
మహిమాన్వితురాలు కన్య మరియ తల్లి
ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి రెంటచింతల: లోక రక్షకుడిగా ఏసుక్రీస్తుకు జన్మనిచ్చిన కన్య మరియతల్లి మహిమాన్వితురాలిగా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతుందని ఫిరంగిపురం విచారణ గురువులు రెవ.ఫాదర్ మాలపాటి ఫాతిమా మర్రెడ్డి అన్నారు. స్థానిక కానుకమాత చర్చి 176వ తిరుణాళ్ల వేడుకలను పురష్కరించుకుని నిర్వహిస్తున్న నవదిన ప్రార్థనలలో భాగంగా ఆదివారం ఆరోగ్యమాత మందిరం వద్ద విచారణ గురువులు ఏరువ లూర్ధు మర్రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించిన సమిష్టి దివ్యపూజాబలిని సహాయక గురువులు రెవ.ఫాదర్ ప్రసన్న కుమార్తో కలిసి సమర్పించి ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి మాట్లాడారు. ఆధ్యాత్మికతతో ఏర్పడిన సమాజంలో ప్రజలందరూ శాంతియుతంగా సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. ముందుగా జపమాలతో ప్రారంభించిన దివ్యపూజాబలిలో కన్యసీ్త్రలు, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ‘నీట్ ఎస్ఎస్’లో 1293 ర్యాంక్ రెంటచింతల: వైద్య విద్య సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికై 2025 డిసెంబర్ 27న నిర్వహించిన నీట్ ఎస్ఎస్ పరీక్షలో మండల కేంద్రమైన రెంటచింతలకు చెందిన యువ వైద్యుడు తన్నీరు దుర్గాగణేష్ 1293వ ర్యాంక్ సాధించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్లోని మెడిసిటీ హాస్పటల్లో ఎంఎస్ (జనరల్)ను గణేష్ పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. న్యూరాలజిస్టు కోర్సులో చేరాలనే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. గణేష్ సతీమణి దీపిక కూడా ఆదిలాబాద్ గ్రామీణ పీహెచ్సీలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. -
సూర్యభగవానునికి ప్రత్యేకపూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరాలయంలో ఉన్న సూర్యదేవాలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యభగవానునికి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతఃకాలనా సూర్యభగవానుడికి ప్రత్యేకంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకా లను పంచామృతాలతో నిర్వహించారు. అనంతరం స్వామి వారికి సహస్రనామ పూజ చేశా రు. సూర్యదేవాలయ అర్చకుడు సప్తగిరి వరప్రసాద్ మాట్లాడుతూ అమరేశ్వరాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పడమర ముఖంగా సూర్యభగవానుడు ప్రతిష్టించటం ప్రత్యేకమన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బందితోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరువెస్ట్): గుంటూరులో ని శ్రీనగర్ ఆరో వీధిలో కొలువైన త్రిశక్తి పీఠం శ్రీరేణుకమ్మ పెద్దఅంకమ్మ నాగేంద్రస్వామి వార్ల నలభైవ వార్షిక కొలుపుల మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. నిత్య పూజలు అనంతరం భక్తి ప్రపత్తుల నడుమ దేవతమూర్తులను వాహనంపై అలంకరించి, మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీలు, కనకతప్పట్లతో ఊరేగింపుగా నగరోత్సవం కొనసాగింది. ప్రధానవీధుల్లో మహిళలు వారు పోసి కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి హారతి పట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో త్రిశక్తి పీఠం నిర్వాహకులు కస్తూరి యలమంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నాదెండ్ల: పల్నాడు జిల్లా చిరుమామిళ్ల గ్రామానికి చెందిన గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి గుంటూరులోని రెడ్డి లేడీస్ హాస్టల్ బ్లాకు నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళాన్ని అందించారు. హాస్టల్ వ్యవస్థాపకురాలు ఉడుముల కోటిరత్నమ్మ ఆధ్వర్యంలో గుంటూరు స్తంభాల గరువులోని రెడ్డి లేడీస్ హాస్టల్ పదేళ్లుగా సేవలందిస్తుంది. ఇందులో ఒక బ్లాక్ నిర్మాణానికయ్యే ఖర్చు రూ.25 లక్షలను హాస్టల్ అధ్యక్ష కార్యదర్శు లు ఉడుముల శ్రీనివాసరెడ్డి, వణుకూరి సూరారెడ్డికి అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హాస్టల్ నిర్వాహకులు ఆయన్ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హాస్టల్ ఉపాధ్యక్షుడు భీమవరపు పిచ్చిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ రాజేశ్వరరావు, యన్నం శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి రూ.2 లక్షల విరాళం... గొరిజవోలు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న గంగా భ్రమరాంబికా సమేత మల్లిఖార్జునస్వామి ఆలయానికి గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందించారు. విరాళాన్ని కమిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డికి అందించారు. కార్యదర్శి చల్లా బసివిరెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉత్తమ ఎలక్ట్రోరల్ విధానాలను అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ ఏడాది ‘నా భారత్ – నా ఓటు‘ (మై ఓట్, మై ఇండియా) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేయడంతో జిల్లా రెవెన్యూ అధికారికి అవార్డు లభించింది. -
ఇంటర్ ప్రాక్టికల్స్కు సర్వం సిద్ధం
సత్తెనపల్లి: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 131 జూనియర్ కళాశాలల్లో 34,371 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీకి సంబంధించి ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులు 12,604 మంది ఉన్నారు. వీరి కోసం 77 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఒకేషనల్ విద్యార్థు లకు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులు 2,082 మంది ఉన్నారు. విద్యార్థులకు ఈసారి సెల్ఫ్ సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఏదైనా కళాశాలలో 50 మంది లోపు విద్యార్థులు ఉంటే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో ప్రాక్టికల్స్కు హాజరు కావలసి ఉంటుంది. సెల్ఫ్ సెంటర్లు కలిగిన ప్రైవేట్ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా అవకతవకులకు పాల్పడుతున్నాయని ఏటా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈసారి ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. కెమెరాలు నేరుగా కమిషనర్ కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయి. -
నేటి నుంచి జాతీయస్థాయి ఎద్దుల బల ప్రదర్శన
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు సర్వం సిద్ధమైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన గరడిలో పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి విభాగంలో 9 బహుమతుల చొప్పున 72 మంది విజేతలకు మొత్తం రూ. 26 లక్షల నగదుతోపాటు మరో రూ.2 లక్షల ప్రోత్సాహక బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు. బహుమతులు ఇలా.. 26వ తేదీన తొలి ముగ్గురు విజేతలకు టచ్ పళ్ల విభాగంలో రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 25 వేలు చొప్పున అందిస్తామన్నారు. 27న రెండు పళ్ల విభాగంలో రూ. 50 వేలు, రూ. 35 వేలు, రూ. 30 వేలు... 28న నాలుగు పళ్ల విభాగంలో రూ. 60 వేలు, రూ. 40 వేలు, రూ. 35 వేలు... 29న ఆరు పళ్ల విభాగంలో రూ. 70 వేలు, రూ. 50 వేలు, రూ. 40 వేలు... 30న న్యూ కేటగిరీలో రూ. 80 వేలు, రూ. 60 వేలు, రూ. 45 వేలు... 31న సబ్ జూనియర్ విభాగంలో రూ. 90 వేలు, రూ.70 వేలు, రూ. 50 వేలు.. ఫిబ్రవరి ఒకటో తేదీన జూనియర్స్ విభాగంలో రూ. లక్ష, రూ. 80 వేలు, రూ. 60 వేలు చొప్పున తొలి ముగ్గురు విజేతలకు అందజేస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 3న సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిగా బుల్లెట్ బైకు, రెండో బహుమతిగా యూనికాన్ బైక్, మూడో బహుమతిగా రూ. 90 వేలు, నాగులో బహుమతిగా రూ.70 వేలు, ఐదో బహుమతిగా రూ. 50 వేలు ఆయా గిత్తల యజమానులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిర్వాహకులు వైఎల్ మర్రెడ్డి, జి.సుమంత్రెడ్డి, ఎ.ఇన్నారెడ్డి, బి.రామకృష్ణ, జి.కస్పాల్రెడ్డి, వై.జోజిరెడ్డి, వెన్నా కోటిరెడ్డి, కె.జోసఫ్రెడ్డి, ఎం.రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, జి.రంజిత్కుమార్ రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, పి.రాజారెడ్డి, జి.రాజేష్రెడ్డి తదితరులున్నారు. -
సీబీఐతో విచారణ జరిపించాలి
అమాయక దళిత కుటుంబంపై దాడి చేసి చంపితే ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఫిర్యాదు చేయడానికి వచ్చినా డీజీపీ కనీసం కలవడానికి ఇష్టపడలేదు. దళితుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి అంత లెక్కలేనితనం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా ఆయన పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, దళిత మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి. వైఎస్సార్ సీపీ హయాంలో ఒక మహిళను దారుణంగా చంపితే దళిత చట్టాల ప్రకారం వారిని ప్రభుత్వం ఆదుకుంది. కానీ చంద్రబాబు స్పందించకపోవడం దుర్మార్గం. – మేరుగ నాగార్జున, మాజీ మంత్రి -
దళితులను బలిగొంటున్న చంద్రబాబు సర్కార్
దాచేపల్లి, పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దళితులను బలితీసుకుంటోందని, ఎర్రబుక్ పాలన పేరిట ఎర్రి పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సాల్మన్ను ఇటీవల టీడీపీ గూండాలు హత్య చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన సాల్మన్ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ... గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గూండా రాజ్యం సాగుతోందని, నియోజకవర్గాన్ని రక్తమయం చేస్తూ దళితలను అణచివేయడంతోపాటు మరణకాండకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసమర్థ చంద్రబాబు పరిపాలనలో దళితులు, బలహీనవర్గాల వారిని హత్యలు చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వీటిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ తెలుగుదేశం నాయకుల ద్వారా చేయిస్తోందని మండిపడ్డారు. పొన్నూరులో టీ స్టాల్ వద్ద ఉన్న ఎస్సీ సర్పంచ్పై రాడ్ తీసుకుని దాడి చేస్తే నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ని టీడీపీ గూండాలు హత్య చేసినా చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు చేయిస్తున్న నరమేధం అని ఆరోపించారు. సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎర్రబుక్ పాలన పేరిట ఎర్రి పరిపాలన వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
ఏపీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షునిగా కె.ఎస్.కె.షరీఫా, ప్రధాన కార్యదర్శిగా బాళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కె.కృష్ణారావు, ఎస్కె.ఎండి.ఇబ్రహీం, టి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాసరావు, షాహినా సుల్తానా, కార్యదర్శులుగా దమ్మాటి శ్రీనివాసరావు, యు.శివానంద్కుమార్, బి.ప్రజామూర్తి, సాని శ్రీనివాసరావు, వి.హైందవకృష్ణ, మీసాల గోపి, రాష్ట్ర కౌన్సిలర్లుగా సయ్యద్ కరిముల్లా, వి.వి.రవికుమార్, బండి రమేష్బాబు, ఎస్ఎస్ఎన్ మూర్తి, ఆడిట్ కమిటీ కన్వీనర్గా జి.ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, పరిశీలకునిగా ఈ.వి.రామారావు వ్యవహరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు, గుంటూరుజిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్ పాల్గొన్నారు. అధ్యక్షునిగా షరీఫా, కార్యదర్శిగా శ్రీనివాసరావు -
బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాడులు, వేధింపులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. అయినా అవన్నీ లెక్కచేయకుండా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మందా సాల్మన్ హత్య జరిగింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే. వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన వ్యక్తుల మీద దాడులు పరిపాటిగా మారాయి. సామాన్యుడు పోలీస్ స్టేషన్కు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. బాధితులనే నిందితులుగా మార్చి చూపిస్తున్నారు. పిన్నెల్లి గ్రామం నుంచి 300 కుటుంబాలు బయటకు వెళ్లి జీవించాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇది పోలీసుల చేతకానితనమే. మందా సాల్మన్ కుటుంబానికి న్యాయం చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది. – విడదల రజని, మాజీ మంత్రి వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళితులను చంపుకుంటూ పోతున్నారు. ఇటువంటి విష సంస్కృతి టీడీపీ నేతలకు తగదు. – చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదు. చంద్రబాబు సర్కార్ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, బహిష్కరణలు, వేధింపులే దీనికి నిదర్శనం. సాల్మన్ను దారుణంగా హత్య చేసి పది రోజులవుతున్నా ఇంతవరకు ఏమాత్రం స్పందించని చంద్రబాబు... వైఎస్సార్సీపీ సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలుసుకుని గ్రామంలోకి టీడీపీ నాయకులను పంపించి కుటిల రాజకీయాలు చేస్తున్నారు. సాల్మన్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దళితుల గ్రామ బహిష్కరణ జరిగి రెండేళ్లవుతుంటే ఒక్కసారి కూడా పట్టించుకోని చంద్రబాబు కారణంగానే ఈ హత్య జరిగింది. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. గ్రామంలో శాంతియుత వాతావరణం తీసుకురావాలి. గ్రామం నుంచి వెళ్లిపోయిన కుటుంబాలను రప్పించాలి. సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. – గోపిరెడ్డి, వైఎస్సార్సీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సాల్మన్ హత్యను ఈ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. దళితుల మీద దాడులను టీడీపీ నాయకులు ఆపకపోతే రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు. – నారాయణమూర్తి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ● -
రాతియుగంవైపు రాష్ట్రం
గత ప్రభుత్వంలో పల్నాడులో శాంతిభద్రతలు నెలకొనేలా కృషిచేశాం. గ్రామాల నుంచి వెళ్లి బయట నివసిస్తున్న వారిని పోలీసుల సాయంతో వెనక్కి రప్పించి కుటుంబంతో ప్రశాంతంగా బతికే వాతావరణం తీసుకొచ్చాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం విజనరీనని చెప్పుకుంటూనే రాష్ట్రాన్ని మళ్లీ రాతి యుగంవైపుకి నడిపిస్తున్నాడు. రెడ్బుక్ పాలనతో కక్ష రాజకీయాలకు తెరలేపాడు. గ్రామానికి ఎందుకొచ్చావ్ అని ప్రశ్నిస్తున్న పోలీసులు పనిచేయడం చేతకాని అసమర్థుల కిందే లెక్క. అలాంటి వారు ఉద్యోగాలకు పనికిరారు. తక్షణమే రాజీనామా చేయాలి. బాధితులకు భరోసా ఇవ్వలేకపోవడం ప్రభుత్వ అసమర్థతే అవుతుంది. – మేకతోటి సుచరిత, మాజీ హోంమంత్రి -
17 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
నరసరావుపేట: జిల్లాలో 17 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందుగానే దరఖాస్తు చేసుకుంటే 18 ఏళ్లు నిండగానే ఓటరు కార్డు పొందవచ్చన్నారు. ఆధారాలతో ఆన్లైన్లో సులభంగా ఎవరికి వారే దరఖాస్తు సమర్పించవచ్చన్నారు. ప్రజాస్వా మ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని, ఓటరుగా నమోదు చేసుకున్న వారు మాత్రమే ఓటు వేసే అవకాశం పొందుతారని తెలి పారు. ఎవరికి వారు తమ పేర్లు, తమ కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో, లేదో గమనించుకుంటూ ఉండాలన్నారు. ఓటు హక్కు ఆవశ్యకత గురించి వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ అవార్డులు ప్రదా నం చేశారు. నూతనంగా ఓటరుగా గుర్తింపు పొందిన యువతకు కార్డులు అందజేశారు. సుదీర్ఘ కా లంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను సత్కరించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ఓటరు నమోదు కార్యక్రమంపై ‘నా దేశం–నా ఓటు’ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అంత్యక్రియలు నిర్వహించుకోలేని దుస్థితి
సాల్మన్ను ప్రత్యర్థులు దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి దాడి చేస్తే, అపస్మారక స్థితిలో ప్రాణాపాయంతో ఆస్పత్రిలో ఉన్న బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో పోలీసులు ఎంత అప్రమత్తంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, నిందితులకు అండగా ఉండి బాధితులపైనే కేసులు పెడుతున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన 300 కుటుంబాలను వెనక్కి రప్పించే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గం. బయటకెళ్లిన వారు ఎవరైనా మరణిస్తే పోలీసుల రక్షణ లేకుండా గ్రామస్తుడి అంత్యక్రియలు చేసుకోలేని దుస్థితి. పోలీసుల రక్షణలో అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.లక్షలు ఖర్చవుతుందని భయపెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం మారిన నాటి నుంచి పల్నాడులో ఫ్యాక్షన్ వాతావరణం తీసుకొచ్చారు. – గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రెండేళ్లుగా 400 కుటుంబాలు ఒక గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయంటే శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి వేరే ఉదాహరణలు అవసరం లేదు. సాల్మన్ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. అందుకు కారణమైన పోలీస్ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి. ఈ దారుణ హత్యపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోగా... కేసును నీరుగార్చాలనే కుట్ర చేస్తున్నారు. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం, ఐదెకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలి. – కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక వెనుబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీద దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ఏడాది పాలన పూర్తి కాకుండానే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 20 నెలల్లో చంద్రబాబు పాలన మీద ప్రజా వ్యతిరేకత పతాకస్థాయికి చేరింది. పిన్నెల్లి మాదిరిగానే బొల్లాపల్లి నియోజకవర్గం పలుకూరులో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. గ్రామంలో భూములన్నీ బీడు బారిపోయాయి. ఇలాంటి దుస్థితిని సృష్టించిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ అండగా ఉంటుంది. – బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే ● -
పల్నాడు వ్యాప్తంగా ఆటవిక రాజ్యం
ఎమ్మెల్యే యరపతినేని డైరెక్షన్లో సీఐ భాస్కరరావు సారథ్యంలో సాల్మన్ని దారుణంగా హతమార్చారు. దాదాపు రెండేళ్లుగా గ్రామానికి దూరంగా ఉంటూ భార్యను చూడటానికి వచ్చిన సాల్మన్ని చంపడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పల్నాడు వ్యాప్తంగా ఆటవిక రాజ్యం నడుస్తోంది. గూండాలు, దోపిడీదారులకు అండగా పోలీసులు పనిచేస్తున్నారు. జిల్లాను అభివృద్ధి చేయడం చేతకాక దాడులతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలి. మెడికల్ కాలేజీ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. – టీజేఆర్ సుధాకర్బాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
త్వరలో చలో ఢిల్లీ
మందా సాల్మన్ హత్యపై నరసరావుపేట: చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదని, అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ సీపీకి అండగా ఉన్న దళితులపై దాడులు చేసి వారిని పార్టీకి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని పార్టీ అగ్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం మీద దాడితోనే దీనికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. టీడీపీ గూండాల దాడిలో మందా సాల్మన్ దారుణ హత్యకు గురై పది రోజులైన సందర్భంగా ఆదివారం నరసరావుపేటలోని కాసు మహేష్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాల్మన్ సంస్మరణలో కూటమి ప్రభుత్వంపై నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనంతరం నాయకులంతా భారీ ర్యాలీగా పిన్నెల్లి గ్రామానికి వెళ్లి మందా సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సాల్మన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చేతనైతే వైఎస్ జగన్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి పల్నాడు ప్రజల మనసు గెలుచుకోవాలని సవాల్ విసిరారు. అభివృద్ధి చేతకాక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే వారే ఎప్పటికీ అధికారంలో ఉండొచ్చనే పగటి కలలు మానుకోవాలని అన్నారు. వారి వేధింపులను లెక్కచేయకుండా పార్టీ కోసం పోరాడుతున్న కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు. త్వరలోనే వైఎస్సార్సీపీ ఆధ్వరంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్లో టీడీపీపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పాల్గొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. దళితులపై దాడులకు టీడీపీ నాయకుల శ్రీకారం -
దేవాలయ నిర్మాణానికి బిట్రా విరాళం
పెదకూరపాడు : లగడపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భద్రావతి సమేత భావనా రుషి స్వామి దేవాలయానికి రథసప్తమి పండుగను పురస్కరించుకొని సత్తనపల్లికి చెందిన వైద్యులు బిట్రా నాగరాజు రూ.లక్ష విరాళంగా ఆదివారం అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభను నెలకొల్పేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ అనుముల వెంకట్రావు, సభ్యులు పాపారావు, రామారావు, నాగేశ్వరరావు, బండారు నాగరాజు, తిరుపతిరావులు నాగరాజును సత్కరించారు. తెనాలి: పట్టణ షరాఫ్బజారులోని భద్రావతి సమేత భావనాఋషిస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథసప్తమి పర్వదినమైన ఆదివారం వసంతోత్సవం జరిపారు. స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఉంచి, పట్టణంలో ఊరేగిస్తూ వివిధ రంగులతో వసంతోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. పలు ప్రాంతాల్లో స్వామివారికి ప్రసాద నివేదనలు జరిపారు. పద్మశాలీయ సంఘీయులందరూ యజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్టులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, దేవాలయ కమిటీ చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్, కమిటీ సభ్యులు జొన్నాదుల మదన్మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపర్తి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, ఆలూరి శ్రీనివాసరావు, తిరువీధుల వీరగోపాల్, గుంటి వెంకట్ పాల్గొన్నారు. రూ.18.43 లక్షల విలువైన సిగరెట్లు సీజ్ తెనాలిరూరల్: తెనాలిలో అక్రమంగా నిల్వ చేసిన సిగరెట్లను విజిలెన్స్, జీఎస్టీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. సుమారు రూ.18, 43,200 విలువైన ఎటువంటి బిల్లులు లేని సిగరెట్లను అధికారులు గుర్తించారు. పట్టణంలో ఆదివారం జీఎస్టీ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా వివిధ గోడౌన్లపై దాడులు చేశారు. మార్కెట్ ప్రాంతంలోని అంజయ్య వీధిలో కౌతరపు నమ్మయ్య నిర్వహిస్తున్న గోడౌన్లో రూ. 6.40 లక్షల విలువైన బిల్లులు లేని సిగరెట్లు, అలానే నందులపేట దేవినేని వారి వీధిలో వేములపల్లి మురళీకృష్ణ, ఉయ్యూరు సుబ్బారావుగుప్తాలకు చెందిన రూ. 12,03,200 విలువ గల సిగరెట్లను గుర్తించి సీజ్ చేశారు. గోడౌన్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. -
గురజాలలో యరపతినేని గూండారాజ్యం
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో సాల్మన్ హత్యతో వచ్చిన ప్రజావ్యతిరేకత ద్వారా చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే అర్థమైపోయింది. ఈ హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారిని సహకరించిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. నిందితులను చట్టపరంగా శిక్షించే దాకా న్యాయస్థానాల్లో పోరాడతాం. గురజాలలో గూండా రాజ్యం నడుపుతున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్కి ప్రజాస్వామ్యం బలం చూపిస్తాం. దాడిచేసి చంపారని ఫోన్ చేసిన బాధితులతో గ్రామంలోకి ఎందుకొచ్చారని ప్రశ్నించిన సీఐ భాస్కరరావుని న్యాయస్థానాల ద్వారా శిక్ష పడేలా చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణలో చూపించిన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించకతప్పదు. – కాసు మహేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
టీడీపీ క్షుద్ర రాజకీయాలు
వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పార్టీకి అండగా నిలిచే వారి మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసే నీచ సంస్కృతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రజాబలాన్ని నిర్వీర్యం చేయాలన్న కుట్రతోనే సాల్మన్ హత్య జరిగింది. సాల్మన్ దేహాన్ని ఖననం చేయడానికి కూడా హైడ్రామా చేశారు. కడసారి చూపుకి కూడా నోచుకోనీయకుండా కుటుంబ సభ్యులను, బంధువులను, గ్రామస్తులను అడ్డుకున్నారు. కనీస మానవత్వం లేకుండా అడుగడుగునా క్షుద్ర రాజకీయాలు చేశారు. – పూనూరు గౌతమ్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి -
గణతంత్ర ఏర్పాట్లు పరిశీలన
నరసరావుపేట: నరసరావుపేటలో సోమవారం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదివారం పరిశీలించారు. కలెక్టరేట్ సమీపంలోని పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించనున్నారు. చేసిన ఏర్పాట్లను గురించి ఆర్డీఓ కె.మధులత, తహసీల్దార్ కె.వేణుగోపాలరావు ఆమెకు వివరించారు. అలాగే జిల్లా అధికారులకు తేనేటి విందు ఇచ్చేందుకు కలెక్టర్ క్యాంపు కార్యాలయం కూడా ముస్తాబైంది. అక్కడి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కాగా, వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 203మంది అధికారులు, ఎన్జీఓలకు అవార్డులను అందజేయనున్నారు. -
రాష్ట్రస్థాయి బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు ఎంపిక
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న షేక్ సైదా సాహెబ్ ఎంపిక య్యారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి శివారు కొత్తపాలెం సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా ఆయన పని చేస్తున్నారు. కొత్తపాలెం పీఎస్ నెంబర్ 100 లో బూత్లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధినిర్వ హణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు పల్నాడు జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు ఎంపికై నట్లు నరసరావుపేట ఆర్డీఓ మధులత తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకొని ఈ నెల 25న విజయవాడ చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయంలో సైదాసాహెబ్ అవార్డును అందుకోనున్నారు. నరసరావుపేట టౌన్: బస్సు ఆపలేదని మహిళ కండెక్టర్పై ప్రయాణికురాలు దాడి చేసి యూటీఎఫ్ మిషన్ను బయటకు విసిరేసిన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. వన్న్ టౌనన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట డిపోకు చెందిన ఏపీ 07 జెడ్ 0314 నంబర్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని నరసరావుపేట నుంచి గుంటూరుకు బయలు దేరింది. బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న షేక్ రహీమ్ మున్సిసా తమ బంధువులు వస్తున్నారని బస్సు ఆపాలని కండక్టర్ ఆవుల విష్ణు కుమారిని కోరింది. బస్సు నిలపక పోవటంతో కండక్టర్తో వాగ్వివాదానికి దిగి ఆమె చేతిలో ఉన్న టికెట్లు కొట్టే మిషన్ను కిటికీలోనుంచి బయటకు విసిరింది. అనంతరం కండక్టర్పై దౌర్జన్యానికి దిగి దాడి చేసింది. సంఘటనలో మిషన్ పాక్షికంగా దెబ్బతింది. తన విధులకు ఆటంకం కలిగించటంతో పాటు మిషనన్ను ధ్వంసం చేసిందని కండక్టర్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు.


