అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల
రెంటచింతల: పునీతురాలైన కన్యమరియ తన కుమారుడైన ప్రభువైన ఏసుక్రీస్తును సమస్త మానవాళి రక్షణ నిమిత్తం లోకానికి ఇచ్చిందని నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు, అభిషిక్త గురువులు మహా ఘన డాక్టర్ కరణం దమన్ కుమార్ అన్నారు. రెంటచింతలలోని ప్రఖ్యాత కానుకమాత చర్చిలో సోమవారం కానుకమాత చర్చి 176వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్థానిక విచారణ గురువులు రెవ.ఫాదర్ ఏరువ లూర్ధుమర్రెడ్డి నేతృత్వంలో రెవ.ఫాదర్ ఏరువ బాల శౌర్రెడ్డి, రెవ.ఫాదర్ కాసు జోజిరెడ్డిలతో కలిసి కానుకమాత చర్చి 176వ వార్షిక తిరునాళ్ల మహోత్సవ సమష్టి దివ్య బలిపూజలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలో నెలకొన్న అశాంతి తొలిగి పోవాలంటే క్రీస్తు ప్రభువు సూక్తులను ఆచరిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. ప్రభువును ప్రేమించే విషయంలో, ఇతరులకు సేవ చేసే విషయంలో పల్నాటి పౌరుషం చూపాలన్నారు. ఇరుగు పొరుగు వారిని దయాహృదయంతో ఆదుకోవాలన్నారు.
దివ్యాపూజాబలి సమర్పించిన నల్గొండ మేత్రాసన పీఠాధిపతి మహా ఘన
డాక్టర్ కరణం దమన్కుమార్
అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల


